money transfer
-
తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!
ఆన్లైన్ వేదికగా సైబర్ నేరస్థులు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, పేటీఎం, ఫోన్పే, జీపే వంటి థర్డ్పార్టీ మోబైల్ యాప్ల ద్వారా నగదు లావాదేవీలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని నంబర్ నుంచి మెసేజ్లు, లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయకూడదని సైబర్ పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు చిన్నమొత్తాల్లో ఖాతాల్లోకి డబ్బు పంపించి తిరిగి ఆ ఖాతాలను లూటీ చేసేలా ప్రయత్నిస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల సైబర్ మోసగాళ్లు ఫోన్పే, జీపే, పేటీఎం వంటి థర్డ్పార్టీ పేమెంట్ యాప్ల ద్వారా తక్కువ మొత్తంలో నగదును ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. దాంతో డబ్బు అందుకున్న వారికి మెసేజ్ వస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకుని, వారిని నమ్మించి ‘మీ ఖాతాలో నగదు జమైంది. ఈ లింక్పై క్లిక్ చేయండి’అంటూ మెసేజ్లో కింద లింక్ ఇస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే పిన్ జనరేట్ చేయమనేలా అడుగుతుంది. పొరపాటున పిన్ జనరేట్ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బు ట్రాన్స్పర్ చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చినట్లవుతుందని పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చాట్జీపీటీ సేవల్లో అంతరాయంఖాతాలో గుర్తు తెలియని నంబర్ల ద్వారా చిన్న మొత్తాల్లో డబ్బు జమ అవుతుందంటే అనుమానించాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చిన మేసేజ్లను, లింక్లను ఓపెన్ చేయకుండా నేరుగా డెలిట్ చేయాలని చెబుతున్నారు. -
జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఇటీవల ఓ యువతి తన ఎక్స్ బాయ్ఫ్రెండ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విభిన్న ప్లాట్ఫామ్ల్లో తనను బ్లాక్ చేసింది. అయినా అతడు ఇటీవల గూగుల్పే ద్వారా తనను వేధిస్తున్నట్లు యువతి పోస్ట్ చేసింది. గూగుల్పే యాప్లో ప్రతి నిమిషానికి రూ.1 పంపిస్తూ తనను వేధిస్తున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్గా మారింది.ఆయుషి అనే యువతి చేసిన ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘జీపే ద్వారా నిమిషానికి రూ.1 చొప్పన 30 రోజుల్లో 43,800 నిమిషాల్లో రూ.40,000 కంటే ఎక్కువే సంపాదించవచ్చు. మీ ఇద్దరి మధ్య గతంలో ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా దాన్ని మీరు వదిలించుకోవాలనుకున్నారు. సింపల్గా ఇగ్నోర్ చేయండి. కానీ మీ ఎక్స్ బాయ్ఫ్రెండ్ను గూగుల్పేలో బ్లాక్ చేయవద్దు. ఎందుకంటే మీరు దాని ద్వారా నెలకు రూ.40 వేలు సంపాదిస్తారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీరు కొంత డబ్బు సమకూర్చుకోండి. తర్వాత గూగుల్పేలో కూడా తనను బ్లాక్ చేయండి’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!ఏదేమైనా ప్రతి రిలేషన్షిప్కు ఇద్దరి అంగీకారం అవసరం. అందుకు ఏ కారణంతోనైనా ఒకరికి ఇష్టం లేదంటే వేరొకరు దాన్ని గౌరవించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. కానీ ఏ విధమైన వేధింపులకు పాల్పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీని మంచికే వినియోగించుకోవాలని చెబుతున్నారు. -
రోజూ 50 కోట్ల లావాదేవీలు
దేశీయంగా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 500 మిలియన్లు(50 కోట్లు) లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇది బిలియన్(100 కోట్లు) మార్కును చేరనున్నట్లు చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ‘గ్రూప్ ఆఫ్ థర్టీస్ వార్షిక అంతర్జాతీయ బ్యాంకింగ్ సెమినార్’లో పాల్గొని ఆయన మాట్లాడారు.‘భవిష్యత్తులో ఆన్లైన్ లావాదేవీలకు మరింత ఆదరణ పెరుగుతుంది. ఆమేరకు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నాం. అందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అన్ని చర్యలు తీసుకుంటోంది. యూపీఐ విధానం ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను ఒక బిలియన్(100 కోట్లు)కు చేర్చాలని భావిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: క్విక్ కామర్స్లోకి టాటా గ్రూప్?‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డేటా ప్రకారం, ఆగస్టులో యూపీఐ రోజువారీ లావాదేవీల సంఖ్య 483 మిలియన్లకు చేరింది. ఇది సెప్టెంబర్లో సుమారు 500 మిలియన్లుగా ఉంది. సెప్టెంబర్ 2024లో మొత్తం యూపీఐ చెల్లింపుల సంఖ్య 15.04 బిలియన్లు(1500 కోట్లు). ఫలితంగా వీటి విలువ రూ.20.64 లక్షల కోట్లకు చేరింది. ఆన్లైన్ చెల్లింపులు పెంచడానికి ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్లతో కూడా యూపీఐను లింక్ చేస్తున్నాం. ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, శ్రీలంక, మారిషస్, నేపాల్ వంటి ఏడు దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది’ అని దాస్ చెప్పారు. -
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నాం. మొత్తం 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,078.36 కోట్లు జమ. కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూముల సాగు రైతులకు సాయం. 57 నెల్లలో రైతు భరోసా కింద అందించిన మొత్తం రూ.34,288 కోట్లు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఒక్కో రైతన్నకు అదనంగా రూ.17,500 ఇస్తున్నాం. రైతు ప్రభుత్వం మనది.. మన ప్రభుత్వం వేసిన ప్రతీ అడుగూ కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలని వేశాం. క్రమం తప్పకుండా వైయస్సార్ రైతు భరోసా కింద సహాయాన్ని అందించాం. పెట్టుబడి సహాయంగా, రైతన్నకు దన్నుగా ఇది అందించాం. రాష్ట్రంలో దాదాపు 50శాతం లోపు రైతులన్నకున్న భూమి అర హెక్టారు లోపలే. హెక్టారు లోపల ఉన్న రైతులు 70 శాతం ఉన్నారు. ఈ పెట్టుబడి సహాయం వారికి ఎంతో మేలు చేసింది. వంద శాతం రైతులకు 80శాతం ఖర్చు రైతు భరోసా కింద కవర్ అయ్యింది. పేద రైతుల పక్షపాత ప్రభుత్వం మనది, దీనికి నేను గర్వపడుతున్నాను. సున్నా వడ్డీ కింద కూడా రూ.215.98 కోట్లు విడుదల చేస్తున్నాం. రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా కట్టే రైతులకు మేలు చేస్తున్నాం.ఇప్పటివరకూ 84.66 లక్షల మంది రైతన్నలకు ఇప్పటి వరకూ అందించిన వడ్డీ రాయితీ 2,050 కోట్లు. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ కింద రైతులకు ఇవాళ విడుదలచేస్తున్న మొత్తం రూ.1,294.38 కోట్లు అందించాం. ప్రతీ అడుగులోనూ రైతన్నలకు తోడుగా నిలుస్తున్నాం. ప్రతీ పథకం దాదాపుగా పేద రైతు కుటుంబానికి అందుబాటులో ఉంచడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఏడాదికి రూ.12500 బదులు వేయి పెంచి రూ.13500 ఇచ్చాం. 50వేల స్థానంలో ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చాం. చెప్పినదానికంటే ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం మనది. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ముందుకు సాగాము. ప్రతీ సందర్భంలోనూ వారికి తోడుగా నిలిచాం. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్.. 19 లక్షల మంది రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ కింద ప్రతి రైతుకు రూ.45వేల మేర మేలు జరుగుతుంది. ఏడాదికి దాదాపుగా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతుల తరఫున ఉచిత పంటల బీమాకు ప్రీమియం కడుతున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం మనది. గతంలో ఎప్పుడూ కూడా రైతుల తరఫున ఎప్పుడూ బీమా ప్రీమియం చెల్లించలేదు. దేశంలో కూడా ఎక్కడా లేదు. రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. కేవలం ఈ ఐదేళ్లలో మాత్రమే ఇలా జరిగింది. ఇదొక విప్లవాత్మక మార్పు. నష్టం నుంచి రైతు తట్టుకుని నిలబడి తిరిగి పంటలు వేసుకునే పరిస్థితి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యగా దీన్ని అమలు చేసింది. ఆక్వా రైతులకు సాయం.. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను పెట్టాం. అగ్రికల్చర్ అసిస్టెంట్ను రైతుకోసం పెట్టాం. రైతులకు ఇ-క్రాప్ చేస్తూ అన్నిరకాలుగా ఆదుకుంటున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా రైతులను చేయిపట్టుకుని నడిపించాం. ఈ ఐదేళ్లకాలంలో మాత్రమే ఇలా జరిగింది. ఆక్వా రైతులకు రూ.1.5కే కరెంటు ఇస్తూ ఆదుకున్నాం. ఆక్వాజోన్లలో ఉన్న ఆక్వారైతులకు తోడుగా నిలిచాం. పాల సేకరణలో కూడా రైతులకు తోడుగా నిలిచాం. రూ.10-20ల వరకూ రైతులకు అధిక ధరలు వచ్చాయి. పాలసేకరణలో ఈ ఐదేళ్ల కాలంలోనే రైతులకు రేట్లు పెరిగాయి. సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్ను తీసుకు వచ్చి ఈ రంగంలో పోటీని పెంచాం. తద్వారా రైతులకు మేలు జరిగింది. భూ సర్వే.. 100 సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగింది. అప్పటినుంచి రికార్డులు అప్డేట్ కాకపోవడం, సబ్ డివిజన్లు జరక్కపోవడం జరిగింది. వివాదాలకు చెక్పడుతూ సమగ్ర సర్వే చేపట్టాం. రికార్డులను అప్డేట్ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవలను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం. 34.77 లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులను రైతులకు, పేదలకు కల్పించాం. గతానికి, ఈ ఐదేళ్ల కాలానికి తేడా గమనించాలని కోరుతున్నాను. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీచేస్తామని చంద్రబాబు చెప్పారు. బ్యాంకుల్లో బంగారం రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. దీంతో రైతులు నమ్మి అధికారం ఇస్తే.. దారుణంగా మోసం చేశారు. బేషరుతుగా రుణాలు మాఫీచేస్తానని చెప్పి చివరకు రుణమాఫీ పత్రాలు ఇచ్చి మోసం చేశారు. చివరకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగొట్టారు. చివరకు మన ప్రభుత్వమే చెల్లించింది. బాబు హయాంలో రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్రవడ్డీలే ఏడాదికి దాదాపు రూ.5-6 వేల కోట్లు. అంత దారుణంగా చంద్రబాబు గతంలో మోసం చేశారు. మనం ఈ ఐదేళ్లలో వైయస్సార్ రైతు భరోసా కింద రూ.34వేల కోట్లు ఇచ్చాం. ధాన్యం కొనుగోలుకోసం రూ.65 కోట్లు ఖర్చు చేశాం. ఇదికాక రూ.1.2 లక్షల కోట్లు రైతున్నలకు వివిధ పథకాలు ద్వారా అందించాం అని అన్నారు. -
ప్రభుత్వ ‘యూకో’ బ్యాంక్ బాగోతం.. ప్రశ్నార్ధకంగా 114 కోట్లు!
డిసెంబర్ 7న ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ యూకో బ్యాంక్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా యూకో బ్యాంక్కు చెందిన 41వేల అకౌంట్లలో పొరపాటున రూ.820 కోట్లు జమయ్యాయి. వాటిల్లో రూ. 705.31 కోట్లు రికవరీ అయ్యాయి. బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ చానెల్లో సాంకేతిక లోపంతో జరిగిన నిధుల బదిలీలో రూ.114.69 ఇంకా రికవరీ కాలేదని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి భగవత్ కరద్ లోక్ సభ సమావేశాల్లో లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటనకు కారణమైన యూకో బ్యాంక్ ఉద్యోగుల్ని గుర్తించింది. గుర్తించలేని ఇతర వ్యక్తులపై సీబీఐ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక పశ్చిమ బెంగాల్, కర్నాటకలోని 13 ప్రదేశాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిల్ ఆర్కైవ్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. -
రిమ్స్ మళ్లీ తెరపైకి.. స్టాఫ్నర్సుల నుంచి డబ్బులు వసూలు!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరచూ వివాదంలోకి ఎక్కుతోంది. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొంతమంది ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. లంచం తీసుకుంటూ బయటపడుతున్నప్పటికీ నవ్వి పోదురుగా.. మాకేమిటి అన్న చందంగా మారింది వీరి పరిస్థితి. ప్రభుత్వం నుంచి రూ.వేలల్లో వేతనం తీసుకుంటున్నా అది చాలదనట్టుగా తోటి ఉద్యోగులను వేధించడం, డబ్బులు ఇస్తే గాని ఫైల్ కదలనివ్వడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా రిమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో కొంతమంది ఉద్యోగులు ముడుపులు ఇస్తే కానీ ఏ ఫైల్ను ముట్టడం లేదని కొంతమంది కాంట్రాక్ట్, అవుట్సో ర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. గతంలో ఓ ఇద్దరు ఉద్యోగులు స్టాఫ్ నర్సుల నుంచి డబ్బులు తీసుకొని సస్పెన్షన్కు గురైన విషయాన్ని మరవక ముందే మరో ఉద్యోగి వసూళ్ల దందాలో తెరపైకి రావడం రిమ్స్లో చర్చనీయాంశంగా మారింది. స్టాఫ్నర్సుల నుంచి వసూళ్లు.. రిమ్స్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల నుంచి ఓ ఉద్యోగి రూ.1లక్ష 40వేలు వసూలు చేసినట్లు అక్క డ పనిచేస్తున్న కొంతమంది బాధితులు చెబుతున్నారు. 2011 బ్యాచ్కు చెందిన వీరికి ఫిబ్రవరిలో 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అయితే వీరికి ఇంక్రిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని సదరు ఉద్యోగి వీరి దృష్టికి తీసుకొచ్చారు. మొదట రూ.2వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత వెయ్యి పెంచి రూ.3వేలు అడగగా, చివరగా మరో వెయ్యి పెంచి రూ.4వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బులు వసూలుకు సామాజిక మాధ్యమం (వాట్సాప్)లో ఏకంగా ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో మెస్సేజ్ రూపంలో డబ్బులు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. స్టాఫ్నర్సుగా పనిచేసే ఓ ఉద్యోగి నగదు రూపంలో వీటిని వసూలు చేసి సదరు ఉద్యోగికి ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తం 36 మందికి గాను 35 మంది డబ్బులు ఇచ్చినట్లు పేపర్పై రాసుకొని గ్రూప్లో వేశారు. ఇంక్రిమెంట్ కాకపోతే పీఆర్సీ, ఐఆర్లో తమ వేతనం పెరగదని భయంతో వారికి డబ్బులు ముట్టజెప్పాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రూప్ను డిలీట్ చేశారు. అయితే డబ్బులు వసూలు చేసిన తర్వాత ఉద్యోగి టేబుల్పై పెట్టిన ఫొటోలు, గ్రూప్ చాటింగ్ మెస్సేజ్లు బయటకు రావడంతో సదరు ఉద్యోగి అయోమయానికి గురవుతున్నారు. మంగళవారం ఆ ఉద్యోగి స్టాఫ్ నర్సులందరినీ పిలిపించి ఈ విషయం మన మధ్యలోనే ఉండాలని, తనకు డబ్బులిచ్చింది ఎవరికి చెప్పవద్దని వారికి సూచించారు. లేకపోతే మీ పని కాదని, తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారిని హెచ్చరించడం గమనార్హం. అయితే విషయం బయటకు పొక్కడంతో ఎవరు బయటకు లీక్ చేశారంటూ ఆరా తీసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. సర్వీసు బుక్లో వివరాలు నమోదుకు గాను 2021లో కొత్తగా రిక్రూట్మెంట్ అయిన స్టాఫ్ నర్సుల నుంచి రిమ్స్లో కొంతమంది ఉద్యోగులు డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ కథనానికి స్పందించిన అప్పటి కలెక్టర్ ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. రిమ్స్లో స్టాఫ్ నర్సుల నుంచి ఓ అధికారి డబ్బులు వసూలు చేశారు. తన బర్త్డే సందర్భంగా కానుకలు తీసుకున్న విషయం విదితమే. తర్వాత అధికారులు సదరు అధికారిపై విచారణ చేపట్టినప్పటికీ ఎలాంటి చర్యలకు పూనుకోలేదు. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పిస్తానని రిమ్స్లో పనిచేసే ఓ ల్యాబ్ అసిస్టెంట్ నుంచి మరో ల్యాబ్ అసిస్టెంట్ రూ.లక్ష 50వేలు వసూలు చేశారు. ఈ విషయంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అందులో నుంచి కొంత డబ్బులు బాధితుడికి తిరిగివ్వడం జరిగింది. అయితే సదరు ఉద్యోగి నెలలు గడుస్తున్నా ఇంకా విధులకు హాజరుకాకపోవవడం గమనార్హం. నా దృష్టికి రాలేదు.. రిమ్స్లో స్టాఫ్నర్సుల ఇంక్రిమెంట్ల కోసం ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. స్టాఫ్ నర్సులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకుంటాను. డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్డైరెక్టర్ -
Upi-Paynow Linked: పేనౌతో ఎస్బీఐ జట్టు
ముంబై: యూపీఐ ప్లాట్ఫాం ఆధారంగా సీమాంతర చెల్లింపులకు వెసులుబాటు కల్పించే దిశగా సింగపూర్కి చెందిన పేనౌతో జట్టు కట్టినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. భీమ్ ఎస్బీఐపే మొబైల్ యాప్ ద్వారా ఈ సదుపాయం పొందవచ్చని పేర్కొంది. భారత్ నుంచి సింగపూర్కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ల ద్వారా, సింగపూర్ నుంచి భారత్కు యూపీఐ ఐడీ ద్వారా నగదు బదిలీ చేయొచ్చని వివరించింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక రెమిటెన్సులు ఏటా దాదాపు 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. -
కిలాడీ ఆటో డ్రైవర్.. పంజగుట్టకు చేరుకోగానే ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసి..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసిన ఓ ఆటో డ్రైవర్ సదరు వ్యక్తి సెల్ఫోన్ నుంచి గూగుల్ పే ద్వారా రూ. 57 వేల నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్కు చెందిన పి.వీరప్రతాప్ సింగరేణి ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చిన అతను అర్జెంట్గా మంచిర్యాల వెళ్లే క్రమంలో తెల్లవారు జామున 4:25కు ఈఎస్ఐ వద్ద సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. ఆటో పంజగుట్ట కూడలికి చేరుకోగానే ఆటోడ్రైవర్ వీరప్రతాప్ను ఆటోలోనుంచి బలవంతంగా బయటకు నెట్టివేసి ఆటో తీసుకుని బంజారాహిల్స్ వైపు వేగంగా వెళ్లిపోయాడు. వీరప్రతాప్ తేరుకుని కొద్దిసేపు తర్వాత చూసుకోగా అతని సెల్ఫోన్ కనిపించలేదు. అర్జెంట్గా ఊరు వెళ్లే క్రమంలో అతను మంచిర్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ ఎటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసేందుకు చూడగా నో బ్యాలెన్స్ చూపించింది. దీంతో మంచిర్యాల యాక్సిస్ బ్యాంకులో సంప్రదించగా తన అకౌంట్ నుండి గూగుల్ పే ద్వారా 57362 రూపాయలు బదిలీ అయినట్లు నిర్ధారించారు. దీంతో తిరిగి నగరానికి వచ్చిన వీరప్రతాప్ శుక్రవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: శంషాబాద్లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్.. 28 నుంచి కార్యకలాపాలు -
గుడ్న్యూస్: కొత్త సేవలు వచ్చాయ్.. ఇలా చేస్తే ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్!
టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా మర్పులే వచ్చాయి. దీంతో కస్టమర్ల ఆర్థికపరమైన పనులన్నీ కూడా చిటికెలో అయిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా డిజిటెల్ చెల్లింపులు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ సేవలకు ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదీ కాక చెల్లింపులు విషయంలో ఏ చిన్న నెట్వర్క్ సమస్యలు తలెత్తిన ఇబ్బందులు తప్పవన్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు ఓ దారి దొరికింది. నెట్వర్క్ లేకపోయినా యూపీఐ లావాదేవీలు.. ఇటీవల నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ఒక్కోసారి ఈ లావాదేవీలు జరుపుతున్న సమయంలో నెట్వర్క్ సమస్యలు వస్తుంటాయి. అయితే నెట్వర్క్తో పనిలేకుండా కేవలం ఆఫ్లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఇది మనలో చాలా మందికి తెలియదు. భారతదేశంలోని బ్యాంకుల అంతటా యూపీఐ (UPI) సేవలను మరింత మెరుగపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సేవ'ను ప్రారంభించింది. యూజర్లు చేయాల్సిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడమే. ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు.. ఇలా చేయండి ► మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి. ► తరువాత మీ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి.కొన్ని సందర్భాల్లో ఐఎఫ్ఎస్ కోడ్ అడుగుతుంది. దాని ప్రకారం, కోడ్ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ► ఇది పూర్తికాగానే ఇలా కనిపిస్తుంది.. ►1.Send Money ►2. Request Money ►3. Check Balance ►4. My Profile ►5. Pending Request ►6. Transactions ►7. UPI Pin ► పైన చూపిస్తున్న సేవలలో మీకు ఏది కావాలో అది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు నగదు ఇతరులకు పంపాలనుకుంటున్నారు. డబ్బు పంపేందుకు 1 నంబర్ ఎంటర్ చేయండి. ► ఇప్పుడు మీరు ఏ ఖాతా నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో వివరాలను ఎంచుకోండి. ఇలా.. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, సేవ్ చేయబడిన లబ్ధిదారుని వివరాలు.. టైప్ చేసి (send) ఎంటర్ చేయండి. ► మీరు మొబైల్ నంబర్ ద్వారా బదిలీని ఎంచుకున్నట్లయితే, రిసీవర్ యూపీఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. ► ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న మొత్తం నగదు ఎంటర్ చేసి పంపండి. ► ఆపై మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి (send) ఆప్షన్ క్లిక్ చేయడంతో మీ లావాదేవీ ఇంటర్నెట్ లేకుండా పూర్తవుతుంది. చదవండి: అసలే డిజిటలైజేషన్ డేస్.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం! -
వడ్డిస్తారా? వదిలేస్తారా?
చూస్తూ చూస్తుండగానే వామనుడు త్రివిక్రమావతారం దాల్చడమంటే ఇదే! ఆరేళ్ళ క్రితం 2016 జూలైలో నెలకు కేవలం కోటి రూపాయల లోపలున్న ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (యూపీఐ) లావాదేవీల విలువ ఈ జూలైలో ఏకంగా రూ. 10.6 లక్షల కోట్ల స్థాయికి చేరింది. సామాన్యులు, పేదలకు సైతం బ్యాంకింగ్ను అందుబాటులోకి తెచ్చి, చేతిలోని స్మార్ట్ఫోన్తో రోజువారీ లావాదేవీలను జరిపే సాంకేతికతను అందించడం అపూర్వ విజయమే! ప్రపంచంలోని దేశదేశాలు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి, ఇండియా వైపు తిరిగి చూసేలా చేసిన డిజిటల్ చెల్లింపుల విప్లవమిది. ఈ యూపీఐ చెల్లింపులపై సర్వీస్ ఛార్జ్ వేయాలా, వద్దా అన్నది తాజా ప్రశ్న. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చర్చాపత్రం గత వారం ఈ అంశాన్ని లేవనెత్తింది. రాజకీయ విమర్శలకు వెరచి, ఆర్థికశాఖ తక్షణమే బరిలోకి దిగింది. భారం మోపే ఆలోచనను కొట్టిపారేసింది. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి దేశంలో ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ వ్యాలెట్లు – ఇలా అనేక వ్యవస్థలున్నాయి. ఆర్బీఐ పక్షాన డిజిటల్ కరెన్సీ సైతం రానుంది. భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్పీసీఐ) వారి ‘యూపీఐ’ పల్లెపల్లెకూ పాకి, మొత్తం రిటైల్ నగదు బదలీల్లో 82 శాతం వాటా దక్కించుకోవడానికి పలు కారణాలు. మొబైల్ ఇంటర్నెట్ విప్లవం, బాదరబందీలు లేని బ్యాంకు ఖాతాల ‘జన్ధన్ యోజన’, నగదు రహిత చెల్లింపులపై సర్కారు మొగ్గు... ఇలా అనేకం ఈ విజయగాథ వెనక ఉన్నాయి. యూపీఐలో అప్పటికే నిర్ధారించిన ఫోన్ నంబర్ల ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదలీ అవుతుంది. డబ్బు అందుకున్నవారు సదరు లావాదేవీ విలువలో 0.3 శాతాన్ని (తక్కువలో తక్కువ రూ. 100) రుసుముగా గతంలో చెల్లించాల్సి వచ్చేది. నగదు రహిత లావాదేవీల్ని పెంచడానికి 2020 జనవరిలో ప్రభుత్వం ఆ ఫీజును తొలగించింది. అప్పటి నుంచి యూపీఐ తారాపథాన్ని తాకింది. ప్రజలపై భారం ఎత్తేసినా, అసలంటూ యూపీఐ కార్యకలాపాల నిర్వహణకైతే 0.25 శాతం మేర ఖర్చవుతున్నట్టు ఆర్బీఐ అంచనా. ఆర్థిక మధ్యవర్తులకు పడే ఆ లోటును కేంద్ర నిధులతో సర్కారు భర్తీ చేస్తూవస్తోంది. ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్ లానే యూపీఐ నిర్వహణ భారాన్నీ జనంపై వేయాలని ప్రతిపాదన. సుమారు రూ. 800 విలువైన లావాదేవీకి ఇచ్చే బ్యాంకు, తీసుకొనే బ్యాంకు, ఎన్పీసీఐ, యూపీఐ యాప్లు అన్నింటికీ కలిపి రూ. 2 ఖర్చవుతుందట. ప్రతి సేవకూ కొంత ఖర్చయ్యే మాట నిజమే. అలాగని అన్నిటికీ రుసుము వసూలు చేస్తామనడం సరికాదు. కొన్ని సేవలకు పబ్లిక్ సబ్సిడీ అవసరం. ఇవాళ యూపీఐ సేవలు లాంటివే. ఏ వ్యవస్థ అయినా నిలదొక్కుకోవాలంటే, అది వాడే వారికి భారం కాకూడదనేది సాధారణ సూత్రం. ఛార్జీల్లేని యూపీఐ మరింత కాలం కొనసాగాలం టున్నది అందుకే. వినియోగదారులకు సౌకర్యం, మన ఆర్థిక వ్యవస్థకు ఒనగూరే లబ్ధి రీత్యా చూస్తే యూపీఐ ‘డిజిటల్ జనహిత’ వ్యవస్థ. ఆర్థిక శాఖే ఆగస్టు 21న ఆ మాట అన్నది. నిర్ణీత అవసరాన్ని తీరుస్తూ, ఎవరైనా వాడుకొనేలా ఉచితంగా అందుబాటులో ఉంటేనే ప్రజాశ్రేయో వ్యవస్థ. లేదంటే అది కొందరి స్వలాభానికే పరిమితమై, చివరకు సంక్షేమం క్షీణిస్తుందని ఆర్థిక శాస్త్రవేత్తల హెచ్చరిక. నల్లధనం చెల్లింపులకు చోటివ్వకుండా, పారదర్శకమైన డిజిటల్ మార్గంలో పురోగమించడం దేశానికి మంచిదని భావిస్తున్న కేంద్రం దీని నిర్వహణ వ్యయాన్నీ భరించాలి. పోనుపోనూ అది బరువయ్యే మాట నిజమే. వచ్చే 2023–24 నాటికి డిజిటల్ చెల్లింపులు ఏటా రూ. 120 లక్షల కోట్లకు చేరతాయని అంచనా. ప్రభుత్వ సబ్సిడీ బిల్లు రూ. 30 వేల కోట్ల పైకి ఎగబాకవచ్చు. కానీ, సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వాలు ఆ భారానికి సిద్ధపడాలి. యూపీఐ లావాదేవీల్లో 1.4 శాతానికి పైగా విఫలమవుతున్నాయనీ, ఇటీవల ఆ రేటు పెరుగుతోందనీ, ఈ చెల్లింపు వ్యవస్థను దీర్ఘకాలం సమర్థంగా నడపాలంటే వినియోగ ఛార్జ్ తప్పదనే వారున్నారు. ఒకవేళ రేపు తప్పనిసరై ఛార్జ్ చేయాల్సి వచ్చినా ఇటు కస్టమర్ల, అటు ఆపరేటర్ల ప్రయోజనాల సమతూకంతో దాన్ని నిర్ణయించాలి. నిర్ణీత మొత్తం లోపల ఛార్జ్ మినహాయించడం ఒక మార్గం. లేదంటే నెలకు నిర్ణీత యూపీఐ లావాదేవీలు ఉచితమంటూ, అది దాటితేనే ఛార్జ్ అన్నది మరో మార్గం. ప్రతి యూపీఐ లావాదేవీకీ ఒక పైసా వంతున స్వల్పఛార్జ్ వసూలు చేసినా, ఈ జూలైకి ముగిసిన ఏడాదికి రూ. 5,842 కోట్ల ఆదాయం వచ్చేదని కొందరు లెక్కలు కడుతున్నారు. వెయ్యిసార్లు యూపీఐ వాడితే... కస్టమర్ పది రూపాయలే చెల్లించాల్సి వస్తుందనీ, ఈ నామ మాత్రపు రుసుముతో కొత్త ఆవిష్కరణలకూ, మెరుగుదలకూ వీలుంటుందనీ చెబుతున్నారు. పైకి ఇవన్నీ బాగానే ఉన్నా, కొన్నదానికీ, తిన్నదానికీ జీఎస్టీ సహా రకరకాల పన్నులు కడుతున్న ప్రజలు తమ నగదు చెల్లింపులకూ సర్కార్ వారి బాదుడు ఆలోచనను స్వాగతిస్తారా అన్నది ప్రశ్న. ఫలితంగా వారు మళ్ళీ డిజిటల్ కన్నా నగదు చెల్లింపుల వైపే మొగ్గే ప్రమాదం ఉంది. పెద్ద మొత్తాల బదిలీకి వాడే ఇతర ఆన్లైన్ చెల్లింపు విధానాలకు పాలకులు సబ్సిడీ ఇవ్వకున్నా ఫరవాలేదేమో కానీ, కోట్లాది సామాన్యుల్ని డిజిటల్ వైపు నడిపించిన యూపీఐని అపురూపంగా చూసుకోవడం ప్రస్తుతం అవసరం. అతి ఛార్జీలతో ఆన్లైన్ చెల్లింపుల్ని నిరుత్సాహపరిస్తే డిజిటల్ లక్ష్యమే దెబ్బ తింటుంది. కథ మళ్ళీ మొదటికి వస్తుంది! -
బ్రిటన్ వెళ్లే భారతీయలుకు శుభవార్త.. ఓ సమస్య తీరింది!
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) తాజాగా బ్రిటన్లోనూ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యూపీఐని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్లో భాగమైన ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్) చెల్లింపు సేవల సంస్థ పేఎక్స్పర్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం బ్రిటన్లో పేఎక్స్పర్ట్కి చెందిన ఆండ్రాయిడ్ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాలు ఉండే స్టోర్స్లో యూపీఐ ఆధారిత క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. బ్రిటన్కు వెళ్లే భారతీయ ప్రయాణికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని, ఎన్ఐపీఎల్ తెలిపింది. యూపీఐ విధానం ఇప్పటికే భూటాన్, నేపాల్లో కూడా అందుబాటులో ఉంది. చదవండి: భారత్లో యాప్స్, గేమ్స్కి పెరిగిపోతున్న క్రేజ్! -
పేటీఎం సేవల్లో అంతరాయం, యాప్లో మీ డబ్బులు ఆగిపోయాయా?
దేశ వ్యాప్తంగా ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం సేవలు స్తంభించిపోయాయి. యాప్లో లాగిన్ సమస్యలు ఉత్పన్నం కావడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ యాప్లో,వెబ్సైట్లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆటోమెటిక్గ్గా లాగవుట్ అవుతుందని ట్విట్టర్లో పేటీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో పేటీఎం యూజర్లు మనీ ట్రాన్స్ఫర్ విషయంలో జాగ్రత్తలు వహించాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంస్థకు సంబంధించిన సేవల అంతరాయాల్ని గుర్తించే డౌన్ డిక్టేటర్ సైతం దేశ వ్యాప్తంగా యూజర్లు పేటీఎం యాప్ నుంచి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. దేశంలో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో పేటీఎం యాప్ పని తీరు మందగించినట్లు తన నివేదికలో పేర్కొంది. Due to a network error across Paytm, a few of you might be facing an issue in logging into the Paytm Money App/website. We are already working on fixing the issue at the earliest. We will update you as soon as it is resolved — Paytm Money (@PaytmMoney) August 5, 2022 నెట్వర్క్ ఎర్రర్ పేటీఎం సేవల్లో అంతరాయం కలగడంపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించింది. నెట్ వర్క్ ఎర్రర్ వల్లే ఈ సమస్య ఏర్పడిందని తెలిపింది. అయితే ఇప్పుడా నెట్ వర్క్ ఇష్యూని పరిష్కరించామని పేటీఎం ట్వీట్ చేసింది. ఐటీ సిబ్బంది ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ట్వీట్ చేసింది. We understand that few of our Trading & F&O users would have faced real issues with their trades & positions. In our continued efforts to always have your back & to be fair & transparent, we request you write to us over email at exg.support@paytmmoney.com with your concerns (2/5) — Paytm Money (@PaytmMoney) August 5, 2022 ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోలేం యూజర్ల అంతరాయానికి చింతిస్తున్నాం. యాప్, వెబ్ సైట్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాం. యాప్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే సమయంలో నెట్ వర్క్ సమస్య, మనీ స్ట్రక్ అవ్వడంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు ట్వీట్లు చేస్తున్నారు.ఈ క్లిష్ట సమయాల్లో ఆ ట్వీట్లను పరిగణలోకి తీసులేం. తమకు ఫిర్యాదు చేయాలనుకుంటే 'సపోర్ట్@పేటీఎంమనీ.కాం.' కు మెయిల్ చేయాలని కోరింది. -
అమెరికాలో మరో భారతీయుని అరెస్టు
వాషింగ్టన్: అమెరికాలో సీనియర్ సిటిజన్ల ఖాతాలను దోచేసిన కేసులో తాజాగా మరో భారతీయుడు అరెస్టయ్యాడు. వర్జీనియాకు చెందిన అనిరుధ్ కల్కోటెను (24) శుక్రవారం హూస్టన్లో కోర్టులో హాజరుపరిచారు. సీనియర్ సిటిజన్ల నుంచి డబ్బులు దోచేందుకు వారికి కొందరు బెదిరింపు మెయిల్స్ పంపడం, ఇవ్వకుంటే దాడులకు దిగుతామని హెచ్చరించడం వంటివి చేశారు. హూస్టన్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న కొందరు భారతీయులు ముఠాగా ఏర్పడి వెస్ట్రన్ యూనియన్, మనీగ్రాం వంటి ట్రాన్స్మిటర్ బిజినెస్ల లింకులు పంపి వృద్ధుల ఖాతాల్లోని సొమ్ము కాజేశారు. మహమ్మద్ ఆజాద్ (25) అనే వ్యక్తితో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడన్నది అనిరుధ్పై అభియోగం. ఆజాద్ను 2020లోనే అరెస్టు చేశారు. నేరాలు రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష, 20 వేల డాలర్ల జరిమానా పడొచ్చు. -
డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలదే హవా!,10 ట్రిలియన్ డాలర్లకు!
