Neena Gupta
-
Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు
మహా కుంభమేళా 2025 (Maha KumbhMela2025) ఉత్తర ప్రదేశ్లోని మహాకుంభమేళా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశ,విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాల ఆచరిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు రాజకీయ నాయకులు, క్రీడా, సినీరంగ ప్రముఖులు కూడా కుటుంబ సమేతంగా ప్రయాగరాజ్కు తరలి వెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర రాజకీయ నాయకులు కూడా పవిత్ర స్నానం ఆచరించారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెఖావత్ , అర్జున్ రామ్ మేఘ్వాల్ వంటి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇంకా నటి హేమా మాలిని, అనుపమ్ ఖేర్, భాగ్యశ్రీ, మిలింద్ సోమన్ వంటి నటులు, కవి కుమార్ విశ్వాస్, క్రికెటర్ సురేష్ రైనా, రెజ్లర్ ది గ్రేట్ ఖలీతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కోవలో ఇపుడు బాలీవుడ్ నటి నీనా గుప్తా (Neena Gupta) చేరారు.బాలీవుడ్ స్టార్స్ నీనా గుప్తా , సంజయ్ మిశ్రా మహా కుంభమేళాను సందర్శించి సంగంలో పవిత్ర స్నానం చేశారు. 2022 చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న వారి ప్రాజెక్ట్ వాధ్ 2 కోసం ఇద్దరూ ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. ఈ సందర్బంగా నీనా గుప్తా తన అనుభవాన్ని పంచుకున్నారు. తొలి సారి కుంభమేళాను సందర్శించాననీ, తనకు ఇంత తన జీవితంలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైన అనుభవాన్నిచ్చిందని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల ఇప్పటికి నెరవేరిందనీ, ఇది "విశిష్ట అనుభవం" అని అభివర్ణించారు."నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం... చివరకు, ఈ రోజు పుణ్య కుంభ స్నానం చేసాను" అని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వం ఇంత బాగా నిర్వహించడం కూడా తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది.#WATCH | Prayagraj, UP | At #MahaKumbhMela2025, actor Neena Gupta says, "I have been wanting to come here for years... It was a unique experience... Finally, I took a dip today... The atmosphere here is crazy. I have never seen a bigger gathering in my life... I am impressed by… pic.twitter.com/kLHwVCbAL9— ANI (@ANI) February 7, 2025మరోవైపు చక్కటి వ్యవస్థీకృత ఏర్పాట్లు, భద్రత, పారిశుధ్యం. సౌకర్యాలు అన్నీ చాలా బావున్నాయి అంటూ నటుడు సంజయ్ మిశ్రా ప్రశంసించారు. రద్దీ తక్కువగా ఉంటుంది అనుకున్నాను..కానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉందంటూ తన అనుభవాన్ని పంచు కున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద జరిగే మహా కుంభమేళా అత్యంత ముఖ్యమైందిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ్2025 ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ విశిష్ట కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ముగియనున్న కారణంగా భక్తులసంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనాకాగా ఇటీవల పంచావత్ సిరీస్తో నటిగాతానేంటో నిరూపించుకున్ననటి నీనా గుప్తా. తనదైన నటనతో అనేక సినిమాల్లో ఆకట్టుకుంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ద్వారా కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఒంటరిగానే ఆమెను పెంచి పెద్దదాన్ని చేసింది. ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్న మసాబా రెండో పెళ్లి చేసుకుని ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. -
స్నేహితుడు పోయిన దుఃఖంలో నటుడు.. 'ఆ వెధవ ఆత్మకు శాంతి దొరక్కూడదు'
ప్రముఖ నిర్మాత ప్రతీశ్ నంది (73) బుధవారం కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాలు నిర్మించిన ఈయన ఒకప్పుడు ప్రముఖ జర్నలిస్టు కూడా! ప్రతీశ్ మరణం పట్ల ఆయన స్నేహితుడు, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.స్నేహితుడి మరణం బాధాకరంనా ప్రియమైన మిత్రుడు ప్రితీశ్ (Pritish Nandy) మరణవార్త నన్నెంతగానో కలిచివేసింది. అద్భుతమైన కవి, రచయిత, నిర్మాత.. అలాగే ధైర్యవంతుడైన జర్నలిస్ట్ కూడా! ముంబైలో అడుగుపెట్టిన కొత్తలో నాకెంతో సపోర్ట్గా నిలబడ్డాడు. మేము ఎన్నో విషయాలను పంచుకునేవాళ్లం. దేనికీ జంకకుండా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. తన దగ్గరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. మిస్ అవుతున్నా..ఒకప్పుడు తను, నేను వేరు కాదు అన్నట్లుగా ఉండేవాళ్లం. కానీ రానురానూ కలుసుకోవడమే తగ్గిపోయింది. మనం కలిసున్న రోజుల్ని మిస్ అవుతున్నా.. నిన్ను కూడా ఎంతో మిస్ అవుతున్నా ఫ్రెండ్.. ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ గుండె ముక్కలైన ఎమోజీతో ఈ పోస్ట్ను షేర్ చేశాడు. అనుపమ్ ఖేర్ (Anupam Kher).. ప్రతీశ్ను అంతలా పొగడం నటి నీనా గుప్తాకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. (చదవండి: నేను చేసిన పెద్ద తప్పు అదే!: కంగనా రనౌత్)బుద్ధి తక్కువ వెధవనా విషయంలో అతడేం చేశాడో తెలుసా? తను చేసిన పనికి ఆగ్రహం పట్టలేక అందరిముందే అతడిని బుద్ధి తక్కువ వెధవ అని తిట్టాను. నా బిడ్డ బర్త్ సర్టిఫికెట్ దొంగిలించి దాన్ని మీడియాలో పబ్లిష్ చేశాడు. ఇందుకు సంబంధించిన సాక్ష్యం ఇప్పటికీ నా దగ్గరుంది. అందుకే అతడి ఆత్మకు శాంతి దొరకాలని నేను కోరుకోను అని కామెంట్ చేసింది. అయితే తర్వాత ఆ కామెంట్ను నీనా (Neena Gupta) డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.ఆమె అనుమతి లేకుండా దొంగిలించి మరీ..ఇకపోతే ప్రితీశ్ నంది జర్నలిస్టుగా ఉన్న సమయంలో నీనా గుప్తా కూతురు మసాబా బర్త్ సర్టిఫికెట్ దొంగిలించి సమాచారం లీక్ చేశాడు. దీని ఆధారంగా నీనా- క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ సంతానమే మసాబా అని జనాలకు తెలిసిపోయింది. పెళ్లితో సంబంధం లేకుండా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడే మసాబాకు పేరెంట్స్ అయ్యారని విస్తృతమైన చర్చ జరిగింది.ప్రితీశ్ నంది విషయానికి వస్తే..కుచ్ కట్టి కుచ్ మీఠి, బాలీవుడ్ కాలింగ్, ముంబై మ్యాట్నీ, చమేలి, జస్ట్ మ్యారీడ్, ధీమె ధీమె, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, అగ్లీ ఔర్ పాగ్లీ, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలను ప్రితీశ్ నిర్మించారు. జర్నలిస్టుగానూ పలు సంస్థల్లో పని చేశారు. 1977లో పద్మశ్రీ, 2008లో కర్మవీర్ పురస్కార్, 2012లో ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ అవార్డులు అందుకున్నారు. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) చదవండి: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు! -
ఈ వయసులో షార్ట్స్ ఎందుకు?.. సీనియర్ నటి అదిరిపోయే సమాధానం!
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేరు అందరికీ పరిచయమే. గతేడాది లస్ట్ స్టోరీస్-2తో అలరించిన నీనా.. తాజాగా ఓ వెబ్ సిరీస్లో కనిపించింది. మలయాళంలో తెరకెక్కించిన 1000 బేబీస్ సిరిస్లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఇటీవల ఆమె టాక్ షోలో పాల్గొన్నారు. కరీనా కపూర్ ఖాన్ చాట్ షో రాబోయే ఎపిసోడ్లో కనిపించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఈ వయసులో మీరు ఎందుకు షార్ట్స్ వేసుకుంటారని చాలామంది అడుగుతున్నారని కరీనా ప్రశ్నించింది. దీనికి నీనా గుప్తా స్పందిస్తూ.. మీ నాన్న డబ్బులతో అయితే వేసుకోవడం లేదు కదా? అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. కాగా.. నీనా గుప్తా ఇటీవలే ఉంచాయి మూవీలో తన నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. -
నో బ్యూటీ పార్లర్.. నా అందం, ఆనందం రహస్యం అదే! నటి
ఈ విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నీనా గుప్తాకు బ్యూటీ పార్లర్లకు వెళ్లే అలవాటు లేదు. ‘అవునా!! గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు తరచూ పార్లర్ లకు వెళ్తుంటారు కదా! అందమే కదా అసలు ఎవరికైనా ఆనందం?’ అని మీరు అడిగి చూడండి... నీనా చెప్పే సమాధానం మిమ్మల్ని మరింతగా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ‘నా కూతురే నా ఆనందం‘ అంటారు నీనా!ఆనందం అందాన్నిస్తుంది. ఆ ఆనందం కూతురు మసాబా రూపంలో నీనా కళ్లెదుట ఉంది. ఇక ఆమెకు ఫేషియల్స్ ఎందుకు? పార్లర్లు ఎందుకు? నీనా వయసు 65. సింగిల్ మదర్కి స్ట్రెస్ ఉంటుంది. కూతురు ఉన్న సింగిల్ మదర్కి మరింత స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్, మరింత స్ట్రెస్లను మించిన మూడోస్ట్రెస్ కూడా ఉండేది నీనాకు. అదేమిటో అందరికీ తెలిసిందే. ఆమె కూతురి తండ్రి ఇండియన్ కాదు. 1980ల నాటి వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్. నీనా, రిచర్డ్స్కు పుట్టిన అమ్మాయే మసాబా. రిచర్డ్స్ కు అప్పటికే పెళ్లి అయి ఉండటంతో ఆయన్ని పెళ్లి చేసుకోకుండా, మసాబా పెరిగి పెద్దయ్యే వరకు – ఒంటరిగానే ఉండిపోయారు నీనా. ప్రస్తుతం మసాబా వయసు 35 ఏళ్లు. ఇప్పటికీమసాబానే నీనా కంటి వెలుగు. మసాబానే ఆమె అందం, ఆనందం. ‘ఎదుగుతున్న వయసులో నా కూతురి కోసం నేను రెండు పనులు ఎప్పటికీ చేయకూడదు అని ఒట్టు పెట్టుకున్నాను. ఒకటి: ఆమె చదువు కోసం ‘ఎవరినీ డబ్బు సాయం అడగకూడదు.’ రెండు : తండ్రి (దగ్గర) లేని పిల్లగా ఆమె కోసం ‘ఎవరి ఎమోషనల్ సపోర్టూ తీసుకోకూడదు.’ ఈ రెండిటిపై గట్టిగా నిలబడ్డాను. మనం డబ్బు, సపోర్ట్ అడగం అని తెలిస్తే ఎవరైనా ధైర్యంగా మన దగ్గరకు వస్తారు. మనమూ అంతే.. ఎవరి దగ్గరకైనా ధైర్యంగా వెళ్లగలం అని ‘బ్రట్ ఇండియా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కుషా కపిల్తో చెప్పారు నీనా గుప్తాకూతురు మాత్రమే కాదు, సింగిల్ మదర్గా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ రావటం కూడా నీనా అందానికి కారణం అయి ఉంటుంది -
నటి నీనాగుప్తా ఇష్టపడే రెసిపీలు ఇవే..!
బాలీవుడ్ నటి, దర్శకురాలు అయిన నీనా గుప్తా సినీ కెరీర్లో ఎన్నో విజయాలను అందుకుంది. మంచి నటిగా పేరుతెచ్చుకోవడమే గాక ఎన్నో అవార్డులు, పురస్కారాలను దక్కించుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటుంది. అలానే తాజాగా తనకిష్టమైన బ్రేక్ఫాస్ట్ గురించి షేర్ చేసుకుంది. ఇన్స్టాలో తనికష్టమైన పరాటా ఫోటోని షేర్ చేసింది. 'ఆలూ పనీర్ ప్యాజ్ పరాఠా' బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని పేర్కొంది. అలాగే తనకిష్టమైన వివిధ అల్పాహారాల కూడా గురించి వెల్లడించింది. సౌత్ ఇండియన్ వంటకమైన ఊతప్పం అంటే మహా ఇష్టమని అన్నారు. కొబ్బరి చట్నీతో ఊతప్పం తింటుంటే ఆ రుచే వేరేలెవెల్ అని చెబుతున్నారు. అలాగే తనకు సుజీ (గోధుమ రవ్వ)తో చేసిన అట్లు అంటే మహా ఇష్టమని తెలిపింది. ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకొచ్చింది. దీన్ని రైతాతో తింటే టేస్ట్ మాములుగా ఉండదట.(చదవండి: అత్యంత స్పైసీ హాట్ సాస్..జస్ట్ మూడు నిమిషాల్లో..!) -
తెలుగులోకి మరో క్రేజీ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సినిమాలు వచ్చినట్లే.. ఓటీటీలో కొత్త కొత్త వెబ్ సిరీసులు కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. తెలుగులో స్ట్రెయిట్గా తీయనప్పటికీ.. ఇతర భాషల్లో తీసిన సిరీస్లని డబ్ చేసి మరీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలా ఇప్పుడు ఓ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: చిచ్చు పెట్టిన బిగ్బాస్.. ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు?)'1000 బేబీస్' పేరుతో తీసిన ఈ సిరీస్ని సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఓ పోలీస్ టీమ్ దేనికోసమే సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు అడవి మధ్యలో ఓ ఇంట్లో ముసలావిడ. ట్రైలర్లో పెద్దగా కథని రివీల్ చేయలేదు గానీ చూస్తుంటే ఇదేదో మంచి థ్రిల్లర్లా అనిపిస్తుంది.మలయాళంలో తీసినప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ డబ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అక్టోబరు 18న అంటే వచ్చే శుక్రవారం ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. మీరు ట్రైలర్పై ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!) -
డబ్బు కోసం ఏదిపడితే అది చేశా.. తర్వాతేమో దేవుడిని ప్రార్థించేదాన్ని: నటి
సినిమాల్లో కనిపించాలని కలలు కనడం బాగుంటుంది కానీ దాన్ని నిజం చేసుకునే క్రమంలో ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా అలవాటు లేని ప్రదేశానికి వెళ్లి.. అక్కడ అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. తాను కూడా కొత్తలో ముంబై నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని చెప్తోంది బాలీవుడ్ నటి నీనా గుప్తా.వెళ్లిపోదామనుకున్నా..తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాది ఢిల్లీ. సినిమా కోసం అక్కడి నుంచి ముంబైకి వచ్చాను. కానీ ఈ వాతావరణానికి అలవాటు పడలేక ఎన్నోసార్లు వెళ్లిపోవాలనుకున్నాను. ప్రతి మూడు నెలలకోసారి బ్యాగు సర్దుకునేదాన్ని. ముందు పీహెచ్డీ చేసి ఆ తర్వాత వచ్చేద్దాం అనుకునేదాన్ని. కానీ ఈ సిటీ మనల్ని వెళ్లనివ్వదు.దేవుడిని మొక్కేదాన్నిఅయితే మొదట్లో నాకు డబ్బు అవసరం చాలా ఉండేది. అందుకోసం నాకు నచ్చని పాత్రలు కూడా చేసేదాన్ని. తర్వాత ఆ సినిమాలు రిలీజవకూడదని దేవుడిని ప్రార్థించేదాన్ని. అప్పుడు దేనికీ నో చెప్పకపోయేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా తిరస్కరిస్తాను. నాకు నచ్చిన స్క్రిప్టునే ఎంచుకుంటాను. నచ్చనివాటిని ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పుకొచ్చింది. గ్లామర్ రోల్స్ చేయనుతనను రెబల్ స్టార్ అని పిలవడంపై స్పందిస్తూ.. ఎందుకు నన్ను రెబల్ అని పిలుస్తారో అర్థం కాదు. పైగా నేను చాలా అమాయక పాత్రలు పోషించాను. పెద్దగా గ్లామర్ పాత్రలు, శక్తివంతమైన రోల్స్ కూడా చేయలేదు. నేను సింగిల్ మదర్ అని మీడియానే నాకు రెబల్ అన్న ట్యాగ్ ఇచ్చింది. నేను పోయినప్పుడు కూడా బోల్డ్ నీనా గుప్తా ఇక లేరు అనే రాస్తారు. నేను చనిపోయినా కూడా అలాంటి ట్యాగులు అంటగట్టడం ఆపరు. సరే, ఇంక దాన్ని నేను ఏం చేయలేను అని నీనా గుప్తా తెలిపింది. కాగా ఈమె ముఖ్య పాత్రలో నటిస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 28 నుంచి ప్రసారం కానుంది. -
మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్
మసాబా గుప్తా ఫ్యాషన్ పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసం లేదు. రెడ్ కార్పెట్ ఈవెంట్ల నుండి వివాహాలు , ఫోటోషూట్ల వరకు పాపులర్ డిజైనర్గా పాపులర్ అయింది. తన క్రియేటివిటీ అందర్నీ కట్టిపడేసింది. అంతేకాదు తన జీవిత కథ ఆధారంగా రూపొందించిన డాక్యు-సిరీస్ మసాబాతో నటిగా అవతరించింది. ఇటీవల నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. తాజాగా తాను తల్లికాబోతున్నానని ఇన్స్టా ద్వారా ప్రకటించింది. ‘‘మా జీవితాల్లోకి రెండు బుల్లి బుల్లి అడుగులు రాబోతున్నాయి.. మమ్మల్ని ఆశీర్వ దించండి, అలాగే మీ ప్రేమను, కొద్ది బనానా చిప్స్ను(plain salted ONLY)’’ అంటూ తాను తల్లికాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్తో షేర్ చేసింది. అంటే తనకు బనానా చిప్ప్ తినాలనిపిస్తోందని చెప్పకనే చెప్పింది. కొన్ని ఎమోజీలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా గతంలో మసాబా వ్యాఖ్యలు వైరల్గా మారాయి. చెప్పినట్టే చేసిందంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) సింగిల్ పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ మోడ్రన్గా ఉన్నా, పెళ్లి కాకుండానే బిడ్డను కనడం నార్మల్గా మారినా, , తాను అలా చేయకూడదనుకుంటున్నానని ఆమె వెల్లడించింది. ‘ఆధునిక మహిళగా పెళ్లి చేసుకుని బిడ్డనుకనే ధైర్యం ఉందా? అంటే .అస్సలు లేదు. ఎందుకంటే అంత ఒత్తిడిని తీసుకోవాలని లేదు. అలాంటి వాతావరణంలో బిడ్డను ఉంచాలని తాను భావించడం లేదని గతంలో ఒక ఇంటర్వ్యలో పేర్కొంది. పెళ్లి కాకుండా పుట్టిన తనకి చాలా మోడ్రన్ అనే ట్యాగ్ వేశారు. ఆధునికంగా ఉండటం చాలా అద్భుతమే కానీ తాము చాలా అవమానాల్ని ఎదుర్కొన్నామని గుర్తు చేసుకుంది. కాగా బాలీవుడ్ నటి, నీనా గుప్తా , వెస్ట్ ఇండియన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమ కథ అందరికి సుపరిచితమే.ఈ జంటకు ప్రేమ ఫలితమే మసాబా గుప్తా. అయితే పెళ్లికాకుండానే నీనా బిడ్డను కనడం అప్పట్లో పెద్ద సంచలనం. నీనా, రిచర్డ్స్ని పెళ్లి చేసుకోలేదు. కానీ ఒంటరిగానే తన కుమార్తె మసాబాను పెంచి పెద్ద చేసి ప్రయోజకురాల్ని చేసింది. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ నటి కూతురు..!
ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురిగా మసాబా గుప్తా అందరికీ సుపరిచితమే. ప్యాషన్ డిజైనర్ కెరీర్ ప్రారంభించిన ఆమె నటిగాను గుర్తింపు తెచ్చుకుంది. 2023లో రెండోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన మసాబా.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మీ అందరీ ఆశీర్వాదాలు కావాలంటూ ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ తారలు కరీనా కపూర్, షెహనాజ్ గిల్, కుషా కపిల, తాహిరా కశ్యప్, సారా టెండూల్కర్, బిపాసా బసు, పరిణీతి చోప్రా, అనన్య పాండే, కృతి సనన్ అభినందనలు తెలిపారు. కాగా.. మాసాబా గుప్తా, సత్యదీప్లు కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో వారి సన్నిహితులు, ఆమె తండ్రి మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. కాగా.. గతంలో టాలీవుడ్ నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. సత్యదీప్ సైతం గతంలోనే అదితి రావు హైదరీని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఆదితిరావు హైదరీ- సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రెడీ.. అదిరిపోయే టైటిల్ ఫిక్స్
'ముచ్చటగా మూడోసారి కూడా భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం' అనే అంచనాల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. 'విశ్వనేత' పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి యువ ప్రతిభాశాలి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. 'వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్' పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో సెట్స్కు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జీ.ఎస్.టీ, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలనాలతో కోట్లాది భారతీయుల గుండెల్లో కొలువుదీరి.. "యూనిఫామ్ సివిల్ కోడ్" అమలు దిశగా అడుగులు వేస్తున్న నరేంద్రుడి బయోపిక్లో చాయ్ వాలా స్థాయి నుంచి "విశ్వనేత" గా ఎదిగిన ఆయన మహాప్రస్థానానికి దృశ్యరూపం ఇవ్వనున్నామని సినిమా యూనిట్ చెబుతోంది!! -
'తప్పుడు మనుషులతో డేటింగ్ చేశా.. కూతురికి పెళ్లి చేయడం నా తప్పే'
పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు.. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలకడగా ఉండట్లేదు. కొంతకాలానికే విడాకులు ఇచ్చేసుకుంటున్నారు. కొందరైతే పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చుకోవడం దేనికని.. సహజీవనానికి జై కొడుతున్నారు. ఈ రెండు రకాల పరిస్థితులు బాలీవుడ్ నటి నీనా గుప్తాకు ఎదురయ్యాయి. నీనా గుప్తా.. భార్యాబిడ్డలున్న క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమించింది. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా పుట్టింది. వీరి బంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేకప్ అయింది. సింగిల్ పేరెంట్గా మసాబాను పెంచి పెద్ద చేసింది నీనా. ఆ తర్వాత 2008లో వివేక్ మెహ్రాను పెళ్లాడింది. సలహాలివ్వడానికి నేను కరెక్ట్ కాదు మసాబా 2015లో నిర్మాత మధు మంతెనను పెళ్లాడగా 2019లో విడాకులు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 27న నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది మసాబా. ఇతడికి కూడా ఇది రెండో పెళ్లే.. సత్యదీప్ గతంలో హీరోయిన్ అదితి రావును పెళ్లాడి, తర్వాత ఆమెకు విడాకులిచ్చేశాడు. అయితే మసాబా మొదటి పెళ్లి ఆమె తల్లి బలవంతం మీదే జరిగిందట. ఈ విషయాన్ని తాజాగా నీనా గుప్తా వెల్లడించింది. 'రిలేషన్షిప్ గురించి సలహాలివ్వడానికి నేను సరైన వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను ఎప్పుడూ తప్పుడు మనుషులతోనే డేటింగ్ చేశాను. కాబట్టి నేను మంచి సలహాలివ్వలేను. అయితే మసాబా విషయంలో మాత్రం ఓ పొరపాటు చేశాను. పెళ్లి చేసి తప్పు చేశా తను మొదట పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కాబోయే భర్తతో సహజీవనం చేయాలనుకుంది. అందుకు నేను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకున్నాకే తనతో కలిసి ఉండాలని చెప్పాను. అదే నేను చేసిన తప్పు. పెళ్లయిన కొంతకాలానికి వారు విడాకులు తీసుకున్నారు. అప్పుడు నేను కుంగిపోయాను, జీర్ణించుకోలేకపోయాను. వాళ్ల జంటను చూసి మేము ముచ్చటపడేవాళ్లం. ఇప్పటికీ నా మాజీ అల్లుడి మీద నాకు అభిమానం ఉంది. విడాకుల వార్త చెప్పగానే నోట మాట రాలేదు. కానీ అది వారి జీవితం.. కాబట్టి నేను ఏమీ చేయలేకపోయాను' అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా. చదవండి: రైతు బిడ్డ సహా ఏడుగురు నామినేషన్స్లో.. ఆ ఒక్కరు మాత్రం సేఫ్! -
నవ్వించడంతో పాటు థ్రిల్ చేస్తానంటున్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ నవ్వించడానికి, థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు. ఆమెతో పాటు నీనా గుప్తా కూడా చేతులు కలిపారు. ఈ ఇద్దరూ కలిసి చేసే కామెడీ, థ్రిల్ని వచ్చే ఏడాది వెండితెరపై చూడొచ్చు. రకుల్, నీనా గుప్తా లీడ్ రోల్స్లో ఓ చిత్రం రూపొందనుంది. కామెడీ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆశిష్ ఆర్. శుక్లా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ కేతర్పాల్ నిర్మించనున్నారు. రకుల్ ఓ లీడ్ రోల్లో నటించిన ‘ఐ లవ్ యు’కి కూడా కేతర్పాల్నే నిర్మాత. ఈ ఏడాది జూన్లో ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. అయితే తాజా చిత్రాన్ని మాత్రం థియేటర్స్లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ని అక్టోబర్లో ఆరంభించి, డిసెంబర్కల్లా పూర్తి చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం విడుదలయ్యే చాన్స్ ఉంది. -
భయం వద్దు మిత్రమా... కూల్గా తినుమా! సీనియర్ నటి సలహాలు
డైనింగ్ ఎటికేట్లో భాగంగా కొన్ని రెస్టారెంట్లలో, ఫంక్షన్లలో ఫోర్క్, నైఫ్లతో తినడం తప్పనిసరి అవుతుంది. అయితే అది అందరికీ సులభం కాకపోవచ్చు. పొరపాట్లు దొర్లవచ్చు. ఎవరైనా గమనిస్తున్నారేమో... అనే ఆలోచనతో కూడా భోజనాన్ని సరిగ్గా తినలేకపోవచ్చు. ‘ఇదంతా ఎందుకు... ఫోర్క్, నైఫ్లతో సరిౖయెన పద్ధతిలో ఎలా తినాలో నేర్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అంటూ ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ట్యుటోరియల్ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఫోర్క్, నైఫ్లతో ఎలా తినాలో చూపించింది నీనా గుప్తా. ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లితే... ఒకప్పుడు నీనా కూడా ఫోర్క్, నైఫ్లతో తినడం రాక చాలా ఇబ్బంది పడేది. దీంతో పట్టుదలగా తినే పద్ధతిని నేర్చుకుంది. ‘నాకైతే చేతులతో తినడమే ఇష్టం’ అని నీనా గుప్తా చెప్పడం కొసమెరుపు. -
'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)
టైటిల్: లస్ట్ స్టోరీస్ 2 నటీనటులు: తమన్నా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకుర్, కాజోల్ తదితరులు నిర్మాణ సంస్థ: RSVP & ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాత: ఆషీ దువా, రోనీ స్క్రూవాలా దర్శకత్వం: ఆర్. బాల్కీ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్, కొంకణ్ సేన్ శర్మ సినిమాటోగ్రఫీ: ఆనంద్ బన్సాల్ ఎడిటర్: సన్యుక్త కజా ఓటీటీ: నెట్ఫ్లిక్స్ విడుదల తేదీ: 29 జూన్ 2023 ఓటీటీలు వచ్చిన కొత్తలో 'లస్ట్ స్టోరీస్' ఓ సెన్సేషన్. ఎంతలా అంటే ఈ ఆంథాలజీ దెబ్బకు కియారా అడ్వాణీ తెగ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'లస్ట్ స్టోరీస్ 2' తీసుకొచ్చారు. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ లో తమన్నా చేస్తున్న హడావుడి, ట్రైలర్లో ఆమె సీన్స్ వల్ల.. ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం... అంచనాల్ని అందుకుందా? ఫస్ట్ పార్ట్ కంటే మెప్పించిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) కథేంటి? ఇందులో నాలుగు కథలుంటాయి. మొదట దానిలో వేద(మృణాల్ ఠాకుర్), అర్జున్ (అంగద్ బేడీ) పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లి పనుల్లో పెద్దలు బిజీగా ఉంటారు. వేద బామ్మ (నీనా గుప్తా) మాత్రం.. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనాలని వేద, అర్జున్ కి సలహా ఇస్తుంది. రెండో దానిలో ఇషిత (తిలోత్తమ షోమీ) ముంబయిలో జాబ్ చేస్తూ ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుంది. ఓ రోజు కాస్త త్వరగా ఇంటికొచ్చేసరికి.. తన బెడ్ పై పనిమనిషి సీమ(అమృత సుభాష్) తన భర్తతో కలిసి బెడ్ పై శృంగారంలో బిజీగా ఉంటుంది. మూడో దానిలో విజయ్ చౌహాన్ (విజయ్ వర్మ)కు మహిళలంటే తెగ మోజు. ఓ రోజు లవర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. దగ్గరలోని ఓ ఊరికి వెళ్తే అక్కడ తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. నాలుగో దానిలో బిజోక్పుర్ అనే ఊరిలో రాజకుటుంబీకుడు (కుముద్ మిశ్రా).. భార్య దేవయాని(కాజోల్), కొడుకు అంకుర్ (జీషాన్ నదఫ్)తో కలిసి జీవిస్తుంటాడు. ఈయన కూడా ఆడవాళ్లని చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. ఈ నాలుగు స్టోరీల్లోనూ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? బామ్మ.. పెళ్లీడుకు వచ్చిన తన మనవరాలిని దగ్గర కూర్చోబెట్టుకుని, శృంగారం గురించి చాలా ఓపెన్ గా చెబుతుంటుంది. 'మీ తాతగారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు. లేకపోయింటే ఈ గది తలుపులకు ఈ పాటికే గొళ్లెం పెట్టి ఉండేవి' అని అంటుంది. ఈ సీన్ లో ఆ మనవరాలు నవ్వుతూ ఉంటుంది గానీ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. బోల్డ్నెస్ లో మరీ హద్దులు దాటేశారు బాబోయ్ అనిపిస్తుంది. ఇదే కాదు 'లస్ట్ స్టోరీస్ 2'లో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' టైటిల్ తో తీసిన తొలి స్టోరీలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకుర్ నటించింది. పెళ్లికి ముందు శృంగారం అనే షాకింగ్ కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించారు. ఇది నిజంగా భారతీయ సంస్కృతిలో వర్కౌట్ కాదు. ఈ ఎపిసోడ్ అంతా బామ్మ పాత్ర చుట్టూనే ఉంటుంది. ఆమె మాటలు విన్న అర్జున్, వేద ఏం చేశారనేది స్టోరీ. చాలా సింపుల్, ఫ్లాట్ గా దీన్ని తీశారు. యూత్ ని ఆకట్టుకోవడం తప్పితే పెద్దగా ఏం లేదు. 'ద మిర్రర్' పేరుతో తీసిన రెండో స్టోరీ ఓ శృంగార నవల చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో చూపించిన పాయింట్.. ప్రస్తుతం సమాజంలో ఒంటరి మహిళలు లేదా అమ్మాయిల జీవితాలని ప్రతిబింబించేలా అనిపిస్తుంది! ఇందులో పదేపదే 'ఆ' సీన్సే చూపిస్తుంటారు. దీని వల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నిడివి కూడా కాస్త ఎక్కువే. అసలు విషయం బయటపడిన తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా మారిపోతాయి అనే పాయింట్ కూడా ఇందులో చూపించారు. (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) 'సె*క్స్ విత్ ఎక్స్' పేరుతో తీసిన మూడో స్టోరీలో రియల్ లైఫ్ కపుల్ తమన్నా, విజయ్ వర్మ జంటగా కనిపించారు. ఈ ఎపిసోడ్ మొదటంతా రొమాంటిక్ వేలో వెళ్తుంది. చివరకొచ్చేసరికి మిస్టరీ తరహాలో మారిపోతుంది. తమన్నా అయితే రెచ్చిపోయి మరీ అలాంటి సీన్స్ చేసింది. యూత్ ని టార్గెట్ చేయడం కోసం ఈ ఎపిసోడ్ లో ముద్దు, శృంగారం సన్నివేశాల గాఢత పెంచిన ఫీలింగ్ కలుగుతుంది. చివరి సీన్ మాత్రం మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది. 'టిల్చట్టా(బొద్దింక)' పేరుతో నాలుగో ఎపిసోడ్.. పైవాటితో పోలిస్తే చాలా నిదానంగా సాగుతుంది. చివరి సీన్ కి వస్తే గానీ అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాదు. క్లైమాక్స్ పాయింట్ బాగున్నప్పటికీ.. దానికోసం ఎపిసోడ్ ని అరగంటపాటు సాగదీయడం బోర్ కొట్టిస్తుంది. ఇందులో కాజోల్ లాంటి స్టార్ యాక్టర్ ఉన్నప్పటికీ ఆమె పాత్రని సరిగా డిజైన్ చేయలేదు. మొత్తంగా చూసుకుంటే 'లస్ట్ స్టోరీస్' చిత్రంలో విభిన్న వ్యక్తుల భావోద్వేగాలని చూపిస్తే... ఇప్పుడీ సీక్వెల్ లో శృంగారమే ప్రధానం అన్నట్లు తీశారు. కథ కన్నా 'కామం' అనే పాయింట్ నే హైలెట్ చేశారు. దీంతో ఇది సినిమాలా కాకుండా ఓటీటీ కోసం తీసిన సెమీ బూతు చిత్రంలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు.. ఈ ఆంథాలజీ చిత్రాన్ని పొరపాటున కూడా ఓపెన్ చేయొద్దు. ఎవరెలా చేశారు? మృణాల్ ఠాకుర్.. డిఫరెంట్ గా కనిపించింది. తిలోత్తమ షోమీ కూడా ఉన్నంతలో పర్లేదు. తమన్నా, విజయ్ వర్మ అయితే రెచ్చిపోయి నటించారు. ముద్దు, శృంగారం సన్నివేశాల్లో హద్దులు దాటేశారు. కాజోల్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. సీనియర్ నటి నీనా గుప్తా అయితే ప్రతిఒక్కరినీ తన యాక్టింగ్, డైలాగ్స్ తో ఆశ్చర్యపరిచింది. చెప్పాలంటే ఈమె రోల్ అందరికీ పెద్ద షాక్. టెక్నికల్ గా నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ.. స్టోరీ, మిగతా విషయాల్లో దర్శకనిర్మాతలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. -చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
మొదటి ముద్దు.. డెటాల్తో నోరు కడుక్కున్నా: ప్రముఖ నటి
పలువురు లేడీ యాక్టర్స్.. కొన్ని విషయాలు బయటపెట్టడానికి అస్సలు మొహమాటపడట్లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పేస్తున్నారు. బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ తెగ పాపులర్ అవుతోంది. కొన్నిరోజుల ముందు యువతని ఉద్దేశించి బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడేమో తన తొలిముద్దు అనుభవం గురించి షేర్ చేసుకుని, అందరికీ షాకిచ్చింది. అసలు అప్పుడు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు బయటపెట్టింది. రాత్రంతా నిద్రపోలే..! 'ఓ యాక్టర్ గా మనం అన్ని రకాల సీన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బురదలో దిగాలి. మరికొన్నిసార్లు ఎండలో గంటల తరబడి నిలబడాలి. సరే ఇది పక్కనబెడితే చాలా ఏళ్ల క్రితం దిలీప్ ధావన్ తో కలిసి నేను ఓ సీరియల్ చేశాను. మనదేశ చరిత్రలోనే అదే తొలిసారి ఓ సీరియల్ లో కిస్ సీన్ ఉండటం. అందులో నటించిన తర్వాత రాత్రంతా నాకు నిద్రపట్టలేదు' అని నీనా గుప్తా చెప్పింది. (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) డెటాల్ తో కడుక్కున్నా! 'అతడు(దిలీప్ ధావన్) చూడటానికి బాగానే ఉంటాడు. కానీ అలాంటి పరిస్థితిలో అదేం గుర్తుకురాదు. ఆ సీన్ జరిగే సమయానికి మానసికంగా నేను రెడీగా లేను. చాలా టెన్షన్ వచ్చేసింది. కానీ నాకు నేను చెప్పుకొని ఆ ముద్దు సన్నివేశాన్ని పూర్తిచేశాను. కొందరు నటులు కామెడీ చేయలేరు. కొందరు కెమెరా ముందు ఏడవలేరు. నేను మాత్రం చేసేయాలి అని అనుకుని ఆ సీన్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మాత్రం డెటాల్ తో నోరు బాగా కడుక్కున్నాను. తెలియని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఏదేమైనా చాలా కష్టం' అని నీనా అన్నారు. సీక్వెల్లో బామ్మగా! 2018లో విడుదలైన 'లస్ట్ స్టోరీస్' ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. శృంగారం, దానికి సంబంధించిన చాలా విషయాల్ని ఓపెన్ గా మాట్లాడుకోవడం, చూపించడం లాంటివి అప్పట్లో ప్రేక్షకుల్ని నోటమాట రానీయకుండా చేశాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా 'లస్ట్ స్టోరీస్ 2'ని సిద్ధం చేశారు. జూన్ 29 నుంచి నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ పాత్రకు బామ్మగా నీనా గుప్తా నటించింది. 'పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్కి వెళ్లండి' లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పి ఓరి బాబోయ్ అనుకునేలా చేసింది. ఇప్పుడు ఈమెనే తన తొలి ముద్దు గురించి బయటపెట్టి షాకిచ్చింది. (ఇదీ చదవండి: నిధి అగర్వాల్కు కొత్త కష్టాలు.. అన్నీ ఉన్నాసరే!) -
యూత్ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసిన నటి
నీనా గుప్తా, కాజోల్, మృణాల్ ఠాకూర్, తమన్నా,విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లస్ట్ స్టోరీస్-2. ఈ వెబ్ సీరిస్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈ సీరిస్లో నీనా గుప్తా 'డాడీ మా' రోల్లో నటించింది. కొన్నాళ్లుగా సినిమాల్లో వయసుకు తగిన పాత్రలు రాకపోవడంతో ఆమె దూరంగానే ఉంటూ వచ్చింది. లస్ట్ స్టోరీస్- 2తో నీనా గుప్తా తిరిగి టెలివిజన్ స్క్రీన్లలోకి వచ్చింది. ఈ సీరిస్ ట్రైలర్లో శృంగార సన్నివేశాలతో పాటు బోల్డ్ సంభాషణలు ఉన్నాయి. ఇదే విషయంపై తాజాగా ఆమె పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: మద్యం తాగుతారా? నెటిజన్ ప్రశ్నకు శ్రుతీహాసన్ సమాధానమిదే!) శృంగారం గురించి యువత తెలుసుకోవడం చాలా ముఖ్యమైనదని నీనా చెప్పింది. కాలేజీకి వెళ్లే రోజుల్లో అమ్మాయిలు ముద్దులు పెట్టుకోవడం ద్వారా గర్భం దాల్చుతారని అప్పట్లో నమ్మేదానినని నీనా తెలిపింది. తన మదర్ ఎంతో స్ట్రిక్ట్ అంటూ తన గతానికి సంబంధించిన కొన్ని అనుభవాలను ఇలా పంచుకుంది. 'నాకు పన్నెండు, పదమూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా.. నా తల్లిదండ్రులు ప్రత్యేక బెడ్రూమ్లో పడుకోలేదు. మేము అందరం ఒకే గదిలో పడుకునేవాళ్లం. నేను, నా సోదరుడు మంచం ప్రక్కన క్రింద పడుకునేవాళ్లం. కానీ కొన్నిసార్లు నేను నా తల్లిదండ్రుల మధ్య పడుకుంటాను. అప్పటికి మాకు శృంగారం గురించి ఏమీ తెలియదు. మా అమ్మ నాకు శృంగార అంటే ఏమిటో చెప్పలేదు, పీరియడ్స్ అంటే ఏమిటో కూడా చెప్పలేదు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మా అమ్మ ఎంత కఠినంగా ఉండేదంటే, నన్ను నా స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి కూడా వెళ్లనివ్వదు.' 'నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ముద్దు పెట్టుకోవడం ద్వారా గర్భవతి అవుతారని నమ్మేదాన్ని. అప్పట్లో ఇలాంటి విషయాలు తల్లులు కూడా తమ కుమార్తెలతో చెప్పడానికి భయపడతారు. పూర్వ కాలంలో, పెళ్లికి ముందు శృంగారంపై అమ్మాయికి కొంత సమాచారం ఇచ్చేవారు. ఎందుకంటే.. పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఏం జరుగుతుందో చెప్పేవారు. ఆ సమయంలో అబ్బాయితో ఎలా ఉండాలో చెప్పేవారు. ఇలా ఎందుకు చేసేవారంటే? శృంగారం విషయంలో కొత్తజంట మధ్య గొడవలు రాకూడదని.. శృంగారం కోసం భర్త అడిగినప్పుడు అమ్మాయి 'కర్తవ్యం' ఎలా నెరవేర్చాలో అప్పటి తల్లులు చెప్పేవారు.' అని నీనా గుప్తా అన్నారు. (ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్గానే చెప్పేసిన నటి) ఇది నేటికీ కొన్నిచోట్ల జరిగే విషయమేనని, పరిస్థితులు పెద్దగా మారలేదని ఆమె అన్నారు. అందుకే ఇలాంటి విషయాలకు లస్ట్ స్టోరీస్- 2 ముఖ్యమైనదని తెలిపింది. ఈ సీరిస్లో శృంగార సన్నివేశాలు ఉంటాయి. తప్పేముంది? మనిషి జీవితంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్నే ఒక సినిమా ద్వారా తెలుపుతున్నామని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా ఎంతగానో తోడ్పడుతుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Neena Gupta (@neena_gupta) -
Lust Stories 2 teaser: కారు కొనడానికేమో టెస్ట్ డ్రైవ్, మరీ పెళ్లికి ..?
