old people
-
జనాభా తగ్గుతోంది... వృద్ధులు పెరుగుతున్నారు
ఇటు జనాభా క్షీణిస్తోంది. అటు వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనా సహా అనేక దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లివి. పెళ్లికి, పిల్లలను కనేందుకు యువతరం పెద్దగా ఇష్టపడటం లేదు. కాస్త అటూ ఇటుగా ప్రపంచమంతటా ఇదే ధోరణి పెరుగుతోంది. దాంతో ఏ దేశంలో చూసి నా జనాభా క్రమంగా తగ్గుతోంది. 2024లో చైనా జనాభా 10.4 లక్షలు తగ్గింది. అక్కడ జనాభా తగ్గడం వరుసగా ఇది మూడో ఏడాది. జపాన్లోనైతే 15 ఏళ్లుగా జనాభా వరుసగా తగ్గుము ఖం పడుతోంది. దక్షిణ కొరియాలో 2023లో కాస్త పుంజుకున్న జనాభా ఈ ఏడాది మళ్లీ తగ్గింది. ఇటలీలో జననాల సంఖ్య 19వ శతాబ్దం తరవాత తొలిసారి 4 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. 63 దేశాలు, భూభాగాల్లో జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరిందని ఐరాస అంచనా. వచ్చే 30 ఏళ్లలో మరో 48 దేశాలు ఆ స్థాయికి చేరతాయని సంస్థ పేర్కొంది. 60 ఏళ్లలో ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని, అక్కడినుంచి క్షీణించడం మొదలవుతుందని అభిప్రాయపడింది. చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు మరోవైపు ఆరోగ్య సంరక్షణ, మెరుగైన జీవనశైలి, ఆయుర్దాయం పెరుగుదల తదితరాలతో చాలా దేశాల్లో వృద్ధుల జనాభా నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాంతో ఆర్థిక వృద్ధి దెబ్బ తింటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు చైనా నానా ప్రయత్నాలు చేస్తోంది. పురుషుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 63 ఏళ్లకు పెంచింది. ఫ్యాక్టరీ, బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు 50 నుంచి 55కు, వైట్–కాలర్ ఉద్యోగాల్లో 55 నుంచి 58కు పెంచింది. 2022 నుంచి చైనాలో జనాభా తగ్గుముఖం పట్టడం మొదలైంది. దాంతో అత్యధిక జనాభా రికార్డును 2023లోనే భారత్కు కోల్పోయింది. ఒకే సంతానం నిబంధనను సడలించి ముగ్గురిని కనేందుకు అనుమతించినా లాభం లేకపోయింది. 140 కోట్లున్న చైనా జనాభా 2050 నాటికి 130 కోట్లకు తగ్గుతుందని అంచనా. ఇటలీదీ అదే వ్యథ... ఇటలీలో కూడా జనాభా నానాటికీ తగ్గిపోతోంది. 2023లో 5.94 కోట్లుండగా 2024 చివరికి 5.93 లక్షలకు తగ్గింది. 2008లో 5.77 లక్షలున్న వార్షిక జననాల సంఖ్య 2023 నాటికి ఏకంగా 3.8 లక్షలకు పడిపోయింది! ఇటలీ ఏకీకరణ తరువాత జననాల సంఖ్య క్షీణించడం అదే తొలిసారి! పిల్లల సంరక్షణ ఖరీదైన వ్యవహారంగా మారడం, తక్కువ జీతాలు, వృద్ధ తల్లిదండ్రులను చూసుకునే సంప్రదాయం వంటివి ఇటాలియన్లకు భారంగా మారుతు న్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా పోప్ కూడా ఇటీవలే ఇటాలియన్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా 2033 కల్లా ఏటా కనీసం 5 లక్షల జననాలే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిరోధించడానికి జనాభా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దక్షిణ కొరియాలో విదేశీయుల రాక పుణ్యమా అని 2023లో జనాభా పుంజుకుంది. నిజానికి అధిక పోటీ విద్యా విధానంలో పిల్లలను పెంచడానికి అధిక ఖర్చు, మహిళలే శిశు సంరక్షణ చేపట్టా లనే ధోరణి వల్ల అక్కడ కొన్నేళ్లుగా జనాభా తగ్గుతోంది. వర్కింగ్ వీసా ప్రోగ్రాం పొడిగింపు వల్ల విదేశీ నివాసి తుల సంఖ్య 10% పెరిగి 10.9 లక్షలకు చేరింది. ఫలితంగా జనాభాలో కాస్త పెరుగుదల నమోదై 5.18 కోట్లకు చేరింది. కానీ వీరిలో ఏకంగా 90.5 లక్షల మంది 65, అంతకు మించిన వయసువారే! వృద్ధుల జనాభా పెరగడం కార్మికుల కొరతకు దారి తీస్తోంది.జపాన్లో అలా.. జపాన్ అయితే జనాభా సంక్షోభమే ఎదుర్కొంటోంది! 2008లో 12.8 కోట్లుండగా ప్రస్తుతం 12.5 కోట్లకు పడిపోయింది. జననాల సంఖ్య కూడా బాగా తగ్గుతోంది. యువత పెళ్లి, పిల్లలను కనడంపై తీవ్ర విముఖత చూపుతుండటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ఉద్యోగావకాశాల లేమి, జీవన వ్యయానికి తగ్గ వేతనాలు లేకపోవడం, కార్పొరేట్ సంస్కృతి పనిచేసే మహిళలు పని చేసేందుకు అనుకూలంగా లేకపోవడం వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయి. 2070 నాటికి జపాన్ జనాభా 8.7 కోట్లకు పడిపోతుందని అంచనా. జనాభా సమస్యకు తోడు వృద్ధుల సంఖ్య కూడా జపాన్ను కలవరపరుస్తోంది. అక్కడ ప్రతి 10 మందిలో నలుగురు వృద్ధులే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మలి సంధ్యా... మరో వసంతమే!
‘‘పండుటాకులము మిగిలితిమి.. ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి’’ అని భర్త పదవీ విరమణ రోజు భార్య పాడుతున్నట్లుగా ఓ సినీ గీతిక సాగుతుంది. పాటలోని భావమూ మనకు భారంగా అనిపిస్తుంది, కానీ ప్రస్తుత ప్రపంచ ధోరణికి ఆ వాక్యాలు సరిపోవని అనిపిస్తుంది. వృద్ధులు పండుటాకులు కాదు. అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృత భాండాలు.ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని, రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు.ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి.యవ్వనంలో పటుత్వం, బిగువు జీవులకు సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ బిగువు సడలుతూ ఉంటుంది. అది శరీరానికుండే సహజ లక్షణం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది. ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావితరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం.దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలం విశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని ఒత్తిడివల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి వారి ఆహారపు అలవాట్లు, ప్రత్యేకమైన అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుందనడం అతిశయోక్తి కాదు.వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి.వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటివృద్ధాప్యం శాపం కాదు... ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏమాత్రం బాధించదు. పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసును కాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!! యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!! -
70 ఏళ్లుపైబడినవాళ్లకు ఆయుష్మాన్ భారత్ అమలు
న్యూఢిల్లీ, సాక్షి: దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్భారత్ వర్తింపజేస్తూ నిర్ణయం. ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నది: మంత్రి అశ్వినీ వైష్ణవ్తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది కలుగుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్వీరంతా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా (AB PMJAY) పథకాన్ని 2018 సెప్టెంబర్లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందుతాయి.కేబినెట్ నిర్ణయాలుపీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకానికి ఆమోదం.. రూ.10,900 కోట్ల కేటాయింపు.. ఈవీలపై సబ్సిడీ కొనసాగింపు.. 88,500 ప్రదేశాల్లో ఛార్జింగ్ల ఏర్పాట్లు జలవిద్యుత్ ప్రాజెక్టులకు రూ.12,461 కోట్ల కేటాయింపు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన.. రూ. 70,125 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం.. 25,000 గ్రామాలను కలిపేలా రోడ్ల నిర్మాణం పీఎం ఈ -బస్ సేవా పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. రూ. 3,435 కోట్ల రూపాయలతో 38వేల ఈ -బస్ ల ఏర్పాటు వాతావరణ శాఖ టెక్నాలజీ(మిషన్ మౌసమ్) కోసం రూ.2 వేల కోట్ల కేటాయింపు -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా.. జపాన్ మహిళ!
జపాన్కు చెందిన 116 ఏళ్ల టొమికో ఇటుకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నట్లు అమెరికాకు చెందిన జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఇంతకీ ఆమె పుట్టిందెప్పుడో తెలుసా? రైట్ బ్రదర్స్ ఐరోపా, అమెరికాల్లో తొలిసారిగా విమానాలను ప్రారంభించిన 1908లో. అదే ఏడాది ఈఫిల్ టవర్ నుంచి తొలి సుదూర రేడియో సందేశం పంపించారు. ఇటుకా జపాన్లోని నగరమైన అషియా నివాసి.ఆమె 70వ ఏట జపాన్లోని 3,067 మీటర్ల ఎత్తయిన ఒంటాకే పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. అది కూడా బూట్లు ధరించకుండా స్నీకర్స్తో ఎక్కి గైడ్నే ఆశ్చర్యపరిచారు. 100 ఏళ్ల వయసులో ఆషియా మందిరంలోని అతి పొడవైన రాతి మెట్లెక్కారు. ఇప్పటిదాకా అత్యంత వృద్ధురాలిగా ఉన్న స్పెయిన్కు చెందిన మరియా బ్రాన్యాస్ మొరెరా (117) మంగళవారం కన్నుమూయడంతో ఇటుకాకు రికార్డు దక్కింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఫ్రెంచ్ మహిళ జీన్ లూయిస్ కాల్మెంట్. ఆమె 122 ఏళ్ల 164 రోజులు జీవించి 1997లో మరణించారు. -
ఎటువంటి ‘చార్జీ’లు లేకుండానే పింఛన్ ఇవ్వండి
సాక్షి,అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలతో అవ్వాతాతల పింఛన్ సొమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పింఛన్ సొమ్మును ఎలాంటి చార్జీలకు మినహాయించుకోకుండా ఇవ్వాలని బ్యాంక్లను రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) ఆదేశించినట్లు సెర్ప్ అధికారులు గురువారం తెలిపారు. అవ్వాతాతలు తమ బ్యాంక్ అకౌంట్లను చాలా కాలంగా ఉపయోగించని కారణంగా ఆ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేదు.దీంతో ఆయా అకౌంట్లకు బ్యాంక్లు చార్జీలు విధిస్తున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం..అవ్వతాతలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారు పింఛన్ డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఎటువంటి చార్జీలను బ్యాంక్లు తీసుకోకుండా చర్యలు తీసుకుంది. కాగా, మొత్తం లబి్ధదారులు 65.94 లక్షల మందిలో 48.92 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, వారందరి బ్యాంక్ ఖాతాల్లో బుధవారమే అధికారులు డబ్బులు జమ చేయగా, అందులో 74,399 మందికి వారి సాంకేతిక కారణాలు కారణంగా సొమ్ము జమ కాలేదు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ అందేలా వారి ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని సెర్ప్ అధికారులు తెలిపారు. కాగా, మే నెలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 65,49,864 మంది లబి్ధదారులకు పింఛన్ల పంపిణీ నిమిత్తం రూ.1,945.39 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా గురువారం సాయంత్రం వరకు డీబీటీ విధానంలో 48.92 లక్షల మంది లబి్ధదారులలో 48.17 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. దివ్యాంగులు, మంచం/వీల్చైర్కు పరిమితమైన వారిలో 16.57 లక్షల మందికి వారి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయించగా, అందులో 15.13 లక్షల మందికి గురువారం నాటికి పంపిణీ పూర్తయినట్లు వివరించింది. డీబీటీ విధానంలో 98.47% మందికి, లబి్ధదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసేవారిలో 91.34% మందికి పంపిణీ పూర్తయినట్లు పేర్కొంది. -
పింఛన్ కోసం.. నలుగురు మృత్యువాత
సాక్షి నెట్వర్క్: అవ్వాతాతలు, వృద్ధులు, వితంతువులు తదితరుల ఇళ్లకే వెళ్లి ప్రతీనెలా ఠంఛనుగా ఒకటో తేదీ పొద్దున్నే వలంటీర్ల ద్వారా పింఛన్లను అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానంపై టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అక్కసుకు వారు బలవుతున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజీ వస్తుందేమోనన్న దుగ్థతో కూటమి పార్టీలు ఎన్నికల సంఘానికి పదేపదే ఇ చ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో గత నెలలో సచివాలయాల వద్ద ఇవ్వగా దీనిపైనా కూటమి అభ్యంతరాలు చెప్పడంతో ఈనెల బ్యాంకుల్లో పింఛన్ మొత్తం జమచేయమని ఈసీ ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లో పింఛన్లను జమచేసింది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు తరలివెళ్లిన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు భగభగలాడుతున్న మండుటెండల్లో నానా అవస్థలు పడ్డారు. ఇలా ఎండలకు తాళలేక వడదెబ్బతో ముగ్గురు మృత్యువాత పడగా మరొకరు పెన్షన్ ఎలా తెచ్చుకోవాలో తెలీక చింతిస్తూ మరణించారు. వివరాలివీ.. చిత్తూరులో జిల్లాలో స్పృహతప్పి.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం పరిధిలోని పద్మసరస్సు ఎస్టీ కాలనీకి చెందిన చిన్నముత్తయ్య (గోపాలయ్య) మామిడి తోటలో కాపలాదారు. పింఛన్ కోసం బ్యాంకుకు వెళ్లి తిరిగి వస్తుండగా జీలగల్లు ప్రాంతంలో ఎండ వేడికి తాళలేక స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెన్షన్ కోసం చింతిస్తూ.. ఇన్నాళ్లూ ఇంటికే వచ్చిన పింఛన్ సొమ్ము బ్యాంకులో జమకావడంతో ఎలా తెచ్చుకోవాలో తెలీక శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెమళ్లదిన్నె ఎస్టీ కాలనీకి చెందిన రాగి తిరుపాలమ్మ (75) చింతిస్తూ గురువారం మృతిచెందింది. తిరుపాలమ్మ బుధవారం పింఛను డబ్బుల కోసం సచివాలయం వద్దకు వెళ్లగా బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు సమాచారం ఇచ్చారు. కానీ, డబ్బులు చేతికి అందలేదనే దిగులుకు తోడు ఆ డబ్బుల్ని ఎలా తెచ్చుకోవాలో తెలీక చింతిస్తూ తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది. పింఛను తీసుకున్న పది నిమిషాలకే వడదెబ్బ.. అన్నమయ్య జిల్లా పెనగలూరుకు చెందిన బుజ్జమ్మ (60) బ్యాంకులో పింఛన్ తీసుకుని ఇంటికి బయల్దేరుతుండగా ఎండవేడిమి తాళలేక దారిలోనే కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. బ్యాంకు బయటే కుప్పకూలి.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాలకు చెందిన వెంకట నాగులు (72) తన ఖాతాలో పింఛను డబ్బులు జమకావడంతో ఏ.రంగంపేటలోని బ్యాంకుకు వెళ్లాడు. ఎండ వేడిమికి తట్టుకోలేక బ్యాంకు వెలుపలగుండెపోటుతో కుప్పకూలిపడిపోయాడు. తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో ఇంటి వద్ద ఓటుకు దరఖాస్తు
సాక్షి, అమరావతి: పోలింగ్ కేంద్రం వరకు రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయం తీసుకుంది. దేశంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగ ఓటర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈమేరకు రాష్ట్రాల వారీగా ఇంటి వద్దే ఓటు వేసేందుకు అర్హత ఉన్న ఓటర్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు శుక్రవారం ప్రకటించారు. వీరికి ఇంటి వద్దే ఓటు వేయాలనేది తప్పనిసరి కాదని, ఇది ఐచ్ఛికం మాత్రమేనని చెప్పారు. ఇటువంటి ఓటర్లు దేశవ్యాప్తంగా 1.70 కోట్లకు పైగా ఉన్నట్లు సీఈసీ తెలిపింది. ఇందులో 85 ఏళ్లు పైబడిన వారు 81 లక్షలకు పైగా, దివ్యాంగులు 90 లక్షలకుపైగా ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లలో మహిళలు ఎక్కువ ఉన్నారు. వీరిలో 33.84 లక్షల మంది పురుషులు కాగా, 47.27 లక్షల మంది మహిళా ఓటర్లు, 18 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 40 శాతం వైకల్యం ఉన్న ఓటర్లలో 53.64 లక్షల మంది పురుషులు, 36.42 లక్షల మంది మహిళలు, 442 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. ఈ వర్గాల వారికి ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించడం ప్రగతిశీల చర్యగా ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ వర్గాలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే సమయంలో ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సదుపాయాన్ని పొందే విధానం సరళంగా, సమగ్రంగా, పారదర్శకంగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన ఐదు రోజుల్లోగా అర్హులైన ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసేందుకు 12 డి ఫారమ్ను పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. దివ్యాంగులు 12 డి ఫామ్తో పాటు వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వీరి నుంచి 12 డి ఫామ్ను బూత్ లెవల్ ఆఫీసర్ సేకరిస్తారు. జవాబుదారీ, పాదర్శకత కోసం ఇంటి వద్ద ఓటు వేసే వారి వివరాలను అభ్యర్ధులకు అందుబాటులో ఉంచుతారు. అవసరమైతే అభ్యర్థులు ఈ ప్రక్రియను పర్యవేక్షించుకోవచ్చు. ఈ ఓటర్ల ఇళ్లకు భద్రతా అధికారులతో పాటు ప్రత్యేక పోలింగ్ బృందం వెళ్తుంది. ఎప్పుడు ఇంటికి వస్తారో ముందుగానే ఆ ఓటర్లకు తెలియజేస్తారు. ఇంటి వద్ద ఓటు వేసే పూర్తి ప్రక్రియను వీడియో తీస్తారు. ఓటు ఎవరికి వేశారో తెలియకుండా గోప్యతను పాటిస్తారు. ఇంటి వద్ద ఓటు వేసిన తరువాత ఆ బ్యాలెట్లను భద్రంగా బ్యాక్సుల్లో ఉంచి తిరిగి రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేస్తారు. రాష్ట్రంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు మొత్తం ఓటర్లు 2,11,088 పురుషులు 84,155 మహిళలు 1,26,927 థర్డ్ జెండర్ 6 రాష్ట్రంలో 40 శాతం వైకల్యం గల ఓటర్లు మొత్తం ఓటర్లు 5,18,193 పురుషులు 3,02,374 మహిళలు 2,15,795 థర్డ్ జెండర్ 24 -
బాధపడొద్దు.. నేనున్నా
