occupied
-
జెనిన్లో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్
జెనిన్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని జెనిన్లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన భారీ ఆపరేషన్లో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారు. 35 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సాయుధ సంస్థలకు కంచుకోటగా ఉన్న జెనిన్లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు విస్తృతమైన ఆపరేషన్ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఇజ్రాయెల్ కాల్పుల్లో గాయపడిన వారిలో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులు ఉన్నారని జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ విస్సామ్ బకర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ దళాలు వెళ్లడానికి ముందే జెనిన్ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి స్థానిక భద్రతా సిబ్బంది వైదొలిగారు. ఇజ్రాయెల్ దళాలు పౌరులపై కాల్పులు జరిపాయని, దీంతో పలువురు గాయపడ్డారని పాలస్తీనా భద్రతా దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అన్వర్ రజాబ్ తెలిపారు. జెనిన్లో ఒక టీనేజర్సహా 9 మందిని ఇజ్రాయెల్ బలగాలు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. టియానిక్ గ్రామంలోనూ ఇజ్రాయెల్ దళాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయి. గాజాలో కాల్పుల విరమణ ప్రారంభమైన మూడు రోజుల తర్వాత, వెస్ట్బ్యాంక్లో దాడులు జరగడం గమనార్హం. ‘‘వెస్ట్ బ్యాంక్లో భద్రతను బలోపేతానికి, మా లక్ష్యాలను సాధించడానికి మరో ముందడుగుగా జెనిన్ ఆపరేషన్ చేపట్టాం. లెబనాన్, సిరియా, యెమెన్, వెస్ట్ బ్యాంక్లలో ఇరాన్ ఏ ప్రాంతంపై ప్రభావం చూపించాలనుకున్నా మేం దానిని అడ్డుకుంటాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. వెస్ట్బ్యాంక్లోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ఇతర సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు, నిధులను అందిస్తోందని ఆరోపించారు. ‘‘ ఈ ప్రాంతాల్లో సాయుధ బృందాల మౌలిక సదుపాయాలను విచ్ఛిన్నం చేయడం ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యం’’ అని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. -
పాలస్తీనాను అదీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం
ది హేగ్: పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అ«దీనంలో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని, అక్కడ స్థిర నివాసానికి కాలనీల నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని సూచించింది. 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ అజమాయిషీని తప్పుపడుతూ అంతర్జాతీయ న్యాయం స్థానం తీర్పు ఇవ్వడం అసాధారణ విషయంగా పేర్కొంటున్నారు. వెస్ట్బ్యాంక్, తూర్పు జెరూసలెంలలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను నిర్మించడం, విస్తరించడం, ఆక్రమిత ప్రాంతాలను స్వా«దీనం చేసుకోవడం, వాటిపై నియంత్రణ, అక్కడి సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని జడ్జీల ప్యానెల్ అభిప్రాయపడింది. ఆక్రమిత ప్రాంతాలపై ఇజ్రాయెల్కు సార్వ¿ౌమాధికారం లేదని, పాలస్తీనాలోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించడంఅంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని పేర్కొంది. అయితే అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచి్చన ఈ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిన, పాటించాల్సిన అవసరం ఇజ్రాయెల్కు లేదు. ఇదొక అభిప్రాయం మాత్రమే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందిస్తూ.. ఆ ప్రాంతాలు యూదు ప్రజల చారిత్రక మాతృభూమిలో భాగమన్నారు. -
Russia-Ukraine war: జపొరిజియా అణు ప్లాంట్పై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
కీవ్: రష్యా ఆక్రమిత జపొరిజియా అణు విద్యుత్ ప్లాంట్పై డ్రోన్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ప్లాంట్లోని ఆరో యూనిట్ డోమ్ సహా పలు చోట్ల ఉక్రెయిన్ మిలటరీ డ్రోన్లు ఆదివారం దాడి చేశాయన్నారు. అయితే ఎటువంటి నష్టం వాటిల్లలేదని, ఎవరూ చనిపోలేదని అన్నారు. ప్లాంట్లో అణుధారి్మకత స్థాయిలు కూడా సాధారణంగానే ఉన్నట్లు వివరించారు. దాడి సమాచారం తమకు అందిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. ఇటువంటి దాడులతో భద్రతాపరమైన ప్రమాదాలున్నాయని హెచ్చరించింది. యూరప్లోనే అతి పెద్దదైన జపొరిజియా అణు విద్యుత్కేంద్రం 2022 నుంచి రష్యా ఆ«దీనంలోనే ఉంది. ఇందులోని ఆరు యూనిట్లు కొద్ది నెలలుగా మూతబడి ఉన్నాయి. -
గాజా.. మరుభూమి!
దెయిర్ అల్ బలాహ్/జెరూసలేం/టెల్ అవీవ్: గాజాలో పరిస్థితులు నానాటికీ విషమిస్తున్నాయి. కరెంటు తదితర సదుపాయాలతో పాటు నిత్యావసరాలన్నీ పూర్తిగా నిండుకోవడంతో కొద్ది రోజుల క్రితం నుంచే పూర్తిగా పడకేసిన ఆస్పత్రులు క్రమంగా మృత్యుదిబ్బలుగా మారుతున్నాయి. రోగులు, నవజాత శిశువుల నిస్సహాయ సామూహిక మరణాలకు వేదికలుగా మారుతున్నాయి. గాజాలోని ప్రధాన ఆస్పత్రి అల్ షిఫాలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 179 మృతదేహాలను ప్రాంగణంలోనే ఒకే చోట సామూహికంగా ఖననం చేసినట్టు ఆస్పత్రి డైరెక్టర్ అబూ సలామియా తాజాగా నిర్ధారించడం పరిస్థితికి అద్దం పడుతోంది! వీరిలో చాలామంది ఐసీయూ రోగులు, నవజాత శిశువులేనని సమాచారం. అక్కడ 30కి పైగా శవాలను ఖననం చేస్తుండగా చూసినట్టు అక్కణ్నుంచి బయటపడ్డ ప్రత్యక్ష సాక్షి కూడా వెల్లడించారు. పలు ఇతర ఆస్పత్రుల్లోనైతే మృతదేహాలు కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్నట్టు సమచారం. ప్రస్తుతం ఉత్తర గాజాలో అల్ అహ్లి బాప్టిస్ట్ ఆస్పత్రి మాత్రమే కాస్తో కూస్తో పని చేస్తోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఒక్క మంగళవారమే 500 మందికి పైగా క్షతగాత్రులు అందులో చేరినట్టు వివరించింది. కరెంటు లేకపోవడం, ఆక్సిజన్, ఇంధనంతో పాటు ఆహార పదార్థాలు, నిత్యావసరాలన్నీ నిండుకుంటుండటంతో అది కూడా ఏ క్షణమైనా పూర్తిగా మూతబడే పరిస్థితి నెలకొందని ఆవేదన వెలిబుచ్చింది. మరోవైపు గాజా అంతటా ఎటు చూసినా వ్యర్థాల కుప్పలే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా మురుగు నీరు పొంగి పొర్లుతోంది. వాటిద్వారా ఇప్పటికే పలు అంటురోగాలు ప్రబలుతున్నాయి. ఇవి మరింత విజృంభిస్తే గాజా మరుభూమిగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. చలి, చెదురుమదురు వర్షాలతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. జబాలియాలో 30 మంది మృతి: మరోవైపు, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ బీభత్సం మంగళవారం కూడా యథాతథంగా కొనసాగింది. ఆస్పత్రులతో పాటు ఇంకా చెదురుమదురుగా మిగిలి ఉన్న భవనాలన్నీ క్షిపణి, బాంబు దాడులు, కాల్పులతో అల్లాడిపోయాయి. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడులు మరో 30 మందిని బలిగొన్నట్టు తెలుస్తోంది. గాజాలోని పార్లమెంటు భవనాన్ని ఇజ్రాయెల్ సైనికులు ఆక్రమించారు. భవనం లోపల ఇజ్రాయెల్ పతాకాలతో ఉన్న సైనికుల ఫొటోలు ఆ దేశ మీడియాలో వైరల్గా మారాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్)కు చెందిన గోల్డెన్ బ్రిగేడ్ గాజా పార్లమెంటును స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటిదాకా 100 మందికి పైగా ఐరాస వర్కర్లు యుద్ధానికి బలయ్యారు. మరణించిన పాలస్తీనావాసుల సంఖ్య 11,550 దాటినట్టు గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది. వీరిలో మూడొంతులు మహిళలు, పిల్లలేనని పేర్కొంది. ఆస్పత్రులను కాపాడాలి: బైడెన్ బందీల విడుదలకు కృషి చేస్తున్నట్టు తాము కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అల్ షిఫాతో పాటు గాజాలో ఆస్పత్రులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా కాపాడాలన్నారు. ఏ ఆస్పత్రి మీదా ఇజ్రాయెల్ సైన్యం దుందుడుకు చర్యలకు పాల్పడరాదని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, పట్టు వీడేందుకు ఇప్పటిదాకా ససేమిరా అంటున్న ఇజ్రాయెల్ కూడా కాస్త దిగొస్తున్నట్టు కన్పిస్తోంది. గాజా ఆస్పత్రుల్లో మృత్యుముఖంలో ఉన్న నవజాత శిశువులను సురక్షితంగా తరలించేందుకు ఇంక్యుబేటర్లను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆస్పత్రులే కమాండ్ సెంటర్లు: ఇజ్రాయెల్ ఆస్పత్రులను హమాస్ తన స్థావరాలుగా మార్చుకుందని ఇజ్రాయెల్ మరోసారి ఆరోపించింది. ఇందుకు ఆధారాలున్నట్టు పేర్కొంది. రంటిసీ పిల్లల ఆస్పత్రిలో గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలతో కూడిన కమాండ్ సెంటర్ను గుర్తించామంటూ సంబంధిత వీడియోలు, ఫొటోలు విడుదల చేసింది. ఇజ్రాయెల్ బందీలను కూడా అక్కడే దాచారని అనుమానం వెలిబుచ్చింది. వీటిని హమాస్ మరోసారి ఖండించింది. ఆస్పత్రులపై నిస్సిగ్గు దాడులను సమర్ధించుకునేందుకే ఇజ్రాయెల్ నిరాధారణ ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది. వాళ్లు రోగులు.. జంతువులు కాదు! కంటతడి పెట్టిస్తున్న డాక్టర్ ఇంటర్వ్యూ అల్ షిఫా ఆస్పత్రిని తక్షణం వీడాలన్న ఇజ్రాయెల్ ఆదేశాలను వైద్య సిబ్బంది మంగళవారం కూడా తిరస్కరించారు. 700 మందికి పైగా నిస్సహాయులైన రోగులను ప్రాణాపాయ పరిస్థితుల్లో వదిలి వెళ్లలేమని స్పష్టం చేశారు! ఈ క్రమంలో ఆస్పత్రికి చెందిన హమామ్ అల్లో అనే నెఫ్రాలజిస్టు మరణానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడందరినీ కంటతడి పెట్టిస్తోంది. ‘‘ఆస్పత్రిలో, ఐసీయూ వార్డుల్లో అంతమంది ఉన్నారు. వారంతా రోగులు. జంతువులు కారు. నేను వెళ్లిపోతే వారికి చికిత్స అందించేదెవరు? చికిత్స పొందడం వారి హక్కు. వారి కర్మకు వారిని వదిలి వెళ్లలేం. 14 ఏళ్ల పాటు వైద్య విద్య నేర్చుకున్నది ఇలా కేవలం నా జీవితాన్ని కాపాడుకునేందుకు రోగులను నిస్సహాయ స్థితిలో వదిలేసి వెళ్లిపోయేందుకు కాదు’’ అంటూ కొద్ది రోజుల క్రితం డెమొక్రసీ నౌ అనే స్వతంత్ర పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కుండబద్దలు కొట్టారు. కుటుంబంతో పాటు దక్షిణ గాజాకు వెళ్లిపోవాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలను హమామ్తో పాటు ఆయన కుటుంబం కూడా బుట్టదాఖలు చేసింది. అత్తగారింట్లో ఉండగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమామ్తో పాటు ఆయన తండ్రి, మామ, బావమరిది దుర్మరణం పాలయ్యారు! స్వేచ్ఛాయుత పాలస్తీనా కోసం హమామ్ నిత్యం కలలు కనేవాడని గుర్తు చేసుకుంటూ తోటి నెఫ్రాలజిస్టు బెన్ థామ్సన్ కన్నీటి పర్యంతమయ్యాడు. కాల్పులాపితే బందీల విడుదల: హమాస్ యుద్ధానికి ముగింపు ఇప్పట్లో కనిపించని పరిస్థితుల్లో, కనీసం కాల్పుల విరామం కోసం హమాస్ ప్రయత్నిస్తోంది. ఐదు రోజుల పాటు కాల్పులాపితే తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీల్లో 70 మంది మహిళలు, చిన్నారులను విడుదల చేసేందుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ఖతార్ మధ్యవర్తుల ద్వారా దీన్నిప్పటికే ఇజ్రాయెల్కు చేరవేసినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ చెరలో ఉన్న 200 మంది పాలస్తీనా చిన్నారులు, 75 మంది మహిళలను వదిలేస్తే తమ వద్ద ఉన్న బందీల్లో మహిళలు, పిల్లలను విడుదల చేస్తామని గత వారం కూడా హమాస్ ప్రకటించడం తెలిసిందే. హమాస్ చెరలో 240 మందికి పైగా ఇజ్రాయెలీలున్నట్టు సమాచారం. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అధ్యక్షురాలు మిర్జానా స్పొల్జారిక్ మంగళవారం ఇజ్రాయెల్లో వారి కుటుంబాలను కలుసుకుని ధైర్యం చెప్పారు. మరణానంతర ప్రసవాలు! ఆస్పత్రులపై ఇజ్రాయెల్ దాడులు అంతులేని దారుణాలతో పాటు పలు విషాదాలకూ కారణంగా మారుతున్నాయి. సౌకర్యాల లేమి తదితరాల కారణంగా ఆస్పత్రుల్లో ఎందరో నిండు గర్భిణులు దుర్మరణం పాలైనట్టు హమాస్ ఆరోగ్య శాఖ ఆవేదన వెలిబుచ్చింది. ‘‘అలాంటి పరిస్థితుల్లో కూడా వైద్యులు తమ వృత్తి ధర్మం మరవలేదు. ఎప్పటికప్పుడు ఆ మృతదేహాలకు హుటాహుటిన సిజేరియన్ చేసి వీలైనంత మంది శిశువులను బయటికి తీసి కాపాడుతూ వచ్చారు’’ అని పేర్కొంది. ఇంక్యుబేటర్లతో పాటు ఏ సదుపాయాలూ లేక ఆ నవజాత శిశువులు కూడా మృత్యువుకు చేరువవుతున్నట్టు చెప్పింది. బయటపడ్డ కశ్మిరీ మహిళ లుబ్నా నజీర్ షాబూ అనే కశ్మిరీ మహిళ తన కూతురు కరీమాతో పాటు గాజా నుంచి మంగళవారం సురక్షితంగా బయట పడింది. వారిద్దరూ ఈజిప్టు చేరినట్టు భర్త వెల్లడించారు. ఈజిప్టులోని భారత మిషన్ల కృషి వల్లే తాను, తన కూతురు గాజా నుంచి బయట పడ్డట్టు లుబ్నా చెప్పారు. గాజాలో సర్వం నేలమట్టమైందని ఆవేదన వెలిబుచ్చారు. -
రష్యాపై ఎదురుదాడికి ఉక్రెయిన్ సన్నాహాలు!