ముంబై: ప్రజలు నగదు రహిత చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి నిదర్శనం ప్రస్తుతం ప్రతీ 10 లావాదేవీల్లో నాలుగు డిజిటల్ రూపంలోనే నమోదవుతున్నాయి. 2026 నాటికి యూపీఐ తదిర నగదు రహిత లావాదేవీల వాటా 65 శాతానికి చేరుకుంటుందని బీసీజీ, ఫోన్పే సంయుక్త నివేదిక అంచనా వేసింది. అలాగే, 2026 నాటికి డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ 10 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని.. అది ప్రస్తుతం 3 ట్రిలియల్ డాలర్ల స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. 2020–21 నాటికి దేశ ప్రజల్లో 35 శాతం మందికే చేరువ అయిన యూపీఐ చెల్లింపుల సేవలు వచ్చే ఐదేళ్ల కాలంలో 75 శాతం ప్రజలను చేరుకుంటాయని పేర్కొంది. కరోనా అనంతరం దేశంలో యూపీఐ చెల్లింపులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ అంశంపై నివేదిక వెలువడడం గమనార్హం. మర్చంట్ పేమెంట్స్ ప్రస్తుత స్థాయి నుంచి ఏడు రెట్లు పెరిగి 2026 నాటికి 2.5–2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని పేర్కొంది. మరింత మంది మర్చంట్లు (వర్తకులు) డిజిటల్ చెల్లింపులను అమోదిస్తే.. చిన్న వర్తకులకు రుణ సదుపాయం విషయంలో పెద్ద మార్పు కనిపిస్తుందని బీసీజీ ఎండీ ప్రతీక్ రూంగ్తా చెప్పారు. చిన్న పట్టణాల నుంచి తదుపరి డిజిటల్ పేమెంట్స్ వృద్ధి టైర్ 3 నుంచి టైర్ 6 పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. గత రెండేళ్ల కాలంలో కొత్త కస్టమర్లలో 60–70 శాతం ఈ పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ చెల్లింపులను వర్తకులు ఆమోదించేలా వారిని ప్రోత్సహించాలని.. ఇందుకు వీలుగా స్థిరమైన మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. తక్కువ విలువ లావాదేవీలపై ఎండీఆర్ రేటు 0.2–0.3 శాతం ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని సూచించింది. అప్పుడు బ్యాంకులు, పేమెంట్ సంస్థలు వ్యాపారాన్ని కొనసాగించడానికి వీలుంటుందని పేర్కొంది. ‘‘డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగడం బ్యాంకులపై ఒత్తిడిని పెంచుతోంది. కొన్ని బ్యాంకులు డిమాండ్ను తట్టుకోలేకున్నాయి. యూపీఐ లావాదేవీల వైఫల్యానికి ఇదే కారణం. అందుకుని బ్యాంకులు కోర్ బ్యాంకింగ్కు వెలుపల క్లౌడ్ తదితర ఆప్షన్లను పరిశీలించాలి’’ అని ఈ నివేదిక సూచించింది. -
అదృష్టం తలుపుతట్టి అంతలోనే అదృశ్యం
వికారాబాద్ అర్బన్/దస్తురాబాద్/మంథని: అదృష్టలక్ష్మి తలుపు తట్టి అంతలోనే అదృశ్యమైంది. కోటీశ్వరులం అయ్యామనే ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైంది. వికారాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లోని పలువురు హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు అకౌంట్లలో అప్పనంగా రూ. కోట్లు జమయ్యాయి. టెక్నికల్ సమస్య వల్లే డబ్బులు జమ అయ్యాయని తెలుసుకున్న బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఖాతాలను స్తంభింపజేశారు. వికారాబాద్లోని సెవెన్ హిల్స్ మొబై ల్స్ యజమాని వెంకట్రెడ్డికి హెచ్డీఎఫ్సీ స్థానిక బ్రాంచ్లో కరెంట్ అకౌంట్ ఉంది. ఆదివారం రాత్రి తన అకౌంట్లో రూ.18.52 కోట్లు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. మరునాడు ఉదయం బ్యాంకు అధికారులకు విషయం చెప్ప డంతో వెంటనే అతడి ఖాతాను స్తంభింపజేశారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజిపేటకి చెందిన వంగల సాయి అనే యువకుడికి నిర్మల్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా ఉంది. రూ.1,27,07,978 జమ అయినట్లు ఫోన్కు సమాచారం రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నిజమా కాదా అనే అనుమానంతో ఖాతా నుంచి రూ.లక్ష మరో ఖాతాకు బదిలీ చేశాడు. ఆ వెంటనే బ్యాంకు ఖాతా స్తంభించిపోయింది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఇల్లందుల సాయి అనే మొబైల్ షాపు నిర్వాహకుడికి స్థానిక హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా ఉంది. ఆయన ఖాతాలో రూ.5.68 కోట్లు జమ అయినట్లు ఆదివారం మెసేజ్ వచ్చింది. 6 గంటల అనంతరం అవి వెనక్కి వెళ్లాయి. పెద్ద మొత్తంలో డబ్బు జమ కావడంతో మొదట ఆనందం వేసినా.. ఆ డబ్బు ఎవరైనా కావాలనే వేశారా..? అని భయపడ్డానని సాయి తెలిపాడు. -
నవ్వితే చాలు అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయ్!
నవ్వు గురించి ఓ సినిమాలో "నవ్వవయ్యా బాబూ నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుందనే" పాట విని ఉంటాం. ఆ పాట సంగతి అటుంచితే టెక్నాలజీ పుణ్యమా అని.. ఇప్పుడు నిజంగానే నవ్వితే చాలు అకౌంట్లో ఉన్న మన సొమ్ము మాయం కానుంది. మన అకౌంట్ నుంచి మరో అకౌంట్కు ట్రాన్స్ ఫర్ కానుంది. ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే! ఫైనాన్షియల్ సర్వీస్ దిగ్గజం మాస్టర్ కార్డ్ యూజర్లకు అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. మాస్టర్ కార్డ్ వినియోగదారులు పేమెంట్ చేసేందుకు బయో మెట్రిక్ తంబ్ లేదంటే నవ్వితే చాలు కార్డ్, స్మార్ట్ ఫోన్, టెలిఫోన్తో అవసరం లేకుండా మరో అకౌంట్కు డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేయోచ్చు. ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్ను బ్రెజిల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొత్త టెక్నాలజీతో బెన్ఫిట్స్ ఏంటంటే! ఈ కొత్త టెక్నాలజీతో కరోనాలాంటి వైరస్ల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉంచడంతో పాటు సెక్యూర్గా మరింత ఫాస్ట్గా డబ్బుల్ని మాస్టర్ కార్డ్ తెలిపింది. నేటి ఆధునిక జీవన శైలికి తగ్గట్లుగా వేగంగా పేమెంట్ సేవలందించేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాం. ఇదే సమయంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశామని మాస్టర్ కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. కేబీవీ రీసెర్చ్ ఏం చెబుతోంది 2026 నాటికి ఈ కాంటాక్ట్ లెస్ బయో మెట్రిక్ టెక్నాలజీ బిజినెస్ 18.6బిలియన్ డాలర్లకు చేరుకోనుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కేబీవీ రీసెర్చ్ తెలిపింది. అయితే మాస్టర్ కార్డ్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త సౌకర్యం ఇప్పటికే వీసా, అమెజాన్లు అభివృద్ధి చేశాయని తెలిపింది. చదవండి👉ఏటీఏం కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త! -
న్యూయర్ గిఫ్ట్..బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2000; మీకు వచ్చాయో లేదో చెక్ చేసుకోండి ఇలా..!
ప్రధాన మంతి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైతులకు నూతన సంవత్సర కానుకను అందించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకం కింద 10వ విడత నగదును రైతుల ఖాతాల్లోకి జమచేసింది. సుమారు 10 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ. 20,000 కోట్లకు పైగా నగదు బదిలీని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. అట్టడుగు రైతులకు సాధికారత కల్పించాలనే ప్రధాని మోదీ నిబద్ధత, సంకల్పానికి అనుగుణంగా నగదు బదిలీ జరిగిందని ప్రధాన మంత్రి కార్యాలయం పీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఇవ్వనుంది. నాలుగు-నెలల వాయిదాలలో రూ. 2,000 చొప్పున ప్రభుత్వం రైతులకు చెల్లిస్తోంది. ఈ పథకంలో భాగంగా రైతులకు ఇప్పటివరకు రూ. 1.6 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. అయితే పదో విడత నగదు ఖాతాలో పడ్డాయో లేదో అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొందరికి ఎస్ఎమ్ఎస్ రూపంలో మెసేజ్ లు కూడా వస్తాయి. ఒకవేల మెసేజ్ రాకపోతే ఈ క్రింది విధంగా చెక్ చేస్తే సరిపోతుంది. స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా..! పీఏం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ pmkisan.gov.inకు వెళ్లి, మెనూ బార్ లో ఉన్న 'ఫార్మర్స్ కార్నర్' పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి (ఎ) ఆధార్ సంఖ్య, (బి) బ్యాంక్ ఖాతా సంఖ్య, (సి) మొబైల్ నంబర్. ఇందులో ఏదైనా ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు చెల్లింపు చెక్కు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, మీరు 'గెట్ డేటా' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నగదు జమ అయ్యిందో లేదో మీకు చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఎఫ్టీ(రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్)ని ఆమోదించిన తర్వాత ప్రభుత్వం ఎఫ్టిఒ(ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) కనిపిస్తుంది. ఒకవేల మీకు రాకపోతే ముందుగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించండి. అలాగే, పీఏం కిసాన్ హెల్ప్లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉంటేనే నగదు వస్తాయనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. చదవండి: గుడ్న్యూస్! గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు -
APSSDC Scam: హవాలా దారిలో ‘పెద్దలకు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో కొల్లగొట్టిన రూ.242 కోట్ల చిక్కుముడి వీడుతోంది. గత సర్కారు హయాంలో వర్సిటీలు, కాలేజీలకు పరికరాలు సరఫరా చేసినందుకు నిధులు చెల్లించామన్న వాదన కట్టుకథేనని తేటతెల్లమవుతోంది. చంద్రబాబు సర్కారు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన రూ.242 కోట్లు హవాలా మార్గంలో తిరిగి ‘పెద్దలకే’ చేరాయని స్పష్టమైంది. 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు వ్యక్తం చేసిన సందేహాలు నిజమేనని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. చదవండి: ‘స్కిల్’ స్కామ్లో షెల్.. షా హవాలా దారిలో రూ.242 కోట్లు కాంట్రాక్టు నిబంధనలను పాటించకున్నా గత ప్రభుత్వం డిజైన్టెక్ కంపెనీకి పూర్తి సానుకూలంగా వ్యవహరించింది. నిబంధనల ప్రకారం సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు 90% నిధులు సమకూర్చాలి. అయితే ఒక్క శాతం కూడా వెచ్చించకున్నా టీడీపీ సర్కారు తన వాటాగా రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించింది. అందులో రూ.242 కోట్లను డిజైన్ టెక్ బోగస్ కంపెనీ స్కిల్లర్కు చెల్లించింది. స్కిల్లర్ ఆ నిధులను ఏసీఐ అనే మరో షెల్ కంపెనీకి మళ్లించింది. నకిలీ ఇన్వాయిస్లతో బురిడీ కొట్టించిన ఏసీఐ కంపెనీ రూ.242 కోట్లను మళ్లీ డిజైన్ టెక్ ఖాతాలోనే వేసింది. ఆ నిధులను డిజైన్ టెక్ కంపెనీ ప్రతినిధులు విత్డ్రా చేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అంత మొత్తాన్ని విత్డ్రా చేసినప్పటికీ కంపెనీ రికార్డుల్లో ఎలాంటి ఎంట్రీలు లేకపోవడం గమనార్హం. రూ.242 కోట్లను హవాలా మార్గంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులకు డిజైన్ టెక్ ప్రతినిధులు చేరవేసినట్లు స్పష్టమైంది. అందుకే వాటికి సంబంధించి రికార్డుల్లో ఎలాంటి ఎంట్రీలు లేవు. ఇలా ఈ నిధులు గత సర్కారు పెద్దల జేబుల్లోకి చేరిపోయాయి. ఆనాడే గుర్తించిన కేంద్ర జీఎస్టీ... కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పుణెలోని షెల్ కంపెనీలపై దాడులు నిర్వహించినప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏఐసీ, స్కిల్లర్ తదితర కంపెనీలు సమర్పించిన ఇన్వాయిస్లన్నీ నకిలీవేనని జీఎస్టీ అధికారుల దాడుల్లో నిర్ధారణ అయ్యింది. తాము ఏపీఎస్ఎస్డీసీకి ఎలాంటి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సరఫరా చేయలేదని ఆ రెండు కంపెనీ ప్రతినిధులు అంగీకరించారు. తమ రికార్డుల్లో చూపిస్తున్న రూ.242 కోట్ల లావాదేవీలన్నీ కల్పితాలేనని వెల్లడించారు. కేంద్ర జీఎస్టీ అధికారులు ఇదే విషయాన్ని 2018లోనే టీడీపీ సర్కారు దృష్టికి తెచ్చారు. రూ.242 కోట్లు దారి మళ్లాయని స్పష్టం చేశారు. దీనిపై గత సర్కారు ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చింది. తాజాగా సీఐడీ అధికారుల దర్యాప్తులో ఆ అవినీతి బండారం బట్టబయలైంది. షా అరెస్టుతో టీడీపీ నేతల్లో గుబులు.. ముంబైకి చెందిన షెల్ కంపెనీల సృష్టికర్త శిరీష్ చంద్రకాంత్ షా అరెస్టుతో టీడీపీ పెద్దల్లో ఆందోళన మొదలైంది. రూ.242 కోట్లు హవాలా మార్గంలో తరలించిన ఉదంతంలో తమ పేరు వెలుగులోకి వస్తోందని కలవరం చెందుతున్నారు. చంద్రకాంత్ షా సృష్టించిన షెల్ కంపెనీల ద్వారానే ఏపీఎస్ఎస్డీసీతోపాటు మరికొన్ని శాఖల్లో కుంభకోణాల నిధులను పక్కాగా దారి మళ్లించినట్టు తెలుస్తోంది. -
వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయండిలా.!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై అందరు వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. వాట్సాప్ ఈ సదుపాయాన్ని గతేడాది అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలామందికి ఆ ఫీచర్ అందుబాటులోకి రాకపోవడంతో పాటు పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఏడాది కాలంగా "వాట్సాప్ పే" ఫీచర్పై వర్క్ చేస్తుంది. తాజాగా ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చిందని, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది. కాగా, ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ) సహకారంతో ఇండియాలోనే తొలిసారిగా 160 బ్యాంక్ల మద్దతుతో వాట్సాప్పే ఫీచర్ పనిచేస్తుంది. వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలంటే ♦ ముందుగా వాట్సాప్ సెట్టింగ్ మెనూ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ♦ ట్యాప్ చేసిన వెంటనే మనకు యాడ్ న్యూ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ♦ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ... 160 బ్యాంక్ల లిస్ట్ చూపిస్తుంది ♦ ఆ లిస్ట్ లో మీకు కావాల్సిన బ్యాంక్ నేమ్ పై క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ను వెరిఫై చేయాలి ♦ వెరిఫై చేసే సమయంలో బ్యాంక్ కు లింక్ చేసిన ఫోన్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. ♦ ఒక వేళ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ♦ బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసి మీరు డబ్బుల్ని మీ వాట్సాప్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు -
రైతుబంధు సహాయం మరొకరి ఖాతాలోకి..