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, వృద్ధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ సమస్యలు విన్నవించి ఆదుకోవాలని అభ్యర్ధించారు. వారి కష్టాలను సావధానంగా ఆలకించిన సీఎం జగన్ ప్రతి ఒక్కరి నుంచి అర్జీలను స్వీకరించారు. ‘‘బాధపడొద్దు.. నేను ఉన్నాను. తప్పకుండా మీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తా’’ అని భరోసా ఇచ్చి అర్జీలను వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. – సింగరాయకొండ (మర్రిపూడి) పొన్నలూరు/పీసీపల్లి టీడీపీ వాళ్లు పొలం కబ్జా చేశారయ్యా.. మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామానికి చెందిన రాయిపాటి లక్ష్మీనరసయ్య (70) వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పదేళ్ల పాటు గడ్డం పెంచాడు. 2019 ఎన్నికలకు ముందు జగన్తో పాటు పాదయాత్రలో పాల్గొన్నాడు. దీనిపై కక్షగట్టిన టీడీపీ సానుభూతిపరులు లక్ష్మీనరసయ్యకి చెందిన 9 ఎకరాల పొలాన్ని కబ్జా చేశారు. బస్సు యాత్ర సందర్భంగా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తేవడంతో పెద్దాయన సమస్యను నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగం కోసం వినతి 2017లో బీకాం చదివిన పీసీపల్లి మండలం అలవలపాడు కొత్తూరుకు చెందిన రావి సురేష్ ప్రస్తుతం వలంటీర్గా పని చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా ఉన్నందున ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సీఎం జగన్కు వినతిపత్రం అందజేశాడు. ట్రై సైకిల్ ఇప్పించండన్నా బస్సు యాత్ర కనిగిరి మండలం అజీజ్పురానికి చేరుకున్న సమయంలో గ్రామానికి చెందిన కేశారపు దేవమ్మ అనే దివ్యాంగురాలు సీఎం జగన్ను కలిసింది. దివంగత వైఎస్సార్ గతంలో తనకు ఇచి్చన ట్రైసైకిల్ మూలనపడినందున కొత్తది ఇప్పించాలని విన్నవించింది. నలుగురు బిడ్డలున్నా... ‘‘చూపు కోల్పోయి పని చేయడానికి వీలు లేకుండా పోయింది. కుటుంబ పోషణ అంతంత మాత్రం. ఆర్థిక సాయం చేయండి సారూ’’ అంటూ కనిగిరి మండలం అజీస్పురంలో కేశారపు రోశయ్య వేడుకున్నాడు. తనకు నలుగురు పిల్లలున్నా పట్టించుకోవడం లేదని, ఒంటరినయ్యానని సీఎం జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విలపించాడు. దివ్యాంగుడిని ఆదుకోండయ్యా కనిగిరి మండలం ఏరువారిపల్లిలో గ్రామానికి చెందిన లక్కె మంగమ్మ దివ్యాంగుడైన తన కుమారుడు లక్కె సాయిని వెంటబెట్టుకుని సీఎం జగన్ను కలిసింది. మన ప్రభుత్వంలో దివ్యాంగ పింఛన్ వస్తోందని తెలిపింది. తన కుమారుడికి ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విన్నవించింది. ► శారీరక ఎదుగుదల లేని పొన్నలూరు గ్రామానికి చెందిన వెలగపూడి ఏసుబాబు అర్హత ఉన్నా తనకు సదరం సరి్టఫికెట్ మంజూరు చేయడం లేదని, పింఛన్ పొందలేకపోతున్నానని విన్నవించాడు. ► పరుచూరివారిపాలెం గ్రామానికి చెందిన నేలపాటి నరసింహం ఎడమ కాలు రోడ్డు ప్రమాదంలో విరిగిపోయింది. తనకు మెరుగైన వైద్యం అందించాలని సీఎంకు విన్నవించాడు. ► కల్లూవారిపాలెం గ్రామానికి చెందిన కప్పల రియాగ్రేస్కు రెండు కళ్లు కనిపించకపోవడంతో శస్త్ర చికిత్స చేశారు. అయితే దురదృష్టవశాత్తూ శస్త్ర చికిత్స విఫలమైందని, మరోసారి శస్త్ర చికిత్స కోసం ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె తల్లిదండ్రులు కోరారు. ► మరికొందరు వృద్ధులు తమకు ఆరోగ్య సమస్యలున్నాయని, వాటిని నయం చేసేందుకు వైద్య సాయం అందించాలని వేడుకున్నారు. -
చంద్రబాబు కుట్రలు.. పెన్షన్ కోసం వృద్ధుల పాట్లు
సాక్షి, విజయవాడ: హేయమైన రాజకీయాలకు నిరుపేదలకు బలి అవుతున్నారు. చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీల కుట్రతో వృద్దులు పెన్షన్ కోసం పాట్లు పడుతున్నారు. ప్రతినెల ఇంటికే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ నెల లేదు. ఎన్నిలకు కమిషన్ కి ఫిర్యాదు చెయ్యడంతో వాలంటీర్లు సేవలు బంద్ అయ్యాయి. నడవలేని వృద్దులు ఎండలో వస్తున్నారు. సచివాలయాల వద్ద పెన్షనర్లు కు సౌకర్యాలు కల్పించి పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు సిబ్బంది. కానీ ఎండలలో సచివాలయాలకు రావాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు చేసిన కుట్రకు మేము బలి అయ్యామని, మాకొద్దు చంద్రబాబు అంటున్నారు. ఓటుతో చంద్రబాబు కి బుద్ధి చెప్తామని పెన్షనర్లు చెబుతున్నారు. -
ఈయన ఓటేశారు.. ఆ తర్వాత ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: పవిత్రమైన ఓటును పవిత్రంగానే ఉపయోగించుకోవాలి.. ఇది ఓటర్లకు పెద్దలు ఇస్తున్న సందేశం. తెలంగాణ ఓటర్ల జాతర నేపథ్యంలో.. ఎనిమిది పదుల వయసు దాటిన కొందరు చురుకుగా, అదీ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం ఇంట్లో వాళ్ల సాయంతో ఓటింగ్ పాల్గొని.. ఓటుకు దూరంగా ఉండొద్దని మిగతా వాళ్లకు పిలుపు ఇస్తున్నారు. అంబర్పేటలో 92 సంవత్సరాల వృద్ధుడు ఓటు హక్కు వినియోగించుకుని.. యువత ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే.. శివానంద రిహబిలిటేషన్ లో వృద్దులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినయోగించుకున్న దృశ్యాలు కనిపించాయి. మరోవైపు దివ్యాంగులు సైతం ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం తొలిసారిగా.. ఓట్ ఫ్రమ్ హోం ద్వారా 27వేలమందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడం తెలిసిందే. మిగిలిన వాళ్లు ఇవాళ నేరుగా పోలింగ్కేంద్రాలకు వెళ్తూ ఓటేస్తున్నారు. తద్వారా ఓటు హక్కు అందరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. -
ఇంట్లో తల్లిదండ్రులు ఒంటరిగా ఉన్నారా? ఇకపై భయపడాల్సిన పనిలేదు
పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఇలాంటి ఒంటరి తల్లిదండ్రులను ప్రమాదాల బారి నుంచి రక్షించడానికి కేరళ స్టార్టప్ ‘స్మార్ట్కేర్’ ఎమర్జెన్సీ అలర్ట్ టెక్నాలజీతో కొన్ని పరికరాలను రూపొందించింది.... హైదరాబాద్ కూకట్పల్లిలోని రిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వరరావు ఒంటరిగా ఉంటాడు. భార్య రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. కొడుకు, కోడలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. విశాఖపట్టణంలో ఉండే అనసూయమ్మకు ఒక్కగానొక్క కూతురు పుణెలో ఉద్యోగం చేస్తుంది. అనసూయమ్మ భర్త చనిపోయి చాలాకాలం అయింది.రాజేశ్వరరావు ఒకరోజు ఇంట్లో కాలు జారిపడ్డాడు. ఆ సమయంలో వేరే ఊరి నుంచి వచ్చిన బంధువు ఒకరు ఉండడంతో ఆయనను త్వరగా హాస్పిటల్కు తీసుకువెళ్లాడు.అనసూయమ్మకు కూడా ఇలాగే జరిగింది. పడిన తర్వాత చాలాసేపటికి ఎవరో ఇంటికి రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మరింత ఆలస్యం అయి ఉంటే అనసూయమ్మ ప్రమాదంలో పడేది. అయితే అన్ని సందర్భాల్లోనూ ఎవరో ఒకరు వచ్చి బాధితులను హుటాహుటిన హాస్పిటల్కు తీసుకువెళతారని గ్యారెంటీ లేదు. ఇక కేరళ విషయానికి వస్తే ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల సంఖ్య అక్కడ ఎక్కువగా ఉంది. వారు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిందే... స్మార్ట్కేర్.కేరళకు చెందిన వేణునాథ్ స్వీడన్లో చదువుకునే రోజుల్లో ఒక వృద్ధురాలి ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఆమె వయసు ఎనభై సంవత్సరాలు. ఆ వృద్ధురాలి ఒంటరి జీవితం చూసి వేణుకు జాలిగా అనిపించేది. ఒక రాత్రి ఆమె అనారోగ్యానికి గురైంది. సీరియస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆమె తన చేతికి ఉన్న కంకణంలాంటి దానిపై ఉన్న బటన్ను నొక్కింది. వెంటనే టేబుల్ మీద ఉన్న పరికరం తనతో మాట్లాడడం మొదలుపెట్టింది. తనకు ఇబ్బందిగా ఉన్న విషయం గురించి చెప్పింది ఆమె. ఇరవై నిమిషాల లోపే వైద్యుడు, సహాయక బృందం ఆమె ఇంటికి వచ్చారు. ప్రాథమిక చికిత్స చేసి హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆ పరికరం గురించి వేణుకు విపరీతమైన ఆసక్తి ఏర్పడి దాని గురించి వివరాలు తెలుసుకున్నాడు. మన దేశంలో కూడా ఇలాంటి టెక్నాలజీ ఉంటే బాగుండేది అనుకున్నాడు. స్వీడన్లో డాటా సైంటిస్ట్గా కొంతకాలం ఉద్యోగం చేసిన వేణు ఆ తరువాత ఇండియాకు వచ్చి స్నేహితుడు అరుణ్ నాయర్తో కలిసి ‘అన్స్ఫ్రిడ్ స్మార్ట్కేర్ ప్రొడక్స్’ కంపెనీ మొదలు పెట్టాడు.అంతకుముందు ఉద్యోగం చేస్తూనే జీతంలో సగం మొత్తాన్ని వృద్ధులకు ఉపకరించే ఉపకరణాల గురించి రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఖర్చు చేసేవాడు. ఎంతోమంది నిపుణులతో మాట్లాడేవాడు. స్మార్ట్కేర్ ఉత్పత్తుల్లో ఒకటి... వైర్లెస్ ఫాల్ సెన్సర్. దీన్ని బాత్రూమ్ గోడలకు బిగిస్తారు. వృద్ధులు పడిపోతే కంపెనీకి అలర్ట్ పంపుతుంది. కంపెనీ వెంటనే వైద్యులను ప్రమాద బాధితుల ఇంటికి పంపుతుంది. చేతికి ధరించే ‘విబ్బీ డిటెక్టర్’ కూడా వృద్ధులు ప్రమాదంలో ఉన్నప్పుడు అలర్ట్ పంపుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవారికి ఇది బాగా ఉపకరిస్తుంది. ‘హీట్ అలారమ్’ అనేది వైర్లెస్ ఇండోర్ సెన్సర్. లాకెట్లా మెడలో ధరించవచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్చరిస్తుంది. తక్కువ బరువుతో ఉండే ‘మైఎమీ’ లాకెట్ వృద్ధులు ఇల్లు దాటి బయటికి వెళ్లినప్పుడు ఉపయోగపడుతుంది. ఆపద సమయంలో సహాయం కోసం దీనిపై ఉన్న బటన్ను నొక్కాలి...‘స్మార్ట్కేర్’ ఉత్పత్తుల్లో ఇవి కొన్ని మాత్రమే.‘స్మార్ట్కేర్’ నలభై హాస్పిటల్స్తో కలిసి పనిచేస్తోంది. కోల్కత్తా, ముంబై, చెన్నై, దిల్లీ, బెంగళూరు నగరాలకు కూడా కంపెనీ విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. -
అమ్మమ్మలకు అండగా.. మతిమరుపుతో బాధపడేవాళ్లకు ఇది బెస్ట్ సొల్యూషన్
మన చుట్టూ మనకు తెలియకుండానే ఎంతో మంది రకరకాల బాధలకు లోనవుతుంటారు. వారిలో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల సమస్యలకు సరైన పరిష్కారం తెలియక ఇబ్బందులు పడుతుంటారు. వారి మానాన వారిని అలాగే వదిలేయడం కన్నా పరిష్కారాన్ని కనుగొంటాను అనుకున్నాడు. తనదైన మార్గంలో ప్రయత్నించాడు. విజయం సాధించాడు. సత్కారాలను పొందుతున్నాడు హైదరాబాద్ వాసి హేమేష్ చదలవాడ. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సేవలు అందించిన 21 ఏళ్ల లోపు 20 మంది యువ సాధకులను ఢిల్లీలో మొన్న జరిగిన ‘అన్స్టాపబుల్ 21’ వేదికగా సత్కరించారు. హ్యూమన్ స్టడీస్, సైన్స్, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్, సోషల్ ఇంపాక్ట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే ఏడు రంగాలలో ప్రతిభావంతులైన యువతకు ఈ సత్కారాన్ని అందజేశారు. వారిలో హైదరాబాద్కు చెందిన 16 ఏళ్ల హేమేష్ చదలవాడ ఎలక్ట్రానిక్స్ రంగంలో కనబరిచిన ప్రతిభకు గుర్తింపు పొందాడు. వృద్ధులకు సహాయం.. హేమేష్ పన్నెండేళ్ల వయసు నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగంలో గణనీయమైన ప్రతిభను చూపుతున్నాడు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న అమ్మమ్మను చూసి ఆమెకు ఏదైనా సాయం చేయాలనుకున్నాడు. తన ఆలోచనల గురించి హేమేష్ చెబుతూ ‘నడిచేటప్పుడు అమ్మమ్మ అడుగులు తడబడుతుండేవి. మతిమరపు ఉండేది. ఆమెకు తన మీద తనకు కంట్రోల్ ఉండేది కాదు. కొన్నిసార్లు అర్థరాత్రి మంచంపై నుంచి లేచి ఎటో వెళ్లిపోయేది. దీంతో ఆమెను కనిపెట్టి ఉండటం కష్టమయ్యేది. అమ్మమ్మకు, ఆమెను చూసుకునే మాకూ ఇదో సవాల్గా ఉండేది. కొన్ని అందుబాటులో ఉన్న డివైజ్లను ప్రయత్నించి చూశాం. కానీ, ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. అమ్మమ్మకు సాయపడే డివైజ్ను నేనే సొంతంగా తయారుచేయాలనుకున్నాను’ అని తనలో రూపుదిద్దుకున్న ఆలోచనను వివరిస్తాడు. హేమేష్ కృషి, పట్టుదల, అంకితభావానికి అతని తల్లిదండ్రులు కిశోర్, సంధ్యలు ప్రోత్సాహం అందించారు. పరికరం ఎలా పనిచేస్తుందంటే.. ఈ పరికరం వాచ్లాగా మణికట్టుకూ కట్టుకోవచ్చు. బ్యాడ్జ్గానూ ధరించవచ్చు. రోగి నడక, భంగిమ, శరీర ఉష్ణోగ్రత, నాడిని పర్యవేక్షిస్తుంది. నీళ్లు జారిపడుతుండే శబ్దాన్ని కూడా గుర్తించగలదు. మనిషి దూరంగా తిరుగుతున్నప్పుడు లేదా పడిపోవడం వంటి ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే తెలియజేస్తుంది. ఇంకా అలారంలో ‘పిల్బాక్స్’ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది రోగులు వారి మందులు తీసుకునే సమయం వచ్చినప్పుడు హెచ్చరికలను పంపుతుంది. ‘ఈ డివైజ్ మా అమ్మమ్మ కోసం తయారు చేసినప్పుడు ఇంటర్నెట్ సరైన మార్గం చూపింది. అయితే, ఈ పరికరం పూర్తయ్యేసరికి అమ్మమ్మ చనిపోయారు’ అని హేమేష్ తెలిపాడు. ఇప్పుడీ అబ్బాయి 12వ తరగతి చదువుతున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్స్తో ఎలక్ట్రానిక్స్, రోబోటిక్ రంగంలో మరిన్ని అడుగులు వేస్తున్నట్టుగా వివరించాడు. 2021లో ప్రధానమంత్రి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్నాడు. పేరున్న కంపెనీల నుంచి గ్రాంట్లను పొందాడు. – నిర్మలారెడ్డి -
పల్లెవెలుగు బస్సుల్లో టీ9 టికెట్
సాక్షి, హైదరాబాద్: పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా టీ9 పేరుతో కొత్త టికెట్ను అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణ చార్జీ భారాన్ని కొంతమేర తగ్గించే ఈ టికెట్లను ఆదివారం నుంచి అమలులోకి రానుంది. పల్లె వెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివి ప్రయాణించేవారు రూ.100 చెల్లించి ఈ టీ9 టికెట్ కొంటే, అప్ అండ్ డౌన్కు అదే వర్తిస్తుంది. విడిగా మరో టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. 60 కి.మీ. పరిధి దాటితే మాత్రం ఇది వర్తించదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ వెసులుబాటు ఉంటుంది. పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివికి రెండువైపులా (అప్ అండ్ డౌన్) ప్రయాణానికి దాదాపు రూ.120 టికెట్ చార్జి అవుతుంది. ఒకేసారి టీ9 టికెట్ కొంటే రూ.100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.20 ఆదా అవుతుంది. ఆ ప్రయాణ మార్గంలో టోల్గేట్ ఉంటే టికెట్పై రూ.20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టీ9 టికెట్తో టోల్ చార్జి భారం కూడా ఉండదు. మొత్తంగా రూ.40 ఆదా అయినట్టవుతుంది. ఆటోల దూకుడుకు కళ్లెం చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు విపరీతంగా పెరిగిపోయి, బస్సు ప్రయాణికులను ఎగరేసుకుపోతున్నాయి. ఇప్పుడు ఈ టికెట్ రూపంలో కనీసం రూ.20 ఆదాతో ఆటో తాకిడి నుంచి బయటపడేందుకు యత్నించనుంది. వెళ్లేప్పుడు ఓ పల్లెవెలుగు బస్సులో ఈ టీ9 టికెట్ కొంటే, వచ్చేప్పుడు మరో పల్లెవెలుగు బస్సులో దాన్ని విని యోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, దాన్ని ఆ మార్గంలో ఒకే ప్రయాణానికి మాత్రమే వాడాల్సి ఉంటుంది. మహిళలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు వయసు ధ్రువీకరణ పత్రం చూపి ఈ వెసులుబాటు పొందాల్సి ఉంటుంది. సాయంత్రం 6తో ఈ అవకాశం ముగియనున్నందున కండక్టర్లు సాయంత్రం 4 వరకు మాత్ర మే ఆ టికెట్లు జారీ చేస్తారు. కాగా, పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళలకి ఆర్థికంగా వెసులుబాటు కల్పిం చేలా ఈ కొత్త టికెట్ను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బస్భవన్లో ఈ టికెట్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ టికెట్కు సంబంధించిన సమాచారం కావాలనుకునేవారు ఆర్టీసీ కాల్సెంటర్ (ఫోన్ నెంబర్లు 040–6944 0000, 040–23450033)ను సంప్రదించొచ్చని సజ్జనార్ తెలిపారు. -
ఆ ఆశ్రమం..‘మమత’ల కోవెల
నందిగామ(ఎన్టీఆర్ జిల్లా): కన్నబిడ్డలకు భారమై, ఆత్మీయుల ఆదరణకు దూరమై క్షణం ఒక యుగంలా గడుపుతున్న అవ్వాతాతలను అక్కున చేర్చుకుని ‘మమత’ను పంచుతోంది ఎన్టీఆర్ జిల్లా లచ్చపాలెంలోని వృద్ధాశ్రమం. పచ్చని చెట్ల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆశ్రమం నడుస్తోంది. మలిదశలో ఉన్న వారి మనస్సుకు ప్రశాంతతను ఇస్తోంది. సేవే లక్ష్యంగా ఆశ్రమాన్ని నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన వేముగంటి మమత. ఆహ్లాదకర వాతావరణంలో ఆత్మీయతలను పంచే వృద్ధాశ్రమంపై ప్రత్యేక కథనం.. సొంతూరుకు ఏదో చేయాలని.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన వేముగంటి మమత ప్రస్తుతం హైదరాబాదులో బుక్ డిజైనింగ్ కంప్యూటర్ వర్క్ చేస్తుంటారు. ఆమె భర్త చక్రవర్తి వ్యాపారి. వీరు హైదరాబాద్లో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచి సేవా దృక్పథం కలిగిన మమత హైదరాబాద్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాను పెరిగిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో లింగాలపాడు సమీపంలోని లచ్చపాలెం గ్రామంలో 2020 సంవత్సరంలో 50 సెంట్ల స్థలంలో సుమారు రూ.90 లక్షల వరకు వెచ్చించి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అభయం సొసైటీ ద్వారా పి.వి.ఆర్.కె.ప్రసాద్ శేష సదన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమంలో వృద్ధులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చారు. సాయంత్రం వేళ ఆహ్లాదం కోసం పచ్చని గార్డెన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆశ్రమంలో 22 మంది ఆశ్రయం పొందుతున్నారు. నందిగామ ప్రాంత వాసుల సహకారం.. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మమత తన దగ్గర ఉన్న నగదుతో పాటు మరో రూ.30 లక్షల వరకు బ్యాంక్ ద్వారా రుణం తీసుకొని మొత్తం సుమారు రూ.90 లక్షలతో ఆశ్రమ నిర్మాణం పూర్తి చేశారు. ఆమె ఆలోచనకు పలువురు దాతలు సహకారం అందించారు. ఆశ్రమానికి తరచూ వచ్చి వెళుతూ వృద్ధుల బాగోగులు చూసుకుంటున్నారు. నందిగామ చుట్టు పక్కల ప్రాంతాల వారు ఆశ్రమంలో జన్మదిన వేడుకలు, వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఆశ్రమానికి మరింత అండగా నిలుస్తున్నారు. రెండేళ్ల నుంచి ఇక్కడే నా భర్త 30 ఏళ్ల కిందట చనిపోయాడు. ప్రస్తుతం నాకు 70 సంవత్సరాలు. పిల్లలు ఉన్నప్పటికీ వాళ్లు నన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఇక్కడ నన్ను సొంత తల్లి లాగా చూసుకుంటున్నారు. నాకు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటోంది. –కన్నూరి రాజేశ్వరమ్మ, తిరువూరు మరింత అభివృద్ధి చేయాలి చిన్నతనం నుంచి ఎదుటి వారికి సేవ చేయడమంటే ఇష్టం. ఈ ఉద్దేశంతోనే సొంత ఊరిలో ఆశ్రమం ఏర్పాటు చేశా. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయాలి. ఆశ్రమంలో ఉండేవాళ్లు ప్రశాంతంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రకృతి ఒడిలో ఆశ్రమాన్ని నిర్మించాం. –వేముగంటి మమత, ఆశ్రమ నిర్వాహకురాలు -
కన్నపేగు కన్నీరు!