బెర్లిన్: రష్యా ఆక్రమించిన ప్రాంతాలకు తిరిగి విముక్తి కల్పించడానికి ఎదురుదాడికి దిగుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. అయితే రష్యా భూభాగంపై దాడులకు పాల్పడబోమని స్పష్టం చేశారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన జెల్న్స్కీ ఆదివారం జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కాల్జ్తో సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దు ప్రాంతాలకు విముక్తి కల్పించడమే తమ మీడియాకు లక్ష్యమని తెలిపారు. తమ ప్రాంతాలను రష్యాపై నుంచి తీసుకుంటామన్నారు. రష్యాపై దాడికి దిగేటంత ఆయుధ సంపత్తి తమ దగ్గర లేదన్నారు. రష్యా అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి తీసుకుంటామని చెప్పారు. తమకు అండదండగా ఉంటూ 300 కోట్ల డాలర్ల విలువైన మిలటరీ సాయం చేసిన జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్కు ధన్యవాదాలు తెలిపారు. -
మరోసారి ఆక్రమిత ఉక్రెయిన్లోకి పుతిన్
కీవ్: యుద్ధం మొదలై దాదాపు 13 నెలలు పూర్తవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించి తమ సైన్యం సన్నద్ధతను సమీక్షించారు. మొదట ఖేర్సన్ ప్రావిన్స్కు చేరుకున్న పుతిన్ అక్కడి రష్యా సేనల కమాండ్ పోస్ట్కు వెళ్లారు. తర్వాత లుహాన్సŠక్లోని రష్యన్ నేషనల్ గార్డ్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఖేర్సన్, లుహాన్సŠక్లో సైనిక ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రష్యా అధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాల్లో పుతిన్ పర్యటించడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. కొన్ని నెలల క్రితమే ఆక్రమించాక ఉక్రెయిన్లోని ఖేర్సన్, లుహాన్సŠక్, డోనెట్స్కŠ, జపోరిజియా ప్రావిన్స్లను స్థానిక ‘రెఫరెండమ్’ల ద్వారా గత సెప్టెంబర్లో రష్యా తనలో కలిపేసుకున్న విషయం తెల్సిందే. -
ఆక్రమిత మేరియుపోల్లో పుతిన్
కీవ్: ఉక్రెయిన్లోని ఆక్రమిత తీర ప్రాంత నగరం మేరియుపోల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకస్మికంగా పర్యటించారు. సెప్టెంబర్లో తమ సైన్యం ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాక పుతిన్ మొదటిసారిగా అక్కడికి వెళ్లారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న పుతిన్, సొంతంగా వాహనం నడుపుతూ నగరంలోని స్మారకప్రాంతాలను సందర్శించారు. పుతిన్ శనివారం మేరియుపోల్కు దగ్గర్లోనే ఉన్న క్రిమియాకూ వెళ్లారు. -
షాకింగ్.. హైదరాబాద్ పరిధిలో 134 జలాశయాలు కబ్జా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో స్వచ్ఛమైన వర్షపు నీటితో కళకళలాడాల్సిన చెరువులు కబ్జాల చెరలో చిక్కిశల్యమవుతున్నాయి. ఒకవైపు మురుగు ముప్పు.. మరోవైపు ఆక్రమణలు ఆయా జలాశయాల ఉసురు తీస్తున్నాయి. మహానగరం పరిధిలో మొత్తంగా 185 చెరువులుండగా వీటిలో ఇప్పటివరకు 134 చెరువులు కబ్జాలకు గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్కు నివేదించడం గమనార్హం. ఇందులో పలు జలాశయాల ఫుల్ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలో ఆక్రమణలు అధికంగా ఉన్నట్లు ఈ నివేదికలో తెలిపింది. మొత్తంగా 134 జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో 8,718 .. బఫర్జోన్లో 5,343 అక్రమ నిర్మాణాలున్నట్లు పేర్కొంది. సదరు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం నివేదికలో స్పష్టంచేసింది. 51 చెరువులకు ఊరట.. మహానగరం పరిధిలో కేవలం 51 చెరువులు మాత్రమే కబ్జాలకు గురికాకుండా ఉన్నాయని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. ఇక 30 చెరువులు 85 శాతం ఆక్రమణకు గురైనట్లు తేల్చింది. మరో 104 జలాశయాలు 15 శాతం కబ్జాకు గురైనట్లు నివేదికలో పేర్కొంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 185 జలాశయాలకు సంబంధించి ఎఫ్టీఎల్ హద్దులను సిద్ధం చేసి హెచ్ఎండీఏ పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి సమర్పించినట్లు తెలిపింది. ఇప్పటికే 157 చెరువుల ఎఫ్టీఎల్ బౌండరీలకు సంబంధించి తుది నోటిఫికేషన్ హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రదర్శిస్తున్నామని పేర్కొంది. నూతనంగా ఆయా జలాశయాల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే రెవెన్యూ, జీహెచ్ఎంసీ విభాగాల సహకారంతో సంబంధిత వ్యక్తులపై ఇరిగేషన్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించింది. న్యాయపరమైన చిక్కులతో సాగని పనులు.. నగరంలో పలు చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఇరిగేషన్ శాఖ ఆయా జలాశయాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సాధ్యపడడం లేదని నివేదికలో తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేని చోట ఆక్రమణలను తొలగించి ఎఫ్టీఎల్ బౌండరీల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశామని పేర్కొంది. నగరంలో 63 జలాశయాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటుకు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ రూ.94 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపింది. లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుతోపాటు ఆయా జలాశయాల చుట్టూ సీసీటీవీలను ఏర్పాటు చేసి అక్రమార్కులపై నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. -
Russia-Ukraine War: ఖేర్సన్పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్
కీవ్: రష్యా ఆక్రమిత ఖేర్సన్ ప్రాంతంపై ఉక్రెయిన్ తిరిగి పట్టు బిగిస్తోంది. ఖేర్సన్ను ఉక్రెయిన్ మిలటరీ పాక్షికంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. నిరంతరాయంగా ఆ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ పరిణామాలతో ఖేర్సన్ ప్రాంతానికి చీఫ్గా నియమితుడైన వ్లాదిమర్ సాల్దో ఆ ప్రాంతం నుంచి రష్యాకు ఎవరైనా వెళ్లిపోతామంటే వారికి ఉచితంగా వసతి సదుపాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ చట్టవిరుద్ధంగా ఖేర్సన్సహా నాలుగు ప్రాంతాలను తమ భూభాగంలో కలిపేసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఖేర్సన్ ప్రాంతంలోని ప్రజల ప్రాణాలను రక్షించడానికి రష్యన్ ప్రాంతాలైన రోస్తోవ్, క్రానోడర్, స్ట్రావోపోల్, క్రిమియాకు తరలిస్తామని చెప్పారు. యుద్ధ సమయంలో అనాథమైన వేలాది మంది పిల్లల్ని రష్యాకు బలవంతంగా తరలిస్తోందని, ఇలా చేయడం యుద్ధ నేరాల కిందకే వస్తుందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఉక్రెయిన్ యుద్దంలో అనూహ్య పరిణామం
మాస్కో: ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల విలీనం పేరిట రష్యా వేసిన పథకం మొత్తానికి ఫలించింది. ఎనిమిదేళ్ల కిందట క్రిమియా ఆక్రమణ తరహాలోనే.. ఇప్పుడు ఉక్రెయిన్కు చెందిన మరో నాలుగు కీలక ప్రాంతాలను తనలో విలీనం చేసుకోబోతోంది. శుక్రవారం క్రెమ్లిన్ భవనంలో జరగబోయే కార్యక్రమంలో ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను అధికారికంగా తనలో కలిపేసుకోనుంది రష్యా. ఈ మేరకు గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్లోని జార్జియన్ హాల్లో శుక్రవారం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కొత్త సరిహద్దులు రష్యాలోని చేరనున్నాయి అని పుతిన్ వ్యక్తిగత ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అంతేకాదు.. ఈ పరిణామంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రసంగం చేస్తారని వెల్లడించారు. దీంతో పుతిన్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి నుంచి మొదలైన ఆక్రమణలో భాగంగా.. క్రెయిన్ సరిహద్దుల్లోని లుగన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా సైన్యం ఇదివరకే ఆక్రమించేసింది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పౌరులు రష్యాలో చేరేందుకు సుముఖంగా ఉన్నారంటూ ఆయా ప్రాంతాల్లో క్రెమ్లిన్ నియమించిన రష్యన్ అధికారులు వెల్లడించారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్లో జెండా పాతేద్దాం
ఊహించని ఎదురుదెబ్బల నేపథ్యంలో ఉక్రెయిన్లో రష్యా వ్యూహం మార్చింది. ఆక్రమిత ప్రాంతాలన్నింటినీ శాశ్వతంగా అట్టిపెట్టుకునేలా పుతిన్ పథక రచన చేస్తున్నారు. చాపకింద నీరులా ఆ దిశగా ఒక్కో చర్యా తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఆక్రమించిన 20 శాతం భూ భాగాన్ని రష్యాలో విలీనం చేసుకునేలా చర్యలను వేగవంతం చేశారు. కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగి 100 రోజులు దాటింది. అధ్యక్షుడిని కూలదోసి తమ అనుకూల నేతను గద్దెనెక్కించడంతో రోజుల వ్యవధిలో ముగిసిపోతుందనుకున్న పోరు కాస్తా నెలలు దాటినా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహం మార్చారని, ఉక్రెయిన్ నుంచి వైదొలగరాదని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతాలను శాశ్వతంగా సొంతం చేసుకోనున్నట్టు చెప్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే రష్యా పలు చర్యలకు దిగింది కూడా. ఉక్రెయిన్లోని దక్షిణ ఖెర్సన్, హ్రివ్నియా ప్రాంతాల్లో రష్యా కరెన్సీ రూబుల్ అధికార కరెన్సీగా మారింది. అక్కడి పౌరులకు రష్యా పాస్పోర్టులు కూడా ఇస్తున్నారు. ఆయా ప్రాంతాలను అధికారికంగా రష్యాలో భాగంగా ప్రకటించే దిశగా చర్యలు ఊపందుకున్నాయి. దీంతోపాటు తూర్పున డోన్బాస్లోని రష్యా అనుకూల వేర్పాటువాద పాలకులు కూడా పూర్తిగా ఆ దేశంతో కలిసిపోవాలన్న ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నట్టు క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ 2019 నుంచి ఇప్పటిదాకా రష్యా 7 లక్షలకు పైగా పాస్పోర్టులిచ్చింది! ఇలాంటి చర్యలతో ఉక్రెయిన్ భూ భాగాలను కొంచెం కొంచెంగా రష్యా విలీనం చేసుకుంటూ వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సైనిక విజయాలను వృథా పోనివ్వబోమన్న పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ వ్యాఖ్యల అంతరార్థం కూడా ఇదేనంటున్నారు. సైనికులు కావలెను! మరోవైపు, రష్యా ముట్టడిని దీటుగా అడ్డుకుంటూ వస్తున్న ఉక్రెయిన్ తాజాగా పెద్ద సమస్య ఎదుర్కొంటోంది. యుద్ధంలో సైన్యాన్ని భారీగా నష్టపోయిన నేపథ్యంలో దేశాన్ని బలగాల కొరత తీవ్రంగా వేధిస్తున్నట్టు సమాచారం. రోజుకు కనీసం 60 నుంచి 100 మంది దాకా సైనికులను కోల్పోతున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ప్రకటించారు. మరోవైపు రష్యాకు సైనిక నష్టాలు యుద్ధం తొలి రోజులతో పోలిస్తే ఇటీవల బాగా తగ్గాయని జెలెన్స్కీ సలహాదారు మిఖాయిలో పొడోల్స్క్ శనివారం ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. జెలెన్స్కీ లెక్క ప్రకారం ఉక్రెయిన్ ఇప్పటిదాకా 10 వేల మంది సైనికులను కోల్పోయినట్టే. కానీ వాస్తవ ప్రాణ నష్టం అంతకంటే చాలా ఎక్కువగా ఉందని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పున డోన్బాస్ ప్రాంతంపై రష్యా సైన్యం ప్రధానంగా దృష్టి సారించినప్పటి నుంచీ అక్కడ ఉక్రెయిన్ సైనికులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నట్టు తెలుస్తోంది. యుద్ధానికి ముందు ఉక్రెయిన్కు 2.5 లక్షల మంది సైనికులున్నారు. యుద్ధం మొదలయ్యాక లక్ష మంది దాకా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సైన్యంలో చేరారు. ఈ 100 రోజుల యుద్ధంలో వీరిలో ఎంతమంది మరణించిందీ ఉక్రెయిన్ స్పష్టంగా వెల్లడించలేదు. యుద్ధం సుదీర్ఘ కాలం పాటు కొనసాగేలా కన్పిస్తున్న నేపథ్యంలో ఈ భారీ సైనిక నష్టం ఉక్రెయిన్ను బాగా కలవరపెడుతోంది. దీన్ని తగ్గించుకోవాలంటే అత్యంత శక్తిమంతమైన, అత్యాధునికమైన ఆయుధాలు తక్షణావసరమని ఉక్రెయిన్ సైనికాధికారులు చెబుతున్నారు. పౌరులు పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరుతున్నా వారికి శిక్షణ తదితరాలకు చాలా సమయం పడుతుందని గుర్తు చేస్తున్నారు. భారీగా చేరికలు: ఉక్రెయిన్ తమ సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోతుండటం వాస్తవమేనని ఉక్రెయిన్ సైన్యాధ్యక్షుడు ముజెంకో అంగీకరించారు. అయితే, ‘‘ఈ మేరకు జెలెన్స్కీ చేసిన ప్రకటన వాస్తవానికి మాకు చాలా మేలు చేస్తుంది. దానివల్ల మాకు పశ్చిమ దేశాల సాయుధ సాయం మరింతగా పెరుగుతుంది. ప్రజలందరికీ నిజం తెలిసింది గనుక దేశ రక్షణ కోసం వారు భారీ సంఖ్యలో ముందుకొస్తారు. అలా జరుగుతోంది కూడా. తద్వారా సైన్యంలో నైతిక స్థైర్యం బాగా పెరుగుతోంది’’ అని చెప్పుకొచ్చారు. ఉక్రేనియన్లకు రష్యా పౌరసత్వం ఉక్రెయిన్లో ఐదో వంతు ఇప్పటికే తమ అధీనంలోకి వచ్చిందని రష్యా తాజాగా ప్రకటించింది. ఇది నిజమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అంగీకరించారు. డోన్బాస్తో పాటు ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో కూడా జూలై లోపే రిఫరెండం నిర్వహించే యోచన ఉన్నట్టు ఉక్రెయిన్తో చర్చల్లో పాల్గొన్న రష్యా బృందం సభ్యుడు లియోనిడ్ స్లట్స్కీ వెల్లడించారు! మెలిటోపోల్ వంటి నగరాల్లో రష్యా పౌరసత్వం కోసం పౌరుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంటున్నారు కూడా. మారియుపోల్ వంటి రష్యా ఆక్రమిత నగరాల్లో పలువురు పౌరులు ఈ పరిణామాన్ని స్వాగతిస్తుండటం విశేషం! ‘‘రష్యా పౌరునిగా మారాలన్నది నా చిన్నప్పటి కల. ఇప్పుడు ఇంటినుంచి అడుగు కూడా కదల్చకుండానే అది నెరవేరేలా కన్పిస్తోంది’’ అని ఓ మారియుపోల్వాసి ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితి అంతటా లేదు. తమ అధీనంలోకి వచ్చిన ఖెర్సన్, ద్నిప్రోపెట్రోవ్స్క్, మారియుపోల్ తదితర ప్రాంతాల్లో రష్యన్లను స్థానిక అధికారులుగా క్రెమ్లిన్ నియమించగా పలుచోట్ల వారికి స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చెరువులకు శాపం ఇలా.. రక్షణ చర్యలు తీసుకోవాలిలా...
సాక్షి, హైదరాబాద్: మహానగరానికి మణిహారంలా ఉన్న జలాశయాల పరిరక్షణ, సుందరీకరణ విషయంలో సర్కారు విభాగాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు ఔటర్రింగ్రోడ్డు లోపలున్న వందలాది జలాశయాలు కబ్జాలతో కుంచించుకుపోయాయి. మరికొన్నింట గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల వ్యర్థజలాలు చేరి వాటిని కాలుష్య కాసారాలుగా మార్చివేశాయి. ఈ విషయంలో ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, పీసీబీ, పరిశ్రమలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర విభాగాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలాశయాల పరిరక్షణ విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ పలు సందర్భాల్లో జారీచేసిన మార్గదర్శకాలను సర్కారు యంత్రాంగం అమలు చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. చెరువులకు శాపం ఇలా... ► పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. ► సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతున్నాయి. దీంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధభరితంగా మార్చేస్తున్నాయి. ► ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం. ► సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరడంతోనేఈ దుస్థితి తలెత్తింది. ► గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం.. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపమౌతున్నాయి. ► చాలా చెరువులు తమ ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయి చిక్కిశల్యమై కనిపిస్తున్నాయి. పైపై మెరుగులకే జీహెచ్ఎంసీ ప్రాధాన్యం ► రోజువారీగా గ్రేటర్వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మా త్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే చెరువులు, మూసీ లో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. రక్షణ చర్యలు తీసుకోవాలిలా... ► చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సేవ్ అవర్ అర్భన్లేక్స్ సంస్థ పలు సూచనలు చేసింది. ► గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. ఆయా చెరువుల్లో అట్టడుగున పేరుకుపోయిన ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. ► జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. ► చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటుచేయాలి. ► గృహ,వాణిజ్య,పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ► ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. ► అన్యాక్రాంతం కాకుండా ఎఫ్టీఎల్ బౌండరీలు,రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. నిరంతరం నిఘా పెట్టాలి. జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి. ► వర్షపునీరు చేరే ఇన్ఫ్లో ఛానల్స్ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ► జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి. ► కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. -
వెలగపూడి వైరస్: పేదల ఫుడ్ కోర్టుపై ‘పడగ’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు... ఈయన గారి నేర చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. వంగవీటి మోహన రంగా హత్య కేసులో నిందితుడుగా పరారై ఇక్కడకు వలస వచ్చిన దరిమిలా విశాఖ నగరంలో విష సంస్కృతికి బీజం వేసిన ప్రబుద్ధుడీయన. కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు.. అక్రమార్జన.. ఇలా విశాఖకు మునుపెన్నడూ ఎరగని నయా మాఫియాకు తెరలేపిన ’పచ్చ’ నేత ఈయన. దాదాపు పదిహేనేళ్లుగా తూర్పు నియోజకవర్గాన్ని చెరబట్టిన ఈయన గారి నిర్వాకాలకు, దందాలకు గత రెండేళ్లుగా బ్రేక్ పడుతూ వస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వెలగపూడి బ్యాచ్ భూదందాలు, కోడిపందాలు, మద్యం మాఫియాకు దాదాపు అడ్డుకట్టపడిందనే చెప్పాలి. అయితే అక్రమార్జన అలవాటుపడిన సదరు వెలగపూడి బ్యాచ్ చివరికి చిరు వ్యాపారుల ఫుడ్ కోర్ట్పై కూడా పడిపోయారు. నగరమంతటా కోవిడ్ వైరస్ కలకలం సృష్టిస్తుంటే.. నైట్ఫుడ్ కోర్టులో మాత్రం వెలగపూడి వైరస్ ప్రబలింది. ఇంతకీ.. ఆ వైరస్ ఏంటి.. నైట్ఫుడ్ కోర్టులో అసలేం జరుగుతోందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి రండి. మహా నగర పరిధిలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కోసం జీవీఎంసీ 2019 ఫిబ్రవరిలో జైల్ రోడ్డులో 27 ఫుడ్ స్టాల్స్తో నైట్ ఫుడ్ కోర్టు ప్రారంభించింది. ఆ తర్వాత క్రాఫ్ట్ బజార్ కూడా ఇందులో ప్రారంభించాలని అధికారులు భావించారు. అయితే.. అదే ఏడాది మార్చి నుంచి కరోనా కలకలం మొదలవ్వడంతో లాక్డౌన్తో కొన్నాళ్లు వ్యాపారాలు మూతపడ్డాయి. పర్యవేక్షించాల్సిన జీవీఎంసీ అధికారులంతా కోవిడ్ నియంత్రణ చర్యల్లో 24‘‘7 బిజీగా అయిపోయారు. గతేడాది మే నుంచి నుంచి నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి చెందకుండా నగర ప్రజల్ని కాపాడే బాధ్యతని జీవీఎంసీ భుజానికెత్తుకొని.. నైట్ ఫుడ్ కోర్టు విషయాన్ని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని వ్యాపారాల మాదిరిగానే ఫుడ్ కోర్టు కూడా మొదలైంది. ఇదే అదనుగా ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఫుడ్కోర్టుని ఆక్రమించేశారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో పచ్చజెండా పాతేశారు. అనుమతి 27 స్టాల్స్కి.. ఉన్నవి 138 అప్పటివరకు ఎంవీపీ కాలనీ, బీచ్రోడ్డులో స్ట్రీట్ఫుడ్ దందా సాగిస్తున్న వెలగపూడి బ్యాచ్ జైల్రోడ్డులోని నైట్ఫుడ్ కోర్టుని ఆక్రమించేసింది. వెలగపూడి తన అనుచరుల ద్వారా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయించేశారు. అక్కడితో ఆగకుండా మహారాష్ట్ర, ఒడిశా, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు ఇలా.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారికీ స్టాల్స్ పెట్టుకోడానికి వాళ్లే సొంత అనుమతులిచ్చేశారు. వీరిని చూసి.. మిగిలిన మరికొందరు సైతం తమకు నచ్చినట్లుగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకురాకుండానే ఓ రకంగా. మొత్తం ఫుడ్ కోర్టుని తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. మొత్తం 27 స్టాల్స్కు మాత్రమే అనుమతులుండగా ప్రస్తుతం 138 వరకూ వచ్చేశాయి. ఇందులో సగానికి పైగా వెలగపూడి అనుచరులకు చెందిన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని అంటున్నారు. ఒక్కొక్కరూ తమ బంధువుల పేరుతోనే నాలుగైదు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారుల్ని మాత్రం వాటి దరి చేరకుండా తమ గుప్పిట్లోకి తీసేసుకున్నారు. జీవీఎంసీలో పెండింగ్లో 500 దరఖాస్తులు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మంచి స్పందన రావడంతో నగరంలోని వివిధ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 500కి పైగా దరఖాస్తులు వచ్చాయని యూసీడీ విభాగాధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్న 27 మందికి మాత్రమే ఇప్పటివరకు ఫుడ్ కోర్టులో స్టాల్స్ పెట్టుకోవాలని తాత్కాలిక అనుమతి ఇచ్చామనీ.. ఇంకెవ్వరినీ అనుమతించలేదని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాతే ఫుడ్ కోర్టు విషయమై ఏం చేయాలో ఆలోచిస్తామని అధికారులు అంటున్నారు. స్టాల్ స్టాల్కీ.. వసూళ్ల పర్వం జీవీఎంసీ తమ ఆదాయ వనరుగా నైట్ ఫుడ్ కోర్టుని ఏర్పాటు చేస్తే.. వెలగపూడి బ్యాచ్ దాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయాలంటే లక్ష నుంచి రెండు లక్షల రూపాయిల వరకూ వసూలు చేశారు. పోనీ.. జీవీఎంసీకి వీటి వల్ల ఆదాయం వస్తుందా అంటే.. ఇప్పటివరకూ నైట్ ఫుడ్ కోర్టు నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదని అధికారులే చెబుతున్నారు. మొదట అధికారికంగా ఏర్పాటు చేసిన 27 స్టాల్స్ నుంచి కూడా ఫీజు వసూలు చేయలేదనీ.. కరోనా కారణంగా మినహాయింపునిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. చిరు వ్యాపారులను తొక్కేసి.. రోడ్లపై చిరుతిళ్లు అమ్ముతూ బతుకులీడ్చుతున్న నగరానికి చెందిన చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ చివరికి బడా వ్యాపారస్తుల కేంద్రంగా మారిపోయింది. ఆ ఫుడ్కోర్టులోకి అడుగు పెడితే కొన్ని స్టాళ్లలో పెద్ద హోటల్స్తో పోటీగా ధరలుంటాయి. మొత్తంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు సదుద్దేశ్యాన్ని పక్కదారి పట్టించి... చిరు వ్యాపారులను మింగేసిన పచ్చ రాబందులపై జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా దృష్టిసారిస్తారో లేదో చూడాలి. చదవండి: టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత.. నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా..