సాక్షి, తాండూరు: వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో ఓ మహిళ రైతుబంధు డబ్బులు మరొకరి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. సంబంధిత రైతు ఖాతాలో పడాల్సిన డబ్బులు హైదరాబాద్లోని ఓ వ్యక్తి ఖాతాలో పడ్డాయి. తాండూరు మండలం గౌతపూర్ గ్రామానికి చెందిన జెన్నె ఎల్లమ్మకు అల్లాపూర్ గ్రామ సమీపంలో సర్వే నంబర్ 200, 201లో 4.35 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేస్తూ ఆమె జీవిస్తోంది. అయితే ఆమెకు అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి సహాయం ఆమె ఖాతాలో జమ కాలేదు. తనకు డబ్బులు పడలేదని ఆమె వ్యవసాయ అధికారులు, ఆంధ్రాబ్యాంక్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. అయితే ఆమెకు రావాల్సిన 2018, 2019 కు సంబంధించిన రైతుబంధు డబ్బులు ఆమె ఖాతాలో కాకుండా ఇతరుల ఖాతాల్లో పడ్డాయని సమాచారం తెలిసింది. హైదరాబాద్లోని ప్రగతినగర్కు సంబంధించిన సిండికేట్ బ్యాంక్ ఖాతా ఉన్న ఓ వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు అధికారులు చెప్పారు. దీంతో ఎల్లమ్మ కుటుంబసభ్యులు హైదరాబాద్కు వెళ్లి సిండికేట్ బ్యాంకులో వెళ్లి నగదు విషయమై బ్యాంక్ అధికారులను అడగ్గా తిరస్కరించారు. దీంతో ఎల్లమ్మ తాండూరులోని వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతుబంధు డబ్బుల కోసం తిరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ ఉన్నతాధికారులు స్పందించి రైతుబంధు డబ్బులు ఎల్లమ్మ ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు. -
అంత డబ్బు ఎలా ఇచ్చేస్తారండీ!
న్యూఢిల్లీ: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ నిధుల బదలాయింపుపై అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్బీఐ అదనపు నిధుల బదలాయింపును ప్రస్తావిస్తూ, ‘‘ఇది తీవ్ర ఆందోళనకర అంశం’’ అని పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వశాఖకు ఆర్బీఐ అదనపు బ్రాంచ్ ఆఫీస్ (ఎక్స్టెన్షన్ కౌంటర్) కారాదని స్పష్టంచేసింది. ఒక స్వతంత్ర సంస్థగా ఆర్బీఐ ఏర్పాటయ్యిందని పేర్కొంటూ, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, విదేశీ అనిశ్చితి పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ, ద్రవ్య స్థిరత్వం, దవ్య లభ్యత, సరఫరాల్లో ఇబ్బందులు లేకుండా చూడ్డం వంటివి ఆర్బీఐ ప్రధాన లక్ష్యాలుగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఆర్బీఐ మిగులు నిధులను కేంద్రానికి బదలాయింపులపై ఏర్పాటయిన బిమల్ జలాన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్బీఐ ఆమోదించిన నేపథ్యంలో ఏఐబీఈఏ తాజా వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1,23,414 కోట్లు మిగులు లేదా డివిడెండ్ రూపంలో, మరో రూ. 52,637 కోట్లు మిగులు మూలధనం రూపంలో మొత్తం రూ.1,76,051 కోట్లను కేంద్రానికి బదలాయించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఎంవీఐ లంచం.. వయా గూగుల్ పే
సాక్షి, కరీంనగర్ : రవాణాశాఖ కరీంనగర్ జిల్లా పరిధిలో ఆయనే సుప్రీం. పేరుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) అయినా... రవాణా శాఖ జిల్లా అధికారికి తగ్గని స్థాయి ఆయనది. జిల్లాల పునర్విభజన తరువాత నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిమితమైన కరీంనగర్కు ఆయనొక్కడే ఎంవీఐ. ఐదేళ్లుగా రెగ్యులర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ లేరు. ప్రస్తుతం ఆదిలాబాద్ డీటీసీ శ్రీనివాస్ ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీఐదే ఇష్టారాజ్యం. మూడేళ్లలో పదవీ విరమణ చేయాల్సిన ఆయన వాహనాల తనిఖీ పేరిట సాగించే అవినీతి దందాకు సరికొత్త విధానాన్ని ఎన్నుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నగదు రహిత లావాదేవీల విధానాన్ని లంచం వసూళ్లకు కూడా వాడుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల నుంచి వసూలు చేసే అపరాధ రుసుమును ‘గూగుల్ పే’ ద్వారా చెల్లించాలని డ్రైవర్లకు ఆదేశాలిచ్చారు. అయితే అది వెళ్లేది మాత్రం రవాణా శాఖకు కాకుండా సొంతానికి. ఇందుకోసం ప్రైవేటు సైన్యాన్ని కూడా నియమించుకున్నట్లు సమాచారం. ఇటీవల తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం ఎంపీటీసీ భర్త అశోక్రెడ్డి నుంచి రూ.5 వేలు గూగుల్పే యాప్ ద్వారా ఎంవీఐ లంచం తీసుకున్నాడు. అలాగే వాహన తనిఖీ పేరిట పెద్ద ఎత్తున డబ్బులు పలు ఖాతాల్లో జమ చేయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు అశోక్రెడ్డి డీటీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, మీడియాలో రవాణా శాఖలో జరుగుతున్న దందాపై కథనాలు రావడంతో కరీంనగర్ ఇన్చార్జి డీటీసీ శ్రీనివాస్ సదరు ఎంవీఐని రవాణాశాఖ కమిషనర్కు సరెండర్ చేశారు. ఎంవీఐ గౌస్పాషా సరెండర్ కరీంనగర్ జిల్లా రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్పాషాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను రవాణాశాఖ కమిషనర్కు సరెండర్ చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి డీటీసీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనలు, ఇతర ఫిర్యాదుల మేరకు జరిపిన ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిన అంశాల ఆధారంగా గౌస్పాషాను సరెండర్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు గుర్తించిన అంశాలపై పూర్తిస్థాయిలో రవాణాశాఖ కమిషనర్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కాగా, గౌస్పాషా సరెండర్తో ప్రస్తుతం జిల్లాలో రెగ్యులర్ ఎంవీఐ లేకుండా పోయినట్లయింది. మూడేళ్ల సర్వీస్.. పర్సనల్ గార్డుల నియామకం సరెండర్ అయిన వీఎంఐకి ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉంది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న కాలంలో అందిన కాడికి దండుకోవాలనే ఆలోచనతో నిత్యం వాహనాల తనిఖీ పేరిట వసూళ్ల దందా సాగిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. డీటీసీకి సైతం సమాచారం ఇవ్వకుండా తనే వాహనంలో వెళ్లి తనిఖీల దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులను గార్డులుగా నియమించుకొని మరీ వాహనాలను నిలిపివేయించి, నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరైనా మీరెవరు..? మీ గుర్తింపు కార్డేది? అని ప్రశ్నిస్తే వెంటనే ఎంవీఐకి ఫోన్చేసి మాట్లాడిస్తారు. అధికారి స్వయంగా మాట్లాడి తానే వారిని నియమించానని, మీ పత్రాలు చూపించి వెళ్లాలని చెప్పి... వారికి డబ్బులు ఇచ్చి వెళ్లాని ఆదేశించేవారని తెలిసింది. ఇటీవల కూడా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో సదరు పర్సనల్ హోంగార్డులు వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై గతంలో కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. కొత్తగూడెంలో పనిచేసిన సమయంలోనూ ఇదేరీతిన వ్యవహరించినట్లు సమాచారం. గూగుల్ పేతో పలు నెంబర్లకు మనీ ట్రాన్స్ఫర్ రవాణా అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఎంవీఐ లంచం తీసుకున్నాడని నిర్ధారణ అయినట్లు తెలిసింది. తన చేతికి కరెన్సీ నోట్లు అంటని విధంగా... నేరుగా డబ్బులు తీసుకోకుండా ‘గూగుల్ పే’ ద్వారా పలు బినామీ నంబర్లకు మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు తేలింది. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. వాహనాల తనిఖీలో నిబంధనలు పాటించని వాహనాలపై వేసే అపరాధ రుసుము ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సి ఉండగా... తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లు తేలింది. గతమంతా అవినీతిమయమే.. కరీంనగర్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంవీఐ గత చరిత్ర కూడా అవినీతిమయమే అని తెలుస్తోంది. గతంలో కొత్తగూడెం రవాణా శాఖ కార్యాలయంలో విధులు నిర్వహించిన సమయంలో వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీకి పట్టుపడ్డట్టు సమాచారం. దీంతో రవాణా అధికారులు ఈయనతోపాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. దీంతో ఆయన ఉన్నతాధికారులు, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని తిరిగి విధుల్లో చేరారు. అతడిని విధుల్లోకి తీసుకున్న అధికారులు కరీంనగర్ రవాణా కార్యాలయానికి బదిలీ చేశారు. -
స్మగ్లింగ్ స్పెషలిస్ట్
సాక్షి, సిటీబ్యూరో: ‘జీరో నెంబర్’ దందా చేసే మైసూర్ వాసి రాజు నాంగ్రే పసిడి, డబ్బు రవాణాలు కారుల్లో ప్రత్యేక లాకర్లు ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి డ్రైవర్లుగా పని చేసే వారికి ఓ కీలక విషయంలో తర్ఫీదు కూడా ఇచ్చాడు. వివిధ రాష్ట్రాలకు తిరిగే వీళ్ళు ఏదైనా నేరం బారినపడితే స్థానిక పోలీసులకు ఇచ్చే ఫిర్యాదులో ఎక్కడా బంగారం, డబ్బు విషయం ప్రస్తావించకుండా కౌన్సిలింగ్ చేశాడు. ‘పన్ను’పోటు తప్పించుకోవడానికే ఈ ఎత్తులు వేశాడు. ఫలితంగానే గతంలో కేరళ, కర్ణాటక పోలీసులతో కలిసి మేనేజ్ చేసుకుంటూ తన దందాను రికార్డుల్లోకి ఎక్కించలేదు. ఈసారి నేరం సైబరాబాద్లో జరగడంతో అతడికి ఆ చాన్స్ లేకుండా పోయింది. షాద్నగర్ ఠాణా పరిధిలోని రాయకల్ టోల్ప్లాజా సమీపంలో గత నెల 28న జరిగిన బందిపోటు దొంగతనం కేసులో ఉన్న కీలకాంశమిది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితుల్ని సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. అక్రమ బంగారంగా అనుమానం... మహారాష్ట్రకు చెందిన రాజు నాంగ్రే మైసూర్లో స్థిరపడ్డారు. అక్కడ ఉంటూనే కేరళ నుంచి తక్కువ ధరకు బంగారం ఖరీదు చేస్తుంటాడు. ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది విదేశాల్లో ఉంటున్నారు. స్థానిక ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న రాజు ఆయా దేశాల నుంచి వాళ్ళు తిరిగి వచ్చేప్పుడు బంగారం అక్రమంగా తీసుకువచ్చేలా చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా దేశంలోని స్మగుల్డ్ అయిన గోల్డ్ను తక్కువ ధరకు వారి నుంచి ఖరీదు చేసే వాడు. దీన్ని హైదరాబాద్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్న బంగారం వ్యాపారులకు ఎక్కువ ధరకు విక్రయించేవాడు. వ్యాపారులకు పసిడి డెలివరీ చేయడానికి, వారి నుంచి డబ్బు వసూలు చేసుకు రావడానికి ఏడు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు. ఈ వాహనాలను తీసుకువెళ్ళే, తిరిగి తీసుకువచ్చే డ్రైవర్లకు రాజు ఓ విషయం స్పష్టం చేసేవాడు. ఎక్కడైనా నేరం బారినపడితే కారులో ఉండే బంగారం, డబ్బు విషయం బయటకు చెప్పకుండానే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పదేపదే చెప్పేవాడు. తలలు పట్టుకున్న పోలీసులు... ఓ మధ్యస్థాయి కారు కోసం నలుగురు వ్యక్తులు వచ్చి, తుపాకీ చూపించి మరీ ఎత్తుకుపోవడం ఏంటని పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే అనుమానం వచ్చిన అధికారులు ఫిర్యాదుదారుడైన రాహుల్ను వివిధ కోణాల్లో, లోతుగా ప్రశ్నించారు. దీంతో ఆ కారులో రహస్య లాకర్ ఉండటం, అందులో రూ.3.67 కోట్ల నగదు ఉన్న విషయం బయటపెట్టక తప్పలేదు. దీంతో అసలు విషయం తెలుసుకున్న అధికారులు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ గాలించారు. చివరకు ఏడుగురు బందిపోటు దొంగల్నీ పట్టుకుని రూ.2.89 కోట్లు, బంగారం రికవరీ చేశారు. యజమాని రాజు ఎంతగా ప్రయత్నించినా నగదును రికార్డుల్లోకి ఎక్కకుండా ఆపలేకపోయాడు. ఇది భారీ మొత్తం కావడంతో ఈ విషయంపై ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాయాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నిర్ణయించారు. డీమానిటైజేషన్ తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు కలిగి ఉండటమూ నేరమే అని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు చూసుకుంటారని అంటున్నారు. ఈ బందిపోటు ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు పోలీసు కమిషనర్ ప్రత్యేక రివార్డులు అందించారు. ఆ రెండు చోట్లా సాధ్యమైనా... రాజుకు చెందిన వాహనాలు బంగారం, డబ్బుతో వెళ్ళి వస్తున్నప్పుడు గతంలోనూ మాయమయ్యాయి. కొన్ని ముఠాలు ఆ కారుతో సహా సర్వం దోచుకుపోయాయి. అయినప్పటికీ అప్పట్లో ఆయా వాహనాలకు డ్రైవర్లుగా వ్యవహరించిన వాళ్ళు పోలీసులకు కేవలం వాహనం పోయిందని మాత్రమే ఫిర్యాదు చేశారు.విషయం తెలుసుకున్న ఆ పోలీసుస్టేషన్కు చేరుకునే రాజు అధికారులను మేనేజ్ చేయడం ద్వారా తన డబ్బు, బంగారం రికార్డుల్లోకి ఎక్కకుండానే రికవరీ చేయించుకునేవాడు. ఇలా కేరళ, కర్ణాటకల్లోనూ జరిగింది. రాయకల్లో బందిపోటు దొంగతనానికి గురైన వాహనానికి డ్రైవర్గా వ్యవహరించిన రాహుల్ కూడా ఇలానే చేశాడు. గత నెల 28న నేరం జరిగిన తర్వాత షాద్నగర్ ఠాణాకు వెళ్ళాడు. గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు తనకు పిస్టల్ చూపించి, కారు పట్టుకుపోయారని ఫిర్యాదు చేశాడు. దుండగులు ఎత్తుకుపోయిన కారు మారుతి బ్రిజా అని, కేరళ రిజిస్ట్రేషన్తో ఉందని అందులో పేర్కొన్నాడు. -