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు ఆమె. ఆమె కొడుకు, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు, కోడలు ఆమెను ఊళ్లోనే వదిలేసి కామారెడ్డికి వలస వెళ్లారు. తర్వాత కొడుకు బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు. ఆమె వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో వంట కూడా చేసుకోలేక ఆకలితో అలమటించింది. కోడలికి సమాచారం ఇచ్చినా రాకపోవడంతో గ్రామస్తుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. వారు కోడలిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేదు. వృద్ధురాలు ఇరుగుపొరుగు వారు నాలుగు మెతుకులు పెడితే తిని కాలం వెళ్లదీసేది. ఆవేదనతో ఓ రోజు ఉరివేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వర్పల్లికి చెందిన ఓ వృద్ధుడు తన కొడుకు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. ఆయన కష్టపడి ఎనిమిది ఎకరాల భూమి సంపాదించి పెట్టాడు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోయాయి. భార్య చనిపోయింది. తాను కష్టపడి సంపాదించిన భూమిని సాగు చేసుకుంటున్న కొడుకు తనకు తిండి కూడా పెట్టక పోవడంతో తల్లడిల్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా మార్పు రాలేదని ఆ వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. సాక్షి, కామారెడ్డి: వారు వయసు మీద పడిన వృద్ధులు.. పిల్లాజెల్లా అంతా ఉన్నా పట్టించుకునేవారు లేక బాధపడుతున్నవారు.. నడిచే శక్తి, పలికే ఓపిక లేక ఇబ్బందిపడుతున్నవారు.. పిడికెడు మెతుకులు పెట్టి, కాసింత చోటు ఇస్తే.. బిడ్డల నీడలో కన్నుమూస్తామని ఆరాటపడుతున్నారు. ఇలాంటి వృద్ధ దంపతుల్లో ఇద్దరు ఉన్నంత కాలం ఎలాగోలా బతికేస్తున్నా.. ఎవరైనా ఒకరు దూరమైన తర్వాత ఒంటరి జీవితం నరకప్రాయంగా మారుతోంది. తోడు కోల్పోయి, బిడ్డల ఆదరణ కరువై మానసికంగా కుంగిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. సరైన వైద్యం అందక కన్నుమూస్తున్నారు. మరికొందరు ఈ జీవితం మాకొద్దంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలికాలంలో చాలా చోట్ల వృద్ధుల బలవన్మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై.. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కొన్ని కుటుంబాల్లో తండ్రులే కాదు తాతలు కూడా కలిసి జీవించారు. ఆ పెద్దల మాట మేరకు ఎవరి పనివారు చేసుకుంటూ ఉండేవారు. కొన్నేళ్లుగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. చాలా కుటుంబాల్లో కన్నవారిని కూడా భారంగా భావించే పరిస్థితి నెలకొంది. ఉద్యోగం, వ్యాపారం పేరుతో పట్టణాలకు వెళ్తున్నవారు కన్నవారిని ఇంటి దగ్గరే వదిలేస్తున్నారు. ఊర్లలోనూ విడిగా ఉంటున్నారు. దీనితో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉన్న కుటుంబాల్లో కొందరు కన్నవారిని ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. తాము ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీగా ఉండి ఆలనా పాలనా చూడటం ఇబ్బందని చెప్పుకొంటూ డబ్బులు కట్టి ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఆశ్రమాల్లో ఉన్న అలాంటి వృద్ధులను కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినా తమ పిల్లలకు చెడ్డ పేరు రావొద్దని బాధను దిగమింగుకుంటున్నారు. కొందరిని బతికిస్తున్న ‘ఆసరా’ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ఎంతో మంది వృద్ధుల బతుకులకు ‘ఆసరా’గా నిలుస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 41 లక్షల మంది వృద్ధులు ఉండగా.. 15,94,650 మందికి వృద్ధాప్య పింఛన్ అందుతోంది. మందులు, నిత్యావసరాలకు కొంత వరకు పింఛన్ సొమ్ము ఉపయోగపడుతోంది. ఇదే సమయంలో కన్నవారి పింఛన్ డబ్బుల కోసం పిల్లలు వేధిస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఆత్మహత్యల్లో 14% వృద్ధులవే.. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల ఘటనల్లో 14 శాతం వృద్ధులవే ఉంటున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంటోంది. కన్నబిడ్డల ఆదరణ లేకపోవడం, ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో వృద్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏడాదిలో తెలంగాణలో 8 వేల పైచిలుకు ఆత్మహత్యలు జరిగితే.. అందులో 12 వందల మంది వరకు వృద్ధులు ఉంటున్నారు. రాష్ట్ర జనాభాలో వృద్ధులు 11 శాతం తెలంగాణ జనాభాలో వృద్ధులు పదకొండు శాతం ఉన్నారు. 2021 అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభా 3.77 కోట్లుకాగా.. ఇందులో వృద్ధుల సంఖ్య 41 లక్షలు దాటింది. ఇందులో 60–64 ఏళ్ల మధ్య వయసు వారు 12.77 లక్షల మంది.. 65–69 ఏళ్లవారు 10.18 లక్షలు, 70–74 ఏళ్లవారు 8.33 లక్షలు, 75–79 ఏళ్లవారు 5.62 లక్షలు, 80ఏళ్లు పైబడినవారు 4.70 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి చాలా కుటుంబాల్లో పేదరికం ఇబ్బందులు సృష్టిస్తోంది. తాను, భార్యాపిల్లలు బతకడమే కష్టమని, ముసలివాళ్లను ఎలా పోషించాలంటూ కొందరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాల్లో మరో రకమైన సమస్య ఉంటోంది. తమకు ముసలివాళ్లు అడ్డుగా ఉంటున్నారంటూ ఆశ్రమాలకు పంపడమో, వేరుగా ఉంచడమో చేస్తున్నారు. ఒంటరితనం, సరైన ఆహారం దొరకకపోవడం, పిల్లలు పట్టించుకోకపోవడంతో వృద్ధులు మానసికంగా కుంగిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో చాదస్తం ఎక్కువైందంటూ వృద్ధులను ఇబ్బంది పెడుతుంటారు. నెలలు, ఏళ్ల తరబడి ఒకేచోట ఉండటంతో చాదస్తం వస్తుంది. అందుకే పెద్దలకు నలుగురితో కలిసి ముచ్చటించుకునే అవకాశం కల్పించాలి. మన దగ్గర ప్రభుత్వమే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సి.వీరేందర్, సైకాలజిస్ట్, హైదరాబాద్ -
Pensions: ప్రతినెలా ఇదే తంతు.. సర్వర్ మొరాయింపు
కీసర(మేడ్చల్ జిల్లా): ఆసరా పింఛన్ల పంపిణీ ప్రహాసనంగా మారింది. పింఛన్ల సోమ్ము తీసుకునేందుకు వృద్ధులకు ఆగచాట్లు తప్పడం లేదు. సర్వర్లు మొరాయించడంతో వేలిముద్రలు తీసుకోవడం ఆలస్యం అవుతుండటంతో వృద్ధులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దీంతో పింఛను పంపిణీ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులుతీరుతున్నారు. ఒక్కోసారి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతినెలా ఇదే తంతు నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. రోజంతా పింఛన్ కేంద్రం వద్ద ఉన్నా పింఛన్ డబ్బులు తీసుకుంటామన్న నమ్మకం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. తిప్పలు తప్పాలంటే నేరుగా ఖాతాలోకి వేయాలి రెండు, మూడు రోజులుగా పింఛన్ల కోసం తిరుగుతున్నా సర్వర్ సమస్యతో డబ్బులు తీసుకోలేకపోతున్నానని ఎస్వీనగర్కు చెందిన మోహన్రావు వాపోయారు. మరికొందరు ఉదయం 7 గంటలకు టిఫిన్ తీసుకొని వచ్చి పింఛన్ల డబ్బుల కోసం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ తిప్పలు తప్పాలంటే తమకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చూడాలని ఉన్నతాధికారులను లబ్ధిదారులు కోరుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఫించన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారని మున్సిపాలిటీల్లోనూ ఇది అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆన్ ది ఎర్త్ ఇక లేరు
Oldest Woman Kane Tanaka Dies: ప్రపంచంలో అత్యధిక వయసుతో పేరుబడ్డ వ్యక్తి ఇక లేరు. జపాన్కు చెందిన 119 ఏళ్ల కేన్ టనాకా.. సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. జనవరి 2, 1903లో పుట్టిన కేన్ టనాకా.. 2019లోనే ఈ భూమ్మీద అత్యధిక వయసున్న వ్యక్తిగా అధికారికంగా రికార్డుల్లో ఎక్కారు. పశ్చిమ జపాన్లోని ఫుకువా నగరంలోని ఓ ఆస్పత్రిలో వృద్ధాప్య రిత్యా సమస్యలతో ఆమె కన్నుమూసినట్లు ఒక ప్రకటన వెలువడింది. ఇదిలా ఉండగా.. జపాన్లో వందేళ్లు దాటుతున్న వృద్ధుల సంఖ్య సుమారు 85 వేలమందికి పైనే ఉంది. ప్రపంచంలోనే ఇదొక రికార్డు. ఇందులో ప్రతీ పది మందిలో తొమ్మిది మంది ఆడవాళ్లే ఉంటున్నారు. వాళ్ల ఆరోగ్య రహస్యాలపై, జీవన శైలిపై పరిశోధనలూ జరుగుతున్నాయి కూడా. -
61.03 లక్షల మందికి 1 నుంచి పింఛన్లు
సాక్షి, అమరావతి: ఏప్రిల్ రెండో తేదీ ఉగాది పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో పింఛనుదారులందరికీ 1న పింఛన్ చేతికందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 61,03,530 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రెండు రోజుల ముందే రూ.1,551.15 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం ఉదయం నుంచే లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. వలంటీర్ల ఆధ్వర్యంలో 1న తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టి, సాయంత్రంలోగా కనీసం 90 శాతం మందికి డబ్బులు చేరవేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చదవండి: రాయచోటి.. ప్రత్యేకతల్లో మేటి -
కరోనా కష్టకాలంలో వృద్ధులపై పెరిగిన వేధింపులు
-
‘వృద్ధులకు వ్యాక్సిన్ను రెండురోజుల్లో పూర్తి చేస్తాం’
సాక్షి, అమరావతి : ఆధార్కార్డు లేని వృద్ధులకు వ్యాక్సినేషన్కు సంబంధించిన సుమోటో కేసును ఏపీ హైకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ.. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లోని ఆశ్రమాల్లో వృద్ధులకు వ్యాక్సిన్ పూర్తి చేశామన్నారు. మరికొన్ని జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లో వ్యాక్సినేషన్ మొదలు పెట్టామన్నారు. వృద్ధులకు వ్యాక్సిన్ను రెండురోజుల్లో పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు. హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
Tamil Nadu: సొంత ఇళ్లు.. ఆటోలో వచ్చి అడుక్కుంటారు!
కరోనా సమయంలో రోడ్ల మీద కష్టాలు పడుతున్న భిక్షగాళ్లను ఆదుకునేందుకు సిద్ధమైన పోలీసులకు పెద్ద షాక్ తగిలింది. యాచకుల్లో ఒకరు.. సొంతంగా తనకున్న ఇళ్లను అద్దెకిచ్చి.. భిక్షాటన చేస్తున్నట్లు చెప్పగా, ఇంకొకరు తన వద్ద నోట్ల కట్టలున్నాయని చెప్పడంతో ఖాకీలు అవాక్కయ్యారు. సాక్షి, చెన్నై : కరోనా కష్టాలు ఎవర్నీ వదలి పెట్ట లేదు. అన్ని వర్గాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్ల మీద , బస్టాండ్లలో తలదాచుకుని భిక్షాటనలో ఉన్న వారు ఎదుర్కొంటున్న కష్టాల్ని పరిగణించి నాగర్ కోయిల్ పోలీసులు, కార్పొరేషన్ వర్గాలు సేవలకు సిద్ధం అయ్యారు. ఆ దిశగా మంగళవారం నుంచి నాగర్ కోయిల్లో ఉన్న భిక్షగాళ్లను ఆశ్రమానికి తరలించే పనిలో పడ్డారు. వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్ రావడంతో కలవరం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయాన్నే బస్టాండ్ ఆవరణలో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, దివ్యాంగులు స్థానిక పోలీసుల వద్దకే వెళ్లి అన్నం పొట్లాలు ఇప్పించాలని వేడుకున్నారు. దీంతో వీరందర్నీ పోలీసులు విచారించి కొంతకాలం ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించారు. ఈక్రమంలో వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆటోలో వచ్చి మరీ.. ఈ సమయంలో నలుగురు భిక్షగాళ్లు అక్కడి నుంచి జారుకునే యత్నం చేశారు. దీనిని గుర్తించిన పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది మందలించారు. ఈసమయంలో ఓ భిక్షగాడు అయితే, తాను ఆశ్రమానికి వెళ్లే ప్రసక్తే లేదని, తనకు సొంతంగా ఇళ్లు ఉన్నాయని, వాటిలో కొన్నింటిని అద్దెకు కూడా ఇచ్చి ఉన్నట్టు వెల్లడించారు. విచారణ చేపట్టిన పోలీసులు సొంతిళ్లను అద్దెకు ఇచ్చిన భిక్షగాడు నగర శివారు వరకు రోజు ఆటోలో వచ్చి, భిక్షాటన అనంతరం తిరిగి వెళ్లే వాడు అని తేలింది. దీంతో అతడ్ని తీవ్రంగా మందలించారు. మరోమారు చిక్కితే కటకటాల్లోకి నెడుతామని హెచ్చరించారు. మరో వృద్ధుడు అయితే, తన వద్ద రెండు నోట్ల కట్టలు ఉన్నాయని, ఇదంతా భిక్షాటనతో తాను సంపాదించినదిగా వెల్లడించారు. మూడో వ్యక్తి వద్ద రూ. 3500 నగదు, పొడవైన కత్తి బయట పడింది. విచారించగా అతడు రామనాథపురంకు చెందిన కుమార్గా తేలింది. రాత్రుల్లో కొందరు గంజాయి మత్తులో వచ్చి వేధిస్తున్నారని, వారి నుంచి ఆత్మరక్షణ కోసం ఈ కత్తి పెట్టుకున్నట్టు పేర్కొనడంతో పోలీసులు విస్తుపోయారు. మిగిలిన వారు కూడా వివిధ కారణాలతో ఆశ్రమానికి వెళ్లేందుకు సమ్మతించలేదు. దీంతో వారికి పోలీసులు అవగాహన కల్పించారు. అందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. చదవండి: గోల్డ్ స్కామ్లో కీలక మలుపు: ప్రధాన సూత్రధారి అరెస్ట్ -
కన్న ఒడి.. కన్నీటి తడి!
సాక్షి, హైదరాబాద్: జీవన సంధ్యాసమయంలో పేగు బంధం తల్లడిల్లలేదు. వృద్ధాప్యంలో ఒంటరి బతుక్కు ఊతమవ్వలేదు. చిన్నప్పుడు చంటి పాపలను కంటిపాపలుగా చూసిన ఆ కళ్లు చెమ్మగిల్లితే తుడవనూలేదు. చేయి పట్టి నడిపించిన ఆ చేతులను చేరదీయలేదు. బుక్కెడు బువ్వ పెట్టి కడుపు నింపేవారే దూరంగా వెళ్లిపోయారు. బిడ్డలను నమ్ముకున్న ఆ తల్లులకు చివరికి కన్నీరే మిగిల్చారు. రెక్కలొచ్చి ఎక్కడికో వెళ్లిపోయారు. రెక్కలు అలసి ఆ మాతృమూర్తులు ఒంటరి వారయ్యారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్డునంబర్– 10లోని ఫుట్పాతే ఇద్దరు అమ్మలకు ఆశ్రయంగా మారిన వ్యథార్థ జీవన యథార్థ గాథ ఇది. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద కేబీఆర్ పార్కును ఆనుకొని ఉన్న ఫుట్పాత్పై ఇద్దరు ‘అమ్మ’లు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కష్టాల పాలవుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దొడుకొండపల్లికి చెందిన కాశమ్మ (60)కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఆమె కుటుంబం 25 ఏళ్ల క్రితమే బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చింది. కూలిపనులు చేస్తుండేవారు. కొన్నేళ్ల కిందట కాశమ్మ భర్త చనిపోయరు. కుమారులు, కుమార్తెకు వివాహాలయ్యాయి. వేర్వేరుగా బతుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మొదటి దశ కరోనా సమయంలోనే పనులు లేక తలోదారి పట్టారు. కొడుకులిద్దరూ తల్లిని వదిలేసి వెళ్లిపోయా రు. కాశమ్మ ఒంటరిదైంది. కూతురు కూడా చూసే పరిస్థితి లేదు. ఒంటరిగా మారిన కాశమ్మ ఫుట్పాత్నే ఆశ్రయంగా చేసుకుంది. దారిన పోయేవారు ఇంత తిండిపెడితే కడుపు నింపుకొంటోంది. వెంకమ్మది మరో దీనగాథ.. నెల్లూరు జిల్లా మొల్కురుకు చెందిన వెంకమ్మ (60)కి ఓ కుమారుడున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నం.10లోని సింగాడికుంటలో ఉంటున్నాడు. కరోనా కష్టకాలంలో కొడుకును చూద్దామని వెంకమ్మ నగరానికి ఇటీవల వచ్చింది. తమకే కడుపుకింత తిండిలేక సతమతమవుతున్నామని నువ్వు మాకు భారమంటూ కొడుకు ముఖం మీదే చెప్పి పంపించాడు. వెళ్లడానికి దారి ఖర్చులు లేకపోవడంతో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద అన్నం పెడుతున్నారంటే వచ్చింది. ఇక ఇక్కడే ఆశ్రయం ఏర్పాటు చేసుకుంది. కాశమ్మతో పాటు తనూ ఉంటోంది. తమ కష్టాలు పంచుకుంటున్నారు. కాగా.. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద ఫుట్పాత్పై సుమారు 150 మంది వరకు నిరాశ్రయులు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరైనా ఇంత తిండిపెడితేనే వీరి కడుపు నింపుకొంటున్నారు. ఆదుకోని నైట్షెల్లర్లు జీహెచ్ఎంసీ సర్కిల్– 18 పరిధి కిందకు వచ్చే ఈ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ఫుట్పాత్లపై ఆశ్రయం పొందుతున్నారు. రాత్రిపూట వీటిపైనే నిద్రిస్తున్నారు. ఎవరైనా ఇంత అన్నం పెడితే తింటూ కాలం గడుపుతున్నారు. కనీసం వృద్ధులనైనా నైట్ షెల్టర్లలోకి చేర్చాల్సిన బాధ్యతను అధికారులు మర్చిపోయారు. – బంజారాహిల్స్ -
ధైర్యే సాహసే.. ఆరోగ్యం: కరోనా భయాన్ని జయించిన వృద్ధులు
వైద్యుల ఆత్మీయ స్పర్శే ప్రాణం నిలిపింది కరోనా సోకిందని తెలియగానే ఆందోళన చెందాను. కుటుంబసభ్యులు కూడా ఇబ్బందిపడ్డారు. కానీ, నేను మాత్రం మనోస్థైర్యం తో ఉన్నా. 90 ఏళ్లకు వచ్చాను. ఇప్పుడేదైతే అదే అవుతుందని భావించాను. ఈ నెల ఐదో తేదీన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)లో చేరాను. వైద్యసిబ్బంది ఎంతో ప్రేమగా చూసుకున్నారు. వేళకు ఆహారం, మందులు ఇచ్చారు. ఆరోగ్యంగా ఇంటికి చేరాను. వారి ఆతీ్మయస్పర్శే నాకు పునర్జన్మను ప్రసాదించింది. – మాణిక్యమ్మ(90), నేదునూరు, కందుకూరు మండలం, రంగారెడ్డి మానసిక ప్రశాంతతతో ఎదుర్కొన్నాను నా పేరు నాగమణి, నాకు 73 ఏళ్లు. జ్వరం, జలుబు ఉండటంతో ఏప్రిల్ 15న నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచి్చంది. తొలుత భయాందోళనకు గురైనా పాజిటివ్గా ఆలోచిస్తూ కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడటం, ఆవిరి పట్టడం, వేళకు ట్యాబ్లెట్లు వేసుకోవడంతోపాటు తేలికపాటి వ్యాయామాలు చేశాను. బలవర్థకమైన ఆహారం తీసుకున్నాను. హోం క్వారంటైన్ అనంతరం టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచి్చంది. – నాగమణి, పార్శిగుట్ట భయపడలేదు నాకు పదిరోజుల క్రితం దగ్గు, జలుబు, ఒంటినొప్పులు, ఆయాసం వంటి సమస్యలు మొదలయ్యాయి. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంట్లో వాళ్లంతా ఆందోళన చెందినా నేను భయపడలేదు. తొలుత ఫీవర్ ఆస్పత్రిలో చేరాను. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో మరునాడు కొత్తపేటలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేరాను. ప్రస్తుతం ఏ సమస్యా లేకపోవడంతో గురువారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. – సత్యనారాయణ(88), హస్తినాపురం వారంరోజుల్లోనే ఇంటికి వచ్చిన.. నేను కె.రాములమ్మ. నాకు 92 ఏళ్లు. మాది గౌతంనగర్ డివిజన్ ఇందిరానెహ్రూనగర్. 15 రోజుల క్రితం కరోనా సోకింది. కుటుంబసభ్యులు స్థానికంగా ఉండే అంగన్వాడీ టీచర్ సహాయంతో అంబులెన్స్లో కింగ్కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. వారంపాటు చికిత్స తీసుకొని కరోనాను జయించి క్షేమంగా తిరిగి వచి్చన. నా రెండో కొడుకు స్వామిగౌడ్కు గత ఏడాది కరోనా సోకడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. – రాములమ్మ(92), గౌతంనగర్ ఏం చేశావ్, ఏం తిన్నావని అడుగుతుండ్రు నా పేరు పడాల రాములు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం. 17 రోజుల కింద కాళ్ల నొప్పులు, కొద్దిగా జ్వరం వచ్చింది. పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. ఇంట్లోనే ఉంటూ రోజూ మూడు పూటలా ఆవిరిపట్టాను. డాక్టర్ చెప్పినట్టు ఉదయం, సాయంత్రం గుడ్లు తిన్నా. ప్రభుత్వ దావకాండ్ల ఇచ్చిన మందులతోనే 14 రోజుల తర్వాత కరోనాను జయించాను. చాలామంది వచ్చి ఏ చేశావ్, ఏం తిన్నావని అడుగుతుండ్రు. ధైర్యంగా ఉంటే కరోనా చంపే రోగమేమీకాదు. – పడాల రాములు(80) భయమే ప్రాణాంతకం ‘మాది కోనరావుపేట మండలం నిమ్మపల్లి. పక్షంరోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లాం. అక్కడ నాతోపాటు ఇద్దరు కొడుకులకు కరోనా అంటింది. అయినా భయపడలేదు. ఇంట్లోనే ఉంటూ డాక్టర్లు ఇచి్చన మాత్రలు వేసుకున్నాం. నాకు ఒకరోజు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ బెడ్లు ఖాళీ లేవనడంతో ఇంటికి వచ్చి మందులు వాడిన. ధైర్యంగా ఉండి కరోనా నుంచి కోలుకున్నాను. భయమే ప్రాణాంతకం. అందుకే భయపడొద్దు. – విక్కుర్తి నర్సయ్య(96) గుండె ధైర్యం రక్షించింది నా పేరు బద్దం వెంకటరెడ్డి. మాది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సి). జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు రావడంతో కురవిలో పరీక్ష చేయిస్తే కరోనా నిర్ధారణ అయింది. ఇంట్లోనే ఉంటూ ఆశ కార్యకర్త, ఏఎన్ఎంలు ఇచ్చిన మందులు వాడాను. ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే నా కొడుకు చెప్పిన సూచనలు పాటించాను. పౌష్టికాహారం తీసుకుంటూ రోజూ ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చునేవాడిని. ఈ సమయంలోనే సూర్యాపేటలో ఉండే నా కుమార్తె కన్నుమూసింది. నాకు కరోనా ఉండటంతో కుమార్తెను కడసారి చూడలేకపోయాను. ఈ బాధ ఉక్కిరిబిక్కిరి చేసినా గుండెధైర్యంతో ఉండి కోలుకున్నా. – బద్దం వెంకటరెడ్డి(78), కొత్తూరు(సి), మహబూబాబాద్ జిల్లా వందేళ్ల బామ్మ.. ఇంట్లోనే కోలుకుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు యాళ్ల సీతారామమ్మ. వయసు వందేళ్లు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన ఈమెకు గత నెల 20న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోమ్ ఐసోలేషన్లో ఉంటూ.. సకాలంలో మందులు, సరైన ఆహారం తీసుకుంటూ, వైద్యుల సలహాలు పాటించడంతో ఆమె కరోనాను జయించారు. ప్రస్తుతం ఆక్సిజన్ స్థాయి 97 నుంచి 98 ఉంటోందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈమె ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులకు స్వయానా పెద్దమ్మ కావడం విశేషం. – సారవకోట (శ్రీకాకుళం జిల్లా) -
అక్కడ సమయానికి వడ్డీ కూడా ఇస్తారు.. ఎలాగంటే!