♦.. లేస్తే మనిషిని కాదన్నట్టు ఎప్పుడూ కుర్చీల్లో కూర్చుని టీవీల్లో కనిపిస్తూ సుద్ద పూసలా మాట్లాడే మాజీ మేయర్ సబ్బం హరి అసలు బండారం ఇప్పుడు బయటపడింది. ♦ఘాజీ సబ్మెరైన్ను విశాఖ తీరానికి తానే తీసుకువచ్చానని అర్ధం పర్ధం లేని విశ్లేషణలు చేస్తూ.. తనకు తాను పెద్ద మనిషిలా బిల్డప్ ఇచ్చే హరి వారి నిజరూపం ఇప్పుడు విశాఖ ప్రజలకు నిలువెత్తుగా దర్శనమిచ్చింది. ♦ఆయన నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తాయో.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని కనీస స్పృహ లేకుండా ఎంత దారుణంగా మాటలు అంటారో... ప్రభుత్వ అధికారులను ఇష్టమొచ్చినట్టు ఎలా దునుమాడుతారో ఇన్నేళ్లకు స్పష్టంగా తెలుసొచ్చింది. ♦హరి ఓవర్ యాక్షన్ ఎందుకో తెలుసు కదా... ఆయన మేయర్గా వెలగబెట్టిన కాలంలో అడ్డగోలుగా కట్టేసిన ఓ అక్రమ నిర్మాణాన్ని కూలి్చవేయడమే అధికారులు, సర్కారు ఘోర తప్పిదమైనట్టు శనివారం రెచ్చిపోయాడాయన. ♦సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నంబర్ 7లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా రెస్ట్రూం, ప్రహరీ నిర్మాణం చేసేసిన నిర్వాకంపై స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం జీవీఎంసీ అధికారులు స్పందించి కూలగొట్టారు. అంతే.. దానికి నానాయాగీ చేస్తూ... అధికారులనే కాదు.. పాలకులను సైతం బండబూతులు తిడుతూ కనీస స్పృహ కూడా లేకుండా చేసిన సబ్బం గబ్బు చూసి సామాన్యులు సైతం ఛీ కొట్టారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇంతకూ అసలు సుద్దపూసలా కబుర్లు చెబుతున్న సబ్బం హరి జీవిత ప్రస్థానం ఏమిటో ఒక్కసారి చూద్దాం రండి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సబ్బం హరి.. నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం... విశ్వాస ఘాతుకానికి అసలు సిసలు ప్రతిరూపం... ఇదేంటి అన్నేసి మాటలు. అని అనుకుంటున్నారా... అయితే సబ్బం హరి చిట్టా విప్పాల్సిందే.. ►విశాఖ నగరంలో పనీ పాటా లేకుండా చిల్లర వేషాలు, రౌడీవ్యవహారాలు, సెటిల్మెంట్లు చేస్తూ కాలం గడిపేసిన సబ్బం హరిని అదృష్టం వరించి 1995లో అనూహ్యంగా విశాఖ నగరపాలకసంస్థ మేయర్ అయ్యారు. గౌరవప్రదమైన మేయర్ పదవిలో ఉండి...ఓ సారి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన ఉదంతంలో అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఆనాటి పోలీస్కమిషనర్ ఆర్íపీ మీనా, డీఎస్పీ రామచంద్రరాజులు బూటుకాళ్లతో బుద్ధి చెప్పారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మేయర్గా ఉంటూనే.. ఏకంగా సీతమ్మధారలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేసేశారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్నే జీవీఎంసీ అధికారులు కూలగొట్టారు. (చదవండి: సబ్బం హరి కాదు.. పబ్బం హరి) ►ఒక్క దఫా మేయర్గా పని చేసి... చెరిగిపోని మరకలు అంటించుకున్న సబ్బం హరిని కాంగ్రెస్ పార్టీనే కాదు.. నగర ప్రజలు కూడా దూరంగా పెట్టేశారు. అందుకే 1999 ఎన్నికల్లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దారుణ పరాభవం రుచిచూపించారు. అటు తర్వాత మారిన మనిషినని నమ్మించి మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డాడు. ఓ దఫా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అప్పటి విశాఖ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సదరు సబ్బం హరిని సస్పెండ్ కూడా చేయించారు. అప్పుడు కూడా వైఎస్ పెద్దమనసుతో మన్నించి నేదురుమల్లిని ఒప్పించి తిరిగి హరిని పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గరుండి అనకాపల్లి లోక్సభ సీటు ఇప్పించి గెలిపించారు. మహానేత హఠాన్మరణం తర్వాత సబ్బం హరి ఎలాంటి ‘కృతజ్ఞత’ చూపించారో అందరికీ తెలుసు. (చదవండి: మెడలు విరిచేస్తా.. అంతు తేలుస్తా) 2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి.. ఆనక చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి హరిబాబుకు ఓటేయాలని పిలుపునిచ్చాడు. ఆ ఎన్నికల తర్వాత ఐదేళ్లు 2014 నుంచి 2019 వరకు బయటకు మొహం చూపించలేని దుస్థితి దాపురించింది. 2019లో సరిగ్గా ఎన్నికల సమయంలో తెర మీదకు వచ్చి తెలుగుదేశం పారీ్టలో ఎవ్వరూ వద్దన్న భీమిలి బరిలో నిలుచుని వైఎస్సార్సీపీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. సబ్బం రుద్దుడు భరించలేక భీమిలి ప్రజలు తిప్పికొట్టడంతో ఎన్నికల తర్వాత బయటకు మొహం చూపించలేక టీవీలకే పరిమితమయ్యాడు. కేవలం టీవీల్లో తప్పించి బయట ఎక్కడా కానరాని సబ్బం హరి విన్యాసాలు చూస్తే.. జబర్దస్త్ కామెడీకి మించి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే శనివారం ఆ కామెడీ శృతి మించి సీరియస్ కావడంతో సబ్బం హరిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన హరిపై అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేందుకు వెనుకాడబోమని జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. -
‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’
సాక్షి, విశాఖపట్నం : అనుమతులకు విరుద్ధంగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి నిర్మాణం చేపట్టారని విశాఖ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సబ్బంహరి అక్రమ నిర్మాణానికి సంబంధించి విశాఖ కమిషనర్ ప్రెస్నోట్ విడుదల చేశారు. ఇందులో పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని సెప్టెంబర్ 5న ఏపీఎస్ఈబీ కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నెం.7లో ఏపీఎస్ఈబీ పార్కు ఉందన్నారు. 2012లో ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి తీసుకున్న సబ్బం హరి 592.93చ.మీ విస్తీర్ణంలో జీ+1 కోసం అనుమతి తీసుకున్నారని తెలిపారు. ()సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత) ఇంటి ముఖం 58 ఫీట్లకు అనుమతి తీసుకుని 70 ఫీట్లు కట్టినట్లు వెల్లడించారు. మొత్తం మీద పార్క్లోని 212 గజాలను ఆక్రమించిన సబ్బం హరికి ఆక్రమణలకు సంబంధించి 406 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు తీసుకోవడానికి ఆయన నిరాకరించడంతో నోటీసులను సబ్బం హరి భవనానికి కమిషనరేట్ సిబ్బంది అతికించారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోకపవంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. కాగా సీతమ్మధారలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వద్ద పార్కు స్థలం కబ్జాకు గురైందని వైజాగ్ జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాన్ని తొలగించామని వెల్లడించారు. ముందుగా సబ్బం హరికి ఆక్రమణ నోటీసు ఇచ్చాము కానీ ఆయన తీసుకోలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
పార్క్ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ ఎంపీ సబ్బంహరి
-
సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం : మాజీ ఎంపీ సబ్బంహరి వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని ఎంచక్కా కబ్జా చేసి టాయిలెట్ను నిర్మించారు. 12 అడుగుల పార్క్స్థలాన్ని ఆక్రమించి సొంత నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాకుండా మరికొంత ప్రభుత్వం స్థలం ఇంటి స్థలంలో కలిపేసుకున్నారు. ఈ విషయం కాస్తా స్థానిక అధికారుల దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణన్ని తొలగించాలని నోటీసులు జారీచేశారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. అయితే అక్కడి చేరుకున్న అధికారులపై సబ్బం హరి నోరుపారేసుకున్నారు. మెడలు విస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆయన అనుచరులు సైతం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘటనాస్థలానికి పోలీసు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. తాజా వివాదంపై జీవీఎంసీ ఏసీపీ మహాపాత్ర మాట్లాడుతూ.. ‘12 అడుగుల ప్రభుత్వ స్థలం సబ్బం హరి కబ్జా చేశారు. రికార్డ్ ప్రకారం ఆ స్థలం ప్రభుత్వంది. కబ్జా స్థలంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాము. ఆక్రమించిన కాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశాము. సమాచారం లేకుండా తొలగించాము అన్న సబ్బం హరి మాటల్లో వాస్తవం లేదు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసు జరిచేసాము. నోటీసుకు సబ్బం హరి స్పందించలేదు. నోటీసుకు స్పందించక పోవడంతోనే టాయిలెట్ తొలగించి, ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాము.’అని తెలిపారు. -
తీరంలో ‘భూ’చోళ్లు
సముద్ర తీర భూములు కబ్జా అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్వా పరిశ్రమలు అప్పనంగా కలుపుకుంటున్నాయి. రికార్డుల్లో సర్కార్ భూమిగా ఉంటుంది. స్వరూపం చూస్తే అక్కడ పెద్ద పెద్ద కంపెనీల భవనాలు కనిపిస్తుంటాయి. ఐదెకరాల ప్రైవేట్ భూమిని కొని దాని చుట్టు పక్కల పది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రహరీలు నిర్మించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులను మామూళ్లతో లోబర్చుకుని అందిన కాడికి భూమిని కలుపుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. జిల్లాలోని ఇందుకూరుపేట తీరం భూ కబ్జాలకు నిలయంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని ఇందుకూరుపేట పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. మైపాడు తీరంలో బీచ్, రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడి తీరం అనువుగా ఉండడంతో ఆక్వా హేచరీలు సైతం సీడ్ ఉత్పత్తిని ప్రారంభించాయి. పదిహేనేళ్ల క్రితం నుంచి ఇక్కడ హేచరీలు ఒక్కొక్కటిగా ఏర్పడ్డాయి. మైపాడు, కొరుటూరు ప్రాంతాల్లోనే హేచరీలు అధికంగా ఉన్నాయి. ఒక్క మైపాడు పరిసర ప్రాంతంలోనే సుమారు 30 వరకు హేచరీలు ఉన్నాయి. హేచరీలు అధికంగా రావడం, మైపాడు బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతానికి డిమాండ్ ఏర్పడింది. ♦హేచరీల ఏర్పాటు ముందు వరకు ఎకరా రూ.5 లక్షలు పలికిన భూమి ప్రస్తుతం రూ.50 లక్షలకు చేరింది. ♦జిల్లాలోని వివిధ రంగాల వ్యాపారులు, రాజకీయ పార్టీల నేతలు, కొందరు డాక్టర్లు అందరూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంతో బహిరంగ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ♦ఈ క్రమంలో రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూముల స్వాహా పర్వానికి మొదట్లోనే ఒకటి..రెండు హేచరీల నిర్వాహకులు తెర తీశారు. ♦అలా ప్రారంభమైన భూ ఆక్రమణ పర్వం నేటికి అప్రతిహతంగా కొనసాగుతోంది. 12 సర్వే నంబర్లలో 150 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొందరు తమ ప్రైవేట్ భూముల్లో కలుపుకుని హేచరీలు నిర్మించారు. ♦తాజాగా ప్రభుత్వం జిల్లాలో పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అనువైన స్థలాలను జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములకు సంబంధించి రికార్డులను అధికారులు పరిశీలించారు. దీంతో మైపాడు, కొరుటూరులో 150 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రైవేట్ భూమి మాటున.. ఇందుకూరుపేట మండలం మైపాడు, కొరుటూరు గ్రామాలు సముద్ర తీర ప్రాంతం కావడంతో ప్రభుత్వ భూమికి కొదవ లేదు. ఈ భూముల మధ్య మధ్యలో ప్రైవేట్ భూమి కూడా ఉంది. ఇదే హేచరీల నిర్వాహకులకు వరంగా మారుతోంది. ♦కొంత ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి దానికి రెట్టింపులో ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేశారు. ♦ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే నంబర్లకు ఆనుకుని అనేక ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. ♦హేచరీల యాజమాన్యం ప్రైవేట్ భూములను అధికారికంగా కొనుగోలు చేసి వాటిలో ప్రభుత్వ భూములు కలుపుకుని ప్రహరీ నిర్మించడం సముద్రం వరకు పైపులైన్లు ఏర్పాటు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ♦ఒక్క కొరుటూరులోనే 10 సర్వే నంబర్లలో 70 ఎకరాలకు పైగా భూమి హేచరీల్లో కలిసి ఉంది. ♦కొందరు హేచరీ నిర్వాహకులు గతంలో అధికారులను లోబర్చుకుని రికార్డులను కూడా తారుమారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ♦గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన హేచరీలు కాల్వ పోరంబోకు, ప్రభుత్వ డొంక, శ్మశాన డొంక, చెరువు పోరంబోకు ఇలా ఏ ఒక్క దాన్ని వదలకుండా అందిన మేరకు కలుపుకున్నాయి. ♦దీనిపై గతంలోనూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి విచారణతో సరి పెట్టారు. ♦కొరుటూరులో 544, 545, 546, 543, 547, 526, 527, 557, 559, 560 తదితర సర్వే నంబర్లలో 10 హేచరీ నిర్వాహకులు ప్రభుత్వ భూమిని కలుపుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. ♦పది సర్వే నంబర్లలో ప్రధానమైన పది కంపెనీలు కలుపుకున్న 70 ఎకరాల భూమి విలువ సుమారు రూ.35 కోట్లు పైమాటే. ♦ఇక మండలం మొత్తంలోనూ ఇదే పరిస్థితి. మండలంలో సుమారు 400 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలో ఉన్నట్లు నిర్ధారించారు. వీటి విలువ మొత్తం సుమారుగా రూ.200 కోట్లపై మాటేనని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ♦ఆక్వా పరిశ్రమల భూ ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. -
దర్జాగా భూములు కబ్జా
సాక్షి, శ్రీకాకుళం : ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్న అక్రమార్కులు దర్జాగా అక్రమ కట్టడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ వైపు పేదలకు పట్టాలు ఇచ్చేందుకు గాను రెవెన్యూ అధికారులు భూముల కోసం సర్వేలు చేస్తుండగా మరోవైపు రియల్టర్లు సర్వే నంబర్లు మార్చుస్తూ ప్రభుత్వ భూములకే పంగనామం పెడుతున్నారు. దీనికి తోడు ఆర్ఐ, వీఆర్వోలు సైతం చూసిచూడనట్టుగా వ్యవహారించడం, అక్రమార్కులకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ భూములను చాప కింద నీరులా రియల్డరంతా కలిసి గెద్దెల్లా లాక్కోవడం ఎక్కడికక్కడే జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాలు పంపిణీ చేసే దిశగా భూములు కోసం రెవెన్యూ సిబ్బందితో మండలంలోని పలు ప్రాంతాల్లో సర్వే చేపట్టగా, సెంటు భూము లేదని సర్వేయర్లు ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వడం నిత్యకృత్యంగా జరుగుతోంది. ప్రభుత్వ స్థలాల్లో కొంతమంది ఆక్రమణదారులు పాగ వేస్తూ రెవెన్యూ యంత్రాంగాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకొని ఎంతో కొంతవారికి ముట్టచెబుతూ దొడ్డిదారిన నిర్మాణాలు చేపడుతున్నారు. విలువైన స్థలాల్లో పుట్టగొడుగుల్లా అక్రమ బిల్డింగ్లు వెలుస్తున్నా రెవెన్యు యంత్రాంగం మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. మండల పరిధిలోని మునసబుపేటలో గల విధాత్రి స్కూల్ను ఆనుకొని సింగుపురం రెవెన్యూ పరిధిలో గల ల్యాండ్ సీలింగ్ భూమిలో ఓ మండల టీడీపీ నాయకుడు అనుచరుడు ఏకంగా 80 సెంట్లు విస్తీర్ణంలో ఓ భవంతిని అక్రమంగా నిర్మించినట్టు ఆరోపణలున్నాయి. ఇది రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 446లో గల ప్రభుత్వ ల్యాండ్ సీలింగ్ భూముల పరిధిని చూపిస్తుంది. జాతీయ రహదారిని ఆనుకొని ఉండడంతో ఇక్కడ సెంటు భూమి ధర రూ.5లక్షలు పలుకుతోంది. సుమారు నాలుగుకోట్లు విలువైన భూమిని కేవలం పక్క సర్వే నంబర్తో చేజెక్కించుకున్నారు. ఇప్పటికే మూడు ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. గత ప్రభుత్వ పాలనలోనే ఈ బిల్డింగ్ వ్యవహారమంతా గత టీడీపీ ప్రభుత్వ పాలనలోనే జరిగింది. మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తన సమీప బంధువుకు సంబంధించినది కావడంతో ఆయన కనుసైగల్లోనే పూర్తిస్థాయిలో ఆమోదమైనట్టు సమాచారం. ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతంగా కావడంతో ఆ పరిసర ప్రాంతంలో గల భూ ములకు మరింత గిరాకీ పెరిగింది. దీంతో ప్రభుత్వ భూములోనే ఆ బిల్డింగ్ నిర్మాణ పనులు ఆగమేఘాలపైన జరుగుతున్నాయి. చక్రం తిప్పుతున్న వీఆర్వో ఎవరు వాస్తవంగా రెవెన్యూ రికార్డుల భూముల వ్యవహారంలో ఓ వీఆర్వో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే వీఆర్వోల బదిలీల వ్యవహారంలో కుడా ఆయన చేతివాటం తీవ్రస్థాయిలో ప్రదర్శించినట్టు సమాచారం. ప్రభుత్వ భూముల సమాచారంపై ముందస్తుగా రియల్టర్లు ఈయన్నే సంప్రదిస్తారు. ప్రస్తుతం విదాత్రీ స్కూల్ పక్కన ఉన్న ల్యాండ్సీలింగ్ భూముల్లో వెలసిన మూ డంతస్తుల భవంతిలో కుడా ఈయన చేతివాటంతోనే సర్వే నంబర్లలో మార్పులు చేర్పు లు జరిగినట్టు పలువురు చెబుతున్నారు. నా దృష్టికి రాలేదు సింగుపురం రెవెన్యూ పరిధిలో గల ల్యాండ్ సీలింగ్ భూముల్లో ఓ భవంతిని అక్రమంగా నిర్మిస్తున్నారన్న విషయం నా దృష్టికి రాలేదు. మరో రెండు రోజుల్లో ఆయా భూములపై సర్వే నిర్వహిస్తాం. అక్రమంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఉగాది నాటికి పట్టాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భూమలు కోసం సర్వే చేయమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడా ఉన్నాయో ఆ దిశగా సర్వే చేస్తున్నాం. – ఐటి కుమార్, తహసీల్దార్, శ్రీకాకుళం -
రికార్డులు మార్చి.. ఏమార్చి!