ధాన్యం.. ‘ధనం’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో దశలవారీగా జమ అవుతున్నాయి. రబీ సీజన్కు సంబంధించి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మగా.. పౌరసరఫరాల శాఖ అధికారులు నగదు చెల్లింపు చర్యలు చేపట్టారు. వాస్తవానికి ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతులకు నగదు ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల సకాలంలో చెల్లించలేదు. దీంతో రైతుల ఇబ్బందులను గుర్తించిన ప్రజాప్రతినిధులు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సమస్యపై అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జేసీ అనురాగ్ జయంతి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు 3,500 మంది రైతులకు ఇంకా నగదు రావాల్సి ఉండగా.. వారిలో ఇప్పటివరకు చాలా మంది ఖాతాల్లో నగదు జమ చేశారు. రబీ సీజన్లో రైతులు జిల్లాలో 25వేల హెక్టార్లలో ధాన్యం సాగు చేశారు. ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తం 90 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ, ఐకేపీ ఆధ్వర్యంలో 18, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 72 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో డీఆర్డీఏ–ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 4,116 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 24,500.240 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 1,752.200 మెట్రిక్ టన్నులు.. మొత్తం 26,252.440 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే పీఏసీఎస్ల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 12,868 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 99,709.560 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 4,125.440 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,03,835.000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అంటే మొత్తం 90 కొనుగోలు కేంద్రాల ద్వారా 16,984 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 1,24,209.800 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 5,877.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,30,087.440 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశారు. నగదు రాకపోవడంతో ఆందోళన.. సాధారణంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత సంబంధిత రైతులకు 48 గంటల్లో నగదు వారి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఈసారి చాలా మంది రైతులకు నెలలు గడుస్తున్నా నగదు మాత్రం వారి ఖాతాల్లో జమ కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల నుంచి వివరాలను అప్లోడ్ చేసిన అనంతరం సంబంధిత రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అయితే రైతులకు సకాలంలో నగదు రాకపోవడంతో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సాధారణ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు రైతుల ఖాతాల్లో నగదు జమ కాని విషయంపై అధికారులను ప్రశ్నించారు. కొనుగోళ్లు జరిగి ఇంత కాలమైనా ఇంకా నగదు రాకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. దాదాపు 3,500 మందికి ఇంకా నగదు రాలేదని, వారి పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులు త్వరలోనే రైతులకు నగదు అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు చెల్లింపులు.. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు నగదు చెల్లింపులు చేపట్టారు. గతంలో రైతులకు నగదు అందకపోవడంతో ఇబ్బందులు పడిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం దశలవారీగా అందరు రైతులకు ధాన్యానికి సంబంధించిన నగదును వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 16,984 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. వీరిలో అనేక మందికి నగదు చెల్లింపులు ఇప్పటికే చేయగా.. మిగిలిన వారికి కూడా వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాతాల్లో నగదు జమ కావడంతో రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది. ఖాతాల్లో జమ చేస్తున్నాం.. పెండింగ్లో ఉన్న రైతులందరి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాం. మరో వారం రోజుల్లో రైతులందరికీ నగదు అందించేందుకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాం. – వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ -
రైతుకు భరోసా
నారాయణపేట: ‘భూ ప్రక్షాళనలో చిన్న చిన్న తప్పులతో కొంతమందికి మాత్రమే కొత్త పాసు పుస్తకాలు రాలేదు.. ఇందుకు ఎవరూ పరేషాన్ కావొద్దు.. రెవెన్యూ రికార్డుల్లో భూములు మీవైతే.. మీకు తప్పకుండా కొత్త పాసుపుస్తకాలు వస్తాయ్.. రైతు బంధు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయి.. ఇందులో ఎలాంటి అపోహలు పెంచుకోవద్దు..’ అని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. భూ సమస్యలు, రైతుబంధు తదితర సమస్యలపై ప్రజలు తమ గోడును వినిపించేందుకు కలెక్టర్తో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్లో నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పలువురు రైతులు ‘సాక్షి’ ఫోన్ ఇన్ ద్వారా భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు చెప్పిన సమస్యలను కలెక్టర్ ఓపికగా విని.. పరిష్కారానికి భరోసా ఇచ్చారు. సమస్యల ఏకరువు.. చాలామంది రైతులు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం రావడం లేదని.. కొత్త పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. పట్టాదారు పాస్ పుస్తకాలకు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్కు ఫోన్లో ఏకరువు పెట్టారు. స్పందించిన కలెక్టర్ ఫోన్ చేసిన రైతులందరి సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. సమస్య పరిష్కారం తర్వాత వారికి తిరిగి ఫోన్ చేసి చెప్పాలని తహసీల్దార్లను ఆదేశించారు. కొంతమంది రైతుల ఫోన్ నంబర్లను నోట్ చేసుకొని సంబంధిత వీఆర్ఓలకు సమాచారం అందించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మరి కొంతమంది రైతులకు మాత్రం ఈ రోజు (మంగళవారం) సాయం త్రం వరకు మీమీ మండల తహసీల్దార్ల వద్దకు వెళ్లి సమస్యను వివరించాలని చెప్పారు. ఫోన్ ఇన్కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆర్డీఓ నోట్ చేసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రఘువీరారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ బాలాజీ, నారాయణపేట తహసీల్దార్ రాజు, జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు. సార్ నీ కాల్మొక్త.. పాసు బుక్ ఇస్తలేరు కలెక్టర్ సార్ నీ కాల్మొక్త.. నా పేరు హన్మంతు. దామరగిద్ద మండలం ఆశన్పల్లి గ్రామం. 1996లో సర్వే నంబర్లు 91, 92, 94లలో ఐదెకరాల భూమి కొన్నాం. డాక్యుమెంట్లు, ఈసీ ఉన్నాయి. ఉర్దూలో ఉన్న డాక్యుమెంట్లను తెలుగులోకి మార్పించా. సంబంధిత పత్రాలను రెవెన్యూ అధికారులకు చూపించినా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. నాకు న్యాయం చేయండి సారూ. కలెక్టర్ స్పందిస్తూ.. హన్మంతు మీ డాక్యుమెంట్లు తీసుకెళ్లి ఈ రోజు సాయంత్రం దామరగిద్ద తహసీల్దార్ను కలవండి. వాటిని సరిచూసి విచారణ జరిపి మీకు న్యాయం జరిగిలే చూస్తాం. సరే సార్ మీకు రుణపడి ఉంటా. నా భూమి నాకు ఇప్పించండి సార్.. నా పేరు కుర్వ దశరథ్. ఊట్కూర్ మండలం పెద్దపొర్ల గ్రామం. సర్వే నంబర్ 170/సీ/5లో 18 గుంటల భూమి ఉంది. రికార్డుల్లో మార్చి నాకు భూమి లేకుండా చేశారు. నా వద్ద పట్టా పాసు బుక్కు ఉంది. రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ స్పందిస్తూ.. అక్కడే ఉన్న ఊట్కూర్ తహసీల్దార్ను విచారణ జరిపి భూమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. భూమి దశరథ్దే అని తేలితే సంబంధిత వీఆర్ఓపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. పట్టా చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని హెచ్చరించారమూడెకరాలకు ఎకరానే వచ్చింది సార్ మా మామయ్య హన్మంతు పేరిట సర్వే నంబర్లు 692, 704లో మూడెకరాల భూమి ఉంది. కొత్త పుస్తకంలో ఒక ఎకరా మాత్రమే వచ్చింది. నా పేరు పవిత్ర. మాది మరికల్ గ్రామం. ఇంకా రెండు ఎకరాల భూమి ఎక్కడపోయింది. మాకు న్యాయం చేయండి. కలెక్టర్ స్పందిస్తూ.. మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఖలీద్ ను కలిసి భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు చూయించండి. రికార్డులను పరిశీలించి సరిచేసుకునే అవకాశం ఉంది. కొత్త పాసుపుస్తకం రాలేదు సార్.. నా పేరు నీరటి వెంకటమ్మ. మాది నారాయణపేట పట్టణం పళ్లబురుజు. సర్వే నంబర్లు 441, 443లో తొమ్మిది ఎకరాలకు 10 సెంట్లు తక్కువగా ఉంది. మొదటి విడతలో పాసుపుస్తకం రాకపోయినా రైతుబంధు డబ్బులు ఇచ్చారు. ఇంత వరకు కొత్త పాసుపుస్తకం రాలేదు. రెండో విడత డబ్బులు పడలేదు. దయచేసి నాకు కొత్త పాసు పుస్తకం ఇప్పించి రైతుబంధు డబ్బులు వేయించండి సార్ మీకు పుణ్యమొస్తది. తక్షణమే కలెక్టర్ స్పందించి ఫోన్ ఇన్ నీరటి వెంకటమ్మను లైన్లోనే పెట్టి వెంటనే వీఆర్ఓ కు ఫోన్ కలపండంటూ పక్కనే ఉన్న నారాయణపేట తహసీల్దార్కు ఆదేశించారు. వీఆర్ఓ తో ఫోన్లో మాట్లాడుతూ నీరటి వెంకటమ్మకు సంబంధించిన భూమిపై నివేదిక సాయంత్రం వరకు నా టేబుల్పై ఉండాలని ఆదేశించారు. ఇనాం భూములకు.. సార్.. నాపేరు గజలప్ప. దామరగిద్ద మండలం బాపన్పల్లి గ్రామం. సర్వే నంబర్లు 9, 10, 11, 16లలో దాదాపు 20 కుటుంబాలకు ఇనాం భూ ములు ఇచ్చారు. కొత్త పాసు పుస్తకాలు ఇవ్వ మంటే ఇవ్వడం లేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ స్పందిస్తూ.. బాపన్పల్లిలో ఈనాం భూములకు సంబంధించి వెంటనే విచారణ చేపట్టి నివేదికలను సమర్పించాలని ఆర్డీఓ శ్రీనివాసులు సూచించారు. బాపన్పల్లితోపాటు ఇతర గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉంటే తహసీల్దార్లతో సమీక్షించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. బుక్క రాలే.. పైసలు పడలే సార్.. నా పేరు నర్సింహులు. దామరగిద్ద మండలం లక్ష్మీపూర్. ఇంత వరకు కొత్త పాసు పుస్తకం రాలేదు. రైతుబంధు డబ్బులు పడలేదు. ఆరు నెలలుగా రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. అప్పుడు.. ఇప్పుడు అంటూ తిప్పుతున్నారు. కానీ, ఇంత వరకు బుక్ ఇస్తలేరు. నాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ స్పందిస్తూ..ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దామరగిద్ద తహసీల్దార్ను వెళ్లి కలవండి. మీ దగ్గర ఉన్న పాత పాసు బుక్కులు చూయించండి. ఏమైనా సమస్య ఉంటే వాటి ని సరిచేసి కొత్తపాసు బుక్కు ఇచ్చేందుకు చర్యలు చేపడుతాం. నా కొడుకు జర్మనీలో ఉంటాడు సార్.. నా పేరు రఘుపతిరెడ్డి. మద్దూరు మండలం నిడ్జింత. నా కొడుకు జర్మనీలో ఉంటాడు. భూమి కొడుకు పేరు మీద ఉంది. కొత్త పట్టా పాసు పుస్తకం రాలేదు. ఆఫీసులో అడిగితే ఈకేవైసీ సమస్య ఉందంటున్నారు. మాకు పట్టా పాసుపుస్తకం ఇప్పించండి. కలెక్టర్ స్పందిస్తూ.. మీ కుమారుడి ఆధార్ కార్డును ఈకేవైసీ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలి. మీరు తహసీల్దార్ కార్యాలయంలో వెళ్లి కలవండి. మీ కుమారుడి ఆధార్ నంబర్కు లింకైన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ నంబ ర్ చెబితే లింకప్ చేసి ఓకే చేస్తారు. అప్పుడు మీ కొడుకు పేరిట కొత్త పాసుపుస్తకం వస్తుంది. తహసీల్దార్ను కలిసిన రైతులు తమకు పొలాలు ఉన్న కొత్త పట్టా పాసు పుస్తకాలు రాలేదని ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన సిద్దన్ కిష్టమ్మ, నీటి వెంకటమ్మల కుటుంబ సభ్యులు కలెక్టర్ సూచన మేరకు సాయంత్రం 4 గంటలకు తహసీల్దార్ రాజు ను కలిసి భూముల పట్టా పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను అందజేశారు. కలెక్టర్కు ఫోన్ ఇన్లో తమ సమస్యను వివరించామని, మిమ్మల్ని కలవాలని చెప్పారని వివరించారు. దీంతో తహసీల్దార్ స్పందిస్తూ.. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. -
పోలీసులకు పండగే
సాక్షి, నెల్లూరు: జిల్లాలో పది నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటమి తప్పదని సర్వేలు తేల్చేశాయి. మరో వైపు రాజకీయ విశ్లేషకులు సైతం సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఎదురుగాలి తప్పదని తేల్చేశారు. దీంతో వైఎస్సార్సీపీకి గట్టి పోటీ అయినా ఇవ్వాలన్న ఆశతో ఓటుకు నోట్లు పెట్టి కోనుగోలు చేస్తున్నారు. అభ్యర్థులు ఆర్థిక స్తోమతను బట్టి నగదు పంపకాలు చేస్తున్నారు.నెల్లూరు నగరంలో మాత్రం మంత్రి నారాయణ ఓటుకు రూ.2 వేలు వంతున బహిరంగంగానే పంపకాలు చేస్తున్నారు. తమ విద్యాసంస్థల ఉద్యోగుల చేత నగదు పంపకాలు చేయిస్తూ ఉంటే వైఎస్సార్సీపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటనలు ఉన్నాయి. అలాగే నెల్లూరు రూరల్లో రూ.1000 వంతున, ఆత్మకూరులో రూ.2 వేలు, కావలిలో రూ.1000, ఉదయగిరిలో రూ.1000, వెంకటగిరిలో రూ.2వేలు, సూళ్లూరుపేట, గూడూరులో రూ.1000 వంతున ఓటుకు నగదు పంచుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటుకు నోటు ఇచ్చి టీడీపీ అభ్యర్థులు కొనుగోలు చేస్తున్నా పోలీసులు మాత్రం పట్టుకోలేకపోతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగదు స్వాహా.. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అభ్యర్థులు వారికి అనుకూలంగా పనిచేసే పోలీస్ అధికారులను తమ నియోజకవర్గంలో బదిలీలపై వేయించుకున్నారు. ఎన్నికల సమయంలో తామెన్ని అక్రమాలు చేసినా వారు చూసీ చూడనట్లుగా ముందుగానే ఒప్పందంతోనే వచ్చినట్లు ఆరోపణలున్నాయి.ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థులు బరితెగించి ఎన్నికల సమయంలో నిబంధనలు తుంగలో తొక్కినా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే ఓటర్లకు పంపకాలు కోసం నియోజకవర్గాలకు తరలిస్తున్న నగదును పట్టుకున్న పోలీసులు అందులో వాటాలు పుచ్చుకుని వదలివేసిన సంఘటనలున్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలీసులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం గువ్వాడి–కాంచెరువు రహదారి మధ్యలో మూడు రోజుల క్రితం టీడీపీ అభ్యర్థికి చెందిన రూ.కోటి నగదును ఓటర్లకు పంపకాల కోసం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం వెలుగులోకి రాకుండా స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పోలీసుల వద్ద పైరవీలు చేసి రూ.10 లక్షలు వారికి సమర్పించుకుని రూ.90 లక్షల తీసుకెళ్లినట్లు ప్రచారం జోరుగా ఉంది. వరికుంటపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి వద్ద ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ టీడీపీ నేతలు నగదు పంపకాలు చేస్తుండగా పట్టుకుని వారి వద్ద నున్న రూ.1.5 లక్షలు తీసుకుని వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో అనంతసాగరం మండలంలో ఇటీవల టీడీపీ అభ్యర్థికి చెందిన సమీప బంధువు ఓటర్లకు నగదు పంపకాలు చేస్తున్న సమయంలో రూ.8.5 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. అయితే అందులో రూ.7 లక్షల నగదు పక్కదారి పట్టించి రూ.1.5 లక్షలు పట్టుకున్నట్లుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఉద్యోగులు వద్ద రూ.20 లక్షలు పట్టుబడినా పోలీసులు కొంత నగదు తీసుకుని వదలివేసినట్లు ప్రచారం ఉంది. -
నేరాలకు వీసా!