స్విట్జర్లాండ్కి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇటీవలి కరోనా కాలంలో కూడా ఆ దేశంలో ఒక్క కేసు కూడా రాకుండా జాగ్రత్తపడ్డారు. అన్ని విషయాలలోనూ కొత్తగా ఆలోచిస్తారు ఆ దేశీయులు. ఏ ఆసరా లేని వృద్ధుల గురించి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టారు. అదే ‘టైమ్ బ్యాంక్ ’ స్కీమ్. ఒంటరిగా, కుటుంబ సభ్యుల సహకారం లేకుండా నివసిస్తున్న సీనియర్ సిటిజెన్లకు అండగా నిలబడటానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. స్విట్జర్లాండ్లో ఒక పాఠశాల దగ్గర 67 సంవత్సరాల ఒంటరి మహిళ ఉండేవారు. ఆవిడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైరయ్యారు. తనకొచ్చే పెన్షన్తో ఆవిడ హాయిగా కాలం గడపవచ్చు. కాని ఆమె ఖాళీగా కూర్చోవటానికి ఇష్టపడలేదు. తనకంటె 20 సంవత్సరాలు ఎక్కువ వయసున్న ఒక వృద్ధురాలికి సేవ చేసే పనిలో కుదిరారు. డబ్బు కోసం పనిచేయవలసిన అవసరం లేదు ఆమెకకు. తన సమయాన్ని టైమ్ బ్యాంకులో దాచుకోవటానికి పనిచేశారు. అక్కడే మొదలు.. టైమ్ బ్యాంక్ను స్విట్జర్లాండ్లోని ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. అక్కడి ప్రజలు యవ్వనంలో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు... నిస్సహాయులైన వృద్ధులకు సేవలందిస్తూ, సమయాన్ని దాచుకొని, తిరిగి వారికి అవసరంలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు, ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. చక్కగా మాట్లాడే సంభాషణ నైపుణ్యం ఉండాలి. ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి కావలసిన సేవలు అందించగలిగే స్థితిలో ఉండాలి. వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలో ‘సామాజిక భద్రత మంత్రిత్వశాఖ’ జమ చేస్తుంది. అలా ఆ 67 సంవత్సరాల మహిళ వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలు అందించటానికి వెళ్లేవారు. వారి గదుల్ని శుభ్రం చేయటం, వారికి కావలసిన సరుకులు తేవటం, వారికి ఎండలో స్నానం చేయటానికి సహకరించటం వంటి పనులకు సహాయపడేవారు.. కొద్దిసేపు వారితో సరదాగా ముచ్చటించటానికి సమయం కేటాయించేవారు. వారు దరఖాస్తులో చేసుకున్న ఒప్పందం ప్రకారం. సంవత్సరం తర్వాత ‘టైమ్ బ్యాంక్’ వారు ఆమె సేవాకాలాన్ని లెక్కించి, ‘టైమ్ బ్యాంక్ కార్డు’ జారీ చేసింది. ఆమెకు ఇతరుల సహాయం అవసరం ఉన్నపుడు తన కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఉంది. బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీ వచ్చినట్లుగానే, ఖాతాలో ఉన్న సమయాన్ని వడ్డీతో సహా తిరిగి వాడుకోవచ్చు. దరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపుతారు. ఒక టీచర్ తన అనుభవాన్ని, ‘‘ఒకరోజు నేను స్కూల్లో ఉన్నపుడు నాకు పిలుపు వచ్చింది. నేను అక్కడకు వెళ్లాను. ఆవిడ... తాను కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ మీద నుంచి జారిపడ్డానని చెప్పింది. నేను వెంటనే స్కూల్కి సెలవు పెట్టి, ఆవిడను ఆసుపత్రికి తీసుకువెళ్లాను. ఆవిడకు మడమ దగ్గర ఫ్రాక్చర్ అయ్యిందనీ, కొంతకాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలనీ చెప్పారు డాక్టర్. నేను కొన్ని రోజుల పాటు ఆవిడ ఇంటి దగ్గర ఉండటానికి సిద్ధపడ్డాను. అయితే ఆవిడ నన్ను దిగులుపడద్దని, అప్పటికే తాను టైమ్ బ్యాంక్కి దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. ఆసుపత్రిలో చేరిన రెండు గంటలకే, ఆవిడకు సేవలందించడానికి టైమ్ బ్యాంక్ వారు వాలంటీర్లను పంపారు. నెల రోజుల పాటు ఆ వాలంటీర్ ఆమె యోగక్షేమాలు చూసుకున్నారు. ఆమెకు ఇష్టమైన వంటకాలు తయారు చేసి పెట్టారు. మనసుకు ఉల్లాసం కలిగించేలా కబుర్లు చెప్పారు. సకాలంలో మంచి సేవలు అందటం వల్ల, త్వరగా కోలుకుని, తిరిగి తన పనులు తాను చేసుకోవటం మొదలుపెట్టారామె. తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి టైమ్ బ్యాంక్లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆవిడ’’ అని చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన టైమ్ బ్యాంకు సేవలను ఇప్పుడు స్విట్జర్లాండ్లో అందరూ ఆనందంగా వినియోగించుకోవటం సర్వసాధారణమైపోయింది. ఈ పద్ధతి వల్ల ఆ దేశంలో బీమా ఖర్చులు బాగా తగ్గాయి. అనేక సామాజిక సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయి. ఆ దేశప్రజలు ఈ విధానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. అక్కడ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఆ దేశ పౌరులలో సగం మంది పౌరులు టైమ్ బ్యాంకు విధులలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రభుత్వం ఈ విధానాన్ని చట్టబద్ధం చేసింది. ప్రస్తుతం ఆసియా దేశాల్లో ఒంటరి గూటి వృద్ధ పక్షుల సంఖ్య బాగా పెరిగిపోతుండటం వల్ల వారి సంక్షేమం ఒక సామాజిక సమస్యగా మారుతోంది. అన్ని దేశాల వారు స్విట్జర్లాండ్ ‘టైమ్ బ్యాంక్ ‘ విధానం గురించి ఆలోచన చేసి, టైమ్ బ్యాంకు విధానాన్ని ప్రవేశపెట్టి, చట్టబద్ధం చేస్తే మంచిదేమో. ఆలోచించాల్సిన విషయమే. టైమ్ బ్యాంకు... ఈ పేరు వినగానే ఇది ఏమిటి అనిపిస్తుంది. మన దగ్గరున్న డబ్బులు మనీ బ్యాంకులో వేస్తాం. ఆ బ్యాంకుల గురించి అందరికీ తెలుసు. అలాగే మనం చేసిన పని సమయాన్ని టైమ్ బ్యాంకులో వేస్తాం. అదే టైమ్బ్యాంక్. ఆ టైమ్ను, తను కదలలేని పరిస్థితుల్లో వినియోగించుకోవచ్చు. వినటానికి ఈ మాట కొత్తగా అనిపిస్తోందా. ఇది నిజం. స్విట్జర్లాండ్లో ఇప్పుడు అందరూ బాగా వినియోగించుకుంటున్న ఏకైక బ్యాంకు టైమ్ బ్యాంక్. -
మీసం తిప్పితే ఆ సంతోషమే వేరు
సాక్షి, కామారెడ్డి: ఆ ఊళ్లో అడుగు పెట్టగానే పెద్ద పెద్ద మీసాలతో ఉన్న పెద్దమనుషులు కనిపిస్తారు. యాభై ఏళ్లు దాటిన వాళ్లందరూ దాదాపు మీసం రాయుళ్లే. మీసాల గురించి ఎవరినైనా అడిగినా.. ‘మగోడు అన్నప్పుడు మీసం ఉండాలె. మీసం ఉంటేనే రోషం ఉంటది’ అనే సమాధానం వస్తుంది. ‘మా తండ్రి, తాత, ముత్తాతలు పెంచిండ్రు. మేం గూడ పెంచినం’ అంటారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి కలాన్లో దాదాపు 100 మందికి పైనే మీసం రాయుళ్లు ఉంటారు. పది మందిలో ఏడెనిమిది మందికి కచ్చితంగా మీసాలు ఉంటాయి. మగవాళ్లకు మీసాలు ఉండాలని, ఆ దర్పం వేరేగా ఉంటుందని వారు చెబుతున్నారు. కొందరైతే నలుగురిలో నిలబడినప్పుడు మీసాలను మెలేస్తుంటారు. ఆ ఊరికి కొత్తగా ఎవరొచ్చినా మీసం రాయుళ్లను ఆసక్తిగా చూస్తారు. తాము మాత్రం బతికున్నన్ని రోజులు మీసాలను కాపాడుకుంటామని చెబుతున్నారు. మీసం తిప్పితే ఆ సంతోషమే వేరు తాతల కాలం నుంచి మగవాళ్లందరూ మీసాలు పెంచుతున్నారు. మా తాత నుంచి మా తండ్రికి అబ్బింది. నాకు కూడా మీసం మీద అభిమానంతోని పెంచినా. ఇప్పటికీ మీసాలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. మీసం తిప్పితే ఆ సంతోషం వేరేగా ఉంటది. ఇప్పటోళ్లు మీసాలన్నీ గీకేసుకుంటున్నరు. – కడెం లస్మయ్య మా అన్నదమ్ములందరికీ మీసాలున్నయి మేం ఆరుగురం అన్నదమ్ములం. అందరికీ మీసాలు ఉన్నయి. మా తాతలు, తండ్రుల నుంచి మా అన్నలు అందరూ పెంచిండ్రు. ఆళ్లను చూసి నేను గూడ పెంచిన. మీసం ఉంటే అందరూ గొప్పగ జూస్తరు. మా ఊళ్లె చానా మంది మీసాలతోనే ఉంటరు. –బందంల అశోక్ -
నార్వేలో టీకా విషాదం.. 23 మంది మృతి
ఓస్లో: నార్వేలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. దాంతో నార్వే ప్రభుత్వం బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది. వివరాలు.. ఫైజర్ ఎన్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. వీరిలో 13 మందికి శవపరీక్షలు నిర్వహించగా.. టీకా తీసుకున్న తర్వాత వచ్చే సాధారణమైన దుష్ర్పభావాలు తలెత్తి.. అవి తీవ్రంగా మారి మరణించారని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనిపించే సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా బలహీనంగా ఉన్న వారిలో తీవ్రంగా మారాయన్నారు. (చదవండి: ‘వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం లేదు’) బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలతో ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని సూచించారు నార్వే అధికారులు. అతి తక్కువ జీవితకాలం ఉన్నవారు టీకా తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. వారికి టీకా అనవసరం అన్న అభిప్రాయాన్ని నార్వే ఆరోగ్య శాఖ వ్యక్తం చేసింది. ఆరోగ్యవంతులు, యువకులు టీకాను తీసుకోవచ్చు అని నార్వే ప్రభుత్వం తెలిపింది. ఇక తమ వ్యాక్సిన్ తీసుకుని 23 మంది మరణించిన ఘటనపై ఫైజర్ కంపెనీ విచారణ చేపడుతున్నది. టీకా వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య తక్కువగానే ఉందని, తాము ముదుగా అనుకున్న రీతిలో సంఘటనలు జరుగుతున్నట్లు ఫైజర్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇక ఇప్పటి వరకు నార్వేలో వైరస్ వల్ల రిస్క్ ఉన్న సుమారు 33 వేల మందికి టీకా ఇచ్చారు. 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఉండగా.. దాంట్లో మూడో వంతు మంది 80 ఏళ్లు దాటినవారే ఉన్నారు. -
మనోధైర్యమే మందు: ఓల్డ్ ఈజ్ గోల్డ్!
వందేళ్లు, 90 ఏళ్లు దాటినా... కరోనాను జయించిన వారియర్స్ వీళ్లు. మనోధైర్యమే ఆయుధంగా కరోనాను ఎదుర్కొన్నారు. అదే అసలైన మందు అంటున్నారు. ఇతర అనారోగ్య సమస్యలున్నా... టెన్షన్ పడలేదు. ఆందోళన పడతారని కరోనా సోకిన విషయాన్ని పిల్లలకు కూడా చెప్పని నిబ్బరం ఉన్నవాళ్లు కొందరు. ప్రశాంతంగా ఉంటూ, డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకొని బయటపడ్డారు.. ఈయన పేరు శుభ్ కరణ్ అర్హ. 102 ఏళ్ల శుభ్కరణ్కు అక్టోబర్ 24వ తేదీన కరోనా సోకింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారిగా కీలక పదవుల్లో పనిచేసి రిటైరైన సీడీ అర్హ తండ్రి. శతాధికుడైన తండ్రికి కరోనా రావడంతో సీడీ అర్హ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుభ్కరణ్ అర్హకు షుగర్, బీపీ వంటివి లేవు. జ్వరం, తీవ్ర జలుబు ఉండటంతో హోం ఐసో లేషన్లోనే ఉంచి చికిత్స చేశారు. ఒకసారి శ్వాసకోశ సమస్య ఎదురైనా అంతటి వయస్సులోనూ ఆయన గట్టెక్కారు. నవంబర్ రెండో తేదీన పరీక్షిస్తే ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది. కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. 102 ఏళ్ల వయస్సులోనూ శుభ్కరణ్ అర్హ ప్రతిరోజూ ఉదయం ఒక కిలోమీటర్, సాయంత్రం ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తారు. శాకాహారి. మధ్యాహ్నం ఒక చపాతి, రాత్రి ఒక చపాతి తీసుకుంటారు. ఎక్కువగా పండ్లు, సలాడ్లు తింటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రార్థనలు చేస్తారు. బీపీ, ఆస్తమా ఉంది... అయినా గట్టెక్కా ఆగస్టులో కరోనా వచి్చనట్లు తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు. కిమ్స్కు వెళ్లాను. చెస్ట్ స్కాన్ చేశారు. అక్కడ పది రోజులు ఉన్నాను. నాకు బీపీ, ఆస్తమా ఉంది. అయినా త్వరగా కరోనా నుంచి బయటపడ్డాను. కరోనా వచ్చింది ఏం చేస్తాం... అనుకున్నానే కానీ టెన్షన్ పడలేదు. నా పిల్లలకు కూడా చెప్పలేదు. ఏం చేస్తుందిలే అని ధైర్యంగా ఉన్నాను. డాక్టర్లు చెప్పినట్లుగా మందులు వేసుకున్నాను. అంతే కోలుకున్నాను. – జి.లలితకుమారి (90), హైదరాబాద్, సీఆర్ఫౌండేషన్ వృద్ధాశ్రమం బీపీ, షుగర్ ఉన్నా భయపడలేదు.. నాకు కూడా ఆగస్టులోనే కరోనా సోకింది. వైరస్ లోడ్ అంతగా లేదని డాక్టర్లు చెప్పారు. సమీపంలోని టిమ్స్లో జాయిన్ చేశారు. బీపీ, షుగర్ ఉన్నాయి. మందులు వేసుకున్నాను. ధైర్యంగా ఉన్నానంతే. అందువల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడలేదు. టిమ్స్లో వారం రోజులు ఉంచుకొని పంపించారు. – కాట్రగడ్డ అనసూయ (93),సీఆర్ ఫౌండేషన్,హైదరాబాద్ ప్లాస్మా ఎక్కించారు నాలుగు నెలల కిందట నాకు కరోనా వచ్చింది. వైరస్ నిర్ధారణకు ముందు జ్వరం వచి్చపోయేది. నాలుక పొక్కింది. పట్టించుకోలేదు. మందులు వాడాను. టెస్టు చేస్తే కరోనా అని తెలిసింది.ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది. షుగర్ ఉంది. టిమ్స్ ఆసుపత్రిలో ఉంచారు. ప్లాస్మా ఇచ్చారు. ఆరు రోజులు ఉన్నాను. టెన్షన్ పడలేదు. కరోనాకు ముందు రోజుకు 40 నిమిషాలు వాకింగ్ చేసేవాడిని. ఆసుపత్రి నుంచి వచ్చాక నీరసం ఉండేది. ఇప్పుడు బాగానే ఉన్నాను. – వెల్లంకి రామారావు (73), సీఆర్ ఫౌండేషన్ మనోధైర్యమే కారణం 90 ఏళ్లు... వందేళ్లు దాటిన వారు కూడా కరోనా నుంచి గట్టెక్కారంటే వారి మనోధైర్యమే ప్రధాన కారణం. పైగా త్వరగా వైరస్ను పసిగట్టడం, వెంటనే చికిత్స పొందడంతో వారంతా వైరస్ను జయించారు. ఆహారపు అలవాట్లు అత్యంత కీలకం. దాని కారణంగా రోగనిరోధక శక్తి బాగుంటుంది. దానికి తోడు మనోధైర్యం ఆరోగ్యకరంగా ఉండటానికి ప్రధానంగాతోడ్పడుతుంది. – డాక్టర్ కృష్ణ ప్రభాకర్, ఐసీయూ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్,సిటీ న్యూరో సెంటర్,హైదరాబాద్ -
మతిమరపు.. చికిత్స తియ్యతియ్యగా!
మానవుల్లో ఒక వయసు దాటాక మతిమరపు రావడం చాలా చాలా సాధారణం. పెద్ద వయసులో సాధారణంగా అల్జైమర్స్ వల్ల మతిమరపు రావడం ఎక్కువ. పైగా వృద్ధాప్యంలో దాపురించే అల్జైమర్స్ వ్యాప్తి కూడా ఇటీవల బాగా పెరిగింది. అయితే చాలా తియ్యని మార్గంలో, చాలా సహజసిద్ధమైన రీతిలో మతిమరపును ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ప్రతి రోజూ పరిమితమైన మోతాదులో తీసుకునే చాక్లెట్ వల్ల వృద్ధాప్యంలో వచ్చే మతిమరపు (డిమెన్షియా), అఅల్జైమర్స్ను నివారించవచ్చని పేర్కొంటున్నారు. చాక్లెట్లో ఉపయోగించే కోకో... అందులోని పోషకాల్లో ఒకటైన ఫ్లేవనాల్ వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందంటున్నారు వారు. ఇటీవల కొద్దికాలం కిందట ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ఎల్ అక్విలాకు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ గియోవాబాటిస్టా దేసిదెరి ‘‘మనం మితిమీరిన క్యాలరీలు తీసుకోకుండా పరిమితంగా కోకో ఉన్న చాక్లెట్లను తినడం వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది’’ అని పేర్కొన్నారు. అంతేకాదు... చాలా పరిమితంగా చాక్లెట్ డ్రింక్ (ఫ్లేవనాల్ డ్రింక్) తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. అందుకే వృద్ధాప్యానికి ముందరే చాలా పరిమితంగా చాక్లెట్లు తినడం మంచిదనే అంటున్నారు. అయితే చక్కెర వ్యాధి ఉన్నవారు మాత్రం ఈ విషయంలో ఒకసారి తమ మెడికల్ స్పెషలిస్ట్ను సంప్రదించాకే తాము తీసుకోగలిగే చాక్లెట్ మోతాదును నిర్ణయించుకోవడం మంచిదని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా చాక్లెట్లతో ఇన్ని మేళ్లు ఉన్నాయంటూ మితిమీరి తింటే మనకు ప్రయోజనం కలగకపోగా... ప్రతికూల ఫలితాలే ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. -
వారిపై హింస, అకృత్యాలు భారత్లోనే కాదు..
