online sales
-
న్యూ ఇయర్ వేడుకల కోసం భారతీయుల అరాచకం.. ఏం చేశారంటే?
ఢిల్లీ : కొత్త ఏడాది 2025 సందర్భంగా ఆన్లైన్ అమ్మకాలు సరికొత్త రికార్డ్లు నమోదు చేశాయి. డిసెంబర్ 31 రోజున ద్రాక్ష నుంచి కండోమ్స్ వరకు.. చిప్స్ ప్యాకెట్ల నుండి హ్యాండ్కఫ్ల వరకు కస్టమర్లు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారని ఫాస్ట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లింకిట్, బిగ్బాస్కెట్తో పాటు ఫాస్ట్ డెలివరీ స్టార్టప్లు ఆన్లైన్ అమ్మకాల రిపోర్ట్ను విడుదల చేశాయి. తమ డెలివరీ ఎగ్జిక్యూటీవ్లు మంగళవారం సాయంత్రం 8 గంటల వరకు చిప్స్, కోక్, నామ్కీన్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాత్రి 8 గంటల వరకు 2.3 లక్షల ప్యాకెట్ల ఆలూ భుజియా, 6,834 ఐస్ క్యూబ్ల ప్యాకెట్లను కస్టమర్లకు అందించినట్లు వెల్లడించారు. 39 శాతం చాక్లెట్ ఫ్లేవర్ కండోమ్ విక్రయించగా.. స్ట్రాబెర్రీ 31 శాతం, బబుల్గమ్ 19 శాతం అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. 1,22,356 packs of condoms45,531 bottles of mineral water22,322 Partysmart2,434 Eno..are enroute right now! Prep for after party? 😅— Albinder Dhindsa (@albinder) December 31, 2024 నిన్న కస్టమర్లు ద్రాక్ష పండ్లను ఎక్కువ మొత్తంలో ఆర్డర్ పెట్టడంపై దిండా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఈరోజు ద్రాక్ష పండుకు ఇంత క్రేజ్ ఏంటి? ఉదయం నుండి ప్లాట్ఫారమ్లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువులలో ఇదొకటి!’అని ట్వీట్లో పేర్కొన్నారు.అదే సమయంలో మంగళవారం సాయంత్రం 7:30ల వరకు స్విగ్గీ ఇన్స్టామార్ట్ నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్లను, బ్లైండ్ఫోల్డ్స్, హ్యాండ్కఫ్లను డెలివరీ చేసింది. 7:41కి ఐస్ క్యూబ్స్ ఊహించని స్థాయిలో ఆర్డర్లు వచ్చాయని, కేవలం నిమిషం వ్యవధిలో 119 కిలోలు ఐస్ క్యూబ్స్ను డెలివరీ చేసినట్లు స్విగ్గీ ఇన్స్టామార్ట్ కోఫౌండర్ ఫణి కిషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిగ్బాస్కెట్లో కూల్డ్రింగ్స్ ఆర్డర్లు 552 శాతానికి చేరుకున్నాయి. డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్ల అమ్మకాలు 325 శాతం, పచ్చిక కార్పెట్, మాక్ టెయిల్ విక్రయాలు 200 శాతం పెరిగాయి.https://t.co/ookPgwMqg3 pic.twitter.com/oUViC73eGS— Albinder Dhindsa (@albinder) December 31, 2024 న్యూఇయర్లో జరిగిన ఆన్లైన్ అమ్మకాలతో కోవిడ్-19 రాకతో వినియోగదారుల అభిరుచి మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్విక్ కామర్స్ సంస్థల రాకతో సంప్రదాయ ఆఫ్లైన్ షాపుల్లో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టింది. నిమిషాల్లో డెలివరీతో బిజినెస్ స్ట్రాటజీ మెట్రో నగరాలను దాటి టైర్-2, టైర్-3 నగరాలకు పాకింది. ఫలితంగా వినియోగదారులు ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్ పెట్టుకుంటున్నట్లు తాజాగా, క్విక్ కామర్స్ డెలివరీ రిపోర్ట్లతో తేలింది. -
ఆన్లైన్ షాపింగ్ కోసం అత్యుత్సాహం వద్దు!: హెచ్చరికలు జారీ
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఎదురుచూస్తున్న బ్లాక్ఫ్రైడే సేల్స్ మొదలైపోయాయి, షాపింగ్ హడావిడి కూడా పెరిగిపోయింది. దీనిని అదనుగా తీసుకున్న స్కామర్లు.. ప్రజలను దోచుకోవడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ సారి జరిగే మోసాలు 89 శాతం ఎక్కువని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. దాదాపు 80 శాతం షాపింగ్ సంబంధిత ఇమెయిల్లు స్కామ్లుగా గుర్తించారు. వినియోగదారులను మోసం చేయడానికి స్కామర్లు గూగుల్ సెర్చింగ్ ఫలితాలను కూడా తారుమారు చేస్తున్నట్లు సమాచారం.బ్లాక్ఫ్రైడే సేల్స్ సందర్భంగా చాలా మోసాలు జరుగుతున్నాయని.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి హెచ్చరికలు జారీ చేసింది. బ్లాక్ఫ్రైడే, సైబర్ మండే, మిగిలిన సెలవు సీజన్లలో మోసాల నుంచి తమను తాము రక్షించుకోవాలని.. మోసాల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని ఎఫ్బీఐ పేర్కొంది.యూఎస్ మార్కెట్లో 95 శాతం ఆధిపత్యం చెలాయించే క్రోమ్, సఫారీ, ఎడ్జ్ వంటి ప్రసిద్ధ వెబ్ బ్రౌజర్ల వినియోగదారులను కూడా ఎఫ్బీఐ హెచ్చరిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆన్లైన్లో షాపింగ్ చేసే సమయంలో ఆఫర్ లేదా డిస్కౌంట్ వంటి వాటిలో ఏ మాత్రం అనుమానం అనిపించినా వెంటనే జాగ్రత్త పడాలి.ఆఫర్లు చూసిన మోసపోయి.. స్కామర్లకు బాధితులవ్వకండి. ప్రతి సంవత్సరం, వేలాది మంది ప్రజలు ఈ స్కాములకు బలైపోతున్నారని ఎఫ్బీఐ వెల్లడించింది. స్కామర్ల చేతికి చెక్కితే.. సంపాదించినా డబ్బు, వ్యక్తిగత సమాచారం వంటి వాటిని దోచుకుంటారు.ఎఫ్బీఐ ముందు జాగ్రత్త చర్యలుఆన్లైన్లో కొంతమంది వస్తువులపై ఎక్కువ ఆఫర్స్ ప్రకటిస్తూ ఆకర్షిస్తారు. ఇది నిజమని నమ్మి డబ్బు చెల్లించి, మీరు దానిని బుక్ చేసుకుంటే మీకు ఎప్పటికీ డెలివరీ రాదు. ఇలాంటి తరహా నాన్ డెలివరీ స్కామ్లు, నాన్ పేమెంట్ స్కామ్లు, గిఫ్ట్ కార్డ్ మోసాలు జరుగుతుంటాయి. ఇలాంటివి అస్సలు నమ్మకూడదు.Don't let #holiday excitement cloud your judgment! Always verify the legitimacy of online retailers and be cautious with unsolicited offers. Learn how to spot a holiday scam at https://t.co/rg1Twt4Nq2. pic.twitter.com/RBgftlHngh— FBI (@FBI) November 29, 2024 -
గాడిద పాల సబ్బు.. డబ్బే డబ్బు
సాక్షి, అమరావతి: గాడిద పాలు లీటర్ రూ.3 వేలు. అదే లీటరు పాలతో సబ్బులు తయారు చేస్తే రూ.11,980 ఆదాయం. గాడిద పాలకంటే.. ఆ పాలతో తయారు చేసే ఉప ఉత్పత్తులు సైతం అధిక లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం గాడిద పాలకు ప్రపంచమంతా క్రేజ్ వచ్చింది. ఏపీలో తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని తోకాడ వద్ద ప్రారంభించిన అక్షయ డాంకీ ఫౌండేషన్ నాలుగేళ్లలోనే మంచి గుర్తింపు పొందింది. రూ.80 లక్షల వ్యయంతో 10 ఎకరాల్లో ప్రారంభించిన ఈ ఫామ్ ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాల ఉత్పత్తి చేస్తోంది. ఈ పాలతో సబ్బులు, పాల పౌడర్ వంటి ఉప ఉత్పత్తులు తయారు చేస్తోంది. వారానికి 310 లీటర్ల పాల ఉత్పత్తిఅక్షయ డాంకీ ఫామ్లో దేశీయ నాటు గాడిదలతో పాటు అంతర్జాతీయంగా పేరొందిన హలారీ, కాట్వాడి, టోక్యో జాతులకు చెందిన గాడిదలున్నాయి. 80 గాడిదలతో ప్రారంభమైన ఈ ఫామ్లో ప్రస్తుతం వాటి సంఖ్య 120కు పెరిగింది. నాటు గాడిదలు రోజుకు సగటున 250–350 మిల్లీలీటర్ల పాలు ఇస్తుండగా, హలారి (గుజరాత్), కాట్వాడి (మహారాష్ట్ర), టోక్యో (ఇథియోఫియా) జాతి గాడిదలు రోజుకు 750 మిల్లీ లీటర్ల నుంచి 1.75 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. ప్రారంభంలో వారానికి 240 లీటర్ల పాల ఉత్పత్తి జరగ్గా.. ప్రస్తుతం 310 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. గాడిద పాలు పితికిన తర్వాత 3 గంటలకు మించి నిల్వ ఉండవు. పాశ్చురైజ్ చేసి ఫ్రిజ్లో ఉంచితే 3 రోజులు, డీప్ ఫ్రిజ్లో పెడితే 6 నెలలు, పౌడర్ రూపంలో అయితే రెండేళ్ల పాటు నిల్వ ఉంచొచ్చు. పిల్లలు తాగే పాలు లీటర్ రూ.3 వేలకు విక్రయిస్తుండగా.. కాస్మొటిక్ కంపెనీలకు రూ.5 వేల నుంచి రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. మూత్రాన్ని లీటర్ రూ.450, పేడ కిలో రూ.250 చొప్పున విక్రయిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువటగాడిద పాలల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పాలలో విటమిన్ ఏ, బీ1, బీ2, సీ, ఈతోపాటు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వే ప్రొటీన్, కాసియన్ ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయంటున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ పెంచేందుకు దోహదపడుతుందని, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు దివ్య ఔషధంగా ఉపయోగçపడుతుందని పేర్కొంటున్నారు. గాడిద మూత్రాన్ని ఆయుర్వేద మందుల తయారీ, పేడను ధూప్స్టిక్స్, ఎరువులుగా వాడతారు.ఈ–కామర్స్లో అమ్మకాలుగాడిద పాల సబ్బులు, గాడిద పాల పౌడర్ను అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తున్నారు. ఆర్డర్లను బట్టి వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. త్వరలో స్కిన్ లోషన్తో పాటు మరిన్ని ఉప ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు ఫ్లేవర్స్లో సబ్బుల తయారీక్లియోపాత్ర చర్మ సౌందర్యానికి గాడిద పాలే కారణమని చెబుతారు. గాడిద పాలతోనే స్నానం చేసేదాననని తన స్వీయ చరిత్రలో ఆమె రాసుకున్నారు. గాడిద పాలతో తయారు చేసే సబ్బులను మోడల్స్, సినీతారలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటి వాడకం వలన శరీరం కాంతివంతమవుతుందని, చర్మం త్వరగా ముడతలు పడదని చెబుతారు.అక్షయ డాంకీ ఫౌండేషన్ ఇటీవలే ఫామ్లో కొత్తగా సబ్బులు, పాల పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. లావెండర్, గులాబీ, హనీ–బెంటోనైట్ క్లే, అలోవెరా–ఫ్రెంచ్ గ్రీన్ క్లే వంటి నాలుగు రకాల సబ్బులను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. 100 గ్రాముల సబ్బు తయారీకి 50 మిల్లీలీటర్ల పాలను వినియోగిస్తున్నారు. ఒక్కో సబ్బును రూ.599 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ ఫామ్లో ఏడాదికి సుమారు 6 వేల సబ్బులు తయారవుతాయి.మిల్క్ పౌడర్కూ భలే గిరాకీగాడిద పాలతో తయారు చేసే పాల పౌడర్ను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాలు, బ్యూటీ కాస్మోటిక్స్ తయారీలో వినియోగిస్తుంటారు. ఒక స్పూన్ పౌడర్ లీటర్ నీటిలో కలుపుకుంటే అవన్నీ పాలుగా మారిపోతాయి. ఆస్తమా రోగులు ఎక్కువగా ఈ పాలను సేవిస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో పాల పౌడర్ ధర రూ.85 వేల పైమాటే. 13 లీటర్ల పాలతో కిలో పౌడర్ తయారవుతుంది. ఈ ఫామ్లో ఏటా 200 కేజీల పాల పౌడర్ను ఉత్పత్తి చేస్తున్నారు. 100 గ్రాముల పౌడర్ రూ.8,500 చొప్పున విక్రయిస్తున్నారు. సబ్బులకు మంచి డిమాండ్నాలుగేళ్లలోనే ఫామ్ను విస్తరించాం. గాడిదల సంఖ్యతోపాటు పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. సబ్బులు, పాల పౌడర్ తయారు చేస్తున్నాం. త్వరలో మరిన్ని ఉప ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – ఎం.ప్రదీప్, మేనేజర్, అక్షయ ఫౌండేషన్ -
ప్రేమికుల దినోత్సవం.. ఆన్లైన్లో వీటి అమ్మకాలు బీభత్సం!