దేశంలోని మెట్రో నగరాలపై ఇరానియన్లు కన్నేశారు. ఓ కుటుంబంగా విజిట్ వీసాపై వస్తున్నారు. ఢిల్లీలోని లాడ్జిలు, హోటళ్లలో బస చేస్తున్నారు. అక్కడే ఓ వాహనం అద్దెకు తీసుకుని ప్రధాన మెట్రో నగరాల్లో సంచరిస్తున్నారు. ఓ సిటీకి చేరిన తర్వాత రాత్రికి బస చేయడం, ఉదయం దృష్టి మళ్లించి డబ్బు కాజేసే నేరం చేయడం పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్ సహా ఐదు నగరాల్లోని మనీ ట్రాన్స్ఫర్, ఎక్స్చేంజ్ సంస్థల్ని ప్రధానంగా టార్గెట్ చేశారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల ఓ ముఠాను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో రెండింటి కోసం గాలిస్తున్న పోలీసులు ఆ అరెస్టు వివరాలను గోప్యంగా ఉంచారు. –సాక్షి, హైదరాబాద్ ‘స్థానిక ముఠాలు’ ఇచ్చిన సమాచారంతో... కొన్నేళ్ల క్రితం ఇరాన్ నుంచి వలస వచ్చి దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. వీరిలో కొందరు నేరగాళ్లుగానూ మారారు. ప్రధానంగా కర్ణాటకలోని బీదర్, ధర్వాడ, మహారాష్ట్రలోని థానే సమీపంలో ఉన్న అంబివలీ, మధ్యప్రదేశ్తో పాటు రాష్ట్రంలోని గుంతకల్, మదనపల్లిలో ఉంటూ నేరాలు చేస్తున్నాయి. పోలీసుల అవతారం ఎత్తి తనిఖీల పేరుతో మహిళల నుంచి నగలు తదితరాలు కాజేసేవాళ్లు. ఆ తర్వాతి కాలంలో ఈ ముఠాలు అటెన్షన్ డైవర్షన్స్గా పిలిచే దృష్టి మళ్లించి సొత్తు కాజేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. నాలుగేళ్ల క్రితం వరకు హైదరాబాద్పైనా వరుసపెట్టి పంజా విసిరారు. అటెన్షన్ డైవర్షన్ నేరాల గురించి తెలుసుకున్న ఇరాన్లోని వీరి బంధువులు టూరిస్ట్ వీసాపై వస్తున్నారు. విమాన టికెట్లు, ఇతర ఖర్చులు కలిపి రూ.1.5 లక్షలకు మించి కాకపోవడంతో అనేక ముఠాలు వచ్చి పంజా విసరడం మొదలెట్టాయి. ఒంటరిగా విజయవంతం కావడంతో ముఠా... ఇరాన్కు చెందిన బర్జిగరేసికా బెటేకల్మార్జీ అహ్మద్ కొన్నాళ్ల క్రితం విజిట్ వీసాపై వచ్చి అటెన్షన్ డైవర్షన్ నేరాలు చేసి వెళ్లాడు. మళ్లీ గత ఏడాది జూలైలో జెరేహ్దౌస్త్ కమ్రాన్, పహంఘే అలీ అతడి భార్య పహంగే మీనతో కలసి వచ్చాడు. తామంతా ఓ కుటుంబమని, విహారయాత్రకు వచ్చామంటూ చెప్పారు. ఢిల్లీలోని ఓ హోటల్లో బస చేసిన వీరు అక్కడ నుంచి ఓ వాహనాన్ని రోజుకు రూ.2,300 అద్దెకు తీసుకున్నారు. దీనిపై ఒక్కో మెట్రో నగరానికి వెళ్లి రాత్రి బస చేసేవారు. అదే పూట మనీ ట్రాన్స్ఫర్, మనీ ఎక్సే ్చంజ్ సంస్థలు ఎక్కడ ఉన్నాయో గుర్తించేవారు. మరుసటి రోజు ఆయా దుకాణాలకు సూటుబూటుతో వెళ్లి నిర్వాహకుల దృష్టి మళ్లించి క్యాష్ కౌంటర్లోని డబ్బు పట్టుకుని ఉడాయించేవారు. ఈ ముఠా అహ్మదాబాద్, షోలాపూర్, ముంబై, పుణేల్లో ఈ తరహా చోరీలు చేసింది. ఓ ప్రాంతంలో ఒక రోజు ఒక నేరం చేసి వెంటనే ఆ నగరాన్ని వదిలేస్తారు. మరో మెట్రో సిటీకి వెళ్లి తమ వద్ద ఉన్న డబ్బులో వీలైనంత హవాలా మార్గంలో తమ దేశానికి పంపించి కొంతే దగ్గర ఉంచుకుంటారు. ఎవరైనా తనిఖీలు చేసినా అనుమానం రాకుండా తమ వద్ద ఉన్న దాన్ని ఇరాన్ కరెన్సీగా మార్చేసుకుంటారు. పుణే మార్గంలో పట్టుకున్న టాస్క్ఫోర్స్... ఈ గ్యాంగ్ గత ఏడాది ఆగస్టు 27న హైదరాబాద్ వచ్చి ఆ మరునాడు మాదన్నపేటలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థలో నేరం చేసింది. యజమాని దృష్టి మళ్లించి రూ.2 లక్షలతో ఉడాయించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం చేసిన వెంటనే ఇరానీ ముఠా నగరం విడిచిపెట్టాల్సి ఉంది. అయితే కాలకృత్యాల కోసం పాతబస్తీలోని ఓ షాపునకు వెళ్లి అవకాశం చిక్కడంతో క్యాష్ కౌంటర్లోని డబ్బు కాజేసింది. మాదన్నపేట కేసును పర్యవేక్షిస్తున్న పోలీసులకు ఈ విషయం తెలిసి ఆ దుకాణం వద్దకు వెళ్లి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి దుండగులు వాడిన వాహనం నంబర్ గుర్తించారు. దాని యజమానిని సంప్రదించగా.. ఇరాన్ నుంచి వచ్చిన కుటుంబానికి అద్దెకు ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో సాంకేతికంగా కదలికలు గుర్తించిన టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులు పుణే మార్గంలో ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 3న అక్కడకు వెళ్లిన టీమ్ నలుగురిని పట్టుకోవడంతో కథ వెలుగులోకి వచ్చింది. ఎంబసీ సాయం తీసుకోవాలనే యోచన.. ఈ గ్యాంగ్ను విచారించగా ఆ పని తాము చేయలేదని, తమ మాదిరిగానే మరో రెండు ముఠాలు సంచరిస్తున్నాయని వెల్లడించారు. వీరు అరెస్టు అయినట్లు బయటకు వస్తే ఆ ముఠాలు అప్రమత్తం అవుతాయనే ఉద్దేశంతో విషయాన్ని గోప్యంగా ఉంచారు. మిగిలిన రెండు ముఠాల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు అవసరమైతే ఎంబసీ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అహ్మద్ గ్యాంగ్ను అరెస్టు చేసినట్లు ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చారు. వీసా వివరాలను తీసుకుని సమగ్రంగా అధ్యయనం చేస్తే ఇరాన్ నుంచి వచ్చిన ముఠాలెన్ని అనేది తెలుస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. ‘ఈ తరహా ముఠాలు చేస్తున్న నేరాల్లో అనేకం అనివార్య కారణాల నేపథ్యంలో పోలీసుల వరకు రావట్లేదు. ఆదాయపు పన్ను, జీఎస్టీ ఇలాంటి అనేక అంశాలతో వ్యాపారులు ఫిర్యాదులకు వెనుకాడుతున్నారు. ఫలితంగా కొన్నాళుగా ఈ ముఠాల ఆగడాలు హద్దూ్ద అదుçపూ లేకుండా సాగిపోతున్నాయ’ని ఆయన వివరించారు. -
చివరి దశలో ప్రచారం.. భారీగా పట్టుబడుతున్న నగదు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఇన్నాళ్లు మూటల్లో మూలిగిన డబ్బంతా బయటకు వస్తోంది. నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నేతలు సిద్దమయ్యారు. దానిలో భాగంగానే భారీగా నగదును తరలిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు వివిధ రూపాల్లో లభించిన మొత్తం రూ. 100 కోట్లు దాటింది. ప్రచారం చివరిదశ కావడంతో అక్రమ నగదును అడ్డుకునేందుకు అధికారులు ప్రత్యేక చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఒక్కరోజే ఆలేరులో 6 కోట్లు, పెంబర్తి చెక్పోస్ట్ వద్ద 5.80 కోట్లు, జూబ్లీహిల్స్లో 2 కోట్ల నగదును తనిఖీల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదే కాకుండా 9 కోట్లు విలువ చేసే మద్యం కూడా పట్టుబడింది. ఓటర్లను ఆకర్షించేందుకు కేవలం డబ్బు మాత్రమే కాకుండా నేతలు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. దానిలో భాగంగా మోబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికారాలు, చీరలు, చేతి వాచీలను నేతలు ఎరగా చూపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇదివరకే అధిక మొత్తంలో తనిఖీల్లో నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ.75 కోట్లు, ఐటీ అధికారులకు రూ. 25కోట్లు పట్టుబడింది. పోలింగ్కు మరో రెండు రోజుల గడవు మాత్రమే ఉండటంతో మరింత నగదు తరిలించే అవకాశం ఉందిని అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. -
‘మీ సేవ’లో మనీ ట్రాన్స్ఫర్ మోసం
మెదక్ మున్సిపాలిటీ: ‘మా తమ్ముడి కొడుకు ఆస్పత్రిలో ఉన్నాడని, అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని ఇచ్చిన డబ్బులు అకౌంట్లోకి రాలేదని అడిగితే’ మీ సేవ నిర్వాహకులు నానా దుర్భాషలాడుతున్నారని ఓ మహిళ మీ సేవ ముందు రోధించింది. ఈ సంఘటన బుధవారం మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వనం పద్మ, తమ్ముడి కొడుకు అనారోగ్యంతో ఉండటంతో నిజామాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే ఆమె ఆçస్పత్రి ఖర్చుల కోసం డబ్బులను పంపించేందుకు మార్చి 31న పట్టణంలోని జీకేఆర్ గార్డెన్ ప్రాంతంలో మీసేవ సెంటర్కు వెళ్లింది. రూ.10వేలు నిర్వాహకులకు అప్పగించి తన తమ్ముడి ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. దీంతో డబ్బులు తీసుకున్న నిర్వాహకులు డబ్బులు పంపించామని పద్మకు చెప్పి, అందుకు సంబంధించిన రషీదు కూడా ఇచ్చారు. అయితే ఏప్రిల్ 4వ తేదీ ఖాతాలోకి డబ్బులు రాలేదు. ఈ విషయమై బాధితురాలు బుధవారం మీసేవ నిర్వాహకులను ప్రశ్నించింది. నిర్వాహకులు మాత్రం ‘గోల చేయకు ఖాతాలోకి డబ్బులోస్తాయని వెళ్లిపోమ్మంటూ’ గద్దించారు. దీంతో ఆగ్రహించిన ‘డబ్బులు ఇచ్చి వారం రోజులవుతున్నా.. ఇప్పటికీ కూడా డబ్బులు రాలేదంటే’ గద్దిస్తారా? అంటూ నిలదీసింది. దీంతో మీ సేవ నిర్వాహకులు నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ మహిళ అని చూడకుండా దుర్భాషలాడరని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నా డబ్బులు నాకు ఇవ్వకుంటే ఇక్కడే పురుగుల మందు తాగి చచ్చిపోతానంటూ మీ సేవ ముందు బైఠాయించి రోధించింది. అయినప్పటికీ నిర్వాహకులు నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో అక్కడికిచేరుకున్న పోలీసులు బాధితురాలి ఆవేదన విని వెంటనే ఆమె డబ్బులు ఇవ్వాలని మీసేవ నిర్వాహకులను హెచ్చరించారు. అయినప్పటికీ వారు మాత్రం బ్యాంకులోకి సెలవులు ఉండటంతో డబ్బులు ట్రాన్స్ఫర్ కావడంలో ఆలస్యమైందని తెలిపారు. పోలీసుల సూచన మేరకు బాధితురాలికి డబ్బులు ఇస్తామని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో మీసేవ సెంటర్ల నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సెంటర్లకు వచ్చిన ప్రజలపై దురుసుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. -
పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్ ఇక వాట్సాప్ నుంచి..
పేమెంట్లు, మనీ ట్రాన్స్ఫర్లు ఇక వాట్సాప్ నుంచి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయట. భారత్ లో పెరుగుతున్న డిజిటల్ సర్వీసులకు వాట్సాప్ ఈ వినూత్న సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఫేస్బుక్ కు చెందిన వాట్సాప్ త్వరలోనే ఇండియాలో డిజిటల్ సర్వీసుల్లోకి రావడానికి సన్నద్ధమవుతున్నట్టు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ సర్వీసుల్లోకి భారతీయులు ఎక్కువగా మరలుతున్న క్రమంలో ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ లో ఎక్కువగా ఫేమస్ అయిన వాట్సాప్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. యూపీఐ వాడుతూ పేమెంట్ సిస్టమ్ తో ఇంటిగ్రేట్ అయ్యేలా కంపెనీ ప్రస్తుతం వర్క్ చేస్తుందని, ఈ చాట్ యాప్ ద్వారానే అన్ని పేమెంట్లు జరిగేలా ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుందని ది కెన్ రిపోర్టు చేసింది. ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) తెలిసిన టెక్నికల్, ఫైనాన్సియల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉద్యోగుల కోసం కంపెనీ గాలిస్తున్నట్టు వాట్సాప్ వెబ్ సైట్ కూడా ఓ ఉద్యోగ ప్రకటన ఇచ్చేసింది. వచ్చే ఆరు నెలల్లోనే ఈ సర్వీసులు ప్రారంభించబోతున్నారట. డిజిటల్ సర్వీసుల్లో దూసుకెళ్తున్న పేటీఎంకు చెక్ పెట్టి, వాట్సాప్ ఆ స్థానాన్ని కొట్టేయాలని యోచిస్తుందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతమున్న 20 కోట్ల యూజర్ బేస్ ను మరింత పెంచుకోనుందని రిపోర్టు వెల్లడించింది. ఇండియన్ యూజర్ల కోసం ఓ స్పెషల్ ఫీచర్ ను తీసుకురాబోతున్నట్టు వాట్సాప్ అంతకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
డబ్బులు డ్రా చేస్తానని చెప్పి.. బురిడీ!
హైదరాబాద్: ఏటీఎంలో డబ్బులు తీసేందుకు సాయం చేస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శాతవాహననగర్కు చెందిన మండ జయశంకర్ ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గతవారం ఓ రోజు రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న ఎస్బీహెచ్ ఏటీఎంలోకి డబ్బులు తీసుకునేందుకు వెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలో నుంచి డబ్బులు తీసేందుకు సహాయ పడతానని చెప్పి ఏటీఎం కార్డు తీసుకుని రూ.20,800లను తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఫోన్కు సమాచారం రావడంతో మోసపోయినట్లు గుర్తించిన జయశంకర్ ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్టెల్ బ్యాంకులో ఖాతా తెరవడం ఎలా..?
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన మొట్టమొదటి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకును గత వారం రాజస్థాన్లో ప్రారంభించింది. ప్రస్తుతం పదివేల ఎయిర్టెల్ అవుట్లెట్లలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. త్వరలో మరిన్ని రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ బ్యాంక్లో అకౌంట్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.. ఠ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. మీరు ఎయిర్టెల్ కస్టమర్ కానక్కరలేదు. మీ దగ్గర్లోని ఎయిర్టెల్ అవుట్లెట్లో ఆధార్ కార్డును సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే అకౌంట్ ఓపెన్ అవుతుంది. వెంటనే ఎయిర్టెల్ బ్యాంక్ మీకు ఏటీఎం, క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తుంది. వీటి ద్వారా నగదు డిపాజిట్ చేయడంతోపాటు విత్ డ్రా చేసుకోవచ్చు. 400 కి డయల్ చేయడం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రతి సేవింగ్ అకౌంట్పై రూ.లక్ష వరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుంది .పొదుపు ఖాతాల డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. -
గల్ఫ్కూ తాకిన నోట్ల రద్దు సెగ
-
గల్ఫ్కూ తాకిన నోట్ల రద్దు సెగ
