news paper
-
దేశమంతా ఆరోగ్యశ్రీని ప్రశంసిస్తుంటే రామోజీ వికృత రాతలు
-
హైకోర్టులో ఆంధ్రజ్యోతికి చుక్కెదురు..
-
ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను దిగజార్చేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ 2019లో తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు ఆ పత్రిక యాజమాన్యంపై రూ.100 కోట్లకు టీటీడీ తిరుపతి కోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. అలాగే టీటీడీ తరఫున వాదనలు వినిపించేందుకు మాజీ ఎంపీ సుబ్రహ్మణస్వామికి అనుమతినివ్వాలని కోరుతూ ఒక అనుబంధ పిటిషన్ను కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ తరఫున వాదనలు వినిపించేందుకు సుబ్రహ్మణ్యస్వామికి అనుమతినిస్తూ తిరుపతి కోర్టు 2021 మే 1న ఉత్తర్వులు ఇచ్చిం ది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రజ్యోతి పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఎడిటర్ కె.శ్రీనివాస్, ఎండీ వేమూరి రాధాకృష్ణ తదితరులు వేసిన హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ (సీఆర్పీ) దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యస్వామికి తిరుపతి కోర్టు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరారు. అయితే ఆంధ్రజ్యోతి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. తిరుపతి కోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పులేదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. తమ తరఫున వాదనలు వినిపించేందుకు ఎవరిని నియమించుకో వాలన్నది టీటీడీ ఇష్టమని, ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ప్రతివాదులకు లేదన్న టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఎవరిని నియమించుకోవాలో మా ఇష్టం... నిబంధనలకు అనుగుణంగా తమ తరఫున వాదనలు వినిపించేందుకు కింది కోర్టులో సుబ్రహ్మణ్య స్వామికి అనుమతినిచ్చామని సత్యనారాయణ ప్ర సాద్ వాదనలు వినిపించారు. ఈ విషయంలో టీటీ డీకున్న హక్కును ఎవరూ కాలరాయలేరన్నారు. ఆయన విషయంలో అభ్యంతరం లేవనెత్తే హక్కు ఆంధ్రజ్యోతికి లేదన్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఎన్నో కేసుల్లో సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన గొప్ప స్కాలర్ అని, ఆయన వాదనాపటిమపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. పరువు నష్టం దావాలో జరుగుతున్న విచారణను జాప్యం చేసేందుకే దురుద్దేశాలతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ రివిజన్ పిటిషన్ దాఖలు చేసిందని సత్యనారాయణ ప్రసాద్ కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ భానుమతి ఈ నెల 10న తీర్పు రిజర్వ్ చేశారు. శుక్రవారం తీర్పు వెలువరిస్తూ ఆంధ్రజ్యోతి యాజమా న్యం దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ను కొట్టేశారు. -
పచ్చ విషం గక్కడమే పనిగా పెట్టుకున్నరామోజీరావు
-
ఈ ‘వార్తలు’ మొలకెత్తుతాయ్.. మట్టిలో నాటితే చిగురించే వార్తాపత్రిక
సాక్షి, అమరావతి: వార్తా పత్రికను చదివిన తర్వాత ఏం చేస్తారు? ఆకర్షించే అంశాలుంటే దాచుకుంటారు. లేదంటే చింపి ఇంట్లో అవసరాలకు వాడుకుంటారు. ఎక్కువగా ఉంటే కేజీల్లెక్కన అమ్మేస్తారు. కానీ, వార్తాపత్రికను చదివేశాక మట్టిలోకప్పెడితే.. పరిమళాలు వెదజల్లే పూల మొక్కగానో, ఆరోగ్యాన్నిచ్చే ఔషధ మొక్కగానో మొలకెత్తితే అద్భుతమే కదా! ఈ ప్రయత్నమే చేసింది జపాన్లోని ‘మైనిచి షింబున్షా’. ఆ ప్రచురుణ సంస్థ 2016లో ప్రారంభించిన ‘గ్రీన్ న్యూస్పేపర్’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుత పర్యావరణ సమస్యలపై పిల్లలకు అవగాహన పెంచడానికి, భవిష్యత్ తరానికి పేపర్ రీసైక్లింగ్ ప్రాముఖ్యతను బోధించేందుకు ఉత్తమ మార్గంగా ఈ పత్రిక ప్రత్యేకతను అక్కడి పాఠ్యాంశాల్లో చేర్చడం గమనార్హం. ‘ది మైనిచి షింబున్షా’ మే 4, 2016న ‘గ్రీనరీ డే’ కోసం తొలిసారి ఈ పత్రికను ప్రచురించింది. పర్యావరణ వార్తలకు అంకితం చేస్తూ 100 శాతం బయోడిగ్రేడబుల్ పేపర్తో ప్రత్యేక ఎడిషన్గా వచ్చిన తొలి పత్రికగా ఇది గుర్తింపు పొందింది. పాత కాగితాలను రీసైకిల్ చేసి, దానికి వివిధ రకాల మొక్కల విత్తనాలను జతచేసి తయారు చేసిన కాగితాన్ని ముద్రణ కోసం వినియోగిస్తున్నారు. వార్తలను ముద్రించేందుకు కూడా మొక్కల నుంచి తీసిన సహజసిద్ధ సిరాను వినియోగించడం మరో ప్రత్యేకత. జపాన్ మార్కెట్లో ప్రతిరోజు సుమారు 40.60 లక్షల మందికి చేరుతున్న ఈ పత్రికను చదివిన అనంతరం మట్టిలో పడేస్తే దాన్నుంచి మొక్కలు మొలిచి సీతాకోక చిలుకలను ఆకర్షించే పూలు పూయడం అంతకంటే ప్రత్యేకం. పత్రికలకు పెరుగుతున్న ఆదరణ వార్తా పత్రికలకు అవసరమైన కాగితం కోసం ప్రపంచంలో ఏటా 95 మిలియన్ చెట్లను నరికివేస్తున్నట్టు పర్యావరణం పరిరక్షణకు కృషి చేస్తోన్న అమెరికాకు చెందిన ‘వన్ ఎర్త్’ ఎన్జీవో సంస్థ చెబుతోంది. అయితే, పర్యావరణ ప్రయోజనాన్ని గుర్తించిన మైనిచి షింబున్షా సంస్థ అందుబాటులోకి తెచ్చిన గ్రీన్ న్యూస్పేపర్కు జపాన్లో వచ్చిన ఆదరణను చూస్తుంటే.. ఇంటర్నెట్ కాలంలో కూడా ఇలాంటి పత్రికలను రీడర్స్ విపరీతంగా ఆదరిస్తారని నిరూపితమైనట్టు పేర్కొంది. గ్రీన్ న్యూస్పేపర్ ముద్రణ ద్వారా ప్రచురణకర్త 7 లక్షల డాలర్లకు పైగా ఆర్జించడం పెద్ద సంచలనంగా వన్ ఎర్త్ పేర్కొంది. ఇది వార్తాపత్రిక పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణగా, పర్యావరణంపై ప్రజల్లోని చైతన్యానికి గుర్తుగా వివరించింది. భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోను మొలకెత్తే పత్రికల ముద్రణ ప్రారంభమైందని, అమెరికాలోని అనేక కంపెనీలు వివిధ ప్రయోజనాల కోసం ప్లాంటేషన్ పేపర్ను తయారు చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. ఇటీవల వన్ ఎర్త్ చేసిన సర్వేలో భారత్లో శుభలేఖలు, యూరప్లో 74 శాతం గ్రీటింగ్ కార్డులను మొలకెత్తే రీతిలో తీసుకొచ్చినట్టు తెలిపింది. పచ్చదనం పెంచడానికి దోహదం ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచే కార్యక్రమాలను జపాన్ ప్రభుత్వం ముమ్మరం చేసిన నేపథ్యంలో దేశంలో పచ్చదనం పెంపునకు తమ పత్రిక దోహదం చేస్తున్నట్టు ప్రచురుణ సంస్థ ది మైనిచి షింబున్షా ప్రకటించింది. పత్రిక చదవడం పూర్తయిన తర్వాత చిన్న ముక్కలుగా చింపేసి, ఆ ముక్కలను మట్టిలో నాటాలని, ఆపై ఇతర మొక్కల మాదిరిగానే నీరు పెట్టాలని వారు సూచిస్తున్నారు. జపాన్లోని అతిపెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో ఒకటైన డెంట్సు ఇంక్ ఈ విధానాన్ని కనిపెట్టి, మైనిచితో కలిసి పనిచేస్తోంది. గత కొన్నేళ్లుగా ది మైనిచి షింబున్షా పబ్లిషర్స్ జపాన్ పాఠశాలల్లో పర్యావరణ సమస్యలపై అవగాహన పాఠాలు చెబుతున్నారు. -
‘నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను’.. వైరలవుతోన్న పేపర్ యాడ్
సాధారణంగా డెత్ సర్టిఫికెట్ చనిపోయిన తరువాత ఇస్తారు. డెత్ సర్టిఫికెట్ పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. ఈ మధ్య కాలంలో బతికున్న వారికి కూడా డెత్ సర్టిఫికెట్లు జారీ అవుతున్న ఘటనలు మచ్చుకు కొన్ని చూస్తూనే ఉన్నాం. అధికారుల తప్పిదాల కారణంగా మనిషి బతికున్నప్పటికీ చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కల్లో కొకొల్లలు ఉన్నాయి. తాజాగా డెత్ సర్టిఫికెట్ విషయంలో ఓ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నట్లు పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సాంకు చెందిన రంజిత్ కుమార్ ఈ నెల 7న ఉదయం 10 గంటలకు నాగాన్లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన మరణ ధ్రువీకరణ పత్రం పోయిందని ఒక పత్రికలో ప్రకటన ఇచ్చాడు. సదరు డెత్ సర్టిఫికేట్ నంబర్ కూడా అందులో పేర్కొన్నాడు. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ఈ పేపర్ ప్రకటన ఫొటోను ట్విట్టర్లో ఆదివారం పోస్ట్ చేశారు. ‘ఇలాంటివి కేవలం ఇండియాలోనే జరుగుతాయి’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ ప్రకటనను చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ‘ఆ వ్యక్తి స్వర్గంలో నుంచి సాయం కోరుతున్నాడా? ఒకవేళ ఆ ‘మరణ ధ్రువీకరణ పత్రం’ ఎవరికైనా దొరికితే ఎక్కడికి పంపాలి స్వర్గానికా? లేక నరకానికా? ఒక వ్యక్తి తన డెత్ సర్టిఫికేట్ పోగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే తనకు ఇచ్చేయండి. దయచేసి దీనిని అత్యవసరంగా పరిగణించండి. లేకపోతే ఆ దెయ్యం ఆగ్రహం చెందుతుంది’ అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. చదవండి: షాకింగ్ ఘటన: మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలు... సీరియస్ అయిన మంత్రి -
Viral: మ్యాట్రిమోనీలో యాడ్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాల్ చేయద్దంటూ..
ఒకప్పుడు బంధువులు, తెలిసిన వారి ద్వారా పెళ్లి సంబంధాలు కుదిరేవి. ఇప్పుడు కాలం మారింది. మ్యాట్రిమోనీ సైట్లు వచ్చాక ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నారు. తమ వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేసేస్తున్నారు. అంతేగాక తమకు ఎలాంటి గుణాలు ఉన్న వ్యక్తి కావాలో కూడా చెప్పుకునే అవకాశం ఉటుంది. వీటితోపాటు పత్రిక ప్రకటనలు చూసి కూడా పెళ్లిళ్లు నిశ్చయించుకుంటున్నారు. తాజాగా ఓ పత్రికలో ఇచ్చిన పెళ్లి ప్రకటన వైరల్గా మారింది. వ్యాపారవేత్త సమీర్ అరోరా.. న్యూస్ పేపర్లో ప్రచురితమైన మ్యాట్రిమోనీ అడ్వర్టైజ్మెంట్ క్లిప్ను ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో 24 ఏళ్ల అందమైన అమ్మాయికి ధనవంతులైన, బిజినెస్ బ్యాగ్రౌండ్ ఉన్న వరుడు కావాలి. అదే కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, లేదా డాక్టర్ అని అయి ఉండాలి’ అని ఉంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ప్రకటన చివర్లో ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దయచేసి కాల్ చేయవద్దు’ అని నొక్కి చెప్పారు. ‘ఐటీ రంగానికి భవిష్యత్తు అంతాగా కనిపించడం లేదు’ అనే ట్యాగ్లైన్తో షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2 — Samir Arora (@Iamsamirarora) September 16, 2022 ఓ వర్గం వారు నిజమేనంటూ మద్దతిస్తుంటే.. మరో వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఈ యాడ్ చూస్తుంటే.. దేశ భవిష్యత్తు మొత్తం మంచిగా కనిపించడం లేదు. ఐటీ లేకుంటే భవిష్యత్తే బాగోదు. హమ్మయ్యా నాకు 11 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ఇది సరైంది కాదు. డోంట్ వర్రీ..ఇంజనీర్లు ఇలాంటి వార్తాపత్రికల ప్రకటనపై ఆధారపడరు. వారు తమంతట తాముగా ప్రతిదీ వెతుకుంటారు’ అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కాని ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోది. Don't worry..Engineers don't rely on some newspaper ad. They find everything on their own. — Ajay sharma (@Ajaysha17977479) September 16, 2022 Looking at the ad, the whole country's future doesn't look so sound. — Ashutosh Vishwakarma (@aashutoshaawara) September 16, 2022 Thank god, I got married 11 years ago! — Bharat Trader 🇮🇳 (@BharatTrader) September 16, 2022 -
ఓడినా పైచేయి నిజాందేనంటూ.. మజ్లిస్ పత్రిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు ‘మీజాన్’ పేరుతో ఓ పత్రిక ఉంది. నరరూప రాక్షసుడిగా ముద్రపడ్డ ఖాసింరజ్వీ నేతృత్వంలో ఉన్న సంస్థ కావటంతో దాని పత్రిక కూడా నిజాం సేనలకు అనుకూల వార్తలతో జనాన్ని తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. ఓవైపు భారత సేనలు హైదరాబాద్ను చుట్టుముట్టడంతో నిజాం సైన్యం తోకముడిచినా.. ఎంఐఎం పత్రిక మీజాన్ మాత్రం, నిజాం సైన్యానిదే పైచేయి అంటూ తప్పుడు కథనాలను జనంలోకి వదిలింది. మరోవైపు నిజాం నియంత్రణలో ఉన్న హైదరాబాద్ రేడియో కూడా నిజాం సేనలు వీరోచితంగా పోరాడుతూ భారత సైన్యాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నాయని వార్తలు వెలువరించింది. సెప్టెంబర్ 17 సాయంత్రం వరకు జరిగిన ఈ తంతు ఆ తర్వాత ఆగిపోయింది. తప్పుడు వార్తలే కాదు, తుదకు ఆ పత్రిక, రేడియో కూడా ఆ తర్వాత మూగబోయాయి. సైన్యానికి స్వాగతం పలికిన జనంపై రజాకార్ల దాడులు భారత సైన్యం రాకను అడ్డుకోలేకపోయిన నిజాం సేనలు, ఆ అక్కసును సాధారణ ప్రజలపై చూపించాయి. నగరానికి చేరుకున్న భారత సైనిక పటాలాలను చూసి సంబరపడ్డ జనం, హారతులిచ్చి స్వాగతం పలికాయి. బొల్లారం మిలటరీ కేంద్రం వద్ద పండగ వాతావరణం నెలకొంది. సెప్టెంబరు 17న రాత్రి అక్కడికి దొంగచాటుగా చేరుకున్న రజాకార్ల బృందం సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో అమాయకులు బలయ్యారు. విషయం తెలుసుకున్న భారత సైనికులు గాలించి మరీ ముష్కరులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. చదవండి: (బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని) -
కళ్ళు ఉండి చూడలేని కబోది రాతలు
-
అగ్నిపథ్కు షింజో అబే హత్యకు ముడిపెడుతూ..