అంతర్జాతీయ విమానాశయ్రం పేరుతో టీడీపీ నేతలు భూదందాకు పాల్పడ్డారు. రూ.కోట్లు గడించారు. నిర్మాణానికి సంబంధించి గత ఐదేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. కానీ దీనిని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. అధికారులను పావులుగా ఉపయోగించుకుని వలస వెళ్లిన వారి భూములను కాజేశారు. రికార్డులను తారు మారు చేశారు. భూములు కోల్పోయిన వారికి ఇచ్చిన పరిహారాన్ని సైతం స్వాహా చేశారు. టీడీపీ నేతల భూ, ధన దాహానికి సహకరించిన రెవెన్యూ అధికారులు సస్పెండ్ కూడా అయ్యారు. సాక్షి, కావలి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అంతర్జాతీయ విమానాశ్రయానికి బీజాలు పడ్డాయి. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం దామవరం వద్ద నిర్మించ తలపెట్టిన ఎయిర్పోర్టు శరవేగంగా నిర్మా ణం చేయాలని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. చెన్నె– కోల్కత్తా జాతీయ రహదారి పైనే ఉన్న ఈ ప్రదేశంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తే ఇటు నెల్లూరు జిల్లా ప్రజలకు, అటు ప్రకాశం జిల్లా అందుబాటులో ఉంటుందని భావించారు. దీనికి 2,200 ఎకరాలు భూమి అవసరమని ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రులు అయిన రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి రావడంతో.. ఈ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే టీడీపీ నేతలు విమానాశ్రయం నిర్మించ తలపెట్టిన భూములపై రాబందుల్లా వాలిపోయారు. ప్రధానంగా దామవరం, కేకేగుంట గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములపై పడి నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. విమానాశ్రయ భూముల్లో అసలు యజమానులు ఎవరో, నకిలీలు ఎవరో తేల్చుకోలేక అధికారులు సైతం హడలిపోయారు. ఏ నిర్ణయం తీసుకొంటే తమ ఉద్యోగాలకు ఎసరు తెస్తుందో అని వణికిపోయారు. ఈ క్రమంలో 2016లో జిల్లా కలెక్టర్గా ఉన్న జానకి దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ చేయడం సాధ్యం కాదని, అన్నీ కూడా వివాదాస్పద భూములే అని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో 18 మే 2017వ తేదీ నెల్లూరుకు వచ్చిన అప్పటి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు కల్పన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్ ఒక స్టార్ హోటల్లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసి, దామవరంలో విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలను రద్దు చేసి, దానిని మరో జిల్లాకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. భూ సేకరణకు ఎక్కువ ధర డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికే రూ.20 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టామని, ఇక ఏ విధమైన అవకాశం లేనందున విమానాశ్రయం ఏర్పాటును రద్దు చేస్తున్నామన్నారు. ధరలు తగ్గింపు విషయంలో యజమానులు ముందుకు వస్తే పునరాలోచించడం జరుగుతుందన్నారు. ఇలా విమానాశ్రయం ఏర్పాటుకు రైతులే అడ్డం పడుతున్నట్టుగా నెపం వేసేలా అప్పటి ప్రభుత్వం యత్నించిందన్న విమర్శలు సైతం వచ్చాయి. అప్పటి ప్రభుత్వ ప్రకటనలపై ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలిచారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విమానాశ్రయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రీన్ ఫీల్డ్ నుంచి.. బుల్లి ఎయిర్పోర్ట్ విమానాశ్రయం నిర్మాణానికి 2,200 ఎకరాలు అవసరమని భావించినప్పటికీ, అక్కడ నెలకొని ఉన్న భూ వివాదాల నేపథ్యంలో కేవలం 613 ఎకరాలు సరిపోతుందని స్వయంగా ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సర్దుబాటు ధోరణిలో చెప్పింది. తర్వాత జరిపిన చర్చలు తర్వాత జిల్లా అధికార యంత్రాంగం విమానాశ్రయం కోసం దగదర్తి మండలంలోని దామవరంలో 1,075 ఎకరాలు, కొత్తపల్లి కౌరుపల్లిగుంట (కేకేగుంట)లో 323 ఎకరాలు కలిపి 1,399 ఎకరాలు భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 1,379.71 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు చంద్రబాబుతో ఉత్తుత్తి శంకుస్థాపన చేయించి చేతులు దులుపుకొన్నారు. అయితే భూ సేకరణ పనులు ఇంకా పూర్తి కాలేదు. కేవలం 1,061.095 ఎకరాలు మాత్రమే రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి అప్పగించారు. ఇంకా 318.615 ఎకరాలు అప్పగించాల్సి ఉంది. ఇక విమానాశ్రయ భూములను ఆనుకొని ఉన్న 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడు ఒకరు కొల్లగొట్టేశాడు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు బ్రోకర్లుగా అవతరించి నష్టపరిహారంలో వాటాలు తీసుకొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.50 కోట్లు నష్టపరిహారాన్ని కూడా దేశం నేతలు కాజేశారు. విమానాశ్రయ స్వప్నం సాకారం జిల్లా ప్రజల విమానాశ్రయ స్వప్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేస్తున్నారు. టీడీపీ నాయకులు విమానాశ్రయం నిర్మించాలని ఏ రోజు అనుకోలేదు. విమానాశ్రయాన్ని అడ్డం పెట్టుకొని రైతుల భూములు కాజేసి వారి కడుపుకొట్టారు. ఆ పాపం ఊరికనే పోదు. మాకు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వీలైతే రైతులకు సహాయం చేయడానికి చట్టం ఇబ్బందిగా ఉంటే దానిని సవరించి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం. తప్పులు, దోపిడీలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు. – రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే, కావలి -
వక్ఫ్ భూమి హాంఫట్
సాక్షి, కోడుమూరు: కర్నూలు నగర శివారులో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వక్ఫ్ భూములను సైతం చెరబడుతున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల సహకారం కూడా ఉండడంతో రియల్టర్లు చెలరేగిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఈ క్రమంలోనే కల్లూరు మండలం పందిపాడు గ్రామ పరిధిలోని ఇండస్ స్కూల్ ఎదురుగా ఉన్న వక్ఫ్బోర్డు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారు. దీన్ని ప్లాట్లుగా మార్చి యథేచ్ఛగా అమ్ముతున్నారు. అడిగే వారేరీ? పందిపాడు గ్రామ సర్వే నంబర్లు 5, 7/ఏ, 22, 94లలో మొత్తం 21.58 ఎకరాల వక్ఫ్బోర్డు భూమి ఉంది. ఇక్కడ ఎకరా భూమి విలువ రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు పలుకుతోంది. వక్ఫ్ బోర్డుకు చెందిన భూములని తెలిసినా రియల్ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో అధునాతన భవనాలు సైతం నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమంగా రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది జూలైలో కల్లూరు సబ్ రిజిస్ట్రార్ బదిలీపై వెళుతూ దాదాపు ఎకరన్నర వక్ఫ్ భూమిలోని ప్లాట్లకు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన విషయం వెలుగు చూసింది. సర్వే నంబర్ 7/ఏలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకు ప్రతిఫలంగా రియల్టర్ల నుంచి దాదాపు రూ.25 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. సర్వే నంబర్ 7/ఏలోని 12.12 ఎకరాల భూమి ఎంతోకాలంగా రిజిస్ట్రేషన్స్ నిషేధిత జాబితాలో ఉంది. అయినప్పటికీ బదిలీపై వెళ్తున్నానన్న ధీమాతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని ప్లాట్లను సర్వే నంబర్ మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా వక్ఫ్బోర్డు అధికారులు పట్టించుకోలేదు. కనీసం భూమి ఉన్న ప్రాంతంలో నోటీస్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో రియల్ఎస్టేట్ వ్యాపారులు రోడ్లు వేసి, రాళ్లు పాతి ప్లాట్లను అమ్ముకుంటున్నారు. ఒక్క జూలైలోనే దాదాపు 30 ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. -
ఆక్రమించిన ‘డబుల్’ ఇళ్లు ఖాళీ
సాక్షి, ఖమ్మం : మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో అక్రమంగా ప్రవేశించిన వారిని అధికారులు బుధవారం ఖాళీ చేయించారు. గ్రామంలో నిర్మాణం పూర్తయిన 20 డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి గత ఆదివారం రాత్రి కొందరు అక్రమంగా ప్రవేశించారు. ఇళ్లకు వేసిన తాళాలు పగుల గొట్టి సామగ్రి సర్దుకున్నారు. విషయం తెలిసిన తహసీల్దార్ జన్ను సంజీవ గ్రామానికి చేరుకుని ఇళ్లను ఖాళీ చేయాలని సూచించారు. ఆక్రమణదారులు ఖాళీ చేయకపోవడంతో తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ను స్వయంగా కలిసి పరిస్థితి వివరించారు. దీంతో కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి ఆక్రమణదారులను ఖాళీ చేయించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఇళ్లను ఆక్రమించుకున్న 20 మంది వ్యక్తులపై మంగళవారం రాత్రి వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్దకు రెవెన్యూ అధికారులు పోలీసులను తీసుకుని వెళ్లారు. డీఆర్వో శిరీష, తహసీల్దార్ సంజీవ, డీసీపీ దాసరి ప్రసన్నకుమార్, సీఐ రమాకాంత్, ఎస్సైలు తాండ్ర నరేష్, శ్రీనివాస్, ఎల్లయ్య, సుమారు 100 మంది పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలని ఆక్రమణదారులను హెచ్చరించారు. ఖాళీ చేయబోమంటూ ఆక్రమణదారులు ఆందోళనకు దిగారు. తమకు ఇళ్లు ఇస్తామంటేనే గతంలో ఇక్కడ ఉన్న 35 గుడిసెలు తొలగించామని, ఇప్పుడు తమకు ఇళ్లు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అర్హులకు ఇళ్లు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు నచ్చజెప్పి ఇళ్లను ఖాళీ చేయించారు. అనంతరం తాళాలు వేసి సీల్ వేశారు. కాగా కొందరు డీఆర్ఓ శిరీష కాళ్ల మీద పడి కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అర్హులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీంతో మూడు రోజుల నుంచి ఉత్కంఠ రేపుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ఆక్రమణ వివాదం సద్దుమణిగింది. -
మార్టిగేజ్ ల్యాండ్ మాయం?
సాక్షి, సిరిసిల్లటౌన్:మున్సిపల్ ఆస్తులకు రక్షణ కరువైంది. కొందరు మధ్యవర్థుల అడ్డగోలు వ్యవహారం.. అధికారుల గుడ్డినమ్మకం ఇందుకు కారణమైంది. రూ.25 లక్షల విలువ చేసే మార్టిగేట్ స్థలం వివాదంలో చిక్కింది. టౌన్ ప్లానింగ్ వైఫల్యంతో.. మున్సిపల్కు చెందిన ఆస్తుల రక్షణలో టౌన్ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలకు ఈసంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. సాయినగర్లో 729/ఏ, 729/బి తదితర సర్వే నంబర్లలో 2000, 2001 ప్రాంతంలో పలువురు తమ స్థలాలను ప్లాట్లుగా మార్చుతూ అనుమతులు పొందారు. ఈప్రాంతం అభివృద్ధి కోసం మున్సిపల్కు 31 గుంటలు కేటాయించినట్లు సమాచారం. మున్సిపల్ స్థలాలకు రక్షించే చర్యలో భాగంగా సదరు సర్వే నంబర్లలోని లేఅవుట్ భూమి 31 గుంటలు ఉండగా మున్సిపల్ కేవలం 16 గుంటలకే ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం నర్సరీ నిర్వహిస్తున్నారు. ఇదే స్థలాన్ని ఆనుకుని మిగతా 15 గుంటలకు ప్రహరీ నిర్మించకపోవడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నలోటు.. పెద్దతప్పు.. సాయినగర్ ప్రాంతంలోని రెండు వేర్వేరు వెంచర్ల ద్వారా మున్సిపల్కు 31 గుంటల స్థలం సంక్రమించింది. ఇందులో ఒక వెంచర్ను ముగ్గురి తరఫున ప్లాట్ నంబరు 21 పేరుతో మున్సిపల్ ఫీజు కింద కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేశారు. ప్లాటింగ్ అనుమతిలో డీటీసీపీ నుంచి అనుమతి వచ్చినపుడు సదరు ప్లాటు నంబరు 25గా మారిం ది. హద్దులు మాత్రం వెనకాల మున్సిపల్ నర్సరీ, ముందు భాగంలో రోడ్డు వంటివి ప్లాన్లో నిర్ధారణ చేసినట్లు మిగతా ఇద్దరు బాధితులు తెలిపారు. అయినా మూడోవ్యక్తి కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేసిన స్థలాన్ని విక్రయించడం..ఇటీవలే ఆ ప్లాటులో టౌన్ప్లానింగ్ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి రావడం వివాదానికి తెరలేపింది. అడ్డదారులు పట్టిస్తున్న గుడ్డినమ్మకం.. మధ్యవర్థులపై అధికారులకు ఉన్న గుడ్డినమ్మకం అడ్డదారులకు తావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఇంటి నిర్మాణ అనుమతి మంజూరులో స్థానిక మున్సిపల్ ప్లానర్స్తోపాటు మరికొందరు మధ్యవర్థిత్వం నెరుపుతున్నట్లు సమాచారం. ఈవిషయంలో ఓ ప్లానర్ అ«ధికారులు, ప్లాటు విక్రయదారులకు మధ్యవర్థిత్వం నెరిపి విచారణ లేకుండా ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయించినట్లు చర్చసాగుతోంది. సాయినగర్లోని మున్సిపల్ మార్టిగేజ్ ల్యాండ్ను ఇతరులకు అమ్మిన వ్యక్తి ప్రముఖుడు కావడంతో ఎలాంటి వి చారణ లేకుండానే ఇంటిపర్మిషన్ ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ప్రస్తుతం సదరు మార్టిగేజ్ ల్యాండ్ విడుదల కోసం ఇద్దరు బాధితులు దరఖాస్తు చేసుకుని న్యాయం కావాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం మార్టిగేజ్ ల్యాండ్ విక్రయంపై మాకు ఫిర్యాదు రాలేదు. ఈవిషయంలో విచారణ చేపట్టి చర్యలు చేపడతాం. మున్సిపల్కు సంబం««ధించిన స్థలాలను ఆక్రమించినా..దుర్వినియోగం చేసినా కఠినంగా వ్యవహరిస్తాం. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
కాల్వను మింగేసిన కబ్జాదారులు
సాక్షి, రాజేంద్రనగర్: నదిపై వంతెన, రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే లక్షలాది రూపాయలు, సంవత్సరం పాటు సమయం పడుతుంది. అదే కబ్జాదారులకు ఆ పని అప్పగిస్తే రాత్రికి రాత్రే రోడ్డును పూర్తి చేస్తారు. ఇది మాటల్లో కాదూ చేతల్లో చేసి చూపించారు కబ్జారాయుళ్లు... వివరాల్లోకి వెళితే.. హిమాయత్సాగర్ జలాశయం నుంచి వచ్చే వరద నీటిని కిస్మత్ఫూర్, బండ్లగూడ మీదుగా సంఘం వద్ద మూసీ నదిలోకి కలిసేలా గతంలో 220 అడుగుల కాల్వను ఏర్పాటు చేశారు. దీనికి ఈసీ నదిగా పేరు పెట్టారు. మూసీ పేరుతోనే ఈ కాల్వ ప్రస్తుతం కొనసాగుతుంది. బండ్లగూడ పీఅండ్టీ కాలనీ నుంచి జనచైతన్య వెంచర్కు మధ్యన మూసీ నది అడ్డుగా ఉంది. ఈ రెండు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో స్థానికంగా స్థలాలకు విపరీతమైన ధర పలుకుతోంది. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ కొందరు మట్టిపోసి రోడ్డును ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా మరికొందరు భారీ వాహనాలు వెళ్లేలా మట్టిని పోసి రోడ్డును తయారు చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు గుండా లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు సులువుగా వెళ్తున్నాయి. ఇదే అదునుగా కొందరు కబ్జాదారులు మూసిలో సైతం మట్టిపోసి ప్లాట్లుగా విభజించి విక్రయించారు. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణాలు సైతం సాగుతున్నాయి. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
సైన్యంలో పోరాటం కంటే ఇది కష్టం!