పెద్దవాళ్లను గౌరవించడం భారత సంస్కృతి నేర్పే తొలి పాఠం. ఇది ఎంతమంది బుర్రలకు ఎక్కిందో తెలియదు కానీ...ముదిమి మీదపడ్డ పండుటాకులను వీధులపై వదిలేసే వాళ్లను.. కని పెంచిన తల్లిదండ్రులను ఆస్తి కోసం, డబ్బు కక్కుర్తితో రకరకాల హింస పెట్టే వాళ్లనూ..మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. ప్రభుత్వాలా పట్టించుకోవు.. న్యాయస్థానాలు అప్పుడప్పుడు కొరడా ఝళిపిస్తాయి కానీ.. మళ్లీ అవే ఘటనలు.. అందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితులు! ఇదంతా ఎందుకంటే... ఈ అంశంపై అవగాహన ఎంత పెరిగితే..పండుటాకులకు అంత మేలు కాబట్టి! పైగా రేపు వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే కూడా! ప్రపంచమంతా ఇదే తీరు.. వృద్ధులపై హింస, అకృత్యాలు ఒక్క భారత్కే పరిమితం కాదు. ప్రపంచమంతా ఇదే తీరు. 2017 నాటి లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అరవై ఏళ్ల పైబడ్డ ప్రతి ఆరుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన హింస, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ (ఐఎన్పీఈఏ) 2006లో ఏటా జూన్ 15న ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. ఐక్యరాజ్యసమితి దీన్ని 2011లో గుర్తించింది కూడా. ఐరాస సభ్యదేశాలు, పౌర హక్కుల సంఘా లు, స్వచ్ఛంద సంస్థలు ఈ సమస్య పరిష్కారానికి తమదైన రీతిలో కృషి చేయాలని ఐరాస పిలుపునిచ్చింది. 2017లో సుమారు 28 దేశాల్లో నిర్వహించిన 52 అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. ఆరవై ఏళ్లపైపడ్డ వారిలో 15.7 శాతం మంది ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్నారు. మానసిక హింస అంటే తిట్టడం, చులకన చేయడం వంటివి సుమారు 11.6%మంది.. వృద్ధుల సొమ్ము లాగేసుకోవడం, దొంగిలించడం వంటివి 6.8% మంది ఎదుర్కొంటున్నారు. ఇక నిర్లక్ష్యానికి గురయ్యే వారు 4.2% కాగా, కొట్టడం, గాయపరచడం వంటివి ఎదుర్కొంటున్న వారు 2.5% మంది. ఇవి చాలవన్నట్లు దాదాపు ఒక శాతం వృద్ధులు లైంగిక హింసనూ ఎదుర్కోవాల్సి వస్తుండటం శోచనీయమైన అంశం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వయోవృద్ధులపై హింస ఘటనలు అందరికీ తెలిసే అవకాశాలు చాలా తక్కువ. హింసకు పాల్పడే వాళ్లు ఎక్కువగా కుటుంబ సభ్యులే కావడం ఒక కారణం. ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగానూ వృద్ధులపై హింసాత్మక ఘటనలు పెరిగిపోవడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల చాలాచోట్ల వారి ఆదాయం, పెన్షన్లు కూడా తగ్గిపోతున్నట్లు సమాచారం. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లపైబడ్డ వారి సంఖ్య కనీసం 200 కోట్లకు చేరుకుంటుందని, వృద్ధుల హక్కుల రక్షణకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోని పక్షంలో వారిపై హింస మరింత పెరిగే అవకాశముందని ఐరాస హెచ్చరిస్తోంది. ఇవన్నీ ఆ వర్గంలోనే... 1. భౌతిక హింస.. కొట్టడం, తన్నడం, తోసేయడం, తగు రీతిలో ముందులు వాడకపోవడం, పరిమితులు విధించడం. 2. మానసిక, ఎమోషనల్ హింస.. తిట్టడం, బెదిరించడం, అగౌరవపరచడం, నిర్బంధించడం, ఏకాంతంలో ఉంచడం, కట్టడి చేయడం. 3. లైంగిక హింస.. అనుమతి లేకుండా లైంగిక చర్యలకు పాల్పడటం 4. ఆర్థిక పీడన.. వృద్ధుల ఆస్తులు, సొమ్మును దుర్వినియోగం చేయడం, తస్కరించడం. 5. నిర్లక్ష్యం చేయడం, వదిలేయడం... కూడు, గూడు, నీడ కల్పించకపోవడంతోపాటు వైద్యం అందించకపోవడం. ఈ సంఘటనలు ఒక్కసారి కాకుండా పదే పదే జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. వృద్ధులపై హింస ప్రధానంగా రెండు వర్గాల నుంచి ఎదురవుతోంది. వృద్ధులపై హింస ప్రధానంగా రెండు వర్గాలనుంచి ఎదరవుతోంది ఒకటి : కుటుంబ సభ్యులు.. రెండు : 90 శాతం మంది ఆరోగ్యసేవలు అందించేవాళ్లు (నర్సులు, ఆసుపత్రి సిబ్బంది) ఈ అంశానికి సంబంధించిన సమాచారం చాలా తక్కువ. అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. నర్సింగ్ హోమ్లు, ఆసుపత్రుల్లోనూ ఈ హింస ఎక్కువగానే ఉంది. ఫిర్యాదులు 4 శాతమే ఎందుకు? వృద్ధులు తమపై జరిగే హింసపై ఫిర్యాదు చేసేది చాలా తక్కువ. అవమానంగా భావించడం ఇందుకు ఒక కారణమైతే, ఫిర్యాదు చేస్తే ప్రతి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం రెండోది. అలాగే తమను హింసించిన వారు (కుటుంబ సభ్యులు) సమస్యల్లో చిక్కుకుంటారన్న ఆందోళన, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడం కూడా కారణాలే. సగం దేశాల్లో వ్యవస్థలే లేవు... వృద్ధులపై జరిగే హింసను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉండగా... 60 శాతం దేశాల్లో ఇలాంటి ఏర్పాట్లే లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కేవలం 17 శాతం దేశాలు తమ దేశాల్లో వృద్ధుల పరిస్థితి ఏమిటన్న విషయంపై సర్వే నిర్వహించాయి. భారత్లో ఏజ్వెల్ ఇండియా అనే సంస్థ కొంత కాలం క్రితం ఈ అంశంపై ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం వృద్ధులపై హింసకు సామాజిక, ఆర్థిక స్థాయిలకు సంబంధం లేదు. అన్ని వర్గాల కుటుంబాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు... సుమారు 71% వృద్ధులు తమ కుటుంబ సభ్యులు, బంధువుల చేతుల్లోనే హింసకు గురవుతున్నారు. అవహేళనకు గురవుతున్నారు. కుటుంబం ఆర్థిక స్థితి, ఇరుకిరుకు ఇళ్లు, వ్యక్తిగత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు వృద్ధులపై హింసకు ప్రధాన కారణాలుగా ఈ సర్వే గుర్తించింది. పడిపోతున్న నైతిక విలువల మాట సరేసరి అని చెప్పింది. వృద్ధులపై భౌతిక హింస కారణంగా అమెరికాలోనే ఏటా దాదాపు 53 లక్షల డాలర్ల వ్యయం అవుతున్నట్లు ఒక అధ్యయనం స్పష్టం చేసింది. నిజానికి ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉంది. ఆరోగ్య రంగంతోపాటు ఇతర రంగాల్లోనూ సామాజికంగా, ఆరోగ్యపరంగా జరిగే నష్టాన్ని వివరించడం ఇందులో ఒకటి. అలాగే వృద్ధులపై హింసను ప్రజారోగ్య సమస్యగా గుర్తించడంతోపాటు ఏదైనా సమస్య ఎదురైతే సంప్రదించేందుకు వీలుగా ఒక అధికారిని నియమించడం, హింస నివారణకు తగిన చట్టాలు చేయడం, చర్యలు తీసుకోవడం కూడా ప్రభుత్వాల బాధ్యతే. భారత్లో పరిస్థితి కొంత మెరుగు! భారత్లో ప్రస్తుతం అరవై ఏళ్ల పైబడ్డ వారు సుమారు పది కోట్ల మంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. జీవన ప్రమాణాలు, ఆరోగ్య సౌకర్యాలు పెరుగుతున్న కారణంగా 2030 నాటికి దేశంలో వృద్ధుల సంఖ్య 38 శాతం పెరుగుతుందని అంచనా. వీరిపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వృద్ధులను కాపాడేందుకు కొద్దోగొప్పో చట్టాలను చేసింది కూడా. 2017లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం హింసకు దిగుతున్న పిల్లలను ఇంట్లోంచి వెళ్లగొట్టే అధికారం తల్లిదండ్రులకు సంక్రమించింది. ఆస్తి సొంతానిది కాకపోయినా, చట్టపరంగా అధీనంలో ఉన్నదైతే చాలు. ఈ చట్టం కారణంగా చాలామంది వృద్ధులకు సొంతిల్లు లేదా తమ అధీనంలో ఉన్న ఇంట్లోనే బిడ్డల దయాదాక్షిణ్యాలపై ఉండాల్సిన అవసరం తప్పుతుంది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ విషయంపై భారత ప్రభుత్వం 2007లో చేసిన చట్టం కూడా వృద్ధులను హింస నుంచి రక్షించేదే. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులదని 2007నాటి చట్టంలో పేర్కొనగా 2013లో పోషణ విషయమైన తల్లిదండ్రులు సంతానానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయవచ్చునని సవరించారు. 2018లో ఇంకో సవరణ చేస్తూ పోషణభారం కేవలం కొడుకులు, కోడళ్లపైనే కాకుండా కూతుళ్లు, అల్లుళ్లకూ ఉంటుందని కూడా విస్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జిల్లాలోనూ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు, నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఈ చట్టం అనుమతిచ్చింది. తల్లిదండ్రులు తమ నెలవారీ ఖర్చుల కోసం సంతానానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఈ చట్టం కల్పిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించిన పిల్లలకు రూ.ఐదు వేల వరకూ జరిమానా, 3 నెలల జైలుశిక్ష, లేదా రెండు శిక్షలు కలిపి విధించవచ్చు. ఈ చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వృద్ధులు హింసను సహిస్తున్నారని అంచనా. -
వృద్ధ దంపతుల సజీవ దహనం
సాక్షి, నెక్కొండ: ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన భూక్య ధస్రు(68), బాజు(65)లు అనుమానాస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవదహనం అయ్యారు. ఈ క్రమంలో వారు నివసిస్తున్న ఇల్లు సైతం మంటలకు ఆహుతైంది. స్థానికులు సమాచారం అందించడంతో నెక్కొండ ఎస్సై నవీన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించన వివరాలు అడిగి తెలిసుకున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. -
పింఛన్ కోసం ఎదురుచూపులు
రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామని, లబ్ధిదారుల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించి ఆసరా పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా ప్రభుత్వం పాత లబ్ధిదారులకు రెట్టింపు పింఛన్లు అందజేస్తున్నా.. 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు వయస్సు కుదింపు విషయంలో నేటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకంలో వయస్సు కుదించిన తమకు పింఛన్ అందజేయాలని వారు కోరుతున్నారు. సాక్షి, తుంగతుర్తి: ఆసరా పథకంలో భా గంగా వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల వయోపరిమితిని కుదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించినా నేటికీ అమలుకు నోచుకోవడంలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ .. పింఛన్లు పెంచడంతో పాటు లబ్ధిదారుల వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత, నేత కార్మికులు, బోధకాలు ఉన్న వారికి ఇస్తున్న పింఛన్లను రూ.1000 నుంచి రూ.2016లకు, వికలాంగుల పింఛన్లు రూ.1500 నుంచి రూ.3016లకు పెంచిన విషయం తెలిసిందే. వయస్సు కుదించిన లబ్ధిదారులకు జూన్–2019 నుంచి పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా... వృద్ధాప్య పింఛన్ల అర్హత, వయోపరిమితి విషయంలో ఇంత వరకు నిర్ణయం తీసుకోకపోవడంతో కొత్తగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు నిరాశ చెందుతున్నారు. తమకు పింఛన్ వస్తుందన్న నమ్మకంతో అర్హులైన లబ్ధిదారులు అన్ని పత్రాలను తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ముందు ప్రభుత్వంపై పడే అదనపు భారాన్ని లెక్కించేందుకు 57ఏళ్లు నిండిన పేద వృద్ధుల జాబితాను రూపొందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు తాత్కాలికంగా ప్రాథమిక సర్వే నిర్వహించి జాబితాను సిద్ధం చేశారు. ప్రాథమిక సర్వే ద్వారా అర్హుల గుర్తింపు.. వృద్ధాప్య పించన్ల కోసం జిల్లాల్లో 57ఏళ్లు నిండిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని వీఆర్ఓలు గ్రామాల్లో ప్రాథమిక సర్వేను నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో చేపట్టిన ప్రాథమిక సర్వేలో 30,373 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి సంబంధిత అధికారులు నివేదక అందజేశారు. 5నెలల క్రితమే ఈ ప్రక్రియను వీఆర్ఓలు పూర్తిచేసినా నేటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అర్హులైన లబ్ధిదారులు తమకు పింఛన్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ దారులకు కుదించిన వయోపరిమితి విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని తమకు పింఛన్లు అందజేయాలని వృద్ధులు కోరుతున్నారు. జిల్లాలో ఇలా.... జిల్లాలో ఇప్పటికే పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు 1,37,479 మంది ఉన్నారు. వీరికి జూలై 2019 నుంచి ఆసరా కింద రెట్టింపు మొత్తాన్ని అందజేస్తోంది. దివ్యాంగులకు రూ.1,500 నుంచి రూ.3,016లకు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతకార్మి కులు, చేనేత తదితర లబ్ధిదారులకు రూ.1,000 నుంచి రూ.2,016లకు ప్రభుత్వం పింఛన్లను పెంచింది. కాగా జిల్లాలో ప్రస్తుతం మొత్తం 1,37,479 మంది లబ్ధిదారులు ఉండగా, కొత్తవారు మరో 30,373 మంది ఉన్నారు. దీంతో జిల్లాలో మొత్తం ఆసరా పింఛన్ దారుల సంఖ్య 1,67,850 మందికి చేరనుంది. ఆదేశాలు రాగానే పింఛన్లు అందజేస్తాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలో 57ఏళ్లు నిండిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వేచేసి తాత్కలిక జాబితాను సిద్దం చేశాం. సర్వేలో జిల్లాలో 30,373 మంది ఉన్నట్లుగా గుర్తించాం. వీరికి ప్రభుత్వం నుంచి ఆదేశాల రాగానే పింఛన్లు అందజేస్తాం. – కిరణ్కుమార్, డీఆర్డీఏ పీడీ, సూర్యాపేట -
వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే జైలుశిక్షే..
సాక్షి, ఖమ్మం : ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చెదిరిపోవడంతో పెద్దవారిని కుటుంబం గమనించడం తగ్గిపోయింది. ఫలితంగా పెద్దలు ప్రత్యేకించి వితంతువులు వారి జీవనసంధ్యా కాలం ఒంటరిగానూ, భౌతికంగా, ఆర్థికంగా ఏ ఆసరా లేకుండా గడపాల్సి వస్తోంది. వయసు మీరడం అనేది ప్రధానమైన సామాజిక మార్పునకు దారితీస్తుంది. పెద్దవారి సంరక్షణకు వారి భద్రతకు శ్రద్ధ అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్లో 2007 ఏడాదిలో తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం అమలులోకి తెచ్చారు. చట్టంలోని సదుపాయాలు.. ఆస్తిని వారసత్వం ప్రకారం పొందే సంతానంపైన విధిగా బాధ్యతలు ఉంచింది. మెరుగైన వైద్యసదుపాయాలను వృద్ధులకు కల్పించడంతోపాటు వారి జీవనాన్ని, వారి ఆస్తులను సంరక్షించే సదుపాయాలను కల్పిస్తుంది. తల్లిదండ్రులతో సహా వృద్ధుడు తమ స్వార్జితం ద్వారా లేకపోతే తనకు గల ఆస్తి ద్వారా నిర్వహణ జరుపుకోలేనప్పుడు ఈ చట్టం సెక్షన్ 5 ప్రకారం షరతులకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు. వారి సంతానం తల్లిదండ్రుల అవసరాలను తీర్చేవిధంగా, వారు సాధారణ జీవనం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత ఉంది. వృద్ధుల నిర్వహణ కోసం నెలసరి వేతనాన్ని విడుదల చేస్తూ సంతానానికి లేనిపక్షంలో బంధువులకు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ట్రిబ్యునల్ నేర శిక్షా స్మృతి 1973 జుడీషియల్ అధికారాలు కలిగి, ప్రతివాదులు హాజరు కాని ఎడల కేసును ఏకపక్షంగా విచారిస్తుంది. సెక్షన్–7ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఉప డివిజనల్ అధికారి హోదా కలిగిన అధికారి ట్రిబ్యునల్ను నిర్వహిస్తారు. సంతానం, బంధువులు.. వృద్ధుల నిర్వహణలో నిర్లక్ష్యం, తిరస్కారాన్ని సెక్షన్ 9 వివరిస్తుంది. సదరు ఉత్తర్వు రాష్ట్ర ప్రభుత్వ నియమావళికి లోబడి నెలకు రూ.10వేలకు లోబడి ఉంటుంది. వృద్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. వృద్ధులు, తల్లిదండ్రులు ట్రిబ్యునల్ ఉత్తర్వు ద్వారా బాధించబడితే అప్పిలేట్ ట్రిబ్యునల్కు 60రోజుల్లోగా సెక్షన్ 16ను అనుసరించి దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అనువైన చోట్ల అవసరం ఉందని భావిస్తే జిల్లాకు ఒకటి చొప్పున వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసి కనీసం 150 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తుంది. సంరక్షణ, భద్రత కల్పించాల్సిన వృద్ధులను విడిచిపెట్టినా.. పరిత్యాగం చేసే విధంగా బుద్ధి పూర్వకంగా వ్యవహరించినా శిక్షార్హం. శిక్షా కాలం గరిష్టంగా 3నెలల జైలుశిక్ష, అపరాధ రుసుము గరిష్టంగా రూ.5వేలు, లేకపోతే రెండింటినీ విధించవచ్చు. సీనియర్ సిటిజన్లకు నల్సా స్కీమ్ –2016 ఈ చట్టం ప్రకారం వృద్ధులు న్యాయసేవాసంస్థలను ఆశ్రయించలేనప్పుడు ప్యానల్ లాయర్స్, పారా లీగల్ వలంటీర్ల సహాయంతో వారిని న్యాయసేవాసంస్థ వద్దకు తీసుకొచ్చి సమస్యలను పరిష్కరిస్తారు. ఆ మేరకు వారికి సంస్థ శిక్షణను ఇచ్చింది. న్యాయసేవాసంస్థ వృద్ధులను వారి కుమారులు అశ్రద్ధ చేయకుండా వారిలో చైతన్యం కలిగించేందుకు న్యాయసేవాసంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకుగాను ప్యానల్ లాయర్స్, పారా లీగల్ వలంటీర్లతో స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేశారు. 2017 ఏడాదిలో 47 క్యాంప్ల ద్వారా 880మంది వృద్ధులు లబ్ధిపొందారు. 2018లో 16 క్యాంపుల ద్వారా 1538మంది లబ్ధిపొందారు. 2019 ఏడాది ఇప్పటి వరకు 13 క్యాంపుల ద్వారా 1092 మందికి లబ్ధి చేకూర్చారు. శిక్షలు కఠినంగానే ఉంటాయి న్యాయసేవాసంస్థ ద్వారా వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వారికి వారసుల నుంచి ఆసరా కల్పించడానికి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అనేకమంది వృద్ధులకు చేయూతను అందించాం. న్యాయసేవాసంస్థ ద్వారా వృద్ధులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి, ఆస్తులను సంరక్షించే సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. – వినోద్ కుమార్, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి, ఖమ్మం -
‘ఓల్డ్’ భారతం!
దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) తగ్గుముఖం పడుతుండడం సరికొత్త ఆందోళనకు తెరలేపింది. తాజామార్పుల ద్వారా జనాభాలో చిన్నారులు, యువత శాతం తగ్గుముఖం పట్టి.. వృద్ధుల సంఖ్య రెట్టింపు కానుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే సంబంధిత గణాంకాలను విశ్లేషించింది. 2018–19 ఆర్థిక సర్వే విశ్లేషించిన వివరాల ప్రకారం.. వర్కింగ్ ఏజ్ గ్రూప్ మొత్తం జనాభాలో 59% వరకూ ఉండనుంది. టీఎఫ్ఆర్ తగ్గుతుండడంతో మొత్తం జనాభాలో 0–19 ఏళ్ల వయసు మధ్య గల జనాభా తగ్గుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2011లో ఈ గ్రూపులో ఉన్న జనాభా 41% ఉండగా.. 2041 నాటికి 25% పడిపోతుందని పేర్కొంది. అలాగే 60 ఏళ్ల పైబడిన జనాభా గ్రూపు పెరుగుతుందని వివరించింది. 2011లో వీరు 8.6% ఉండగా.. 2041 నాటికి 16 శాతానికి పెరగనుంది. 20–59 మధ్య ఉండే వర్కింగ్ గ్రూప్ జనాభా 59 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. – సాక్షి, న్యూఢిల్లీ వయసు వారీ జనాభా మార్పులపై ఆర్థిక సర్వే వెలువరించిన ముఖ్యాంశాలు తెలంగాణలో 0–19 మధ్య వయస్సు గల గ్రూపులో 2011లో 37% మంది ఉండగా.. 2021 నాటికి 30%, 2031 నాటికి 26%, 2041 నాటికి 23% శాతానికి తగ్గనున్నారు. అలాగే 20–59 మధ్య వయసున్న గ్రూపులో 2011లో 53.8% మంది ఉండగా.. 2021 నాటికి 59.4 శాతానికి, 2031 నాటికి 60.5 శాతానికి పెరగనున్నారు. 2041 నాటికి 58.8 శాతానికి తగ్గనున్నారు. ఇక 60 ఏళ్ల పైబడిన వారు మొత్తం జనాభాలో 2011లో 9.2% ఉండగా.. 2021 నాటికి 10.6 శాతానికి, 2031 నాటికి 13.5 శాతానికి, 2041 నాటికి 18.2 శాతానికి పెరగనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 0–19 మధ్య వయసున్న గ్రూపులో 2011లో 34.8% మంది ఉండగా.. 2041 నాటికి 21.4 శాతానికి తగ్గనున్నారు. అలాగే 20–59 మధ్య వయస్సు గల గ్రూపులో 2011లో 55.1 శాతం మంది ఉండగా.. 2041 నాటికి 58.6 శాతానికి తగ్గనున్నారు. ఇక 60 ఏళ్ల పైబడిన 2011లో 10.1% ఉండగా.. 2041 నాటికి 20 శాతానికి పెరగనున్నారు. గణనీయంగా తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, అసోం, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో వృద్ధి రేటు 1% కంటే తక్కువగా ఉంది. 2031–41 నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు సున్నాగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. తెలంగాణ సహా కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్, బెంగాల్, పంజాబ్, మహారాష్ట్రల్లో ఈ వృద్ధి రేటు 0.1–0.2గా ఉంటుందని పేర్కొంది. ఇక తమిళనాడులో వృద్ధిరేటు 2031–41 నాటికి తిరోగమనదిశలో ఉంటుందని పేర్కొంది. వార్షిక జనాభా వృద్ధిరేటు దేశవ్యాప్తంగా 2001–11 మధ్య 1.77% ఉండగా, 2011–2021 మధ్య 1.12%, 2021–31 మధ్య 0.72%, 2031–41 మధ్య 0.46% ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. తెలంగాణలో వార్షిక జనాభా వృద్ధి రేటు 2011–2021 మధ్య 0.80%, 2021–31 మధ్య 0.53 శాతం, 2031–41 మధ్య 0.22% ఉంటుందని ఆర్థికసర్వే అంచనా వేసింది. ఆంధప్రదేశ్లో ఈ వార్షిక జనాభా వృద్ధి రేటు 2001–11 మధ్య 1.10% ఉండగా, 2031–41 మధ్య 0.02% ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. మొత్తం సంతానోత్పత్తి రేటు (టోటల్ ఫర్టిలిటీ రేటు–టీఎఫ్ఆర్) తెలంగాణలో 2001 నాటికి ఇది 2.3శాతంగా ఉండగా.. 2011కు 1.8శాతానికి, 2017కు 1.6 శాతానికి పడిపోయింది. 2021 నాటికి 1.6%, 2031 నాటికి 1.6%, 2041కి 1.6% శాతంగా ఉంటుందని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. ఏపీలో 2001 నాటికి ఇది 2.3 శాతంగా ఉండగా.. 2041కి 1.5 శాతంగా ఉంటుందని పేర్కొంది. లింగ నిష్పత్తిలో వృద్ధి.. బేటీ బచావో బేటీ పఢావో పథకం ప్రారంభించిన తరువాత ఆంధ్రప్రదేశ్ సహా పలు పెద్ద రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి పెరిగింది. అంతకుముందు 2001 నుంచి 2011 వరకు లింగ నిష్పత్తి తగ్గగా.. ఈ పథకం ప్రారంభమయ్యాక ఈ నిష్పత్తిలో మార్పు వచ్చింది. 2015–16లో ఏపీలో లింగ నిష్పత్తి 873 నుంచి 901 మధ్య ఉండగా.. 2018–19 నాటికి 930–980 నమోదైంది. ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాలో 40 పాయింట్ల మేర వృద్ధి చెందింది. తెలంగాణలో కూడా లింగ నిష్పత్తిలో సానుకూల మార్పు కనిపించింది. సర్వీస్ సెక్టార్లో తెలంగాణ టాప్ సేవలరంగంలో వృద్ధి చూపించడంలో తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచింది. గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్ (జీఎస్వీఏ)లో సర్వీస్ సెక్టార్ వాటా 50% కంటే అధికంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ ముందంజలో నిలిచింది. రాష్ట్రాల వారీగా 3వ స్థానంలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఆరోస్థానం సంపాదించింది. ఆర్థికసర్వే విశ్లేషణ ప్రకారం తెలంగాణలో 2017–18లో మొత్తం సర్వీస్ సెక్టార్ వాటా 63.2% కాగా.. వృద్ధిరేటు 10.7% (2013–17 సగటు)గా ఉంది. దేశవ్యాప్తంగా ఇదే అత్యధిక వృద్ధిరేటు కావడం విశేషం. తదుపరి కర్ణాటక, హరియాణా 10.5% వృద్ధి రేటు కనబరిచాయి. ఇక ఆంధ్రప్రదేశ్ జీఎస్వీఏలో సర్వీస్ సెక్టార్ వాటా కేవలం 42.7% మాత్రమే కాగా.. వృద్ధి రేటు 9.2 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే సర్వీస్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ 21వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి చూస్తే 25వ స్థానంలో నిలిచింది. -
ఇంట్లో నుంచి తల్లిదండ్రుల గెంటివేత
మద్దిరాల: నవమాసాలు మోసి.. కని,పెంచి.. ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను కుమారులు ఇంటి నుంచి గెంటివేశారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని పోలుమల్ల గ్రామంలో ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన దేవులపల్లి వీరయ్య రాములమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు దేవులపల్లి వెంకన్న, లింగయ్య. పెద్ద కుమారుడు వెంకన్న గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నకుమారుడు లింగయ్య హైదరాబాద్లో పెయింటింగ్ పని చేస్తూ.. అక్కడే ఉంటున్నాడు. గ్రామంలో కుమారులు ఇద్దరూ ఇళ్లు నిర్మించుకున్నారు. చిన్న కుమారుడు లింగయ్య హైదరాబాద్లో ఉండటంతో అతని ఇంట్లో తల్లిదండ్రులు ఉంటూ పింఛన్తో కాలం వెల్లదీస్తున్నారు. కొద్దిరోజులుగా అన్నదమ్ముల నడుమ తగాదాలు జరుగుతుండడంతో చిన్నకుమారుడు తన ఇంట్లో ఉండవద్దని తల్లిదండ్రులను బయటికి గెంటివేశాడు. దీంతో ఆ వృద్ధ దంపతులు వీధిన పడ్డారు. స్థానికులు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారికి నచ్చజెప్పడంతో ఆ దంపతులను ఇంట్లోకి తీసుకెళ్లారు. కుమారులిద్దరికీ సోమవారం స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని ఎస్ఐ మగ్దూమ్ అలీ తెలిపారు. -
శ్రీవారి దర్శనం: వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక టోకెన్లు
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం 65 ఏళ్లకుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ నాలుగు వేల టోకెన్లను జారీ చేసింది. శ్రీవారి దర్శనం కోసం మంగళవారం ఉదయం 10 గంటల స్లాట్కు వెయ్యి టోకెట్లు, మధ్యాహ్నం 2 గంటలకు రెండువేల టోకెన్లు, మూడు గంటల స్లాట్కు వెయ్యి టోకెన్లు ఇవ్వనుంది. రద్దీరోజుల్లో తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా.. ఈ అవకాశాన్ని కల్పించినట్టు టీటీడీ తెలిపింది. బుధవారం ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని, ఇందుకోసం నాలుగు వేల టోకెన్లు ఇస్తామని టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రిన్స్పాల్ సెక్రటరీ శైలేంద్ర జోషి, ట్యాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, కర్నాటక డీజీపీ నీలమణిరాజు, తమిళనాడు డీజీపీ రాజేంద్రన్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్నికల జ్ఞాపకాలు: ఆరోజుల్లో అట్లుండే..!