కోల్కతా: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు.. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్కు ముడిపెడుతూ ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో విమర్శలకూ దారి తీసింది. జపాన్ రాజకీయవేత్త షింజో అబేను హతమార్చిన వ్యక్తి పేరు టెత్సుయ యమగామి(41). జపాన్ నావికా దళంలో మూడేళ్లపాటు పని చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం లేకుండా.. పెన్షన్ రాకుండా ఇబ్బంది పడ్డాడు. ఆ కోపంతోనే షింజోను కాల్చి చంపేశాడు అంటూ సదరు కథనం హాట్ హాట్ చర్చకు దారి తీసింది. ఈ కథనాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ ఫ్రంట్పేజీ కథనంగా ప్రచురించింది ఇవాళ. అంతేకాదు.. మోదీ ప్రభుత్వం కూడా యువతను రక్షణ దళంలో నాలుగేళ్ల పాటు పని చేయించుకుని.. పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా చూడాలని ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో భారత్లోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చంటూ ఆ కథనంలో కేంద్రంపై విమర్శలు గుప్పించింది. మరోవైపు శుక్రవారం ఘటన జరిగిన కొన్ని గంటలకే.. కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్పుత్ కూడా దాదాపు ఇలాంటి అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశాడు. యమగామి జపాన్ ఎస్డీఎఫ్లో పని చేశాడు. కానీ, ఎలాంటి పెన్షన్ అతను పొందలేకపోయాడు అంటూ ట్వీట్ చేశాడాయన. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత ట్వీట్తో పాటు టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లా కథనంపై బీజేపీ మండిపడింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగానే ఆ పత్రిక కథనాలు ప్రచురిస్తుంది. అసలు అగ్నిపథ్కు అబే మరణానికి మృతి పెట్టి కథనం రాసింది ఎవరు?. దేశం మీద గౌరవం, ప్రేమ ఉన్న ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయరు. జాగో బంగ్లా చేసింది ముమ్మాటికీ తప్పే. భారత యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది టీఎంసీ. షింజో అబే మీద గౌరవంతో భారత్ సంతాప దినం పాటిస్తున్న వేళ.. ఇలాంటి కథనం దురదృష్టకరం అని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ విప్ మనోజ్ తిగ్గా ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: షింజో అబేపై కాల్పులకు అసలు కారణం ఇదే.. -
ప్రింట్ మీడియాపై రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రింట్ మీడియా ఆదాయంలో 25 శాతం వరకు వృద్ది ఉండొచ్చని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ నివేదిక వెల్లడించింది. ప్రకటనలు అధికం కావడమే ఇందుకు కారణమని వివరించింది. ప్రకటనల ఆదాయం 25–30 శాతం, సర్క్యులేషన్ ఆదాయం 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా న్యూస్ప్రింట్ ఖర్చుల భారం అధికం అయింది. ఇది లాభదాయకతను తగ్గిస్తుంది. ప్రింట్ మీడియా సంస్థల నిర్వహణ లాభాల మార్జిన్లు 3 శాతం పాయింట్ల వరకు క్షీణిస్తాయి. 2020–21లో వినియోగించిన న్యూస్ప్రింట్లో 60 శాతం దిగుమతి చేసుకున్నదే. యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి న్యూస్ ప్రింట్ ధర 80 శాతం దాకా దూసుకెళ్లింది. దిగుమతులు తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో న్యూస్ ప్రింట్ మరింత ప్రియం అయ్యే అవకాశం ఉంది. సర్క్యులేషన్, ప్రకటనల పరిమాణం పునరుద్ధరణతో న్యూస్ప్రింట్ వినియోగంలో పెరుగుదలకు దారి తీస్తుంది’ అని వివరించింది. -
‘అమ్మ ఆవేదన’కు కదిలిన హృదయాలు
శ్రీకాకుళం: టెక్కలి ఎన్టీఆర్ కాలనీకు చెందిన బూసి అఖిల్ అనే కిడ్నీ బాధిత యువకునికి సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. కుమారుడి రెండు కిడ్నీలు పాడై, మెరుగైన వైద్యం కోసం తల్లి లోకేశ్వరి డబ్బులు కోసం పడుతున్న వేదనపై ‘సాక్షి’ లో ‘అమ్మ ఆవేదన’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి దాతలు స్పందిస్తున్నారు. టెక్కలికి చెందిన అభయం యువజన సేవా సంఘం సభ్యులు తమ వంతు సాయంగా రూ.15 వేలను బాధితుడి తల్లి లోకేశ్వరికి అందజేశారు. ఇందులో సేవా సంఘం నుంచి రూ.10 వేలు, ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడు శంభాన శ్రీనివాసరావు తన వంతు సాయంగా రూ.5 వేలు అందించారు. అలాగే పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ బెహరా కృష్ణవేణి కాళీ తన వంతు సాయంగా రూ.5 వేలను బాధితుడి తల్లికి అందజేశారు. చదవండి: ట్విట్టర్ను వదిలేస్తున్నారు,'కూ' కు క్యూ కట్టేస్తున్నారు -
హాంకాంగ్లో ‘యాపిల్ డైలీ’ కథ ముగిసింది
హాంకాంగ్: హాంకాంగ్ ప్రజాస్వామ్య డిమాండ్కు మద్దతుగా నిలిచిన చివరి పత్రిక ‘యాపిల్ డైలీ’ మూతపడింది. గురువారం ఆ పత్రిక చివరి సంచిక వెలువడింది. మొత్తం 10 లక్షల కాపీలు గంటల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. యాపిల్ డైలీ కాపీల కోసం పాఠకులు ఎగబడ్డారు. దుకాణాల ముందు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అర్ధ స్వయంప్రతిపత్తి కలిగిన హాంకాంగ్పై పూర్తిగా పట్టుబిగించేందుకు డ్రాగన్ దేశం చైనా పావులు కదుపుతోంది. హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమాలను కఠినంగా అణచివేస్తోంది. ఇన్నాళ్లూ ప్రజా పోరాటాలకు అండగా నిలిచిన యాపిల్ డైలీ పత్రిక మూతపడడంతో ఇక చైనాకు మరింత బలం చేకూరినట్లేనన్న వాదన వినిపిస్తోంది. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించేలా విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తోందంటూ యాపిల్ డైలీపై చైనా పాలకులు కన్నెర్ర చేశారు. ఇటీవల ఆ పత్రికకు చెందిన ఐదుగురు సంపాదకులను అరెస్టు చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 2.3 మిలియన్ డాలర్ల విలువైన యాపిల్ డైలీ ఆస్తులను స్తంభింపజేశారు. ఈ నేపథ్యంలో ఇక పత్రికను మూసివేయడమే శరణ్యమని యాపిల్ డైలీ యజమానులు నిర్ణయాని కొచ్చారు. ఈ పత్రిక మూతపడడం హాంకాంగ్లో పత్రికా స్వేచ్ఛకు చీకటి రోజని జార్జిటౌన్ సెంటర్ ఫర్ ఆసియన్ లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ కెల్లాగ్ చెప్పారు. హాంకాంగ్ డౌన్టౌన్లో యాపిల్ ప్రతుల కోసం ప్రజల క్యూ -
పాత పేపర్కు డిమాండ్ పెరిగిందండోయ్.. కిలో ఎంతంటే!
సాక్షి, ఆదిలాబాద్ : పాత పేపర్ ధర అమాంతగా పెరిగిపోయింది. కిలో ధర రూ. 35 రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పాతపేపర్ కొరత ఉండడంతో గిరాకీ పెరిగింది. గతంలో కిలో రూ. 4 నుంచి 9 రూపాయల వరకు మాత్రమే ఉండేది. కాని కరోనా నేపథ్యంలో పేపర్ మార్కెట్లోకి రాకపోవడంతో డిమాండ్ పెరిగింది. ఇటీవల మండల కేంద్రానికి చెందిన వ్యాపారి 10 టన్నుల పేపర్ను గుజరాత్ నుంచి కొనుగోళ్లు చేసి నిజమాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో విక్రయించారు. చదవండి: కొడుకుతో సమయం కేటాయించాలని.. న్యూస్ పేపర్ -
కొడుకుతో సమయం కేటాయించాలని.. న్యూస్ పేపర్
ఎనిమిదేళ్ల కొడుకుచేత వార్తాపత్రిక చదివించాలనుకుంది ఆ తల్లి. పిల్లలకోసమే వార్తాపత్రిక ఏదైనా ఉందా అనే వెతికింది. అలాంటి పత్రికలేవీ కనిపించక తన కొడుకు లాంటి పిల్లల కోసం ‘ది చిల్డ్రన్స్ పోస్ట్’ అనే పేరుతో దిన పత్రిక ప్రారంభించింది. ఆ తల్లి పేరు నిధి అరోరా. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్లో ఉంటుంది. వార్తాపత్రికలు మనోవృద్ధికి ఎంతగా తోడ్పడుతాయో పిల్లవాడికి రోజూ పాఠంలా చెప్పేది. కానీ, కొన్ని రోజులకు పిల్లవాడితో పత్రిక చదివించాలనుకుంది. కానీ, పిల్లల కోసమే ఉన్న దినపత్రిక ఏదీ కనిపించలేదు. అందుకే, 2017లో ‘ది చిల్డ్రన్స్ పోస్ట్’ పేరుతో వార్తాపత్రిక ప్రారంభించింది. కొడుకుతో సమయం కేటాయించాలని.. నిధి 2015 డిసెంబర్ వరకు మంచి కార్పోరేట్ సంస్థలో ఉద్యోగిని. క్వాలిటీ టైమ్ను కొడుకుకి కేటాయించాలనుకుంది. కొడుకులో చదివే అలవాటును పెంచాల్సిన అవసరంతో ఉద్యోగాన్ని వదిలేసింది. ఇప్పుడు పత్రికను దానితో పాటు ఓ ఎన్జీవో సంస్థను కూడా నడుపుతుంది. ఓ కన్సల్టింగ్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలుగా ఉంది. ఆమె పత్రికా పాఠకులు 8 నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. పేపర్ ద్వారా పిల్లలకు మాట్లాడే గొంతుక అవ్వాలని, ఆ గళాన్ని తల్లిదండ్రులు వినాలని కోరుకుంటుంది. దేశం నలుమూలలా.. పేపర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే పాఠకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఆ ఉత్సాహం ఆమెను ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంది. ‘మాకు భారతదేశం నలుమూలల నుండి, నాగాలాండ్, గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్, కేరళ వరకు పాఠకులు ఉన్నారు. ఇప్పుడు దేశ హద్దులు దాటి జింబాబ్వే, యుఎస్, కెనడా, యు.ఎ.ఇ, దోహా, ఒమన్ల నుంచీ పాఠకులు కూడా ఉన్నారు. ఇంతగా పాఠకుల సంఖ్య ఎలా పెరిగిందో ఆశ్చర్యంగా ఉంది’ అంటోంది నిధి. తల్లులతో సంభాషణ తను రోజూ చేసే పని గురించి వివరిస్తూ –‘మా అబ్బాయి ఇప్పుడు చదివే అలవాటును పెంచుకోకపోతే, అది ఎప్పటికీ జరగదని నేను భయపడ్డాను. గురుగ్రామ్ తల్లులతో (ఫేస్బుక్ పేరెంటింగ్ గ్రూప్) నా ఆందోళనను పంచుకున్నాను. పిల్లల కోసం ఒక వార్తాపత్రికను ప్రారంభించాలనే ఆలోచన గురించి వారితో మాట్లాడాను. నన్ను ప్రోత్సహించారు. దీంతో వార్తాపత్రికను ప్రారంభించే ధైర్యం నాకు వచ్చింది. మొదటి కాపీని మా అబ్బాయికి ఇచ్చినప్పుడు, వచ్చి నన్ను కౌగిలించుకొని ‘అమ్మా, చెప్పలేనంత సంతోషంగా ఉంది’ అన్నాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడనవసరం లేకపోయింది. రెండు నెలల్లో ఏడు వేర్వేరు ఎడిషన్లలో ఏడుగురు ఎడిటర్లు (తల్లులు) చేరారు. పిల్లల కోసం వారానికి ఒకరు చొప్పున ఎడిషన్ తీసుకువస్తారు. దీంతో ఆ తల్లుల మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు. మా పిల్లలు ఈ పత్రికను ఇష్టపడిన తర్వాత, మేం దానిని విస్తృతంగా పాఠకుల వద్దకు తీసుకువెళ్లాం. కార్టూనిస్ట్గా ఎదుగుదల పత్రికకు మా అబ్బాయి కూడా సాయం అందిస్తున్నాడు. పిల్లలూ పాల్గొంటున్నారు. దాదాపు 40–50 శాతం కంటెంట్ అంతా మా పాఠకుల నుండే వస్తుంది. బాగా, పజిల్స్, కార్టూన్లు (చైల్డ్ కార్టూనిస్టులు చేస్తారు), కవిత్వం, వర్డ్ మ్యాజిక్, ప్రస్తుత వార్తలు ఉంటాయి. అంతర్జాతీయ వ్యవహారాలు, ఆర్థిక శాస్త్రం, సాంకేతికత, సమాచార భద్రతకు సంబంధించినవి కూడా ఇస్తాం. మంచి పౌరులుగా పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి తగిన విభాగాలు మా పత్రికలో ఉన్నాయి. హింస, లైంగిక వేధింపులు మినహా అన్నింటినీ కవర్ చేస్తాం. దీని ద్వారా వారు ప్రధాన సమస్యపై మంచి అవగాహన తో ఉంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మా అబ్బాయి ఈ పేపర్కి కార్టూనిస్ట్ అయ్యాడు. సొంత ఆలోచనతో కార్టూన్లు వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకు మించి క్రమశిక్షణ, నిబద్ధత, సకాలంలో పనులు చేయడం అలవాటైంది. సృజనాత్మకంగా బాధ్యతగా ఉండటం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. సమాజం పట్ల ఒక అవగాహనతో ఉంటున్నాడు. ప్రక్రియలో తల్లీకొడుకులుగా మేమిద్దరం ఎదిగాం అనిపిస్తుంది’ అని వివరించిన నిధి తమ పత్రికను హోటళ్ళు, ఆసుపత్రులు, పిల్లలలు ఉండే అన్ని చోట్లా వార్తాపత్రిక ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. -
నారా లోకేష్ తీరుపై తీవ్ర వ్యతిరేకత
సాక్షి, ప్రకాశం : నారా లోకేష్ తీరుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లాలో బుధవారం మంత్రి మాట్లాడుతూ.. సాక్షి పత్రిక ప్రతులను తగాలబెడతావా అని లోకేష్పై నిప్పులు చెరిగారు. పత్రికలపై గౌరవం ఉన్న వారు ఇటువంటి పని చేయరని పేర్కొన్నారు. అలాగైతే తప్పుడు కథనాలు రాస్తున్న మీ పచ్చ పత్రికను మేమేం చేయాలని ప్రశ్నించారు. దానిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మాకు ఏ పథకం అందలేదని కొందరితో చెప్పించి మీ అనుంగు పత్రికలో అబద్దాలు రాయించారని మండిపడ్డారు. వాళ్ళు పొందిన లబ్దికి ఆధారాలు ఉన్నాయని చూపించారు. మీ పత్రికలో రాసిన మేడపి గ్రామ వాసులు రేగుల కాశయ్య, అనురాధ కుటుంబానికి వివిధ పథకాల ద్వారా 2లక్షల 88వేల 545 పాయలు అందాయని స్పష్టం చేశారు. అమ్మఒడి రాలేదని రాసిన రేగుల అనురాధ ఖాతాలో గత ఏడాది రూ 15 వేలు జమ అయ్యిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. చదవండి: పప్పూ... ఇది తప్పు!! కాగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో మంగళవారం సాక్షి ప్రతుల్ని చింపి దహనం చేసిన నారా లోకేష్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన్ను చూసి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడాలని, తెలుగుదేశం పార్టీ తలదించుకోవాలని మండిపడుతున్నారు. ఈయనకు ప్రజాస్వామ్యమన్నా.. దానికి మూలస్తంభాల్లాంటి పత్రికలన్నా ఏ కొంచమైనా గౌరవం ఉందా? ఉంటే ఇలా చేస్తాడా? నిజాలు తనకు నచ్చనంత మాత్రాన ఏకంగా పత్రిక ప్రతులనే తగలబెట్టే సాహసం చేశాడంటే ఈయన రాజకీయాలకు పనికొస్తాడా? అధికారం లేదనే నైరాశ్యంలో.. తమ కుట్రలు బయటపడిపోతున్నాయన్న అక్కసుతో ఇంతకు దిగజారిపోతాడా? అని ప్రశ్నిస్తున్నారు. -
నిన్నటి పేపర్ అలాగే ఉండటంతో అనుమానం..