► సిపాయి భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు ► భూమి ఇప్పించాలని నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా ఫలితం శూన్యం ‘ఒకప్పుడు దేశ సరిహద్దులను కాపలా కాశా.. విధి నిర్వహణలో మాతృభూమికి కోసం త్యాగాలకు సిద్ధపడ్డా.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడా.. పదవి విరమణ చేశా.. తర్వాత ప్రభుత్వం నాకు కొంత భూమి ఇచ్చింది. దాన్ని కొందరు కొబ్జా చేశారు. భూమిని దక్కించుకోవడానికి అధికారులతో అలుపెరగని పోరాటం చేస్తున్నా. సైన్యంలో పోరాటం కంటే ఈ పోరాటం నాకు కష్టంగా అనిపిస్తోంది. బతిమిలాడుకున్నా నాపై ఎవరికీ కనికరం లేదు..’ ఇవి సాక్షాత్తూ మూడు సార్లు శతృదేశాలతో ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్న ఓ సిపాయి మాటలు బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన మేడికొండ ఆదాం 1961–62లో భారత సైన్యంలో ఇన్ఫాంట్రీ విభాగంలో సిపాయిగా చేరాడు. 1962లో చైనాతో, 1965, 1971లలో పాకిస్థాన్తో మూడుసార్లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నాడు. కళ్ల ముందు సాటి సైనికులు మృతి చెందినా దిగమింగి యుద్ధంలో ముందుకు సాగాడు. 15 ఏళ్ల పాటు సైన్యంలో కొనసాగి పదవి విరమణ పొందాడు. భూమి కబ్జా..! విరమణ తర్వాత జీవనం కోసం సాగు భూమి కేటాయించాలని అప్పట్లో ఆయన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మండలంలోని సరికొండలపాలెం ఇందిర జలప్రభ కార్యక్రమానికి గ్రామానికి విచ్చేయగా మేడికొండ ఆదాం ఆయన భూమి సంగతి విన్నవించుకున్నారు. వెంటనే వైఎస్ స్పందించి వెల్లటూరు పరిసరాల్లోని సర్వేనెంబర్ 454/13–బి 19లో 2.50 ఎకరాలు, బి– 21లో 2 ఎకరాలు కలిపి 4.50 ఎకరాలు సర్వేచేసి హద్దులు చూపారు. అయితే.. కొన్నేళ్ల నుంచి సాగు చేయకపోవడంతో దళారులు అధికారులతో కుమ్మక్కై రికార్డులు మార్చి భూమి కాజేయాలని హస్తగతం చేసుకున్నారని ఆదాం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి తనకు న్యాయం చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని అప్పగించాలని కోరుతున్నారు. -
చెరువుకు శోకం.. రైతుకు శాపం
టి.నరసాపురం : మెట్ట ప్రాంతంలోని సాగునీటి చెరువులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కుచించుకుపోతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగునీటి ఎద్దడి తలెత్తి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. తాగునీటికీ కటకటలు తప్పడం లేదు. చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని అమలు చేస్తున్నా ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంది. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని చెరబట్టారు. నిధులు.. చెరువుల్లోని మట్టిపైన కన్నేసి అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అక్కడక్కడా పనులు చేపట్టినా ఆక్రమణలు తొలగించకుండా తూతూమంత్రంగా మట్టి తొలగించి అమ్ముకోవడానికే పరిమితమయ్యారు. వర్షాకాలం వచ్చినా.. తొలకరి వర్షాలు జిల్లాను పలకరించాయి. వేసవిలో పూర్తిగా ఎండిపోయిన చెరువులు నేడోరేపో నీటితో నిండే అవకాశాలున్నా రైతులకు అక్కరకు వచ్చే పరిస్థితి లేదు. వీటి కళింగలు శిథిలమయ్యాయి. ఇన్లెట్, అవుట్ లెట్స్ పూడుకుపోయాయి. దీనివల్ల చెరువుల్లోని నీరు పొలా ల్లోకి పారే అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు పొంగితే మాత్రం పొలాలన్నీ నీటమునిగి పంట నష్టం ఏర్పడుతోంది. జిల్లాలో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల సాగునీటి చెరువులు 450 ఉండగా, సాధారణ, మధ్యస్థాయి చెరువులు 3,100 ఉన్నాయి. మొత్తంగా ఈ చెరువులన్నీ 1.80 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే మెట్ట ప్రాంతంలో దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతుల కష్టాలు తీరిపోతాయి. కానీ.. చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం కనీస శ్రద్ధ కూడా చూపటం లేదు. జిల్లాలోని అన్ని చెరువులు ఆక్రమణల బారినపడి బక్కచిక్కాయి. జమ్మి చెరువు పెద్ద ఉదాహరణ టి.నరసాపురం మండలం ముక్కినవారి గూడెంలో 108 ఎకరాల విస్తీర్ణంలో జమ్మి చెరువు ఉంది. దీనిని మినీ రిజర్వాయర్గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన నేటికీ అమలుకు నోచుకోలేదు. ఈ చెరువు ఎగువ, దిగువ తూముల కింద 3 వేల ఎకరాల ఆయకట్టులో పంటలు సాగయ్యేవి. చెరువులో నీరుండటం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి 10 గ్రామాల్లోని పొలాలకు మేలు కలిగేది. ఈ చెరువు లోతట్టులో దాదాపు 40 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ మడులు కట్టి మరీ వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు నిండి కళింగ పక్కన గండి పడింది. 6 వేల ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చారు. ఈ చెరువు తూములు సైతం శిథిలావస్థకు చేరాయి. గత ఏడాది వేసిన ఇసుక బస్తాలు చివికిపోయాయి. ఇదే ప్రాంతంలో గండిపడే ప్రమాదం పొంచివుంది. అదే జరిగితే సమీపంలోని 3 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. గండిపడితే ఆ పొలాల్లో ఇసుక మేటలు వేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్మిచెరువులోని ఆక్రమణల్ని తొలగించి.. మరమ్మతులు చేపట్టాలని ఏళ్ల తరబడి రైతులు కోరుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క జమ్మి చెరువుకే పరిమితం కాలేదు. మెట్టలోని అన్ని చెరువులు ఇలాంటి దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్త తూములు కట్టిస్తాం జమ్మిచెరువుకు తిరిగి గండిపడే అవకాశాలు ఉన్న విషయాన్ని ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్.ఇమ్మానియేల్ దృష్టికి తీసుకెళ్లగా.. రెండు కొత్త తూములు నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. చెరువు కళింగను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడానికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. నిధులొస్తే ఆ పనులు చేపడతామన్నారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిలో భాగంగా ఏనుగుబంధం చెరువు, చింతల చెరువుకు రూ.4.50 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో ఆ చెరువులకు తూములు నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ గండి తప్పదు వర్షాకాలం నెత్తిమీదకు వచ్చింది. గత ఏడాది జమ్మి చెరువు కట్టకు గండిపడింది. తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేశారు. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ ఏడాది ఏ మాత్రం వర్షాలు పడినా గండిపడి పొలాలు నీట మునుగుతాయి. ఇసుక మేటలు వేస్తాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. – మక్కిన వెంకట గోపాలరావు, మాజీ సర్పంచ్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి మెట్ట ప్రాంతంలోని చెరువులన్నీ ఆక్రమణల బారినపడ్డాయి. తూములు, కళింగలు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఏటా రైతులు నష్టపోతున్నారు. భూగర్భ జలాలు పడిపోయాయి. అతిపెద్దదైన జమ్మిచెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. చెరువు కట్టకు గండిపడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. అన్ని చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలి. – ఆకుల శ్రీను, రైతు, మక్కినవారి గూడెం ప్రధాన పనులు వదిలేసి.. ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెరువు అభివృద్ధిని గాలికొదిలేశారు. ఎందుకూ పనికిరాని ఏనుగు బంధం, చింతల చెరువులకు కొత్తగా తూములు కట్టిస్తున్నారు. ఆ చెరువుల కింద సాగయ్యే విస్తీర్ణం లేదు. నీరు పారే అవకాశం కూడా లేదు. అయినా అటువంటి చెరువులకు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. రైతులందరికీ ఉపయోగపడే జమ్మి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. – సిరిమళ్ల వెంకట సత్యనారాయణ, రైతు, మక్కినవారి గూడెం -
చెరువుకు శోకం.. రైతుకు శాపం
టి.నరసాపురం : మెట్ట ప్రాంతంలోని సాగునీటి చెరువులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కుచించుకుపోతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగునీటి ఎద్దడి తలెత్తి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. తాగునీటికీ కటకటలు తప్పడం లేదు. చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని అమలు చేస్తున్నా ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంది. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని చెరబట్టారు. నిధులు.. చెరువుల్లోని మట్టిపైన కన్నేసి అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అక్కడక్కడా పనులు చేపట్టినా ఆక్రమణలు తొలగించకుండా తూతూమంత్రంగా మట్టి తొలగించి అమ్ముకోవడానికే పరిమితమయ్యారు. వర్షాకాలం వచ్చినా.. తొలకరి వర్షాలు జిల్లాను పలకరించాయి. వేసవిలో పూర్తిగా ఎండిపోయిన చెరువులు నేడోరేపో నీటితో నిండే అవకాశాలున్నా రైతులకు అక్కరకు వచ్చే పరిస్థితి లేదు. వీటి కళింగలు శిథిలమయ్యాయి. ఇన్లెట్, అవుట్ లెట్స్ పూడుకుపోయాయి. దీనివల్ల చెరువుల్లోని నీరు పొలా ల్లోకి పారే అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు పొంగితే మాత్రం పొలాలన్నీ నీటమునిగి పంట నష్టం ఏర్పడుతోంది. జిల్లాలో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల సాగునీటి చెరువులు 450 ఉండగా, సాధారణ, మధ్యస్థాయి చెరువులు 3,100 ఉన్నాయి. మొత్తంగా ఈ చెరువులన్నీ 1.80 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే మెట్ట ప్రాంతంలో దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతుల కష్టాలు తీరిపోతాయి. కానీ.. చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం కనీస శ్రద్ధ కూడా చూపటం లేదు. జిల్లాలోని అన్ని చెరువులు ఆక్రమణల బారినపడి బక్కచిక్కాయి. జమ్మి చెరువు పెద్ద ఉదాహరణ టి.నరసాపురం మండలం ముక్కినవారి గూడెంలో 108 ఎకరాల విస్తీర్ణంలో జమ్మి చెరువు ఉంది. దీనిని మినీ రిజర్వాయర్గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన నేటికీ అమలుకు నోచుకోలేదు. ఈ చెరువు ఎగువ, దిగువ తూముల కింద 3 వేల ఎకరాల ఆయకట్టులో పంటలు సాగయ్యేవి. చెరువులో నీరుండటం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి 10 గ్రామాల్లోని పొలాలకు మేలు కలిగేది. ఈ చెరువు లోతట్టులో దాదాపు 40 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ మడులు కట్టి మరీ వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు నిండి కళింగ పక్కన గండి పడింది. 6 వేల ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చారు. ఈ చెరువు తూములు సైతం శిథిలావస్థకు చేరాయి. గత ఏడాది వేసిన ఇసుక బస్తాలు చివికిపోయాయి. ఇదే ప్రాంతంలో గండిపడే ప్రమాదం పొంచివుంది. అదే జరిగితే సమీపంలోని 3 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. గండిపడితే ఆ పొలాల్లో ఇసుక మేటలు వేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్మిచెరువులోని ఆక్రమణల్ని తొలగించి.. మరమ్మతులు చేపట్టాలని ఏళ్ల తరబడి రైతులు కోరుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క జమ్మి చెరువుకే పరిమితం కాలేదు. మెట్టలోని అన్ని చెరువులు ఇలాంటి దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్త తూములు కట్టిస్తాం జమ్మిచెరువుకు తిరిగి గండిపడే అవకాశాలు ఉన్న విషయాన్ని ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్.ఇమ్మానియేల్ దృష్టికి తీసుకెళ్లగా.. రెండు కొత్త తూములు నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. చెరువు కళింగను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడానికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. నిధులొస్తే ఆ పనులు చేపడతామన్నారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిలో భాగంగా ఏనుగుబంధం చెరువు, చింతల చెరువుకు రూ.4.50 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో ఆ చెరువులకు తూములు నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ గండి తప్పదు వర్షాకాలం నెత్తిమీదకు వచ్చింది. గత ఏడాది జమ్మి చెరువు కట్టకు గండిపడింది. తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేశారు. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ ఏడాది ఏ మాత్రం వర్షాలు పడినా గండిపడి పొలాలు నీట మునుగుతాయి. ఇసుక మేటలు వేస్తాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. – మక్కిన వెంకట గోపాలరావు, మాజీ సర్పంచ్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి మెట్ట ప్రాంతంలోని చెరువులన్నీ ఆక్రమణల బారినపడ్డాయి. తూములు, కళింగలు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఏటా రైతులు నష్టపోతున్నారు. భూగర్భ జలాలు పడిపోయాయి. అతిపెద్దదైన జమ్మిచెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. చెరువు కట్టకు గండిపడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. అన్ని చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలి. – ఆకుల శ్రీను, రైతు, మక్కినవారి గూడెం ప్రధాన పనులు వదిలేసి.. ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెరువు అభివృద్ధిని గాలికొదిలేశారు. ఎందుకూ పనికిరాని ఏనుగు బంధం, చింతల చెరువులకు కొత్తగా తూములు కట్టిస్తున్నారు. ఆ చెరువుల కింద సాగయ్యే విస్తీర్ణం లేదు. నీరు పారే అవకాశం కూడా లేదు. అయినా అటువంటి చెరువులకు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. రైతులందరికీ ఉపయోగపడే జమ్మి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. – సిరిమళ్ల వెంకట సత్యనారాయణ, రైతు, మక్కినవారి గూడెం -
ఆక్రమణ.. అక్రమార్జన
– ప్రభుత్వ స్థలం కనబడితే కాసులే – అక్రమాల ఆద్యుడు ‘మునిసిపల్ పెద్ద’ – సొంత పార్టీలోనే వెల్లువెత్తుతున్న విమర్శలు రాయదుర్గం : రాయదుర్గంలో మునిసిపల్ స్థలాలను కాపాడుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని స్థలాలను ఆక్రమించుకుని, బంకులు ఏర్పాటు చేసి అనధికారికంగా అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్లో ఖాళీగా ఉన్న రూములను ఓ ప్రజాప్రతినిధి తన అధీనంలో ఉంచుకుని, బాడుగలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలోని చెరువులు, రెవెన్యూ భూములు, రోడ్లు, డ్రెయినేజీ స్థలాలను సైతం అక్రమార్కులు వదలడం లేదు. గతంలో ఉన్న సామూహిక మరుగుదొడ్ల స్థలాలను సైతం కబ్జాలు చేసి యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. మునిసిపల్ స్థలాల్లో గదులు నిర్మించి పూర్తిస్థాయిలో అద్దెకు ఇవ్వకపోవడం, మరికొన్నిచోట్ల ఖాళీస్థలాల్లో గదులు నిర్మించకపోవడంతో సంస్థ ఆదాయానికి గండిపడుతోంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. - పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ, ఆర్అండ్బీ, మునిసిపల్, దేవాదాయ, అసైన్డ్, వంక పొరంబోకు భూములపై కూడా స్వార్థపరులు కన్నేసి, కొన్నింటిని ఆక్రమించుకోగా, మరికొన్నింటిని చేజిక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. - బళ్లారి రోడ్డులోని ఇందిరాగాంధి మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాలల గేటు పక్కన ఉన్న ఆర్అండ్బీ స్థలాన్ని ‘మునిసిపల్ పెద్ద’ తన అనుచరులతో ఆక్రమించి, షెడ్డు ఏర్పాటు చేసి రూ.3లక్షలకు గుడ్విల్ ఇచ్చారు. స్థలం ఇరుకు కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. - అధికారం అడ్డం పెట్టుకుని అధికారులను లొంగదీసుకుని టీడీపీ నాయకులు అక్రమాలకు తెర తీస్తూనే ఉన్నారు. పాతబస్టాండులో నుంచి కూరగాయల మార్కెట్కు వెళ్లడానికి ఉన్న చిన్నపాటి దారిని సైతం ధరలు నిర్ణయించి అప్పణంగా దండుకుంటున్నారు. ఈ దారిలో పూలవ్యాపారం కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్డు నిర్వాహకుడితో ‘మునిసిపల్ పెద్ద’ రూ.5 లక్షలు ఇప్పించుకుని అనుమతి ఇచ్చినట్లు టీడీపీ నాయకులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. - రోడ్డు విస్తరణలో మునిసిపల్ అధికారులు వేసిన మార్కింగ్ను మార్పించి, ఓ వ్యక్తికి వత్తాసు పలకడానికి కూడా ‘మునిసిపల్ పెద్ద’ రూ.3లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీ స్థలాలతో పాటు ఆదాయం చేకూరే మార్గాలను అన్వేషించడానికి ఆ ‘పెద్ద’ ఇద్దరు వ్యక్తులను నియమించుకున్నట్లు సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. షెడ్డు ఏర్పాటు వాస్తవమే ఇందిరాగాంది మునిసిపల్ పాఠశాల వద్ద షెడ్డు ఏర్పాటు చేసినది వాస్తవమే. టీడీపీ కార్యకర్త అస్లాంకు ఇచ్చాం. అయితే గుడ్విల్ తీసుకోలేదు. విద్యార్థులకు అడ్డంగా ఉందంటే దాన్ని తీసివేయిస్తాం. రోడ్డు విస్తరణలో మార్కింగ్ మార్పుల కోసం ఎవరితోనూ డబ్బు తీసుకోలేదు. పూలవ్యాపారి షెడ్డు వేసుకోవడానికి డబ్బుతీసుకున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. - వీఎం రాజశేఖర్, మునిసిపల్ చైర్మన్, రాయదుర్గం -
హౌసింగ్ సొసైటీ భూమిపై టీడీపీ మంత్రి కన్ను
-
సింగరప్పకు శఠగోపం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు నగరంలోని అళహ సింగరప్ప ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. సుమారు రూ.30 కోట్ల విలువైన భూములు పరుల చేతిలోకి వెళ్లిపోయాయి. వీటిని కాపాడుకునే విషయంలో అటు ప్రభుత్వం, ఇటు వంశపారంపర్య అర్చకులు చొరవ చూపకపోవడంతో అక్రమార్కులకు ఫలహారమయ్యాయి. భారతీయ సంస్కృ తి, వారసత్వ పరిరక్షణ సమితి చొరవ చూపినా వివాదం కోర్టులో ఉండటంతో జాప్యం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు పడమర వీధిలోని వన్నెంరెడ్డి వారి వీధిలో శ్రీ సింగరప్ప (లక్ష్మీ నరసింహస్వామి) క్షేత్రం ఉంది. ఇది నగరంలోనే అత్యంత ప్రాచీనమైంది. పురావస్తు శాఖ చెబుతున్న ప్రకారం.. దీనిని 10వ శతాబ్దంలో నిర్మించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కలిసి ఉన్న రోజుల్లో ఈ స్వామిని అళహ సింగరప్ప అని పిలిచేవారు. సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, యాదగిరిగుట్ట, అహోబిలం క్షేత్రాల తరహాలో ఇక్కడి సింగరప్ప ఆలయంలోనూ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రాలన్నీ ఒకే కాలం నాటివని చెబుతుంటారు. వేంగి చాళుక్యులు, కాకతీయులు, గజపతులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు ఈ క్షేత్రాన్ని విశిష్టమైనదిగా భావించి సంరక్షణకు పూనుకున్నారు. ఇంతటి ప్రాశస్త్యం గల ఆలయానికి ఆస్తులు సైతం భారీగానే ఉండేవి. నగరంలోని ప్రస్తుత పంపుల చెరువు ఈ క్షేత్రానికి చెందినదే. ప్రజోపయోగార్థం 1915లో అప్పటి పురపాలక సంస్థ పాలకవర్గం దీనిని స్వాధీనం చేసుకుంది. ఇందుకు నష్టపరిహారంగా ఇచ్చిన సొమ్ముతో పెదపాడు మండలం తాళ్లగూడెంలో 47.10 ఎకరాల పంట భూమి కొనుగోలు చేశారు. ఆలయ నిర్వాహకులు దీనిపై వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తూ స్వామి సేవ చేస్తూ వచ్చారు. కాలక్రమంలో వారి వారసులు వేరే వ్యాపకాల్లో పడటంతో ఆలయాన్ని పట్టించుకోలేదు. తాళ్లగూడెంలో కొనుగోలు చేసిన 47.10 ఎకరాల్లో 30 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాం తంలో ఎకరం విలువ రూ.కోటిపైనే ఉంది. ఈ పరిస్థితుల్లో దేవాదాయ శాఖ ఆలయాన్ని, దానికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో నియమించిన ధర్మకర్తల మండలి భూముల అన్యాక్రాంతం విషయాన్ని అప్పటి దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు దృష్టికి తీసుకురావడంతో ఆయన విచారణకు ఆదేశించారు. పెదపాడు మండలంలో 47.1 ఎకరాల భూమితోపాటు ఆలయ చుట్టుపక్కల భూమి కూడా ఈ క్షేత్రానిదేనని తహసీల్దార్లు నివేదిక ఇచ్చారు. అయితే దేవాదాయ శాఖ ఈ భూమిని స్వాధీనం చేసుకునే దిశగా ఇంతవరకూ చర్యలు చేపట్టలేదు. ఈ పరిస్థితుల్లో ఆలయం జీర్ణ దశకు చేరుకుంది. కనీసం హుండీలో కానుకలను కూడా తీయని దుస్థితి ఉంది. ఆలయంలోని శేషశయన వాహనం అపహరణకు గురైంది. ఈ నేపథ్యంలో స్థానికులు ఆలయాన్ని, దాని ఆస్తులను కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు. ఆలయాన్ని శుభ్రం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ వస్తున్నారు. ఏటా కల్యాణం నిర్వహిస్తున్నారు. అయితే అర్చకులు ఈ ఆస్తులన్నీ తమ సొంతమంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై దేవాదాయ శాఖ రిట్ వేయడానికి గడువు కోరడంతో స్టేటస్ కో నడుస్తోంది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి స్వామివారికి చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను తిరిగి క్షేత్రానికి వచ్చేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. -
కథ కాదు.. కొల్లేరు వ్యథ!