నీనా గుప్తా, కాజోల్, మృణాల్ ఠాకూర్, తమన్నా, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లస్ట్ స్టోరీస్-2. ఈ మూవీకి అమిత్ రవీందర్నాథ్ శర్మ, కొంకణ సెన్ శర్మ, ఆర్ బాల్కీ, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. (ఇది చదవండి: చిన్న సూట్కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి) ఈ చిత్రంలో సీనియర్ నటి నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటించారు. టీజర్ ప్రారంభంలో నీనా గుప్తా మాటలు టీజర్పై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఒక కారు కొనడానికి ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తాం.. మరీ పెళ్లికి ముందు ఇలాగే చేయకూడదా అని అడిగింది. నీనా మాటలకు కాజోల్ నవ్వుతూ కనిపించింది. కాగా.. ఈ చిత్రంలో అంగద్కు జోడీగా మృణాల్, విజయ్ వర్మకు జంటగా తమన్నా నటిస్తున్నారు. ఈ టీజర్లో విజయ్, తమన్నా కూడా రొమాంటిక్గా కనిపించారు. కాగా.. విశాల్ భరద్వాజ్ వెబ్ సిరీస్ చార్లీ చోప్రా & ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీలో కూడా నీనా నటిస్తున్నారు. కాజోల్ కూడా ది గుడ్ వైఫ్ వెబ్ సిరీస్లో కనిపించనుంది. (ఇది చదవండి: లలితా జ్యువెలరీలో దోపిడి, చివరకు ఎయిడ్స్తో.. ఆ దొంగ కథే జపాన్?) Love or lust… you decide. #LustStories2 Coming soon, only on @NetflixIndia! 🤩 #LustStories2OnNetflix#RBalki @konkonas @sujoy_g @iAmitRSharma @Neenagupta001 @mrunal0801 @Imangadbedi @TillotamaShome @AmrutaSubhash @itsKajolD #KumudMishra @RSVPMovies… pic.twitter.com/bo7tq7R3kr — Tamannaah Bhatia (@tamannaahspeaks) June 6, 2023 -
గర్భంతో ఉన్న నటిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన దర్శకుడు!
ప్రముఖ దర్శకుడు సతీశ్ కౌశిక్ మరణంతో బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. హోలీ వేడుకల్లోనూ సంతోషంగా పాల్గొన్న ఆయన బుధవారం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్తను అభిమానులు, సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నటి నీనా గుప్తా సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించింది. 'బాధాకరమైన వార్తతో నిద్రలేచాను. ఈ ప్రపంచంలో నన్ను నాన్సీ అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే! నేను తనను కౌశిఖాన్ అని పిలిచేదాన్ని. మా స్నేహం కాలేజీలో మొదలైంది, మేము తరచూ కలుసుకునేవాళ్లం. కానీ ఇప్పుడాయన లేరు. ఇది నన్నెంతో భయానికి గురి చేస్తోంది. అదే సమయంలో బాధిస్తోంది కూడా! తన భార్యాపిల్లలు శశి, వంశికలకు ఇదెంతో కష్టకాలం. వారికి ఏ అవసరం వచ్చి నేనెప్పుడూ అండగా ఉంటాను. ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చింది. కాగా గతంలో సతీశ్.. నీనాను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని నీనా తన ఆత్మకథ 'సచ్ కహో తో'లో రాసుకొచ్చింది. నీనా గర్భంతో ఉన్న సమయంలో సతీశ్ ఆమెకు ఎంతగానో అండగా నిలబడ్డారు. 'ఒకవేళ పుట్టబోయే పాప ఛామనచాయతో ఉంటే అది నా బిడ్డే అని చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు నిన్నెవరూ అనుమానించరు' అని సతీశ్ చెప్పినట్లు పుస్తకంలో రాసుకొచ్చింది నీనా. ఇకపోతే సతీశ్ చివరగా ఎమర్జెన్సీ అనే చిత్రంలో కనిపించారు. View this post on Instagram A post shared by Neena Gupta (@neena_gupta) -
సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్న నటి, ఫోటోలు వైరల్
నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా సీక్రెట్గా పెళ్లిపీటలెక్కింది. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది. తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేసి అభిమాలను సర్ప్రైజ్ చేసింది. శాంతస్వరూపుడైన సత్యదీప్తో నా వివాహం జరిగింది. లెక్కలేనంత ప్రేమ, శాంతి, సంతోషం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ క్యాప్షన్ ఎంచుకోవడానికి అనుమతించినందుకు థ్యాంక్స్.. ఎందుకంటే ఇది చాలా బాగుంది అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. దీనికి పెళ్లి ఫోటోలను జత చేసింది. ఇందులో మసాబా లైట్ పింక్ కలర్ కుర్తాలో మెరిసిపోతోంది. ఇక ఈ పోస్టుపై సెలబ్రిటీలు స్పందిస్తూ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విక్కీ కౌశల్, సోహా అలీ ఖాన్, శిబానీ దండేకర్ సహా పలువురు కంగ్రాచ్యులేషన్ చెప్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా బాలీవుడ్ ప్రముఖ నటి నీనా గుప్తా- క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ కూతురే మసాబా. సక్సెస్ఫుల్ డిజైనర్గా కొనసాగుతున్న ఆమె మసాబా 1,2 సీజన్స్తో పాటు మోడ్రన్ లవ్ ముంబై సిరీస్లోనూ నటించింది. గతంలో నిర్మాత మధు మంటేనాను పెళ్లాడిన ఆమె 2019లో అతడికి విడాకులు ఇచ్చింది. సత్యదీప్ మిశ్రా విషయానికి వస్తే.. అతడు నో వన్ కిల్ల్డ్ జెస్సికా సినిమాతో 2011లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. లా పూర్తి చేసిన అతడు కార్పొరేట్ లాయర్గానూ పని చేశాడు. ఇటీవలే ఆయన విక్రమ్ వేదాలో సీనియర్ ఇన్స్పెక్టర్గా, స్పైలో ముక్బీర్గా నటించాడు. ప్రస్తుతం ఆయన నటించిన తానవ్ వెబ్ సిరీస్ రిలీజ్కు రెడీగా ఉంది. గతంలో ఇతడు హీరోయిన్ అదితి రావును పెళ్లాడాడు. కానీ వీరిద్దరి మధ్య పొరపచ్చాలు రావడంతో 2013లో విడిపోయారు. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Bollywood News & Updates (@bollywoodcouch) చదవండి: మాస్ మహారాజ రవితేజ ఇల్లు ఎన్ని కోట్లో తెలుసా? మూడు రోజుల్లో మూడు వందల కోట్లు... షారుక్ రికార్డు -
Neena Gupta: అందమైన అంకెల లోకంలో అపురూప విజేత ఆమె
National Mathematics Day 2022: చిన్నప్పుడు బొమ్మలతో కాదు లెక్కలతో ఆడుకుంది నీనాగుప్తా. జటిలమైన గణిత సమస్యల పరిష్కారంలో తనదైన ప్రతిభ చూపి యువతరానికి ఆదర్శంగా నిలుస్తుంది. ‘గణితంలో నైపుణ్యం సాధించడానికి ఒక జీవితకాలం చాలదు’ అంటున్న నీనాగుప్తా గణితంపై ఆసక్తి, పరిశోధనలనే తన జీవనవిధానంగా మార్చుకుంది... చాలామంది పిల్లల మాదిరిగా చిన్నప్పుడు లెక్కలు అంటే భయపడేది కాదు నీనాగుప్తా. లెక్కలతోనే ఆడుకునేది. పాడుకునేది. తల్లిదండ్రులకు గణితం అంటే ఇష్టం. నీనాకు చిన్నవయసులోనే గణితంలో మెలకువలు నేర్పించి, ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టమయ్యేలా చేశారు. స్కూల్లో మ్యాథ్స్లో ఎప్పుడూ తానే మొదటి స్థానంలో నిలిచేది. గణితశాస్త్రవేత్త ఆస్కార్ జరిస్కి లెక్క ఒకటి 65 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉంది. ఈ సమస్యను పరిష్కరించి 2014లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డ్ అందుకుంది నీనా. 2019లో ‘శాంతిస్వరూప్ భట్నాగర్’ అవార్డ్ అందుకుంది. గత సంవత్సరం అత్యున్నత పురస్కారం అయిన ‘రామానుజన్ ప్రైజ్’ కు ఎంపికైంది. ‘నీనాగుప్తా పరిశోధనలు బీజగణితానికి సంబంధించి ఆమె నైపుణ్యానికి అద్దం పడతాయి. భావితరాలకు ఉపయోగపడతాయి’ అని గుప్తాను కొనియాడింది రామానుజన్ అవార్డ్ కమిటీ. ‘మ్యాథ్స్లో ఒక సవాలు మనకు స్వాగతం పలుకుతుంది. ఆ సవాలును స్వీకరించి విజయం సాధించినప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది’ అంటుంది నీనా. ‘చదివించింది చాలు. పెద్ద చదువులు ఎందుకు’ అని నీనా గురించి ఇరుగు,పొరుగు మాటలను తల్లి లెక్క చేయలేదు. కూతురుకు అన్ని విధాలుగా అండగా నిలబడింది. ‘ఒక మహిళకు మరో మహిళ అండగా ఉంటే, ధైర్యం ఇస్తే ఎన్నో విజయాలు సాధించవచ్చు’ అని తల్లిని ఉద్దేశించి అంటుంది నీనా. ‘నీనా పనితీరును పదిహేను సంవత్సరాలుగా గమనిస్తున్నాను. ఎప్పటికప్పుడు తన ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకుంటూనే ఉంది. ఆమెకు గణితమే ప్రపంచం’ అన్నారు ఐఎస్ఐ, కోల్కతా ప్రొఫెసర్ అమర్త్య కుమార్ గుప్తా. ‘అభిరుచిగా మొదలైన గణితం ఇప్పుడు నా జీవనవిధానంగా మారింది’ అంటున్న 38 సంవత్సరాల నీనాగుప్తా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ), కోల్కతాలో ప్రొఫెసర్గా పనిచేస్తుంది. తాజాగా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్–పవర్ (సెల్ఫ్మేడ్ ఉమెన్–2022) జాబితాలో చోటు సంపాదించింది. ‘ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది’ అంటున్న నీనాగుప్తా గణింతపై భయాలను తొలిగించి, అందరికీ చేరువ చేయడానికి అవసరమైన భవిష్యత్ ప్రణాళికకు రూపకల్పన చేసుకుంది. చదవండి: క్రిస్మస్ వేళ.. మమ్మీ.. శాంటా ఏమిచ్చాడో చూడు.. Sudheera Valluri: మన వృత్తే మన గుర్తింపు -
నా కూతుర్ని సినిమాల్లోకి రానివ్వలేదు: బాలీవుడ్ నటి
మసాబా గుప్తా.. ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్న ఈమె మసాబా మసాబా, మోడర్న్ లవ్ ముంబై అనే వెబ్ సిరీస్లలో నటించింది. తల్లి నీనా గుప్తా బాలీవుడ్లో పేరు మోసిన నటి. తండ్రి రిచర్డ్స్ వెస్టిండీస్.. వీరికి గుర్తుగా జన్మించిన కూతురే మసాబా. అయితే రిచర్డ్ తనను పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పడంతో సింగిల్ పేరెంట్గానే మసాబాను పెంచి పెద్ద చేసింది నీనా. కానీ మసాబాను సినిమాల్లోకి రానివ్వలేదని అందుకు క్షమాపణలు కోరుతున్నానంటూ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మసాబా మసాబా మొదటి సీజన్ చూసినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోయా. నిజానికి మసాబాను నేను ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేదాన్ని, అందువల్ల ఆమె బాధపడేది కూడా! కానీ తల్లిగా నేను చేయాల్సింది అదే.. కానీ ఆ సిరీస్ చూశాక ఆమె టాలెంట్కు అబ్బురపడ్డా. మొదట్లో తనను సినిమాల్లోకి రానివ్వలేదు.. అందుకు క్షమించమని కోరుతున్నా. నటిగా తనేంటో నిరూపించుకునే సత్తా ఆమెకుంది. తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ సిస్టమ్లా ఉండాలి. వారి సమస్యలను పేరెంట్స్ దగ్గర చెప్పుకునేలా ఉండాలి. ఇప్పుడు మసాబా నాతో మాట్లాడినట్లుగా నేను మా అమ్మతో మాట్లాడలేదు. పరిస్థితులు మారుతున్నాయి. కానీ చిన్నకుటుంబంలో మన సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. అవి మనలోనే నలిగిపోయి కొన్నిసార్లు భయానక పరిస్థితులను సృష్టిస్తాయి' అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా. కాగా మసాబా మసాబా సిరీస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కిడ్నీ ఫెయిలై మహాభారత్ నటుడు మృతి -
ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తరచుగా ట్రోలింగ్కు గురవతున్నారు. కొందరు విచిత్రమైన చేష్టలతో అభాసుపాలైతే మరికొందరు ఏం చేయకుండానే ట్రోలింగ్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ట్రోలింగ్ బారిన పడింది. అయితే ఆమె ఓ నెటిజన్ చేసిన కామెంట్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి నోరు మూయించింది. మసాబా గుప్తా ఇటీవల తన పిక్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్ 'నువ్ అంత అందంగా లేవు. ఘోరంగా ఉన్నావ్. ఈ ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ (సినిమా) రంగంలో నువ్ ఎలా ఉన్నావ్' అంటూ వ్యంగంగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్కు సంబంధించిన స్క్రీన్షాట్ షేర్ చేస్తూ ''ఇది అందమైనది. కేవలం ప్రతిభ వల్లే ఏ పరిశ్రమలోనైనా నిలదొక్కుకోగలరనే విషయాన్ని నీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అమితమైన హార్డ్ వర్క్, భయంకరమైన క్రమశిక్షణ వల్లే అది సాధ్యం. ఇక నా ముఖం విషయానికొస్తే అది నాకొక బోనస్. (నా మైండ్, మనస్సు ఒక పదునైనా కత్తిలాంటింది. నువ్ ఎంత ప్రయత్నించినా నీ చెత్త మాటలు అందులోకి వెళ్లలేవు)'' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మసాబా గుప్తా. చదవండి: 'అవును, ఆ రూమర్ నిజమే' అంటున్న రష్మిక.. అతడితో.. ఒక్క ఎపిసోడ్కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ ! మసాబా గుప్తా ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'మోడ్రన్ లవ్ ముంబై'లో నటించింది. అలాగే ఆమె తల్లి నీనా గుప్తాతో కలిసి నెట్ఫ్లిక్స్ సిరీస్ 'మసాబా మసాబా'లో కూడా యాక్ట్ చేసింది. ఈ సిరీస్ను మసాబా గుప్తా, ఆమె తల్లి, నటి నీనా గుప్తా జీవితాల నుంచి స్ఫూర్తిగా తీసుకుని సెమీ ఫిక్షన్గా తెరకెక్కించారు. త్వరలో ఈ సిరీస్కు రెండో సీజన్ కూడా రానుంది. 'ఎమ్టీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్' రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది మసాబా గుప్తా. కాగా మసాబా గుప్తా.. నీనా గుప్తా, క్రికెటర్ వివ్ రిచర్డ్ల సంతానం. తర్వాత నీనా గుప్తా చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకుంది. చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ -
తల్లి ఓ స్టార్ నటి, తండ్రి ఓ స్టార్ ఆటగాడు.. కూతురు ఏమో ఇలా..
మసాబా గుప్తా... పేరు వినగానే ముందు వాళ్లమ్మ నీనా గుప్తా.. తర్వాత వాళ్ల నాన్న వివ్ రిచర్డ్స్ను గుర్తుచేసుకునేవాళ్లున్నారు. కానీ ఈ ఇద్దరు లెజెండ్స్ నీడను కాదని సొంత ఉనికిని చాటుకుంటోంది మసాబా. ఈ రోజు ఇక్కడ ఆమె గురించి రాస్తున్నామంటే కారణం.. భిన్న రంగాల్లో మసాబా సాధిస్తున్న విజయాలు.. తెచ్చుకుంటున్న ఐడెంటిటీయే! మసాబా పుట్టింది ఢిల్లీలో.. పెరిగింది ముంబైలో. తల్లి నీనా గుప్తా బాలీవుడ్ నటి. తండ్రి వివ్ రిచర్డ్స్ వెస్టిండీస్... క్రికెట్ స్టార్. కాస్త ఊహ తెలిసేప్పటికే తండ్రి లాగా ఆటల్లో రాణించాలనుకుంది. టెన్నిస్లో శిక్షణ కూడా తీసుకుంది. తనకు పదహారో యేడు వచ్చే వరకూ టెన్నిస్ ఆడింది. వాళ్లమ్మేమో మసాబా నటి కావాలని కోరుకుంది. ఆ రెండూ కాక మసాబా మ్యూజిక్ అండ్ డాన్స్ మీద ఆసక్తి పెంచుకుంది. లండన్ వెళ్లి ఆ రెండిటికీ సంబంధించిన కోర్స్ చేసింది. అప్పుడే.. తనకు పందొమ్మిదేళ్ల వయసప్పుడు లాక్మే ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఇక తను చేరుకోవాల్సిన గమ్యం అదే అని నిర్ణయించుకుంది. ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ తీసుకుంది. డిజైనర్గా ష్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ కీర్తిని ఆర్జించింది మసాబా. అప్పటి (2014) ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ‘బిజినెస్ ఎక్సలెన్స్ అండ్ ఇన్నోవేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్’ అవార్డ్ను అందుకుంది. తల్లి నీనా గుప్తా కోరుకున్నట్టుగా 2020లో నటనా రంగంలోకి ప్రవేశించింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయిన ‘మసాబా మసాబా’ అనే వెబ్ సిరీస్తో నటిగా మారింది. ఒకరకంగా ఇది ఆమె జీవిత కథే. అందులో మసాబా నటనకు మంచి పేరు వచ్చింది. తండ్రిలా ఆటల్లో, తల్లిలా నటనారంగంలో.. తనకులా ష్యాషన్ రంగంలో ఎందులోనైనా రాణించగలను అని నిరూపించుకుంది. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్లో ప్రసారంలోకి వచ్చిన ‘మోడర్న్ లవ్ ముంబై’ అనే ఆంథాలజీలోనూ నటించింది. నటిగా మరోసారి తన ప్రతిభను చూపింది. ఈ సందర్భంగా ఇటీవల ఓ చానల్తో ముచ్చటించిన మాసాబా తన తల్లి నీనా గుప్తే తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా అమ్మను చూస్తే ఏజ్ అనేది ఓ నంబర్ మాత్రమే అనిపిస్తుంది. 67 ఏళ్ల వయసులో కూడా వర్క్ చేస్తూ స్టార్డమ్ను ఆస్వాదిస్తోంది. తను జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. కానీ ఎప్పుడూ నిరాశను దరిచేరనివ్వలేదు. అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను.. కుంటున్నాను కూడా. తనే నాకు ఇన్స్పిరేషన్’ అని చెప్పుకొచ్చింది. -
Panchayat season 2: మంచి మనుషులకు గట్టి దెబ్బలు