ఈ వారంలో వాలెంటైన్స్ డే సందర్భంగా భారత్లో నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్లను ఆర్డర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ప్లాట్ఫాంపై గులాబీలు, చాక్లెట్స్, రొ**** గిఫ్ట్ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే వేడుకలు జరుగుతాయి. కానీ భారత్లో మాత్రం వారం రోజుల ముందు నుంచే ఊపందుకున్నాయి. దీంతో ఈ-కామర్స్,డేటింగ్ సైట్స్ యూజర్ల తాకిడితో కిక్కిరిసిపోయాయి. రొ**** ప్రోడక్ట్స్, గిఫ్ట్ల సేల్స్ విపరీతంగా పెరిగాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ వారంలో నిమిషానికి 350 రోజెస్, 406 చాక్లెట్స్ వినియోగదారులు కొనుగోలు చేయగా.. ఫిబ్రవరి 9న తాము నిమిషానికి 406 చాక్లెట్స్ డెలివరీ చేశామని ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం బ్లింకిట్ సీఈవో అల్బిందర్ థిండ్సా ట్వీట్ చేశారు. మరో 20,000కిపైగా చాక్లెట్స్, చాక్లెట్ బాక్స్లు మరో పది నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ అవుతాయని తెలిపారు. The peak is here and currently running at 406 CPM! More than 20k chocolates and chocolate boxes are on the way and will be delivered in the next 10 minutes ✌️ https://t.co/8ZGzncSzq3 — Albinder Dhindsa (@albinder) February 9, 2024 వాలెంటెన్స్ డే రోజు అమ్మకాలపై స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ ట్వీట్ చేశారు. భారతీయులు వాలెంటెన్స్ డేను సెలబ్రేట్ చేసుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారని ట్వీట్ షేర్ చేశారు. అందులో నిన్నటి నుంచి వాలెటెంటైన్స్ కోసం కేక్ ఆర్డర్లు పెరిగాయి. గరిష్టంగా రాత్రి 10 గంటల సమయంలో నిమిషానికి ఏడు కేకు ఆర్డర్లు వచ్చినట్లు చెప్పారు. అలాగే, ఎఫ్ఎన్పీ. కామ్ సంస్థ వాలెంటైన్స్ డే కి ఒక్కరోజు ముందు (ఫిబ్రవరి 13) నిమిషానికి 350 గులాబీలను అందజేస్తూ కొత్త రికార్డును నెలకొల్పింది. అంతే కాదు, వాలెంటైన్స్ డే రోజున ఆన్లైన్ పెట్టే కేక్ ఆర్డర్లు నిమిషానికి అంతకంతకూ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. -
పోటెత్తుతున్న యూజర్లు.. ఆ సేవల్ని రద్దు చేసిన ‘ఫ్లిప్ కార్ట్’!
ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యవసర వస్తువుల డెలివరీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో ఫ్లిప్కార్ట్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేక సేల్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ తరుణంలో మంగళవారం (అక్టోబర్10)న ఫ్లిప్కార్ట్ పోర్టల్కు యూజర్లు పోటెత్తారు. దీంతో ఫ్లిప్కార్ట్ సైట్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ సైట్లో నిత్యవసర వస్తువుల్ని బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన యూజర్లకు ఫ్లిప్కార్ట్ గ్రోసరీ సెగ్మెంట్లో చిన్న బ్యానర్ను డిస్ప్లే కనిపించింది. రేపటి నుంచి సరుకుల్ని బుక్ చేసుకోండనేది ఆ బ్యానర్ సారాంశం. ఫిర్యాదుల వెల్లువ అసలే పండగ సీజన్, పైగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది. ఈ సమయంలో గ్రోసరీ షాపింగ్ చేసే సమయంలో సమస్య తలెత్తుతుందంటూ కొనుగోలు దారులు ఫ్లిప్ కార్ట్కు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. సేవలు పున:ప్రారంభం అప్పుడే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభమైన మొదటి రెండు రోజులు ఊహించని విధంగా ఆర్డర్లు వచ్చాయి. అన్నీ కేటగిరీల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని అందించడమే మా లక్క్ష్యం. అయితే, కొత్త ఆర్డర్లను అక్టోబర్ 11 మిడ్ నైట్ 12 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రూ.90వేల కోట్ల ఆన్లైన్ అమ్మకాలు పండగ సీజన్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు ఆన్ లైన్ విక్రయాలు ఎంత మేర జరిగే అవకాశం ఉందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ ఓ నివేదికను విడుదల చేసింది. ‘రెడ్సీర్ సస్టట్రాటజీ కన్సల్టెంట్స్’ రిపోర్ట్ ప్రకారం.. ఆన్లైన్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 నుంచి 20 శాతం మేర పెరిగి రూ.90 వేల కోట్లు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది రూ.76,000 కోట్ల ఆన్లైన్ విక్రయాలు జరిగాయి. -
తాజా గోల్డ్ బాండ్ @ రూ. 5926
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023–24 తొలి విడత సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. బంగారం జారీ ధరను గ్రాముకు రూ.5,926గా ఆర్థికశాఖ ప్రకటించింది. ఐదు రోజుల పాటు (19–23) స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే ప్రకటిత ధరలో గ్రాముకు రూ.50 రిబేట్ లభిస్తుంది. అంటే ఆన్లైన్ ధర గ్రాముకు రూ.5,876గా ఉంటుందన్నమాట. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మొదటి ఆరు నెలల్లో రెండుసార్లు– జూన్ 19తో పాటు సెప్టెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకూ కూడా మరో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులో ఉండే సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!) గోల్డ్ బాండ్లు– షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీమ్యాట్ అకౌంట్తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా కొనుగోలు చేయొ చ్చు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసి యేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం సగ టు ధర ఆధారంగా ఎస్జీబీ ధరను నిర్ణయిస్తారు. -
వీల్స్ ఆన్ వెబ్: కార్ ఆన్లైన్లో ఆర్డర్ చేయండి.. ఇంటికొచ్చేస్తుంది!
ఇప్పటి వరకూ వివిధ రకాల వస్తువలు, దుస్తులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటివి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్లో కార్లు ఆర్డర్ చేసే వెసులుబాటు వచ్చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల తన బెంగళూరు కస్టమర్ల కోసం కొత్త ప్లాట్ఫామ్ను పరిచయం చేసింది. ‘వీల్స్ ఆన్ వెబ్’ పేరిట ఆన్లైన్ రిటైల్ సేల్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు షోరూంలకు వెళ్లే పని లేకుండా హాయిగా ఇంటి వద్దే ఉండి తమకు ఇష్టమైన టయోటా మోడల్ కార్లను ఆర్డర్ చేయొచ్చు. ఇంటి వద్దే కార్ డెలివరీ పొందవచ్చు. పత్రికా ప్రకటన ద్వారా కొత్త ప్లాట్ఫామ్ను ప్రకటించిన టయోటా సంస్థ ‘వీల్స్ ఆన్ వెబ్’ అనేది బిజినెస్ టు కస్టమర్ (B2C) ప్లాట్ఫామ్ అని తెలిపింది. డిజిటల్ స్పేస్లో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఈ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఆన్లైన్ ద్వారా కార్ కొనుగోలు చేసేవారు కారు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్లు, కలర్లు, వేరియంట్ల ప్రత్యేకతలను డిజిటల్గా వీక్షించవచ్చు. యాక్సెసరీలు, సర్వీస్ ప్యాకేజీలు, ఎక్స్టెండెడ్ వారంటీ వంటి విలువ-ఆధారిత సేవలను కూడా ఆన్లైన్లోనే ఎంచుకోవచ్చు. టయోటా వీల్స్ ఆన్ వెబ్లో కస్టమర్లు ఇప్పటికే తమ వద్ద ఉన్న పాత కార్లను సైతం ఎక్సేంజ్ కింద విక్రయించవచ్చు. ఇక్కడ వివిధ రకాల ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. బుకింగ్ అమౌంట్, పూర్తి మొత్తం లేదా డౌన్పేమెంట్ను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. ఆన్లైన్ కార్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రతి దశనూ వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. తాము కొత్తగా ప్రారంభించిన వీల్స్ ఆన్ వెబ్ ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫామ్ భారతదేశంలో కార్ల కొనుగోలు అనుభవాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ పేర్కొన్నారు. -
'నో కాస్ట్' ఈఎంఐ కిరికిరి, అసలు రహస్యం ఇది!