ఆక్రమణలతో చిక్కిశల్యమైన కొల్లూరు అక్రమంగా కొనసాగుతున్న చేపల సాగు జలమార్గం ద్వారా చేప పిల్లల రవాణా మంత్రి కామినేని పేరు చెప్పి హల్చల్ మూడేళ్లకు పెంచిన లీజులు కొల్లేరమ్మ.. కన్నీరు పెడుతోంది. అక్రమార్కులు చేస్తున్న గాయాలతో చిక్కిశల్యమైన కొల్లేరు తల్లి వ్యథ వర్ణనాతీతంగా మారింది. ఆపరేషన్ కొల్లేరును వెక్కిరిస్తూ ఆక్రమణల పర్వం మళ్లీ కొనసాగుతోంది. కొల్లేరు స్వచ్ఛతకు తూట్లు పొడిచేలా ఇక్కడ వ్యవహారం నడుస్తోంది. అక్రమంగా చేపల చెరువులను సాగు చేస్తున్నా ఎవ్వరికీ పట్టని పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కైకలూరు : కొల్లేరుకు అక్రమార్కుల చెర వీడడంలేదు. పేదల పేర్లు చెప్పి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. అక్రమంగా చేపల చెరువులు సాగు కొనసాగుతున్నా అటవీశాఖ అడ్డుకునే ధైర్యం చేయడం లేదు. పట్టపగలు అభయారణ్యంలో చెరువుల తవ్వకం, అటవీ అధికారులు సీజ్ చేసిన వాహనాన్ని దౌర్జన్యంగా తీసుకెళ్లడం, ఇష్టారాజ్యంగా వ్యర్థాలు వేయడం ఇటీవల కొల్లేరులో బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతంలేని అక్రమాల పర్వం.. కొల్లేరు అభయారణ్యంలో ధ్వంసం చేసిన చేపల చెరువులతో పాటు ఇటీవల కొత్తగా తవ్విన వందలాది ఎకరాల్లో చేపల సాగు జరుగుతోంది. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో 1200 ఎకరాలు, శృంగవరప్పాడులో 1500, గుమ్మళ్లపాడులో 800 ఎకరాల్లో ధ్వంసం చేసిన చెరువుల్లో తిరిగి చేపల సాగుకు సిద్ధమవుతున్నారు. వీటిలో ఇప్పటికే గుమ్మళ్లపాడులో జీరో సైజు చేప పిల్లలను వదిలారు. మండవల్లి మండలం దయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక, పెనుమాకలంక, నందిగామలంక, కైకలూరు మండలం వడ్లకూటితిప్ప, పెంచికలమర్రు, చటాకాయి, నత్తగుళ్లపాడు గ్రామాల్లో అభయారణ్యలో సాగు కొనసాగుతోంది. గతంలో జీరో పాయింట్ చేపల సాగు ఏడు నెలలకు పాట పెట్టేవారు. ఇప్పుడు మూడేళ్లకు రూ.కోట్లలో పాట పెట్టారు. జలమార్గం ద్వారా చేప పిల్లలు.. అక్రమ చెరువుల్లోకి చేప పిల్లల తరలింపునకు కొల్లేరులో జలమార్గాన్ని ఉపయోగిస్తున్నారు. ఆకివీడు, జంగంపాడు రేవుల నుంచి కొట్టాడ, కోటలంక, గుమ్మళ్లపాడు, సింగరాలతోటకు బోట్లలో చేప పిల్లలను తరలిస్తున్నారు. ఇందుకోసం పందిరిపల్లిగూడెం, గుమ్మళ్లపాడు వద్ద 11 పెద్ద బోట్లను సిద్ధం చేశారు. ఒక్కో బోటులో రెండున్నర టన్నుల చేప పిల్లలను తరలించవచ్చు. ఇవేకాకుండా 17 చిన్న బోట్లను సిద్ధం చేసుకున్నారు. రోడ్డు మార్గంలో ఏలూరు నుంచి శృంగవరప్పాడుకు చేప పిల్ల రవాణా అవుతోంది. మంత్రి పేరు చెప్పి హల్చల్.. ఈ నెల 11న సీఎంతో జరిగిన కొల్లేరు సమావేశానికి ఓ చోట నాయకుడు వెళ్లాడు. అక్కడ నుంచి రాగానే ‘కొల్లేరులో ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు.. సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కామినేని శ్రీనివాస్ అభయం ఇచ్చారు’ అంటూ నమ్మబలుకుతున్నాడు. అటవీ అధికారులకు ఇదే విషయం చెబుతున్నాడు. గతంలో అటవీ, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేయాలంటూ ఎకరానికి రూ.1500 వసూలు చేసి, స్వాహా చేశాడనే ఆరోపణలు ఆ చోటా నాయకుడిపై ఉన్నాయి. చెప్పగానే పార్టీ సమావేశాలకు లారీల్లో జనాలను తరలిస్తుండడంతో పాలకులు కూడా అతను ఎన్ని తప్పులు చేసినా వదిలేస్తున్నారనే భావన అందరిలో ఉంది. ఇప్పటికే ఆక్రమణలతో చిక్కిశల్యమైన కొల్లేరును కాపాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. చేప పిల్ల విడుదలను అడ్డుకుంటాం.. అభయారణ్యంగా గుర్తించిన కొల్లేరులో చేపల సాగు నిషేధం. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కొట్టేసిన చేపల చెరువులకు గట్లు ఏర్పాటు చేసుకుని మళ్లీ చేపల సాగుకు సిద్ధమవుతున్నారనే సమాచారం అందింది. సిబ్బందిని ఇప్పటికే గస్తీ పెట్టాం. జంగంపాడు నుంచి చేప పిల్లలు జలమార్గం ద్వారా వచ్చే అవకాశం ఉండటంతో అటవీ శాఖ సిబ్బందిని నియమించాం. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. - జి.ఈశ్వరరావు, అటవీశాఖ డెప్యూటి రేంజ్ ఆఫీసరు, కైకలూరు -
శిఖం కబ్జా!
పెద్దచెరువు శిఖంలో యథేచ్ఛగా బోర్ల తవ్వకం 69 ఎకరాల్లో సగం శిఖం మాయం సర్వే చేసి హద్దులు పాతాలంటున్న సర్పంచ్ కౌడిపల్లి: చెరువు శిఖం భూమిని కొందరు రైతులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. జిల్లాలో బోరుబావులు తవ్వకంపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంగిస్తూ శిఖం భూమిలో బోర్లు వేస్తూ కబ్జాకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలంలోని రాజిపేట పెద్దచెరువు శిఖం సర్వే నంబర్ 231లో 69 ఎకరాలు ఉంది. వర్షాకాలంలో ఈ చెరువు పూర్తిగా నిండితే ఆయకట్టు పరిధిలోని సుమారు 150 ఎకరాలు సాగులోకి వస్తుంది. రాజిపేటకు పెద్దచెరవుకు పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉండటంతో కొద్దిపాటి వర్షం పడినా నిండేది. గత నాలుగేళ్లుగా సరిగా వర్షాలు లేకపోవడంతో చెరువు నిండటం లేదు. దీంతో చెరువు శిఖం పైబాగంలో గల రాజిపేటతో పాటు పక్క గ్రామమైన ఖాజీపేట గ్రామస్తులు శిఖం భూమిని కబ్జా చేస్తున్నారు. దీంతో 69 ఎకరాల ఆయకట్టు సగానికి పైగా కబ్జాకు గురైంది. 20 నుంచి 25 మంది రైతులు ప్రతి ఏడాది కొద్దికొద్దిగా సగం శిఖం భూమిని ఆక్రమించారు. ఆక్రమించిన భూమిలో వరి సాగు చేసి బోరుబావులు వేస్తున్నారు. ఇటీవల ఖాజీపేట గ్రామానికి చెందిన రైతులు గత వారం బోరువేసి సాగు చేస్తున్నారు. గ్రామంలో నీటి సమస్య గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే బోరుబావి చెరువు శిఖం బోరు ఉంది. రైతులు ఆక్రమించిన పొలంలో గ్రామ పంచాయతీ బోరు ఉంది. పంచాయతీ బోరు పక్కనే రైతులు బోరు వేశారు. దీంతో పంచాయతీ బోరులో నీళ్లు తగ్గాయి. గ్రామంలో తాగునీటి సమస్య నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిఖం భూమి సర్వేచేసి కబ్జాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. హద్దులు చూపాలి పెద్ద చెరువు శిఖం భూమి కబ్జాకు గురైంది. 69 ఎకరాలు శిఖం భూమి సగం కంటే ఎక్కువ కబ్జాకు గురైంది. రైతులు ఆక్రమించిన భూమిలో యథేచ్ఛగా బోర్లు వేసి సాగు చేస్తున్నారు. గ్రామానికి నీటిని సరఫరా చేసే బోరు పక్కన బోరు వేయడంతో గ్రామంలో మంచినీటి సమస్య తలెత్తుతోంది. అధికారులు స్పందించి సర్వే చేసి హద్దులు చూపాలి. - మహ్మద్ పాషా, రాజిపేట సర్పంచ్ -
అసైన్డ్ భూముల కబ్జాపై కఠిన చర్యలు
దుబ్బాక: నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను కబ్జాచేసిన ఆక్రమణదారులపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు తౌడ శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బతుకు దెరువు లేని దళితులకు బతుకునివ్వాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం భూములను పంచితే దళితుల అత్యవసరాలను కొంతమంది ఆసరా చేసుకుని నయానో, భయానో వారి భూములను లాక్కున్నారన్నారు. ప్రభుత్వమిచ్చిన భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన లబ్ధిదారుల ఆధీనంలోనే ఉండాలని, ఎస్సీ, ఎస్టీలు కాకుండా కబ్జాలో ఇతర వర్గాలుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసైన్డ్ భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయో విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులకు ఆయన సూచించారు. దళితుల నుంచి అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకున్న ఇతర వర్గాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలపై కులం పేరుతో దాడులు చేసినా, వారి భూములను ఆక్రమించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరారు. -
పేరు పేదలది.. పెత్తనం పెద్దలది
పేదలకు పట్టాలు.. ఎమ్మెల్యే అనుచరుని చేతిలో భూమి 13 ఏళ్లుగా పేదలకందని ఇంటి స్థలం కలగానే మిగిలిన సొంతిల్లు సుందరపల్లి (కె.గంగవరం) : ‘మేం ఏం చెబితే అదే జరుగుతుంది. స్థలం కావాలని అడిగితే ఖబడ్దార్. ..మేం ఇచ్చినప్పుడే తీసుకోండి.’ ఇదీ అధికార పార్టీ నేత హుకుం. నియోజకవర్గంలోని కె. గంగవరం మండలం సుందరపల్లిలో స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అనుచరుని అరాచకాలకు నిలువుటద్దం పడుతోందీ సంఘటన. 13 ఏళ్లుగా దేవస్థానం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు యథేచ్ఛగా పండించుకుంటున్నప్పటికీ అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సుందరపల్లిలోని శ్రీసోమేశ్వరస్వామి దేవస్థానికి చెందిన సుమారు రెండు ఎకరాల భూమిని 2003లో గ్రామంలోని కొంత మందికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సేకరించింది. 70 సెంట్ల భూమిని ఎస్సీలకు, 120 సెంట్ల భూమిని ఓసీలకు కేటాయిస్తూ అప్పటి తహసీల్దార్ లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. పట్టాలిచ్చారు గానీ ఆభూమిని మాత్రం ఇప్పటికీ వారికి అప్పగించలేదు. దేవస్థానం భూమిని ప్రభుత్వం సేకరించటంతో దేవస్థానం అధికారులు ఆ పంట భూమికి వేలం కూడా నిర్వహించలేదు. ఆ భూమిని ప్రభుత్వం మెరక చేసి పట్టాదారులకు అప్పగించాలి. కానీ ఆ విధంగా జరగలేదు. ప్రభుత్వం దేవస్థానం భూమిని సేకరించిందని చెప్పి గ్రామానికి చెందిన ఆ నేత ఆ భూమిని తన ఆధీనంలోనికి తీసుకున్నాడు. 13 ఏళ్లుగా సుమారు 2 ఎకరాల భూమిని తన అనుచరులతో సాగు చేయిస్తూ మగతాలు పొందుతున్నాడు. చేను వృథాగా ఉందని సాగు చేస్తున్నామని, వచ్చిన పంటను దేవుడి కోసంS ఖర్చు చేస్తున్నామని ఆయన కబుర్లు చెబుతున్నాడు. ఎవరైనా ఇదేమని అడిగినా, జమా ఖర్చులు చెప్పాలన్నా వారిపై దాడులు చేయిస్తూ తనమాటే చెల్లుబడి చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా రెవెన్యూ, దేవస్థానం అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని తమకు అందజేసి న్యాయం చేయాలని పట్టాదారులు కోరుతున్నారు. -
దర్జాగా కార్పొరేషన్ స్థలం కబ్జా
గుంటూరులో టీడీపీ మాజీ కార్పొరేటర్ భూ దాహం మరుగుదొడ్ల స్థలంలో ఇల్లు నిర్మించేందుకు యత్నం స్థానికుల ఫిర్యాదుతో కదలిన యంత్రాంగం గుంటూరు (అరండల్పేట): నగరంలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నాయకుడి స్థాయిని బట్టి ప్రభుత్వ, కార్పొరేషన్ స్థలాలను కబ్జా చేసేస్తున్నారు. తాజాగా నగరంలోని శారదాకాలనీలోని కార్పొరేషన్ స్థలాన్ని మాజీ కార్పొరేటర్ కబ్జా చేసి అందులో ఇల్లు నిర్మాణం చేపట్టారు. స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలో 35 సంవత్సరాల క్రితం శారదాకాలనీని ఏర్పాటు చేశారు. ఇక్కడ పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చారు. కాలనీలో నివసిస్తున్న పేదల కోసం 28వ లైనులోని కార్పొరేషన్కు చెందిన ఐదు సెంట్ల స్థలంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. రెండు దశబ్దాల వరకు మరుగుదొడ్లును స్థానికులు వినియోగించుకున్నారు. కాలక్రమంలో అవి శిథిలావస్థకు చేరడంతో వాటిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అక్కడ నివసించే కొంతమంది ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా కార్పొరేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఐదు సెంట్ల స్థలంలో ఒక సెంటును ఓ వ్యక్తికి కేటాయిస్తూ పట్టా ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే తాజాగా టీడీపీ అధికారంలోకి రావడం, భూమి రేట్లు పెరగడంతో దీనిపై మాజీ కార్పొరేటర్ గోళ్ళ ప్రభాకర్ కన్ను పడింది. ఇంకేముంది ఈ స్థలాన్ని కబ్జా చేసి కొద్దిరోజులుగా ఇల్లు నిర్మిస్తున్నారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. అధికారపార్టీ నాయకుడు కావడం, అడిగే వారు లేకపోవడంతో శరవేగంగా నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు రంగం సిద్ధం చేశారు. నాలుగు సెంట్ల స్థలం కబ్జాకు గురికావడం గమనించిన స్థానికులు నగర కమిషనర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. కబ్జాను వెంటనే అడ్డుకోవాలని పట్టణ ప్రణాళికాధికారిని ఆమె ఆదేశించారు. దీంతో పట్టణ ప్రణాళికాధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి కబ్జాను అడ్డుకున్నారు. రెండురోజుల్లో ఆ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్కు చెందిన స్థలంగా బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో కార్పొరేషన్ స్థలం కబ్జా చేయాలనుకున్న సదరు నాయకుని ప్రయత్నం విఫలమైంది. -
దానం భూమి కనిపించదేం..