కోట్లాది అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది. ‘ఫులేరా’ అనే పల్లెటూళ్లో పంచాయతీ ఆఫీసులో ఆ ఆఫీసు ఉద్యోగికి, ఊళ్లోని వారికి మధ్య స్నేహంతో మొదటి సీజన్ సాగితే ఇప్పుడు ముఖ్యపాత్రలకు గట్టి విరోధులు ఈ సీజన్లో కనిపిస్తారు. సహజత్వం, హాస్యం, అనుబంధంతో ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ అమేజాన్లో మళ్లీ ఒకసారి ప్రేక్షకులను బింజ్ వాచింగ్ చేయిస్తోంది. 8 ఎపిసోడ్ల సెకండ్ సీజన్ పరిచయం ఈ ఆదివారం. అదే ఊరు. అదే పంచాయతీ ఆఫీసు. వేరే గది తీసుకోకుండా ఆ పంచాయతీ ఆఫీసులోనే నివసించే ఉద్యోగి అభిషేక్. అతన్ని అభిమానంగా చూసుకునే పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆఫీసు అసిస్టెంట్ వికాస్... 2020లో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు పాత దూరదర్శన్ సీరియల్స్లా అనిపించి దేశమంతా చూసింది. పంచాయత్ వెబ్ సిరీస్కు విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. సెకండ్ సీజన్ కోసం విన్నపాలు, ఒత్తిళ్లు తెచ్చారు. లాక్డౌన్ వల్ల ఆ పనులన్నీ ఆగిపోయి ఇప్పుడు పూర్తయ్యి ‘పంచాయత్ సీజన్ 2’ స్ట్రీమ్ అవుతోంది. మళ్లీ అభిమానులను అలరిస్తోంది. ఫులేరాలో ప్రత్యర్థులు ఉత్తరప్రదేశ్లోని ‘ఫులేరా’ అనే కల్పిత ఊరిలో జరిగినట్టుగా చెప్పే ఈ కథలో అందరూ మంచివాళ్లే. అమాయకులే. ఒకరికొకరు సాయం చేసుకునేవారే. కాని ఆ ఊరికి గ్రామ సచివాలయ ఉద్యోగిగా వచ్చిన అభిషేక్కు ఎం.బి.ఏ చదివి వేరే ఉద్యోగం చేయాలని ఎంట్రన్స్ టెస్ట్కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఈ లోపల అతనికి ఆ ఊరి సర్పంచ్తో, ఉప సర్పంచ్తో, అసిస్టెంట్తో మంచి స్నేహం ఏర్పడుతుంది. నిజానికి ఆ ఊరి సర్పంచ్ స్త్రీ (నీనా గుప్తా) అయినా సర్పంచ్ భర్త (రఘువీర్ యాదవ్) వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. అభిషేక్ (జితేంద్ర కుమార్) వారి ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. మొదటి సిరీస్లో సర్పంచ్ కూతురు ఉంటుంది కాని ఎక్కడా కనిపించదు. కాని ఈ సిరీస్లో ఆ కూతురు కనిపిస్తుంది. అభిషేక్తో స్నేహం చేస్తుంది. అయితే ఊరన్నాక ఒకరో ఇద్దరో ప్రత్యర్థులు ఉండకపోరు. ఈ ఊళ్లో కూడా ఒక ప్రత్యర్థి తయారవుతాడు. అతడే ఆ ఊరి టెంట్ హౌస్ ఓనర్. రాబోయే ఎన్నికలలో తన భార్యను నిలబెట్టి సర్పంచ్ భర్తగా చలాయించాలనుకుంటున్న ఆ టెంట్ హౌస్ ఓనర్ సర్పంచ్ను, సచివాలయ ఉద్యోగులను పరేషాన్ చేస్తుంటాడు. మరోవైపు ఆ నియోజక వర్గ ఎం.ఎల్.ఏ కూడా సర్పంచ్ని అవమానిస్తుంటాడు. సర్పంచ్ తన కుమార్తె కోసం సంబంధం చూస్తే ఆ పెళ్లికొడుకు సైకోలాగా మారి ఆ అమ్మాయికి తెగ ఫోన్లు చేస్తుంటాడు. వీళ్లందరూ ప్రత్యర్థులే అయినా అభిషేక్, సర్పంచ్, ఉప సర్పంచ్, అసిస్టెంట్ నలుగురూ కలిసి ఆ సమస్యలను ఎలా దాటారు అనేవే ఈ ఎపిసోడ్స్. నవ్వొచ్చే ఎపిసోడ్స్ గత సిరీస్లోలానే ఈ సిరీస్లో కూడా నవ్వొచ్చే ఉదంతాలు ఎన్నో ఉంటాయి. ఊరికి మరుగుదొడ్లు అలాట్ అయినా కొందరు ఉదయాన్నే బయటకు వెళుతుంటారు. అలా కనిపిస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ విజిట్కు వస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ముందు ఊరి సర్పంచ్ను ఎలాగైనా బద్నామ్ చేయాలని టెంట్ హౌస్ ఓనర్ ఒకతణ్ణి నువ్వు ఎలాగైనా చెంబు పట్టుకుని పొద్దున్నే కలెక్టరుకు కనిపించు అంటాడు. కలెక్టరు విజిట్కు వస్తే కనిపించాలని అతను, అతణ్ణి ఎలాగైనా ఆపాలని మిత్రబృందం చేసే ప్రహసనాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. గుడిలో టెంట్ హౌస్ ఓనర్ భార్య చెప్పులను పొరపాటున సర్పంచ్ భార్య తొడుక్కుని ఇంటికి వస్తుంది. తన చెప్పులు కనిపించని టెంట్ హౌస్ ఓనర్ భార్య సిసి టీవీలో చూసి సర్పంచ్ భార్యే దొంగ అని తెలుసుకుని పోలీస్ కేస్ పెడతానంటుంది. ఆ చెప్పులు ఆమె ఇంట్లో పడేయడానికి హీరో నానా విన్యాసాలు చేస్తాడు. అదీ నవ్వే. ఊరి రోడ్డు కోసం నిధులకు ఎంఎల్ఏ దగ్గరకు వెళితే ఆ ఎంఎల్ఏ ముందు ఎక్స్ప్రెస్ రైలును ఆపడానికి ధర్నా చేయమని పంపిస్తాడు. అక్కడ సర్పంచ్ను, ఉపసర్పంచ్ను పోలీసులు పట్టుకెళతారు. అదంతా చాలా సరదాగా ఉంటుంది. హీరోయిన్ను పెళ్లికొడుకు వేధిస్తూ ఉంటే ఆమె హీరో సాయం కోరుతుంది. అలాగే హీరోయిన్, హీరో పరిచయం పెంచుకునే సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. గంభీరమైన ముగింపు సాధారణంగా పంచాయత్ ఎపిసోడ్స్ అన్నీ సరదాగా ఉంటాయి. కాని ఈ సిరీస్లో చివరి ఎపిసోడ్ను ఒక ఉదాత్త సన్నివేశంతో గంభీరం చేశాడు దర్శకుడు. ఆ సన్నివేశంతో ప్రేక్షకులందరూ కన్నీరు కారుస్తారు. మనసులు బరువెక్కుతాయి. సంతోషంతోపాటు దుఃఖమూ మనుషుల జీవితాల్లో ఉంటుందని చెప్పడానికి కాబోలు. ఇంకా పాత్రలు, వాటి గమ్యం పూర్తిగా తేలకుండానే ఈ సిరీస్ కూడా ముగుస్తుంది. అంటే సీజన్ 3కు కథ మిగిలించుకున్నారన్న మాట. ‘పంచాయత్’ బలం అంతా దాని సహజత్వం. సున్నితత్వం. హాస్యం. మానవ నిజ ప్రవర్తనలు. వీటిని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా, రచయిత చందన్ కుమార్ గట్టిగా పట్టుకోవడంతో సిరీస్ నిలబడింది. కథ ఉత్తరప్రదేశ్లో జరిగినా లొకేషన్ అంతా భొపాల్కు దగ్గరగా తీశారు. ఆ ఊరి వాతావరణమే సగం ఆకట్టుకుంటుంది. థియేటర్ చేసిన నటులు కావడం వల్ల అందరూ పాత్రలను అద్భుతంగా పండిస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం. ఇలాంటి జీవితాలు, పాత్రలు తెలుగు పల్లెల్లో ఎన్నెన్నో ఉంటాయి. గతంలో తెలుగులో కూడా మంచి సీరియల్స్ వచ్చేవి. ఇలాంటి కథలతో తెలుగులో కూడా వెబ్ సిరీస్ వస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. పంచాయత్ చూడని వాళ్లు మొదటి సిరీస్, రెండో సిరీస్ హాయిగా చూడొచ్చు. హిందీలో మాత్రమే లభ్యం. -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: పిల్లలకు బంధాలు కావాలి
‘ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎవ్వరి మాటా వినం. కాని పిల్లలు పుట్టాక అన్నీ మెల్లగా అర్థమవుతాయి. పిల్లలకు బంధాలు కావాలి. తల్లీ తండ్రీ ఇద్దరూ కావాలి. తల్లి తరఫు ఉన్నవారూ తండ్రి తరఫు ఉన్నవారూ అందరూ కావాలి. బంధాలు లేని పిల్లలు చాలా సఫర్ అవుతారు’ అంది నీనాగుప్తా. జీవితం ఎవరికైనా ఒక్కో దశలో ఒక్కోలా అర్థం అవుతుంది. క్రికెటర్ వివ్ రిచర్డ్స్తో కుమార్తెను కన్న నీనా పిల్లల గురించి చెబుతున్న మాటలు వినదగ్గవి. ఆమె తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ గురించి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడింది. ‘వివ్ రిచర్డ్స్ (క్రికెటర్)తో నేను ప్రేమలో ఉన్నాను. పెళ్లితో సంబంధం లేకుండా బిడ్డను కనాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు ఎందరో మిత్రులు ఎన్నో రకాలుగా నాకు సలహాలు ఇచ్చారు. కాని నేను ఎవ్వరి మాటా వినలేదు. ముందుకే వెళ్లాను. మసాబా పుట్టింది. కాని సింగల్ పేరెంట్గా పిల్లల్ని పెంచడం చాలా చాలా కష్టం. ఆ విధంగా నేను మసాబాకు అన్యాయం చేశాను అని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు బంధాలు కావాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. వారి వైపు ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులు అందరూ కావాలి. మసాబాకు ఆ విధంగా తండ్రి వైపు నుంచి పెద్ద లోటును మిగిల్చాను’ అంది నటి నీనా గుప్తా. ఆమె రాసిన ‘సచ్ కహూ తో’ ఆత్మకథ మార్కెట్లో ఉంది. దాని గురించి మాట్లాడటానికి ఆమె ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’కు హాజరయ్యింది. ‘మాది తిండికి హాయిగా గడిచే కుటుంబం. కాని మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. దాని వల్ల పిల్లలుగా మేము ఎదుర్కొన్న ఇబ్బంది పెద్దగా లేకపోయినా మా అమ్మ చాలా సతమతమయ్యేది. ఆమె బాధ చూసి నాకు చాలా బాధ కలిగేది. బాల్యంలో అలాంటి ప్రభావాలు గాఢమైన ముద్ర వేస్తాయి’ అందామె. నీనా గుప్తా నటిగా పూర్తిగా నిలదొక్కుకోని రోజులవి. హటాత్తుగా వివ్ రిచర్డ్స్తో గర్భం దాల్చాను అని పత్రికలకు చెప్పి సంచలనం సృష్టించింది. 1989లో కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఎలా ఉంటుందో అని చాలా మంది ఆందోళనగా, కుతూహలంగా గమనించారు. ఇప్పుడు ఆమె నటిగా, కుమార్తె ఫ్యాషన్ డిజైనర్గా సక్సెస్ను చూస్తున్నారు. కాని ఈలోపు ఎన్నో జీవితానుభవాలు. ‘మసాబాను నెలల బిడ్డగా ఇంట్లో వదిలి నేను పనికి వెళ్లాల్సి వచ్చేది. ఒక్కోసారి షూటింగ్కి కూడా తీసుకెళ్లి షాట్కు షాట్కు మధ్యలో పాలు ఇచ్చేదాన్ని. ఆమె రంగు, రూపం... వీటిని చూసి పిల్లలు కామెంట్లు చేసేవారు. తండ్రి కనిపించేవాడు కాదు. నా కూతురుకు ఏది ఎలా ఉన్నా ‘యూ ఆర్ ది బెస్ట్’ అని చెప్తూ పెంచుకుంటూ వచ్చాను. కాని మనం ఎంత బాగా పెంచినా బంధాలు లేకుండా పిల్లలు పెరగడం ఏమాత్రం మంచిది కాదని చెప్పదలుచుకున్నాను’ అందామె. అలాగే ఒంటరి స్త్రీని సమాజం ఎంత అభద్రతగా చూస్తుందో కూడా ఆమె వివరించింది. ‘సింగిల్ ఉమెన్గా ఉండటం వల్ల నేను ఇబ్బంది పడలేదు కానీ నా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏదైనా పార్టీకి వెళ్లి ఏ మగాడితోనైనా ఐదు నిమిషాలు మాట్లాడితే ఆ మగాడి భార్య తుర్రున పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చేసేది. సింగిల్ ఉమెన్ అంటే పురుషులను వల్లో వేసుకునేవారు అనే ఈ ధోరణి అన్యాయం’ అని నవ్వుతుందామె. స్త్రీలను వారి దుస్తులను బట్టి జడ్జ్ చేయడం అనే మూస నుంచి బయడపడాలని నీనా గట్టిగా చెబుతుంది. ‘నేను ఢిల్లీలో ఎం.ఏ సంస్కృతం చదివాను. కాలేజ్కు చాలా మోడ్రన్ బట్టలు వేసుకుని వెళ్లేదాన్ని. సంస్కృతం చదువుతూ ఇలాంటి బట్టలు వేసుకుని వస్తుంది ఏమిటి అని ఏ ఆడపిల్లా నాతో మాట్లాడేది కాదు. నేను ఆ పక్కనే ఉండే మరో కాలేజ్కు వెళ్లి క్యారెమ్స్ ఆడుతూ కూచునేదాన్ని. చివరకు ఫస్ట్ ఇయర్లో నాకు మంచి మార్కులు రావడం చూసి అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు’ అందామె. ఇంకో ఉదాహరణ కూడా చెప్పింది. ‘ముంబైలో నా కెరీర్ మొదలులో రచయిత గుల్జార్, నేను రోజూ బాడ్మింటన్ ఆడటానికి కారులో వెళ్లేవాళ్లం. ఇద్దరం షార్ట్స్ వేసుకుని పక్కపక్కన కూచుని వెళ్లేవాళ్లం. ఇన్నేళ్ల తర్వాత మొన్న నేను షార్ట్స్లో ఆయన ఇంటికి వెళ్లి నా ఆత్మకథ కాపీ అందించాను. అది నెట్లో చూసి ‘హవ్వ.. గుల్జార్ గారిని కలవడానికి వెళ్లి ఈ వయసులో షార్ట్స్ వేసుకుంటావా’ అని ట్రోలింగ్. అరె.. ఏమిటిది? ఎండగా ఉంది వేసుకున్నాను... లేదా కాళ్లు బాగున్నాయని వేసుకున్నాను. మీకేంటి నొప్పి’ అంటుందామె. నీనా గుప్తాకు నటిగా ఎంత ప్రతిభ ఉన్నా ఆమెకు కమర్షియల్ సినిమాల్లోకాని పార్లల్ సినిమాల్లో కాని లీడ్ రోల్స్ రాలేదు. ‘షబానా ఆజ్మీ తన సినిమాల్లో వేసిన పాత్రలన్నీ వేయాలని నాకు ఉంటుంది. ఆర్ట్ సినిమాల్లో కూడా అన్నీ హీరోయిన్ పాత్రలు షబానా, స్మితా పాటిల్, దీప్తికి దక్కాయి. అది నాకు బాధే. కాని ఇప్పుడు నేను లీడ్ రోల్స్ చేసి హిట్స్ కొడుతున్నాను. అది ఆనందం’ అంటుందామె. నీనా గుప్తా అమెరికాలో తీస్తున్న ఒక బాలీవుడ్ సినిమాలో తెలుగు పనిమనిషిగా నటిస్తోంది. ఆమె నటించిన ‘పంచాయత్’ వెబ్ సిరీస్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ‘స్త్రీలుగా మీరు ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకండి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది గమనించుకుని యూ ఆర్ ది బెస్ట్ అనుకోండి. అదే మీ సక్సెస్మంత్ర’ అందామె. ఆమె నిజమే చెబుతోంది. అందుకే ఆమె పుస్తకం పేరు ‘సచ్ కహూ తో’. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఆమె... అగణిత మేధావి
గణితశాస్త్రంలో డెబ్భై యేళ్లుగా ప్రపంచానికి అంతుపట్టకుండా ఉన్న అత్యంత క్లిష్టమైన జరిస్కి క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్కు పరి ష్కారం సూచించారు 32 ఏళ్ల నీనా గుప్తా. అందుకుగాను ఆమె 2021 డిసెంబర్లో, ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ది రామానుజన్ ప్రైజ్’ పురస్కారానికి ఎంపికయ్యారు. కోల్కతాలో జన్మించిన నీనా గుప్తా , బెతున్ కళాశాల నుండి గణిత శాస్త్ర ఆనర్స్లో పట్టా తీసుకున్నారు. ఇప్పుడు తాను పాఠాలు బోధిస్తున్న ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఐ) సంస్థ నుంచే పీహెచ్డీ తీసుకున్నారు. తన పరిశోధనలకు గాను ఆమె ఇప్పటికే డజను అవార్డులు పొందారు. 40 ఏళ్ల లోపు ఉండే యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన రామానుజన్ అవార్డును ఇటీవలే నీనా గుప్తాకు ఇచ్చారు. అకడమిక్ రంగంలో గౌరవనీయమైన అవార్డును గెలుచుకున్న నాల్గవ భారతీయురాలు ఆమె. కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా ఉన్న ఆమె అఫైన్ ఆల్జీబ్రాక్ జ్యామితిలో, కమ్యుటేటివ్ ఆల్జీబ్రాలో చేసిన అత్యుత్తమ కృషికి, ప్రత్యేకించి అఫైన్ స్పేస్ల కోసం జారిస్కీ రద్దు సమస్యపై కనిపెట్టిన పరిష్కారం కోసం ఈ విశిష్ట బహుమతిని అందుకున్నారు. జారిస్కీ రద్దు సమస్యకు ఆమె చూపిన పరిష్కారం తనకు గతంలోనే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ 2014 యంగ్ సైంటిస్ట్స్ అవార్డును సంపాదించి పెట్టింది. 2019లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకున్నారామె. గణితం అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది అని వేద గణితం చెబుతుంది. సంఖ్యామానానికి పట్టుగొమ్మ అయిన సున్నా ఆవిష్కరణే దీనికి నిదర్శనం. ఇది ప్రపంచ గణిత శాస్త్రా నికి భారతీయుల అద్భుత కానుక. గణితం కష్టం కాదు. ఇతర సబ్జెక్టులులాగా దీన్ని కంఠస్థం చేయలేరు. మీకు గణిత భావనపై స్పష్టత ఉంటే, మీరు కూడా క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించగలరు. ప్రాక్టీస్ కీలకం, అది మినహా వేరే మంత్రం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 32 ఏళ్ల నీనా గుప్తా. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. తనకు పదేళ్ల వయసులోనే గణితశాస్త్రంతో అనుబంధం ఏర్పడింది. పదమూడేళ్లు నిండేసరికల్లా ఎస్.ఎల్. లోనీ... త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను ఆపోశన పట్టడమే కాకుండా సొంతంగా సిద్ధాం తాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ, అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించారు. శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగపడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్–తీటా ఫంక్షన్స్పై చేసిన పరిశో ధనలు చాలా ప్రసిద్ధమైనవి. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరైన శ్రీనివాసన్ రామానుజన్ పేరు మీద ఉన్న ‘రామానుజన్ అవారు’్డ నీనా గుప్తాకు రావడం పట్ల దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారు. డాక్టర్ టి. నాగయ్య వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ మొబైల్ : 97012 75354 (నేడు జాతీయ గణిత దినోత్సవం) -
Neena Gupta: లెక్కలంటే నీనాకు బొమ్మలను చూసినంత సంబరం! అందుకే ఇలా
Neena Gupta: లెక్కలు అంటే భయపడని పిల్లలు తక్కువ. అయితే తన బాల్యంలో లెక్కలు అంటే నీనాకు బొమ్మలను చూసినంత సంబరం. ఆ సంబరమే ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చింది. ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ది రామానుజన్ ప్రైజ్’ పురస్కారానికి ఎంపికైంది. ప్రతి సంవత్సరం నలభై ఐదేళ్ల వయసులోపు వారికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ–ఇండియా), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియెరిటికల్ ఫిజిక్స్ (ఐసీటిపి)లు ఈ పురస్కారం అందజేస్తాయి. మన దేశం నుంచి ఈ పురస్కారం అందుకుంటున్న నాలుగో వ్యక్తి, మహిళలలో మూడో వ్యక్తి నీనా గుప్తా. 2014లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డ్, 2019లో శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకుంది నీనా. ఆమె బడిరోజుల్లోకి వెళదాం. ఖాల్సా హైస్కూల్లో చదువుకునే రోజుల్లో తన అద్భుతమైన గణితప్రతిభ తో టీచర్లను ఆకట్టుకునేది నీనా. ‘ఈ ప్రాబ్లమ్ ఎవరు సాల్వ్ చేస్తారు?’ అని టీచర్ పిల్లల వైపు చూసేవారు. పిల్లలు మాత్రం నీనా వైపు చూసేవారు. ‘నీనా సంగతి సరే మీ సంగతి ఏమిటి?’ అడిగేవారు టీచర్. అలా అని తల గర్వంగా ఎగరేసేది కాదు నీనా. డౌట్ల మీద డౌట్లు వచ్చే పిల్లల దగ్గరకు వెళ్లి వారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పేది. జూనియర్స్ కూడా రకరకాల ‘ప్రాబ్లమ్స్’తో ఆమె దగ్గరికి వచ్చేవారు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులభంగా వారికి చెప్పేది. తరాలు మారుతున్నా... సాంకేతిక జ్ఞానం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా... చాలామంది పిల్లల్లో ‘మ్యాథ్స్ ఫోబియా’ పోవడం లేదు. ఒక వైపు తన పరిశోధనలకు టైమ్ను వెచ్చిస్తూనే అలాంటి పిల్లల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది ‘ది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్–కోల్కతా’ ప్రొఫెసర్ అయిన నీనా. ‘ఈ అంకెలను చూడండి....ఎంత అమాయకంగా ఉన్నాయో. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు!’ అని అడుగుతుంది ఆమె. పిల్లలు గట్టిగా నవ్వుతారు. ‘ఈ ప్రాబ్లమ్ను ఎంత ఈజీగా సాల్వ్ చేయవచ్చో ఒకసారి చూడండి’ అని బ్లాక్బోర్డ్ వైపు వెళుతుంది. పిల్లలో ఎక్కడిలేని ధైర్యం వస్తుంది! ‘మ్యాథ్మెటిక్స్ ఎడ్యుకేషన్ ఇన్ టైమ్స్ ఆఫ్ కోవిడ్’పై జరిగిన ఆన్లైన్ చర్చా వేదికలో విలువైన సూచనలు ఇచ్చింది. ‘ఇండియన్ వుమెన్ అండ్ మ్యాథమెటిక్స్’ అంశంపై అద్భుత ప్రసంగం చేసింది. 70 సంవత్సరాలుగా పరిష్కారం కాని ఒక గణితసమస్యను పరిష్కరించి ‘భేష్’ అనిపించుకుంది. అయితే గణితాన్ని చూసి గజగజలాడుతున్న పిల్లలు, గణితాన్నే పెద్ద సమస్య అనుకుంటున్న పిల్లలు ఉన్నారు. వారి భయాలను తొలగించి గణితం అంటే అంతులేని ప్రేమను కలిగించే పుస్తకం ఒకటి రాస్తే... తనలాంటి జీనియస్లు మరెంతోమంది వస్తారనడంలో సందేహం లేదు కదా! చదవండి: Health Tips: వాతం ఎక్కువైందా? నిద్ర పట్టడం లేదా? అయితే.. -
పెళ్లి కాకుండానే తల్లైన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..