సాక్షి, న్యూఢిల్లీ : సమయ స్ఫూర్తి కలిగిన వారు జీవితంలో విజయం సాధించడమే కాకుండా ఎదుటి వారి జీవితాలను రక్షించి ప్రశంసలు అందకుంటారని దక్షిణ ఇంగ్లండ్లోని డార్సెట్ నగరానికి చెందిన 15 ఏళ్ల నవోమీ జుప్ అనే బాలిక నిరూపించారు. బతుకుతెరవు కోసం గత రెండేళ్లుగా ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్ వేస్తున్న ఆ బాలిక రోజూలాగే ఈ నెల 15వ తేదీన కూడా క్రైస్ట్చర్చ్ ప్రాంతంలో ఇంటింటికి పేపర్ వేస్తూ వెళ్లింది. ఓ ఇంటి వద్ద పేపర్ బాక్సులో పేపర్ వేయబోతుండగా, అంతకుముందు రోజు పేపర్ కూడా కనిపించింది. ఆ ఇంటిలో ఉంటున్న వారెవరో పేపర్ కోసం బయటకు రాలేక పోయారని ఆమెకు అర్థం అయింది. వెంటనే ఆ బాలిక 101కు ఫోన్చేసి పోలీసులకు ఈ విషయం చెప్పింది. అనారోగ్యం లేదా మరో కారణం వల్లనో ఆ ఇంట్లోని వారు బయటకు రాలేకపోయి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. (చదవండి: వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్) పోలీసులు హుటాహుటిన వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లగా ఓ మంచం మీద అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న ఓ వద్ధుడు కనిపించారు. పోలీసులు వెంటనే అంబులెన్స్ను పిలిపించి ఆ వద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. ఆ ఇంట్లో ప్రభుత్వ పింఛనుదారుడు ఒక్కరే నివసిస్తున్నారు. ఆయన పూర్తిగా కోలుకుని బుధవారం నాడే ఇంటికి చేరుకున్నారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించి నిండు ప్రాణాలను రక్షించినందుకు ఆ ప్రాంతం పోలీసు అధికారి ఆమెను ప్రశంసిస్తూ ‘ప్రత్యేక గుర్తింపు పత్రం’తో సత్కరించారు. లాక్డౌన్లో కూడా పేపర్ ఆపకుండా తన విధులను సక్రమంగా నిర్వహించిందంటూ ఆ ప్రాంతం వాసులు కూడా ఆమెను ప్రశంసించారు. (చదవండి: రాబిన్ హుడ్ అవతారమెత్తిన డీజీపీ ) -
వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్
శ్రీనగర్ : కొవిడ్-19 కట్టడిలో భాగంగా ఓ ఉర్దూ దినపత్రిక వినూత్న ప్రచారానికి తెరతీసింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కేవలం సూచనలు ఇవ్వడమే కాకుండా, ఏకంగా ఓ మాస్క్ను పాఠకులకు ఉచితంగా ఇచ్చింది. జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్కు చెందిన స్థానిక ఉర్దూ పత్రిక రోష్నీ, తమ ముందు పేజీలో ఓ మాస్క్ను అంటించి తమ పాఠకులకు అందించింది. (అంత లేదు, కేసుల సంఖ్యతో పరేషాన్ కావొద్దు) ‘ఈ సందేశాన్ని ప్రజలకు పంపించడం ఈ సమయంలో ముఖ్యమని మేము భావించాము. మాస్క్ ధరించాలనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చేయడానికి ఇది మంచి మార్గం’ అని రోష్ని ఎడిటర్ జహూర్ షోరా అన్నారు. (అయ్యో! తాతకోసం చిన్నోడి కష్టం) ఇక రోష్ని పత్రిక చూపించిన చొరవను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. కరోనా కట్టడిపై కేవలం సూచనలకే పరిమితం అవ్వకుండా పాఠకులకు మాస్క్లను పంపిణీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో సోమవారం ఒక్క రోజే 751 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా, పది మంది మృతిచెందారు. మొత్తంగా 13,899 కేసులు నమోదవ్వగా 244 మంది మృతిచెందారు. -
కరోనాపై పోరులో మీడియాది అసమాన పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల కు సరైన, అవసరమైన సమాచారాన్ని చేరవేస్తూ అనుక్షణం వారిని అప్రమత్తం చేయడంలో ప్రసారమాధ్యమాలు పోషించిన నిర్మాణాత్మక పాత్రను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ‘కరోనాపై పోరులో ప్రసార మాధ్యమాల అసమాన పాత్ర’ పేరుతో ఆదివారం ఫేస్బుక్ వేదికగా విడుదల చేసిన వ్యాసంలో.. గతకొద్ది నెలలుగా వైరస్కు సంబం ధించిన ప్రతి అంశాన్ని ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరచడంలో.. జాగ్రత్తగా ఉండేందుకు ప్రభుత్వాలు చేసిన సూచనలను నిరంతరం ప్రజలకు చేరవేయడంలో మీడియా పోషించిన పాత్రను అభినందించారు. అలాగే పత్రికలు వైరస్ వాహకాలని మొదట్లో ప్ర చారం జరిగిందని, అదేమా త్రం వాస్తవం కాదన్నారు. ‘నేను రోజూ పత్రికలు చదువుతూనే ఉన్నాను’ అని ఆయన వెల్లడించారు. నెటిజన్లు బాధ్యతగా మెలగాలి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ధ్రువీకృత సమాచారాన్ని మాత్రమే వెల్లడించాలని..లేకుంటే ప్రజల్లో ఆందోళన నెలకొంటుందని ఉపరాష్ట్రపతి అన్నారు. మహ మ్మారికి సంబంధించిన వివిధ అంశాలను లేవనెత్తడం ద్వారా, వాస్తవిక, విశ్లేషణాత్మక పద్ధతి లో ప్రచురించడం ద్వారా పార్లమెంటరీ సంస్థల చర్చల విషయంలో మీడియా ఒక అజెండాను సూచించిందన్నారు. -
న్యూస్ పేపర్తో రైలు.. ఆశ్చర్యపోయిన రైల్వే శాఖ
తిరువనంతపురం: కేరళకు చెందిన 12 ఏళ్లు బాలుడు న్యూస్ పేపర్తో అచ్చం రైలు నమూనాను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. లాక్డౌన్లో మెదడుకు పదును పెట్టి తన సృజనాత్మకతను చాటుకుని మాస్టర్గా మారాడు. తన టాలెంట్తో నెటిజన్లతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖను కూడా అబ్బురపరిచిన ఈ బాలుడి పేరు అద్వైత్ కృష్ణ. ఇతడు కేరళలో త్రిస్పూర్లోని సీఎన్ఎన్ బాయ్స్ హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. మాస్టర్ అద్వైత్ న్యూస్ పేపర్తో రైలును తయారు చేస్తున్న వీడియోలను, ఫొటోలను గురువారం రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. (‘ఆ ఉద్యోగులకు భారీగా వేతన పెంపు’) Master Adwaith Krishna, a 12 year old rail enthusiast from Thrissur, Kerala has unleashed his creative streak and has made a captivating train model using newspapers. His near perfection train replica took him just 3 days. pic.twitter.com/H99TeMIOCs — Ministry of Railways (@RailMinIndia) June 25, 2020 ‘12 ఏళ్ల మాస్టర్ అద్వైత్ ఈ రైలును రూపొందించడానికి కేవలం 3 రోజుల సమయం తీసుకున్నాడు. ఇది తయారు చేయడానికి 33 న్యూస్ పేపర్లు, 10 ఎ4(A4) షిట్లు, గ్లూను ఉపయోగించి అచ్చమైన రైలు ప్రతిరూపాన్ని తయారు చేశాడు’ అని రైల్యే శాఖ తన ట్వీట్లో పేర్కొంది. మాస్టర్ అద్వైత్ రైలు ఇంజన్, బోగీలను, ఇతర భాగాలను తయారు చేసి వాటిని అమర్చిన విధానాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. కాగా ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 32 వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్లు వచ్చాయి. ‘అద్భుతం’, ‘ఈ బాలుడి తెలివి అందరికి స్ఫూర్తి’, ‘ఇతడికి రైల్వే ఆర్ అండ్ డీలో ఉద్యోగం ఇవ్వండి తన తెలివితో కొత్త టెక్నాలజీని తీసుకువస్తాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదువెందుకు..పెళ్లిచేసేయండి అన్నారు!) pic.twitter.com/qRN6WEQ3ms — Ministry of Railways (@RailMinIndia) June 25, 2020 -
ఉద్దీపన ప్యాకేజీతో ఆదుకోండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆదాయం పడిపోయి వార్తాపత్రికల సంస్థలు కుదేలవుతున్నాయని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రకటనల ఆదాయం, సర్క్యులేషన్ తగ్గిపోవడంతో న్యూస్పేపర్ పరిశ్రమ ఇప్పటికే రూ. 4,000–4,500 కోట్ల దాకా నష్టపోయిందని పేర్కొంది. ప్రభుత్వం తక్షణం ఉద్దీపన ప్యాకేజీలాంటిదేదైనా ఇవ్వకపోతే వచ్చే ఆరు.. ఏడు నెలల్లో దాదాపు రూ. 15,000 కోట్ల దాకా నష్టపోయే ముప్పు ఉందని తెలిపింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ అంశాలు పేర్కొన్నారు. వార్తాపత్రిక పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 లక్షల మంది పైచిలుకు జర్నలిస్టులు, ప్రింటర్లు, డెలివరీ వెండార్లు వంటి వారు పనిచేస్తున్నారని, నష్టాల కారణంగా వీరందరిమీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో న్యూస్ప్రింట్పై అయిదు శాతం కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయాలని, రెండేళ్ల పాటు న్యూస్పేపర్ సంస్థలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, ప్రింట్ మీడియా బడ్జెట్ను 100 శాతం పెంచాలని ఐఎన్ఎస్ విజ్ఞప్తి చేసింది. పెండింగ్ అడ్వర్టైజింగ్ బిల్లులను తక్షణం సెటిల్ చేయాలని కోరింది. తక్షణమే ప్యాకేజీ ప్రకటించాలి: కార్పొరేట్ ఇండియా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు పరిశ్రమలకు వెంటనే ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించాలని దేశీయ పరిశ్రమలు (కార్పొరేట్ ఇండియా) కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. లాక్డౌన్ తీవ్రమైన ఆర్థిక విఘాతానికి దారితీసినట్టు కార్పొరేట్ ఇండియా వ్యాఖ్యానించింది. లాక్డౌన్ను మే 4 నుంచి మరో రెండు వారాల పాటు కొనసాగిస్తూ, అదే సమయంలో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఎన్నో వెసులుబాట్లు ఇవ్వడాన్ని స్వాగతించింది. నియంత్రణలతో కూడిన ఆర్థిక కార్యకపాల నేపథ్యంలో సత్వరమే, ప్రభావవంతమైన సహాయక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. -
డెత్ నోటీసుల కోసం పేపర్ పేజీలు పెంచారు
రోమ్ : చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ఇతర దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇటలీ, ఇరాన్లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కరోనా బారిన పడి మృతిచెందే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 1400కు పైగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా ఇటలీలో కరోనా తీవ్రత ఎలా ఉందో తెలిపే ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇటలీలోని ఓ స్థానిక పత్రికలో డేత్ నోటీసులు ప్రచురించడానికి మాములుగా ఒక పేజీని కేటాయిస్తారు. అయితే కరోనా మృతుల నేపథ్యంలో దానిని పది పేజీలకు పెంచేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న లోంబార్డిలో పబ్లిష్ అయ్యే ‘లి ఎకో డి బెర్గామో’ అనే స్థానిక పత్రికలో ఫిబ్రవరి 9వ తేదీన ఒక పేజీన్నర భాగంలో డెత్ నోటీసులను ప్రచురించారు. ఆ సమయంలో ఇటలీలో కేవలం ముగ్గురికి కరోనా సోకినట్టు మాత్రమే నిర్ధారణ అయింది. మార్చి 13న అదే పేపర్లో డేత్ నోటీసులను ప్రచురించడానికి పది పేజీలను కేటాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇటలీలో కరోనా ఏ విధంగా మృత్యు ఘంటికలు మోగిస్తుందో ప్రపంచానికి చాటిచెప్పారు. కాగా, మార్చి 13 వరకు ఇటలీలో 17,600 మందికి కరోనా పాజిటివ్గా తేలగా.. అందులో 1,266 మంది మృతిచెందారు. మరోవైపు ఇటలీలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఐసీయూలో బెడ్స్ సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఒకవేళ హాస్పిటల్స్లో బెడ్స్ కొరత ఉంటే 80 ఏళ్లు పైబడినవారికి, ఆరోగ్యం పూర్తిగా క్షీణించినవారికి ఐసీయూలోకి ప్రవేశం నిరాకరించాలని సలహా ఇస్తూ టురిన్లోని విపత్తు నిర్వహణ బృందం నిర్ణయం తీసుకుంది. బాధితులకు సరిపడ బెడ్స్ లేనప్పుడు ఎవరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించాలనే దానిపై కూడా ఓ ప్రణాళికను తయారుచేసింది. -
బిగ్ ఫైట్/శుభారాణి