విదేశాల నుంచి నిలిచిన ‘మనీ ట్రాన్సఫర్’ - ఇబ్బందుల్లో గల్ఫ్ కార్మిక కుటుంబాలు - అక్కడ డబ్బులున్నా.. ఇంటికి పంపలేని వైనం - రోజుకు రూ. 20 కోట్ల నుంచి 30 కోట్ల వ్యాపారం మోర్తాడ్: పెద్దనోట్ల రద్దు సెగ.. గల్ఫ్లోని మన కార్మికులకు తగులుతోంది. అక్కడ పని చేస్తున్న కార్మికులు వారు పొందిన వేతనాలను మనీ ట్రాన్సఫర్ కేంద్రాల ద్వారా స్వగ్రామాల్లోని తమ కుటుంబాలకు పంపిస్తారు. అయితే, మన దేశంలో రూ.500, రూ. 1000 నోట్లు రద్దు కావడం, బ్యాంకుల నుంచి పరిమితంగానే నగదును డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో మనీ ట్రాన్సఫర్ కేంద్రాల నిర్వహణ పూర్తిగా స్తంభించిపోరుుంది. మనీ ట్రాన్సఫర్ కేంద్రాలకు ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలు న్నా నగదు డ్రా చేయడంపై ప్రభుత్వం సీలింగ్ను విధించడం, కొత్తగా విడుదల చేసిన నోట్లు ఇవ్వడంలో జాప్యం జరగడం తో మనీ ట్రాన్సఫర్ కేంద్రాలు తమ లావాదే వీలను నిర్వహించలేక పోతున్నాయి. గల్ఫ్ దేశాలైన దుబాయ్, సౌదీ అరేబియా, ఖతర్, ఇరాక్, మస్కట్, కువైట్, అబుదాబీ తదితర దేశాల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో అనేక మంది తమ వేతనాలను ఎప్పటికప్పుడు ఇంటికి పంపిస్తుంటారు. గల్ఫ్ దేశాల నుంచి మనీ ట్రాన్సఫర్ కేంద్రాల ద్వారా రోజుకు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు లావాదేవీలు కొనసాగుతాయని అంచనా. గల్ఫ్లో మన దేశానికి సంబంధించిన బ్యాం కుల శాఖలు ఉన్నా కార్మికులు ఎక్కువగా మనీ ట్రాన్సఫర్ కేంద్రాలనే ఆశ్రరుుస్తు న్నారు. బ్యాంకు ఖాతాల్లో పంపే డబ్బును ఇక్కడివారు తీసుకోవడానికి కొంత సమ యం పడుతుంది. మనీ ట్రాన్సఫర్ కేంద్రాల ద్వారా పంపించే సొమ్మును క్షణాల్లో తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో అక్కడి వారంతా మనీ ట్రాన్సఫర్ కేంద్రాలనే ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో గల్ఫ్లోని కార్మికులు అక్కడ ఉన్న మనీ ట్రాన్సఫర్ కేంద్రాలలో సొమ్ము జమ చేస్తున్నా ఇక్కడ తమవారికి మాత్రం ఆ సొమ్ము అందే లేకుండా పోరుుందని ఆవేదన వ్యక్తమవుతోంది. గల్ఫ్ నుంచి తమవారు సొమ్ము పంపిస్తున్నా ఇక్కడ ఉన్న వారికి డబ్బులు పొందే అవకాశం లేక పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి కార్మికుల వద్ద ఇక్కడి కరెన్సీ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు ముందు జాగ్రత్త చర్యగా మన కరెన్సీని కొంత దాచుకుంటారు. సెలవు సమయంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సదరు సొమ్ము ఖర్చులకు ఉపయోగపడ తాయనే ఉద్దేశంతో ప్రతి కార్మికుడు మన కరెన్సీని తన దగ్గర కొంత దాచుకుంటాడు. ఒక్కో కార్మికుడి వద్ద రూ.వెరుు్య నుంచి రూ.5 వేల వరకు మన కరెన్సీ ఉంటుంది. అరుుతే, మన దేశంలో రూ.500, రూ.వెరుు్య నోట్లు రద్దు కావడంతో గల్ఫ్లో ఉన్న కార్మికులు అయోమయంలో పడ్డారు. గతంలో గల్ఫ్లో మన కరెన్సీని మార్చుకోవడానికి మనీ ట్రాన్సఫర్ కేంద్రాలు అనుమతి ఇచ్చేవి. ఇప్పుడు గల్ఫ్లోని మనీ ట్రాన్సఫర్ కేంద్రాలు మన కరెన్సీని తీసుకోవడం లేదు. గల్ఫ్ దేశాల్లో మన బ్యాంకులు ఉన్నా.. అవి గల్ఫ్ చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తారుు. విదేశాల్లో మన కరెన్సీతో వ్యాపారం చేయడం ఫెమా చట్టం ప్రకారం నేరం. అందువల్ల గల్ఫ్ దేశాల్లోని మన కార్మికుల వద్ద ఉన్న కరెన్సీ చెత్తబుట్టపాలు అవుతోంది. ఒక్కో కార్మికుని వద్ద రూ. వెరుు్య చొప్పున మన కరెన్సీ ఉంటే దాని విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుంది. ఈ కరెన్సీని ఎలాగైనా మార్చుకోవడానికి విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేయాలని గల్ఫ్లో ఉన్న కార్మికులు కోరుతున్నారు. మా కొడుకు డబ్బులు పంపించానని చెప్పాడు మా కొడుకు తెడ్డు సతీష్ మూడు నెలల కింద దోహఖతర్కు వెళ్లాడు. అక్కడ ఆఫీస్బాయ్గా పనిచేస్తున్నాడు. వారం రోజుల కింద ఫోన్ చేసి డబ్బులు పంపిస్తున్నానని చెప్పాడు. వెస్టర్న్మనీ సెంటర్కు వెళ్లాం, కోడ్ నంబర్ చెప్పా.. డబ్బులు మా పేరుమీద వచ్చారుు కానీ, ఇప్పుడు ఇవ్వడం కుదరదంటున్నారు. డబ్బులు ఎప్పుడు ఇస్తామో ఇప్పుడు చెప్పలేమన్నారు. - తెడ్డు రాజు, దశరథ్ మోర్తాడ్ చెక్ ఇస్తామంటున్నారు నేను బెహరాన్లో డ్రైవర్గా పని చేస్తున్నా.. నా భార్యకు ఆరోగ్యం బాగాలేక నెల రోజుల కింద ఇంటికి వచ్చాను. కంపెనీ వారు నాకు రూ.25 వేల జీతం డబ్బులు ఇవ్వాల్సి ఉంది. నేను ఇండియాకు వచ్చేటప్పుడు కంపెనీ మేనేజర్ లేకపోవడంతో నా స్నేహితుడిని జీతం తీసుకుని పంపమన్నాను. నా జీతం డబ్బులు నా స్నేహితునికి ఇచ్చారు. యూఏ ఈ ఎక్ఛ్సేంజ్కు పంపితే చెక్ ఇస్తామంటున్నారు. - రాకేష్, తొర్తి (బెహరాన్లో డ్రైవర్) జీతం పంపానని చెప్పాడు నా కొడుకు సారుుకుమార్ దుబాయ్లో పని చేస్తున్నా డు. ప్రతి నెలా 10న నా కొడుకు జీతం వస్తుంది. జీతం పైసలు ఎప్పటి లెక్కనే వెస్టర్న్మనీ సెంటర్లో పంపించాడు. వారు డబ్బులివ్వడంలేదు. బాకీలోల్లకు వడ్డీ కట్టాల్సి ఉంది. చిట్టీలు కట్టాల్సి ఉంది. వెస్టర్న్ మనీ సెంటర్లో ఎప్పుడైనా పది నిమిషాల్లో పైసలిచ్చేటోల్లు ఎప్పుడిత్తమో తెల్వదంటాండ్లు. - సాయమ్మ, మోర్తాడ్ డబ్బులు చేతికందక ఇబ్బంది నా కొడుకు సంజీవ్ ఖతర్లో పని చేస్తున్నాడు. ప్రతి నెలా 5వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య జీతం డబ్బులు పంపిస్తాడు. ఈసారి కూడా జీతం తీసుకున్నా.. బ్యాంకులల్ల పైసలు ఇస్తలేరనీ, మనీ ట్రాన్స్ఫర్ సెంటర్ వాళ్లుకూడా డబ్బులు ఇవ్వడం లేదని నా కొడుకు చెప్పిండు. మరి ఏం చేస్తం. కొన్నిరోజులైన తర్వాత డబ్బు పంపిస్తానని అతను ఫోన్ చేసిండు. కానీ, మాకు ఇబ్బందిగానే ఉంది. - లక్ష్మి, మోర్తాడ్ -
‘ఆరోగ్యలక్ష్మి’కి నగదు బదిలీ
► ఇకపై గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార నిధులు ► పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రం ఎంపిక ► పూర్తిస్థాయి వివరాలు పంపాలన్నకేంద్ర ప్రభుత్వం ► త్వరలో నివేదిక సమర్పించనున్నరాష్ట్ర యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో నగదు బదిలీ (డీబీటీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యమైన గర్భిణులు, బాలింతల పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసి.. దానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయాలన్నది తాజా నిర్ణయం. ఆరోగ్యలక్ష్మి పేరుతో రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలవుతుంది. అంగన్వాడీల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల్లో తొలి విడతగా దీన్ని నగదు బదిలీ కిందకు మార్చనుంది. ఇలా చేయడం వల్ల పౌష్టికాహార పంపిణీలో జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టడంతోపాటు అర్హులకు నేరుగా లబ్ధి కలగనుందని కేంద్రం నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యలక్ష్మి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను పంపాలని రాష్ట్రాన్ని కేంద్రం కోరింది. ఆ మేరకు త్వరలో పూర్తి వివరాలను నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 4,01,902 మంది గర్భిణులు, బాలింతలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అరోగ్యలక్ష్మి కింద ఒక్కో లబ్ధిదారుకు ప్రతిరోజు పప్పుతో కూడిన భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు, ఒక గుడ్డు అందిస్తారు. నిత్యం సంబంధిత అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి లబ్ధిదారులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఒక్కో లబ్ధిదారుపై ప్రతిపూట రూ.21 ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, ఏటా రూ.303.83 కోట్లు వెచ్చిస్తోంది. భారీగా అవకతవకలు ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు ఆ శాఖ విజిలెన్స్ విభాగం తనిఖీల్లో బహిర్గతమైంది. పలుచోట్ల లబ్ధిదారుల హాజరు, పౌష్టికాహార పంపిణీలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. వాస్తవంగా గర్భిణులు, బాలింతలు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి రావడాన్ని కష్టంగా భావిస్తున్నారు. చాలాచోట్ల దొడ్డు బియ్యంతో వండిన భోజనాన్ని నిరాకరిస్తున్నారు. వండిన పదార్థం కాకుండా ముడిసరుకు ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో సగానికిపైగా లబ్ధిదారులు ఈ కేంద్రాలకు రావడం లేదు. కాని అంగన్వాడీల్లో మాత్రం భారీ హాజరు శాతాన్ని చూపుతున్నారు. దీంతో సరుకులు దారి తప్పుతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇలాంటి అవకతవకలను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇలా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుండటంతో నగదు బదిలీ ప్రక్రియను అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. -
పీఎఫ్ ట్రాన్స్ఫర్ కోసం కొత్త నిబంధన
ముంబై : రిటైర్మెంట్ నిధి సంస్థ ఇపీఎఫ్ఓ పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని సులభతరం చేసింది. ఈ మేరకు నిబంధనలను మరింత సడలించింది. ఫారం నెం. 11 పేరుతో కొత్త డిక్లరేషన్ ఫాంను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న ఫారం నెం 13 స్థానంలో దీన్ని రీప్లేస్ చేసింది. కొత్త ఫారం నెం.11లో నో యువర్ కస్టమర్ (కేవైసీ) లో లాగానే వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. యూఏఎన్ నెంబర్ ఆధారంగా ద్వారా అతని / ఆమె పాత యజమాని లేదా, కంపెనీ నుంచి పీఎఫ్ బదిలీ కోసం అభ్యర్థన చేసుకోవచ్చని ఈపీఎఫ్వో ఒక ప్రకటనలో తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) లోని సభ్యులు ఉద్యోగం మారినపుడు తమ పీఎఫ్ డిపాజిట్లను బదిలీ చేసుకోవాలనుకునే వారికోసం ఈ నిబంధనలను సడలించినట్టు తెలిపింది. మరోవైపు రెండు లక్షల సాధారణ సేవా కేంద్రాల (సీఎస్సీ) ద్వారా పీఎఫ్ సెటిల్ మెంట్ కోసం వివిధ ఆన్లైన్ సౌకర్యాలను విస్తరించనున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా చందాదారులకు సుమారు7.84 కోట్ల యూఏఎన్ నెంబర్ల జారీకోసం ఐటి శాఖ ఈపీఎఫ్వోకు సహాయం చేయనుందనీ, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తికానుందని వివరించింది అలాగే ఇప్పటికే యూఏఎన్ కేటాయించిన, కేవైసీ డిజిటల్ వెరిఫికేషన్ పూర్తి చేసిన ఖాతాదారులు, ఈ కొత్త ఫారంను నింపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా ఇపిఎఫ్ఓ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 2.93 కోట్ల యూఏఎన్ నెంబర్లు యాక్టివేట్ అయ్యాయి దేశంలో పనిచేసే ఉద్యోగులందరికీ యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నంబరు లేదా సార్వత్రిక ఖాతా సంఖ్య) చాలా కీలకం. ఎందుకంటే ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ డబ్బు బదిలీకి (ట్రాన్స్ఫర్) యూఏఎన్ ఉపయోగపడుతోంది. అలాగే యూఏఎన్ నెంబరు తో ఆధార్ నెం. ను అనుసంధానం చేయడం ద్వారా మరింత సరళతరం చేసిన సంగతి తెలిసిందే. -
చిల్లర్ యాప్ తో చేయి కలిపిన ఆంధ్రాబ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫోన్బుక్లో ఉన్న నెంబర్కి ఎప్పుడైనా నగదు బదిలీ చేసుకునే సదుపాయాన్ని ఆంధ్రాబ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం మొబైల్ పేమెంట్ యాప్ చిల్లర్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఖాతాదారుని అకౌంట్తో చిల్లర్ యాప్ అనుసంధానింపబడి ఉంటుందని, దీంతో దేశంలో ఎక్కడికైనా తక్షణం నగదును పంపిచుకోవచ్చని ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్ ఎం.ఎన్.సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం ఇది పెలైట్ ప్రాజెక్టు కింద బ్యాంకు ఉద్యోగులపై పరీక్షిస్తున్నామని, త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. -
నగదు బదిలీకి వ్యతిరేకంగా రేషన్ డీలర్ల ధర్నా
రంగారెడ్డి: నిత్యావసర సరుకుల కొనుగోలుకుగాను లబ్ధిదారులకు నేరుగా ఖాతాల్లోకి నగదు బదిలీ చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల రేషన్ డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు డీలర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం రేషన్ కార్డుదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు తమిళనాడు రాష్ట్రంలోలాగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, డీలర్ల కుటుంబానికి ఇన్సురెన్స్, హెల్త్ కార్డులు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ షౌకత్ అలీకి వినతిపత్రం అందజేశారు. -
నగదు పంపాలంటే...ఫేస్బుక్ చాలు
-
15 నుంచి గ్యాస్కు నగదు బదిలీ
ఒంగోలు : గ్యాస్కు ఆధార్ లింకేజీని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయనుంది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో వివరాలను పొందుపరిచింది. 15వ తేదీ నుంచి డెలివరీ అయ్యే సిలిండర్లకు నగదు బదిలీ పథకం వర్తిస్తుందని శ్రీదేవి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కోటిరెడ్డి తెలిపారు. అయితే గతంలో గ్యాస్కు నగదు బదిలీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు తాజాగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, మిగిలిన వారు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. తమకు ఒక దరఖాస్తు అందజేయడంతోపాటు బ్యాంకుకు కూడా సంబంధిత సమాచారాన్ని తెలియజేస్తూ ఆధార్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఫేస్బుక్ ద్వారా మనీట్రాన్స్ఫర్ ఇలా..
ఆప్తులకు, స్నేహితులకు, ఇతర వ్యాపార లావాదేవీలు జరపడానికి బ్యాంక్కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారా?.. మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి సమయం మించిపోయిందా?.. మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి బ్రాంచి కోడ్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర విషయాలపై మీకు అవగాహన లేదా? అయితే ఇలాంటి సందర్భాల్లో నగదును సులభంగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఫేస్బుక్ దోహద పడుతుంది. ఇందుకు కొటక్ మహీంద్రా వారు అవకాశం కల్పిస్తున్నారు. - గాజులరామారం రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా.... ►ఇందుకు మీరు https://www.kaypay.com ►వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాలి. ►ఇక్కడ మీకు లాగిన్ విత్ ఫేస్బుక్ ఆప్షన్ వస్తుంది. ►మీరు ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ కావాలి. ►మీ బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవడానికి ►కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ►మీ బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసుకోవాలి. ►ఇక్కడ అకౌంట్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నంబరుతోపాటు ఎంఎంఐడీ నెంబరు ఇవ్వాలి. ►ఇందుకు మీరు ఐడీని ఎస్ఎంఎస్ ద్వారా పొందాల్సి ఉంటుంది. నగదు ట్రాన్స్ఫర్ చేయండి ఇలా... ►మీ రిజిస్ట్రేషన్ అయిన తరువాత మీ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న మిత్రులకు మీరు నగదు ►బదిలీ చేసుకునే అవకాశం కలుగుతుంది. ►మీరు నగదు పంపాల్సిన వ్యక్తిని ఎంచుకుని ►అతని అకౌంట్ నంబరును ఎంటర్చేయాలి. ►మీరు ఏదైనా సమాచారం ఇవ్వాలనుకున్నా ఇక్కడ పొందుపరచవచ్చు. ►ఇక మీరు ఒన్ టైమ్ పాస్వర్డ్ను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ►ఇందుకు మీరు బ్యాంక్ను సెలక్ట్ చేసుకోగానే ఓటీపీ కోసం ► ఎస్ఎంఎస్ చేసే విధానాన్ని చూపిస్తుంది. ►దాన్ని అనుసరించి మీరు ఓటీపీ రూపొందించుకోవాలి. ►మీ మొబైల్కు వచ్చిన పాస్వర్డ్ను మీరు ఎంటర్ చేస్తే నగదు బదిలీ అవుతుంది. ►మీరు నగదు పంపే వ్యక్తి కేపేలో రిజిస్టర్ లేకపోతే అతని ఫేస్బుక్ ►అకౌంట్కు సమాచారం వెళ్తుంది. ►సంబంధిత వ్యక్తి 48 గంటల్లో kaypayలో రిజిస్టర్ అవ్వాలి. ►ఒక వేళ కాని పక్షంలో తిరిగి మీ డబ్బులు మీ అకౌంట్కు చేరుతాయి. సూచనలు... ►ప్రస్తుతానికి ఈ సదుపాయం కేవలం 28 బ్యాంకులకు మాత్రమే ఉంది. ►ఇది 24 గంటలూ పని చేస్తోంది. ►నగదు పంపేవారు రోజుకు రూ. 2,500, నెలకు రూ.25 వేల వరకు మాత్రమే నగదును బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ►ఈ విధానం ద్వారా నెల మొత్తంలో ఎప్పుడైనా రూ.25 వేలు అందుకోవచ్చు. ►24 గంటల్లో మీ నగదు బదిలీ పూర్తి అవుతుంది. ►మీ పేరు కాని, మీరు బదిలీ చేయాలనుకునే వారి పేరు కానీ, బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్రాంచ్ కోడ్ కాని అందించాల్సిన అవసరం లేదు. ►టువే సెక్యూర్డ్ పాస్వర్డ్ సిస్టమ్ ఉండడం వల్ల సేఫ్. ►అన్ని లావాదేవీలు కొటక్ మహీంద్రా సర్వర్ నుంచే ఆపరేట్ అవుతాయి. ఉదాహరణకు.. ►మీది ఎస్బీఐ అకౌంట్ అయితే MMID SBI అని టైప్ చేసి 9223440000కు మెసేజ్ చేయాలి. ►బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో మీరు ఏ నంబర్ను రిజిస్టర్ చేసుకున్నారో దాని నుంచే మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ►mmid పొందాలంటే మీ ఫోన్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్కు లింక్ అప్ అయి ఉండాలి. ►ఎంఎంఐడీ కోసం ప్రతి బ్యాంక్కు మెసేజ్ చేయాల్సిన నంబర్ ఉంటుంది. సంబంధిత నంబర్ బ్యాంక్ పేరు ఎంచుకోగానే మీకు కనిపిస్తుంది. ►ఇప్పుడు మీ మొబైల్కు ఏడు అంకెలు గల mmid (mobile money identifier)-వస్తుంది. ►దీన్ని ఎంటర్ చేశాక తరువాత సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ను ►సెలక్ట్ చేసుకుని ఎంటర్ చేయాలి. ► ఇక మీ అకౌంట్ రిజిష్ట్రర్ అయిపోయినట్లే. -