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రీటైల్, ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్ను నిర్వహిస్తుంటాయి. ఈ సందర్భంగా పలు ప్రొడక్ట్లపై డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్నిఅందిస్తుంటాయి. అయితే ఈ నోకాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి? ఈ నోకాస్ట్ ఈఎంఐ వల్ల కొనుగోలు దారులకు లబ్ధి చేకూరుతుందా? దాని వెనుక ఏదైనా మతలబు దాగి ఉందా? ఏడాదిలో జరిగే ఫెస్టివల్స్ సీజన్లో సంస్థలు ప్రొడక్ట్ల అమ్మకాలు జరిగేలా నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. అందుకే కొనుగోలు దారులు గృహోపకరణాలు, వెహికల్స్, గాడ్జెట్స్ను ఫెస్టివల్ సీజన్లో కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతుంటారు. ఈ కొనుగోలు ముందు ఈ నోకాస్ట్ ఈఎంఐ గురించి తెలుసుకోవాలని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. నో కాస్ట్ ఈఎంఐ అంటే ముందుగా నో కాస్ట్ ఈఎంఐ అంటే? నోకాస్ట్ ఈఎంఐ కింద ఓ వస్తువును ఎంత ధర పెట్టి కొనుగోలు చేస్తామో.. ఆ మొత్తాన్ని నెలనెలా కొద్ది మొత్తాన్ని చెల్లించాలి. ఆ మొత్తానికే సంస్థలు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయవు. ఇలా నెలవారీ చెల్లించే ఈఎంఐలపై ఎలాంటి వడ్డీని విధించకపోవడాన్ని నోకాస్ట్ ఈఎంఐ అంటారు. నోకాస్ట్ ఈఎంఐ కిరికిరి ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి అప్పుడే మార్కెట్లో విడుదలైన 5జీ ఫోన్ను నో కాస్ట్ ఈఎంఐ కింద రూ.30వేలకు కొనుగోలు చేస్తాడు. ఆమొత్తాన్ని 10 నెలల టెన్యూర్ కాలానికి ఒక్కో నెల 3వేలు చెల్లించి.. ఈఎంఐని క్లియర్ చేస్తాడు. వడ్డీ లేదని తెగ సంబర పడిపోతుంటాడు. కానీ ఈ నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లో జరిగేది అదికాదు. రమేష్ ఫోన్ ధర వాస్తవానికి రూ.27వేలు ఉంటుంది. సంస్థలు అదనంగా మరో రూ.3వేలు జత చేసి.. ఫోన్ ధర రూ.30వేలు ఉందని, మీకు డిస్కౌంట్లో జీరోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఊదర గొట్టేస్తుంటాయి. మరో రకమైన వసూలు మరో రకంగా చెప్పాలంటే అదే రమేష్ కొన్న 5జీ ఫోన్ వాస్తవ ధర రూ.30 వేలు ఉంటుంది. కానీ ఫోన్ తయారీ సంస్థలు జీరో కాస్ట్ ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంటాయి. ఆ ప్రాసెసింగ్ ఫీజు ఏంటో తెలుసా? మీకు అందించే ఈఎంఐ కింద సంస్థలు వసూలు చేసే వడ్డీ. తస్మాత్ జాగ్రత్త కాబట్టి, కొనుగోలు దారులు నోకాస్ట్ ఈఎంఐలో ప్రొడక్ట్ను కొనుగోలు చేయాలని అనుకుంటే.. తప్పని సరిగా నియమ నిబంధనల గురించి తెలుసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. చదవండి👉 ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా? -
దుమ్ములేపుతున్న ఆన్లైన్ అమ్మకాలు, ఏకంగా రూ. 94 వేల కోట్ల బిజినెస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ కంపెనీల జోరు కొనసాగుతోంది. దీపావళితో ముగిసే నెల రోజుల పండుగల సీజన్లో ఆన్లైన్ వేదికగా రూ.94 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని రెడ్సీర్ అంచనా వేస్తోంది. గతేడాది సీజన్తో పోలిస్తే ఇది 28 శాతం అధికమని వెల్లడించింది. పెరిగిన వినియోగదార్ల సంఖ్యకు అనుగుణంగా అమ్మకాలు అధికంగా ఉంటాయని రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అసోసియేట్ పార్ట్నర్ సంజయ్ కొఠారీ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ పండుగల సీజన్లో ఆన్లైన్ షాపర్స్ రెండింతలు కానున్నారని వివరించారు. ఫెస్టివ్ సేల్స్ పట్ల అవగాహన, విస్తృతి పెరగడం, కస్టమర్ల లక్ష్యంగా ఎంపికలు, ఉత్పత్తుల శ్రేణి విరివిగా అందుబాటు ధరలో ఉండడం ఇందుకు కారణమన్నారు. 2021లో ఆన్లైన్ సేల్స్ రూ.4,14,232 కోట్లు నమోదైంది. ప్రస్తుత సంవత్సరం ఇది 30 శాతం అధికమై రూ.5,41,688 కోట్లకు చేరనుందని రెడ్సీర్ అంచనా వేస్తోంది. | నాలుగింతల వృద్ధి.. ఆన్లైన్ కస్టమర్ల సంఖ్య 2018తో పోలిస్తే ఈ ఏడాది నాలుగింతల వృద్ధి నమోదు కానుందని రెడ్సీర్ తెలిపింది. ‘డిజిటల్ వైపు కస్టమర్లు బాట పట్టడం, ద్వితీయ శ్రేణి నగరాల్లో వినియోగదార్ల సంఖ్య పెరగడం ఈ స్థాయి వృద్ధికి దోహదం చేయనుంది. సీజన్ తొలి వారం రూ.47 వేల కోట్ల వ్యాపారం జరిగే చాన్స్ ఉంది. ఫ్యాషన్ విభాగం గణనీయంగా దూసుకెళ్లనుంది. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి కస్టమర్లు పెరగడమే ఇందుకు కారణం. అలాగే తొలిసారిగా ఆన్లైన్కు మళ్లినవారు ఫ్యాషన్ను ఎంచుకుంటారు. ఫ్యాషన్ బ్రాండ్స్ ఎక్కువ మొత్తంలో రంగ ప్రవేశం చేయనున్నాయి. మెరుగైన డీల్స్, నూతన ఆవిష్కరణల కారణంగా మొబైల్, ఎలక్ట్రానిక్స్ విభాగం బలమైన పనితీరు కనబర్చనుంది. లైవ్, వీడియో కామర్స్తో ఆన్లైన్ షాపర్స్ సంఖ్య మరింత పెరుగుతుంది’ అని వివరించింది. -
మరో ఆరు లేపాక్షి షోరూమ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హస్తకళలకు పెద్దఎత్తున ప్రచారం కల్పించడంతోపాటు వాటికి బ్రాండ్ ఇమేజ్ కల్పించడంలో లేపాక్షి ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వీటి తయారీలో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా కళాకారులు 23 రకాల హస్తకళలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ మరింత ఉపాధి చూపడంతోపాటు ఆ కళలను బతికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తరణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ప్రస్తుతమున్న 17 లేపాక్షి ఎంపోరియంలకు అదనంగా ఇప్పుడు మరో ఆరు కొత్త షోరూమ్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విశాఖపట్నం, విశాఖ విమానాశ్రయం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుమల, తిరుపతి, తిరుపతి శ్రీనివాసమ్, విష్ణు నిలయం, తిరుపతి విమానాశ్రయంతోపాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీలో లేపాక్షి షోరూమ్లు ఉన్నాయి, కొత్తగా విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గండికోట, కడప, తిరుపతిలో కూడా మరిన్ని షోరూమ్లు ఏర్పాటుచేయనున్నారు. ఒక్కో షోరూమ్ ఏర్పాటుకు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. హస్తకళల ప్రోత్సాహానికి బహుముఖ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ’ ద్వారా హస్తకళలను ప్రోత్సహించేలా బహుముఖ చర్యలు చేపట్టింది. ప్రధానంగా క్రాఫ్ట్మేళా, ఎగ్జిబిషన్, ప్రచారం, మార్కెటింగ్ వంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే.. మరికొంత మందికి ఉపా«ధి కల్పించేందుకు పెద్దఎత్తున శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా ‘కామన్ ఫెసిలిటి సర్వీస్ సెంటర్ (సీఎఫ్ఎస్సీ)లను ఏర్పాటుచేస్తోంది. వాటికి అవసరమైన మౌలిక వసతులు, యంత్రాలు, పరికరాలను ఏర్పాటుచేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతోంది. ఒకే గొడుగు కిందకు నైపుణ్యాన్ని, తయారీని, విక్రయాలను తీసుకొస్తోంది. ఆన్లైన్లోనూ విక్రయాలు ఇక రాష్ట్రంలో పేరెన్నికగన్న హస్తకళా ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతోపాటు తోలు బొమ్మలకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మంచి డిమాండ్ ఉంది. ఈ–కామర్స్ పాŠల్ట్ఫామ్లు అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో కూడా ఆన్లైన్ విక్రయాలు చేస్తున్నారు. ఈ ఏడాది రూ.35 లక్షలు విలువైన హస్తకళా ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మాలని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. -
పసిడి ‘ధనత్రయోదశి’ ధగధగలు
ముంబై: ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. కరోనా కారణంగా గతేడాది డిమాండ్ తగ్గగా.. ఈ ఏడాది పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. కొనుగోళ్లకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. గతేడాదితో పోలిస్తే 40 శాతం పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు చెప్పాయి. ఆన్లైన్ విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. 15 టన్నుల ఆభరణాలు.. జ్యుయలరీ పరిశ్రమ కరోనా మహమ్మారి నుంచి కోలుకుందని అఖిలభారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా రూ.7,500 కోట్ల విలువ మేర సుమారు 15 టన్నుల బంగారం ఆభరణాలు విక్రయాలు ధనత్రయోదశి రోజున నమోదయ్యాయి’’ అని తెలిపింది. గత డిమాండ్ తోడవ్వడం, ధరలు అనుకూలంగా ఉండడం, లాక్డౌన్ ఆంక్షలు సడలిపోవడం డిమాండ్కు మద్దతునిస్తాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సీఈవో సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత త్రైమాసికం ఇటీవలి సంవత్సరాల్లోనే బంగారానికి అత్యంత మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ధనత్రయోదశి సందర్భంగా బంగారానికి డిమాండ్ గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉందని పీసీ జ్యుయలర్స్ ఎండీ బలరామ్గార్గ్ సైతం తెలిపారు. గతేడాదితో పోలిస్తే డిమాండ్ రెట్టింపైనట్టు ఆగ్మంట్ గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కొథారి పేర్కొన్నారు. 20–30 టన్నుల మేర.. ‘‘బంగారం ధరలు 2019తో పోలిస్తే పెరిగినప్పటికీ.. కరోనా ముందు నాటి స్థాయికి విక్రయాలు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాము’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆవిష్ పెథే తెలిపారు. ఏటా ధనత్రయోదశి నాడు దేశవ్యాప్తంగా 20–30 టన్నుల బంగారం అమ్ముడుపోతోందని.. ఈ ఏడాది విక్రయాలు కొంచెం అధికంగానే ఉంటాయని పరిపరిశ్రమ వరా>్గలు వెల్లడించాయి. బంగారం ధరలు తులం రూ.57,000 స్థాయి వరకు వెళ్లి దిగి రావడం కూడా డిమాండ్కు కలిసొచ్చింది. ఢిల్లీలో బంగారం 10 గ్రాముల ధర రూ.47,644 (పన్నులు కాకుండా) పలికింది. అయితే 2020 ధనత్రయోదశి రోజున ఉన్న ధర రూ.39,240తో పోలిస్తే కాస్త పెరగడం గమనార్హం. బుధవారం ఉదయం వరకు త్రయోదశి తిథి ఉన్నందున ఆ రోజు కూడా బంగారం కొనుగోళ్లు కొనసాగనున్నాయి. హాల్మార్క్ ఉన్న ఆభరణాలే కొనండి హాల్మార్క్ కలిగిన ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వద్ద నమోదైన వర్తకులకు చెందిన దుకాణాల్లో మాత్రమే హాల్మార్క్ ఆభరణాలను, కళాఖండాలను కొనుగోలు చేయాల్సిందిగా వినియోగదార్ల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ‘బిల్లు/ఇన్వాయిస్ తప్పనిసరిగా తీసుకోవాలి. హాల్మార్క్ ఆభరణాల విక్రయ బిల్లు, ఇన్వాయిస్లో.. ప్రతి ఆభరణం తాలూకు ప్రత్యేక వివరణ, విలువైన లోహం నికర బరువు, క్యారెట్లో స్వచ్ఛత, హాల్మార్కింగ్ రుసుమును సూచిస్తుంది’ అని వివరించింది. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో 2021 జూన్ 23 నుంచి 14, 18, 22 క్యారట్ల ఆభరణాలకు హాల్మార్కింగ్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
రూ. 100కే గోల్డ్..! సరికొత్త వ్యూహంతో గోల్డ్ జ్యువెలర్స్ కంపెనీలు..!