శుభారాణి దశ్ రోజూ తెల్లవారుజామున 3.20కి నిద్ర లేస్తారు. కాలకృత్యాలు ముగించుకుని ఆ చీకట్లోనే సైకిల్ మీద న్యూస్ పేపర్ల ఏజెంట్లు ఉండే సెంటర్కు వెళ్తారు. భువనేశ్వర్లో తన నివాసానికి దగ్గరగా ఉండే 200 ఇళ్లకు ఆ పేపర్లను డెలివరీ చేస్తారు. 7.30 కల్లా పేపర్ వెయ్యడం పూర్తవుతుంది. అక్కడి నుంచి స్కూలు పిల్లలకు ట్యూషన్ చెప్పేందుకు అదే సైకిల్ మీద కొన్ని ఇళ్లకు వెళ్తారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. తర్వాత ఇంట్లోనే సాయంత్రం వరకు కుట్టు మెషీన్ మీద బట్టలు కుడతారు. పాత న్యూస్పేపర్లతో కవర్లు తయారు చేస్తారు. ఆ కవర్లు ఎక్కువ మొత్తంలో జమ అయ్యాక ఒక రోజు వాటిని తీసుకెళ్లి కిరాణా దుకాణాలకు అమ్ముతారు. శుభారాణి దినచర్య ఇది. ఈ పనులన్నిటి మధ్య ఎప్పుడో కాస్త ఎంగిలి పడతారు. ఉదయం పేపర్ల సెంటర్కు వెళ్లినప్పుడు ఎవరైనా ఇప్పిస్తే టీ తాగుతారు. ఎప్పుడైనా గుర్తొస్తే ఒడిశా ఫుట్బాల్ అసోసియేషన్ తనకు ఇచ్చిన ప్రశంసాపత్రాలు, అవార్డులను తీసి చూసుకుంటారు. అవును శుభారాణి ఒకప్పుడు ఫుట్బాల్ ప్లేయర్! ఇప్పుడు న్యూస్ పేపర్ హాకర్. ప్రస్తుతం ఆమె వయసు 44 ఏళ్లు. 1992లో తొలిసారి ఒడిశా రాష్ట్ర తొలి మహిళా ఫుట్బాల్ జట్టు సభ్యురాలిగా అస్సామీ కొండ ప్రాంతపు మైదానం హఫ్లాంగ్కు వెళ్లారు శుభారాణి. ఆ ఆటలో శుభారాణి ఒడుపైన ఆట వల్ల ఒడిశా జట్టు క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగింది. ఫుట్బాల్ క్రీడాకారిణిగా ఆమె కెరీర్ కూడా 1998 వరకు చురుగ్గా ఎదిగింది. అయితే ఆ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత శుభారాణి మళ్లీ ఫుట్బాల్ ఆడలేకపోయారు. ఒడిశా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా ఎంపికై ఇక ఉద్యోగంలో చేరబోతుండగా జరిగిన యాక్సిడెంట్ అది. అలా ఉద్యోగం కూడా ఆమెకు చేజారింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ పేద కుటుంబంలో పుట్టారు శుభారాణి. స్కూల్లో ఆమె ఖో–ఖో ప్లేయర్. ఫుట్బాల్కు ముందు చిన్న వయసులోనే ఖో–ఖోలో నేషనల్ గేమ్స్ ఆడారు. శుభారాణికి యాక్సిడెంట్ అయిన రెండేళ్లకు ప్రకాశ్ చంద్ర మిశ్రా అనే బంధువులబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె తండ్రి. ప్రకాశ్ చంద్ర న్యూస్ పేపర్ హాకర్. భువనేశ్వర్ దగ్గరి షాహిద్ నగర్ ఏరియాలో ఇల్లు. చిన్న పెట్టెలాంటి గది అది. అక్కడే జోత్స్నమయి, స్తుతి ఆరాధన పుట్టారు. రెండేళ్ల క్రితం వరకు అక్కడే ఉన్నారు కానీ, పిల్లలు పెద్దవాళ్లు అవుతుండడంతో దగ్గర్లోనే ఇంకో ఇంటికి మారాల్సి వచ్చింది. ఆ ఇంటి అద్దె ఏడు వేలు. భార్యాభర్తలతో పాటు, పిల్లలిద్దరూ చదువుకుంటూనే పేపర్లు వేస్తుంటారు. అందరికీ కలిపి నెలకు 12 వేలు వస్తుంది. అద్దె పోగా మిగిలేది ఐదు వేలు. ఆ ఐదు వేలలోనే కుటుంబం గడవాలి. పాత ఇంట్లో (గదిలో) బాత్రూమ్ లేదు. గది బయటే పాలిథిన్ షీట్లతో స్నానాలకు ఒక ‘మాటు’ను ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు లేచే సరికే వీళ్ల స్నానాలు ముగించుకునేవారు. తర్వాత పిల్లల కోసం ఇల్లు మారక తప్పలేదు. భువనేశ్వర్లో వచ్చే ఏడాది ‘ఫిఫా’ యు–17 ఉమెన్స్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఒడిశా క్రీడా శాఖ అధికారులు ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఆ అధికారుల దగ్గరే పెన్షన్ కోసం శుభారాణి దరఖాస్తు చేసుకున్న కాగితం కూడా ఉంది. వాళ్లు దాన్ని ఓకే చేస్తే నెల నెలా ఆమెకు 3000 రూపాయలు వస్తాయి. శుభారాణి చెయ్యి చాసి ఎవర్నీ ఏమీ అడగలేదు. అడగలేరు కూడా. స్వాభిమానం. కానీ ఇలా జీవితంతో పోరాడేవారికి వాళ్లు నోరు తెరిచి అడక్కుండానే వాళ్లకు దక్కాల్సింది దక్కాలి. ‘‘అద్దె ఏడువేలు పోను, మిగిలే ఐదు వేలతో మేం నలుగురం ఎలాగో నెట్టుకొస్తున్నాం. ఆడపిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ల కోసం ఈ ఐదు వేలల్లోనే దాచేది దాస్తున్నాం. మా భయం ఒక్కటే. ఇంట్లో ఒక్కరికి అనారోగ్యం వచ్చేనా దాచిందంతా కొట్టుకు పోతుంది. అప్పుడు జీవితం మళ్లీ మొదటికే వస్తుంది’’ – శుభారాణి, న్యూస్ పేపర్ హాకర్, మాజీ ఫుట్బాల్ క్రీడాకారిణి -
పేపర్ బాయ్స్కి ఆనంద్ మహీంద్రా సెల్యూట్
ముంబై : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై మహానగరాన్ని ముంచెత్తిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. రోడ్డు, రైలు సేవలతో పాటు విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి సమయంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ముంబైలో ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పేపర్ బాయ్స్ తెరవెనుక నిజమైన హీరోలుగా నిలిచారని ఆయన అన్నారు. వారికి సెల్యూట్ చేస్తూ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ముంబై ఎయిర్పోర్ట్ రన్వేను మూసివేశారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రైలు పట్టాలపైకి పూర్తిగా నీరు చేరింది. కానీ న్యూస్ పేపర్ మాత్రం రోజు వచ్చే సమయానికే మా ఇంటికి వచ్చింది. అది కూడా పొడిగా(ఏ మాత్రం తడవకుండా). ఇందుకు కారణం తెరవెనుక ఉన్న నిజమైన హీరోలు. కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. మనల్ని సాధారణ రోజులుగా అనుభూతికి గురిచేసిన వారికి సెల్యూట్ చేస్తున్నట్టు’ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అలాగే తన ఇంటికి వచ్చిన న్యూస్ పేపర్ను పోస్ట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కొద్ది సేపటికే వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. న్యూస్ పేపర్ బాయ్స్, మిల్క్ మ్యాన్, కూరగాయల అమ్మేవారు నిజమైన హీరోలు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. Mumbai Airport runway shut, schools closed, train stations flooded, but the newspapers arrived in my house on time & dry! I have to salute those quiet, unsung heroes who brave torrential rain just so we can experience a ‘normal day.’ 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/iUhKMRSRFi — anand mahindra (@anandmahindra) July 2, 2019 -
టీఆర్ఎస్కు పత్రిక లేదు
సాక్షి, హైదరాబాద్: టీఆ ర్ఎస్కు పార్టీ పత్రిక, వార్తా చానల్ లేదని ఆ పార్టీ ఎంపీ బి.వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక, టీ– న్యూస్ చానల్లో టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ప్రచారం కల్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును ఆయన తోసిపుచ్చారు. పార్టీ ఎమ్మె ల్యే శ్రీనివాస్రెడ్డితో కలిసి బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈ ఓ) రజత్కుమార్ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు హెలికాప్టర్ వినియోగం, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహిం చడంపై సీఈఓను కలిసి అనుమానాలు నివృత్తి చేసుకున్నామని చెప్పారు. -
త్వరలో చానల్, పత్రిక..
రాజకీయ ప్రకటనతో నాయకుడిగా అవతరించిన కథానాయకుడు రజనీకాంత్ తన మక్కల్ మండ్రంకు ప్రత్యేక నియమ నిబంధనల్ని రూపొందించారు. మక్కల్ మండ్రంలో నిర్వాహకులు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, క్రమశిక్షణ కల్గిన రక్షకుల వలే ఎలా మెలగాలి వివరిస్తూ కఠిన నిబంధనల్ని పుస్తకం రూపంలో మంగళవారం విడుదల చేశారు. అలాగే, త్వరలో ఓ టీవీ చానల్, పత్రిక ఏర్పాటుతో రాష్ట్ర పర్యటనకు సిద్ధం అవుతున్నారు. సాక్షి, చెన్నై : 2017 డిసెంబరు 31వ తేదీ కథానాయకుడు రాజకీయ ప్రకటనతో నాయకుడిగా అవతరించారు. తమిళనాడు పరిరక్షణకు రక్షకులుగా నిలబడుదామని అభిమాన సేనలకు ఈసందర్భంగా పిలుపునిచ్చారు. రజనీ రాజకీయ ప్రకటనతో తమిళనాట ఆహ్వానాలు, వ్యతిరేక చర్చ జోరుగానే సాగింది. అయితే, వీటన్నింటిని లెక్క చేయని తలైవా పార్టీ కసరత్తుల దృష్టి పెట్టారు. తన సన్నిహిత మిత్రులు, మేధావులతో మంతనాల్లో నిమగ్నం అయ్యారు. అయితే, రాజకీయ పార్టీ ప్రకటనలో మాత్రం జాప్యం తప్పడం లేదు. సమయం వచ్చినప్పుడు పార్టీ అని స్పందిస్తూ వచ్చిన రజనీకాంత్, తన అభిమాన సంఘాల్ని ఏకంచేసి రజనీ మక్కల్ మండ్రాన్ని నెలకొల్పడంలో సఫలీకృతులయ్యారు. రజనీ మక్కల్ మండ్రంకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో నిర్వాహకుల్ని ఏర్పాటుచేశారు. ఇందులో ఎవరి మీదైనా సరే చిన్న ఫిర్యాదు, ఆరోపణ వచ్చినా తక్షణం ఉద్వాసన పలికి మరొకరికి అవకాశం కల్పిస్తున్నారు. రజనీ మక్కల్ మండ్రం తమిళనాడుకు రక్షకులుగా నిలబడాలన్న కాంక్షతో నిబంధనల్ని కఠినత్వం చేస్తూ కీలక నిర్ణయాలను తాజాగా తీసుకున్నారు. రజనీ మక్కల్ మండ్రం నియమ నిబంధనల్ని ఓ పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. ఇందులో అనేక కీలక, కఠిన అంశాలను పొందుపరిచారు. రక్షకులు ఎలా ఉండాలో చాటడంతో పాటు, అందుకు సిద్ధపడే వాళ్లు ఎలా తమను తాము మలచుకోవాలో వివరిస్తూ అంశాల్ని వివరించారు. నిబంధనలు మక్కల్ మండ్రం నిబంధనలతో కూడిన పుస్తకాలను నిర్వాహకులకు పంపిణీ చేశారు. అందులోని కొన్ని నిబంధనలు.. మక్కల్ మండ్రం నిర్వాహకులు ఇతరులకు ఆదర్శంగా ఉండే రీతిలో మెలగాల్సిన అవసరం ఉంది. ఎవరైనా చిన్న తప్పుచేసినా, అది మండ్రం మీద ప్రభావం పడుతుంది కాబట్టి, అలాంటి వారిని ప్రోత్సహించకుండా, తక్షణం ఉద్వాసన పలకడం లక్ష్యంగా కొన్ని అంశాలను పొందుపరిచారు. అలాగే, ఒక కుటుంబానికి చెందిన వాళ్లు మక్కల్ మండ్రంలో ఏదేని పదవిలో ఉన్న పక్షంలో, ఆ కుటుంబానికి చెందిన మరకొరికి పదవులు కేటాయించే ప్రసక్తేలేదు. మత, కుల, తదితర సంఘాల్లో సభ్యులుగా ఉన్న వాళ్లకు రజనీ మక్కల్ మండ్రంలో చోటు లేదు. అలాంటి వారు ఎవరైనా ఉన్న పక్షంలో వారంతకు వారే బయటకు వెళ్లడం మంచిది. లేదా ఉద్వాసన పలకడం త«థ్యం. యువజన విభాగంలో 35 ఏళ్ల వయస్సులోపు వారికి మాత్రమే చోటు. 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్లు ఎవరైనా మండ్రంలో సభ్యులుగా చేరవచ్చు. మక్కల్ మండ్రం జెండాను ఎల్లప్పుడు ఉపయోగించేందుకు వీలు లేదు. ప్రధానంగా వాహనాల్లో ఉపయోగించకుండా ఆంక్షలువిధించారు. మక్కల్ మండ్రం కార్యక్రమాల సమయంలో మాత్రమే ఉపయోగించి, ఆ తదుపరి వాటిని తీసివేయాలి. మహిళల్ని గౌరవించడం, భారత దేశ చట్టాలను గౌరవించాలి. వ్యక్తిగత విమర్శలకు చోటులేదు. పార్టీ నుంచి లఖిత పూర్వకంగా వచ్చే ప్రకటనలు, ఇతర వివరాల మేరకు నడచుకోవాలి. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీలు లేదు. పార్టీ ఆదేశించకుండా ఎలాంటి విరాళాల్ని సేకరించకూడదు. ఇతరుల్ని హేళనచేసే రీతిలో సామాజిక మాధ్యమాల్లో స్పందించరాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రీతిలో నడుచుకోవాలి. ప్రజాస్వామ్య బద్ధంగానే మక్కల్ మండ్రం నిర్వాహకుల ఎంపిక ఎన్నికలు జరిగే రీతిలో పార్టీ ఇచ్చిన ఆదేశాలను గౌరవించాలి. మార్పులు చేర్పులు, ఉద్వాసనలు, చర్యల విషయాల్లో అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడాల్సిందేనంటూ అనేక నిబంధనల్ని అందులో పొందుపరిచారు. మీడియా వైపు చూపు మక్కల్ మండ్రం పటిష్టత మీద దృష్టి పెట్టిన రజనీ, అదే తరహాలో బూత్ కమిటీల ఎంపికలోనూ నిమగ్నం అయ్యారు. ఒక బూత్కు 30 మంది చొప్పున కమిటీల ఏర్పాటు కసరత్తుల్ని వేగవంతం చేశారు. కొన్నిచోట్ల బూత్ కమిటీలకు పుష్కలంగా మద్దతుదారులు ఉన్నా, మరికొన్నిచోట్ల సంఖ్య తక్కువగా ఉండడంతో కష్టాలు తప్పడం లేదు. దీన్ని పరిగణించి ఆయా ప్రాంతాల్లో మక్కల్మండ్రం నిర్వాహకుల ద్వారా కార్యక్రమాల్ని విస్తృతం చేయడానికి సిద్ధం అయ్యారు. అలాగే, పార్టీ ఏర్పాటుకు ముందుగా తమ కార్యక్రమాలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలంటే, మీడియా మద్దతు తప్పనిసరిగా భావించారు. ఇందుకోసం ఓ టీవీ చానల్ మీద దృష్టి పెట్టారు. తన సన్నిహితునికి సంబంధించిన ఓ టీవీ చానల్కు మంచి గుర్తింపు ఒకప్పుడు ఉన్నా, ఇప్పుడు ప్రజాదరణ లేక సతమతం అవుతుండడాన్ని పరిగణించి, దానిని తన గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అలాగే, ఓ పత్రికను నెలకొల్పడమా లేదా, కష్టాలు, నష్టాల్లో ఉన్న పరిశ్రమను తమ ఆధీనంలోకి తీసుకోవడమా..? అన్న దిశగా కూడా రజనీ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ ప్రక్రియలన్నీ త్వరితగతిన ముగిసిన పక్షంలో, ఆ తదుపరి రాష్ట్ర పర్యటనకు సన్నద్ధం కానున్నారు. ఇందుకు తగ్గట్టుగా కార్యాచరణను మక్కల్ మండ్రం రాష్ట్ర నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. -