సాక్షి, వికారాబాద్: ‘నేటి ఎన్నికల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. నాడు ఎన్నో కిలోమీటర్లు నడిచి ఓటు వేసేవాళ్లం.. పైగా మాటకు విలువ ఇచ్చేవాళ్లం.. ఇప్పుడేమో డబ్బుల మూటకే అందలం ఎక్కిస్తున్నారు. పెద్దోళ్లు ఏది చెబితే అదే గుర్తుకు వేసేవాళ్లం. అప్పుడు కాగితంపై గుర్తు చూపి ప్రచారం చేసేవారు. ఇప్పుడు పొద్దుగాల నుంచి రాత్రి వరకు మైకులు మోగిస్తున్నారు. నేడు హామీలు గుప్పిస్తూ, డబ్బులు పంచుతూ ప్రచారాన్ని అదరగొడుతున్నారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు సైతం ఇప్పుడు ఎవరికి వేస్తున్నారో తెలియడం లేదు’ అని ప్రజలు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో శనివారం కొందరి వృద్ధులు, విద్యావేత్తలను ‘సాక్షి’ పలకరించగా నాటి ఎన్నికలపై వెలిబుచ్చిన వారి అభిప్రాయాలు ఇవీ.. నాలుగు కిలోమీటర్లు నడిచివెళ్లి ఓటు వేసేవాళ్లం... కందుకూరు: ముప్పై ఏళ్ల క్రితం ఎన్నికలు అంటే ఎవరికి తెలిసేది కాదు. ఊరి పెద్ద పంపిన కావలికార్లు ముందు రోజు వచ్చి రేపు ఓటు వేయాలని చెప్పి పోయేవారు. ఆ రోజు మా తండా నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పులిమామిడికి నడిచి వెళ్లి ఓటు వేశావాళ్లం. అక్కడే కల్లు లేదా అంబలి ఇస్తే తాగి వచ్చే వాళ్లం. ఇప్పట్లా జోరుగా ప్రచారం లేదు. డబ్బులు పంచుడులేదు. చేతగాని ముసలోళ్లు ఉంటే ఎడ్ల బండిపై ఎక్కించుకుని ఓటు వేయడానికి తీసుకుపోయేది. – వి.నేచ్చానాయక్, దావూద్గూడతండా, కందుకూరు ఎడ్ల బండిపై వెళ్లేటోళ్లం... షాబాద్(చేవెళ్ల): గతంలో ఓటు వేయాలంటే నాలుగు కిలోమీటర్లు ఎండ్లబండిపై పోయి ఓటు వేసేవాళ్లం. మా ఇంట్లో పెద్ద మనిషి ఎవరికి ఓటు వేయమంటే వారికే ఓటు వేసేటోళ్లం. పటేల్ ఇంటికి వచ్చి ఈ గుర్తుకు ఓటు వేయాలని చెబితే అదే గుర్తుకు వేసేవాళ్లం. మాకు ఏ ఆపతి వచ్చినా ఆయన వద్దకు పోయి చెబుతుంటిమి. ఆయన సమస్య పరిష్కరించేవారు. కల్లు, సారాకు లొంగేవారు కాదు. మళ్లీ వచ్చి ఎవరు ఎవరికి ఓటు వేశారని అడిగే వారు కాదు. మా జమానాలో ఎన్నికలంటే ఇంత ప్రచారం జరిగేది కాదు. నాయకులు ఇంటింటికి వచ్చి దండాలు పెట్టి కాళ్లు మొక్కేవారు కాదు. ఇప్పుడు పొద్దుగాల నుంచి పొద్దుమూకినదాకా మైకులు పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారు. అప్పటి రోజుల్లోనే ఒక పెద్ద మనిషి చెప్పినట్లు వినేవాళ్లం. ఇప్పుడు ఎవరు చెప్పినా వినడం లేదు. ఓటు కూడా ఎవరికి వేస్తారో తెలియడం లేదు. మానవత విలువలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. – మణెమ్మ, బోడంపహాడ్ గ్రామం నచ్చిన వ్యక్తికే ఓటేస్తా... ధారూరు: వికారాబాద్ మండలం గూడుపల్లి గ్రామం నుంచి నాగారం గ్రామానికి 9 ఏళ్లకే పెళ్లి చేసుకుని వచ్చాను. 21 ఏళ్లకు ఓటుహక్కు ఉండేది. 25 ఏళ్లకు నడుచుకుంటూ పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసీ వచ్చా. మా కాలంలో అభ్యర్థి ప్రచారం ఇల్లిల్లు తిరిగి కాదు. అందరిని ఒక దగ్గర చేర్చి తన గురించి చెప్పివెళ్లేవారు. ఆ తర్వాత ఓటేసేవాళ్లం. ఇపుడేమో మద్యం, మాంసాహారంతో పాటు నగదు ఇస్తేనే ఓటేస్తున్నారు. మా కాలంలో డబ్బుతో ఓటు అంటేనే చచ్చినంత పని. నమ్మి ఓటేసీవాళ్లం. ఇపుడేమో ఓటును అమ్ముకుని ఓటేస్తున్నారు. ఇప్పటి వరకు ఓటువేయకుండా ఉండలేదు. భర్త, కొడుకులు, మనుమళ్లు ఓటు కోసం చెప్పినా తనకు నచ్చిన ట్లుగానే ఓటేశాను. ఇప్పుడు రాజకీయ విలువలు పూర్తిగా దిగజారీ పోయాయి. ఇపుడు ఎన్నికలప్పుడే హామీలు చెప్పి తిరిగి ప్రజల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈసారి మాత్రం తప్పక ఓటేస్తా. – 96 ఏళ్ల జైదుపల్లి రత్నమ్మ తాగుడుకు బానిసవుతున్న యువత... షాబాద్(చేవెళ్ల): మా కాలంలో ఓటు వేయాలంటే దేవుని గుడికి వెళ్లి తిలకం దిద్ది, మొక్కి ఓటు వేసేవాళ్లం. అప్పట్లో గ్రామంలో ఒక నలుగురు పెద్ద మనుషులు ఇండ్ల వద్దకు వచ్చి పలానా గుర్తుకు ఓటు వేయాలని చెప్పేవారు. ఆయన మాట తీసి వేయకుండా మాటకు కట్టుబడి ఓటు వేసేవాళ్లం. ఏ కష్టమొచ్చిన అతని వద్దకే వెళ్లితే సమస్యలను పరిష్కరించేవారు. ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు, మద్యం ఎక్కువ ఎవరు ఇస్తే వారికే ఓటు వేస్తామని చెబుతున్నారు. రోజుకో పార్టీలో తిరుగుతు అటు నాయకులను, ఇటు ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కులానికి ఒక పెద్ద మనిషిని పిలిపించి మీ ఓట్లు పలానా వ్యక్తికి వేయాలని చెబితే ఆయన మాటనే వేదవాక్కుగా నమ్మేవారు. ఇప్పుడు కుల రాజకీయాలు ఎక్కువ కావడంతో ఎవరికి వారు మా కులానికి ఏమీ ఇస్తావనీ, మావి వంద ఓట్లు ఉన్నాయని బేరాసారాలు అడుతున్నారు. నాటికి, నేటికి ఎన్నికల ప్రచారాల్లో నాయకుల హడావిడి, పార్టీల కండువాలు మార్చడంలో నాయకులు పోటీపడుతున్నారు. మద్యం ఏరులై పారుతుంది. యువత తాగుడుకు బానీసై ఎవరికి ఓటు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజలకు నైతిక విలువలు తగ్గిపోయాయి. – కిష్టయ్య జ్యోషి, విద్యావేత్త, షాబాద్ నాడు అందరిదీ ఒకే మాట... నందిగామ: నాడు.. నేడు జరుగుతున్న ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. నాకు తెలిసినంత వరకు నేను సుమారు 12 సార్లు (ఎమ్మెల్యే ఎన్నికలకు) ఓటు వేశాను. అప్పట్లో కొంత మంది పెద్దలు కూర్చుని అందరం కలిసి నిర్ణయించుకొని తమకు నచ్చిన వారికి ఓటు వేసే వారం. కొందరు ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్లి భోజన సమయంలో ఊర్లోకు వచ్చి ఓటు వేసేవారు. మరికొందరు ఓటు వేసిన తర్వాతనే పనులనిమిత్తం వెళ్లేవారు. గ్రామంలోని అందరం ఒకే మాటకు కట్టుబడి ఉండేవాళ్లం. పెద్దల మాటకు గౌరవం ఇచ్చేవారం. కానీ ప్రస్తుత సమాజంలో కొడుకు ఎవ్వరికి ఓటు వేస్తున్నాడో, భార్య ఎవ్వరికి ఓటు వేస్తుందో, కోడలు, కూతురు ఇలా ఎవ్వరు ఎవ్వరికి ఓటు వేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. మాట మీద నిలబడే రోజులు పోయాయి. ఇలా ఉంటే మన ఓటుతో గెలిచిన వారిని పనిచేయమని ప్రశ్నించే హక్కును కోల్పోతాం. ఎన్నికలకు ముందు వారు ఇచ్చే డబ్బులకు అశపడటం ఎందుకు.. మన కష్టాన్ని నమ్ముకొని జీవించాలి. పనులు మానుకొని వారి వెంట తిరిగే బదులు , మన పని మనం చేసుకోవాలి. వారు ఎన్నికల వరకు మాత్రమే మందు తాపగలరు, కానీ తర్వాత .. కావున తమ కష్టాన్ని నమ్ముకోవాలి. – గోవిందు శర్వయ్య, నర్సప్పగూడ, ఓటు వేయకుంటే సచ్చినట్లే అనేవారు... ఇబ్రహీంపట్నం రూరల్: అప్పట్లో ఓటు వేయకుంటే సచ్చినంత విలువ అని పెద్దలు చెబుతుండే వారు. ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బుల రాజకీయం నడుస్తోంది. నాకు ప్రస్తుతం 85 సంవత్సరాలు. మొదటి సారిగా ఆవుగుర్తుకు ఓటు వేశాను. రెండున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఓటు వేసేది. ఓటు వేసి మళ్లీ పనులకు వెళ్లెవాళ్లం. అప్పట్లో రెండు పార్టీలు మాత్రమే ఉండేది. ఎవ్వరి ఇష్టం వచ్చిన దానికి వారు ఓటు వేసే వాళ్లం. ఇప్పుడు ఓటు హక్కు వచ్చినప్పటికీ భయంతో ఓటు వేసే రోజులివి. – ఇబ్రహీం జంగయ్య, ఉప్పరిగూడ నేడు మైకుల మోత... దౌల్తాబాద్: నాకు 75 సంవత్సరాలు. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఓటు వేశాను. అయితే అప్పట్లో ఎన్నికల హడావుడి చాలా తక్కువ. చాలా తక్కువ కాలంలో మూడు నాలుగు రోజులు మాత్రమే ఇంటింటికి వచ్చి ఓటు కోసం ప్రచారం చేసేవారు. ఇప్పుడు రెండు నెలల నుండి ఊర్లలో మైకులతో ప్రచారం జోరు చేస్తున్నారు. అప్పుడు ఓటుకు వచ్చే వారు కాగితంపై గుర్తు చూపి ప్రచారం చేసేవారు. ఇప్పుడు పొద్దుగాల నుంచి రాత్రి వరకు మైకులు మోగిస్తున్నారు. ఓటునాడు పోలింగ్బూత్ దగ్గర తమ గుర్తు ఇది అని చెప్పేవారు. ఇప్పుడు మిషన్లు వచ్చాయి. అప్పట్లో పైసలు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు వందలకు వందలు, రోజూ టిఫిన్లు, భోజనం కూడా పెడుతున్నారు. ఇలా అప్పటికి ఇప్పటికి చాలా తేడాగా ఉంది. – రామప్ప, దౌల్తాబాద్ నిజాయితీగా ఓటు వేశాం... ఇబ్రహీంపట్నం రూరల్: స్వాతంత్య్రం రాగానే మొట్టమొదట జరిగిన ఎన్నికల్లో ఓటు వేశాను. నాకు ఇప్పుడు 83 ఏళ్లు. అప్పుడు నీతినిజాయితీగా ఓటు వేసేది. కార్లు, మోటారు సైకిళ్లు అప్పట్లో లేవు. ఇప్పుడు కార్లల్లో తీసుకెళ్లి ఓటు వేయించుకుంటున్నారు. ఇష్టం ఉంటే ఓటు వేసేది లేకపోతే లేదు. ఎక్కువగా ఓటు వేయాలని పెద్దలు చెబుతుండేది. 35 యేళ్లుగా డబ్బుల రాజకీయమే నడుస్తోంది. – మంత్రి ఎల్లయ్య, ఉప్పరిగూడ -
వృద్ధులను నిర్లక్ష్యం చేయడం నేరమే
విజయనగరం లీగల్ : వృద్ధులను నిర్లక్ష్యం చేయడం చట్ట రీత్యా నేరమని, అందుకు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద 5 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తామని, కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలు పడతాయని జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎం.శ్రీహరి తెలిపారు. మంగళవారం మండలంలోని పినవేమలి గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామంలోని ఏబీసీడీ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న వితంతువులు, వృద్ధులను పరామర్శించి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ వృద్ధులకు అవసరమైన న్యాయ సహాయాన్ని డీఎల్ఎస్ఏ ద్వారా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. అలాగే వారికి చేతి కర్రలు, చెప్పులు తదితర వస్తువుల కోసం సాంఘిక సంక్షేమ శాఖకు సిఫారసు చేశారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమం కేర్ టేకర్ ఎ.విజయలక్ష్మి, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. -
వివాహబంధంతో ఒక్కటైన వృద్ధులు
కేసముద్రం(కేసముద్రం) : భార్య మృతిచెందగా ఓ వృద్ధుడు, భర్త మృతితో ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉండలేక ఒక్కట య్యారు.. ఓ ఆలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కేసముద్రం మండలం వెంకటగిరి శివారు చంద్రుతండాకు చెందిన బీల్యానాయక్ అనే 75 ఏళ్ల వృద్ధుడికి ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. కాగా రెండేళ్ల క్రితం భార్య జాంకి అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారు తండాకు చెందిన బుజ్జి అనే 52 ఏళ్ల వృద్ధురాలుకు ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది. బుజ్జి భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఆమె కూడా ఒంటరిగా ఉంటోంది. తోడు కోసం మరో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్న బిల్యా కొందరి ద్వారా బుజ్జి గురించి తెలుసుకున్నాడు. ఒకరికొకరు తోడు కోసం పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో కేసముద్రం మండలకేంద్రంలోని రామాలయానికి వెళ్లి దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్న వృద్ధులు -
ఇద్దరు వృద్ధుల అనుమానాస్పద మృతి
పటాన్చెరు టౌన్: గుర్తుతెలియని ఇద్దరు వృద్ధులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వేణు గోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాంచంద్రాపురం మండలం వెలమెల్ల గ్రామ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సుమారు 65 సంవత్సరాల గుర్తుతెలియని ఓ వృద్ధురాలు, సుమారు 70 సంవత్సరాల మరో వృద్ధుడు రోడ్డు పక్కన చెట్ల మధ్యలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గురువారం ఉదయం ఔటర్ రింగు రోడ్డుపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నవారు ఇద్దరు వృద్ధుల శవాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ వెంకట్ రెడ్డి, క్లూస్ టీం చేరుకొని పరిశీలించారు. వారి మృతికి గల కారణాలు ఏమిటో? రింగ్ రోడ్డు వద్దకు ఇద్దరు వృద్ధులు ఎలా వచ్చారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
శభాష్ పెద్దాయన
-
ఈ నగరం ‘వృద్ధాప్య’ నరకం!