List Of 10 Popular Actresses Who Got Pregnant Before Marriage: సినిమా ఇండస్ట్రీలో రిలేషన్షిప్లు కామనే. కొందరు ఈ రిలేషన్ను పెళ్లి దాకా కొనసాగిస్తే.. కొన్ని జంటలు మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకొని ఎవరిదారి వారు చూసుకుంటారు. అయితే మరికొంత మంది మాత్రం మాత్రం పెళ్లికి ముందే గర్భం దాల్చి పిల్లలను కన్నారు. ఈ లిస్ట్లో ఉన్న టాప్ హీరోయిన్స్ ఎవరో చూసేయండి.. శ్రీదేవి అతిలోక సుందరి శ్రీదేవి పెళ్లి కాకుండానే తల్లైంది. నిర్మాత బోనీ కపూర్తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన ఆమె కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే గర్భం దాల్చింది. పెళ్లి జరిగే సమయానికి శ్రీదేవి ఏడు నెలల గర్భవతిగా ఉండటం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లుపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సారిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొన్నాళ్ల పాటు చక్రం తిప్పన సారిక విలక్షణ నటుడు కమల్హాసన్తో ప్రేమలో పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. అలా పెళ్లి కాకుండానే వీరికి శ్రుతిహాసన్ జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ బద్రీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ ఆ సినిమా సమయంలోనే పవన్కల్యాణ్తో ప్రేమలో పడింది. జానీ సినిమా సమయంలో మరింత దగ్గరైన ఈ జంట కొన్నాళ్ల పాటు సహాజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అకీరా పుట్టిన ఐదేళ్లకు అంటే 2009 లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు. దాదాపు 12 ఏళ్ల అనంతరం వీరు విడిపోయారు. అమీ జాక్సన్ ఐ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అమీ జాక్సన్. బాయ్ఫ్రెండ్ జార్జ్తో ఎంగేజ్మెంట్ అనంతరం తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన అమీ జాక్సన్ పెళ్లకి ముందే తల్లైంది. అయితే ఇప్పటివరకు ఈ జంట ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. నీనా గుప్తా బాలీవుడ్ నటి నీనా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్తో డేటింగ్ చేసింది. ఇక ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయింది. రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఈ జంట విడిపోయారు. సింగిల్ మథర్గానే మసాబాను పెంచింది నానా గుప్తా. కల్కి కొచ్లిన్ బాలీవుడ్ నటి కల్కి కొక్లెయిన్ తొలుత దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. ఆ తర్వాత అతనితో చెడిపోవడంతో విడాకులు తీసుకుంది. తర్వాత హర్ష్ బెర్గ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయ్యింది. దియా మీర్జా బాలీవుడ్ భామ దియా మీర్జా వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే గర్భవతి కాబట్టే పెళ్లి చేసుకుంది అని అప్పట్లో దియా మీర్జాపై నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. నటాషా బాలీవుడ్ నటి నటాషా క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లికి ముందే నటాషా గర్భం దాల్చింది. -
తెరపై గర్బిణీలుగా మెప్పించిన నటీమణులు వీళ్లే..
Top 5 Actresses Who Played Pregnant Women Role: ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడూ ముందుంటారు. పలు ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ బీటౌన్ నటీమణులు తమ సొంత బ్యాంకింగ్ను ఏర్పర్చుకుంటున్నారు. మహిళా ప్రాధాన్యత చిత్రాల నుంచి బోల్డ్ క్యారెక్టర్ల వరకు పేరు తెచ్చుకుంటున్నారు. సినిమాల్లో కేవలం ఒక భాగం, సహాయక పాత్రలకు పరిమితం కాకుండా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా మంది నటీమణులు తల్లి పాత్రను పోషించారు. ఏ సంకోచం లేకుండా గర్భిణీ పాత్రలకు సైతం మొగ్గు చూపారు. ఈ గర్భిణీ స్త్రీలుగా తెరపై నటించిన బాలీవుడ్ నటీమణులు ఎవరెవరో ఓసారి చూద్దామా ! 1. నుష్రత్ భరుచ్చా (ఛోరీ) హిందీలో వస్తున్న హార్రర్ మూవీ 'ఛోరీ'లో నుష్రత్ భరుచ్చా గర్భిణీగా నటించారు. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. సినిమా షూటింగ్కు సుమారు 25 రోజుల ముందు 'గర్భిణీ బాడీసూట్'ను ధరించడం ప్రారంభించారు. ఈ విషయంపై ఆమె 'ఇప్పుడు నిజ జీవితంలో నేను గర్భివతిని కాలేను. కాబట్టి, ఒక బిడ్డను మోసే స్త్రీ ఎలా ఉంటుంది. ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఏం అనుభవిస్తుందో తెలుసుకోడానికే ఆ బాడీసూట్ను తయారు చేసుకున్నాను. గర్భిణీలకు వచ్చే సమస్యలను తెలుసుకోడానికి సినిమా షూటింగ్ ప్రారంభానికి 20-25 రోజుల ముందు ఆ బాడీసూట్ను ధరించాను. దాంతోనే తినడం, పడుకోవడం, బాత్రూమ్కు వెళ్లడం, చుట్టూ తిరగడం చేశాను.' అని తెలిపారు. 2. విద్యా బాలన్ (కహానీ) భారతీయ చలనచిత్ర రంగంలో మహిళల చిత్రీకరణలో మార్పు తీసుకురావడానికి పేరుగాంచిన నటి విద్యా బాలన్. 'కహానీ' చిత్రంలో గర్భిణీగా నటించి.. అందరి మెప్పు పొందారు. ఇందులో ప్రొస్తెటిక్ బేబీ బంప్ను ధరించి నటించారు విద్యా బాలన్. ఆమె ఎంతో చక్కగా, పరిపూర్ణతో ఆ పాత్రను పోషించారు. ప్రేక్షకులను కంటతడి పెట్టించి, విమర్శకుల ప్రశంసలు పొందారు. ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా పొందారు. దీనికి రీమెక్గా తెలుగులో నయనతార హీరోయిన్గా 'అనామిక' రూపొందించారు. కానీ అందులో ఆమెను గర్భిణీ పాత్రలో చేయలేదు. 3. నీనా గుప్తా (బధాయి హో) 2018లో నటి నీనా గుప్తా, అమిత్ శర్మతో కలిసి 'బధాయి హో' సినిమాలో యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో ఆమె 50 ఏళ్ల గర్భిణీ పాత్రను పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఒకటిగా మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాకు. 'పూర్తి వినోదాత్మకంగా అత్యంత ప్రజాధారణ పొందిన ఉత్తమ చిత్రం' విభాగంలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. 4. కరీనా కపూర్ ఖాన్ (గుడ్ న్యూస్) గుడ్ న్యూస్ సినిమాలో దీప్తి బాత్రాగా కరీనా కపూర్ పాత్ర 21వ శతాబ్దపు మహిళలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె ఒక స్వతంత్ర, స్వయం సమృద్ధి గల వ్యక్తి పాత్రను పోషించారు. ఆమె కూడా బిడ్డను కలిగి ఉండాలని కోరుకునే అమ్మాయి కథ. తెరపై గర్భిణీ స్త్రీ పాత్రను వివరిస్తూ, గర్భధారణ సమయంలో స్త్రీ పడే కష్టాలు, ప్రభావాలు తెలిసేలా చక్కగా నటించారు. అందులో కియారా అద్వానీ కూడా గర్భిణీ పాత్రలో కనిపించారు. 5. కృతి సనన్ (మిమి) 'మిమి' చిత్రంలో కృతి సనన్ ఒక సరోగసి తల్లి పాత్రలో నటించారు. ఈ పాత్రతో ఆమె నటనకు మంచి బ్రేక్ వచ్చింది. ఎంతో పరిణితీ ఉన్న నటిగా ఆమె నిరూపించుకుంది. ఆ పాత్ర కోసం కృతి సనన్ సుమారు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. -
పెళ్లైన మగాడిని ప్రేమించారంటే..: నటి
బాలీవుడ్ నటి నీనా గుప్తా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది. ఒక పుస్తకంలో చదివిన వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే కళ్లకు మస్కారా పెట్టుకోవద్దు.. ఈ లైన్ చాలా బాగుంది కదూ.. నేనేం చెప్తున్నానో మీకీపాటికే అర్థం అయి ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అవును, పెళ్లైన మగాళ్లను ప్రేమిస్తే మిగిలేవి కన్నీళ్లేనంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి పెళ్లైన మహిళలను ప్రేమిస్తే? పరిస్థితి ఏంటి? అని మరికొందరు అనుమానాలు లేవనెత్తుతున్నారు. నీనా ఇచ్చిన సలహా బాగుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా నీనా గతంలో ఇదివరకే పెళ్లైన వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్ను ప్రేమించింది. వీరి ప్రేమకు గుర్తుగా మసాబా గుప్తా జన్మించింది. కానీ రిచర్డ్ నీనాను పెళ్లి చేసుకోలేను అని చెప్పాడు. సింగిల్ పేరెంట్గానే మసాబాను పెంచి పెద్ది చేసింది నీనా. View this post on Instagram A post shared by Neena Gupta (@neena_gupta) -
చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యా.. ఎవరికీ తెలియకుండా ఏడ్చా: నటి
చిన్న పిల్లలపై లైగింక వేధింపులు జరుగుతున్న ఉదంతాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఇలా బలపోయిన వారిలో ఎంతో మంది బయటికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. ఇలాంటి వాటికి సెలబ్రిటీలు సైతం అతీతులు కాదు. తాజాగా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని వెల్లడించింది బాలీవుడ్ నటి నీనా గుప్తా. సర్దార్ కా గ్రాండ్ సన్, పంగ, సందీప్ ఔర్ పింకీ పరార్, ముల్క్, బదాయిహో వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నీనా గుప్తా. తాజాగా ‘సచ్ కహు తో’ అనే పేరుతో ఆటో బయోగ్రఫీని విడుదల చేసింది. అందులో ఎన్నో వ్యక్తిగత, వృత్తిగత విషయాల గురించి చర్చించింది. పసి వయస్సులో ఓ డాక్టర్, టైలర్ లైంగికంగా వేధించిన విషయాన్ని అందులో రాసుకొచ్చింది. ‘నా సోదరుడితో కలిసి కళ్ల ఇన్ఫెక్షన్కు ట్రిట్మెంట్ కోసం ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అతను నా బ్రదర్ని వెయిటింగ్ రూమ్లో ఉండమని చెప్పి.. నా కళ్లను చెక్ చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తూనే కొద్ది సేపు తర్వాత ఇతర పార్ట్పై చేయి వేయడం ప్రారంభించాడు. దీంతో భయంతో వణికిపోయిన నేను ఇంటికి వచ్చి ఎవరికీ తెలియకుండా ఏడ్చాను. అలాగే ఇంకోసారి ఓ టైలర్ దగ్గరికి వెళ్లగా ఇలాగే జరిగింది. ఈ విషయాలను మా అమ్మకు చెప్పలేదు. ఎందుకంటే వాటికి కారణం నేనే అంటుందని. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇలాంటి విషయాలను కచ్చితంగా పెద్దలకు చెప్పేలా పిల్లలను ప్రోత్సాహించాలి’ అని నీనా పేర్కొంది. అంతేకాకుండా ఇలాంటి ఎంతో మంది తన ఫ్రెండ్స్తో ఎక్స్పీరియన్స్ చేసినట్లు తెలిపింది. చదవండి: విక్కీతో కత్రినా టైట్ హగ్.. వీడియో వైరల్ -
పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి
నీనా గుప్తా.. నటనకు నిర్వచనం! వివియన్ రిచర్డ్స్.. క్రికెట్ సంచలనం! ఆమె అతని ఫ్యాన్.. అతని జీవన సహచరిగా కూడా కావాలనుకుంది.. కుదరలేదు.. ఆ వైఫల్యం మనసు నిండా బాధను నింపింది.. ఆ ప్రేమ ఇచ్చిన గుర్తును గుండెకు హత్తుకొని ముందుకు సాగింది.. అలా మొదలైంది.. 1980ల నాటి సంగతి.. ఇండియాతో సిరీస్ ఆడ్డానికి వెస్ట్ ఇండీస్ టీమ్ ఇక్కడికి వచ్చింది. ఆ సమయంలో వెస్ట్ ఇండీస్ టీమ్ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్. ఆటగాడిగా ఎంత ఫేమస్సో లేడీస్ మన్గానూ అంతే పాపులర్. మ్యాచ్ షెడ్యూల్లో భాగంగా ముంబై చేరుకుందా టీమ్. ఒకరోజు పేజ్ త్రీ పార్టీకి హాజరయ్యాడు రిచర్డ్స్. ఆ పార్టీకి నీనా గుప్తా కూడా వచ్చింది. రిచర్డ్స్ అంటే వెర్రి అభిమానం ఆమెకు. అక్కడ అతను కనిపించేసరికి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అంతలోనే నీనా సన్నిహితులు ఆమెను రిచర్డ్స్కు పరిచయం చేశారు ‘మీ అభిమాని’ అంటూ. తనను చూసినప్పుడు నీనా కళ్లల్లో మెరిసిన మెరుపు అతణ్ణి కట్టిపడేసింది. నీనా అభిమానం ఆమె ముందు నుంచి కదలనివ్వకుండా చేసింది. ఆ ఇద్దరి మధ్య స్నేహం ఇంకా నిలదొక్కుకోకముందే ఆకర్షణ ఆ జంటను ప్రేమలోకి తోసింది. అప్పటికే రిచర్డ్స్ ఇద్దరు పిల్లల తండ్రి కూడా.. రిచర్డ్స్ అప్పటికే వివాహితుడు.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా! ‘నువ్వంటే ఇష్టం.. నిన్ను ప్రేమిస్తున్నాను’ అని నీనా అన్నప్పుడే తనకు పెళ్లయిన విషయం చెప్పేశాడు అని అంటారు ఆ జంట లవ్ స్టోరీ తెలిసిన సన్నిహితులు. అయినా నీనా .. రిచర్డ్స్ ప్రేమను ఆస్వాదించింది. సిరీస్ అయిపోయాక రిచర్డ్స్ స్వదేశం వెళ్లిపోయాడు. షూటింగ్స్ లేని ఖాళీ సమయాలను రిచర్డ్స్తోనే వెచ్చించింది.. అతని దేశంలో. ఆ సమయంలో రిచర్డ్స్ తన భార్యకు దూరంగా.. విడాకుల ఆలోచనలో ఉన్నాడని.. అయినా నీనా, రిచర్డ్స్ల మధ్య పెళ్లి ప్రస్తావన రాలేదని అప్పటి మీడియాలో వార్త. రిచర్డ్స్ ప్రేమలో ప్రపంచాన్ని మరచిపోయింది. ఆ సంతోషంలో ఆమె గ్రహించిన విషయం.. తాను తల్లిని కాబోతున్నానని. సంబరపడాల్సిందే కానీ.. పెళ్లి కాకుండా .. కరెక్ట్కాదు.. అన్నారు నీనా కుటుంబ పెద్దలు. మసాబా పుట్టింది.. రిచర్డ్స్ నుంచి ఏదైనా అనుకూలమైన నిర్ణయం వస్తుందేమోనని చూసింది నీనా. రాలేదు.. ‘పెళ్లి చేసుకోలేను’ అనే మాటను మార్చలేదు రిచర్డ్స్. అది నీనా మనసును కష్టపెట్టింది. అతని తీరు చూసి నీనా స్నేహితులూ హెచ్చరించారు..‘నువ్వు నీ గురించే ఆలోచించుకుంటున్నావ్ తప్ప పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించట్లేదు. పుట్టబోయే ఆ బిడ్డను సఫర్ చేయడం తప్ప నువ్వేం సాధించలేవు’ అని. వినలేదు నీనా. బిడ్డను కనాలనే తీర్మానించుకుంది. మసాబా పుట్టింది. సింగిల్ పేరెంట్.. ఒంటరి తల్లిగానే మసాబాను పెంచింది. ఆ ప్రయాణంలో నీనా తండ్రి ఆమెకు అండగా ఉన్నాడు. అయినా చాలా సమస్యలు ఎదుర్కున్నారు ఇటు నీనా.. అటు మసాబా కూడా. 42ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమ పండిట్ జస్రాజ్ కొడుకు శారంగ్దేవ్ పండిట్ నీనాతో ప్రేమలో పడ్డాడు. నిశ్చితార్థమూ జరిగింది. కానీ ఎందుకో అది పెళ్లిదాకా రాలేదు. దాంతో నీనా చాలా కుంగిపోయింది. ఇంక పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ.. తన 42వ ఏట.. అంటే 2002లో ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మిశ్రా.. నీనాతో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లు కొనసాగిన ఆ ప్రేమ 2008లో పెళ్లిగా మారింది. ఆ వైవాహిక బంధం సంతోషంగా సాగిపోతోంది. ఒకసారి ముంబై మిర్రర్ ప్రతినిధి నీనా గుప్తాను ‘గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల్లో దేని గురించైనా పునరాలోచించాల్సివస్తే దేన్ని పరిగణనలోకి తీసుకుంటారు?’ అని అడిగితే.. ‘పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది. ప్రతి బిడ్డకు తల్లి, తండ్రి ఇద్దరి ఆప్యాయత, సంరక్షణ అత్యంతవసరం. సింగిల్ పేరెంట్గా నేను ఏలోటు రానివ్వకుండా మసాబాను పెంచినా చెంత తండ్రి లేకుండా తనెంత సఫర్ అయిందో నాకు తెలుసు’ అని చెప్పింది. నాకు అమ్మ, నాన్న ఇద్దరి పట్లా అంతే ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇద్దరు ఎవరికి వారే గొప్ప వాళ్లు. నా చిన్నప్పుడు నాన్నతో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. ఆయనతో మేము, మాతో ఆయన ఉండిపోలేదు కానీ సెలవుల్లో మాత్రం నాన్న దగ్గరకు వెళ్లి ఆయనతో గడిపేవాళ్లం. – మసాబా గుప్తా జీవితంలో నాకు రిగ్రెట్స్ ఉన్నాయి. పెళ్లి కాకుండా బిడ్డను కనేకంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సింది. అలా చేసుంటే నా జీవితం ఇలా ఇన్ని మలుపులు తిరిగుండకపోయేది! – నీనా గుప్తా ‘సచ్ కహూ తో’ అనే తన ఆత్మకథలో నిర్భయంగా, నిజాయితీగా చాలా విషయాలనే రాసింది నీనా గుప్తా. ∙ఎస్సార్ చదవండి: శిల్పా శెట్టి, రాజ్కుంద్రాలపై పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు 'స్పిరిట్'కు ప్రభాస్ రికార్డు స్థాయి పారితోషికం! -
గుండె బద్దలైపోయింది.. ఇది నమ్మలేకపోతున్నాను :నటి
చిన్నారి పెళ్లికూతుర(బాలికా వధు)ఫేమ్ సురేఖ సిఖ్రి మృతిపై సీనియర్ నటి నీనా గుప్తా స్పందించారు. సిఖ్రి ఇక లేరన్న విషయం తెలిసి గుండె బద్దలైపోయింది. ఇది నమ్మలేకపోతున్నాను. ఆమెతో బధాయి హో అనే సినిమాలో కలిసి నటించాను. షూటింగ్ బ్రేక్లో చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. స్పాట్లో రెగ్యులర్గా కలిసే తినేవాళ్లం. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. సిఖ్రి మరణవార్త జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది అంటూ నీనా గుప్తా ఎమోషనల్ అయ్యారు. 2018లో వచ్చిన బధాయి చిత్రం ఘన విజయం సాధించింది. ఈ మూవీలో సురేఖ సిఖ్రి నీనా గుప్తాకు అత్తగా నటించారు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) గుండెపోటుతో శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి ఈ ఉదయం తుదిశ్వాస విడిచింది. 'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు సంపాదించుకుంది. -
సినిమాల్లోకి రాకముందే పెళ్లి.. ఏడాదిలోపే విడిపోయాం: నటి