ఏరియల్ సర్వేలో పత్రికా వీక్షణం
యశవంతపుర: ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వరద బాధిత జిల్లాల్లో హెలికాప్టర్లో ఏరియల్ సర్వే సమయంలో దినపత్రిక చదవడం విమర్శలకు తావిస్తోంది. విహంగ వీక్షణంలో పేపర్ను చూస్తున్న వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో సీఎం వైఖరిపై విమర్శలు తప్పడం లేదు. మైసూరు నుంచి హిరియాపట్టణ వరకు సీఎం ఏరియల్ సర్వే చేశారు. వందలాది గ్రామాలు నీటమునిగాయి, రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి, ఆ సమయంలో పేపర్లో తలదూర్చడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విమర్శలు బీజేపీ పనేనని, తనపై ఆరోపణలు చేయటం అలవాటుగా మారిందని కుమారస్వామి దుయ్యబట్టారు. -
పత్రికల్లో రైల్వే టెండర్ ప్రకటనలు బంద్
న్యూఢిల్లీ: వార్తా పత్రికలు, మ్యాగజీన్లలో టెండర్ల ప్రకటనలు ఇవ్వడం ఆపేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రైల్వేశాఖ అన్ని పనులకు ఈ–టెండర్లు ఆహ్వానిస్తున్న తరుణంలో ప్రత్యేకంగా పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం అనవసరమని అభిప్రాయపడింది. అంతేకాకుండా దీనిద్వారా రైల్వేలు చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఉత్వర్వులను జారీచేసింది. వెబ్సైట్లో టెండర్ వివరాలు ఉంచిన తేదీనే టెండర్ పబ్లిషింగ్ చేసిన తేదీగా భావించాలని రైల్వే బోర్డు అందులో తెలిపింది. టెండర్లు తెరిచేందుకు తీసుకునే కనీస సమయం కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేసింది. -
బస్సు నడుపుతూ స్టీరింగ్పై పత్రిక ఉంచి..
-
పత్రిక చదువుతూ.. బస్సు పోనిస్తూ..!
అన్నానగర్: చెన్నై కార్పొరేషన్ రవాణా సంస్థకి చెందిన ఓ బస్సు డ్రైవర్ పత్రిక చదువుతూ బస్సుని నడుపుతున్న వీడియో వైరల్ అవుతోంది. తమిళనాడులోని చెన్నై కార్పొరేషన్ రవాణా సంస్థలో 3,500పైన బస్సులు చెన్నై మొత్తం నడుస్తున్నాయి. డ్రైవర్లు ఇలా సెల్ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా బస్సు నడిపే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కార్పొరేషన్ బస్సు డ్రైవర్ బస్సు నడుపుతూ స్టీరింగ్పై పత్రిక ఉంచి చదువుతున్నట్టుగా ఓ వీడియో సామాజిక మాధ్యమంలో హల్చల్ చేస్తోంది. ఇందలో శనివారం ఆవడి నుంచి తిరువాన్మ్యూర్ వైపుగా కార్పొరేషన్ బస్సు(నం 47డీ) వెళుతోంది. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. బస్సు డ్రైవర్ అంబత్తూర్ ప్రాంతంలో వస్తుండగా పత్రికను స్టేరింగ్పై చదువుతూ బస్సు నడుపుతున్నాడు. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన ప్రయాణికులు అతన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని తెలుస్తుంది. బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్ఫోన్లో ఈ దృశ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టుచేశారు. దీనిపై ఆ రవాణ సంస్థ అధికారి ఆదివారం మాట్లాడుతూ బస్సు అంబత్తూర్ బస్సు డిపోకి చెందిందని, డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పత్రికపై కక్ష.. మారణహోమం
వాషింగ్టన్: ఒక వార్తాపత్రికపై కక్ష పెంచుకున్న వ్యక్తి.. అమెరికాలోని అన్నాపోలిస్ నగరంలో మారణహోమం సృష్టించాడు. పత్రిక కార్యాలయంలోకి చొరబడి స్మోక్ గ్రనేడ్లు విసిరి గన్తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదురుగు మరణించగా.. వారిలో నలుగురు జర్నలిస్టులు. అమెరికా రాజధాని వాషింగ్టన్కు 50 కి.మీ దూరంలో ఉన్న మేరిల్యాండ్ రాష్ట్రం అన్నాపోలిస్లోని ‘క్యాపిటల్ గెజిట్’ పత్రికా కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం(భారత కాలమానం శుక్రవారం అర్ధరాత్రి) జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. దుండగుడు జరోద్ వారెన్ రామోస్(38)ను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. క్యాపిటల్ గెజిట్ పత్రికకు వ్యతిరేకంగా 2012లో పరువునష్టం దావా వేసిన రామోస్ ఆ కేసులో ఓడిపోవడంతో కక్ష పెంచుకుని ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అంత ఘోరం జరిగినా.. క్యాపిటల్ గెజిట్ సిబ్బంది బాధను దిగమింగుకుని తర్వాతి రోజు పత్రికను మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా కాల్పుల్లో మరణించిన సహచర సిబ్బందికి నివాళులర్పించారు. ముందస్తు లక్ష్యంతోనే దాడి ‘ముందస్తు లక్ష్యంతోనే దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాల్పులు జరిపేందుకు అన్నీ సిద్ధం చేసుకుని పత్రికా కార్యాలయానికి వచ్చాడు’ అని స్థానిక కౌంటీ డిప్యూటీ పోలీసు చీఫ్ విలియం క్రాంఫ్ తెలిపారు. కాల్పుల్లో పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ రాబ్ హియాసెన్, ఎడిటోరియల్ పేజ్ ఎడిటర్ గెరాల్డ్ పిస్క్మేన్, ఎడిటర్ అండ్ రిపోర్టర్ జాన్ మెక్నమార, స్పెషల్ పబ్లికేషన్స్ ఎడిటర్ వెండీ వింటర్స్, సేల్స్ అసిస్టెంట్ రెబెక్కా స్మిత్లు మరణించారని ఆయన వెల్లడించారు. మీడియా కథనాల ప్రకారం.. 2011లో పత్రికలో వచ్చిన ఒక వార్త తనను అపఖ్యాతి పాలు చేసేలా ఉందని రామోస్ పరువునష్టం కేసు వేశాడు. ఆ కేసులో అతను ఓడిపోయాడు. సోషల్ మీడియాలో ఒక మహిళను వేధించిన కేసులో రామోస్ నేరాంగీకార వివరాలు పత్రికలో ప్రచురితమయ్యాయి. విచారణకు సహకరించని నిందితుడు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడు బల్ల కింద దాక్కున్నాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన కొద్దిసేపటికే రామోస్ను అదుపులోకి తీసుకున్నామని... విచారణకు అతను సహకరించడం లేదని వారు వెల్లడించారు. తన గుర్తింపును కనుగొనకుండా రామోస్ చేతివేళ్లకు గాయం చేసుకున్నాడని.. అయితే అతని ముఖాకృతి ఆధారంగా పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాల్ని పోలీసులు సేకరించారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న గెజిట్ పత్రిక విలేకరి ట్వీట్ చేస్తూ.. ‘దుండగుడు న్యూస్రూం గాజు తలుపుపై గుళ్ల వర్షం కురిపించి పలువురు ఉద్యోగులపై కాల్పులకు పాల్పడ్డాడు’ అని ఘోరాన్ని గుర్తుచేశారు. ట్రంప్ సంతాపం ఈ సంఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ మాట్లాడుతూ.. సామూహిక కాల్పులు, రోజువారీ తుపాకీ హింస అనేక మంది ప్రాణాల్ని బలి తీసుకుంటుందని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అమెరికన్ కాంగ్రెస్ తక్షణం చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. తుపాకీ హింసపై కాంగ్రెస్ స్పందించాలని భారతీయ సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా డిమాండ్ చేశారు. -
పెను విషాదం.. పేపర్ ఆగిపోకూడదని...
ఉన్మాది విచక్షణ రహితంగా జరిపిన కాల్పులు.. నెత్తురొడ్డిన కార్యాలయం.. సహచరుల మృతి.. అయితే అంత పెనువిషాదంలోనూ ఆ సంస్థ ఉద్యోగులు పనిపై నిబద్ధతను కనబరిచారు. గంటల వ్యవధిలోనే పనిని తిరిగి ప్రారంభించారు. చనిపోయిన తమ సహచరుల ఆత్మశాంతి కోసం రేపు ప్రజల ముందుకు జరిగిన దారుణాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైపోయారు. అన్నాపొలిస్: మేరీల్యాండ్ రాజధానిలోని క్యాపిటల్ గెజిట్ పత్రిక కార్యాలయంపై ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన విషయం విదితమే. స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 2:35 సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కార్యాలయంలోకి చొరబడ్డ ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. అయితే అతను సహకరించటం లేదని తెలుస్తోంది. పగ పెంచుకుని... ఫేస్ డికెక్టర్ ద్వారా అతని వివరాలు సేకరించిన పోలీసులు, కేసును దాదాపుగా చేధించినట్లు తెలుస్తోంది. నిందితుడిని లౌరెల్కు చెందిన జర్రోడ్ రామోస్(38)గా గుర్తించిన అధికారులు.. గతంలో క్యాపిటల్ గెజిట్పై సదరు నిందితుడు దావా వేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ కేసును జడ్జి కొట్టివేయటంతో పగ పెంచుకుని మరీ ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. దీనికితోడు గత కొన్నిరోజులుగా పేపర్కు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ బెదిరింపులకు, రామోస్కు సంబంధం ఉందా? అన్న కోణం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంత శోకంలోనూ... మృతుల్లో ఎడిటర్ హిస్సాయెన్(59) ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. తమ సహచరుల మృతుల వార్త తెలియగానే మిగతా సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు కార్యాలయాన్ని మూసివేశారు. అయితే అంత శోకంలోనూ ఈ ఘటనను కవర్ చేసేందుకే స్టాఫ్ నిర్ణయించుకున్నారు. ఆఫీస్ వెనకాల ఓ వ్యాన్లో కూర్చుని ముగ్గురు సిబ్బంది కథనాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. ‘జరిగింది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. మా సహచరుల మృతి గురించి చెప్పాల్సిన బాధ్యత మాది’ అని చేజ్ కుక్ అనే ఉద్యోగి ఈ విషయాన్ని ట్విటర్లో ధృవీకరించాడు. ఘటనను వైట్ హౌజ్ ఖండించింది. ‘‘జర్నలిస్టులు తమ బాధ్యతను తాము నిర్వహిస్తున్నారు. వారిపై దాడిచేయడమంటే ప్రతి అమెరికన్పైనా దాడిచేయడమే..’’ అని వైట్హౌస్ మీడియా సెక్రటరీ శారా సాండర్స్ వ్యాఖ్యానించారు. ఫాక్స్పై ప్రజాగ్రహం... ఘటన తర్వాత ఫాక్స్ మీడియా ప్రచురించిన కథనంపై ప్రజలు మండిపడుతున్నారు. విద్వేషపూరిత కథనాల వల్లే క్యాపిటల్ గెజిట్ దాడికి గురైందని ఫాక్స్ పేర్కొంది. దీంతో పలువురు ‘మీకు సైద్ధాంతిక విలువలు లేవా?. సాటి మీడియాపై ఇలాగేనా కథనాలు ప్రచురించేది అంటూ’ సోషల్ మీడియాలో ఫాక్స్పై విరుచుకుపడుతున్నారు. -
అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ
అన్నాపోలీస్ : అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. అన్నాపోలీస్లోని క్యాపిటల్ గెజిట్ పత్రిక కార్యాలయంలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 5 పౌరులు మృతి చెందగా... పదుల సంఖ్యలో గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
ఆంధ్రజ్యోతి కథనాలపై బీజేపీ శ్రేణుల ఆగ్రహం
బంజారాహిల్స్: ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వంపై ఈ నెల 1 నుంచి ప్రచురితమవుతున్న విశ్లేషణాత్మక కథనాలను నిరసిస్తూ మంగళవారం బీజేపీ శ్రేణులు జూబ్లీహిల్స్లోని ఆ పత్రిక ప్రధాన కార్యాలయ ముట్టడికి యత్నించాయి. దీంతో ఆ పత్రిక కార్యాలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే బారికేడ్లు పెట్టారు. బీజేపీ కార్యకర్తలు కార్యాలయం వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలు ఆంధ్రజ్యోతి దినపత్రికకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీపై కథనాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బారికేడ్లను తొలగించుకొని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎగవేతదారులకు ‘బొమ్మ’ పడుద్ది..!