అన్యాక్రాంతమైన ‘భూదాన’ భూమి 400 ఎకరాలపై స్పష్టత లేని పరిస్థితి దొరకని సర్వే నంబర్లు.. ఉన్నా కనిపించని భూములు గ్రామాల్లో అన్వేషిస్తున్న రెవెన్యూ అధికారులు కొత్తగూడెం : దానం భూములు అన్యాక్రాంతమయ్యాయి.. ఎకరాలకెకరాల సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల్లో చెరిగిపోయాయి.. ఉన్న భూమి ఎక్కడుందో ఎవరికీ తెలియదు.. నిరుపేదలు, గిరిజనులు, దళితులు, కూలీలకు భూమి అందించి.. చేదోడు వాదోడుగా నిలవాలనే మంచి పనికి మచ్చపడింది.. భూములున్న రైతుల వద్ద నుంచి సేకరించిన దానం భూములు అగుపించకుండాపోయాయి. దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఆచార్య వినోభాబావే ఆశయం నీరుగారిపోయే పరిస్థితులు దాపురించాయి.. 448 ఎకరాల కమతానికి సంబంధించి సర్వే నంబర్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఆచార్య వినోభాబావే నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో 1953లో ప్రారంభించిన భూదానోద్యమానికి ఆకర్షితులై సుమారు 19 మంది కొత్తగూడెం తహసీల్ పరిధిలో 448 ఎకరాల వరకు భూదానం చేశారు. వాటికి సంబంధించిన వివరాలను భూదాన్ ట్రస్టులోనూ పొందుపరిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ భూములు ఇప్పుడు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం భూదాన్ భూములను పట్టుకునే పనిలో నిమగ్నమైన రెవెన్యూ అధికారులకు.. ఉన్న రికార్డుల్లో అసలు ఆ సర్వే నంబర్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్నిచోట్ల సర్వే నంబర్లు ఉన్నా.. భూమి ఎక్కడుందనే విషయంపై స్పష్టత రావడం లేదు. 1950కి సంబంధించి రెవెన్యూ రికార్డులను పరిశీలించినప్పటికీ ఆ వివరాలు తెలియకపోవడంతో అధికారులు సైతం వాటిని వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం తాలూకాలో 448 ఎకరాలు అప్పటి కొత్తగూడెం తాలూకా పరిధిలో ఆచార్య వినోభాబావే పర్యటన సందర్భంగా సుమారు 19 మంది వరకు 448 ఎకరాలను భూదాన్ ట్రస్ట్కు అందించారు. చుంచుపల్లి గ్రామంలో సర్వే నం.170, 171, 168, 169, 167, 434లో 17.30 ఎకరాలు, గార్ల సీతంపేటలో 1.20 ఎకరాలు, కారుకొండ సర్వే నం.264లో 40 ఎకరాలు, కొత్తగూడెం రెవెన్యూ గ్రామంలో సర్వే నం.63, 64, 727లో 77 ఎకరాలు, రాఘవాపురం సర్వే నం.26,28, 211, 212లో 50.05 ఎకరాలు దానం చేశారు. సీతంపేట సర్వే నం.2151లో 6.20 ఎకరాలు, సింగభూపాలెం సర్వే నం.19, 22లో 4.06 ఎకరాలు, సుజాతనగర్ సర్వే నం.233, 240లో 229.24 ఎకరాలు, రేగళ్లలో 75 ఎకరాలు భూదాన్ కార్యక్రమానికి అందించారు. వీటిలో సీతంపేట సర్వే నంబర్లో ఉన్న 6.20 ఎకరాల భూమిని మాత్రమే రెవెన్యూ అధికారులు గుర్తించారు. కారుకొండ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ లభించినప్పటికీ.. భూమి ఎక్కడుందనే విషయమై స్పష్టత రాలేదు. మిగిలిన సర్వే నంబర్లు అసలు రికార్డుల్లో లేకపోవడం గమనార్హం. గిరిజనులకు భూమి పంచినా.. కారుకొండ రెవెన్యూ గ్రామంలో భూదాన్ కార్యక్రమం, సీలింగ్ ద్వారా లభించిన అసైన్డ్ భూమిలో సుమారు 280 ఎకరాల మేర ఆదివాసీ గిరిజనులకు అందించారు. అప్పట్లో వీరికి కేవలం పట్టాలు అందించిన రెవెన్యూ అధికారులు.. గిరిజనులకు భూమిని చూపించకపోవడంతో ఇప్పటివరకు ఆ భూములు వారికి దక్కలేదు. అయితే ఆ భూమి భూదాన్ భూమా.. లేక సీలింగ్ భూమా.. అనే విషయంపై స్పష్టత దొరకలేదనేది సమాచారం. దీంతోపాటు ఈ సర్వే నంబర్లో అనేక బై నంబర్లు రావడం, కొందరు బడా బాబుల చేతుల్లోకి భూములు వెళ్లడంతో భూ సేకరణ రెవెన్యూ అధికారులకు కష్టతరంగా మారింది. మహోద్యమం నీరుగారినట్లేనా.. భూమి లేని నిరుపేదలకు భూమిని పంచాలనే ఉద్దేశంతో ఆచార్య వినోభాబావే చేసిన భూదానోద్యమం దేశవ్యాప్తంగా విశిష్టతను సంతరించుకునప్పటికీ.. ఆ ఉద్యమం ద్వారా లభించిన భూములు మాత్రం ఇక్కడ దొరక్కపోవడం నివ్వెరపరుస్తోంది. సర్వే నంబర్లు లేకపోవడంతో ఆ భూములు దొరకని పరిస్థితి నెలకొంది. భూదానోద్యమం ద్వారా లభించిన భూములను అప్పట్లోనే గుర్తించి.. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వాటికి భద్రత ఉండేదని పలువురు చెబుతున్నారు. ఏదేమైనా మహోద్యమం మాత్రం నీరుగారాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై తహసీల్దార్ అశోక చక్రవర్తిని వివరణ కోరగా.. కాస్రా పహాణీలను పరిశీలించినప్పటికీ సర్వే నంబర్లు దొరకలేదని తెలిపారు. మరోమారు ఇతర రికార్డులను పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. -
దేవదాయ భూములను స్వాధీనం చేసుకుంటాం
దేవాదాయ ధర్మదాయ గెజిటెడ్ అధికారి విజయరాజు శ్రీకాకుళం(ఘంటసాల): అన్యాక్రాంతమైన∙దేవదాయ, ధర్మదాయశాఖల పరిధిలోని ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయాశాఖల అధికారి మేడిపల్లిల విజయరాజు తెలపారు. ఆదివారం ఆయన కృష్ణాపుష్కరాల సందర్భంగా శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయ భూములు 4.53 లక్షల ఎకరాలు ఉన్నాయని వాటిలో 80 వేల ఎకరాలు అక్రమణలకు గురైనట్లు తెలిపారు. అక్రమణలకు గురైన స్థలాల్లో ఉన్న వారికి దేవదాయ యాక్టు ప్రకారం నోటీసులు అందించి తిరిగి వాటిని స్వాదీనం చేసుకుంటామన్నారు. అనంతరం ఆయన్ను ఆలయాధికారులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు సుధాకర్, సురేష్, విజయరాజులు ఉన్నారు. -
అధికారంతో ఆక్రమించేశారు!
నిలువ నీడ లేక మురుగుకాల్వ గట్ల మీదో, ఏ పోరంబోకులోనే గుడిసెలు వేసుకుని జీవించే పేదలపై ప్రతాపం చూపించే అధికారులు పట్టణ నడిబొడ్డున విలువైన స్థలాన్ని ప్రజాప్రతినిధులు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తుంటే మాత్రం మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. మంగళగిరి (తాడేపల్లి రూరల్) : గత నెల రోజులుగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే పేరుతో రత్నాలచెరువు మురుగుకాలువల వెంట గుడిసెలు,హిందూ శ్మశానవాటికలో గుడిసెలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించినా స్థానిక ఎమ్మెల్యే ఆర్కే వారికి అండగా నిలవడంతో వెనుతిరగకతప్పలేదు. ఈ నేపథ్యంలో పట్టణ నడిబొడ్డున స్థానిక ఆర్అండ్బీ బంగ్లా వద్ద ఉన్న బీఆర్ మున్సిపల్ పాఠశాల స్థలాన్ని ఆక్రమించి ఏకంగా రెండంతస్తుల భవనాన్ని నిర్మిస్తుంటే మాత్రం అధికారులకు కనిపించకపోవడం విశేషం. గత మున్సిపల్ ఎన్నికలలో టీడీపీతో పొత్తుపెట్టుకుని విజయం సాధించిన ప్రజాప్రతినిధి బీఆర్ స్కూలు ఆవరణలోని స్థలాన్ని మూడు సెంట్లు ఆక్రమించి కనీసం మున్సిపాల్టీకి భవన నిర్మాణానికి ఎలాంటి దరఖాస్తు చేయకుండా భవనం నిర్మించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడ మూడు సెంట్ల విలువ ప్రస్తుతం యాభైలక్షల రూపాయలు చేస్తుందని తెలిసింది. ఎన్నో సంవత్సరాల క్రితం బంగ్లా వద్ద అటవీభూమి 25 సెంట్లలో పాఠశాల నిర్మించారు. పాఠశాలకు ఉత్తరం వైపున రోడ్డు చిన్నదిగా వుండడంతో రోడ్ వెడల్పు కోసం కొంత భూమిని వదిలేశారు. రెండు రోడ్ల మూలమీద మూడు సెంట్ల ఖాళీ స్థలంపై కన్నేసిన స్థానిక ప్రజాప్రతినిధి వెంటనే అక్కడ నిర్మాణం ప్రారంభించారు. పాఠశాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారనే విమర్శలు రావడంతో అది తనసొంతానికి కాదని తమ పార్టీ కార్యాలయం కోసం అంటూ బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం. పార్టీల పేరుతో ఆక్రమణలు చేస్తే అధికారులు చర్యలు తీసుకోరా మరి అలాంటప్పుడు మిగిలిన పార్టీలు కూడా మున్సిపల్ స్థలాలను ఆక్రమించి పార్టీ కార్యాలయాల పేరుతో నిర్మాణాలు సాగిస్తే వదిలేస్తారా అని వివిధ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. పేదలకు అండగా వుంటున్నామని చెప్పుకుంటున్న పార్టీ ప్రజాప్రతినిధులే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలకు పూనుకోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు,పాలకులు వెంటనే మున్సిపల్ స్థలాల ఆక్రమణలను అడ్డుకుని వాటిని పట్టణాభివృద్ధికి కృషి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఎలాంటి దరఖాస్తు అందలేదు ఈ విషయమై పట్టణ ప్రణాళికా విభాగం అధికారి మోహన్బాబును వివరణ కోరగా భవన నిర్మాణానికి తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదన్నారు.ఇప్పటికే నోటీసులు జారీ చేశామని ఎలాంటి సమాధానం రాకపోవడంతో కోర్టులో వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.స్థలానికి పట్టా వున్నట్టు భవనయజమాని, స్థానిక ప్రజాప్రతినిధి చెప్పారని తెలిపారు. ఆ స్థలం పాఠశాలదే! పాఠశాల ఆవరణలో భవనం నిర్మిస్తున్న స్థలం పాఠశాలదే. భవననిర్మాణం చేపట్టిన వెంటనే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్తో కలిపి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాం.అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒక పార్టీ కార్యాలయం పేరునో లేక మరెవరిపేరునైనా పట్టా వుంటే ఆ పట్టా ఎవరు ఇచ్చారు..ఎలా వచ్చింది అనేదానిపై మున్సిపల్ అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలి. పట్టా నిజంగా వుంటే భవనానికి అనుమతులు ఇవ్వడంలో తప్పులేదు. - సుఖమంచి కోటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ -
నా దారి.. రహదారి!
ఓర్వకల్లు సమీపంలో ‘రియల్’ దర్జా కర్నూలు: అది కర్నూలు నుంచి నంద్యాల రహదారికి సమీపంలోని అత్యంత ఖరీదైన స్థలం. సైన్యంలో అందించిన సేవలకు గుర్తింపుగా సిపాయిలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలం. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలంలో కేవలం వెంచర్కు మాత్రమే ఉపయోగపడేలా ఓ దారి కూడా నిర్మించుకుంది. వెంచర్కు అవతలి వైపున్న రైతుల భూములతో పాటు ప్రభుత్వ భూములకు దారి లేకుండా అడ్డంగా గోడ కూడా నిర్మించడం గమనార్హం. ఓర్వకల్లుకు సమీపంలోని పారిశ్రామికవాడకు కూతవేటు దూరంలో కొండపై ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ దర్జా ఇది. తమ పొలాలకు దారి లేకుండా మూసివేశారని రైతులు వాపోతున్నా.. ఇక్కడి రెవెన్యూ అధికారులు ఏమాత్రం చలించని పరిస్థితి. వెంచర్కు ‘లుక్’ కోసమే.. వాస్తవానికి ఈ వెంచర్కు దారి పక్కనే ఉంది. ఆ దారి వెంచర్కు వెనుక వైపునకు వెళ్తుంది. తద్వారా వెంచర్లో విల్లాలు కొనుగోలు చేసే వారికి వెంచర్ అంత పెద్ద అట్టహాసంగా కనిపించే అవకాశం లేదు. అందుకోసం మిలిటరీ వారికి కేటాయించిన ఈ స్థలాన్ని వినియోగించుకుంటే.. వెంచర్ ముందు భాగానికి దారి వెళ్తుంది. అప్పుడు వెంచర్కు మంచి లుక్ వస్తుందనేది వీరి ఆలోచనగా ఉంది. అందుకోసమే ఈ స్థలాన్ని కొనుగోలు చేసి దారి నిర్మించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, అటువైపుగా ఉన్న రైతుల భూములతో పాటు ప్రభుత్వ స్థలాలకు కూడా దారి వదలకుండా వెంచర్లో అడ్డంగా గోడును నిర్మించుకున్నారు. దీంతో రైతులతో పాటు ప్రభుత్వ స్థలాలను పరిశీలించేందుకు వెళ్లే అధికారులు కూడా పాత దారిలోనే వెళ్లాల్సి వస్తోంది. రెవెన్యూ అధికారులకు మామూళ్లు? ప్రభుత్వ స్థలంలో దారి నిర్మించుకున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం వెనుక రెండు కారణాలు ఉన్నట్టు సమాచారం. ఒకటి.. ఈ దారి గుండా అటువైపుగా రైతులతో పాటు ప్రభుత్వ స్థలాలకు వెళ్లేందుకు దారిని వదులుతానని సదరు రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థ హామీ ఇవ్వడం. అయితే, ఈ హామీని సదరు రియల్ ఎస్టేట్ సంస్థ పట్టించుకోనప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడానికి తెరవెనుక లాలూచీ వ్యవహారమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దారి నిర్మాణంలో జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులకు కూడా భారీగానే మామూళ్లు ముట్టాయనే ప్రచారం జరుగుతోంది. ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తాం ఇది మొదట్లో ప్రభుత్వ స్థలం. దీనిని మిలిటరీ వారికి గతంలో కేటాయించారు. వారు విక్రయించుకునేందుకు వీలుగా నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తెచ్చుకున్నారు. వారి నుంచి రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే, అవతల రైతుల పొలాలకు దారి లేకుండా చేశారని ఫిర్యాదులు వస్తే వారితో చర్చించి న్యాయం చేస్తాం. - రామాంజులు నాయక్, ఓర్వకల్లు తహశీల్దార్ -
వాన్పిక్ భూముల్లో పాగా
ఆక్రమణల చెరలో భూములు అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకం ఎన్వోసీ కోసం అధికారులపై ఒత్తిళ్లు ఒంగోలు : వాన్పిక్ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఖాళీగా ఉన్న భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. అక్కడ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు అధికారులపై ఎన్ఓసీ కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే కోర్టులో ఉన్న ఈ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రకాశం, గుంటూరు జిల్లాల తీర ప్రాంతంలో పరిశ్రమల కోసం వాన్పిక్ పేరుతో ప్రభుత్వం సుమారు 28 వేల ఎకరాల భూమిని సేకరించింది. వేటపాలెం నుంచి కొత్తపట్నం వరకూ 13 వేల ఎకరాల భూమిని వాన్పిక్ కోసం కేటాయించింది. అందులో ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి పోగా సుమారు ఎనిమిది వేల ఎకరాల వరకూ రైతుల నుంచి కొనుగోలు చేశారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాన్పిక్ ప్రాజెక్టును రద్దు చేశాయి. ఈ వివాదంపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇందులో కొన్ని భూములను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ జప్తు చేసింది. దీంతో ఈ భూములు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూముల్లో గతంలో వాన్పిక్కు అమ్మిన రైతులే మళ్లీ సాగు చేసుకుంటుండగా, మరికొన్ని భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. ప్రభుత్వ, అసైన్డ్ భూములను బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఆక్రమించి అందులో రొయ్యల చెరువులు తవ్వుతున్నారు. ఒంగోలు రూరల్ మండలంలోని గుండాయపాలెం, దేవరంపాడు గ్రామాల్లో వాన్పిక్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. గుండాయపాలెంలో రైతులు తమ భూములను ఎకరా రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర వరకూ వాన్పిక్కు అమ్మారు. ఇందులో ఎక్కువ చేపల, రొయ్యల చెరువులు ఉన్నాయి. వాన్పిక్ వివాదంలో పడటంతో ఈ భూములు అమ్మిన గ్రామస్తులు మళ్లీ వాటిని తమ స్వాధీనం చేసుకుని బయట వ్యక్తులకు లీజులకు ఇచ్చారు. మరికొంత మంది స్వయంగా సాగు చేసుకుంటున్నారు. వీటిలో చాలా వాటికి గతంలోనే విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాన్పిక్ భూముల్లోనే ఒక ప్రైవేటు కంపెనీ వంద ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు సాగు చేస్తోండగా, పది ఎకరాలకు పైగా సాగు చేస్తున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు. సాగు చేసుకుంటున్నవారు చెరువులకు నీరు పెట్టుకోవడం కోసం సొంతగా పెద్ద పెద్ద పంపింగ్ స్టేషన్లే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. మత్స్యశాఖ అధికారుల నుంచి చేపల, రొయ్యల చెరువుల కోసం అనుమతులు తీసుకుని ఆ పత్రాల ద్వారా ఎన్వోసీ కోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కోర్టులో వివాదం నడుస్తుండగా ఈ భూములను ఎన్వోసీ ఇస్తే తమ ఉద్యోగానికి ముప్పు వస్తుందని రెవెన్యూ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆక్రమణదారులు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఎన్ఓసీ కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల గుండాయపాలెంలో వాన్పిక్ భూమిలో ఒక వ్యక్తి మూడు ఎకరాల్లో రొయ్యల చెరువు తవ్వి దీనికి ఎన్వోసీ కోసం ఒంగోలు తహ శీల్దార్ కార్యాలయంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. అధికారులు సహకరించకపోవడంతో వారిని బదిలీ చేయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. -
వక్ఫ్ భూములు హాంఫట్
నిజామాబాద్ అర్బన్/సుభాష్నగర్: జిల్లాలోని వక్ఫ్ బోర్డు భూములు మాయమవుతున్నాయి. ఏళ్ల తరబడి కబ్జాలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకూ అక్రమ నిర్మాణాలు వెలుస్తుండడంతో వక్ఫ్ బోర్డు భూములు కనిపించకుండా పోతున్నాయి. అధికారుల పరిశీలన లేకపోవడం, ఉన్నవాటిపై విచారణ లేకపోవడంతో ఈ భూముల మనుగడ ప్రశ్నార్థకంగా మా రింది. కబ్జాదారులు దర్జాగా పట్టాలు పొంది, ప్రశ్నించేవారిని మచ్చిక చేసుకుని వాటిని ఆక్రమించుకుంటున్నారు. సుమారు 60 శాతం భూములు ఆమ్రణదారుల చేతిలో ఉన్నాయి. నిజామాబాద్ డివిజన్లో 1,629.27ఎకరాలు, బోధన్ డివిజనలో 3,209 ఎకరాలు, కామారెడ్డి డివిజన్లో 482 ఎకరాలు, మొత్తం 5,319 ఎకరాల వక్ఫ్బోర్డుకు చెందిన భూములున్నాయి. ఇందులో సుమారు 3,216 ఎకరాలు కబ్జాకు గురయయ్యాయి. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంతం, ఖలీల్వాడి, కోటగల్లీ, కంఠేశ్వర్, గూపన్ పల్లి శివారులో, మరికొన్ని చోట్ల 50 ఎకరాల వరకు భూములు ఆక్రమణలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. కబ్జాదారులు వక్ఫ్ బోర్డు అనుమతి పేరిట ఈ భూములలో కొనసాగుతున్నారు. కొన్ని చోట్ల ఒక్కసారి తీసుకున్న అనుమతితో ఏళ్ల తరబడి నిబంధనలకు విరుద్ధంగా అనుభవిస్తున్నారు. రెంజల్ మండలం నీల, కందకుర్తి, బోధన్ డివిజన్లోని పలు ప్రాంతాలలో వక్ఫ్బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయి. కౌలాస్, దుర్కి ప్రాంతాలలో సుమారు 1,600 ఎకరాల భూమి కబ్జాలో ఉంది. కామారెడ్డి, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ ప్రాంతాలలో సుమారు నాలుగు వందల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. డిచ్పల్లి, భీంగల్, బాల్కొండ, నవీపేట ప్రాంతాలలో దాదాపు 630 ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. మొత్తం వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి 5,319 ఎకరాలలో సర్వే నిర్వహిస్తే మరిన్ని అమ్రాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. 80 శాతం భూములు కబ్జా లో ఉన్నట్లు తేలే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా అధికారులు ఈ కబ్జా భూములపై సర్వే చేపట్టలేదు. కొన్ని చోట్ల ఆ భూములకు కేర్టే కర్గా ఉన్న ముతవల్లీలు నిబంధనలకు విరుద్ధంగా లీజులకు ఇస్తున్నారు. కొందరు ఇతరులకు విక్రయించారు. వీటిపై కూడా ఎలాంటి పరిశీలన లేదు. దీంతో భూములు మాయమవుతున్నాయి. సర్వే చేపట్టాలని మైనార్టీ నాయకులు కోరుతున్నా ఫలితం లేకుండా పోతోంది. -
స్వర్ణముఖిపై భూ రాబందులు!