బాలీవుడ్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా కంటే కూడా ఆత్మవిశ్వాసం మెండుగా కల మహిళగానే ఆమెకు గుర్తింపు ఎక్కువ. దాదాపు 20 ఏళ్ల క్రితమే సింగిల్ పేరెంట్గా మారి.. తల్లీతండ్రి తానే అయి మసాబా గుప్తాను పెంచారు. తాజాగా విడుదలైన నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహూ తో’ సినీ అభిమానులతో పాటు సామాన్యులను కూడా బాగా అలరించింది. తన కుటుంబ సభ్యులకు తప్ప బయటి వారికి తెలియని తన జీవిత విశేషాలను దీనిలో వెల్లడించారు నీనా గుప్తా. మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో సహజీవనం కంటే ముందే అంటే సినిమాల్లో రాకముందే తనకు వివాహం అయ్యిందని.. కానీ ఆ బంధం ఏడాది పాటు కూడా నిలవలేదని తన ఆత్మకథలో వెల్లడించారు నీనా గుప్తా. ఆ వివరాలు.. ‘‘నా మొదటి భర్త పేరు అమ్లాన్ కుమార్ ఘోస్. మేమిద్దరం ఓ ఇంటర్ కాలేజ్ ఇవేంట్లో కలుసుకున్నాం. ఆ పరిచయం అలా పెరిగి ప్రేమగా మారింది. అప్పుడు అమ్లాన్ ఢిల్లీ ఐఐటీలో చదవుతుండేవాడు. నేను డిగ్రీ చదువుతున్నాను. మేం ఎక్కువగా ఢిల్లీ ఐఐటీ పరిసరాల్లో కలుసుకునేవాళ్లం. చాలా రోజుల పాటు మా ప్రేమ గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాం’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. ‘‘కానీ కొన్నాళ్ల తర్వాత మా ప్రేమ గురించి మా అమ్మకు చెప్పాను. ఆమెకు ఈ విషయం ఏమాత్రం నచ్చలేదు. అప్పటి నుంచి నన్ను మరింత కంట్రోల్ చేయడం ప్రారంభించింది. ఓ సారి అమ్లాన్ తన స్నేహితులతో కలిసి శ్రీనగర్ వెళ్తున్నాడు. వారితో నేను వెళ్లాలని భావించాను. కానీ మా అమ్మ అందుకు ఒప్పుకోలేదు. అతడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్లు అన్నది. అప్పటికే మాపై నిఘా ఎక్కువ్వయ్యింది. వీటన్నింటిని భరించే బదులు వివాహం చేసుకోవడం మేలని భావించాం’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. ‘‘నేను బెంగాలీ అమ్మాయిని కాకపోవడంతో అమ్లాన్ తల్లిదండ్రులు, బంధువులు మా వివాహానికి అంగీకరించరని మాకు తెలుసు. వారికి మా పెళ్లి గురించి చెప్పలేదు. అందుకే నా కుటుంబ సభ్యులు, మా ఇద్దరి స్నేహితుల సమక్షంలో ఆర్మ సమాజ్లో వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత మేం రాజేంద్ర నగర్లో ఓ చిన్న ఇంటికి మారం. అమ్లాన్ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. నేను డిగ్రీ పూర్తి చేసి ఢిల్లీ యూనివర్శిటీలో సాంస్క్రిట్లో మాస్టర్ డిగ్రీ చేయడానికి జాయిన్ అయ్యాను’’ అన్నారు నీనా గుప్తా. ‘‘కానీ తర్వాత నాకు నాటకాలవైపు మనసు మళ్లింది. థియేటర్ యాక్టర్ కావాలని కలలు కన్నాను. నటన మీద నాకున్న ఆసక్తి అప్పుడే నాకు తెలిసింది. కాకపోతే దురదృష్టం కొద్ది అమ్లాన్ ఆలోచలను ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తను కేవలం ఇంటిని, తనను బాగా చూసుకునే భార్య కావాలని కోరుకున్నాడు. నేను ఇంటి పట్టునే ఉండి, తనను చూసుకోవాలని ఆశించాడు. దాంతో మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి’’ అని రాసుకొచ్చారు నీనా గుప్తా. ‘‘పెళ్లైన ఏడాదిలోపే మా ఇద్దరి దారులు వేరని మాకు అర్థం అయ్యింది. మేం కలిసి ఉండలేమని కూడా తెలిసింది. దాంతో విడిపోయాం. అమ్లాన్ అంకుల్ ఒకరు మా విడాకుల విషయంలో సాయం చేశారు. నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాను. ఆ తర్వాత నటిగా మారడం, రిచర్డ్స్తో ప్రేమ, సహజీవనం, మసాబా జననం జరిగిపోయాయి. నేను, అమ్లాన్ ఎప్పుడు పెద్దగా అరుచుకుని గొడవపడలేదు.. ఒకరి మీద ఒకరం ఆరోపణలు చేసుకోలేదు. స్నేహపూర్వకంగానే విడిపోయాం. తను చాలా మంచి వ్యక్తి’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. -
నీనా గుప్తా ఆత్మకథ..‘నిజం చెప్పాలంటే’
తన జీవితాన్నితాను ఇష్టపడినట్టుగా జీవించడానికి తన మార్గాన్ని కొనసాగించడానికి ఎప్పుడూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన నటి నీనా గుప్తా తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ వెలువరించింది. సినిమా అభిమానుల కంటే స్త్రీలు తప్పక చదవాల్సిన ఆత్మకథ కావచ్చు ఇది. పెంగ్విన్ సంస్థ ఇటీవల ప్రచురించిన నటి నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహూ తో’ (నిజం చెప్పాలంటే) సినిమా అభిమానులను, పాఠకులను కుతూహల పరుస్తోంది. అందులో నీనా గుప్తా తన జీవితంలోని అనేక అంశాలను ‘దాదాపుగా నిజాయితీ’తో చెప్పే ప్రయత్నం చేసిందని విమర్శకులు అంటున్నారు. అందులో కొన్ని విశేషాలు: సతీష్ కౌశిక్తో పెళ్లి ‘నటుడు సతీష్ కౌశిక్ నాకు కాలేజీ రోజుల నుంచి తెలుసు. స్నేహితుడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేను చేరడానికి కారణం అతడే. ముంబైలో నాకు అండా దండగా ఉండేవాడు. నేను వివియన్ రిచర్డ్స్తో గర్భం దాల్చి మసాబాకు జన్మనిచ్చాక సతీష్ ‘నన్ను పెళ్లి చేసుకో. నీ బిడ్డకు తండ్రిగా నా పేరు ఉంటుంది’ అన్నాడు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సింగిల్ మదర్గా నేను, తండ్రి లేని పిల్లగా నా కూతురు మనలేరు అని అతడు నా కోసం బాధ పడ్డాడు.’ అని రాసింది నీనా. బయటపడ్డ ప్రాణాలు ‘మసాబా పుట్టిన మూడు నెలలకే నేను పని చేయడం మొదలెట్టాను. ది స్వోర్డ్ ఆఫ్ టిపూ సుల్తాన్ సీరియల్లో చిన్న పాత్ర దొరికింది. అది చేస్తున్నప్పుడే సెట్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. సంజయ్ ఖాన్ సకాలంలో స్పందించి మంటలార్పే ప్రయత్నంలో తనూ సగం కాలిపోయాడు. సెట్ బయట మసాబా ఉందప్పుడు. తనకు ఆరోగ్యం బాగలేదు. ఎలా ఉందో చూద్దామని నేను బయటకు వెళ్లినప్పుడే ప్రమాదం జరగడంతో బతికిపోయాను. ఆ ప్రమాదంలో 55 మంది చనిపోయారు’ అని రాసిందామె. సుభాష్ ఘాయ్ ‘చోలీ’ ‘ఖల్ నాయక్ సినిమాలో చోలీ కే పీఛే క్యాహై పాటలో నేను, మాధురి నటించాలి. నాకు రాజస్థాని డ్రస్ వేసి తీసుకువెళ్లి చూపించారు. ఆయనను నన్ను చూసి హతాశుడై ‘నో.. నో.. ఏదైనా కొంచెం నింపి తీసుకురండి’ అన్నాడు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అతడు నా వక్షం నిండుగా ఉండాలని సూచించాడు. ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు. దర్శకుడిగా తనకు ఏది కావాలో ఆ ఊహకు తగినట్టుగా నేను ఉండాలనుకున్నాడు. ఆ రోజు షూటింగ్ జరగలేదు. మరుసటి రోజు ప్యాడెడ్ బ్రా వేసి నా కాస్ట్యూమ్స్ సిద్ధం చేశారు. అప్పుడు అతను సంతృప్తి చెందాడు. మంచి దర్శకుడు రాజీపడడు. సుభాష్ ఘాయ్ అందుకే మంచి దర్శకుడు’ అని రాసిందామె. ఇలాంటివే అనేక విశేషాలు ఆమె ఆత్మకథలో ఉన్నాయి. ∙ -
సేల్స్గర్ల్గా మారిన నటి!: నీనా గుప్తా అసహనం..
బాలీవుడు సీనియర్ నటి నీనా గుప్తా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తన గురించి వచ్చిన ఓ ఫేక్ ఆర్టీకల్ గురించి తాజాగా గుర్తు చేసుకున్నారు. కాగా ‘సచ్ కహున్ తో’ అనే పేరుతో నినా స్వయంగా తన ఆత్మకథను రాసుకున్న సంగతి తెలిసిందే. ఈ బుక్ను ఇటీవల ఆమె విడుదల చేశారు. ఈ బయోగ్రఫి ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఆత్మకథకు సంబంధించిన విషయాలపై ముచ్చటించారు. ఈ నేపథ్యంలో కేరీర్ ప్రారంభంలో సేల్స్గర్ల్గా పని చేసినట్లు వచ్చిన తప్పుడు ఆర్టికల్ చదివి షాకయ్యానని చెప్పారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నా గురించి ఎన్నో సార్లు తప్పుడు వార్తలు వచ్చాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ మ్యాగజైన్లో శ్యామ్ ఆహుజా షాప్లో నేను సేల్స్గర్ల్గా చేరినట్లు తప్పుగా రాసినట్లు నాకు ఇప్పటికి గుర్తుంది. అయితే ఆ సమయంలో నాకు నిజంగా శ్యామ్ ఆహుజా ఎవరో తెలియదు. ఆ ఆర్టికల్ చదివాక నా స్నేహితులను అడిగాను. అప్పుడు వారు ఆయన ఓ వ్యాపారవేత్త అని ఆయనకు ఓ కార్పెట్ షాప్ ఉందని చెప్పారు. అది విని నేను షాక్ అయ్యాను. అలాంటి తప్పుడు వార్తలు ఎలా రాస్తారో అర్థం కాదు. నేను ఎందుకు ఆయన షాప్లో పని చేస్తాను’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. అలాగే తను సినిమాలకు ఎందుకు దూరమయ్యారో కూడా చెప్పారు. ‘నేను నా జీవితంలోకి ఓ తప్పుడు వ్యక్తిని ఆహ్వానించాను. అది నా ప్రొఫెషనల్ లైఫ్పై ప్రభావం చూపింది. అందుకే నటిగా సక్సెఫుల్ కెరీర్లో ఉన్నప్పటికి నటనను ఆపేశాను’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె నేటి తరం యువతులకు ఓ సందేశం కూడా ఇచ్చారు. ఎప్పుడు మీ పని మీదే దృష్టి పెట్టండని, పురుషులపై పెట్టకండి అంటూ సలహా ఇచ్చారు. ఓ ఒంటరి మహిళ తన కూతురు(మసాబా) పెంచడంతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, సినీ పరిశ్రమలో నటిగా ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి నీనా గుప్తా తన ఆత్మకథలో వివరించారు. చదవండి: పాచిపని అయినా చేద్దామనుకున్నా: నటి -
నా ఆటోబయోగ్రఫీ ఇచ్చాను.. ఆయన భయపడ్డారు: సీనియర్ నటి
ముంబై: సినీ గేయ రచయిత గుల్జార్ను కలిసి తన జీవతచరిత్రను అందజేసినట్లు సీనియర్ నటి నీనా గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖంపై నవ్వుతో పాటు, కాస్తంత భయాన్ని కూడా చూశానని సరదాగా వ్యాఖ్యానించారు. నీనా గుప్తా జీవితం సంచలనాలకు కేంద్ర బిందువు అన్న సంగతి తెలిసిందే. విండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో సహజీవనం ఆమె.. పెళ్లికాకముందే ఆయన బిడ్డకు జన్మనిచ్చారు. పాపకు మసాబాగా నామకరణం చేసి ఒంటరిగానే ఆమె బాధ్యతలు స్వీకరించి, తనను పెంచి పెద్ద చేసి.. డిజైనర్గా స్థిరపడేలా ప్రోత్సాహం అందించారు. ఈ క్రమంలో నీనా పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు కూడా. ఇక బాలీవుడ్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నీనా గుప్తా.. ఇటీవలే తన ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూ తో’ను విడుదల చేశారు. తన జీవితంలోని ముఖ్య విషయాలన్నింటినీ ఇందులో లిఖించుకున్న ఆమె.. తన ప్రియమైన వ్యక్తులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని గుల్జార్ నివాసంలో ఆయనను కలిసిన నీనా గుప్తా.. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాలో షేర్ చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గేటు బయటే గుల్జార్ను కలిసిన ఆమె.. ‘‘ చదివి ఎలా ఉందో చెప్పండి.. నిజం చెప్పాలంటే ఆయన సంతోషించారు.. అలాగే భయపడ్డారు కూడా’’ అంటూ సరదా క్యాప్షన్ జతచేశారు. అందుకే నాపై ఆయన అరిచారు.. తన ఆటోబయోగ్రఫీలో ఎన్నెన్నో విషయాలు వెల్లడించిన నీనా గుప్తా.. దర్శకుడు సుభాష్ ఘాయ్పై ప్రశంసలు కురిపించారు. ఖల్నాయక్ సినిమాలో చోళీ కే పీచే క్యా హై పాట కోసం.. నిండుగా కనిపించాలంటూ అరిచిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘నా అవుట్ఫిట్ చూసి ఆయన పెద్దగా అరిచారు. పాట అర్థానికి తగ్గట్టుగా వక్షస్థలం నిండుగా కనిపించేలా చూసుకోమని సూచించారు. ఆ మాట వినగానే నాకు ఏదోలా అనిపించింది. కానీ ఆలోచిస్తే నిజమే కదా.. అనిపించింది. మరుసటి రోజు.. లోదుస్తులతో ఆ ఖాళీని పూడ్చి షూట్కు వెళ్లాను. చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకుంటారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. అందుకే గొప్ప డైరెక్టర్ గుర్తింపు పొందారు’’ అని రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Neena Gupta (@neena_gupta) చదవండి: సౌత్ నిర్మాత రాత్రంతా గదిలో ఉండమన్నాడు : నటి -
సౌత్ నిర్మాత రాత్రంతా గదిలో ఉండమన్నాడు : నటి
బాలీవుడ్ నటి నీనా గుప్తా తన బయోగ్రఫీ 'సచ్ కహున్ తో'లో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. పెళ్లి, విడాకులు, పెళ్లికి ముందే గర్భం దాల్చడం, కెరీర్లో ఆటంకాలు, ఒంటరి తల్లిగా తాను ఎదుర్కొన్న చీదరింపులు, సమస్యల సుడిగుండాలు, వాటిని ఎదుర్కొన్న తీరు.. ఇలా అన్నింటినీ ఏకరువు పెట్టింది. అలాగే ఇండస్ట్రీలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్కు గురయ్యానని సంచలన విషయాన్ని బయటపెట్టింది. దక్షిణాది చిత్రాల నిర్మాత ఒకరు నన్ను హోటల్కు ఆహ్వానించారు. అది ముంబైలోని పృథ్వీ థియేటర్కు దగ్గర్లోనే ఉంటుంది. అప్పటికే షూటింగ్లో ఉన్న నేను ఆరోజు షెడ్యూల్ పూర్తవగానే నిర్మాతకు ఫోన్ చేశాను. అతడు తన గదిలోకి రమ్మని పిలిచాడు. నా మనసెందుకో కీడు శంకించింది. మీరే లాబీలోకి రావచ్చు కదా అని అడిగాను. ఆయన ఒప్పుకోలేదు. దీంతో నేనే మెట్లెక్కుతూ పైన అతడి గదిలోకి వెళ్లాను. అక్కడ సోఫాలో కూర్చోగానే అతడు ఉపన్యాసం ప్రారంభించాడు' 'ఎంతోమంది తారలను దక్షిణాది ఇండస్ట్రీకి పరిచయం చేశానని బీరాలు పలికాడు. నాకో మంచి పాత్ర ఇవ్వబోతున్నా అంటూ ఆ పాత్ర వివరాలు చెప్పాడు. కానీ అది చాలా చిన్న పాత్ర అని అర్థమై నిరాసక్తిగా అక్కడి నుంచి వెళ్లిపోతాను అని చెప్పాను. దీంతో అతడు అదేంటి? ఈరోజు రాత్రికి నాతో ఉండవా? అని అడిగాడు. ఆ మాట వినగానే బకెట్ ఐస్ వాటర్ నా నెత్తిన గుమ్మరించినట్లనిపించింది. నా రక్తం గడ్డకట్టుకుపోయింది. ఇంతలో అతడు నా బ్యాగు తీసుకుని చేతిలో పెడుతూ బిందులో బలవంతం ఏమీ లేదు.. అని చెప్పాడు. వెంటనే పరుగు లంకించుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను' అని నీనా చెప్పుకొచ్చింది. చదవండి: గర్భవతిగా ఉన్నా పెళ్లి చేసుకుంటానన్నాడు: నటి ‘రామాయణ్’ ఫేమ్ చంద్రశేఖర్ కన్నుమూత -
గర్భవతిగా ఉన్నా పెళ్లి చేసుకుంటానన్నాడు: నటి
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె జీవితం సినిమా స్టోరీకి తీసిపోదు. తెరమీద ఎంత అందంగా వెలిగిపోయారో.. నిజ జీవితంలో అంతకు మించిన ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సింగిల్ పేరెంట్స్ని ఇప్పటికి వింతగా చూస్తారు మన సమాజంలో. అలాంటిది ఆమె 90లలోనే సింగిల్ పేరెంట్గా మారారు. మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో సహజీవనం చేశారు. ఇక ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయారు. ఆ తర్వాత మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. ఈ క్రమంలో నీనా గుప్తా తన ఆత్మకథ ‘సచ్ కహున్ తో’లో తాను గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...‘‘గర్భవతిగా ఉన్నప్పుడు ఒకసారి నా స్నేహితుడు సతీష్ కౌశిక్ నా దగ్గరకు వచ్చాడు. ‘‘దీని గురించి ఏం బాధపడకు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పుట్టబోయే బిడ్డ మన బిడ్డ అవుతుంది. తను నీలా తెల్లగా పుడితే ఇబ్బంది లేదు. అలా కాకుండా డార్క్ కలర్లో ఉంటే.. నా పోలిక అని చెప్పవచ్చు. అప్పుడు ఎవరు అనుమానించరు’’ అన్నాడు’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. సతీష్ కౌశిక్, నీనా గుప్తా ఇద్దరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రోజుల నుంచి స్నేహితులు. అయితే సతీష్ ప్రతిపాదనను తిరస్కరించారు నీనా. ఆ తర్వాత 2008లో నీనా గుప్తా ఢిల్లీకి చెందిన అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు. తనకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక అంశాలను తన బయోగ్రఫీలో వెల్లడించారు నీనా గుప్తా. ఇక పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో ఇండస్ట్రీ తనను చెడుగా చూసేదని చెప్పారు. ఆ ప్రభావం తన కెరీర్ మీద కూడా పడిందని వివరించారు. ఫలితంగా తనకు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఇచ్చేవారని వెల్లడించారు. 2018 నుంచి తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత బదాయి హో, వీరి దే వెడ్డింగ్ ముల్క్ వంటి చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతి నిండా ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు నీనా గుప్తా. చదవండి: నిజం చెప్పాలంటే.. -
పాచిపని అయినా చేద్దామనుకున్నా: నటి
కూతురిని ప్రయోజకురాలిని చేసి సింగిల్ మదర్గా జీవించగలనని నిరూపించింది బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా. అయితే ఇందుకు తన తల్లే కారణమంటోంది. స్వతంత్రంగా ఎలా బతకగలమనేది తల్లి నుంచే నేర్చుకున్నాననంటోంది. తనను పెంచి పెద్ద చేయడానికి పాచిపని చేసేందుకైనా సిద్ధపడ్డాను కానీ ఎవరినీ సాయం కోసం చేయి చాచి అడగలేదని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో నీనా గుప్తా మాట్లాడుతూ.. 'నేను ఎవరి మీదా ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాను. అది డబ్బు విషయమే కావచ్చు, మరేదైనా కావచ్చు. పొట్టకూటి కోసం ఏ పని చేసినా అందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని నా తల్లి దగ్గర నేర్చుకున్నాను. ఇళ్లు ఊడ్వడం, అంట్లు తోమడం సహా ఎలాంటి పనులు అయినా చేస్తాను కానీ ఎవరి దగ్గరా పైసా అడగకూడదనుకున్నా. ఆఖరికి నా కుటుంబం, స్నేహితుల దగ్గర నుంచి కూడా ఎప్పుడూ ఆర్థిక సాయం కోరలేదు' అని చెప్పుకొచ్చింది. నీనా కూతురు మసాబా గుప్తా ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. నీనా సినిమాల విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'గుడ్బై' సినిమాలో నటిస్తోంది. ఆమె చివరగా నటించిన 'సర్దార్ కా గ్రాండ్సన్' మూవీ ఇటీవలే నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. చదవండి: సర్దార్ కా గ్రాండ్సన్ రివ్యూ: నానమ్మ కోరికను హీరో నెరవేరుస్తాడా? -
Sardar Ka Grandson: ‘సర్దార్ కా గ్రాండ్సన్’ మూవీ రివ్యూ
పిల్లలు ఉన్న చోట పెద్దలు ఉండక తప్పదు. కాని ఆ పెద్దలకు ఒక బాల్యం ఉంటుంది. బతికిన ఒక ఊరు ఉంటుంది. ఏదో ఒక స్థలంతో, ఆవాసంతో బంధం ఉంటుంది. తమ చివరి రోజుల్లో వాటిని ఒకసారి చూసుకోవాలని వారికి ఉంటుంది. పిల్లలకు అది పట్టదు. కాని వారిని అర్థం చేసుకుంటే ఆ కోరిక నెరవేరుస్తే వారు పొందే ఆనందం చాలా విలువైనది. ‘సర్దార్ కా గ్రాండ్సన్’లో ఒక నానమ్మ చివరి సందర్శనను మనవడు నెరవేరుస్తాడు. ఆదివారం సినిమా పరిచయం. వృద్ధాప్యంలో జ్ఞాపకం పెద్ద ఊతంగా ఉంటుంది. గతం ఒక ఓదార్పుగా ఉంటుంది. ఎన్నో చేదు అనుభవాలు కూడా వాటిలో ఉంటాయి. కాని వాటి గాఢత, ఆ సందర్భాలను దాటి రావడం వల్ల పూర్తిగా తగ్గి, ఆ అనుభవాల పునఃసందర్శనకు కూడా శక్తి ఉంటుంది. ఇక మంచి జ్ఞాపకాలనైతే వెతుక్కుంటూ వెళ్లాలని ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్నవారి మనసుల్లో ఏం కోరిక ఉందో పిల్లలకు పెద్దగా పట్టదు. వారిని బాగా చూసుకుంటున్నాం కదా అనుకుంటారు. మహా అయితే పుణ్యక్షేత్రాలకు తీసుకువెళతారు. కాని ఇవాళ్టి వృద్ధులు ఒకప్పటి యవ్వనవంతులు, యువతీ యువకులు, భార్యాభర్తలు, ఉద్యోగులు, సంసారులు. వారి జీవనంతో పెనవేసుకున్న విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిలో కొన్నింటిని వారు ఆఖరిశ్వాస వరకూ పూర్తిగా అంటి పెట్టుకుని ఉంటారు. తాము పోయేలోపు ఆ ఫలానా స్థలాన్నో, వ్యక్తినో, ఊరినో తిరిగి చూడాలనుకుంటారు. ఆ కోరిక తీరిస్తే వారికి కలిగే ఆనందం అనంతం. ‘సర్దార్ కా గ్రాండ్’ ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన సినిమా. అమృత్సర్లో స్థిరపడిన శ్రీమంతురాలైన 90 ఏళ్ల వృద్ధురాలి కథ అది. ఆమె పిల్లలు బాగా స్థిరపడ్డారు. ఆమె కూడా ఇక హాయిగా చివరి శ్వాస తీసుకోవచ్చు. కాని ఆమె మనసులో ఒక కోరిక. తాను మరణించేలోపు తను ఇష్టపడి కట్టుకున్న ఇంటిని చూడాలనేది. అదేం పెద్ద కోరిక అనుకోవచ్చు. కాని ఆ ఇల్లు లాహోర్లో ఉంది. దేశ విభజన సమయంలో దానిని ఆమె విడిచి వచ్చేసింది. అక్కడ ఉండగా భర్తతో ఎంతో ఇష్టపడి ఆ ఇంటిని కట్టుకుంది. అందులోనే తొలి బిడ్డకు జన్మనిచ్చింది. అందులోనే నాటి అల్లర్లలో భర్త ప్రాణం విడిచాడు. ఆ ఇంటిని చూసుకోవాలని ఉంటుంది. కాని ఆమె ఆరోగ్యరీత్యా వేరే కారణాల రీత్యా ఎవరూ ఆ కోరికను మన్నించరు. కాని ఆమె మనవడు ఆమె కోరికను అర్థం చేసుకుంటాడు. దానిని నెరవేర్చాలనుకుంటాడు. అక్కడే సమస్య వస్తుంది. ఇంటినే కదిలించి అమృత్సర్లో ఉన్నవారు పాకిస్తాన్కు వెళ్లిరావడం పెద్ద సమస్య కాదు. కాని మనవడికి వీసా వస్తుంది కాని నానమ్మకు రాదు. దానికి కారణం గతంలో ఒక క్రికెట్ మేచ్లో ఆమె చేసిన అల్లరే కారణం. అందుకని మనవడు లాహోర్ వెళతాడు. ఏ ఇంటికైతే తన నానమ్మ రాలేదో ఆ ఇంటినే అమృత్సర్కు తీసుకువస్తాడు. అంటే దానిని పునాదులతో సహా పెకలించి ట్రక్కు మీద పెట్టి అమృత్సర్ తీసుకువస్తాడు. అయితే అదంత సులువు కాదు. దాని కోసం అతడు ఏమేమి తిప్పలు పడ్డాడనేది కథ. కొంచెం హాస్యం, కొంచెం సెంటిమెంట్తో సినిమా మొదటి పదిహేను నిమిషాలు స్లోగా ఉన్నా తర్వాత అందుకుంటుంది. నీనా గుప్తా సర్వమై ఈ సినిమా గత నెల విడుదలైంది. ఆశించినంత స్పందన రాలేదు. దానికి కారణం ఈ స్క్రిప్ట్ ఇంకా బాగుండొచ్చు. అయితే ఈ సినిమా ఒకసారి చూసేంతగా ఆకట్టుకోవడానికి కారణం వృద్ధురాలిగా నటించిన నీనా గుప్తా నటన. ఆమె మన మనసులోని భావాలను, నాటి అనుభవాల గాఢతను తెర మీద వ్యక్తం చేయడంలో గొప్ప నటన చూపించింది. ఈ సినిమా చూసినంత సేపు మన ఇంట్లో నానమ్మో, తాతయ్యో, ఇరువురో ఉంటే ‘మీకేం కావాలి... మీరేం చూడాలనుకుంటున్నారు... మీరెవరిని కలవాలనుకుంటున్నారు’ అని అడిగేలా ఉంటుంది. మిగిలిన పాత్రల్లో అర్జున్ కపూర్, రకుల్ప్రీత్ సింగ్ నటించారు. లాహోర్ ఫ్లాష్బ్యాక్లో జాన్ అబ్రహామ్, అదితి రావ్ హైదరీ మెప్పిస్తారు. జాన్ అబ్రహామ్ దీని నిర్మాత. -