దేశవ్యాప్తంగా కరోనా, లాక్డౌన్ పరిస్థితుల ప్రభావంతో బంగారం అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పుడిప్పుడే బంగారం అమ్మకాలు తిరిగి పుంజుకుంటున్నాయి. కొనుగోలుదారులు ఆన్లైన్ ఫ్లాట్ఫామ్స్లో బంగారం కొనుగోలుపై గణనీయంగా దృష్టిసారించారు. దీంతో పలు జ్వువెలరీ కంపెనీలు కూడా ఆన్లైన్ అమ్మకాలపై దృష్టిపెట్టాయి. చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే రూ.100 కే గోల్డ్..! తాజాగా టాటా గ్రూప్కు చెందిన తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జ్యువెలర్ లిమిటెడ్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి గోల్డ్ జ్వువెలరీ కంపెనీలు కనిష్టంగా రూ. 100 కూడా బంగారం అందించే ప్లాన్స్తో ముందుకువస్తున్నాయి. కంపెనీ వెబ్సైట్లలో లేదా ఇతర థర్డ్యాప్స్ ద్వారా విక్రయించే ఆఫర్లను ప్రారంభించాయి. కాగా ఒక గ్రామ్ బంగారం కొనుగోలు చేసిన వారికే మాత్రమే గోల్డ్ జ్యవెలరీ కంపెనీలు డెలివరీ చేయనున్నాయి. డిజిటల్ బంగారం అమ్మకాలు భారత్కు కొత్తేమీ కాదు...పేటిఏమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి మొబైల్ వ్యాలెట్స్ డిజిటల్ బంగారాన్ని అందిస్తున్నాయి. ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ వంటి ప్లాట్ఫారమ్లు , వరల్డ్ గోల్డ్ కౌన్సిల్-ఆధారిత సేఫ్గోల్డ్ ఆయా మొబైల్ వ్యాలెట్లకు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆన్లైన్లో నగలను విక్రయించే సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆగ్మాంట్ గోల్ట్ డైరక్టర్ కేతన్ కొఠారి పేర్కొన్నారు. అమ్మకాలను పెంచేందుకు..! దసరా, ధంతేరాస్, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో బంగారం అమ్మకాలను మరింత పెంచుకోవడానికి జ్యువెలరీ కంపెనీలు సిద్దమయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఆన్లైన్లో విక్రయాలు 200 శాతం పెరిగినట్లు గోల్డ్ జ్యువెలరీ వర్గాలు పేర్కొన్నాయి. ఎక్కువగా 3 వేల నుంచి 4 వేల మధ్య ఉండే నాణేలు, బిస్కట్లపై ఎక్కువ బంగారం కొనుగోలు దారులు ఆసక్తిని చూపుతున్నారు. చదవండి: భారతీయుల హైట్ తగ్గిపోతోంది!!.. కాలుష్యంతో పాటు ఇవే కారణాలు -
ఆన్లైన్లోకి ఆటో మొబైల్.. భారీగా నియామకాలు!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీలు టెక్ నిపుణుల వెంట పడ్డాయేంటి? అన్న సందేహం రాకమానదు. కానీ, కరోనా అనంతరం మారిన పరిస్థితులు, ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో కంపెనీలు టెక్నాలజీ నిపుణులపై పెద్ద ఎత్తున ఆధారపడడం తప్పడం లేదు. అధిక వేతనం ఆఫర్ ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా టెక్నాలజీ నిపుణులను ఆటోమొబైల్ కంపెనీలు నియమించుకుంటున్నాయి. 35–40 శాతం అధిక వేతన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పెద్ద ఎత్తున డిజిటైజేషన్ నడుస్తుండడం.. వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తుండడం కారణంగా.. ఆన్లైన్ విక్రయాలను పెంచుకునే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో సరఫరా వ్యవస్థలో సమస్యలను అధిగమించేందుకు.. కొనుగోళ్లు, తయారీ కార్యక్రమాల పర్యవేక్షణకు టెక్నాలజీయే కీలకమని అవి గుర్తించాయి. వీరికి డిమాండ్ టీమ్లీజ్ సంస్థ వద్దనున్న సమాచారాన్ని పరిశీలిస్తే.. ఆటోమొబైల్ పరిశ్రమలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ నిపుణల నియమాకాలు కరోనా ముందు 2019తో పోలిస్తే 45 శాతం పెరగడం గమనార్హం. ‘‘గత రెండేళ్ల నుంచి వినియోగదారులు ఆన్లైన్ వేదికలపై వాహనాల గురించి తెలుసుకొని, కొనుగోలు చేయడం పెరిగింది. దీంతో ఆటోమోటివ్ కంపెనీలు కార్యకలాపాలను డిజిటైజ్ చేసి, వర్చువల్ విక్రయాలకు (ఆన్లైన్) వీలు కల్పించేందుకు, సౌకర్యం, సమర్థత పెంచేందుకు ఎక్కువ సమయం కృషి చేస్తున్నాయి’’ అని టీమ్లీజ్ డిజిటల్ ఏవీపీ (డైవర్సిఫైడ్ ఇంజనీరింగ్) మునీరా లోలివాలా చెప్పారు. వాహన తయారీదారులు తమ డీలర్ నెట్వర్క్ను కూడా డిజిటల్గా మార్చేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడం, డీలర్ల స్థాయిలో వనరులను మెరుగ్గా వినియోగించుకోవడంతోపాటు.. మొత్తం కొనుగోలు ప్రక్రియను మార్చే దిశగా కంపెనీలు అడుగులు వేస్తుండడాన్ని గమనించాలి. ఇంత పెద్ద స్థాయిలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం నిపుణుల అవసరాలను గణనీయంగా పెంచినట్టు లోలివాలా చెప్పారు. డిజిటల్ మార్కెటింగ్, వినియోగదారుల సేవలు, వాహన ముందస్తు నిర్వహణ విభాగాల్లో నియామకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం అధికంగా ఉండొచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు. మూడు నెలల్లోనే 18 వేల మంది.. ప్రస్తుత త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) 18,000 టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడినట్టు లోలివాలా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య 25,000ను చేరుకోవచ్చని ఆమె చెప్పారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ డిమాండ్ 15–18 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. విక్రయాలు, మార్కెటింగ్ విభాగాల్లో డేటా అనలిటిక్స్ నిపుణుల నియామకాలను పెంచినట్టు కార్ల తయారీ సంస్థలు సైతం అంగీకరిస్తున్నాయి. వినియోగదారులు డిజిటల్ చానళ్లవైపు మళ్లడంతో విచారణ నిర్వహణకు హైపర్ లోకల్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘ప్రస్తుతం 35 శాతం విచారణలు (కొనుగోళ్లకు సంబంధించి వివరాలు) డిజిటల్ చానళ్ల నుంచే వస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 శాతం పెరిగింది. లాక్డౌన్ల సమయాల్లో అయితే ఇది 50 శాతం వరకు ఉంది’’ అని శ్రీవాస్తవ వివరించారు. విక్రయాలకు సంబంధించి 26 టచ్పాయింట్లకు గాను 24ను డిజిటల్గా మార్చినట్టు.. మిగిలినవి కేవలం పరీక్షల కోసం ఉద్దేశించినవిగా చెప్పారు. ‘‘డిజిటల్ టూల్స్తో మా ప్లాట్ఫామ్ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో డేటాను ఉపయోగించుకుని కొనుగోలుదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించాలన్నది మా ప్రయత్నం. ఇటువంటి అధునాతన డిజిటల్ టూల్స్ వినియోగం వల్ల సీఆర్ఎం కార్యకలాపాలకు సంబంధించి నియామకాల్లో డేటా అనలిటిక్స్కు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాం’’ అని శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా సైతం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో అధిక నైపుణ్యాలున్న వారిని నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. డిమాండ్ ఇలా... - ఆటోమొబైల్ రంగంలో ఈ త్రైమాసికంలోనే 18,000 నిపుణులకు డిమాండ్ నెలకొంది. - ఈ ఆర్థిక సంవత్సరంలో 25,000 నియామకాలకు డిమాండ్ పెరగొచ్చన్న అంచనా. - 2022–23లో ఇటువంటి నిపుణులకు 15–18% అదనపు డిమాండ్ ఉండొచ్చు. - ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీల్లో చేయి తిరిగి నిపుణులకు డిమాండ్ 45 శాతం పెరిగింది. - 35–40 శాతం అధిక వేతనాలతో కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. చదవండి: ఉద్యోగుల కోసం పోటీ పడుతున్న కంపెనీలు -
నేతన్నలకు బాసటగా శ్రీకాకుళం టెకీలు
సాక్షి, శ్రీకాకుళం: పొందూరు ఖద్దరు.. ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. ఎక్కువగా రాజకీయ ప్రముఖులు దీనిని బాగా ఇష్ట పడతారు. ఇవన్ని నాణెనికి ఒక వైపు. పొందూరు ఖద్దరు ఎంత దర్జగా ఉంటుందో దాన్ని నేసే వారి బతుకులు అంత దీనంగా ఉంటాయి. ప్రాణం పెట్టి నేసిన బట్టలను అమ్ముకునే పరిజ్ఞానం కొరవడటంతో నేతన్నలు ఎంతో మోసపోతున్నారు. ఈ క్రమంలో వారికి బాసటగా నిలవడానికి కొందరు యువ టెకీలు ముందుకు వచ్చారు. పొందూరు ఖద్దరు ఉత్పత్తుల అమ్మకం కోసం ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్ రూపొందించారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఫైన్ కాటన్కు ఎంతో గుర్తింపు. కానీ సరైన మార్కెటింగ్ టెక్నిక్స్ తెలియకపోవడంతో నేతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వీరిపై డాక్యుమెంటరీ రూపొందించాలని శ్రీకాకుళానికి చెందిన నలుగురు యువ టెకీలు పోగిరి జవాంత్ నాయుడు, సూరజ్ పోట్నురు, సైలేంద్ర, భరద్వాజ్ నేతన్నలను సంప్రదించారు. ఈ క్రమంలో నేతన్నల కుటుంబాలు రోజుకు కనీసం రెండు వందల రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని తెలుసుకుని షాక్ అయ్యారు. వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. (చదవండి: ‘సిరి’సిల్ల మురుస్తోంది..!) దానిలో భాగంగా ఒక వెబ్సైట్ను రూపొందించారు. వారి ఉత్పత్తులను విక్రయించడానికి గాను చేనేత కార్మికులను దీనిలో చేరేలా ప్రేరేపించారు. ప్రారంభంలో కొందరు ఎంపిక చేసిన కస్టమర్లను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జశ్వంత్ నాయుడు మాట్లాడుతూ.. ‘పొందూరు నేతన్నలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు మమ్మల్ని కదిలించాయి. వారికి సాయం చేయాలని భావించాం. ఇందుకు గాను ఆన్లైన్ ప్లాట్ఫామ్ రూపిందించాము. దానిలో భాగంగానే ‘లూమ్2హోమ్’ వెబ్ పేజ్ క్రియేట్ చేశాం. ప్రస్తుతం దీన్ని రినోవేట్ చేస్తున్నాం. సోమవారం నుంచి అదనపు పేజీలతో అందుబాటులోకి వస్తుంది’ అని తెలిపారు. -
5జీ మొబైల్స్ సందడి షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఇప్పటికీ టెలికం రంగంలో 4జీ సేవలు విస్తరించలేదు. మరోవైపు 5జీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. అయినప్పటికీ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థలు దూకుడుగా ఉన్నాయి. 5జీ మోడళ్లతో పోటీకి సై అంటున్నాయి. ఐడీసీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలై–సెప్టెంబరులో భారత్లో 10 లక్షల పైచిలుకు 5జీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఏప్రిల్–జూన్తో పోలిస్తే ఇది 500 శాతం అధికం. దీనినిబట్టి చూస్తే అటు కస్టమర్లూ నూతన టెక్నాలజీ పట్ల ఆసక్తిగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. 5జీ సేవలు రాకముందే ఈ స్మార్ట్ఫోన్లు పెద్ద ఎత్తున వినియోగదార్ల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉందని టెలికం రంగం అంచనా వేస్తోంది. క్వాల్కాం, మీడియాటెక్ వంటి చిప్సెట్ తయారీ సంస్థలు నూతన టెక్నాలజీ చిప్సెట్లను ఆఫర్ చేస్తున్నాయి. సేవల కంటే ముందే చిప్సెట్ల ధరలూ దిగొస్తున్నాయి. ఒకదాని వెంట ఒకటి.. యాపిల్, శామ్సంగ్, షావొమీ, వన్ప్లస్, ఆసస్, వివో, ఒప్పో, మోటరోలా, రియల్మీ, హువావే ఇప్పటికే భారత 5జీ హ్యాండ్సెట్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. హానర్, సోని, నోకియా, గూగుల్, ఎల్జీ, నూబియా, బ్లాక్షార్క్, జడ్టీఈ, టీసీఎల్, మీజు, షార్ప్ త్వరలో రంగ ప్రవేశం చేయనున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లో 40 దాకా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు సుమారు రూ.24,000 నుంచి ప్రారంభం. త్వరలో 120కి పైగా కొత్త మోడళ్లు రానున్నాయి. 4జీతో పోలిస్తే 5జీ స్మార్ట్ఫోన్ల ధర పెద్దగా వ్యత్యాసం లేకపోవడం కూడా కలిసి వచ్చే అంశమని బిగ్–సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఇప్పటికే సగటు స్మార్ట్ఫోన్ ధర రూ.14–15 వేలకు వచ్చింది. 5జీ విషయంలో తయారీ సంస్థలు, కస్టమర్లు రెడీగా ఉన్నారు. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటే 5జీ టెలికం సేవలు త్వరితంగా అందుబాటులోకి వస్తాయి’ అని అన్నారు. వచ్చే ఏడాది నుంచి.. భారత్లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 5జీ మోడళ్ల రాక క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2021 ప్రారంభంలో రూ.15,000–25,000 ధరల శ్రేణిలో స్మార్ట్ఫోన్లన్నీ 5జీ టెక్నాలజీతో రానున్నాయని అంచనా. రూ.8–15 వేల ధరల శ్రేణిలో మోడళ్లు వస్తే కొనుగోళ్లు అనూహ్యంగా అధికమవుతాయని సెల్ పాయింట్ ఫౌండర్ మోహన్ ప్రసాద్ పాండే తెలిపారు. సోషల్ మీడియాలో యువత చాలా చురుకుగా ఉంటోంది. 5జీ టెక్నాలజీ వస్తే ఫొటోలు, వీడియోలు వేగంగా అప్లోడ్ చేసుకోవచ్చు, వీక్షించొచ్చు అని అన్నారు. 5జీ హ్యాండ్సెట్స్ కోసం కస్టమర్లు పరుగెత్తాల్సిన అవసరం లేదు. బ్రాండ్స్ దూకుడు చూస్తుంటే 4జీ నుంచి 5జీకి వినియోగదార్లు సులభంగా మళ్లుతారని టెక్ఆర్క్ అనలిస్ట్ ఫైజల్ కవూసా చెప్పారు. 3జీ నుంచి 4జీకి కస్టమర్ల ఆదరణకు నాలుగేళ్లు పట్టింది. 2012లో దేశంలో 4జీ ప్రారంభం అయినప్పుడు ఒక్క బ్రాండ్ నుంచి కూడా స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. 5జీ విషయంలో ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ఆరేళ్లలో 35 కోట్లకు 5జీ యూజర్లు ► ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల కనెక్షన్లు ► 2026 నాటికి ఎరిక్సన్ అంచనా న్యూఢిల్లీ: భారత్లో 5జీ కనెక్షన్లు 2026 నాటికి 35 కోట్లకు చేరవచ్చని అంతర్జాతీయ టెలికం సంస్థ ఎరిక్సన్ అంచనా వేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సబ్స్క్రిప్షన్స్ సంఖ్య 350 కోట్లకు చేరగలవని ’ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ 2020’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో స్పెక్ట్రం వేలం నిర్వహించిన పక్షంలో 2021లోనే భారత్లో తొలి 5జీ కనెక్షన్ అందుబాటులోకి రాగలదని ఎరిక్సన్ నెట్వర్క్ సొల్యూషన్స్ విభాగం హెడ్ (ఆగ్నేయాసియా, భారత్) నితిన్ బన్సల్ తెలిపారు. ‘2026లో ప్రపంచ జనాభాలో 60 శాతం మందికి 5జీ కవరేజీ ఉంటుంది. కనెక్షన్ల సంఖ్య 350 కోట్ల దాకా చేరొచ్చని అంచనా. భారత్లో 5జీ సబ్స్క్రైబర్స్ సంఖ్య 35 కోట్లు దాటిపోవచ్చు. 2026లో మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్స్లో దీని వాటా 27 శాతంగా ఉండవచ్చు‘ అని బన్సల్ పేర్కొన్నారు. టెలికం సేవలకు సంబంధించి భారత్లో ప్రస్తుతం ఎల్టీఈ (4జీ) టెక్నాలజీదే ఆధిపత్యం ఉందని, మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్స్లో దీని వాటా 63 శాతంగా ఉందని నివేదికలో వెల్లడైంది. 2026 నాటికి దశలవారీగా 3జీ సేవలు నిల్చిపోతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. భారత్లో ఎల్టీఈ యూజర్ల సంఖ్య 2020లో 71 కోట్లుగా ఉండగా 2026 నాటికి సుమారు 2 శాతం వార్షిక వృద్ధితో 82 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. -
త్వరలో ప్రభుత్వం నుంచి దేశీ అమెజాన్
న్యూఢిల్లీ, సాక్షి: ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త! త్వరలో దేశీయంగా అమెజాన్ తరహా ఈకామర్స్ ప్లాట్ఫామ్ ఆవిర్భవించనుంది. ఇందుకు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే నడుం బిగించడం విశేషం! ఇందుకు వీలుగా నిపుణులతో కూడిన ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. త్వరలో ఈ కమిటీ విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వెరసి ప్రభుత్వమే దేశీ ఈకామర్స్ బిజినెస్కు తెరతీయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తద్వారా ఈకామర్స్ రంగంలో జరుగుతున్న కొన్ని అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్నళ్లుగా దేశంలో ఈకామర్స్ బిజినెస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ వస్తోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కోవిడ్-19 దీనికి జత కలిసింది. దీంతో దేశీయంగా పండుగల సీజన్ అయిన గత నెల రోజుల్లోనే ఈకామర్స్ ద్వారా రూ. 61,000 కోట్లకుపైగా(8.3 బిలియన్ డాలర్లు) బిజినెస్ జరగడం గమనార్హం! అయితే ఆన్లైన్ అమ్మకాలలో కొన్న అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని సీరియస్గా పరిగణిస్తున్న ప్రభుత్వం లోపాలకు చెక్ పెట్టేందుకు వీలుగా దేశీ ఈకామర్స్ ప్లాట్ఫామ్కు శ్రీకారం చుడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కఠిన నిబంధనలను రూపొందించేందుకు వీలుగా స్టీరింగ్ కమిటీని సైతం ఎంపిక చేసినట్లు తెలియజేశారు. కమిటీ ఇలా డిజిటల్ కామర్స్కు చెందిన ఓపెన్ నెట్వర్క్(ఓఎన్డీసీ) విధానాలకు వీలుగా కేంద్ర వాణిజ్య శాఖ 11 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తద్వారా ఈకామర్స్ ప్లాట్ఫామ్ అభివృద్ధికి విధానాలు రూపొందించనుంది. ఇందుకు అనుగుణంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ల తరహా తుది స్టోర్ఫ్రంట్ తదితర మౌలిక సదుపాయాలను ఓఎన్డీసీ సమకూర్చనుంది. ఈ విషయాలపై వాణిజ్య శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మండలి ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో ప్రభుత్వ రంగానికి చెందిన పలు విభాగాల నుంచి ప్రతినిధులను ఎంపిక చేసింది. డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. కమిటీలో ఈమార్కెట్, ఎంఎస్ఎంఈ, నితి ఆయోగ్, ఎన్పీసీఐ, ఎన్ఎస్డీఎల్ అధికారులతోపాటు.. జాతీయ ట్రేడర్ల సమాఖ్య, దేశీ రిటైలర్ల అసోసియేషన్ నుంచి ప్రతినిధులకు చోటు కల్పించింది. ఎందుకంటే? పలు అవకతవకలకు చోటున్న ఈకామర్స్ రంగంలో సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వివిధ ప్లాట్ఫామ్స్ వృద్ధి చెందేందుకు వీలు కల్పించడం, కొనుగోలుదారులకు రక్షణ కల్పించడం తదితరాలకు తెరతీయాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా కొత్త విధివిధానాలతో ఈకామర్స్ బిజినెస్ను పటిష్ట పరచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి సొంత ఈకామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కొత్త విధానాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. అంతేకాకుండా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈకామర్స్ సంస్థలు అవలంబిస్తున్న విధానాలపై కొద్ది నెలలుగా దేశీ రిటైల్ రంగ సంస్థలు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రాండ్లతో భాగస్వామ్యం, భారీ డిస్కౌంట్లు, ఇన్వెంటరీ, లాజిస్టిక్స్ నిర్వహణ తదితర అంశాలపైనా ప్రభుత్వం దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. -
30 రోజుల్లో రూ. 61,000 కోట్ల అమ్మకాలు
ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఈకామర్స్ కంపెనీలకు మాత్రం జోష్నిస్తోంది. ఆన్లైన్ ద్వారా ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య నెల రోజుల కాలంలో ఏకంగా 8.3 బిలియన్ డాలర్ల(రూ. 61,000 కోట్లకుపైగా) విలువైన బిజినెస్ జరిగింది. దేశీయంగా పండుగల సీజన్గా పేర్కొనే ఈ కాలంలో ఆన్లైన్ అమ్మకాలు ఏకంగా 65 శాతం జంప్చేశాయి. గతేడాది ఇదే కాలంలో స్థూలంగా 5 బిలియన్ డాలర్ల(రూ. 37,000 కోట్లు) అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ విడుదల చేసిన నివేదిక వివరాలివి. నిజానికి 7 బిలియన్ డాలర్ల అమ్మకాలను అంచనా వేసినట్లు రెడ్సీర్ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయ్... 88 శాతం వృద్ధి గతేడాదితో పోలిస్తే ఆన్లైన్ కస్టమర్లలో ఈ ఏడాది 88 శాతం వృద్ధి నమోదైంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి నమోదైన 4 కోట్లమంది వినియోగదారుల కారణంగా అధిక వృద్ధి సాధ్యమైంది. కాగా.. అమ్మకాలలో ప్రధానంగా మొబైల్ ఫోన్ల హవా కనిపించింది. అయితే చిన్న పట్టణాల నుంచి పెరిగిన కొనుగోలుదారుల నేపథ్యంలో ఒక్కో కస్టమర్పై సగటు ట్రేడ్ విలువ అంటే జీఎంవీ రూ. 7,450 నుంచి రూ. 6,600కు తగ్గింది. అంచనాల ప్రకారం మొత్తం అమ్మకాలలో 66 శాతం వాటాను ఫ్లిప్కార్ట్ సొంతం చేసుకుంది. తాజా పండుగల అమ్మకాల ప్రకారం దేశీయంగా ఈకామర్స్ విభాగానికి అత్యంత ప్రాధాన్యత కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే బిగ్ బిలియన్ డేస్ విక్రయాలలో ఫ్లిప్కార్ట్ ఈసారి 40 శాతం వృద్ధిని సాధించింది. ఇదేవిధంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల నుంచీ కస్టమర్లను ఆకట్టుకుంది. రూ. కోటికిపైగా సుమారు 600 మంది అమ్మకందారులు రూ.కోటికిపైగా విలువైన విక్రయాలు సాధించగా.. 6387 పిన్కోడ్స్ నుంచి సెల్లర్స్కు ఆర్డర్లు లభించినట్లు అమెజాన్ వెల్లడించింది. ఇక 6,500 మంది విక్రేతలు రూ. 10 లక్షలకుపైగా విలువైన అమ్మకాలను సాధించినట్లు తెలియజేసింది. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్డర్లు అధికంగా లభించినట్లు పేర్కొంది. కారణాలివీ భారత్, చైనాల మధ్య సరిహద్దు వద్ద వివాదాల నేపథ్యంలోనూ ఈకామర్స్ కంపెనీలు గరిష్ట స్థాయిలో వస్తువులను అందుబాటులో ఉంచడం అమ్మకాల వృద్ధికి దోహదపడినట్లు రెడ్సీర్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా బ్రాండ్లు, ఫైనాన్సింగ్ ఒప్పందాలు దీనికి జత కలసినట్లు తెలియజేసింది. మెట్రో నగరాల నుంచి ద్వితీయ స్థాయి పట్టణాలకు పెరిగిన ఉద్యోగుల వలస, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు వంటి అంశాలు ఆన్లైన్ అమ్మకాలకు దోహదపడినట్లు అభిప్రాయపడింది. కొనుగోలుదారులు అటు ఖరీదైన లేదా ఇటు కారుచౌక వస్తువులకంటే అందుబాటు ధరల ఐటమ్స్కే మొగ్గు చూపినట్లు వివరించింది. -
కరోనా వైరస్ కలిసొచ్చింది...
సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్ అమ్మకాలకు కరోనా వైరస్ కలిసొచ్చింది. గతేడాది పండుగ సీజన్తో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో జోరుగా సాగాయి. 2019తో పోలిస్తే 2020 పండుగ అమ్మకాల్లో 77 శాతం వృద్ధి నమోదైందని క్రెడిట్, పేమెంట్ స్టార్టప్ స్లైస్ తెలిపింది. 74 శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో, 26 శాతం ఆఫ్లైన్లో జరిగాయని పేర్కొంది. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో 71 శాతం మంది నెలవారి వాయిదా (ఈఎంఐ) వినియోగించారు. గతేడాది ఈఎంఐ వాటా 58 శాతంగా ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్కు యువతరం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, సగటున నాలుగు నెలల ఈఎంఐ వ్యవధి కాలాన్ని ఎంచుకున్నారని సర్వే తెలిపింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 2 లక్షల మంది యంగ్ ఇండియన్స్ వ్యయ సరళిని విశ్లేషించింది. సెప్టెంబర్ నెలలో యంగ్స్టర్స్ ఖర్చు ఎక్కువగా చేశారని, ఇది కోవిడ్ ముందు కంటే ఎక్కువగా జరిగాయని స్లైస్ ఫౌండర్ అండ్ సీఈఓ రాజన్ బజాజ్ తెలిపారు. ప్రతి కస్టమర్ లావాదేవీలో 150 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. స్లైస్ మొత్తం లావాదేవీల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కలిపి 21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎన్నాడు లేనంతగా ఈ ఏడాది పండుగ సీజన్లో స్లైస్లో అత్యధిక లావాదేవీ పరిమాణాన్ని చూశామని ఆయన చెప్పారు. అమెజాన్లో 60 శాతం మంది వినియోగదారులు, 40 శాతం మంది ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేశారని తెలిపారు. మింత్ర, జబాంగ్ వంటి ఫ్లిప్కార్ట్ గ్రూప్తో కలిపి చూస్తే మాత్రం అమెజాన్, ఫ్లిప్కార్ట్ మధ్య వరుసగా 45, 55 శాతం వినియోగదారులు షాపింగ్ చేశారు. -
ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో ఆన్లైన్ జోరు!