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలు పెరుగుతుండటంతో వాటికి కళ్లెం వేసే దిశగా సంబంధిత ఖాతాదారుల ఫొటోలను పత్రికల్లో ప్రచురించడం ద్వారా దారికి వచ్చేలా చేయాలని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘నేమ్ అండ్ షేమ్’ కార్యక్రమం కింద ఎగవేతదారుల ఫొటోలను ప్రచురించేందుకు బోర్డుల అనుమతి తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖలో సూచించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఓ విధానాన్ని రూపొందించి బోర్డు అనుమతి పొందాలని కోరింది. చెల్లించగలిగే సామర్థ్యం ఉన్నప్పుటికీ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని ఖాతాల సంఖ్య గత డిసెంబర్ నాటికి 9,063కు చేరింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతల మొత్తం రూ.1,10,050 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా ఇటీవలే లోక్సభకు వెల్లడించారు. నీరవ్ మోదీ స్కామ్ నేపథ్యంలో రూ.50 కోట్లకు మించి రుణాలు తీసుకున్న వారి పాస్పోర్ట్ వివరాలను సమీకరించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్రం ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే. పారదర్శక, బాధ్యతాయుత బ్యాంకింగ్ అన్నది తమ తదుపరి లక్ష్యమని, పాస్పోర్ట్ వివరాలు తీసుకోవడం ద్వారా మోసం బయటపడితే సత్వరమే చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఈ చర్య వెనుక ఉద్దేశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. -
‘ఆధార్’ రిపోర్టర్పై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు సురక్షితం కాదంటూ ‘ద ట్రిబ్యూన్’ పత్రికలో వచ్చిన కథనంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆధార్ నియంత్రణ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఫిర్యాదు మేరకు.. ఆ కథనాన్ని రాసిన జర్నలిస్టు రచనా ఖైరా పేరును ఎఫ్ఐఆర్లో చేర్చామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కేవలం రూ. 500లతో 10 నిమిషాల వ్యవధిలో ఒక ఏజెంట్ ద్వారా యూఐడీఏఐ వద్ద ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ వివరాలు పొందేందుకు అనుమతి సంపాదించామని ట్రిబ్యూన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. వ్యక్తుల పేర్లు, చిరునామా, పోస్టల్ కోడ్, ఫొటో, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వివరాలు చాలా సులువుగా అందాయని తెలిపింది. యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ బీఎం పట్నాయక్ ఫిర్యాదు మేరకు ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు ఐటీ, ఆధార్ చట్టాల కింద ‘ద ట్రిబ్యూన్’ జర్నలిస్టు రచనా ఖైరాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ‘ఎవరి ఆధార్ వివరాలైనా పొందేందుకు డబ్బులిచ్చి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సప్ ద్వారా అనుమతి సంపాదించినట్లు మాకు సమాచారం వచ్చింది’ అని యూఐడీఏఐ ఫిర్యాదులో పేర్కొంది. జనవరి 5న ఫిర్యాదు అందగా.. అదే రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ సంపాదించా: రచనా ఖైరా ఈ వ్యవహారంపై రిపోర్టర్ రచనా ఖైరా స్పందిస్తూ.. ‘చివరకు నా కథనంపై యూఐడీఏఐ ఏదొకచర్య తీసుకున్నందుకు ఆనందంగా ఉన్నా.. నేను ఎఫ్ఐఆర్ను సంపాదించుకున్నా’ అని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్తో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో యూఐడీఏఐ స్పందించింది. పత్రికా స్వేచ్ఛతో పాటు భావ ప్రకటనా స్వేచ్ఛను తాము గౌరవిస్తామంది. అనధికారికంగా అనుమతి సంపాదించడం వల్లే ఫిర్యాదు చేశామంటూ తన చర్యను సమర్థ్ధించుకుంది. ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన: ఎఫ్ఐఆర్ నమోదుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందో ళన వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకునేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. అక్రమాలపై విచారణ చేపట్టకుండా.. వాటిని వెలికి తీసిన వారిని శిక్షిస్తున్నారని కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది -
ఆసక్తికర విషయం.. అసలు కథ ఇదే!
బెంగళూరు: సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో కొంతకాలం జర్నలిస్ట్గా పనిచేశానని సూపర్స్టార్ రజనీకాంత్ వెల్లడించడం అభిమానుల్లో ఆసక్తి రేపింది. ఆయన బస్ కండక్టర్గా పనిచేశారన్న విషయం అందరికీ తెలుసు. జర్నలిస్ట్గా పనిచేశానని ఆయనే స్వయంగా చెప్పడంతో రజనీకాంత్ గురించి తెలియని విషయం మరోటి ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. చెన్నైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కూడా జర్నలిస్ట్గా పనిచేశా. కన్నడ జర్నలిస్ట్గా, సంయుక్త కర్ణాటక న్యూస్పేపర్లో వ్రూఫ్ రీడర్ను పనిచేశాన’ని చెప్పారు. రజనీకాంత్ తమ సంస్థలో పనిచేయలేదని సంయుక్త కర్ణాటక దినపత్రిక యాజమాన్య సంస్థ ‘లోకశిక్షణ ట్రస్ట్’ తెలిపింది. ‘రజనీ సన్నిహిత మిత్రుడు రామచంద్రరావు మా న్యూస్పేపర్లో ప్రూఫ్ రీడర్గా పనిచేసేవారు. ఆయనను కలిసేందుకు రజనీకాంత్ మా కార్యాలయానికి వస్తుండేవారు. పనిలో తన స్నేహితుడికి సహాయం చేసేవారు. ఇదంతా అనధికారికంగా జరిగేది. దీనికి ఎటువంటి వేతనం చెల్లించలేదు. జర్నలిజం పట్ల ఆసక్తి ఉండటం వల్లే రజనీకాంత్ తన మిత్రుడికి పనిలో సహాయం చేసేవార’ని లోకశిక్షణ ట్రస్ట్ చైర్మన్ ఉమేశ్ వెల్లడించారు. తమ సంస్థతో రజనీకాంత్ అనుబంధం కలిగివుండటం గౌరవంగా భావిస్తున్నామని, త్వరలోనే ఆయనను తమ కార్యాలయానికి ఆహ్వానిస్తామని చెప్పారు. -
పత్రికల్లో వచ్చే కథనాలకు స్పందించండి
- సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేయండి - బాధితులకు భరోసా కల్పించాలి - అధికారులతో కలెక్టర్ సత్యనారాయణ - మీ కోసంలో వినతుల స్వీకరణ కల్లూరు (రూరల్): జిల్లాలోని సమస్యలపై పత్రికల్లో వచ్చే కథనాలకు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యలపై మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అందుకు ఏవైనా అవాంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. వినతులు అందించే బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలన్నారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ 2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఇన్చార్జ్ ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. పిచ్చి వేషాలేస్తున్నావా.. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రైతు దొండపాటి పుల్లయ్య భూ సమస్యపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆయన వెంటనే మహానంది తహసీల్దార్ రామకృష్ణ, వీఆర్వోను సత్యనారాయణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరణ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఏమయ్యా బాబు... మహానంది తహసీల్దార్ రామకృష్ణ.. మీ మండలానికి సంబంధించిన గోపవరం రైతు దొండపాటి పుల్లయ్యకు సంబంధించిన సర్వే నెంబర్లు 558, 561, 570లోని 3 ఎకరాల 10 సెంట్ల భూమి ఉంది. అందులో 24 సెంట్ల భూమిని ఆన్లైన్ అడంగల్ నుంచి ఎందుకు తొలగించావో సమాధానం చెప్పు. భూమికి సంబంధించి వీఆర్ఓ ఎందుకు పేచీ పెడుతున్నాడు. ఆన్లైన్లో ఉన్న భూమిని మీరెందుకు కరెక్షన్ చేస్తారు. మెకానికల్గా తహసీల్దార్, వీఆర్ఓ మాట్లాడకూడదు. అన్నదమ్ముల మధ్య పేచీ ఉంటే కోర్టుకెళ్లమని సూచించండి. ఆన్లైన్లో భూ విస్తీర్ణం మార్చడానికి నీవెవరు (వీఆర్ఓ సత్యనారాయణను)? ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఇష్యూ పిచ్చివేషాలేస్తున్నావా.. సస్పెండ్ చేస్తా’ అని హెచ్చరించారు. ‘మీ కోసం’లో వచ్చిన సమస్యల్లో కొన్ని.. కోడుమూరు ప్రజల దాహర్తి తీర్చండి: కోడుమూరు పట్టణంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని సర్పంచ్ సీబీ లత కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. హంద్రీనది అడుగంటడం, గాజులదిన్నె ప్రాజెక్ట్ నీటిని కర్నూలుకు తరలించడంతో పట్టణంలో నీటి సమస్య అధికమైందన్నారు. ఇప్పటికే గ్రామంలోని పలు వార్డుల్లో వారానికోసారి, మరికొన్ని వార్డుల్లో వారానికి రెండుసార్లు మాత్రమే నీటిని విడుదల చేయాల్సి వస్తుందన్నారు. 20 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసి ప్రజల దాహం తీర్చాలని నోడల్ ఆఫీసర్ విజయభాస్కర్ను ఆదేశించారు. 1.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్సార్బీసీ మైనర్, సబ్ మైనర్ కాల్వలను అభివృద్ధి చేయాలని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్రెడ్డి కలెక్టర్కు విన్నవించారు. అన్ని జిల్లాల్లో మెరిట్ ప్రకారం పీఈటీలకు పదోన్నతలు కల్పిస్తున్నారని, కర్నూలు జిల్లాలో రోస్టర్ ప్రకారం ఇస్తామంటున్నారని పీఈటీల అసోసియేషన్ నాయకులు కృష్ణ, పరమేష్, శేఖర్, లక్ష్మణ్, లక్ష్మయ్య, వెంకటేష్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ మెరిట్ ప్రకారం పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని డీఈఓ తాహేరా సుల్తానాను ఆదేశించారు. సుంకేసుల రోడ్డులోని కొత్త క్రిష్టియన్ బరియల్ గ్రౌండులో సమాధులు కట్టేందుకు వెళితే కొందరు అడ్డుకుంటున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కారల్ మార్క్స్నగర్కు చెందిన సాల్మోన్, ఎస్.రాజు, నాగరాజు, ఏసు, వందనమయ్య జాయింట్ కలెక్టర్ 2 రామస్వామికి ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు పరిధిలోని సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని రాయలసీమ జనతా పార్టీ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త కలెక్టర్ను కోరారు. అనంతపురం– అమరావతి హైవే ఎక్స్ప్రెస్ రహదారిని కొలిమిగుండ్ల నుంచి రుద్రవరం మండలాల మీదుగా నిర్మిస్తే యథేచ్చగా ఎర్రచందనం, గంధపు చెక్కలు, టేకు అక్రమ రవాణా అయ్యే అవకాశం ఉందని, రహదారి నిర్మాణంపై పునారాలోచించాలని సీనియర్ దళిత నాయకుడు టీ.పీ.శీలన్న కలెక్టర్కు విన్నవించారు. -
రోబో జర్నలిస్టు వచ్చేశాడు