అమ్మ ఆత్మకథ కలిచివేసింది: మసాబా
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తాది విభిన్నమైన వ్యక్తిత్వం. తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడించేవారు. నీనా గుప్తా మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో సహజీవనం చేయడం.. మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. కాగా నీనా ఆటో బయోగ్రఫీలోని ఓ ఆసక్తికర విషయాన్ని ఆమె కూతురు, ఫ్యాషన్ డిజైనర్ మసాబా తాజాగా ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. రిచర్డ్స్తో విడిపోయాక.. మసాబా జన్మించే సమయానికి తన దగ్గర కేవలం 2000 రూపాయలు మాత్రమే ఉన్నాయని, దీంతో తాను సాధారణ ప్రసవం కోసం చూసినట్లు నీనా తన ఆత్మకథలో రాసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇప్పుడు తాజాగా మసాబా షేర్ చేస్తూ తన తల్లి ఆత్మకథ చదివానని, దానిని నుంచి చాలా విషయాలను నేర్చుకున్నానంటూ భావోద్యేగానికి లోనయ్యింది. బుక్లోని ఈ పేజీని షేర్ చేస్తూ.. ‘అమ్మ నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహున్ తో’లో.. మా అమ్మ నాకు జన్మనిచ్చే సమయంలో తన వద్ద కేవలం బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 2 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆమె సాధారణ డెలివరి కావాలని కోరుకుంది. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ అంటే 10 వేల రూపాయలు కావాలని. లక్కీగా సమయానికి ట్యాక్స్ రీయింబర్స్మెంట్ పెరగడంతో తన ఖాతాలో 9 వేలు జమ అయ్యాయి. చివరకు తన డెలివరి సమయానికి బ్యాంకులో 12 వేల రూపాయలు అయ్యాయి. ఇప్పుడు నేను సీ-సెక్షన్ శిశువు. తన ఆత్మకథ చదివి చాలా విషయాలు నేర్చుకున్నాను. తను నన్ను ఈ భూమి మీదకు తీసుకువచ్చేందుకు ఎంతటి కష్టాలు భరించిందో తెలుసుకున్నాను. ఆ సంఘటన నన్ను కలిచివేసింది. అందుకే నా జీవితంలో ప్రతి రోజు.. ప్రతి క్షణం ఆమె రుణం తీర్చుకునేందుకే కష్టపడతాను’ అంటూ మసాబా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) -
చుక్కలు చూపిస్తున్న కరోనా.. అక్కడికి వెళ్లిపోయిన నటి
కరోనా వచ్చిన పేషెంట్ ఇంట్లో ఉంటే ఒక విడి గది ఇచ్చే వీలు లేని సామాన్యులు కోట్లాదిమంది ఉన్నారు. అదే సమయంలో కరోనా నుంచి రక్షించుకోవడానికి నగరాలకు దూరంగా వెళ్లే సెలబ్రిటీలు ఉన్నారు. కరోనా వార్తలు గత సంవత్సరం వచ్చిన వెంటనే నటి నీనా గుప్తా నైనిటాల్కు సమీపంగా ఉండే ముక్తేశ్వర్లోని తన విడిది గృహానికి షిఫ్ట్ అయ్యింది. అక్కడే ఉండి తగ్గాక వచ్చింది. ఇప్పుడు మళ్లీ కరోనా ఉధృతం కాగానే ఆమె ముక్తేశ్వర్లో ప్రత్యక్షమయ్యారు. కరోనా సెకండ్ వేవ్ బాలీవుడ్కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా విలన్ అశుతోష్ రాణాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా ఎంతమందికి రానుందో తెలియదు. ముంబై ఏమాత్రం సేఫ్ కాదని తెలిసిన చాలామంది ఫామ్హౌస్ల బాట పట్టారు. నటుడు సల్మాన్ ఖాన్ గత సంవత్సరం నుంచి దాదాపుగా తన పాన్వెల్ ఫామ్హౌస్లోనే ఉంటున్నారు. కరోనా నుంచి రక్షణ పొందడానికి నటి నీనా గుప్తా కూడా గత సంవత్సరం ముక్తేశ్వర్ లో ఉన్న తన విడిదింటికి వెళ్లిపోయారు. అక్కడే ఏడెనిమిది నెలలు ఉన్నారు. ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చినా ప్రస్తుత పరిస్థితి దృష్టా మళ్లీ ముక్తేశ్వర్ చేరుకున్నారు. ముక్తేశ్వర్ నైనిటాల్కు సమీపంగా ఉండే గొప్ప టూరిస్ట్ స్పాట్. ప్రశాంతంగా ఉండే పర్వత ప్రాంతం. ‘ఇక్కడి ప్రజలు, వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఉతికిన గుడ్డలను బయట ఆరవేయడం వారికి నచ్చదు. బట్టలు బాగా ఎండకు ఆరితే తప్ప నాకు అవి ఆరినట్టుగా అనిపించదు. అయినా బట్టలు ఉతికి ఆరేస్తేనే కదా అది ఇల్లు అనే భావన వస్తుంది’ అని నీనా గుప్తా ముక్తేశ్వర్లో తన విడిదింటి నుంచి తాజా వీడియోలో పేర్కొంది. నీనా గుప్తా కుమార్తె మసాబా ఫ్యాషన్ రంగంలో పని చేస్తోంది. తల్లీకూతుళ్లు కలిసి నటిస్తున్నారు కూడా. అయినా ఆ పనులకు బ్రేక్ ఇచ్చి సురక్షితంగా ఉండాలి అని నీనా భావిస్తున్నందుకు ఆమెను అభినందించాలి. ఆమె స్టే బాగా గడవాలని కోరుకుందాం. చదవండి: అమితాబ్కి భార్యగా..'నా కల నెరవేరింది' ఆసక్తికర విషయాలు వెల్లడించిన నీనా గుప్తా -
ఒంటరి తల్లులకు భరోసా ఏదీ?
‘నేను కేవలం స్త్రీని. నాకు పురుషుని తోడు అన్ని వేళలా అవసరం అని స్త్రీ అనుకుంటూ ఉంటే కనుక ఆమెకు స్వయం జీవనం కల్పించడంలో వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వ పథకాలు స్త్రీలకు ముఖ్యం గా ఒంటరి స్త్రీలకు లేదా ఒంటరి తల్లులకు తగిన భరోసా కల్పించడంలో విఫలమైనట్టే’ అని మొన్న శనివారం కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. దత్తత ఇచ్చిన తన బిడ్డను తిరిగి వెనక్కు తెచ్చుకోవడానికి ఒక మహిళ హైకోర్టును ఆశ్రయించగా ఆమె వాదనల సమయంలో న్యాయమూర్తులు ముహమ్మద్ ముష్టాక్, కౌసర్ ఎడప్పగత్ ఈ వ్యాఖ్య చేశారు. కేసు ఏమిటి? కేరళలో ఒక మహిళ తన సహచరునితో లివ్ - ఇన్ రిలేషన్లో ఉండేది. దానివల్ల వారికి సంతానం కలిగింది. అయితే ఆ తర్వాత వాళ్లు విడిపోయారు. ఆ సంతానం తల్లి దగ్గర ఉండిపోయింది. ఒంటరి తల్లిగా బిడ్డను పెంచడం ఈ సంఘంలో చాలా పెద్ద సవాలు అని భావించిన ఆ తల్లి ఆ బిడ్డను దత్తతకు ఇచ్చేసింది. ఇప్పుడు ఆ తండ్రి తిరిగి వచ్చాడు. వారు మళ్లీ కలిసి జీవించదలిచి దత్తత ఇచ్చిన బిడ్డ కోసం కోర్టు మెట్లెక్కారు. ఆ కేసు వాదనలు వింటూ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యానం చేశారు. ఇంత ఆందోళన ఎందుకు? ‘తన బిడ్డను దత్తత ఇచ్చే ముందు ఆ తల్లి ఒక సామాజిక కార్యకర్తతో చేసిన చాట్స్ చూశాం. అందులో ఆమె ఎంత ఒత్తిడికి లోనయ్యిందో తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా ఏ మద్దతు ఒంటరి తల్లులకు లభించదని, కనుక బిడ్డను పెంచలేనని ఆ తల్లి భావించింది. జన్మనిచ్చిన బిడ్డను దత్తత ఇచ్చేసింది. ఈ విధంగా చూసినట్టయితే ఒక ఒంటరి తల్లి ధైర్యంగా బతికేలా చేయడంలో ఈ వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వం సింగిల్ మదర్స్ కోసం ఏం ఆలోచనలు చేస్తున్నట్టు? వారు ఆర్థికంగా, సామాజికంగా తగిన గౌరవంతో బతకడానికి ఎటువంటి చైతన్యం కలిగిస్తున్నట్టు’ అని కోర్టు అంది. మగతోడు లేకుండా బతకలేమా? అయితే ఒక రకంగా చూస్తే ఇది ‘మధ్యతరగతి’ సమస్యా? అనిపిస్తుంది. ఆర్థికంగా దిగువ వర్గాల్లో ఒంటరి తల్లులు ధైర్యంగా బతకడం చూడొచ్చు. సంపన్న వర్గాల్లో పెళ్లిని నిరాకరించి మరీ సింగిల్ మదర్స్ అవుతున్నవారు ఉన్నారు. అందరికీ తెలిసిన ఉదాహరణలు ఏక్తా కపూర్, సుస్మితాసేన్. దీనికి చాలా ఏళ్ల ముందు సింగిల్ మదర్గా తాను జీవించగలనని నీనా గుప్తా నిరూపించింది. మరోవైపు దిగువ వర్గాల్లోగాని, ఉన్నత వర్గాల్లో కాని విడాకులు ఒక సమంజసమైన పరిష్కారంగా భావించి విడిపోయే జంటలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత పిల్లలతో మిగిలిన తల్లులు ధైర్యంగా బతకడం కనిపిస్తూనే ఉంటుంది. ఎటొచ్చి మధ్యతరగతి మర్యాదలలో ‘మగతోడు’ ఒక తప్పనిసరి సాంఘిక చిహ్నంగా, భద్రతగా, రక్షణగా భావించే పరిస్థితితులు ఉన్నాయి. మధ్యతరగతి సమాజం లిఖించుకున్న విలువలు చాలామటుకు స్త్రీని ప్రశ్నించే, నిలదీసే, సరిదిద్దడానికే ప్రయత్నించేలా ఉంటాయి. అందుకే విడాకులకు వెరచి గృహహింసను భరించే స్త్రీలు, ఒంటరి స్త్రీలుగా ఉంటూ పిల్లలను పెంచడానికి భయపడే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. చుట్టూ సవాళ్లు ఒకసారి భర్తతో లేదా సహజీవనం నుంచి విడిపోయాక స్త్రీలు ఒంటరిగా జీవించడానికే ఇష్టపడి తమ పిల్లలను ఒంటరిగానే పెంచుకుందామని అనుకున్నా వారికి సవాళ్లు చాలానే ఉంటాయి. ముఖ్యంగా వీరికి అద్దెకు ఇళ్లు దొరకడం ఒక సమస్య. ఇంటిపని, సంపాదన చూస్తూ పిల్లల అవసరాల గురించి సమయం పెట్టాలంటే వీలు కాదు. నమ్మకమైన బేబి సిట్టర్స్ దొరకడం ఒక సమస్య. సమాజం నుంచి మద్దతు దొరకదు. ఆర్థిక ఆలంబన ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఏమీ అందదు. మరో పెళ్లి చేసుకోమని సమాజం నుంచి వచ్చే వొత్తిడి. అవకాశంగా తీసుకుని అడ్వాన్స్ అయ్యే పురుషులతో సమస్య. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే బహుశా ఆ కేరళ తల్లి తన బిడ్డను దత్తతకు ఇచ్చి ఉండవచ్చు. కోర్టు ఈ వ్యాఖ్యానాలు చేయడం వెనుక ఈ నేపథ్యం అంతా ఉంది. సమాజంలో చట్ట పరిధికి లోబడి తమకు నచ్చిన రీతిలో బతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సింగిల్ మదర్గా ఎవరైనా జీవించదలిస్తే వారిని సమాజం లో భాగంగా చేసుకోవడం. గౌరవించడం, మద్దతు గా నిలవడం చేయవలసిన వ్యవస్థ సంపూర్ణంగా తయారు కాలేదని కేరళ ఉదంతం తెలియచేస్తోంది. - సాక్షి ఫ్యామిలీ -
అమితాబ్కి భార్యగా..'నా కల నెరవేరింది'
‘‘నా కల నెరవేరింది. ఎంతో ఉద్వేగంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను’’ అంటున్నారు నటి నీనా గుప్తా. ఈ ఉద్వేగానికి, ఆనందానికి కారణం అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం ఆమెకు దక్కడమే. తొలిసారి బచ్చన్తో నీనా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా ‘గుడ్ బై’. ఇందులో అమితాబ్ భార్యగా నటిస్తున్నారామె. వీరి కూతురిగా రష్మికా మందన్నా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి నీనా గుప్తా మాట్లాడుతూ – ‘‘దర్శకుడు వికాశ్ బహల్ ఈ కథ గురించి చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. అంత అద్భుతంగా ఉంది. నా పాత్రను బాగా రాశారు. మంచి కథ, అమితాబ్తో నటించాలనే నా కల నెరవేర్చిన చిత్రంగా ‘గుడ్ బై’కి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అన్నారు. ఇదిలా ఉంటే.. నీనా గుప్తా నటించిన ‘బధాయీ హో’ (2018)ని అమితాబ్ చూశారు. చూడడమే కాదు.. ‘అద్భుతంగా నటించావ్ నీనా..’ అంటూ స్వహస్తాలతో ఓ లేఖ రాసి, ఆమెకు పంపారు కూడా! బిగ్ బి ప్రశంసలు అందుకున్న నీనా చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు ఆయన సరసన నటిస్తున్నందుకు డబుల్ ఆనందంలో ఉన్నారు. -
క్రిస్మస్ రోజు నేను చనిపోయాననుకుంది
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా చేసిన పనికి ఆమె తల్లి, సీనియర్ నటి నీనా గుప్తాకు ఒక్క క్షణం గుండాగినంత పనైందట. ఇంతకీ ఆమె ఏం చేసిందనుకుంటున్నారు.. మరేం లేదు. పండగ పూట త్వరగా నిద్ర లేవాల్సింది పోయి బారెడు పొద్దెక్కినా ఆదమరిచి నిద్రపోయారట. దీంతో మసాబా చనిపోయిందా? ఏంటని ఆమె తల్లికి చెమటలు పట్టాయట. ఈ విషయాన్ని మసాబా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించారు. "శుభోదయం నీనాజీ. నాకసలు ఆలస్యంగా నిద్ర లేచే అలవాటే లేదు. కానీ క్రిస్మస్ రోజు ఆలస్యంగా తొమ్మిదిన్నర వరకు నిద్ర లేవలేదు. దీంతో భయపడిపోయిన అమ్మ నేను బతికున్నానా? లేదా? అని నా దగ్గరకు వచ్చి చెక్ చేసింది" అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు నీనా తన ఫోన్ను పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. అమ్మ కంగారును పోగొట్టేందుకు మసాబా త్వరగా రెడీ అయి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నారు. అయితే సత్యదీప్ మిశ్రాను మిస్ అవుతున్నానని బాధ పడ్డారు. కాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, నీనా గుప్తాల కూతురైన మసాబా నెట్ఫ్లిక్స్ సిరీస్ 'మసాబా మసాబా'తో నటనా రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో తల్లి నీనాతో కలిసి నటించారు. (చదవండి: ఈసారి ఫుల్ మీల్స్) మసాబా వ్యక్తిగత విషయానికి వస్తే.. 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఈ నేపథ్యంలో తామిద్దరం విడిపోతున్నామంటూ మధు, మసాబా 2018లో ప్రకటన విడుదల చేశారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె నటుడు సత్యదీప్ మిశ్రాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సత్యదీప్, మసాబా ఆ మధ్య ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోలు ఈ వదంతులకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక సత్యదీప్ సైతం తన భార్య, ప్రముఖ హీరోయిన్ అదితీ రావ్ హైదరీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. 2009లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట 2013లో తమ బంధానికి స్వస్తి పలికారు. (చదవండి: విడాకులు: మళ్లీ ప్రేమలో పడిన నటుడు!) -
మా ఆత్మకథ చెబుతాం
ఎవరో రాసిన కథల్లో, ఎవరో సృష్టించిన పాత్రలకు, ఇంకెవరో రాసిన డైలాగులు చెబుతుంటారు యాక్టర్స్. మంచి కథల్ని స్క్రీన్ మీదకు తీసుకొస్తారు. మంచి పాత్రల్ని మర్చిపోకుండా చేస్తారు. కానీ అవేవీ వాళ్లు కాదు. అది కేవలం స్క్రీన్ మీద చేసిన నటనే. స్క్రీన్ వెనక వాళ్లదైన కథ ఒకటుంటుంది. అది చాలామందికి తెలియదు. ఆ కథను చెప్పబోతున్నాం అంటున్నారు కొందరు స్టార్స్. వాళ్ల కథను చెప్పడానికి రెడీ అయిపోయారు. వాళ్ల ఆత్మకథను చెబుతారట. ప్రస్తుతం ఆత్మకథలు రాసుకుంటున్న స్టార్స్ విశేషాలివి. ఇంకా పూర్తవలేదు బాలీవుడ్ సూపర్స్టార్ నుంచి హాలీవుడ్ హీరోయిన్గా ఎదిగారు ప్రియాంకా చోప్రా. హాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ భారతీయ ఖ్యాతిని పెంచుతున్నారు. ఇప్పుడు ప్రియాంక జీవితాన్ని పుస్తకరూపంలో ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారామె. తన జీవిత కథతో ‘అన్ఫినిష్డ్’ (ఇంకా పూర్తవలేదు) పేరుతో ఓ పుస్తకాన్ని రాశారామె. ఇందులో తన బాల్యం, హీరోయిన్గా మారడం, బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి షిఫ్ట్ అయ్యే విశేషాలు అన్నీ చర్చించారట. ఈ పుస్తకం వచ్చే ఏడాది జనవరి 19న విడుదల కానుంది. రక్షకుడిని కాదు లాక్డౌన్ సమయంలో ఎందరో వలస కార్మికుల పాలిట ఆపద్బాంధవుడు అయ్యారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. అందర్నీ సురక్షితంగా తమ ప్రాంతాలకు పంపే బాధ్యతను నవ్వుతూ భుజాన వేసుకున్నారు. లాక్డౌన్ సమయంలో జరిగిన కథను పుస్తకరూపంలో తీసుకొస్తున్నారు సోనూ సూద్. ‘ఐయామ్ నో మెసయ్య’ (నేను రక్షకుడిని కాదు) పేరుతో ఈ పుస్తకం విడుదల కాబోతోంది. ‘ఇలా సహాయం చేసే బాధ్యతను నాకు కలిగించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది నా కథ కాదు.. వలస కార్మికుల కథ కూడా’ అన్నారు సోనూ సూద్. ఈ పుస్తకం డిసెంబర్లో మార్కెట్లోకి వస్తుంది. రాయాలనిపించింది రాస్తున్నా! బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా కూడా తన ఆత్మకథను రాస్తున్నారు. లాక్డౌన్లో అందరూ ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆత్మకథ రాయాలనే ఆలోచన వచ్చిందట ఆమెకు. లాక్డౌన్ సమయాన్ని మొత్తం ఈ పుస్తకం రాస్తూ గడిపారట. ‘మీ జీవితకథను పుస్తకరూపంలో ఎందుకు తీసుకురాకూడదు? అని చాలా మంది అడిగేవారు. నేనంత ఎక్స్ట్రార్డినరీగా ఏమీ చేయలేదే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ వీలు దొరికింది.. రాసేశాను. కొన్ని నెలల్లో నా కథ బయటకు రాబోతోంది. నచ్చితే చదవండి. బోర్ అనిపిస్తే పక్కన పెట్టేయండి’ అని అన్నారు నీనా గుప్తా. ఆమె ఆత్మకథ పేరు ‘సచ్ కహూ తో’ (నిజం చెప్పాలంటే). వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ పుస్తకం మార్కెట్లోకి రానుంది. గుర్తుగా ఉంటుందని.. ‘జీవితం ఎప్పుడూ పరిగెడుతూ ఉంటుంది. కొన్ని విషయాల్ని రికార్డ్ చేసుకుంటే ఎప్పుడైనా తిరిగి చూసుకోవడానికి బావుంటుంది. అందుకే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాను’ అంటున్నారు సైఫ్ అలీఖాన్. ఆత్మకథ రాస్తున్నాను అని ఇటీవలే ప్రకటించారు సైఫ్. యాక్టర్గా ఎలా మారారు, ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, తన కుటుంబం.. ఇలా ప్రతి విషయాన్నీ ఈ పుస్తకంలో ప్రస్తావించాలనుకుంటున్నారట. ఈ పుస్తకం వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. -
నా పెళ్లి గురించి మసాబా ఏమన్నదంటే..