సాక్షి, హైదరాబాద్ భాగ్యనగరంలోని నాగోల్ ప్రాంతం.. ఓ భారీ అపార్ట్మెంట్.. అందులోని ఓ ఫ్లాట్లో వృద్ధుడు.. పేరు మూర్తి... వయసు 70 ఏళ్లు.. భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు.. అమెరికాలో! మూర్తి ఓ రోజు స్నానానికి వెళ్తూ ప్రమాదవ శాత్తూ హాల్లో కిందపడిపోయాడు.. తలకు బలమైన గాయమైంది.. ‘నా’అన్నవాళ్లెవరూ చెంతలే రు.. రక్తపుమడుగులోనే గిలగిల్లాడుతూ ప్రాణాలు వదిలాడు!! పక్క ఫ్లాట్వారికి, ఇరుగుపొరుగువారికి ఈ విషయం తెలియదు.. రోజు గడిచింది.. రెండ్రోజులైంది.. పక్షమైంది.. నెల రోజులయ్యాయి.. ఎంతకీ ఫోన్ ఎత్తక పోవడంతో అనుమానం వచ్చి భార్య, ఇద్దరు కూతుళ్లు అమెరికా నుంచి వచ్చి బలవంతంగా తలుపు తెరిచి చూసి ఒక్కసారిగా బోరుమన్నారు. రాష్ట్ర రాజధానిలో ఇటీవల వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఉదంతం నగరంలో వృద్ధుల దైన్యస్థితికి పరాకాష్టగా నిలిచింది! ఇదొక్కటే కాదు.. నగరంలో అడపాదడపా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు.. కన్నవారికి ‘భారమై’ఇంకొందరు.. చీత్కరింపులకు దూరంగా బతుకుదామని మరికొందరు.. ‘చిన్న’కుటుంబంలో చోటుదక్కక ఎందరో.. కారణాలేవైతేనేం.. రెక్కలు తెగిన పక్షుల్లా ఒంటరిగా మిగిలిపోయి బతుకులీడుస్తున్న ఈ పండుటాకుల కన్నీటి గాథను, మానసిక వ్యథను, అంతకుమించి వారి యోగక్షేమాలు, భద్రతను పట్టించుకునేనాథుడే కరువయ్యాడు! 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్లో 80 లక్షల జనాభా ఉంటే.. అందులో సుమారు 6.5 లక్షల మంది 60 ఏళ్లపైబడినవారేనని తేలింది. ఇక 2026 నాటికల్లా నగర జనాభా రెట్టింపై వయోవృద్ధుల సంఖ్య కూడా 12 లక్షలకు చేరుకోనున్నట్టు ఓ అంచనా. ఇదే స్థాయిలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ వారి సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో లక్షలాది వృద్ధుల జీవితాల్లో అలుముకున్న చీకట్లను పారదోలే విషయంలో కుట ుంబ సభ్యులతోపాటు అటు ప్రభుత్వం, పౌరసమాజం ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగమంత కుటుంబం.. ఏకాకి జీవితం భాగ్యనగరంలో వృద్ధుల బతుకులు ‘జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది’అన్న చందంగా ఉన్నాయి. మలిసంధ్యలో ఆదరించేవారు లేక అనాథలుగా మారుతున్నారు. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు బతుకుదె రువు కోసం విదేశాలు, సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో వృద్ధాశ్రమాలకు చేరుతున్నారు. ఇలాంటి ఆశ్రమాలు నగరంలో వందలాదిగా ఉన్నాయి. ఏటా వాటి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జీవనభృతికి అయ్యే ఖర్చులు చెల్లించే స్తోమత ఉన్నవారు వృద్ధాశ్రమాల్లో తలదాచుకుంటుండగా.. వేలాది మంది ఆలనాపాలనా లేక రోడ్లపై బతుకులీడుస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలుగా మారుతుండడం, కన ్నవారు విద్య, ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలు, దూర ప్రాంతాలకు వెళ్తుండటం, మారుతున్న సామాజిక పరిస్థితులు.. ఇవన్నీ పిల్లలు–తల్లిదండ్రుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు.. ఉద్యోగాలు, సంపా దన పేరుతో నిత్యం కాలం వెంట పరుగులు తీయడంతో వృద్ధులు ప్రేమ, ఆప్యాయత, పలకరింపులకు నోచుకోలేక మానసికంగా> కుంగిపోతున్నారు. పెద్దవారిపై ‘చిన్న’చూపు.. ఇంటా, బయట తమను చిన్నచూపు చూస్తున్నారని దేశవ్యాప్తంగా వయోజనులు ఆవేదన వ్యక్తం చేశారు. హెల్ప్ ఏజ్ ఇండియా అనే సంస్థ హైదరాబాద్ సహా దేశంలోని 19 నగరాలు, పట్టణాల్లో ఇటీవల నిర్వహించిన ఈ విషయం తేలింది. ఇలా వృద్ధులను చిన్న చూపు చూసే నగరాల్లో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. చీత్కారాలు ఎదుర్కొంటున్నామని, తమను చిన్నచూపు చూస్తున్నారని నగరంలో దాదాపు 90 శాతం మంది వృద్ధులు తెలిపారు. ఆ తర్వాత స్థానాల్లో కోల్కతా(78%), షిల్లాంగ్(61%), బెంగళూర ు(60%) ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది కసురుకుంటున్నారని, రోడ్లపై వెళ్తుంటే వాహనదారులు అవమానపరిచేలా ప్రవర్తిస్తున్నారని వృద్ధులు సర్వేలో తెలిపారు. రక్షణ ఏది? హైదరాబాద్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఎవరూ లేరన్న ఉద్దేశంతో దుండగులు వారి ఇళ్లపై దాడులు చేసి అందినకాడికి దోచుకుపోతున్నారు. ప్రతిఘటిస్తే ప్రాణాలు తీసేందుకు వెనకాడడం లేదు. పంజగుట్ట ఠాణా పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్న కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు పెద్దమ్మ సుశీలాదేవి ఇలాగే గతంలో దారుణ హత్యకు గురయ్యారు. వనస్థలిపురం, ఫీర్జాదిగూడ, ఈస్ట్మారేడ్పల్లి, కూకట్పల్లి, వ ¬షీరాబాద్, బేగంపేట ఇలా.. అనేక ప్రాంతాల్లో వృద్ధులపై దాడులు చేసి దుండగులు దోపిడీలకు పాల్పడ్డారు. ఢిల్లీ విధానం భేష్.. హైదరాబాద్లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల భద్రత, వారి యోగక్షేమాలు చూసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏవీ లేవు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు ముందున్నారు. అక్కడ వృద్ధులకు భరోసా ఇచ్చేందుకు సీనియర్ సిటిజన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఇలాంటి సెల్ను హైదరాబాద్లోనూ ఏర్పాటు చేయాలని గతంలో భావించినా అడుగు ముందుకు పడలేదు. ఢిలీలో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ సెల్ మంచి ఫలితాలు సాధిస్తోంది. ఒంటరి వృద్ధులు, వారి వివరాలు, చిరునామాను ఈ సెల్లో నమోదు చేశారు. ఒకవేళ కుటుంబీకులు ఉద్యోగాలకు వెళ్తే పగటిపూట ఒంటరిగా ఉండేవారి వివరాలు కూడా రిజిస్టర్ చేశారు. రెండేళ్లల్లో 19,716 మంది వృద్ధుల వివరాలు నమోదు చేసి వారిలో 12,812 మందికి ప్రత్యేక గుర్తింపు కార్డులిచ్చారు. ఆ కార్డుల్లో వారి చిరునామా, బ్లడ్ గ్రూపు, వారి అనారోగ్య వివరాలు, డాక్టర్ పేరు, సంప్రదించాల్సిన నంబరు, అత్యవసర సమయాల్లో ఎవరికి సమాచారం ఇవ్వాలనే వివరాలను పొందుపరిచారు. పోలీసులు సెక్యూరిటీ ఆడిట్ పేరుతో నిత్యం వారి ఇళ్లకు వెళ్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. దీంతో వృద్ధులకు భరోసా లభించడంతో పాటు వారిపై నేరాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. హైదరాబాద్లో కూడా ఇలాంటి విధానం అనుసరిం చాలని పలువురు కోరుతున్నారు. ఆదరణ లేక ఆశ్రమంలో చేరా..: గౌరమ్మ పనిచేస్తున్న సమయంలో కన్నవాళ్లకు ఉన్నదంతా ఊడ్చిపెట్టా. వయసు మీద పడ్డది. అయిన వారు కాదన్నారు. ఆదరణ కరువైంది. ఆశ్రమంలో చేరా. కృష్ణా, రామ అంటూ దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నా. వారి బతుకు వారు బతుకుతున్నారు: వెంకట నర్సమ్మ నా భర్త లేడు. ఇద్దరు కొడుకులను చదివించేందుకు ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి. వారి బతుకు వారు బతుకుతున్నారు. ముసలితనం మీద పడ్డది. ఏ పనీ చేసుకోలేను. గత్యం తరం లేక ఆశ్రమంలో చేరా. ఇళ్లు ఇరుకుగా ఉందని ఆశ్రమంలో చేర్పించాడు: రాజారెడ్డి నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఇళ్లు ఇరుకుగా ఉందని హయత్నగర్లోని ఓ వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. పిల్లల మనస్సు ఎక్కడ గాయపడుతుందోనని... మాది అనంతపురం. నా భర్త రైల్వేలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన పోయాక ఇక్కడి వృద్ధాశ్రమంలో ఉంటున్నాను. మాకు ఒక కొడుకు. ఒక బిడ్డ. ఉద్యోగాలు చేస్తున్నారు. మా తరానికి, ఈ తరానికి మధ్య భావాల్లో కొంత వ్యత్యాసం ఉందనిపించింది. పిల్లల మనసు గాయపర్చడం ఇష్టం లేక స్వతంత్రంగా ఉందామనిపించింది. నేను ఎక్కడ ఉన్నా పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. – రాధ, అనంతపురం. హైదరాబాద్లో వృద్ధుల జనాభా: 6.5 లక్షలు గ్రేటర్ పరిధిలోని వృద్ధాశ్రమాలు: 300 తెలంగాణ, ఏపీలో వృద్ధాశ్రమాలు: 600 -
చివరిదశలో ఒంటరి వ్యథలు
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతి ఇద్దరు వృద్ధుల్లో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఏజ్వెల్ ఫౌండేషన్ అనే సంస్థ దాదాపు 15 వేల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. వీరిలో 47.49 శాతం మంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు గుర్తించింది. పట్టణాల్లో ఉండే వారిలో 64.1 శాతం మంది ఒంటరితనాన్ని అనుభవిస్తుండగా పల్లెల్లో ఇది 39.19 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారితో పోలిస్తే పట్టణాల్లో ఉన్నవారిలో ఒంటరితనం భావన ఎక్కువ ఉన్నట్టు స్పష్టమైంది. వీరిలో అధికులు ఒంటరిగా కానీ వారి జీవిత భాగస్వామ్యులతో కానీ ఉంటున్నారని పేర్కొంది. అనారోగ్య కారణాలు, కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం తదితర కారణాల వల్ల వీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఒంటరితనం కారణంగా ప్రతి ఐదుగురు వృద్ధుల్లో ఒకరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని దీనిని అధిగమించేందుకు కౌన్సిలింగ్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 2017 ఏప్రిల్– జూన్ మధ్య ‘చేంజింగ్ నీడ్స్ అండ్ రైట్స్ ఆఫ్ ఓల్డర్ పీపుల్’పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది. -
జన్మభూమి కమిటీలు ఆడిందే ఆట పాడిందే పాట
-
నగదు కోసం అర్ధరాత్రి నుంచే క్యూలో...
-
పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు విలవిల
-
పాపం.. పండుటాకులు
కొవ్వూరు : వయోభారంతో కదలలేని స్థితిలో ఉన్న పండుటాకులను కష్టాలు వెంటాడుతున్నాయి. పింఛను సొమ్ముల కోసం మూడు రోజుల నుంచి సహాయకులను వెంటబెట్టకుని.. చేతికర్ర సాయంతో కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. బ్యాంకుల ఎదుట గంటల తరబడి క్యూలో నిలబడి కౌంటర్ వద్దకు వెళితే.. మీ అకౌంట్లో సొమ్ము రాలేదనే సమాధానం వస్తోంది. వికలాంగులు, వితంతువుల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు. జిల్లా వ్యాప్తంగా 3,38,153 మందికి ప్రభుత్వం సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందులో సుమారు 2లవేల మంది ఖాతాల్లో సొమ్ము జమకాలేదు. కొందరికి బ్యాం క్ ఖాతాలు లేకపోవడం.. ఖాతాలున్నా వినియోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం నాటికి కొన్ని ఖాతాలను సరిచేసినప్పటికీ ఇంకా 15,251 మందికి పింఛను సొమ్ము ఖాతాల్లో చేరలేదు. ప్రాంతాల వారీగా ఇలా.. ఉంగుటూరు మండలంలో గరిష్టంగా 784 మందికి, లింగపాలెం మండలంలో 674, పెదవేగి మండలంలో 599, పోడూరు మండలంలో 538, దేవరపల్లి మండలంలో 534 మందికి పింఛను సొమ్ములు వారి ఖాతాల్లో వేయలేదు. నరసాపురం, యలమంచిలి, ఇరగవరం, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర మండలాల్లో ఒక్కోచోట 400 మందికి పైగా పింఛను సొమ్ము రాలేదు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో 1,909 మందికి సొమ్ము జమ కాలేదు. గరిష్టంగా ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 771 మందికి, భీమవరం పట్టణంలో 244 మందికి, తణుకులో 246 మందికి పింఛన్లు జమ కాలేదు. మిగిలిన మునిసిపాలిటీల్లో 654 మంది నేటికీ పింఛను సొమ్ముకు నోచుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పింఛను సొమ్మును పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 2,300 రేష¯ŒS డీలర్లు, 350 మంది బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా ఈనెల 6వ తేదీ నుంచి పింఛను సొమ్ము పంపిణీ చేయాలని నిర్ణయించారు. లేవలేని స్థితిలో ఉన్న పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రతి గ్రామానికి ముగ్గురు చొప్పున బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై బ్యాంకు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. మూడు రోజులుగా తిరుగుతున్నా.. పింఛను డబ్బు కోసం మూడు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. అయినా సొమ్ము అందలేదు. బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేసినట్టు చెప్పారు. బ్యాంకుకు వెళితే.. ఖాతాలో సొమ్ము పడలేదని సిబ్బంది చెబుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. – సంపతి అమ్మన్న, తాళ్లపూడి చాలా ఇబ్బంది పడుతున్నాం గతంలో ప్రతినెలా 1వ తేదీన పింఛను సొమ్ము చేతికి ఇచ్చేవారు. ఈ నెల డబ్బులు ఎక్కడ ఇస్తారో తెలియక అయోమయంలో పడ్డాను. బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని చెప్పడంతో బ్యాంకుకు వెళితే అక్కడ ఖాళీ లేదు. నాకు ఏటీఎం కార్డు లేదు. పింఛను డబ్బు ఖాతాలో పడిందో లేదో తెలియడం లేదు. – అంకోలు శేషయ్య, వేగేశ్వరపురం -
మలిసంధ్యలో 'మనీ' పాట్లు
– బారులు తీరలేక సొమ్మసిల్లుతున్న వృద్ధులు – ప్రత్యేక కౌంటర్లు పెట్టాలని మనవి ఎమ్మిగనూరు: నోట్ల పాట్లు వయోవృద్ధులకు తప్పలేదు. వణుకుతూ.. తడబడుతూ.. బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. క్యూలో నిరీక్షించి నీరిస్తున్నారు. దాహంతో తల్లడిల్లి, ఆకలితో అలమటిస్తూ ఆపసోపాలు పడుతున్నారు. పొద్దుపొడుపుతో బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. పొద్దు గూకే దాక నోట్ల మార్పిడి కోసం క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. పాపం యువకులతో పోటీ పడలేక, గంటల తరబడి వేచి ఉండలేక ఉన్నచోటనే సొమ్మసిల్లుతున్నారు. వికలాంగులు సైతం నానా అవస్థలు పడుతున్నారు. ఈ నెలలో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో దాదాపు 35 వేల పైగా వృద్ధులు, వికలాంగులు పింఛన్లు పొందారు. అందరికీ పాత నోట్లతో పింఛన్లు అంటగట్టారు. నెలనెలా ఆసరాతో పోగు చేసుకున్న డబ్బు సైతం పనికిరాకుండా పోయింది. పూట గడవని బతుకులు కడుపుమాడ్చుకుని క్యూ కడుతున్నారు. నోట్ల మార్పిడి కోసం వృద్ధులు, వికలాంగులు బ్యాంకుల వద్దకు తరలివస్తున్నారు. బ్యాంకులతో బారులు తీరలేక గంటల తరబడి నిరీక్షించలేక యాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు ఎస్బీఐ, ఏడీబీ,ఆంధ్రబ్యాంక్,గోనెగండ్ల, మంత్రాలయం, కోసిగి ఎస్బీఐ, రాయలసీమ గ్రామీణ బ్యాంకులతో రద్దీ ఎక్కువగా ఉంది. -
విల పింఛెన్
కొవ్వూరు : భద్రత ఐదు రెట్లు అంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. అర్హత ఉన్నా సామాజిక పింఛన్లు అందక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కాళ్లరిగేలా అధికారులు, ప్రజాప్రతి నిధుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే మీకోసం కార్యక్రమాల్లో వచ్చే వినతుల్లో మూడొంతులు పింఛన్లకు సంబంధించే ఉంటున్నాయి. కనిపించిన ప్రతి అధికారికి దరఖాస్తులిస్తూ.. పింఛను ఇప్పించాలని వేలాదిమంది దీనంగా వేడుకుంటున్నా వారిపై చంద్రబాబు సర్కారు కనికరం చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 24 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మీ కోసం కార్యక్రమంలో అందిన దరఖాస్తులను కలిపితే ఆ సంఖ్య 30 వేలకు పైనే ఉంటుందని అంచనా. కొత్త వారికి దక్కని చోటు జిల్లాలో వివిధ సామాజిక పథకాల కింద 3,39,083 మందికి పింఛన్లు ఇస్తున్నట్టు సర్కారు చెబుతోంది. వీరిలో 1,56,827 మంది వృద్ధులు కాగా, 1,06,308 మంది వితంతువులు ఉన్నారు. 44,409 మంది దివ్యాంగులు, 1,977 మంది కల్లుగీత కార్మికులు పింఛన్లు పొందుతుండగా, 26,399 మంది అభయహస్తం పథకం కింద పింఛన్లు ఇస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా అన్ని పథకాల కింద పింఛన్లు పొందుతున్న వారిలో 900 నుంచి 1,100 మంది ప్రతినెలా మృత్యువాత పడుతున్నట్టు డీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. సగటున నెలకు వెయ్యి మంది పింఛనుదారులు మరణిస్తున్నట్టు అంచనా. మరణించిన వారి స్థానంలో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. జిల్లాలో ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. గడచిన ఏడాది కాలంలో మరణించిన వారి స్థానంలో కొత్తగా ఒక్కరికి కూడా పింఛను మంజూరు కాలేదు. పాత పింఛన్లకూ కొర్రీలు కొత్త పింఛన్ల మంజూరు విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న పాత వారికి వివిధ కారణాలతో చెల్లించకుండా ఎగవేస్తున్నారు. వరుసగా మూడు నెలలపాటు పింఛను సొమ్ము తీసుకోకపోతే వారి పేర్లను శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మొదట్లో గుర్తింపు కార్డుల ఆధారంగా పింఛను సొమ్ము చెల్లించేవారు. ఆ తరువాత వేలిముద్రలు, కనురెప్పలు (ఐరిస్) ద్వారా అందిస్తున్నారు. వేలిముద్రలు పడనివారు, పొరుగూళ్లకు వెళ్లిన వారు మరుసటి నెలలో అయినా సొమ్ము అందుకునే వీలుండేది. లబ్ధిదారుల్లో కొందరి పేర్లు మాయమవుతున్నాయి. కనురెప్పలు, వేలిముద్రలు పడని వారికి గ్రామాల్లో అయితే వీఆర్వోలు, పట్టణాల్లో అయితే బిల్లు కలెక్టర్ల వేలిముద్ర ద్వారా సొమ్ము ఇచ్చేవారు. తాజాగా, అందులోనూ అక్రమాలు జరుగుతున్నా నెపంతో కొర్రీలు వేస్తున్నారు. ఈ తరహా కేసులు 5 శాతం మించకూడదని సర్కారు ఆంక్షలు విధించగా, అధికారులు మరో అడుగు ముందుకేసి 2 శాతం మించకూడదనే నిబంధన పెట్టారు. ఫలితంగా వేలిముద్రలు, కనురెప్పలు పడని వారిలో చాలామంది సొమ్ము తీసుకోలేక సతమతం అవుతున్నారు. -
పింఛన్లకు కోత!
* సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు * వేలిముద్రలు, కంటిచూపు మ్యాచ్ అయితేనే చెల్లించాలని ఉత్తర్వులు * ఆధార్ ఆధారమే కాదంటూ నిర్ణయం తీసుకున్న పాలకులు * ఆందోళనలో లబ్ధిదారులు చిలకలూరిపేట రూరల్ : ఎన్టీఆర్ భరోసా పేరుతో అర్హులకు అందించే పింఛన్లలో కోతలు విధించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆధార్ కార్డుల ఆధారంగా ఇస్తున్న పింఛన్లను తగ్గించే ప్రయత్నాలకు తెరలేపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న సీఎం కార్యాలయం నుంచి సీఎంపీ నంబర్ 2809– జేఎస్–2016తో ఆగస్టు 12న ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్న సెర్ప్ సీఈవో పి.కృష్ణమోహన్ జిల్లాలోని అన్ని మండల పరిషత్ల అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు పంపారు. దీనివల్ల వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్లకు కోత పడనుంది. ఇప్పటివరకు ఇలా... జిల్లా వ్యాప్తంగా 57 మండలాలు, 12 పురపాలక సంఘాలు, ఒక కార్పొరేషన్లో 63,616 మంది లబ్ధిదారులు రూ.7 కోట్ల 2 లక్షల 73 వేల 500 పింఛను పొందుతున్నారు. లబ్ధిదారుల వేలిముద్రలు, కంటిచూపు (ఐరిష్) ట్యాబ్లకు అనుసంధానం కాకపోవటంతో పింఛను పంపిణీ చేస్తున్న మున్సిపల్ ఉద్యోగి, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు వారి వేలిముద్రలు సేకరించి, ఆధార్ కార్డుల నంబర్లను నమోదు చేసుకుని సొమ్ము అందజేస్తున్నారు. ప్రస్తుత ఆదేశాల్లో ఈ నెల నుంచి తప్పనిసరిగా వేలిముద్రలు, ఐరిష్లు వేయించాలని పేర్కొన్నారు. దీంతో పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. మండిపడుతున్న ఉద్యోగులు... లబ్ధిదారులందరికీ పింఛను అందిస్తున్నామని, వృద్ధుల్లో చేతి వేలిముద్రలు, కంటిచూపు కోల్పోయిన వారికి మాత్రమే తమ వేలిముద్రలు వేసి వారి ఆధార్ ఆధారంగా పంపిణీ చేస్తున్నామని మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ట్యాబ్ ఆమోదించేవరకు పింఛన్ల పంపిణీ సాధ్యం కాదని, అలాగైతే గంటలతరబడి వేలాదిమంది ప్రజలు నిరీక్షించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించి వాస్తవాలను గుర్తించాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. ఇలాగైతే సమస్యలే.. వృద్ధుల వేలిముద్రలను ట్యాబ్ ఆమోదిస్తేనే పింఛను చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తే వేలాది మంది ఇబ్బందులు పడతారని అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రజలు తమను నిలదీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే సక్రమంగా పింఛను అందక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు ఇకపై కొత్త నిబంధనలతో మరింత కష్టాల్లో పడతామని ఆందోళన చెందుతున్నారు. దీనిపై చిలకలూరిపేట ఎంపీడీవో వి.వసంతలక్ష్మిని వివరణ కోరగా, పింఛన్ల పంపిణీ త్వరగా ముగించేందుకు సిబ్బంది వారి వేలిముద్రలే ఎక్కువగా వేస్తున్నారని తెలిపారు. అర్హులు ఉన్నప్పటికీ ఇదే పద్ధతి అవలంబిస్తున్నారని చెప్పారు. వీటిని నియంత్రించేందుకే ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకుందని వివరించారు. -
తిరుమలలో కుంభవృష్టి
సాక్షి, తిర ుమల: తిరుమలలో కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు భారీ స్థాయిలో వాన కురిసింది. ఆలయ ప్రాంగణం జలమయమైంది. ఆలయంలో నిలిచిన వర్షపు నీటిని మోటార్లతో వెలుపలకు తరలించారు. ఆలయం ముందు, నాలుగు మాడ వీధుల్లో వాన నీరు ఉధృతంగా ప్రవహించింది. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని వెలుపల వచ్చిన భక్తులు భారీ వర్షంలోనే తడుస్తూ వచ్చారు. వృద్ధులు, చంటి బిడ్డలు కష్టాలు చవిచూసారు. ఆలయ సిబ్బంది కూడా జోరువానలోనే ఆలయంలోకి వెళ్లి రావడం కనిపించింది. వర్షం వల్ల ఆలయం ఎదురుగా ఉన్న ఓ దుకాణం కూలింది. ఇక తిరుమల రెండు ఘాట్రోడ్లలో కూడా భారీ స్థాయిలోనే వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల చెట్ల కొమ్మలు, చిన్నపాటి కొండ చరియలు రోడ్డుపై పడ్డాయి. -
రూకల కోసం.. నడకయాతన