బీజింగ్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనేకాదు పాత్రికేయరంగంలోకి రోబో వచ్చేశాడు. చైనాలో రోబో రాసిన 300 పదాల కథనమొకటి ఓ దినపత్రికలో ప్రచురితమైందని బుధవారం పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాసం రాసిన రోబో పేరు జియానో నాన్ అని, అది కేవలం సెకన్లోనే దీన్ని రాసేసిందని పరిశోధన బృందం వెల్లడించింది. ఈ రోబో చిన్న కథనాలు, పెద్ద వార్తలూ రాయగలదట. స్టాఫ్ రిపోర్టర్లతో పోల్చితే దీనికి మెరుగైన సమాచార విశ్లేషణ సామర్థ్యం ఉందని, వేగంగా కథనాలు రాయగలదని బృందం పేర్కొంది. ప్రస్తుతం రోబోలు ముఖాముఖి ఇంటర్వూ్యలు నిర్వహించలేవని, సమయస్ఫూర్తితో ప్రశ్నలు సంధించలేవని బృందం పేర్కొంది. అయితే మీడియాలో కీలకమైన ఎడిటర్లు, రిపోర్టర్లకు సహాయకారులుగా మాత్రం ఉపయోగపడగలవని పేర్కొంది. -
రాజయ్యగారి కోడలు
చేతనబడి పేరు సునీత. మనసు నవనీత. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చింది ఆ అమ్మాయి. అంతా కొత్త. అలవాట్లు కొత్త. పద్ధతులు కొత్త. తిట్లు, చీవాట్లు.. మళ్లీ మళ్లీ పొరపాట్లు. పుట్టినిల్లు ఫ్రెండ్లీ... మెట్టినిల్లు మిలటరీ! తేడా తెలుస్తోంది. తట్టుకోవడం కష్టమైంది! పసుపు కుంకుమలతో కోడలిగా వచ్చిన సునీత... చివరికి ఆ డిప్రెషన్లో ఊరికే అరిష్టమైంది! అసలేం జరిగింది? నల్గొండ జిల్లా కేంద్రం. ఆర్.డి.ఓ ఆఫీసులో సమావేశం. పరిస్థితి కొంచెం వేడిగానే ఉంది. ఎం.ఆర్.వోలు ఉన్నారు. ఆర్.డి.వో టేబుల్ మీద న్యూస్ పేపర్ ఉంది. చర్చ ఆ పత్రికలోని ఓ విషయం మీదనే సాగుతోంది. ‘ఎంతకాలంగా జరుగుతోందిలా’ అడిగారు ఆర్.డి.వో తిప్పర్తి ఎం.ఆర్.వోని చూస్తూ. ఎం.ఆర్.వో చెప్తున్న వివరాల్లో స్పష్టత లోపిస్తోందనిపించింది. ‘వి.ఆర్.వో ఉంటే పిలిపించండి’ అనగానే బంట్రోతు వెళ్లి వరండాలో తచ్చాడుతున్న వి.ఆర్.వోని పిలుచుకొచ్చాడు. వి.ఆర్.వో చెప్పినదంతా విన్న ఆర్.డి.వో ‘ఇది సున్నితంగా వ్యవహరించాల్సిన అంశం. నేనే వస్తాను. గ్రామంలో దండోరా వేయించి గ్రామస్థులందరినీ రేపు ఉదయాన్నే సమావేశ పరచండి’ అంటూ ముగించారు. తిప్పలమ్మ గూడెం రచ్చబండ దగ్గర ఆర్.డి.వో ఇతర అధికారులు కూర్చుని ఉన్నారు. వారి ఎదురుగా రాజయ్య, రంగమ్మ, వాళ్ల కొడుకు రాజు, నెలల పాపాయిని ఎత్తుకుని కోడలు సునీత ఉన్నారు. పెద్ద అధికారి ముందు నోరు తెరవడానికి భయపడుతున్నారు. ‘ఏం జరిగిందో చెప్పు’ అంటూ రాజును చూశాడు వి.ఆర్.వో. ‘పొద్దుగుంకిందంటే భయమైతాందయ్యా. ఎక్కడ నుంచి పడుతున్నాయో తెలియదు, నట్టింట్లో రాళ్లు పడుతున్నాయి, ఒక్కోరోజు పసుపు, కుంకుమ పడుతున్నాయి. ఒక్కో రోజైతే... అశుద్ధం కూడా ఉంటోంది’ అంటూ ఆగాడు రాజు. అతడి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ‘ఒక్కో రాత్రి మా కోడలి జడ కాలిపోతోందయ్యా’ అంటూ బావురుమంది రంగమ్మ. ఆమెను ఊరుకోమని భుజం మీద తడుతూ ‘ఇంటికి ఎవరో చేతబడి చేశారయ్యా, అరిష్టం పట్టిందని పూజలు చేయించాం. మేము రోజంతా పొలం పనులు చేసుకుంటాం. ఇంట్లో పగలంతా కోడలొక్కటే చంటిబిడ్డతో ఉంటుంది. ఏ గాలిసోకిందో, ఎవరు కళ్లలో నిప్పులు పోసుకున్నారో, పచ్చటి కాపురం, గుల్లవుతోంది. పొద్దుగాలం కష్టపడి వస్తాం, తిండి తిని పక్క మీద వాలాలంటే వెన్నులో నుంచి వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎక్కడ నుంచి రాయి పడుతుందో తెలియదు, కళ్లు తెరిచి కప్పువైపు చూడాలంటే పసుపుకుంకుమలు కళ్లలో పడతాయేమోనని భయం, ఆఖరుకు అశుద్ధం కూడా పడుతుంటే ఇంట్లో ఎట్లాగుండాలో తెలియట్లేదు. ఇల్లు విప్పేసి ఎటైనా దూరంగా పోవడమే మార్గం అనిపిస్తోందయ్యా’ ఆవేదనతో చెప్పిందే చెప్పుకుపోతున్నాడు రాజయ్య. అతడి మాట పూర్తయిందో లేదో ఊరి వాళ్ల గొంతులన్నీ ఒక్కసారిగా లేచాయి. ‘‘వాళ్లింటికేదో అరిష్టం పట్టింది. అది అక్కడితో ఆగుతుందో లేక మా ఇళ్లంటినీ తగులుకుంటుందో తెలియక భయంతో చచ్చిపోతున్నాం. ఇక వాళ్లు ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతే ఆ చేతబడి మా ఇళ్లకు పాకుతుంది...’’ అంటూ గొడవకు దిగారు. రాజయ్య కోడలు సునీత... తాను మాట్లాడాల్సిందేమీ లేనట్లు నిర్లిప్తంగా ఉండిపోయింది. ఇదేమీ తెలియని ఆమె చంకలో బిడ్డ అందరినీ పరికించి చూస్తోంది. ఊరు అట్టుడుగుతోంది! ఆర్.డి.వోకి పరిస్థితి ఎంత క్లిష్టతరమవుతోందో అర్థమవుతూనే ఉంది. ఊరు ఊరంతా ఉడికి పోతోంది. మూఢనమ్మకం జడలు విప్పింది. పరిస్థితి చేయిదాటిపోయేటట్లుంది. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని ఊహించారాయన. పక్కనే ఉన్న అధికారిని ఆదేశించారు. ముదాం పెద్దగా అరుస్తూ ‘ఎవరూ మాట్లాడవద్ద’ని గదుముతున్నాడు. ఆర్.డి.వో లేచి రాజయ్య ఇంటికి హాని జరిగినా, ఆ కుటుంబంలో ఎవరిమీదనైనా దాడి జరిగినా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇంట్లో రాళ్లు, పసుపు, కుంకుమల వంటివి పడడానికి కారణాన్ని కనుక్కుంటామని రెండు- మూడు రోజుల్లో మళ్లీ వస్తామని చెప్పారు. ఒకరిని ఒకరు నిందించుకోవడం, దాడికి పాల్పడడం చేయకూడదని ఆదేశించి, పరిస్థితిని గమనిస్తూ ఉండమని రెవెన్యూ ఉద్యోగులను ఆదేశించి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు జనవిజ్ఞాన వేదిక (జెవివి) బృందం తిప్పలమ్మ గూడెం చేరుకుంది. బృందం సభ్యులు గ్రామస్థులందరినీ ప్రశ్నలడిగి మరో రెండు రోజుల తర్వాత వస్తామని వెళ్లారు. ఆ మూడో రోజున... జనవిజ్ఞాన వేదిక వాళ్లు ఏం చెబుతారా అని అంతా ఎదురు చూస్తున్నారు. జెవివి వాళ్లు వచ్చిన వెంటనే మొదటగా చేతబడులు, భూతవైద్యాలు లేవని చెప్పారు. మంత్రగాళ్లు చేసే మాయలను తామూ చేసి చూపించడంతోపాటు రాజయ్య కోడలు సునీత మానసిక స్థితినీ వివరించారు. ‘అదంతా చేసింది సునీతే’ అన్నారు. ఊరు ఆశ్చర్యపోయింది! అమెను తలా ఓ మాట అనడం మొదలుపెట్టారు. అసలేం జరిగింది? సునీత పట్టణంలో పెరిగి, పదవ తరగతి వరకు చదువుకున్న అమ్మాయి. 16 ఏళ్లకే పెళ్లి, ఆ తర్వాత ఏడాదికి బిడ్డ. తల్లిదండ్రుల ఆదరణలో ఆటపాటల్లో గడిచిన బాల్యం నుంచి ఒక్కసారిగా కుటుంబ భారం మీద పడడం, పనిలో ఏ చిన్న లోపం జరిగినా అత్తగారు చివాట్లు పెట్టడం, చేసిన పనిని ఎవరూ గుర్తించకపోగా పొరపాటు జరిగితే ఆకాశం విరిగి మీద పడ్డట్లు గొడవ చేయడం వంటి వాతావరణంలో చిక్కుకుపోయింది. విచిత్రమైన ప్రపంచంలోకి వచ్చినట్లు, ఎవరికీ అక్కర లేని మనుషుల మధ్య జీవించాల్సి వచ్చినట్లు న్యూనతకు గురయ్యేది. దీనికి తోడు బిడ్డతో రాత్రిళ్లు నిద్ర ఉండేది కాదు. తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్న భావనతో డిప్రెషన్కు లోనైంది. ఆ స్థితిలో గదిలో రాళ్లు వేయడం, పసుపుకుంకుమలు చల్లుకోవడం, పాపాయి విసర్జించిన మలాన్ని కాగితంలో చుట్టి గదిలోనే విసిరేయడం వంటి పిచ్చి చేష్టలు చేయడం మొదలుపెట్టింది. అలా చేసినట్లు కూడా ఆమెకు తర్వాత గుర్తుండేది కాదు. జుట్టు కాలడంతో ఇంట్లో అందరూ సునీత పట్ల సానుభూతి వ్యక్తం చేయసాగారు. భర్త, అత్తమామల నుంచి ఆదరణ లభించడం మొదలైంది. ఆ స్థితిలో ఉన్న వాళ్లు అలాంటి ఆదరణ ఇంకా ఉంటే బావుణ్నని కోరుకోవడం సహజం. దాంతో జుట్టు కాల్చుకోవడం వంటి పనులు మళ్లీ మళ్లీ చేస్తుంటారు. అలాంటి స్థితిలో ఆమెకు మానసిక చికిత్స అవసరం అని జెవివి బృందం గుర్తించింది. అంతకంటే ముందు తనదైన, తనకు ఇష్టమైన ప్రపంచం ఆమెకు కావాలి. పుట్టింటిని చూస్తే మనసు కాస్త స్థిమితపడుతుంది. అందుకే ఆమెను పుట్టింటికి తీసుకెళ్లమని చెప్పారు. సైకియాట్రిస్ట్కి చూపించమని తల్లిదండ్రులకు సూచించారు. అనుకున్నట్లే ఆమె నెల రోజుల్లో మామూలైంది. సమస్య తీరిపోయింది. సునీత ఆరోగ్యం బాగైంది. అయితే అందరూ ఆమెను దోషిలా చూస్తే... పరిస్థితి ఇంకా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే ఆమెను మామూలు మనిషిలా చూస్తూ ఎలా వ్యవహరించాలో కూడా ఇంటి వాళ్లను, ఊరి వాళ్లను ఎడ్యుకేట్ చేసింది జెవివి. ఇది జరిగి ఆరేడేళ్లయింది. సునీతకు ఇప్పుడది గతించిన పీడకల. ఇప్పుడామె ఆరోగ్యంగా కుటుంబంతో సంతోషంగా జీవిస్తోంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఎలా ఛేదించారు? రాళ్లు, పసుపు కుంకుమ, అశుద్ధం ఏ సమయంలో పడుతున్నాయంటే... రాత్రి పూట ఎక్కువగానూ, పగలు చాలా అరుదుగానూ పడుతున్నాయన్నారు. సునీత గదిలోనే పడుతున్నాయి కాబట్టి ఆమె భర్త ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయా... అనే కోణంలో ఆరా తీస్తే... అతడు లేనప్పుడు కూడా సునీత జుత్తు కాలుతోంది. అంటే వీటికి రాజుకి సంబంధం లేదు. అత్తమామలు ఏ రాత్రి ఏం జరుగుతుందోనని ఇంటి చుట్టూ చీమ చిటుక్కుమన్నా కళ్లింత చేసుకుని చూడడంలోనే వాళ్లకు తెల్లవారి పోతోంది. సునీతతో రాళ్లు, పసుపుకుంకుమల గురించి ప్రస్తావించకుండా ఇతర విషయాలెన్నో మాట్లాడాం. వాళ్ల తల్లిదండ్రులను పిలిపించి ‘అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్లి నెల రోజుల తర్వాత పంపించమన్నాం. అలాగేనంటూ అప్పుడే ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇక రాళ్లు పడవు, మా మాట మీద నమ్మకం ఉంచి హాయిగా నిద్రపొమ్మని చెప్పాం. రెండు రోజుల తర్వాత వచ్చి రాళ్లు ఎలా పడ్డాయో వివరిస్తామని చెప్పాం. - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ -
సంచలన వార్త