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తాది విభిన్నమైన వ్యక్తిత్వం. తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడిస్తారు. యాభైలలో నీనా గుప్తా మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో సహజీవనం చేయడం.. మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. రిచర్డ్స్తో విడిపోయిన తర్వాత 2008లో నీనా గుప్తా ఢిల్లీకి చెందిన వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు. అప్పుడు మసాబాకు 19 సంవత్సరాలు. అయితే వివేక్ను వివాహం చేసుకోవాలనుకుంటున్న విషయం గురించి మసాబాతో చెప్పినప్పుడు తాను ఎలా స్పందించింది అనే విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నీనా గుప్తా. (చదవండి: విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..) ఈ సందర్భంగా నీనా గుప్తా మాట్లాడుతూ.. ‘వివేక్-నేను ఓ పదేళ్ల పాటు కలిసి తిరిగాము. తను నా కోసం ముంబై వచ్చేవాడు.. నేను అతడి కోసం ఢిల్లీ వెళ్లేదాన్ని. ఇవన్ని మసాబాకు తెలుసు. ఇక మేం పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు దీని గురించి మసాబాకు చెప్పాను. అప్పుడు తన వయసు 19 ఏళ్లు. పెళ్లి గురించి చెప్పగానే తను అడిగిన మొదటి ప్రశ్న.. ఎందుకు వివాహాం చేసుకోవాలనుకుంటున్నావు అని. అప్పుడు నేను ఈ సమాజంలో గౌరవంగా బతకాలంటే పెళ్లి తప్పని సరి అని చెప్పాను’ అన్నారు. అయితే దీని గురించి మసాబాతో చెప్పడానికి తాను కొంత ఇబ్బంది పడ్డానన్నారు నీనా గుప్తా. కానీ మసాబా నన్ను అర్థం చేసుకుంది. నా ఆనందం కోసం తను ఏమైనా చేస్తుంది. అది తనకు నచ్చినా.. నచ్చకపోయినా. కాబట్టి నేను ఆందోళన చెందలేదు అన్నారు. ఇక నీనా గుప్తా, వివేక్ మెహ్రాల వివాహం 2008లో జరిగింది. -
నిజం చెప్పాలంటే..
లాక్డౌన్లో ఒక్కొక్కరూ ఒక్కో పనిలో బిజీగా ఉంటే బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఆమె బయోగ్రఫీ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారట. ఈ విషయాన్ని గురువారం ప్రకటించారు. దీని గురించి మాట్లాడుతూ –‘‘మీ ఆత్మకథ ఎందుకు రాయకూడదు? అని చాలా మంది చాలాసార్లు నన్ను అడిగారు. కానీ నేనంత ఎక్స్ట్రార్డనరీ పనేం చేయలేదు కదా అని రాయాలనుకోలేదు. కరోనా వల్ల ఇంటికే పరిమితం కావడంతో రాయాల్సి వచ్చింది.. రాసేశాను. జనం చదువుతారో లేదో నాకు తెలియదు. చదివితే నచ్చుతుందో లేదో తెలియదు. నా ఆటోబయోగ్రఫీ నాలుగైదు నెలల్లో బయటకు రాబోతోంది. ఒకవేళ కుదిరితే చదవండి. బోర్గా అనిపిస్తే పక్కన పెట్టేయండి. నా ఆటోబయోగ్రఫీ పేరు ‘సచ్ కహు తో (నిజం చెప్పాలంటే)’’ అన్నారు నీనా గుప్తా. -
‘పని మీద దృష్టి పెట్టండి. పురుషుల మీద కాదు’
ముంబై : నటి నీనా గుప్తా పేరు ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నారు. నేహా ధుపియా నిర్వహిస్తున్న టెలివిజన్ ‘నో ఫిల్టర్ నేహా’ షోలో ఇటీవల నీనా గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకవేళ మీరు యుక్త వయస్సులో ఉంటే మీకు మీరు ఇచ్చుకునే సలహా ఏంటని నేహా ప్రశ్నించగా... దీనిపై స్పందించిన నీనా ‘పని మీద దృష్టి పెట్టండి. పురుషుల మీద కాదు’ అంటూ సమాధానమిచ్చారు. అయితే నీనా ఇలా చెప్పడం మొదటి సారి కాదు. తన జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని తరచూ అభిమానులతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. యువత సరైన దారిలో ఎలా నడుచుకోవాలో కూడా సందేశాలు ఇస్తూ ఉంటారు. (వివాహితుడిని ప్రేమించకండి: నటి) కాగా నేహా ధూపియా షో ఐదో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. ఈ ప్రోమోలో నీనా గుప్తాతోపాటు, రానా దగ్గుబాటి, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్ సైఫ్ అలీఖాన్, సోనూసూద్, అదితి రావ్ వంటి ప్రముఖులను కూడా ఇంటర్య్వూ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ షో ఆగస్ట్ 28న ప్రారంభం కాబోతుంది. (విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..) View this post on Instagram 5 years of unfiltered fun. 5 years of your favorite celebrity talkshow! #NoFilterNeha Season 5 at Home Edition is finally here! Join us every week as we bring down the roof - of our very own homes, of course! Premiering exclusively on @JioSaavn Pro, co-produced by @wearebiggirl A post shared by Neha Dhupia (@nehadhupia) on Aug 25, 2020 at 12:51am PDT వెస్టిండీస్ క్రికెటర్, వివాహితుడైన వివియన్ రిచర్డ్స్ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. కూతురికి జన్మనిచ్చిన తర్వాత వివియన్ రిచర్డ్స్, నీనా విడిపోయారు. అనంతరం నీనా గుప్తా వేరే వ్యక్తినిపెళ్లి చేసుకున్నారు. బదా యీ హో, సర్వమంగళ్ జ్యాదా సావధాన్ సినిమాలలో ఇటీవల తెరపై కనిపించిన ఆమె బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. -
అతిథిగా అదితి?
అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఓ హిందీ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం ఈ చిత్రానికి నిర్మాత. నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బామ్మ, మనవడికి మధ్య నడిచే కథ ఇదని సమాచారం. నీనా గుప్తా బామ్మగా, అర్జున్ కపూర్ మనవడి పాత్రలో కనిపిస్తారు. ప్రముఖ హీరోయిన్ అదితీ రావ్ హైదరి అతిథి పాత్రలో మెరవనున్నారని సమాచారం. నీనా గుప్తా యవ్వనంలో ఉన్న పాత్రలో అదితి కనిపిస్తారట. అదితీకి జోడీగా జాన్ అబ్రహాం నటించనున్నారట. లాక్ డౌన్ ముందు చిత్రీకరణ ప్రారంభం అయింది. ఈ నెలాఖరులో మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతారట. ఈ చిత్రానికి కాశవీ నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. -
ప్రతి స్త్రీకి ప్లాన్ బి ఉండాలి
హాలీవుడ్లో హీరోయిన్ పాత్రలు చేయాలంటే వయసుతో సంబంధం లేదు. యాభై, అరవై ఏళ్లు దాటినవాళ్లు కూడా అక్కడ హీరోయిన్లుగా చేస్తుంటారు. కానీ భారతీయ సినిమా సీన్ వేరు. ఒకప్పుడు 30 ఏళ్లు దాటితే కెరీర్ ముగిసినట్లే. ఇప్పుడు ఒక 35–40 వరకూ ఓకే అనే పరిస్థితి. ఆ తర్వాత మాత్రం నో చాన్స్. ఇండస్ట్రీలో కొనసాగాలంటే అక్క, వదిన పాత్రలకు మారక తప్పదు. ఇదే విషయం గురించి బాలీవుడ్ నటి నీనా గుప్తా మాట్లాడుతూ –‘‘దాదాపు 30 ఏళ్లు నేను సినిమాలు చేశాను. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ‘బదాయి హో’ (2018) తెచ్చిపెట్టినంత పాపులార్టీ నాకు అంతకు ముందు రాలేదు. నేను అమితాబ్ బచ్చన్ని కాదని నాకు తెలుసు. మహిళలకు చాలా అరుదుగా పవర్ఫుల్ పాత్రలు రాస్తారు. నా వయసున్న (నీనా వయసు 61) మగవాళ్లు హీరోలుగా చేస్తున్నారు. కానీ స్త్రీలు చేయకూడదు. నా వయసువారి కోసం పాత్రలు రాయడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది’’ అన్నారు. అలాగే మహిళలకు ఓ సలహా ఇచ్చారు నీనా. ‘‘మహిళలకు ప్లాన్ బి ఉండాలి. ప్రతి స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఆ విషయంలో ఎవరి మీదా ఆధారపడకూడదు. మన దగ్గర డబ్బుంటే ఎలాంటి సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు. అందుకే ప్రతి మహిళకు సొంత డబ్బు ఉండాలి. అదే ప్లాన్ బి’’ అన్నారు నీనా గుప్తా. -
చేతిలో చీపురు.. ఈ సెలబ్రిటీ ఎవరు?!
‘‘ఏ పనీ చిన్నది కాదు. గ్లామర్వాలా అయినా సఫాయీ వాలా అయినా ఒకటే అని నీనా గుప్తా నాకు ఎప్పుడూ చెబుతూ ఉంటారు’’ అని ప్రముఖ ప్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా తన పెంపకంలో తల్లి అవలంబించిన విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు. తల్లి నీనా గుప్తా చిన్నతనంలో తనను అందంగా ముస్తాబు చేసిన ఫొటోతో పాటు చేతిలో చీపురు పట్టుకుని ఉన్న ఫొటో షేర్ చేసి ఈ విధమైన క్యాప్షన్ జతచేశారు. కాగా బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా- వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ల కూతురైన మసాబా గుప్తా ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనం కపూర్, ఆమె సోదరి, నిర్మాత రియా కపూర్ తదితర సెలబ్రిటీలకు ఆమె వైవిధ్యమైన, ట్రెండీ దుస్తులు డిజైన్ చేసి ఫ్యాషన్ ప్రియుల మన్ననలు అందుకున్నారు. (వారి విడాకుల విషయం కుంగదీసింది: నటి) కాగా వివాహితుడైన రిచర్డ్స్ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో మసాబాకు జన్మనిచ్చారు. సింగిల్ మదర్గా ఉన్నప్పటికీ తన తండ్రి సాయంతో బిడ్డకు ఎటువంటి లోటు రాకుండా అపురూపంగా పెంచుకున్నారు. ఇటీవల తన మనోభావాలను వెల్లడించిన నీనా... పెళ్లైన వ్యక్తి ప్రేమలో పడి తాను తప్పుచేశానని.. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొన్నానంటూ కూతురి పెంపకంలో తనకు ఎదురైన సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. ఇక 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను వివాహం చేసుకున్న మసాబా.. ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు విడాకుల విషయం తెలిసి తాను విషాదంలో మునిగిపోయానని.. తనపై తీవ్ర ప్రభావం చూపిన విషయం ఇదేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మసాబా ప్రస్తుతం ఆమె అదితీరావ్ హైదరీ మాజీ భర్త, నటుడు సత్యదీప్ మిశ్రాతో ప్రేమలో పడినట్లు బీ- టౌన్ టాక్. గోవాలోని సత్యదీప్ ఇంట్లో వీరిద్దరు లాక్డౌన్ను ఎంజాయ్ చేస్తున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి.(హీరోయిన్ మాజీ భర్త ప్రేమలో మసాబా!?) View this post on Instagram @neena_gupta used to tell me all the time - Koi kaam chhota nahin hota 🙏🏼 Na toh ‘Glamour’ wala na ghar ki safai wala A post shared by Mufasa✨🌙 (@masabagupta) on May 25, 2020 at 4:06am PDT -
విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..
తన కూతురు మసాబా విడాకుల విషయం తెలిసి తాను విషాదంలో మునిగిపోయానని బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా అన్నారు. తనపై తీవ్ర ప్రభావం చూపిన విషయం ఇదేనని పేర్కొన్నారు. వెస్టిండీస్ క్రికెటర్, వివాహితుడైన వివియన్ రిచర్డ్స్ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమెకు మసాబాగా నామకరణం చేసి.. తల్లీతండ్రీ తానే అయి అపురూపంగా పెంచుకున్నారు. ఈ క్రమంలో మసాబా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను వివాహం చేసుకున్న మసాబా.. రెండేళ్ల క్రితం వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. మధు, మసాబా ఈ మేరకు 2018 ఆగస్టులో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కోర్టు మ్యారేజీ ద్వారా పెళ్లి చేసుకున్న తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం వారికి విడాకులు మంజూరయ్యాయి.(వివాహితుడిని ప్రేమించకండి: నటి) ఈ విషయం గురించి తాజాగా మసాబా తల్లి నీనా గుప్తా మాట్లాడుతూ.. మధు, మసాబాల విడాకుల గురించి తెలిసి తాను దుఃఖ సాగరంలో మునిగిపోయానని తెలిపారు. ‘‘నిజానికి ఈ విషయం తెలిసిన తర్వాత బాధ నుంచి తేరుకోలేకపోయాను. అప్పుడు మసాబానే నాకు సహాయం చేసింది. నేను అస్సలు ఈ విషయాన్ని అంగీకరించలేకపోయాను. నాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది’’అని తన ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా... ‘‘నా కూతురి పెంపకంలో నా తండ్రి నాకు ఎంతగానో సహాయం చేశారు. నా కోసం ఆయన ముంబైకి షిప్ట్ అయ్యారు. నా కోసం అంతగా కష్టపడిన నాన్నకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. సింగిల్ పేరెంట్గా ఉన్న నాకు వెన్నెముకగా నిలిచారు’’ అని తన కూతురి పెంపకంలో ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకున్నారు. కాగా కూతురికి జన్మనిచ్చిన తర్వాత వివియన్ రిచర్డ్స్, నీనా విడిపోయారు. అనంతరం నీనా గుప్తా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. బదా యీ హో, సర్వమంగళ్ జ్యాదా సావధాన్ సినిమాలలో ఇటీవల తెరపై కనిపించారు. ఇక కొన్నిరోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేసిన నీనా గుప్తా.. పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడవద్దంటూ తన అనుభవాల గురించి పంచుకున్న సంగతి తెలిసిందే. -
ఆల్రెడీ పెళ్లైన వారితో ప్రేమలో పడకండి: నటి
ఒక మహిళ.. అమ్మ అని పిలుపుకై పడే ఆరాటం వర్ణనాతీతం. కానీ పెళ్లయ్యాక అమ్మ అని పిలిపించుకోవడం వేరు. పెళ్లికి ముందే తల్లి కావడం వేరు. అలా పెళ్లికి ముందే తల్లై సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు బాలీవుడ్ నటి నీనా గుప్తా. డేటింగ్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో పీకల్లోతు ప్రేమలో మునిగారు. ఫలితంగా పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయి వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు. (ఆ విషయం విని షాక్ అయ్యా!) తాజాగా ఆమె తన జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఏదేమైనా సరే కానీ, వివాహితుడితో మాత్రం ఎలాంటి సంబంధం పెట్టుకోకండని సూచించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘అతను తన భార్య అంటే ఇష్టం లేదంటాడు. ఇంకా ఎంతోకాలం కలిసి ఉండలేం అని చెప్తాడు. అది నిజమేనని నమ్మి నువ్వు అతన్ని గాఢంగా ప్రేమిస్తావు. నీ భార్యతో ఇంకెప్పుడు విడిపోతావని పోరాడితే దానికింకా సమయం ఉందని చెప్పి దాటవేస్తాడు. ఎప్పటికైనా నీవాడే అవుతాడని కలలు కంటూ అతన్ని రహస్యంగా కలుస్తూ, షికార్లకు తిరుగుతూ, రాత్రిళ్లు ఏకాంతంగా గడుపుతూ ఇలా అన్నింటికీ ఒప్పుకుంటావు. అలా చాలారోజులు గడిచిపోతాయి. మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి.. త్వరగా నీ భార్యకు విడాకులిచ్చేస్తే మనం పెళ్లిపీటలెక్కవచ్చు అని ఆతృతగా చెప్తావు. ('అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?') కానీ ఈసారి అతను కాస్త కటువుగా.. తర్వాత చూద్దాంలే, అయినా విడాకులు అంత సులువు కాదు అంటూ ఏవేవో కుంటిసాకులు చెప్తూ మాట మార్చేస్తాడు. అప్పుడు అసలు నిజం ఏంటో నీకు గోచరిస్తుంది. కానీ ఆ సమయానికి నువ్వు ఏకాకిగా మారుతావు, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో చిక్కుకుంటావు. చివరాఖరకు అన్ని విధాలా ఆలోచించి నువ్వు ప్రేమించిన వ్యక్తికి దూరమయ్యేందుకే సిద్ధపడుతావు. నా జీవితంలోనూ సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఆ సమయంలో ఎంతో వేదన అనుభవించా. అందుకే చెప్తున్నా.. దయచేసి ఎవరూ అలాంటి పిచ్చిపనులు చేయకండి. పెళ్లైన వ్యక్తితో అస్సలు ప్రేమలో పడకండి’ అంటూ సలహా ఇచ్చారు. (టాలెంట్కు వయసుతో సంబంధమేముంది : నీనా గుప్తా) View this post on Instagram #sachkahoontoe A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on Mar 2, 2020 at 1:51am PST