– ప్రతి నెలా వేలల్లో పంపిణీ కాని పింఛన్లు – అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు – ఆఫ్లైన్పై దృష్టి పెట్టని అధికారులు – పింఛన్దారులకు తప్పని వెతలు ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. ఫలితంగా ప్రతి నెలా వేలాది మంది లబ్ధిదారులకు పింఛన్ అందడం లేదు. పింఛన్దారులు తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్తుండడంతో ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే..పంపిణీ సిబ్బంది అసలు తమ ఇళ్ల వద్దకే రావడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా అంతిమంగా వేలాది మందికి పింఛన్ కష్టాలు తప్పడం లేదు. అనంతపురం టౌన్ : ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 3,86,826 మంది పింఛన్దారులు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య 2,00,778 మంది, వితంతు 1,19,042, వికలాంగ 55,572, చేనేత 11,240, కల్లుగీత పింఛన్దారులు 194 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు వెలుగు సీసీలు మొత్తం 1,261 మంది పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 1–5లోపు పూర్తి చేయాలని ఆదేశాలున్నా అది సాధ్యం కావడం లేదు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా అమలు కావడం లేదు. ఆఫ్లైన్పై దృష్టి పెట్టని అధికారులు పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ట్యాబ్లు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంకేతాలు (సిగ్నల్స్) అందకపోవడంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంకేతాలందే ప్రాంతాల్లో కార్యదర్శులు, సీసీలు కూర్చుని పింఛన్లు పంపిణీ చేయాల్సి వస్తోంది. సంకేతాలు సక్రమంగా అందకపోవడం, వేలిముద్రల సమస్యలతో ఒక్కో పింఛన్ అందించేందుకు 15 నిమిషాల వరకు పడుతోంది. మరికొన్ని చోట్ల రెండు, మూడు రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో పాటు పింఛన్ పంపిణీ సిబ్బంది వేరే ప్రాంతాల నుంచి వస్తుండడంతో సకాలంలో ప్రక్రియ పూర్తి కావడం లేదు. వాస్తవానికి సంకేతాలు అందని ప్రాంతాల్లో ఆఫ్లైన్లో పంపిణీ చేసి, ఆ తర్వాత డేటాను ఆన్లైన్లో నమోదు‡ చేసే అవకాశముంది. ఈ విషయంలో చాలా మంది ఎంపీడీఓలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైగా సకాలంలో పూర్తి చేయాలన్న నిబంధనతో చాలాచోట్ల పంచాయతీ కేంద్రంలోనే పంపిణీ చేపడుతున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల వృద్ధులు, వికలాంగులు వ్యయ ప్రయాసలకోర్చి అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. కొన్ని పంచాయతీ కేంద్రాలు దూరంగా ఉండడం, రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఇలాంటి చోట్ల నరకయాతన అనుభవిస్తున్నారు. 22,936 మందికి అందని పింఛన్ ఆగస్టుకు సంబంధించి 3,86,826 పింఛన్లు మంజూరవగా.. పంపిణీ చేసింది 3,63,926. అంటే 22,936 మందికి అందలేదు. మిగులు మొత్తం రూ.2,63,07,000. ఆగస్టులోనే కాదు.. ప్రతి నెలా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. ఆరు నెలలుగా పింఛన్ తీసుకోని వారి వివరాలు నెల మంజూరైన పింఛన్లు అందుకోని వారు మార్చి 3,88,983 25,152 ఏప్రిల్ 3,87,043 18,283 మే 3,87,759 21,973 జూన్ 3,87,654 17,631 జూలై 3,87,479 20,359 ఆగస్టు 3,86,826 22,936 ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలన్న ఆదేశాలున్నాయి పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలన్న ఆదేశాలున్నాయి. ప్రస్తుతానికి నడవలేని స్థితిలో ఉన్న వారికి వాళ్ల ఇంటి వద్దే ఇస్తున్నాం. సాంకేతిక ఇబ్బందులున్న చోట ఆఫ్లైన్లో పంపిణీ చేస్తున్నాం. వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పింఛన్లు మాత్రమే మిగులుతున్నాయి. రెండు నెలలు రాకపోయినా మూడో నెలలో వస్తే పింఛన్ మొత్తం అందజేస్తాం. – వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ రెండు కిలోమీటర్లు నడవాలి నేను యాడికిలోని రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నా. పింఛన్ను కోన రోడ్డులోని చౌడేశ్వరి గుడి వద్ద ఇస్తారు. అక్కడికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతదూరం వెళ్లి తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. – చిన్న నారాయణ, యాడికి -
పింఛన్ పాట్లు
► సర్వర్ ఎఫెక్ట్.. ► పింఛన్ కోసం పండుటాకుల పాట్లు ► ఒకటిన్నర కిలోమీటరు కాలినడక పుట్లూరు : ఒకటో తారీఖు వచ్చిందంటే వద్ధులు, వికలాంగులు, వితంతువుకు ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తుంది. అందరూ సంతోషంగా వెళ్లి పింఛన్ తీసుకుంటారు అని అనుకుంటాం. కానీ పుట్లూరు మండలం గరుగచింతలపల్లి పింఛన్దారులు ఆ రోజు వచ్చిందంటే వణికిపోవాల్సిన పరిస్థితి. ఇందుకు కారణం ఆ గ్రామంలో పింఛన్ బట్వాడా చేయడానికి సర్వర్ పని చేయదు. దీంతో పింఛన్ను తీసుకోవాలంటే గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో గుట్టపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్దకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ గ్రామంలో 240 మంది పింఛన్దారులు ఉండగా అందులో 180 మంది ముసలి ముతకలే ఉన్నారు. వీరిలో 60 మంది పురుషులు, 120 మంది స్త్రీలు ఉన్నారు. ఊతకర్ర పట్టుకుని రోడ్డుపై గుంపులు గుంపులుగా వెళుతున్న పండుటాకుల ఇబ్బందులను సోమవారం ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. తమకు గ్రామంలోనే పింఛన్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
'జన్మభూమి'లో రసాభాస
తూర్పుగోదావరి(తొండంగి): తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామంలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. పింఛన్లు తీసేశారంటూ గ్రామంలో వృద్ధులు, వితంతువులు ప్రభుత్వాధికారులను నిలదీశారు. మాకు పింఛన్ మంజూరు చేస్తారా ? లేదా అని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులకు సమాధానం చెప్పలేక అధికారులు వెనుదిరిగారు. -
ఫన్డుటాకులు
ఓ పదిమంది వృద్ధులు ఒకచోట చేరితే ఏం చేయగలరంటే టక్కున చెప్పే సమాధానం.... ‘జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు’ అని. కానీ ‘డాక్టర్ ఎ.ఎస్.రావ్ నగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్’ దీనికి భిన్నం. వయసు శరీరానికి కానీ, మనసుకి మంచి ఆలోచనలకు కాదంటున్నారీ ఈ అసోసియేషన్ సభ్యులు. నర్సింహారావ్, బిఎస్ నాయుడు, కె, ఆర్ శర్మ... ఈ ముగ్గురు స్నేహితులు కలిసి ఓ యాభైమంది సభ్యులతో 2001లో ఏర్పాటు చేసిన సంఘంలో ప్రస్తుతం 1,050మంది ఉన్నారు. వీరంతా వివిధ రంగాల్లో అనుభవజ్ఞులు. ‘తెల్లవారుజామున వాకింగ్తో మొదలయ్యే మా ప్రయాణం రాత్రి ఎనిమిదింటికి చెస్ ఆటతో ముగుస్తుంది. మధ్యలో బోలెడన్ని యాక్టివిటీస్’ అంటూ తమ సంఘం స్పెషాలిటీ గురించి చెప్పారు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి రామ్మోహన్రావ్. మొన్నీమధ్యనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘాన్ని ‘బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవార్డ్’తో సత్కరించింది. వాకింగ్ ట్రాక్... అసోసియేషన్కి ప్రత్యేక భవనం ఏర్పాటు చేసుకున్నారు. దాని చుట్టూరా వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. భవనంలోపలికి అడుగుపెట్టగానే బయట వరండాలో కనిపించేవి... ఓ యాభై కుర్చీలు. మధ్యలో టీపాయ్పై ఓ పది రకాల న్యూస్ పేపర్లు. ఇక ముందు గదిలో లైబ్రెరీ, రెండో గదిలో పది క్యారెమ్ బోర్డులు, ఆరు చెస్ బోర్డులుంటాయి. వాకింగ్ పూర్తయ్యాక ఇంటికెళ్లి టీ, టిఫిన్స్ ముగించుకుని మళ్లీ ఇక్కడికి చేరుకుంటారు. కాసేపు న్యూస్పేపర్లు తిరగేసి పుస్తకం అందుకునేవాళ్లు కొందరైతే... ట్రెడ్మిల్పైకి చేరేవారు ఇంకొందరు. ఆటలంటే ఇష్టమున్నవాళ్లు క్యారమ్ బోర్డు ముందో, చెస్ బోర్డు ముందో సెటిల్ అయిపోతారు. ఇవన్నీ కాదు పురాణకాలక్షేపం కావాలనుకునేవారు బిఎస్ రావ్గారి దగ్గరికి చేరిపోతారు. ఇలా చక్కని దినచర్యని ప్లాన్ చేసుకున్నారు. నెలకో పుట్టినరోజు... నెలమొత్తంలో ఎవరెవరి పుట్టినరోజులున్నాయో చూసుకుని అందరికీ ఒకరోజు గ్రాండ్గా పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తారు. బర్త్డే అనగానే అందరికీ కేకులు, చాక్లెట్లు గుర్తొస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు. అందరికీ సతీసమేతంగా ఆహ్వానాలుంటాయి. వారి కుటుంబసభ్యులు కూడా వస్తారు. ‘వారిని శాలువా కప్పి, పూలతో సత్కరించి, వాళ్ల జీవితం గురించి నాలుగు ముక్కలు చెప్పి ఘనంగా సన్మానిస్తాం. ఆ రోజు అందరికీ నచ్చిన మెనూతో భోజనాలుంటాయి’ అంటూ ఆనందంగా చెప్పారు వైస్ ప్రెసిడెంట్ శంకర్రావ్. ‘నెలకు రెండుసార్లు హెల్త్క్యాంపులు ఏర్పాటు చేసుకుంటాం. బీపీ, షుగర్ టెస్ట్ల పరికరాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఎవరికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పరీక్షలు చేసేసుకుంటాం. ఐ, డెంటల్ స్పెషలిస్ట్లు కూడా వస్తుంటారు’ అని మెడికల్ వ్యవహారాలు చూసే ఎస్.వి.రావ్ తెలిపారు. రోజు గడవదు... ఈ సంఘంలో ఉన్న వారి వెయ్యిమంది పిల్లల్లో తొంభైశాతంమంది విదేశాల్లోనే స్థిరపడ్డారు. దాంతో అన్నీఉన్నా... ఇంట్లో పిల్లల సందడి లేక బోర్ఫీలయ్యేవారికి అసోసియేషన్ బిల్డింగ్ బోలెడంత కాలక్షేపంతోపాటు సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన ఉన్నవారికి చేయూతనిస్తుంది. ‘మా సంఘం తరపున ధూమపాన నిషేధం అమలు చేయిస్తున్నాం. అసోసియేషన్లో చేరేప్పటికి చైన్స్మోకర్లై ఉండి... కొద్దికాలంలోనే పూర్తిగా మానేసినవారు చాలామంది. అలాగే ఎవరైనా పొగతాగుతూ కనిపిస్తే.. కౌన్సెలింగ్ ఇచ్చి వారితో కూడా మాన్పించే ఉద్యమం చేపట్టాం’ అని గర్వంగా చెబుతారు డెరైక్టర్ తాతాచారి. ఆత్మీయానుబంధాలు పంచడానికి బంధువులే కానక్కర్లేదు. ‘ఈ భవనంతో మాకు చాలా అనుబంధం ఏర్పడింది. విదేశాల్లో పిల్లల దగ్గరికి వెళ్లినపుడు కూడా ఈ భవనం... ఇక్కడి స్నేహితులే గుర్తుకొస్తారు. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చివాలదామా అనిపిస్తుంటుంది’ అని చెప్పారు ఎమ్. పి దాస్. తోటి వారి కోసం... అరవైదాటిన ఈ వృద్ధులంతా తమ గురించి మాత్రమే ఆలోచించుకోవడంలేదు. వీలైనపుడల్లా తలో వందా చందా వేసుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వృద్ధాశ్రమాలకు ఆర్థికసాయం చేస్తున్నారు. భద్రాచలం దగ్గరున్న ‘మానవసేవా సమితి’కి, ఇబ్రహీంపట్నంలో ఉన్న ‘మాతాపితా’ ఆశ్రమానికీ వెళ్తారు. ఒకరోజంతా అక్కడే ఉండి వారి సాదకబాధకాలు తెలుసుకుంటారు. తోచినసొమ్ముని చేతిలో పెట్టి వస్తారు. నగరం విస్తరిస్తున్నట్లే వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్న కుటుంబాల సంఖ్యా పెరుగుతోంది. దూరంగా ఉన్న బిడ్డలను తలుచుకుంటూ విశ్రాంత జీవితాన్ని అవిశ్రాంతంగా గడపకుండా... నలుగురితో కలిసి ఆనందమయం చేసుకోవడమే కాదు, నలుగురికి ఆర్థిక సాయమూ అందిస్తున్న వీరు అభినందనీయులు! మీరూ పంపండి.. యాభై దాటితే సగం జీవితం అయిపోయినట్టేనా?.. ‘కాదు.. జస్ట్ బిగిన్’ అంటున్నారు సీనియర్ సిటిజన్స్. ఆటపాటలు.. ఇష్టమైన వ్యాపకాలతో స్నేహిస్తూ.. కాసింత చారిటీకి టైమిస్తూ జీవితాన్ని ‘కొత్త బంగారు లోకం’ చేసుకుంటున్న సీనియర్ సిటి‘జెమ్స్’ ఎందరో!. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అని చాటుతున్న మీరు.. మీ అసోసియేషన్ లేదా వృద్ధాశ్రమాల యాక్టివిటీస్ గురించి మాకు రాసి పంపండి. మీ ఎక్స్పీరియన్స్ మరెందరికో ఇన్స్పిరేషన్. ముదిమి వయసులో ఒంటరితనం ఎంత భయంకరమో మాటల్లో చెప్పలేం. చదువులు, ఉద్యోగాల పేరుతో రెక్కలొచ్చిన పిల్లలు తలోదిక్కూ ఎగిరిపోతే... దిగులుపడే పండుటాకులు ఎంతోమంది. అలాంటి కొందరు ఇప్పుడు ఒకచోట చేరి సరికొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడి సిక్స్టీస్లో జీవితాన్ని స్వీట్ సిక్స్టీన్లా మార్చుకుంటున్నారు. వెయ్యిమందికిపైగా సభ్యులతో... నిత్యం కొత్త ఉత్సాహంతో కనిపించే ‘ఎ.ఎస్.రావ్ నగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్’ గురించి..... భువనేశ్వరి మెయిల్: sakshicityplus@gmail.com -
రోడ్డెక్కిన పండుటాకులు
పరిగి: తమకు పింఛన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వృద్ధులు, వితంతువులు రోడ్డెక్కారు. పరిగి పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై శనివారం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తాము అన్ని రకాలుగా అర్హులమైనప్పటికీ పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరమ్ సర్టిఫికెట్లు ఉన్నా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మూడు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్న అధికారులు పింఛన్ల విషయం మాత్రం తేల్చడం లేదన్నారు. ఈ ఆందోళనతో రోడ్డుపై భారీ మొత్తంలో వాహనాలు స్తంభించాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. బీజేపీ మండల అధ్యక్షుడు పెంటయ్యగుప్తా, ప్రధాన కార్యదర్శి రాంచందర్లు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామని ఎంపీడీఓ విజయప్ప హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. -
ఇదేనా భరోసా..!
తాళ్లూరు:ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నారు.. పింఛన్ల పునః పరిశీలనలోనూ అర్హులుగా తేలారు. జన్మభూమి సభల్లో ఎన్టీఆర్ భరోసా పత్రాలూ అందుకున్నారు. ఆ నెల పింఛన్ కూడా తీసుకున్నారు. కానీ మరుసటి నెలకే జాబితాలో పేరు లేదు. అదేమిటంటే ఆధార్ నంబరు సరిగా నమోదు కాలేదని కొందరివి..వేలిముద్రలు సరిపోలేదని మరికొందరివి నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు. ఏ ఆధారం లేని తమకు ఉన్న పింఛనూ తీసేశారు..ఇదెక్కడి అన్యాయమంటూ పింఛన్దారులు లబోదిబోమంటున్నారు. సర్కారు ఇస్తామన్న భరోసా ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. తాళ్లూరుకు చెందిన లోకిరెడ్డి సుబ్బారెడ్డి ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాడు. ప్రైవేటుగా డిగ్రీ చేస్తున్నాడు. వికలాంగుడు కావడంతో రెండేళ్ల నుంచి పింఛన్ వస్తోంది. ఇటీవల సామాజిక పింఛన్ల తనిఖీలో అర్హుడిగా తేల్చారు. దీంతో బట్వాడా కోసం పోస్టుమాస్టర్ వద్దకు వెళ్లాడు. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు సరిపోవడం లేదు..ఆధార్ నంబరు తప్పుగా నమోదైందని..దీంతో మీకు పింఛన్ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. గత నెల రోజులుగా ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరిగి ఆధార్ నంబరు నమోదు చేసుకున్నాడు. అయినా రెండో నెలలో పింఛన్ రాలేదు. దీంతో ఏం చెయ్యాలో ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి. వీరే కాదు..ఇదే సమస్యలతో వందల మంది పింఛన్దారులు అర్హులై ఉండీ..పింఛన్ అందక నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ సక్రమంగా నమోదు కాక, బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు సరిపోక నియోజకవర్గంలో దాదాపు 1310 మంది పింఛన్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. వీరిలో అనేక మంది వృద్ధులు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు కొనేందుకు పూర్తిగా పింఛన్ నగదుపైనే ఆధారపడుతున్నారు. దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 20,025 మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో పింఛన్ల పునః పరిశీలనలో 3,726 పింఛన్లు రద్దయ్యాయి. ఆధార్ కార్డుల్లేక, వేలిముద్రలు సరిపోక మరో 1310 పింఛన్లు ఆగాయి. గతంలో బయోమెట్రిక్ విధానంలో వృద్ధుల వేలిముద్రలు నమోదు కాకపోతే..వారి బంధువులవి ఆన్లైన్లో నమోదు చేసేవారు. మళ్లీ నూతన పద్ధతి అంటూ ఈనెల పింఛన్లు ఆపేశారు. పింఛన్లపై ప్రభుత్వం రోజుకో విధానం అవలంబిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో తమకు జరిగిన అన్యాయంపై అడిగేందుకు సిద్ధమవుతున్న పింఛన్దారులను పోలీసులు అడ్డుకుంటున్నారని... ఇక న్యాయం ఎక్కడ జరుగుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. పింఛన్ పత్రాలు ఇవ్వడం ఎందుకు ?: కోటమ్మ ఐదేళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నా. ఊళ్లో పంచాయతీ దగ్గర సభ పెట్టిన పింఛన్ భరోసా పత్రాలిచ్చారు. ఆ నెల పింఛన్ తీసుకున్నా. మాకు భూములున్నాయని ఎవరో చెప్పి పింఛన్ ఆపించేశారంట. మరి భరోసా పత్రాలివ్వడం ఎందుకు? మళ్లీ పింఛన్ తొలగించడం ఎందుకు? ఇటువంటి పత్రాలున్నా..పోయినా ఒక్కటే. మా లాంటి వారిని ఇబ్బంది పెడితే పుట్టగతులుండవు. -
8 నుంచి పింఛన్ల పంపిణీ
తొలి నెలలో నేరుగా లబ్ధిదారుల చేతికే పెంచిన పింఛన్ నగదు కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో కేటీఆర్ తర్వాత నెల నుంచి గతంలో మాదిరిగా చెల్లింపు సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పెంచిన పింఛను సొమ్మును తొలి నెలలో నేరుగా లబ్ధిదారుల చేతికే ఇవ్వనున్నట్లు చెప్పారు. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల ప్రక్రియపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో మాట్లాడారు. తొలి నెల్లో నేరుగా చేతికే: వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1,500 చొప్పున పింఛన్ల సొమ్మును నేరుగా వారి చేతికే అందించడం ద్వారా.. వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేయాలని కేటీఆర్ అధికారులను కోరారు. ‘తర్వాతి నెల నుంచి గతంలో మాదిరిగా చెల్లింపులు ఉంటాయి. గ్రామం యూనిట్గా పింఛన్లను పంపిణీ చేయాలి. ప్రారంభించిన మూడు రోజుల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలి’ అని చెప్పారు. పంపిణీలో సమస్యలు తలెత్తకుండా లబ్ధిదారులకు పింఛన్ అందినట్లు కంప్యూటరైజ్డ్ రసీదు తీసుకోవాలని సూచించారు. వారంలోగా వెరిఫికేషన్..: పింఛన్ల పంపిణీకి గడువు దగ్గర పడుతున్నందున దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, వారంలోగా పూర్తి చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల కోసం 39,90,197 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 19,27,049 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ఆహార భద్రతా కార్డుల కోసం 92,06,366 దరఖాస్తులు రాగా, 19,28,528 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. పింఛన్ల విషయమై ఇప్పటికే ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ, పెరిగిన పింఛను విషయమై మరింత విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. వితంతువుల పింఛను దరఖాస్తుల పరిశీలన సందర్భంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రాల కోసం వారిని ఒత్తిడి చేయవద్దని ఆదేశించారు. -
పండుటాకుల ఘోష పట్టదా!
‘‘జీవితపు తొలి అడుగులు వేస్తున్న పిల్లలు, మలిసంధ్యలో ఉన్న వృద్ధులు, రోగగ్రస్తులు, వికలాంగులతో వ్యవహరించే తీరు ఆయా ప్రభుత్వాల నైతికతకు తార్కాణాలు. అయితే ఇప్పుడిది గతకాలపు మాటగా మాత్రమే మిగిలిపోయింది’’ - అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు హ్యుబెర్ట్ హంఫ్రీ వయసుకు మర్యాద ఇవ్వడం మన సంస్కృతి. కానీ భారత్లో ఇప్పుడేం జరుగుతోంది? ఉన్న పదికోట్ల మంది వృద్ధుల్లో (అరవై ఏళ్లు పైబడినవారు) 66 శాతం మంది పస్తులతో ఉంటున్నారు. 37 శాతం మంది ఒంటరితనానికి, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు నిత్యం మానసిక, శారీరక హింసకు లోనవుతున్నారు. ఎంత దారుణం? అందుకే జీవితాన్ని కాచివడబోసిన వీరిప్పుడు తమ హక్కుల కోసం గొంతెత్తుతున్నారు. ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. తమ గోడు పట్టదా అని శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనకు దిగనున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్కు చెందిన సెంటర్ ఫర్ లైఫ్లాంగ్ లెర్నింగ్ వీరికి బాసటగా నిలుస్తోంది. చట్టుబండలైన చట్టాలు దేశంలో వయోవృద్ధుల సంక్షేమం కోసం చట్టాలు ఉండనే ఉన్నాయి. ఆకలి, వ్యాధులు, పేదరికం, నిర్లక్ష్యం, అభద్రత భావాల నుంచి సీనియర్ సిటిజన్లను రక్షించే ఉద్దేశంతో కేంద్రం 1999లో ‘నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్’ (ఎన్పీఓపీ), 2007లో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ (ఎండబ్ల్యూపీఎస్సీఏ), అదే ఏడాది ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ పేరుతో మూడు చట్టాలను తెచ్చింది. భారతీయ రాజ్యాంగం తన ఆదేశ సూత్రాల ద్వారా వయో వృద్ధులకు కల్పిస్తున్న హక్కులు అమలు చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని కేంద్రం భావించింది. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలను అసలు పట్టించుకోకపోగా, కొన్ని నామమాత్రంగా అమలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నాయి. మూడేళ్లుగా నిరసనోద్యమాలు తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించేందుకు దేశంలోని వయోవృద్ధులు ‘ఆలిండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్’ నేతృత్వంలో మూడేళ్లుగా నిరసిస్తూనే ఉన్నారు. గతేడాది, ఈ ఏడాది ఆగస్టు ఒకటవ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ముంబైతోపాటు అనేకచోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. డిమాండ్లు ఏమిటి? ఇప్పటికే చేసిన చట్టాలను పటిష్టంగా అమలు చేయడం ప్రధాన డిమాండ్ కాగా, సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్రం ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందించి అమలు చేయాలని అఖిల భారత సీనియర్ సిటిజెన్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు డాక్టర్ కింజావాడేకర్ కోరుతున్నారు. వీటితోపాటు వయోవృద్ధుల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి కోసం ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా ఆరోగ్యశ్రీ వంటి ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని, వృద్ధాప్య పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వృద్ధుల ఆర్థిక భద్రత కోసం ప్రత్యేక సేవింగ్స్ పథకాన్ని తీసుకురావాలని, ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. యాభై ఎనిమిదేళ్లు పైబడ్డ మహిళలకు ఇస్తున్నట్లే తమకు కూడా రైల్వే ప్రయాణాల్లో 50 శాతం రాయితీ కల్పించాలని, వృద్ధుల ఆదాయంపై వసూలు చేసే పన్ను (టీడీఎస్)కు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్