ఆక్రమిత భూముల్లో ఆకు కూరల సాగు యథేచ్ఛగా ఆక్రమణలు మురుగునీరే సాగునీరు వ్యాపిస్తున్న వ్యాధులు చోద్యం చూస్తున్న అధికారులు స్వర్ణముఖి. ఈ నది పవిత్రతకు మారుపేరు. కనుచూపు మేరా ఇసుక.. పవిత్ర జలం..ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. మురుగు నీటికి, ఆక్రమణలకు నిలయంగా మారింది. కొందరు ఇసుకను సైతం చదునుచేసి పంటలు వేస్తున్నారు. వీటికి గృహాలు, హోటళ్లు, లాడ్జీల నుంచి వచ్చే మురుగునీటిని మళ్లిస్తున్నారు. ఇక్కడ పండించే ఆకు కూరలు చూసేందుకు పచ్చగా, ఏపుగానే ఉంటాయి. లోతుగా చూస్తే గానీ తెలియదు అది మురికినీటితో సాగు చేసిన పంట అని. ఇది తెలియక వినియోగదారులు కొనుగోలుచేసి ఆస్పత్రుల పాలువుతున్నారు. శ్రీకాళహస్తి టౌన్: శ్రీకాళహస్తి పట్టణానికి ఆనుకుని స్వర్ణముఖి నది ఉంది. ఒకప్పట్లో ఈ నది పవిత్రతకు మారుపేరుగా ఉండేది. ఇప్పుడు ఆక్రమణలకు నిలయంగా మారింది. నది సమీపంలో ఉన్న కొందరు యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. రామసేతు వంతెన వద్ద ఈ తంతు మరీ ఎక్కువ. నది కట్టకు ఆనుకుని ఉన్న ఇసుకను చదును చేసి సుమారు ఎకరా విస్తీర్ణాన్ని తమ అదుపులో ఉంచుకున్నారు. ఈ స్థలం చుట్టూ కంప నాటి ఎంచక్కా పంటలు వేస్తున్నారు. ఆకుకూరలే ప్రధాన పంటలు ఆక్రమిత స్థలంలో చిర్రాకు, తోటాకు, పుల్లగూర, పచ్చలకూర, కొత్తిమీర ఇలా రకరకాల ఆకుకూరలు సాగుచేస్తున్నారు. మురుగు నీటికారణంగా పంట ఏపుగా వస్తోంది. నెలకు రెండు పంటలు వేయవచ్చు. ఎండాకాలంలోనూ నీటి సమస్య ఉండదు. అడిగేవారు లేకపోవడంతో రోజురోజుకూ ఆక్రమణల జోరు పెరుగుతోంది. మార్కెట్ల నిండా ఇక్కడి పంటలే ఇక్కడ పండించే ఆకుకూరలు స్థానిక మార్కెట్కు, నాయుడుపేట, రేణిగుంట, ఏర్పేడు, మల్లారం, తిరుపతి తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఆకు ఏపుగా పెరిగి నిగనిగ మెరవడంతో విని యోగదారులు భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. చిర్రాకు కట్ట రూ.7కుపైగా విక్రరుుస్తున్నట్టు తెలుస్తోంది. అన్సీజన్ లో రూ.పదికి పైనే. వ్యాధులు ఖాయం మురుగునీటి కారణంగా పండించే ఆకుకూరలు తినడం వల్ల వ్యాధులు సక్రమిస్తున్నారుు. టైఫాయిడ్, మలేరియూ, స్కిన్ అలర్జీ తదితర రోగాలు సోకుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆస్పత్రికి వెళ్లితే కానీ అసలు విషయం తెలియడంలేదు. అక్కడి వైద్యులు ఆహా ర పదార్థాల వల్ల వ్యాధులు ప్రబలుతున్నట్టు చెబుతున్నారని పలువురు రోగులు అంటున్నారు. భూగర్భజలాలూ కలుషితం పట్టణం నుంచి వచ్చే మురుగు నీటిని చెంబేడు కాల్వకు మళ్లిస్తున్నారు. ఇందుకోసం స్వర్ణముఖి నదిలో పైప్లైన్లు ఏర్పాటు చేశారు. మరో వైపు రామసేతు వంతెన అవతల, ఇవతల మురుగునీరు నదిలోకి ప్రవహిస్తోంది. ఈ నీరు నదిలో ఏర్పాటు చేసిన బావుల చుట్టూ చేరుతోంది. ఫలితంగా భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. మున్సిపల్ అధికారులు ఇప్పటికే మూడు బావులను మూసివేశారు. కొన్ని కాల్వల నుంచి వచ్చేనీటిని నదిలో ఆక్రమిత భూములకు మళ్లిస్తున్నారు. కళ్లెదుటే ఆక్రమణలు కనిపించినా స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
భూ ఆక్రమదారులపై చర్య తీసుకోండి
ఎస్సీ, ఎస్టీ ప్రజావాణిలో బాధితులు అనంతపురం సిటీ: ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, వారిపై చర్యల తీసుకుని తమకు న్యాయంచ చేయాలని శింగనమల మండలం నాయనపల్లికి చెందిన వసుంధర, కనగానపల్లి మండలం కొండపల్లికి చెందిన గంగమ్మ వేరువేరుగా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఎస్సీ,ఎస్టీ గ్రీవెన్స్లో కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్కు వారు వినతిపత్రాలు అందజేశారు. బాధితురాలు వ సుంధర మాట్లాడుతూ ఆరో విడత భూ పంపిణీలో భాగంగా తనకు పట్టా ఇచ్చిన 3.60 ఎకరాలను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని వాపోయింది. తనకు కేటాయించిన ఐదెకరాలను ఆక్రమించుకున్నారని గంగమ్మ ఆవేదన వ్యక్తం చే సింది. గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసీ ఖాజామోహిద్దీన్, సోషియల్ వెల్ఫేర్ డీడీ రమణమూర్తి, డీఆర్ఓ హేమసాగర్, డీఎస్ఓ ఉమామహేశ్వర్రావు, ట్రైబల్ వెల్ఫేర్ జయరాం, గృహనిర్మాణశాఖ డీఈ లక్ష్మినారాయణమ్మ అర్జీలు స్వీకరించారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోండి.. పాత కక్షలతో నాలుగు నెలల కిందట తనపై కొందరు దాడి చేశారని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేద ని కనగానపల్లి మండలం కొండపల్లికి చెందిన ముత్యాలన్న అధికారులకు విన్నవించుకున్నారు. గిరిజన భవన్ నిర్మించండి .. జిల్లాలో 3 లక్షల మంది ఎరికలు, గిరిజనలు నివసిస్తున్నారని వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని నగర డెప్యూటీ మేయర్ గంపన్న, టీఎన్ఎస్ఎఫ్ నేత వీరాంజి తదితరులు కలెక్టర్ను కోరారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు గిరిజనభవన్ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నిధులు వారికే ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థలాలు చూపండి.. బెళుగుప్ప మండలం శీర్పి గ్రామంలోని 69 మంది దళితులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, స్థలాలు మాత్రం చూపించలేదని దండోరా నాయకులు అక్కులప్ప, రాజు, తదితరులు అధికారులకు తెలిపారు. వెంటనే స్థలాలు చూపాలని కోరారు. నాణ్యమైన దుస్తులు పంపిణీ చేయండి.. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన దస్తులను పంపిణీ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు అంజి, రాజేష్గౌడ్, మనోహర్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. సక్రమంగా కుట్టకపోవడం వల్ల దుస్తులు పాడవుతున్నాయని వారు వివరించారు. వైద్య సేవలందించండి... ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సక్రమంగా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్నపెద్దన్న, రామక్రిష్ణ, రమణ, తదితరులు వినతిపత్రం అందజేశారు. వైద్యు లు సొంత క్లినిక్లు నిర్వహిస్తూ ఆస్పత్రి విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిం చారు. ప్రతి చిన్న సమస్యకు కర్నూలు కు సిఫారసు చేస్తున్నారని పేర్కొన్నారు. సొంత భవనాలు నిర్మించండి గిరిజన బాల, బాలికల స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేక అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, సొంత భవనాలు నిర్మించి, సౌకర్యాలు కల్పించాలని గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వడిత్యా శంకర్నాయక్, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జుననాయక్ కోరారు. -
ఏదీ రైతుసేవ...?
- గజ్వేల్ మార్కెట్యార్డులో అక్రమార్కులదే రాజ్యం - యార్డు ఆదాయానికి ఏటా లక్షల్లో గండి - అభివృద్ధి పనుల పేరిట నిధుల దుర్వినియోగం గజ్వేల్: ఆదాయపరంగా జిల్లాలోనే రెండో స్థానాన్ని ఆక్రమించి తెలంగాణలోనే ప్రధాన మార్కెట్ యార్డుగా ఉన్న గజ్వేల్లో ‘రైతు సేవ’ ముసుగులో ఆక్రమాలకు తెర లేచింది. వ్యాపారుల మాయాజాలం కారణంగా ప్రతిఏటా మార్కెట్ యార్డు ఆదాయానికి లక్షల్లో గండిపడుతోంది. యార్డులోనే వ్యాపార లావాదేవీలన్నీ సాగాలనే నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. మరోపక్క అభివృద్ధి పేరిట జరుగుతున్న పనుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ వ్యవహారంపై ప్రత్యేక కథనం. గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్, తూప్రాన్ మండలాల రైతుల ప్రయోజనాల కోసం గజ్వేల్లో 19ఏళ్ల క్రితం మార్కెట్ కమిటీ ఏర్పాటైంది. ప్రతిసారి ఆదాయపరంగా సిద్దిపేట తర్వాత స్థానాన్ని సాధిస్తూ జిల్లాలో రెండోస్థానంలో నిలుస్తోంది. పత్తి క్రయవిక్రయాలకు సంబంధించి తెలంగాణలోనే ప్రధాన మార్కెట్గా ఆవిర్భవించింది. రైతు సేవ కోసం నిర్మించిన ఈ యార్డు అక్రమాలకు నిలయంగా మారటం ఆందోళన కలిగిస్తోంది. రైతుల అవతారంలో వ్యాపారులు గజ్వేల్లో యార్డులో తక్కువ ధరకు కొనుగోలు చేసిన వేలాది క్వింటాళ్ల పత్తిని బినామీ పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్లను సమర్పించి సీసీఐకి ఎక్కువ ధరకు విక్రయించుకోవడం పరిపాటిగా మారింది..ఆపై ఎలాంటి లావాదేవీలు జరపనట్లుగా మార్కెట్ ఫీజు యథేఛ్చగా ఎగవేస్తున్నారు. ఫలితంగా యార్డు ఆదాయానికి లక్షల్లో గండిపడుతోంది. పత్తి దిగుబడులు రైతుల చేతికందే సీజన్లో ఇక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేస్తారు. ఎప్పటిలాగే 2012 అక్టోబర్ 8న సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటైంది. కానీ ఏనాడు ఈ కేంద్రం సక్రమంగా లావాదేవీలను చేపట్టలేదు. ఈ పరిస్థితిని అవకాశంగాా మలుచుకుంటున్న వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన ఉత్పత్తులకు క్వింటాల్కు రూ.3600నుంచి 3700వరకు ధర చెల్లించారు. 40కిలోల సంచిపై తరుగు పేరిట 2కిలోల వరకు కోత విధించారు. ఈ విధంగా సేకరించిన వేలాది క్వింటాళ్ల పత్తిని తామే రైతులమని బినామీ పట్టాదారు పాసుపుస్తకాలను సృష్టించి రూ.3900క్వింటాల్ చొప్పున సీసీఐకి అమ్ముకున్నారు. ఆ నెలలో సీసీఐ ద్వారా 70వేల క్వింటాళ్లకు పైగా కొనుగోళ్ల జరిగాయి. ఇందులో సుమారు 60వేలకుపైగా క్వింటాళ్లకుపైగా ప్రైవేట్ వ్యాపారులే విక్రయించగా. ఈ 60వేల క్వింటాళ్లు (ఒక్కో క్వింటాల్ ధర రూ.3900చొప్పున లెక్కిస్తే) తాము వ్యాపార లావాదేవీలు జరిపామని రికార్డులు చూపితే ఒక్కో క్వింటాల్కు ఒక శాతం చొప్పున సుమారు 23లక్షలకుపైగా మార్కెట్ ఫీజు చెల్లించాల్సివుండగా అది పూర్తిగా ఎగవేశారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ బయటపెట్టగా అధికారులు తూతూమంత్రంగా విచారణ చేపట్టి వదిలేశారు. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట గత కొన్నేళ్లక్రితం వ్యాపారులకు చెందిన దుకాణాల ముందు భాగంలో నిర్మించిన సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపించింది. ఈ పనులు చేపట్టే సందర్భంలో అధికారుల నుంచి సరైన పర్యవేక్షణ కొరవడటం కారణంగా ఈ దుస్థితి తలెత్తింది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సీసీ పూర్తిగా కంకర తేలి రైతులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న తరుణంలో ఈ సీసీపైనే 4 ఇంచులు మందంతో కొత్తగా సీసీ వేశారు. 91మీటర్ల పొడవునా ఈ పనులు సాగాయి. నిజానికి ముందుగా మార్కెటింగ్ శాఖ అధికారులు ముందుగా 135మీటర్ల పొడవునా ఈ పనులు చేపట్టాలనుకొని , ఇందుకోసం రూ.35లక్షల వెచ్చించాలనుకొని ఆదరాబాదరాగా నిర్ణయించారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ శాఖ ఎస్ఈ యార్డును సందర్శించి 91మీటర్లు పనులు చేపడితే సరిపోతుందని సూచించడంతో ఈ పనులు అంచనా వ్యయం రూ.20లక్షలకే పరిమితమైంది. మిగిలిన రూ.15లక్షలతో ఓపెన్ ఫ్లాట్ఫారాల పక్కన కొత్తగా సీసీ రోడ్ల నిర్మించి వృథా ఖర్చును కొంతవరకు అరికట్టగలిగారు. ఏదీఏమైనా నాణ్యత లోపించిన పాత పనికి రూ.20లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. ‘బహిరంగబేరం’ యథాతథం యార్డులో మొత్తం 35కుపైగా ట్రేడింగ్ లైసైన్స్లుండగా యార్డులో కేవలం 10మంది వ్యాపారులకు మించి క్రయవిక్రయాలు జరపడంలేదు. గతేడాది కొన్ని నెలలు బహిరంగబేరం నిర్వహించకుండా హడావిడి చేసిన అధికారులు ప్రస్తుతం పట్టించుకోపోవడంతో మిగితాలెసైన్స్దారులు యార్డు పక్కనే తూప్రాన్ రోడ్డుపై సొంతమడిగెలు నిర్మించుకొని యథేచ్ఛగా ‘బహిరంగ బేరం’ నిర్వహిస్తున్నారు.