న్యూఢిల్లీ: దేశీయ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు రూటు మార్చేశాయి. కొనుగోలుదారులు ఈ–కామర్స్ బాటపట్టడంతో ఎఫ్ఎంసీజీలు కూడా అదే బాటపట్టాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్తో మొదలైన ఎఫ్ఎంసీజీల ఈ–కామర్స్ సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఆయా కంపెనీల మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ వాటా 2–8 శాతం వరకున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆన్లైన్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. 2020లో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ ఈ–గ్రాసరీ మార్కెట్ 2024 నాటికి 18.2 బిలియన్ డాలర్లకు చేరుతుందని రెడ్సీర్, బిగ్బాస్కెట్ నివేదిక అంచనా వేసింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలైన నెస్లే, హిందుస్తాన్ యూనిలివర్, పార్లే ప్రొడక్ట్స్, అమూల్, మారికో వంటి సంస్థల ఆన్లైన్ అమ్మకాలు క్యూ2లో అధిక స్థాయిలో జరిగాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా సరే కొనుగోలుదారులు ఈ–కామర్స్ కొనుగోళ్ల మీదే మక్కువ చూపించడమే ఈ వృద్ధికి కారణం. గతేడాది హెచ్యూఎల్ మొత్తం అమ్మకాల్లో 3 శాతంగా ఉన్న ఆన్లైన్ అమ్మకాలు ఈ ఏడాది క్యూ2 నాటికి 6 శాతానికి పెరిగింది. నెస్లే కంపెనీ ఈ–కామర్స్ సేల్స్ కూడా సెప్టెంబర్ నాటికి రెట్టింపయింది. ‘గతేడాదితో పోలిస్తే నెస్లే ఆన్లైన్ సేల్స్లో 97 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో ఈ–కామర్స్ వాటా 4 శాతంగా ఉందని’’ నెస్లే చైర్మన్ సురేష్ నారాయనన్ తెలిపారు. ప్యాకేజ్ ఫుడ్స్కు డిమాండ్.. కొనుగోలుదారులు ఇంట్లో ఉంటూ ప్యాకేజ్డ్ ఫుడ్స్ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. అందుకే మ్యాగీ నూడుల్స్, మంచ్, కిట్క్యాట్ చాక్లెట్స్ అమ్మకాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. లాక్డౌన్ సమయంలో ఈ–గ్రాసరీ షాపింగ్ జోరుగా సాగింది. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా సరే ఈ–కామర్స్దే హవా నడుస్తుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఈ–కామర్స్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తొలిసారి ఆన్లైన్ కొనుగోలుదారులు ఎక్కువగా గ్రాసరీలను కొంటున్నారని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. గతేడాది 2.3 శాతంగా ఉన్న ఐటీసీ కంపెనీ ఆన్లైన్ అమ్మకాలు గత 12 నెలల్లో 4.2 శాతానికి పెరిగింది. ఐటీసీ ఉత్పత్తులైన సన్ఫీస్ట్ బిస్కెట్లు, ఆశీర్వాద్ పిండి ఆన్లైన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఏడాదిక్రితం డాబర్ అమ్మకాల్లో 1.5 శాతంగా ఉన్న ఆన్ౖ లెన్ సేల్స్ వాటా ప్రస్తుతం 6 శాతానికి పెరిగింది. 2–8 శాతం ఆన్లైన్ వాటా.. దేశంలోని అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా కనీసం 2–8 శాతం మధ్య ఉన్నాయి. ఈ–కామర్స్ వృద్ధిలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. లక్షలాది స్థానిక కిరాణా స్టోర్లు కూడా ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. గ్రాసరీ మార్కెట్లో ఆన్లైన్ వాటా 0.5 శాతంగా మాత్రమే ఉంది. ఆరు నెలల వ్యవధిలో అమూల్ డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలు 3 శాతం నుంచి 7–8 శాతానికి పెరిగిందని కంపెనీ ఎండీ ఆర్ఎస్ సోధి తెలిపారు. రాబోయే కాలంలో మరింత వృద్ధి కనబరుస్తుందని పేర్కొన్నారు. ఈ–కామర్స్ అమ్మకాలు దీర్ఘకాలిక వృద్ధిని నమోదు చేస్తాయని మారికో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజయ్ మిశ్రా తెలిపారు. మారికో ఉత్పత్తులైన పారాచ్యూట్ హెయిర్ ఆయిల్, సఫోలా ఓట్స్ ఉత్పత్తులు సెప్టెంబర్ త్రైమాసికంలో 39 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ మొత్తం టర్నోవర్లో ఆన్లైన్ వాటా 8 శాతంగా ఉంది. -
కరోనా ఎఫెక్ట్ : దూసుకుపోయిన అమెజాన్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో ఆన్ లైన్ రీటైలర్ అమెజాన్ లాభాల్లో దూసుకుపోయింది. క్యూ3లో బ్లాక్ బస్టర్ లాభాలను నమోదు చేసింది. అంచనాలకు మించి లాభాలు మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆన్ లైన్ భారీగా పుంజుకున్నాయి. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో వృద్ది నమోదైంది. దీంతో మూడవ త్రైమాసిక ఫలితాల్లో ఏడాది క్రితంతో పోలిస్తే లాభాలు మూడు రెట్లు పెరిగాయని కంపెనీ గురువారం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 37శాతం పెరిగాయి. దీంతో కరోనావైరస్ మహమ్మారి కాలంలో భారీగా లాభపడిన టెక్ దిగ్గజాల్లో ఒకటిగా అమెజాన్ నిలిచింది. (అమెజాన్ దివాలీ సేల్, డిస్కౌంట్ ఆఫర్లు) ఏడాది క్రితం 2.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 15,655 కోట్లు) తో పోలిస్తే ప్రస్తుతం లాభం 6.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 46,764 కోట్లు) గా నమోదయ్యాయి. ఆదాయం 37 శాతం పెరిగి 96.15 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 7,12,824 కోట్లు) పెరిగాయి. క్లౌడ్ డివిజన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ త్రైమాసికంలో 28 శాతం వృద్ధిని 11.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 86,504 కోట్లు) సాధించిందని కంపెనీ తెలిపింది. -
ఈసారి ఈ–కామర్స్కు పండుగే..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్ ఈ కామర్స్ కంపెనీల సంబరాలను రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఈసారి ఆన్లైన్ అమ్మకాలు రెండింతలు ఉండొచ్చని రెడ్సీర్ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. గతేడాది ఈ–కామర్స్ కంపెనీలు సాధించిన గ్రాస్ మర్చండైజ్ వాల్యూ(జీఎంవీ) 3.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది జీఎంవీ 7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక సర్వే అంచనా వేసింది. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువను జీఎంవీగా పిలుస్తారు. ఆన్లైన్ కొనుగోళ్లకు డిమాండ్ ఇందుకే.. కోవిడ్–19 తర్వాత కస్టమర్లు గతంలో కంటే సురక్షితమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన రీతిలో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కామర్స్ సంస్థలు అలాంటి సదుపాయాల కల్పనను సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగా వీడియో, వాట్సాప్ ఆధారిత షాపింగ్ విధానంతో ఈ కామర్స్ కంపెనీలు కొత్త షాపింగ్ విధానానికి తెరతీశాయి. మా సర్వేలో అధిక శాతం కస్టమర్లు ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు’’ అని రీసెర్చ్ సంస్థ తెలిపింది. కస్టమర్లను ఆకర్షిస్తున్న ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్, షాప్క్లూస్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఉత్పత్తులను భారీ ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా ఈ ఏడాది పండుగ సీజన్ తొలి రోజుల్లోనే గతేడాది మొత్తం ఆన్లైన్ కస్టమర్ల సంఖ్యను అధిగమించవచ్చని సర్వే అంచనా వేస్తుంది. కోవిడ్–19తో పెరిగిన డిజిటల్ లావాదేవీలు: మాల్స్, రిటైల్ అవుట్లుక్ లాంటి అధిక సంచారం కలిగిన ప్రాంతాలకు వెళ్లి షాపింగ్ చేసేందుకు ఇప్పటికీ ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా ఆఫ్లైన్ అమ్మకాల రికవరీ ఇంకా బలహీనంగా నే ఉన్నట్లు సర్వే తెలిపింది. కిందటేడాది ఆన్లైన్ ద్వారా 40–50 మిలియన్ మంది షాపింగ్ చేశారు. కోవిడ్–19 డిజిటల్ లావాదేవీలను మరింత పుంజుకునేలా చేసింది. సంప్రదాయ ఆఫ్లైన్ వినియోగదారుల్ని, ఆన్లైన్కు మళ్లించింది. ఫలితంగా ఈ పండుగ సీజన్లో ఆన్లైన్ వినియోగదారులు ఏకంగా 70శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని అంశాలు.. బలమైన జాతీయవాద మనోభావంతో కేంద్రం ఇచ్చిన ఆత్మనిర్భర్ నినాదంతో ఎలక్ట్రానిక్స్, మొబైల్ వంటి విభాగాల్లో కస్టమర్లు ‘‘బ్రాండ్’’ను పెద్దగా పట్టించుకోవడంలేదని సర్వే తెలిపింది. లాక్డౌన్తో ఉత్పత్తి ఆగిపోవడంతో మొబైల్, అప్లికేషన్లు గతేడాదితో పోలిస్తే డిమాండ్ కాస్త తక్కువగా ఉంటుందని సర్వే అంచనా వేసింది. గృహోపకరణాలకు డిమాండ్ ఉంటుదని సర్వే చెబుతోంది. -
కరోనా బిలియనీర్లు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొందరి వ్యాపార జీవితాల్నే మార్చేసింది. ఓ వైపు కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే.. మరోవైపు సరికొత్త వ్యాపార అవకాశాలతో కొత్త బిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా చేతికి తొడుక్కునే గ్లవ్స్ తయారు చేసే కంపెనీల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మలేíసియాలో రబ్బరు గ్లవ్స్ తయారుచేసే సూపర్ మాక్స్ కంపెనీ తొలిసారిగా బిలియన్ డాలర్ల క్లబ్లో చేరినట్టు బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేర్కొంది. కరోనా వేళ సూపర్ మాక్స్ షేర్ 400 శాతం పెరగడంతో ఆ సంస్థ ఫౌండర్ థాయ్ కిమ్ సిమ్ బిలయనీర్ల క్లబ్లో చేరారు. అదేవిధంగా టాప్ గ్లవ్స్ కంపెనీ షేరు ధర సుమారు రెండున్నర రెట్లు పెరగడంతో ఆ సంస్థ వ్యవస్థాపకుడు లిమ్ వీ చాయ్ కూడా బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. హర్టేలిగా కోసన్ షేర్ ధరలు 100 శాతం పెరగడంతో వీటి అధిపతుల ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ఇక దేశంలోని అన్ని ఫార్మా కంపెనీల షేర్లూ భారీగా పెరిగాయి. అదే బాటలో కొన్ని టెక్నాలజీ కంపెనీలు ► లాక్డౌన్ వల్ల పాఠశాలలు, సభలు, సమావేశాలు నిలిచిపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ యాప్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇందులో అమెరికాకు చెందిన జూమ్ యాప్ ముందు వరుసలో ఉంది. ► ఒకేసారి వందలాది మందితో మాట్లాడే అవకాశం ఉండటంతో విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి, రాజకీయ పార్టీలు కార్యకర్తలు, విలేకరులతో సమావేశాలు పెట్టడానికి ఈ యాప్ను అత్యధికంగా వినియోగించారు. ► దీంతో జూమ్ యాప్ సృష్టికర్త ఎరిక్ యువాన్ ఆస్తి విలువ ఈ సంక్షోభ సమయంలో 2.58 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే.. ఈ మూడు నెలల కాలంలో యువాన్ సంపద సుమారు రూ.19,350 కోట్లు పెరిగింది. ► ఒక్కసారిగా ఆన్లైన్ అమ్మకాలు పెరగడంతో వాల్మార్ట్, అమెజాన్ వంటి కంపెనీల షేర్లు భారీగా పెరిగి వారి సంపద కూడా వేల కోట్లు పెరిగింది. వాల్మార్ట్కు చెందిన జిమ్, అలిసే, రాబ్ వాల్టన్ల ఒక్కొక్కరి సంపద 3 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ► ఈ సంక్షోభ సమయంలో రిలయన్స్ గ్రూప్ ఇప్పటికే వివిధ ఇన్వెస్టర్ల నుంచి రూ.1.70 లక్షల కోట్లు సమీకరించగా.. మరో నలుగురు ఇన్వెస్టర్ల నుంచి రూ.30 వేల కోట్లు సమీకరించనుంది. ► కరోనా సమయంలో ఇలా సుమారు రెండు లక్షల కోట్లు సమీకరించడం తలపండిన ఇన్వెస్టర్లను కూడా ఆశ్చర్యపర్చింది. దెబ్బతో ముఖేష్ అంబానీ సంపద వారెన్ బఫెట్ను మించిపోయింది. ► ఈ ఏడాదిలో అంబానీ సంపద 9.64 బిలియన్ డాలర్లు పెరగడం ద్వారా 67.9 బిలియన్ డాలర్లకు చేరింది. ► డాక్టర్ లాల్ పాథ్ల్యాబ్స్ అధిపతి అరవింద్ లాల్, శ్రీరాం గ్రూప్ కంపెనీకి చెందిన అరుణ్ భరత్ రామ్ తొలిసారిగా బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. కొత్త వ్యాపార అవకాశాలు ► కరోనా దెబ్బతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పుతుంటే మరికొంత మంది వినూత్న ఆలోచనలతో సరికొత్తగా ఉపాధి పొందుతున్నారు. ► ముఖ్యంగా ఇంటి వద్ద ఉండే మహిళలు వివిధ డిజైన్లలో మాస్క్లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వచ్చే ఏడాది కాలం పాటు మాస్క్ల వాడకం తప్పనిసరి కావడంతో డిజైనర్ మాస్క్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ► దీంతో పలు అంతర్జాతీయ కంపెనీలు బ్రాండెడ్ మాస్క్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ► మరోవైపు కార్యాలయాలు, షాపులు, కార్లు, బస్సులు ఇలా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న వాటికి శానిటైజ్ చేయాల్సి ఉండటంతో శానిటైజేషన్ వ్యాపారానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతోంది. ► చాలా మంది నిరుద్యోగ యువత శానిటైజేషన్ను ఒక ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. -