ఇద్దరం టోపీలు ధరించి ఆయన కార్లో బయలుదేరాం. కొద్ది దూరంలో చీకట్లో కారాపి చెప్పాడు. ‘‘ఆ వస్తున్నది జిమ్.’’ డేష్ బోర్డు తెరిచి అందులోని ఓ పెట్టెలోంచి పిస్తోలు గుళ్లని తీసి పిస్తోలు లోడ్ చేసి, మా పక్కనించి వెళ్లే జిమ్ని రెండుసార్లు కాల్చి కారుని ముందుకి పోనిచ్చాడు. మర్నాడు జిమ్ కుటుంబ సభ్యులని ఇంటర్వ్యూ చేయడానికి సిరిల్ నన్ను పంపాడు. స్థానిక దినపత్రికలో ఖాళీ ఉందని మిత్రుల నించి తెలుసుకున్నాక సెంట్రల్ విల్కి వచ్చాను. సూపర్ మార్కెట్ పై అంతస్థులో వెనక భాగంలో ఉన్న ఆ పత్రికా కార్యాలయానికి వెళ్లి, దాని ఎడిటర్ మిస్టర్ సిరిల్ ఫ్లాగ్ని కలిశాను. అది చాలా చిన్న ఆఫీసు. రెండు బల్లలు, నాలుగు కుర్చీలు. వెలిసిపోయిన వాల్ పేపర్. అనేక షెల్ఫుల నిండా కాగితాల కట్టలు. అవి ఆ ఆఫీస్కి పత్రికా ఆఫీస్ అనే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ‘‘అతను మాయం అవబట్టి నీకు ఉద్యోగం ఇస్తున్నాను’’ ఆయన నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే చెప్పాడు. ‘‘ఎవరు?’’ అడిగాను. ‘‘నీ ముందు పనిచేసిన సబ్ ఎడిటర్ కమ్ విలేకరి. నీ డిజిగ్నేషన్ కూడా అదే.’’ ‘‘అతను ఎందుకు మాయం అయ్యాడు?’’ అడిగాను. ‘‘ఎవరికీ తెలీదు. మా పత్రికకి ఇంకో మనిషి అవసరం ఉంది. మొదటగా వచ్చింది నువ్వు. ఇవాల్టి నించే పని ఆరంభించు. అన్నట్లు నీ పేరు?’’ సిరిల్ అడిగాడు. ‘‘గెర్చర్.’’ ‘‘నీకూ పత్రికకీ మధ్య గల సంబంధాన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకోవాలి. అది పవిత్రమైంది. దీన్ని కొనసాగించడం ఉత్తమమైన పని. తర్వాతే ఏదైనా. గొర్రెలకి నిత్యం తిండి పెట్టినట్లుగా పాఠకులకి మనం సెన్సేషనల్ వార్తలని ఇస్తుండాలి. మనిషి కుక్కని కరిచాడు లాంటివి. ఐతే అవి ఎవరి నించి సంపాదించామో మాత్రం బయట పెట్టకూడదు. నువ్వు అలా ఒట్టు పెట్టాలి’’ సిరిల్ కోరాడు. ‘‘పెట్టాను’’ నా చేతిని ముందుకి చాపి చెప్పాను. ‘‘మంచిది. దానికి కట్టుబడి ఉండు. లేదా నీకే ప్రమాదం.’’ ఇద్దరం కరచాలనం చేశాం. కొద్ది రోజుల్లో నేను నా ఉద్యోగాన్ని చక్కగా నిర్వర్తించడం నేర్చుకున్నాను. ఊళ్లో జరిగేవన్నీ నేను గమనించి వార్తలుగా రాస్తే, వాటిని చదివి మార్చకుండా సిరిల్ ప్రచురించేవాడు. ఐతే ఆ చిన్న ఊళ్లో పెద్ద వార్తలు అరుదు. కొద్ది వారాల తర్వాత ‘అసలీ చిన్న ఊరికి దినపత్రిక అవసరం ఏముంది?’ అని నాకు అనిపించసాగింది. ఆ పత్రికలో ప్రచురితం అయ్యేవన్నీ ఒకే రకం వార్తలు. పుట్టుకలు, విడాకులు, పెళ్లిళ్లు, చావులు, బదిలీలు, యానివర్సరీలు, ఇంకా సినిమా రివ్యూలే. ఒక్కోసారి కొన్ని వారాలు చావు, పుట్టుకల వార్తలు లేకుండానే పత్రిక వెలువడేది. వరదలు, గొడ్డలితో హత్య లాంటివి ఉండేవి కావు. క్రిస్ట్మస్, జీసస్ లాంటి విషయాల మీద బడి పిల్లలతో ఇంటర్వ్యూలు ప్రచురించసాగాం. ‘‘సర్. మన పత్రిక సర్క్యులేషన్ ఐదు వేల నించి నాలుగున్నర వేలకి తగ్గింది’’... ఓ రోజు నేను సిరిల్తో చెప్పాను. ‘‘అలాగా? ఐతే మళ్లీ పెంచడానికి ఏదైనా చేయాలి. నువ్వు రాకమునుపు కూడా ఇలా పత్రిక సర్క్యులేషన్కి మబ్బులు కమ్మేవి. ఏదో చేసి ఆ మబ్బు లని తొలగిస్తూ వస్తున్నాను’’ చెప్పాడు. ‘‘ఎలా?’’ ఆసక్తిగా అడిగాను. ‘‘ఊహల్ని ఉద్యోగం చేయనివ్వాలి. ఎవరి శవాన్నైనా వెలికి తీసి ఆర్సనిక్ పాయిజన్ ఉందేమో పరిశీలించమని రాయాలి. అయినా వద్దు. ఇది ఇదివరకు ఉపయోగించాం. పద.’’ ఇద్దరం టోపీలు ధరించి ఆయన కార్లో బయలుదేరాం. కొద్ది దూరంలో చీకట్లో కారాపి చెప్పాడు. ‘‘ఆ వస్తున్నది జిమ్.’’ డేష్బోర్డు తెరిచి అందులోని ఓ పెట్టెలోంచి పిస్తోలు గుళ్లని తీసి పిస్తోలు లోడ్ చేసి, మా పక్కనించి వెళ్లే జిమ్ని రెండుసార్లు కాల్చి కారుని ముందుకి పోనిచ్చాడు. నిర్ఘాంతపోయిన నాతో చెప్పాడు. ‘‘నీ ఒట్టు గుర్తుందిగా? ఇక పత్రిక అమ్మకాలు పెరుగుతాయి. అన్నట్లు ఈ సెన్సేషనల్ హత్య గురించి చక్కగా రాయి. గుర్తు తెలియని వ్యక్తి లేదా వ్యక్తుల చేతిలో హత్యకు గురయిన గుడ్ ఓల్డ్ జిమ్ గురించి రాయి.’’ మర్నాడు జిమ్ కుటుంబ సభ్యులని ఇంటర్వ్యూ చేయడానికి సిరిల్ నన్ను పంపాడు. కొద్ది వారాలు నేను భయం భయంగా గడిపానని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘‘చూశావా గెర్చర్? పత్రిక సర్క్యులేషన్ పెరగడానికి మనకి మనం ఒక్కోసారి సహాయం చేసుకోవాల్సి వస్తుంది’’... సర్క్యులేషన్ పెరగ్గానే చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ సర్క్యులేషన్ పడిపోయింది. ‘‘పాఠకులకి మేత కోసం మళ్లీ ప్రయత్నించాలి’’ సిరిల్ చెప్పాడు. ఇటీవలే అతని సబ్ ఎడిటర్ మాయం అయ్యాడు. ఇంకోసారి అలా జరగనివ్వడు అనుకున్నాను. అరగంట ఆలోచించి టోపీ పెట్టుకుని సిరిల్ నాకు సౌంజ్ఞ చేసి బయటికి నడిచాడు. ఇద్దరం ఆయన కారెక్కాం. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుని దాటే ఓ మహిళని సిరిల్ కారు గుద్దింది! నేను భయంగా సీట్లో వెనక్కి జారగిలబడ్డాను. ‘‘గమనించావా? ఆమె కదులుతోంది. కాని వెనక్కి వెళ్లడం పెట్రోల్ వృథా చేయడమే. కారుని వేగంగా నడిపే టీనేజర్ల మీద ప్రత్యేక వ్యాసం రాయి. నువ్వు అది బాగా రాయగలవు.’’ ఆ వార్త చాలా వారాలు మా పత్రిక సర్క్యులేషన్ని నిలిపింది. బ్యూరో ఆఫ్ డ్రైవింగ్ లెసైన్స్లోని లంచగొండితనం మీద నేను రాసిన వ్యాసం సిరిల్కి బాగా నచ్చింది. ఓ రోజు అడిగాడు. ‘‘నీకీ ఉద్యోగం బావుందా?’’ బాధ్యతలన్నీ తెలిశాయా?’’ తల ఊపాను. ‘‘ఐతే మళ్లీ పని చూడు. సర్కులేషన్ తగ్గు ముఖం పట్టింది.’’ ఆ సాయంత్రం నేను ఆఫీసులో ఎక్కువసేపు ఉండి పాత సంచికలన్నీ తిరగేయసాగాను. ఆరేళ్ల పిల్ల హత్యల్లాంటి కొన్ని వార్తలు చాలా బాధాకరమైనవి. హాస్పిటల్ని తగలబెట్టిన దోషి. సర్కస్లో సింహం బోనుని అజ్ఞాత వ్యక్తి తెరిచాడు. ఆ సింహాన్ని పోలీసులు చంపేలోగా అది నలుగుర్ని చంపింది. ఈ వార్త ఎనిమిది నెలలు సర్క్యులేషన్ని నిలబెట్టింది. మిస్టర్ సిరిల్ ఎడిటర్స గిల్డ్ నించి మానవీయ కోణంలో వార్తలని రాసినందుకు బహుమతి అందుకునే ఫోటో ఒకటి ఓ సంచికలో ఉంది. ఆ రాత్రంతా నేను నా గదిలో అటు, ఇటు నడుస్తూ సర్క్యులేషన్ని ఎలా పెంచాలా అని ఆలోచిస్తూండిపోయాను. అంతదాకా నీటిలో మునిగి చావడం, కిడ్నాపింగ్లు ఆ ఊళ్లో జరగలేదు. బాంబు కూడా పేల్లేదు. ఆలోచించి ఆలోచించి అలసటతో నిద్రపోయాను. చివరికి అవి సిరిల్కి సూచించాను. మరికొన్ని నెలల తర్వాత మళ్లీ సర్క్యులేషన్ పడిపోసాగింది. ‘‘గెర్చర్. బాంబు పేలిన వార్తమీద పాఠకులకి మొహం మొత్తినట్లుంది. ఈసారి ఏం చేద్దాం?’’ అడిగాడు. ‘‘నాకు ఓ మంచి ఆలోచన వచ్చింది సార్’’ చెప్పాను. ‘‘ఏమిటది?’’ ఆయన అడిగాడు కంగారుగా. ‘‘ఇది’’ కాగితాన్ని ఇచ్చి చెప్పాను. నల్లటి బోల్డ్ లెటర్స్లో ‘అవార్డ్ పొందిన పత్రికా సంపాదకుడి హత్య- తన ఆఫీసులోనే.’ ఆయన కంగారుగా లేస్తూంటే బలమైన పేపర్ వెయిట్తో ఆయన తలమీద కొట్టాను. మళ్లీ మళ్లీ మళ్లీ. (డొనాల్డ్ హోనిగ్ కథకి స్వేచ్ఛానువాదం) -
విజయపథంలో మానసిక ‘చేతన’
పాతికేళ్ల కిరణ్ న్యూస్పేపర్పై జిగురు రాసి జాగ్రత్తగా అంటిస్తున్నాడు. స్వాతి వాటిని గాలికి ఆరబెడుతోంది. ఇంకో అబ్బాయి వాటిని వరసగా సర్దుతున్నాడు. అలా తయారుచేసిన పేపర్ బ్యాగులు ‘చేతన’ పేరుతో దగ్గరలోని ఆసుపత్రులకు పంపుతారు. అక్కడ రకరకాల చేతివృత్తుల పేర్లతో తయారయ్యే వస్తువులకు బోలెడు గిరాకీ. ఎందుకంటే వాటిని తయారుచేసేది మానసిక వికలాంగులు. ఆ సంస్థని నడిపేది ఓ ఇద్దరు వైద్యులు. ‘శరీరానికైతే వైద్యం చేయగలం. కానీ, మా కంటబడ్డ మానసిక వికలాంగులకు మేం ఏం చేయగలమని మమ్మల్ని మేం పదే పదే ప్రశ్నించుకున్న తర్వాత పుట్టిందే చేతన’ అని చెప్పే మాలా గిరిధర్ మాటల్లో సేవొక్కటే కాదు చక్కని వ్యాపార సూత్రం కూడా ఉంది. అదెలాగంటారా... అప్పటివరకూ ఇంట్లోవారికి భారంగా ఉన్న కిరణ్ ఇప్పుడు ప్రతి నెలా రెండు నుంచి మూడువేల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడు. స్వాతి విషయానికొస్తే తండ్రి లేడు. తల్లి కష్టం పైనే ఆధారపడ్డ ఇంటికి ఇప్పుడు స్వాతి కూడా సాయం చేస్తోంది. ‘చేతన’ సంస్థలో కిరణ్, స్వాతిలాంటివారు ఓ ఇరవైమంది ఉన్నారు. చుట్టుపక్కల బోలెడన్నీ చేతివృత్తుల సంస్థలున్నా ‘చేతన’ తర్వాతే ఏవైనా. పేపరుబ్యాగులు కావాలనుకున్నవారంతా ‘చేతన’ సంస్థలోకే అడుగుపెడుతున్నారు. ఉత్తర కర్ణాటకలో సిర్సి ప్రాంతంలో ఉన్న ‘చేతన’ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ మాలా గిరిధర్. ‘‘నేను, నా భర్త గిరిధర్ ఇద్దరం పదేళ్ల ఉంచి వైద్యవృత్తిలో ఉన్నాం. మా కంటపడ్డ మానసిక వికలాంగుల సంక్షేమం కోసం మేం చేయగలిగినంతలో ఆర్థిక సాయం చేసేవాళ్లం. అలాంటివారికి వేళకింత భోజనం పెట్టి పక్కన కూర్చోబెట్టడం సేవ కాదేమోననిపించింది. ఇంకేం చేస్తే వారికి పూర్థిస్థాయిలో న్యాయం చేసినవాళ్లమవుతామంటూ ఆలోచించాం. వారికి చేతినిండా ఏదో ఒకటి పని ఉంటే అంతకన్నా పెద్ద సేవ మరొకటి ఉండదనుకున్నాం. అనుకున్నదే తడవుగా ‘చేతన’ సంస్థను నెలకొల్పాం’’ అంటూ తమ ఆలోచన వెనకనున్న కారణం చెప్పారు మాల. 200 గంటల శిక్షణ: మామూలువారితోనే ఏదైనా కొత్త పని చేయించాలంటే ముందుగా శిక్షణ అవసరం. అలాంటిది మతిస్థిమితం లేనివారితో పని చేయించడం అంటే మాటలు కాదు. కొన్ని గంటల పాటు, రోజుల పాటు, నెలల పాటు పట్టుదలతో వారికి పని నేర్పించాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు డాక్టర్ మాల వారితో ఏకంగా వ్యాపారమే చేయించారు. ‘‘అనుకోవడం వరకూ బాగానే ఉంది కాని మొదలుపెట్టాక అసలు కష్టం తెలిసింది. అప్పటికే దేశంలో పలుచోట్ల మానసిక వికలాంగుల కోసం పనిచేస్తున్న ఓ 20మంది స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల దగ్గర 200 గంటలపాటు శిక్షణ తరగతులకు హాజరయ్యాను. రెండున్నర లక్షల రూపాయలతో ‘చేతన’ వర్క్షాపు మొదలుపెట్టాను. వీరితో పాటు మరో 40మంది మానసిక వికలాంగులు ఇళ్ల దగ్గర నుండే పనిచేస్తున్నారు’’ అని వివరించారు మాల. పేపర్ బ్యాగులే కాకుండా, పెన్నుల తయారీ, అరటినార ప్యాకింగ్ కూడా ‘చేతన’లో చేస్తున్నారు. ‘‘పేపర్ బ్యాగుల తయారీ చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. అందుకే మానసిక వికలాంగులకు ముందుగా అరటినార పని చెబుతాం. ఆ తర్వాత పెన్నులు, పేపర్ బ్యాగుల తయారీ. వీళ్లకి శిక్షణ ఇవ్వడం కోసం ఓ నలుగురు ప్రత్యేక శిక్షకులున్నారు. ఇద్దరు అకౌంటెంట్లు ఉన్నారు. ఆనందానికీ, దుఃఖానికీ తేడా తెలియని మానసిక వికలాంగుల కంట్లో తెలియని సంతోషాన్ని మాత్రం చూస్తున్నాను. ఇక వారి ఇంట్లో వాళ్ల ఆనందానికీ, ఆశ్చర్యానికీ కొదవలేదు’’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు మాల. విజయం వారి చిరునామా: సేవకు తృప్తి ఉండాలి. వ్యాపారానికి విజయం కావాలి. ఈ రెండింటీని సాధించిన డాక్టర్ మాల తన కల నెరవేరడం వెనక పట్టుదల మాత్రమే ఉందంటున్నారు. ప్రస్తుతం ‘చేతన’కు పేపర్ బ్యాగులకు సంబంధించి చాలా పెద్ద ఆర్డరు వచ్చింది. ఓ ఏడాదిపాటు చేతన సిబ్బందికి చేతి నిండా పని ఉంది. అంతకు మించి మాల సాధించాల్సిన విజయం ఏముంటుంది చెప్పండి. ‘ఓ డాక్టరుగా ఎంతమంది శరీరాల్ని బాగుచేశానో గుర్తులేదు కాని ఓ ఇరవైమంది మానసిక వికలాంగులను చక్కని పనిమంతుల్ని చేయగలిగానన్న తృప్తి నన్ను అనుక్షణం ఆకాశానికి ఎత్తుతోంది’ అని అంటారు మాల. నిజమే... అందరూ చేయగలిగే పని చేసి చప్పట్లు కొట్టించుకోడానికీ, ‘చేతన’ విజయానికీ చాలా తేడా ఉంది. బోలెడు ఆదర్శం కూడా ఉంది.