వంటకు తంటా
నగదు బదిలీ.. ఈ పేరు చెబితేనే సగటు లబ్ధిదారుల్లో గుబులు పుడుతోంది. వచ్చేనెల పదో తేదీ నుంచి వంట గ్యాస్కు నగదు బదిలీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్న కేంద్రం నిర్ణయంపై సగటు వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. గతంలో ఎదురైన చేదు అనుభవాలే ఇందుకు కారణం కాగా.. అందరూ ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏలూరు: యూపీఏ సర్కార్ హయాంలో 2012 అక్టోబర్ నుంచి జిల్లాలో నగదు బదిలీ అమలు ప్రారంభమైంది. తీవ్ర ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆధార్ సీడింగ్ లేకపోవడంతో పేద వర్గాల వారు సైతం సబ్సిడీ లేకుండా రూ.800 నగదును చెల్లించి గ్యాస్ బండ భారాన్ని మోశారు. చివరకు ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నగదు బదిలీని కేంద్రం నిలిపివేసింది. తాజాగా మళ్లీ అమలు చేయాలని నిర్ణయించడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లావ్యాప్తంగా కనెక్షన్లు జిల్లా 56 గ్యాస్ ఏజెన్సీల పరిధిల్లో 8,05,042 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్లు 3,79,222, డబుల్ 2,78,948, దీపం కనెక్షన్లు 1,45,914 మందికి ఉన్నాయి. ఇందులో అప్పట్లో 90 శాతం ఆధార్ సీడింగ్ ఉన్నవారికే నగదు బదిలీని అమలు చేశారు. ఇప్పుడు ఆధార్ సీడింగ్ను 96 శాతంకు పెంచామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. లోపాలెన్నో! నగదు బదిలీ పథకంలో సబ్సిడీ సొమ్ము వినియోగదారులకు సక్రమంగా జమకాకపోవడంతో తీవ్ర ఇక్కట్లపాలైన సంఘటనలతో ఈ విధానాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకుల పరంగా కూడా సబ్సిడీ సొమ్ము జమలో రూ.50ల వరకు వినియోగదారుడికి కోత పడేది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్న వ్యక్తి ఖాతాకు 15 రోజుల తర్వాత కూడా సబ్సిడీ సొమ్ము జమ అయిన సందర్భాలు లేవు. గ్యాస్ సిలిండర్ ధర రూ.405 అయితే.. దీనికి అదనంగా రూ. 435 కలిపి కలిపి రూ.840 వరకు చెల్లించాల్సి వచ్చేది. చేతిలో డబ్బులు లేకపోయినా.. సిలిండరు తప్పనిసరికావడంతో ముందుగా అప్పుచేసి విడిపించుకున్నా.. సకాలంలో నగదు బదిలీ కాకపోవడంతో ప్రతినెలా ఇబ్బందులు తప్పేవి కావు. తప్పనిసరి అయితే ప్రత్యేక సెల్ అవసరం ఈ పథకం అమలు తప్పనిసరైతే లోపాలను సవరించుకునే దిశగా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిలిండర్ ధర చెల్లించిన ఒకటి రోజుల్లోనే వినియోగదారుని ఖాతాకు సొమ్ము జమ అయ్యేలా చూడాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ సెల్ ఏర్పాటు చేస్తేనే పథకం సజావుగా సాగే వీలుంది. అమలుకు సిద్ధం (అభిప్రాయం) జిల్లాలో నవంబర్ 10 నుంచి వంటగ్యాస్కు నగదు బదిలీ అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై త్వరలోనే గ్యాస్ ఏజెన్సీలతో చర్చించి వారిని సమాయత్తం చేస్తాం. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా లేకపోయినా కొంత కాలం పాత పద్ధతిలోనే చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. వంట గ్యాస్ సబ్సిడీ ఎంతనేది త్వరలోనే నిర్ణయం అవుతుంది. -శివశంకర్రెడ్డి, డీఎస్వో -
వంట గ్యాస్ పై నగదు బదిలీకి ఆమోద ముద్ర
-
వంట గ్యాస్ పై నగదు బదిలీకి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: గతంలో వంట గ్యాస్ పై యూపీఏ ప్రభుత్వ చేపట్టిన నగదు బదిలీకి పథకం మరోసారి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోద ముద్ర వేసింది. ఈ నగదు బదిలీ పథకం నవంబర్ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. గ్యాస్ ధరపై కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్న కేంద్ర కేబినెట్ ఈ రోజు సమావేశమైంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి గ్యాస్ ధరపై పునఃసమీక్ష నిర్వహిస్తామని కేంద్ర కేబినెట్ తెలిపింది. ప్రతీ ఏటా ఏప్రిల్ 1 వ తేదీన, అక్టోబర్ 1 వ తేదీన గ్యాస్ ధరపై సమీక్ష చేపట్టనుంది. యూనిట్ ధరను 5.61 యూఎస్ డాలర్ గా నిర్దారిస్తూ నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ కు పూర్తి స్థాయిలో నగదు బదిలీకి పథకాన్ని అమలు చేస్తామని.. దీంతో వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీని వర్తింపజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. యూపీఏ అమలు చేసిన పథకాన్నిఎత్తివేసిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ ఆధార్ అనుసంధానంతో గ్యాస్ సబ్సిడీని పొందిన వంట గ్యాస్ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. అయితే తాజాగా అదే పథకాన్ని తెరపైకి తీసుకురావడంతో ఆధార్ ను బ్యాంక్ ల్లో అనుసంధానం చేసుకోవాల్సిన పరిస్థితి. దేశంలో అధిక సంఖ్యలో ఆధార్ నమోదు చేసుకున్నా.. ఇంకా చాలా మందికి ఆధార్ నంబర్ లభించలేదు. ఈ పథకంతో పూర్తి స్థాయి లబ్ధి చేకూరాలంటే మాత్రం వినియోగదారులకు ఆధార్ తిప్పలు తప్పకపోవచ్చు. అయితే త్వరలో అమల్లోకి రానున్న నగదు బదిలీ పథకాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తామని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. -
ఇక ట్విట్టర్ ద్వారానూ నగదు బదిలీ
డబ్బులు ఒకచోటు నుంచి మరో చోటికి పంపడం ఇప్పుడు చాలా రకాలుగా సులభం అవుతోంది. ఇప్పుడు ఇందుకు మరో సాధనం లభించింది. ట్విట్టర్ ద్వారా డబ్బులు పంపేందుకు త్వరలోనే వీలు కుదరబోతోంది. ఇందుకోసం ఫ్రాన్స్లోని ఓ పెద్ద బ్యాంకు ఈ మైక్రో బ్లాగింగ్ సైట్తో జత కలుస్తోంది. ఇది పూర్తయితే.. ఇక ట్వీట్స్ ద్వారా కూడా డబ్బులు పంపుకోవచ్చు. బీపీసీఈ అనే ఈ బ్యాంకు ఫ్రాన్సులోనే రెండో అతి పెద్దది. కేవలం ప్రకటనల ద్వారా మాత్రమే కాక.. మిగిలిన మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించాలన్న ట్విట్టర్ ఆలోచనలకు ఈ బ్యాంకు మార్గం చూపించింది. మొబైల్ ఫోన్లు, యాప్ ద్వారా డబ్బు పంపే విధానంలో ఫేస్బుక్ లాంటి దిగ్గజాలతో ట్విట్టర్ పోటీపడుతోంది. దీంతో కొన్ని దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తున్న బ్యాంకులు ఇప్పుడు జనం లేక ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి వచ్చినా రావచ్చని అంటున్నారు. ఇక ఫ్రెంచి పౌరులు కొత్త పద్ధతిలో డబ్బు పంపుకోవచ్చని బ్యాంకు అధికారులు తెలిపారు. ఇక వాళ్లకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా కూడా.. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా వివరాలు లేకపోయినా కూడా.. అవతలి వాళ్ల ట్విట్టర్ అకౌంట్ వివరాలుంటే చాలని, సింపుల్గా ఓ ట్వీట్ ద్వారానే డబ్బు పంపొచ్చని చెప్పారు. -
ఫేస్బుక్ అకౌంట్ నుంచి కూడా నగదు బదిలీ!
హైదరాబాద్: ఫేస్బుక్ ఖాతాదారులకు శుభవార్త. ఫేస్బుక్ అకౌంట్ నుంచి నగదు బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొత్త మొబైల్ సోషల్ వాలెట్ హాట్ రెమిట్ అందుబాటులోకి రానుంది. డిజిట్ సెక్యూర్ సంస్థ ఈ కొత్త సోషల్ వాలెట్ను ప్రారంభించింది. హాట్రెమిట్ ఈ-వాలెట్ సర్వీస్ ద్వారా ఫేస్బుక్ ఖాతాదారులు నగదు బదిలీ చేసుకోవచ్చునని డిజిట్ సెక్యూర్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ ఈ రోజు ఇక్కడ చెప్పారు. ** -
ప్రహసనంగా గ్యాస్కు నగదు బదిలీ పధకం
-
ప్రహసనంగా మారిన గ్యాస్ నగదు బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని హుమాయూన్నగర్కు చెందిన ఎం.ఎ.రవూఫ్కు మాసబ్ ట్యాంకులోని జి.ఎన్.ఎస్. ఏజెన్సీలో గ్యాస్ కనెక్షన్ ఉంది. మొదటిసారి ఆయన బ్యాంకు ఖాతాలో వంట గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ కింద అడ్వాన్సుగా రూ.420 పడింది. కానీ తర్వాత మూడు సిలిండర్లు తీసుకున్నా సబ్సిడీ మాత్రం ఆయన ఖాతాలో ఒక్కసారి కూడా జమ కాలేదు. ఈ విషయమై ఎవరిని సంప్రదించాలో తెలియక ఆయన ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్లోనే చింతల్బస్తీకి చెందిన కె.నరసింహులుకు విజయనగర్ కాలనీలోని గ్యాస్ ఏజెన్సీలో కనెక్షన్ (679479) ఉంది. తన ఆంధ్రాబ్యాంకు ఖాతాను గ్యాస్కు అనుసంధానం చేసుకున్నారు. మొదటిసారి ఆయనకు సబ్సిడీ కింద రూ.420.67 ఆంధ్రా బ్యాంకులో జమయింది. కానీ గ్యాస్ కంపెనీ వెబ్సైట్లో మాత్రం ఆయనకు ఖాతాయే లేని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో జమయినట్టుగా ఉంది. పైగా ఎస్బీఐలోని ఏ శాఖలో పడిందో కూడా తెలియడం లేదు. హైదరాబాద్ సీతారాంబాగ్కు చెందిన కె.బాబూలాల్కు విజయనగర్ కాలనీలోని స్వామి ఎంటర్ప్రైజెస్లో వంట గ్యాస్ కనెక్షన్ ఉంది. ఎస్బీఐ ఖాతాతో ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. కానీ వంట గ్యాస్ సబ్సిడీ ఆయనకు ఖాతాయే లేని ఐసీఐసీఐ బ్యాంకులో జమయినట్టు గ్యాస్ కంపెనీ వెబ్సైట్లో ఉంది. అది కూడా ఏ శాఖలోనన్న వివరాలు లేవు. ఇవి కేవలం వీరి సమస్యలు మాత్రమే కాదు. ఇలా నగదు బదిలీ పథకంలో లోపాల వల్ల 12 జిల్లాల్లోని అనేక మంది వంట గ్యాస్ వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. జూన్ 1 నుంచి తొలి దశలో నగదు బదిలీ ప్రారంభించిన హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో.. ప్రత్యేకించి జంట నగరాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ‘సబ్సిడీ జమ కాలేదంటూ చాలామంది వినియోగదారులు మా వద్దకు వచ్చి బాధ పడుతున్నారు. మేం వారి నంబరును గ్యాస్ కంపెనీల వెబ్సైట్లో చూసి ఏ బ్యాంకులో జమయిందో మాత్రమే చెబుతున్నాం. వెబ్సైట్లో అది మాత్రమే కనిపిస్తోంది తప్ప ఏ శాఖ అనే సమాచారం ఉండటం లేదు. దాంతో వినియోగదారులు బ్యాంకు శాఖల చుట్టూ తిరుగుతున్నారు. నగదు బదిలీ పథకంలో ఇది ప్రధాన లోపంగా మారింది’ అని హైదరాబాద్లోని మాసబ్ట్యాంకు, విజయనగర్ కాలనీ, బోరబండ ప్రాంతాలకు చెందిన గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు ‘సాక్షి’కి తెలిపారు. పథకం రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ సమస్యలకు కారణమని ఆంధ్రా బ్యాంకు సీనియర్ మేనేజర్ ఒకరన్నారు. ఎన్నెన్ని బాధలో...! నగదు బదిలీ పథకంలో లోపాల వల్ల ఒక్కో వినియోగదారుడు ఒక్కో రకమైన సమస్య ఎదుర్కొంటున్నాడు. ఆధార్ నమోదు చేసుకుని ఆ సంఖ్యను గ్యాస్ కనెక్షన్కు, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకున్నా కొందరికి సబ్సిడీ రావడంలేదు. మరికొందరికి సిలిండర్ తీసుకోకముందే అడ్వాన్స్ రూపంలో సబ్సిడీ పడింది. తర్వాత మాత్రం మూడు సిలిండర్లు తీసుకున్నా ఒక్కసారీ సబ్సిడీ జమ కాలేదు. ఒక బ్యాంకులో ఖాతా తెరిచి ఆధార్తో దాన్ని అనుసంధానం చేసుకున్న కొందరికి మొదటిసారి ఆ బ్యాంకులోనూ, తర్వాత మరో బ్యాంకులోనూ సబ్సిడీ జమయినట్టు గ్యాస్ కంపెనీల వెబ్సైట్లో కనిపిస్తోంది. కొందరి పేరుతో సబ్సిడీ జమయిన తర్వాత వారం రోజుల్లోనే అది వెనక్కు వెళ్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందో, సమస్య పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక వినియోగదారులు తలపట్టుకుంటున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి సరైన వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వారి పాలిట శాపంగా మారింది. భారం బదిలీ... పై సమస్యలకు తోడు నగదు బదిలీ పరిధిలోకి వచ్చిన వినియోగదారులకు ఒక్కో సిలిండర్పై రూ.53 అదనపు భారం కూడా పడుతోంది. వారికి సిలిండర్ రూ.466.2కు వస్తుంటే బదిలీ పథకాన్ని అమలు చేయని జిల్లాల్లోని వినియోగదారులకు మాత్రం రూ.412.5 మాత్రమే ఉంటోంది. దాంతో డీబీటీ కాస్తా ప్రజల పాలిట డెరైక్ట్ బర్డెన్ ట్రాన్స్ఫర్ (భారం బదిలీ) పథకంలా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అదనపు భారం పడటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రం వంట గ్యాస్ ధరను రూ.50 పెంచగా, ప్రజలపై అదనపు భారం పడనీయొద్దనే లక్ష్యంతో దాన్ని సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆయన నిర్ణయించారు. తర్వాత రోశయ్య హయాంలో ఈ సబ్సిడీని రూ.25కు తగ్గించారు. ఇప్పుడు నగదు బదిలీ పథకం ముసుగులో రూ.50 సబ్సిడీని రద్దు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బ తీసింది. దాంతో వినియోగదారులపై సిలిండర్కు మరో రూ.25 అదనపు భారం పడింది. త్వరలో బ్యాంకర్లతో భేటీ: ఎల్డీఎం భరత్కుమార్ నగదు బదిలీకి సంబంధించి బ్యాంకులపరంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాలుగైదు రోజుల్లో అన్ని బ్యాంకుల అధికారులతో భేటీ అవుతామని హైదరాబాద్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ (ఎల్డీఎం) భరత్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులు సహకరించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. -
గ్యాస్కు నగదు బదిలీ
శ్రీకాకుళం, న్యూస్లైన్: వంట గ్యాస్కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే నగదు బదిలీ పథకం ఆదివారం నుంచి జిల్లాలో అమలు కానుంది. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రెండో దశలో శ్రీకాకుళం జిల్లాను చేర్చడంతో సెప్టెంబర్ ఒకటో తేదీ(ఆదివారం) నుంచి జిల్లాలోని వంట గ్యాస్ వినియోగదారులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కలెక్టర్ సౌరభ్ గౌర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్యాస్ నెంబర్, ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వారికే ఈ పథకం కింద గ్యాస్ సబ్సిడీ లభిస్తుందన్నారు. అయితే ఇప్పటివరకు ఆధార్ నెంబర్ను నమోదు చేసుకోని వారికి మూడు నెలల సమయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతవరకు వీరికి ఇప్పటిలాగే సబ్సిడీ ధరకే గ్యాస్ సిలెండర్ సరఫరా చేస్తారన్నారు. జిల్లాలో 2.90 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 1.78 లక్షల మంది వినియోగదారులే గ్యాస్ డీలర్ల వద్ద ఆధార్ నమోదు చేసుకున్నారని చెప్పారు. అదే సమయంలో బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వారి సంఖ్య 53 వేలు మాత్రమే వివరించారు. బ్యాంకు ఖాతాలు, గ్యాస్ ఏజెన్సీల్లో ఆధార్ పూర్తిస్థాయిలో నమో దు చేయించుకున్న వారికి గ్యాస్ సిలెండర్పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఇక నుంచి నేరుగా వారి ఖాతాలోకి జమ అవుతుందని, సిలెండర్ను మాత్రం పూర్తిసొమ్ము చెల్లిం చి కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నమోదుకు మూడు నెలల గడువు ఇప్పటి వరకు డీలర్ల వద్ద, బ్యాంకుల వద్ద నమోదు చేసుకోని గ్యాస్ వినియోగదారులు నవంబరు 30లోగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్ చెప్పారు. ఈ అవకాాశాన్ని గ్యాస్ వినియోగదారులు సద్వినియోగం చేసుకొని వెంటనే డీలర్ల వద్ద, బ్యాంకుల వద్ద నమోదు చేయించుకొని రాయితీ పొందాలని సూచించారు. అంతకు ముందు హెచ్పీసీఎల్ సేల్స్ మేనేజర్ సునీల్కుమార్, హెచ్పీ గ్యాస్ డీలర్లు శ్రీనివాసరావు, డి. రవీంద్ర జిల్లా కలెక్టర్ను కలసి ఎల్పీజీ వినియోగదారులకు సెప్టెంబరు 1 నుంచి వర్తిం చే నగదు బదిలీ పథకం గురించి వివరించారు. విశ్రాంత పోలీసులకు సన్మానం శ్రీకాకుళం, న్యూస్లైన్: జిల్లాలో సాయుధ దళంలో పనిచేసి శనివారం పదవీ విరమణ చేసి న ఏఆర్హెచ్సీలు ఆర్.కృష్ణ మూర్తి, వై.చల పతిరావు, ఎన్. తవిటినాయుడులను ఎస్పీ నవీన్గులాఠీ పుష్పగుచ్ఛం, దుశ్శాలువలతో సన్మానించారు. విశ్రాంత జీవితం ఆనంద దాయకంగా సాగాలని ఆకాంక్షించారు. కార్య క్రమంలో ఏఎస్పీ సింథల్ కుమార్, ఏఆర్ ఆర్ ఐ ప్రసాదరావు, డీసీఆర్బీసీఐ సీహెచ్జీవీ ప్రసాద్, ఎస్బీసీఐ సతీష్కుమార్ పాల్గొన్నారు.