ఈ మాస్క్ ఉంటే చాలు.. వైరస్ ఖతం
సాక్షి, హైదరాబాద్ : ఇప్పుడు మాస్కులకు భలే గిరాకీ పెరిగిపోయింది. ఎన్–95, సర్జికల్ మాస్కులు.. ఇలా బోలెడన్ని మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇవేవీ వైరస్ను చంపవు. కాకపోతే గాలిలో లేదా ఇతరుల దగ్గు, తుమ్ము, తుంపర్ల ద్వారా వచ్చే వైరస్లు నేరుగా మన నోటిలోకి, ముక్కులోకి చేరకుండా అడ్డుకుంటాయి. అయితే వీటితో వైరస్ సోకదన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న లివింగ్గార్డ్ తయారుచేసిన మాస్కు మాత్రం వీటికి చాలా భిన్నమైంది. మూడు పొరలతో సిద్ధమైన ఈ మాస్కులో ప్రత్యేకమైన వస్త్రం ఉంటుంది. దీనిపై కొన్ని రసాయనాలను బలమైన రసాయనిక బంధాల ద్వారా పోగుబడేలా చేశారు. ఫలితంగా ఈ మాస్కుపై నిత్యం 0.1 నుంచి 0.8 మిల్లీవోల్టుల ధనాత్మక విద్యుదావేశం పుడుతుంటుంది. సూక్ష్మజీవులన్నీ రుణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటాయి.(మళ్లీ లాక్డౌన్ ఉండదు) కాబట్టి వైరస్ మాత్రమే కాకుండా బ్యాక్టీరియా, కొన్ని శిలీంధ్రాలు సైతం ఈ విద్యుదావేశం బారిన పడి నశిస్తాయి. ప్రతి చదరపు సెంటీమీటరుకు ఏకంగా 3,600 కోట్ల విద్యుదావేశాలు పుడుతుంటాయి. కాబట్టి వీటిని తాకిన సూక్ష్మజీవుల పైపొరలు బద్ధలైపోతాయి. అక్కడికక్కడే మరణిస్తాయి లేదా నిర్వీర్యమవుతాయని కంపెనీ సీటీవో, భారతీయ శాస్త్రవేత్త సంజీవ్ స్వామి బుధవారం జరిగిన ఓ వెబినార్లో తెలిపారు. సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్ఏ మషేల్కర్ కూడా ఈ వెబినార్లో పాల్గొన్నారు. వెయ్యి వరకు పాలి కాటయానిక్ రసాయనాలను పరిశీలించామని, వాటి నుంచి అవసరమైన లక్షణాలున్న 3 నుంచి 7 రసాయనాలను ఎంపిక చేసి ప్రత్యేక పద్ధతుల్లో కలిపి, వస్త్రంపై అవి అతుక్కునేలా చేశామని స్వామి వివరించారు. వీటిని ఉతుక్కుని తిరిగి వినియోగించుకోవచ్చని తెలిపారు. విస్తృత పరీక్షల తర్వాత అందుబాటులోకి.. లివింగ్గార్డ్ మాస్కును మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే ముందు పలు యూనివర్సిటీల్లో దానిపై విస్తృత పరీక్షలు చేశారు. బెర్లిన్లోని ఫ్రీ యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో ఈ మాస్కు 99.9 శాతం వరకు వైరస్లను అడ్డుకుని నిర్వీర్యం చేస్తున్నట్లు తేలింది. అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీ కూడా దీన్ని పరిశీలించి బాగా పనిచేస్తుందని నిర్ధారించింది. అమెరికా మిలిటరీ వర్గాలు, ముంబైలోని సియాన్ ఆసుపత్రి వైద్యులు, కొంతమంది పారిశుధ్య కార్మికులు కొంతకాలంగా ఈ మాస్కులను వాడుతున్నారు. అమెరికాలోని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మాస్కుల తయారీకి ఉపయోగించిన ప్రత్యేక వస్త్రాన్ని క్షుణ్నంగా పరిశీలించిందని, మానవ శరీరానికి హానికరం కాదని నిర్ధారించినట్లు స్వామి తెలిపారు. ధర సంగతేంటి..? లివింగ్గార్డ్ సంస్థ మొత్తం మూడు రకాల మాస్కులను తయారు చేయగా వీటి ఖరీదు రూ.1,490– 1,990 మధ్య ఉంటుంది. మొత్తం 3 పొరలు ఉండే ఈ మాస్కు ద్వారా 5 రకాల రక్షణ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. వారానికి ఒకసారి ఉతుక్కుంటూ మొత్తం 210 రోజుల పాటు ఈ మాస్కును వాడొచ్చు. లివింగ్ గార్డ్ మాస్కుతో పాటు చేతితొడుగులు తొడుక్కుంటే ఉపరితలాలపై ఉండే వైరస్లను అక్కడికక్కడ చంపేయొచ్చని, త్వరలో బాడీ సూట్లు కూడా అందుబాటులోకి తెస్తామని సంజీవ్ స్వామి ‘సాక్షి’ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నవీ ముంబైలోని ఓ ఫ్యాక్టరీలో వస్త్రాన్ని తయారు చేస్తున్నామని, బెంగళూరు పరిసరాల్లో మాస్కులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. హోటళ్లు, విమాన ప్రయాణాల్లో ఇవి ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. తిరిగి వాడుకునే వీలు ఉండటంతో పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం భారత్లో వారానికి 1.5 లక్షల మాస్కులు తయారు చేసే సామర్థ్యం ఉందని, దశల వారీగా ఉత్పత్తి పెంచుతామని వివరించారు. వారం రోజుల్లో ఆన్లైన్లో అమ్మకాలు మొదలుకానున్నాయి. -
లాక్డౌన్ సడలింపులు : మారుతి జోరు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద కార్ల దిగ్గజం మారుతి సుజుకి ఇండియా కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభం నుంచి క్రమంగా కోలుకుంటోంది. గత మాసంలో జీరో అమ్మకాలతో కుదేలైన మారుతి తాజాగా ఆన్లైన్ విక్రయాల్లో జోరందుకుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఇప్పటికే 5000 ఆన్లైన్ బుకింగ్లను సాధించింది. అలాగే 2300 కార్లను డీలర్లకు పంపించింది. నిబంధనల మేరకు కార్లను ఆయా వినియోగదారులకు వారం రోజుల్లో డెలివరీ చేస్తామని మారుతి సుజుకి ప్రకటించింది. భారతదేశంలో 2500 టచ్ పాయింట్లను కలిగి ఉన్న మారుతి సుజుకి తన మూడవ వంతు అవులెట్లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్టు తెలిపింది. (మారుతీ లాభం 28 శాతం డౌన్) కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షల కారణంగా మూసివేసిన 1900 వర్క్షాప్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయని సంస్థ ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా మారుతి సుజుకి చైర్మన్ ఆర్సి భార్గవ వెల్లడించారు. ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫారమ్ల కొనుగోళ్లపై దృష్టి పెట్టిన తమకు భారీ మద్దతు లభిస్తోందని తెలిపారు. అయితే చాలా నగరాలు ఇప్పటికీ రెడ్ లేదా ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్నందున డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు, అయితే ఈ నెలలో తిరిగి కార్యకలాపాలను ప్రారంభించిన మానేసర్ ప్లాంట్నుంచి 2300 కార్లను పంపించామన్నారు. (కరోనా : అయ్యయ్యో మారుతి!) చదవండి : ‘పీఏం కేర్స్’ కేటాయింపులపై చిదంబరం సందేహం కరోనా ప్యాకేజీ : మాల్యా స్పందన -
ఆటో.. రీస్టార్ట్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించిన లాక్డౌన్ దెబ్బతో మూతబడిన వ్యాపార కార్యకలాపాలను ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా పునఃప్రారంభిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోక్స్వ్యాగన్, మహీంద్రా, హోండా కార్స్ మొదలైన వాటి బాటలోనే మరికొన్ని సంస్థలు కూడా షోరూమ్లు తెరవడంతో పాటు ఆన్లైన్లో అమ్మకాలు చేపడుతున్నాయి. తాజాగా ఆడి ఇండియా, రెనో తదితర కంపెనీలు ఈ జాబితాలో చేరాయి. ఆడి ఇండియా: కస్టమర్లు ఇంటి నుంచి కదలకుండానే వాహన కొనుగోలు, సర్వీసింగ్ వంటి సేవలు పొందేందుకు వీలుగా ఆన్లైన్ సేల్స్, సర్వీస్ కార్యకలాపాలు ప్రారంభించింది. రెనో: ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో భారత్లో తమ కార్పొరేట్ ఆఫీస్ను, కొన్ని డీలర్షిప్లు.. సర్వీస్ సెంటర్లను పునఃప్రారంభించింది. కొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 194 షోరూమ్స్, వర్క్షాప్లను తిరిగి తెరిచినట్లు రెనో ఇండియా కార్యకలాపాల విభాగం సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. బజాజ్ ఆటో: మూడో ఫేజ్ లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డీలర్షిప్లు, సర్వీస్ సెంటర్లను మే 4 నుంచి క్రమంగా తెరుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. హీరో: పంజాబ్, బీహార్లోని ప్లాంట్లను పునఃప్రారంభించినట్లు హీరో సైకిల్స్ వెల్లడించింది. మొత్తం సామర్థ్యంలో 30 శాతం మేర ఉత్పత్తి మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే స్వల్ప సిబ్బందితో కార్పొరేట్ ఆఫీస్ను కూడా తెరిచినట్లు సీఎండీ పంకజ్ ఎం ముంజల్ చెప్పారు. -
ఆన్లైన్లో మళ్లీ టీవీలు, ఫ్రిజ్లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను క్రమంగా ఎత్తివేసే ప్రక్రియలో భాగంగా ఈ–కామర్స్లో విక్రయాలకు కేంద్రం అనుమతించింది. దీంతో ఏప్రిల్ 20 నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వంటి ఈ–కామర్స్ పోర్టల్స్లో మళ్లీ మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్లు, ల్యాప్టాప్లు వంటి ఉత్పత్తుల అమ్మకం ప్రారంభం కానుంది. మే 3 దాకా పొడిగించిన లాక్డౌన్ మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు వివరణనిచ్చారు. టీవీలు, మొబైల్ ఫోన్స్ కూడా ఆన్లైన్ పోర్టల్స్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే, ఈ–కామర్స్ కంపెనీల డెలివరీ వ్యాన్లు.. రోడ్ల మీదికి రావాలంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. మార్చి 25న తొలిసారిగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఈ–కామర్స్ సంస్థలు కేవలం ఔషధాలు, ఆహారపదార్థాలు వంటి నిత్యావసరాలే విక్రయించడానికి అనుమతినిచ్చారు. సరుకు రవాణా, డెలివరీ మొదలైన సర్వీసుల ద్వారా చాలా మంది ఉపాధి పొందుతుండటంతో వారి ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణ యం తీసుకుంది. దీనికి సంబంధించి బుధవారం ప్రకటించిన మార్గదర్శకాలపై నెలకొన్న సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసింది. -
పండుగ ఆఫర్లపై భగ్గుమన్న ట్రేడర్లు..
ముంబై : ఈ కామర్స్ దిగ్గజాలు పోటీపడి వెల్లడిస్తున్న పండుగ ఆఫర్లతో వ్యాపారులు కలత చెందుతున్నారు. ఈ సంస్థలు పోటాపోటీగా ఆఫర్లతో అతితక్కువ ధరలకే వస్తువులను అమ్మడంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మొరపెట్టుకుంది. ఆన్లైన్ రిటైల్ పోర్టల్స్ను ఇలాంటి ఎత్తుగడలకు దూరంగా ఉంచాలని వీరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ కంపెనీలు న్యాయసమ్మతం కాని ధరలకు వస్తువులు విక్రయించడాన్ని ప్రభుత్వం అనుమతించదని మంత్రి గోయల్ ఇటీవల చేసిన ప్రకటనను సీఏటీఐ ప్రస్తావించింది. పలు ఈ కామర్స్ పోర్టల్స్ అతితక్కువ ధరలకు వస్తువుల అమ్మకాలను చేపట్టడంలో హేతుబద్ధతను సీఏఐటీ అధ్యక్షులు బీసీ బర్తియ, ప్రధాన కార్యదర్శి ఖండేల్వాల్ ప్రశ్నించారు. ఆయా వస్తువుల స్టాక్ కలిగిన వారు మాత్రమే ఈ ధరలకు విక్రయించగలరని, ఈ కామర్స్ వెబ్సైట్లు కేవలం మార్కెట్ సదుపాయం మాత్రమే కల్పిస్తారని, వారు ఆన్లైన్లో విక్రయించే వస్తువులకు యజమానులు కాదని సీఏఐటీ పేర్కొంది. 2016 ఎఫ్డీఐ విధానానికి అనుగుణంగా ఈకామర్స్ పోర్టల్స్ అమ్మకాలు లేదా ధరలను ప్రభావితం చేయరాదని స్పష్టంగా ఉన్నప్పటికీ, వీరు తమ పోర్టల్స్లో సేల్స్ను ప్రకటించడం ద్వారా ఎఫ్డీఐ విధానానికి తూట్లు పొడుస్తున్నారని ఆక్షేపించింది. ఈ కామర్స్ పోర్టల్స్ వస్తువులను తమ గోడౌన్లలో నిల్వ చేస్తున్నాయని ఇది భారత ప్రభుత్వ రిటైల్ విధానానికి విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేసింది. వివిధ పోర్టల్స్ ప్రకటించిన క్యాష్బ్యాక్ ఆఫర్లను తక్షణమే నిలిపివేయాలని ఇది ధరలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. -
ఈ సేల్స్.. సూపర్ !
మెట్రో నగరాల ర్యాంకులిలా.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, పుణె, గుర్గావ్, నోయిడా, చండీగఢ్, నాగపూర్, ఇండోర్, కోయంబత్తూర్, విశాఖపట్నం నగరాలపై ఈ సర్వే చేశారు. ఆయా మెట్రో నగరాల్లోనూ ఏటా 60 నుంచి 65 శాతం మేర ఆన్లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయని పేర్కొంది. సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాల్లో ఆన్లైన్ కొనుగోళ్లు అదరగొడుతున్నాయి. నచ్చిన వస్తువును ఆన్లైన్లో కొనుగోలు చేయడంలో మెట్రో సిటీజన్లు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఈ విషయంలో గ్రేటర్ సిటీజన్లు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఆరోస్థానంలో నిలిచారు. స్మార్ట్ జనరేషన్గా మారుతున్న కుర్రకారు ఈ విషయంలో అగ్రభాగాన నిలవడం విశేషం. ప్రధానంగా 18– 35 ఏళ్ల మధ్యనున్న యువతరంలో సుమారు 90 శాతం ఆన్లైన్ కొనుగోళ్ల వైపే మొగ్గు చూపుతున్నట్లు అసోచామ్ తాజా సర్వేలో వెల్లడైంది. ఇక స్మార్ట్ఫోన్ వినియోగంతో ఆన్లైన్లో వస్తువులు కొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందని అసోచామ్ పేర్కొంది. ఆన్లైన్ మాధ్యమం ద్వారా పలువురు నెటిజన్ల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు. ఇక దేశవ్యాప్తంగా రెండు నెలలుగా సుమారు 15 మెట్రో నగరాల్లో ఆన్లైన్ ఈ కామర్స్ డీల్స్ సుమారు రూ.30 వేల కోట్ల మేర జరిగినట్లు అంచనా వేయడం విశేషం. ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడానికి అందరికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే కారణమని అసోచామ్ పేర్కొంది. దేశంలో పెరుగుతున్న స్మార్ట్ఫోన్ వినియోగం ఈ కామర్స్ ఇండస్ట్రీకి ఊతమిచ్చిందని సర్వేలో పేర్కొంది. ఏంకొంటున్నారంటే.. మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, బ్రాండెడ్ షూస్, ఆభరణాలు, పర్ఫ్యూమ్స్, గృహోపకరణాలు తదితరాల కొనుగోలుకు నెట్జన్లు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. వీటిలోనూ ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను 78 శాతం మేర కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. పండగ ఆఫర్స్, నిర్ణీత సమయాల్లో బుక్చేస్తే భారీ తగ్గింపు ధరలు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు, ధమాకా సేల్స్తో సుమారు 20 ఈ– కామర్స్ సంస్థల సైట్లకు వ్యాపార డీల్స్ పంట పండినట్లు పేర్కొంది. పురుషులే అధికం.. ఆన్లైన్ కొనుగోళ్లలో పురుషులదే ఆధిపత్యమని వెల్లడైంది. వీరి వాటా 65 శాతం ఉండగా.. మహిళలు 35 శాతం మంది ఉన్నారు. పండగల సీజన్లో 18– 35 ఏళ్ల మధ్య మహిళలు, పురుషులే అధిక భాగం ఆన్లైన్ కొనుగోళ్లు జరుపుతున్నట్లు తేలింది. వయసుల వారీగాకొనుగోళ్లు ఇలా.. నిత్యం ఆన్లైన్లో జరిగే కొనుగోళ్లలో యువతరమే అగ్రస్థానంలో నిలిచారు. 18– 35 వయసు గలవారు అత్యధికంగా 90 శాతం మంది ఈ కొనుగోళ్లలో భాగస్వామ్యులవుతున్నారట. ఇక 36–45 ఏళ్ల వారు 8 శాతం, 45– 60 ఏళ్లున్నవారు కేవలం రెండు శాతం మాత్రమే ఆన్లైన్లో కొనుగోళ్లుజరుపుతున్నారట. -
బీఎండబ్ల్యూ ఎం2 కాంపిటీషన్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ‘ఎం2 కాంపిటిషన్’ పేరుతో కొత్త వెర్షన్ కారును గురువారం విడుదల చేసింది. దీని ఎక్స్షోరూమ్ ధర రూ.79.9 లక్షలు. దేశవ్యాప్తంగా అన్ని డీలర్షిప్ కేంద్రాల్లో ఇది అందుబాటులో ఉంటుం దని కంపెనీ తెలిపింది. మూడు లీటర్ల పెట్రోల్ ఇంజన్తో కూడిన ఈ కారు కేవలం 4.2 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, గరిష్ట వేగం 250 కిలోమీటర్లు అని పేర్కొంది. ఆన్లైన్ అమ్మకాల కోసం ప్రత్యేక పోర్టల్ బీఎండబ్ల్యూ భారత్లో ఆన్లైన్ అమ్మకాలను ప్రారంభించింది. ఇందు కోసం http://www. shop.bmw.in పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లు ఆన్లైన్లో కార్ల స్పెసిఫికేషన్లను పోల్చుకుని, తగిన మోడల్ను ఎంపిక చేసుకుని, అక్కడే కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. కొనుగోలుకు ముందు సందేహాలు ఉంటే అప్పటికప్పుడే వాటిని తొలగించుకోవచ్చని కూడా సూచించింది. డిజిటలైజేషన్ భవిష్యత్తులో చాలా కీలకమైన రిటైల్ చానల్గా అవతరిస్తుందని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా చైర్మన్ విక్రమ్ పవా పేర్కొన్నారు. -
'పండగ' చేస్కో!
సాక్షి, హైదరాబాద్: పండుగ వస్తుందంటే చాలు ఆన్లైన్ ఆఫర్ల కోసం నగర యువత ఎదురుచూస్తోంది. డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లు చేసిన తరువాతే కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద పండుగలైన దసరా.. దీపావళి.. ఆన్లైన్ సేల్స్ ఊపందుకున్నాయి. నచ్చిన వస్తువును ఆన్లైన్లో కొనుగోలు చేయడంలో గ్రేటర్ సిటిజన్లు ముందుంటున్నారు. స్మార్ట్ జనరేషన్గా మారుతోన్న యువత ఈ విషయంలో అగ్రభాగాన నిలుస్తున్నారు. ప్రధానంగా 18–35 వయసున్న వారు సుమారు 90 శాతం ఆన్లైన్ కొనుగోళ్లకు మక్కువ చూపుతున్నట్లు అసోచామ్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇక స్మార్ట్ఫోన్ వినియోగంతో ఆన్లైన్లో వస్తువులు కొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందని అసోచామ్ పేర్కొంది. ఆన్లైన్ మాధ్యమం ద్వారా పలువురు నెటిజన్ల అభిప్రాయాలను సేకరించి అధ్యయన వివరాలను వెల్లడించింది. ఈసారి దేశవ్యాప్తంగా దసరా, దీపావళి సందర్భంగా సుమారు 15 మెట్రో నగరాల్లో ఆన్లైన్ ఈ కామర్స్ సేల్స్ సుమారు 30 వేల కోట్ల మేర జరిగే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇక ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడానికి స్మార్ట్ఫోన్ వినియోగం, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే కారణమని అసోచామ్ అభిప్రాయపడింది. వీటిని కొనేందుకు ఆసక్తి... మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, బ్రాండెడ్ షూస్, ఆభరణాలు, పెర్ఫ్యూమ్స్, గృహోపకరణాలు తదితరాల ఆన్లైన్ కొనుగోలుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. వీటిల్లోనూ ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను 78 శాతం మేర కొనుగోలు చేస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. పండుగ ఆఫర్స్, నిర్ణీత సమయాల్లో బుక్చేస్తే భారీ తగ్గింపు ధరలు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు, ధమాకా సేల్స్తో సుమారు 20 ఈ కామర్స్ సంస్థల సైట్లకు ఈసారి వ్యాపార సేల్స్ పంట పండించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మెట్రో నగరాల్లో ఈ–కామర్స్ ఫుల్... దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతాలతోపాటు అహ్మదాబాద్, పుణే, గుర్గావ్, నోయిడా, చండీగఢ్, నాగ్పూర్, ఇండోర్, కోయంబత్తూర్, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఈ–కామర్స్ జోరు కనిపిస్తోందని పేర్కొంది. ఈ మెట్రో నగరాల్లోనూ ఏటా 60 నుంచి 65 శాతం మేర ఆన్లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పురుషులే అధికం.. : ఈ అధ్యయనం ప్రకారం.. ఆన్లైన్ కొనుగోళ్లలో పురుషులదే పైచేయి అని తేలింది. వీరి వాటా 65 శాతం ఉండగా.. స్త్రీలు 35 శాతం మంది ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తున్నారు. ఇక పండుగ సీజన్లో 18–35 మధ్య వయసున్న స్త్రీ, పురుషులే అధిక భాగం ఆన్లైన్ కొనుగోళ్లు చేస్తున్నట్లు అంచనా వేసింది. -
'యూజ్ మీ' ఇట్స్ లోకల్ గురూ!
ఆన్లైన్ కొనుగోళ్లకు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రముఖ సంస్థలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి మనకు దగ్గర్లోని దుకాణాలు అందుబాటులో ఉండే యాప్స్ ఉన్నాయా? వాటిలో ధరలు సరిపోల్చుకునే అవకాశం ఉందా? అంటే ఉంది. సరికొత్తగానగరవాసులకు పరిచయమైనయూజ్ మీ యాప్తో ఇవి సాధ్యమే. సాక్షి, సిటీబ్యూరో :నగరానికి చెందిన సంజయ్ కప్పగంతుల మెకానికల్ ఇంజినీర్. ఓ ప్రముఖ ఐటీ సంస్థలో నాలుగేళ్లు పనిచేసి 1999లో అమెరికా వెళ్లాడు. 13ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశాడు. ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకొని 2013లో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించాడు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీ కంటే సామాన్యుల సమస్యలకు పరిష్కారం చూపే సంస్థ ఏదైనా తీసుకురావాలని ఆలోచించాడు. ఒక్క ఫోన్కాల్తో అన్ని సేవలందించే విధానానికి శ్రీకారం చుట్టాడు. అయితే అది అంతగా సక్సెస్ కాలేదు. తర్వాత యాప్ రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే జస్ట్ డయల్ లాంటివి ఉన్నాయి. అయినప్పటికీ వాటిలో ఫీడ్బ్యాక్ ప్రధాన సమస్య అని గుర్తించి ‘యూజ్ మీ’ యాప్ రూపొందిచినట్లు సంజయ్ చెప్పారు. యూజర్స్–వెండర్స్ కనెక్ట్.. ‘ఆన్లైన్ సేవల విషయంలో ఇప్పటికే కొన్ని యాప్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రధానంగా పెద్ద దుకాణాలు, ప్రముఖ సేవల సంస్థలే అందుబాటులో ఉంచారు. మన దగ్గర్లోని కిరాణ దుకాణాలు, స్వీట్ షాప్స్, కూల్ డ్రింక్స్, బైక్ మెకానిక్ సెంటర్స్, ప్లంబర్ తదితర అందులో ఉండవు. 70 శాతం మంది ఇలాంటి అవసరాలున్నవారే ఉన్నారు. పైగా వినియోగదారుడికి, దుకాణాదారుకు మధ్య అనుసంధానం ఉండదు. అందుకే ‘యూజ్ మీ’ యాప్ రూపొందించాం. యూజర్స్, వెండర్స్ను కనెక్ట్ చేశాం. ప్రస్తుతం చాటింగ్ చేయడం ఎక్కువగా జరుగుతోంది. అందుకే చాట్ ద్వారానే ఈ ప్రకియ పూర్తి చేసేలా యాప్ను తీర్చిదిద్దామ’ని సంజయ్ వివరించారు. గల్లీ కొట్టులో కొనుగోలు చేయొచ్చు... ‘ఈ యాప్ సహాయంతో వినియోగదారులకు సమీపంలోని వ్యాపార సంస్థలు, సేవలందించే వాటి వివరాలు జీపీఎస్ ఆధారంగా తెలియజేస్తున్నాం. తద్వారా నచ్చిన సేవలు పొందొచ్చు. సేవలు, వ్యాపార విధానంలో ఇదో విప్లవాత్మక మార్పు. సమీపంలోని కిరాణా దుకాణాలకు ఆర్డర్ ఇవ్వొచ్చు. మీరు కొనుగోలు చేయబోయే వస్తువును ఇతర దుకాణాల్లో ఎంతకు విక్రయిస్తున్నారో తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఈ తరహా సేవలందించే వాళ్లు ప్రమోషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మా వద్ద 56 కేటగిరీలు, 3 లక్షల వెండర్ల డాటా ఉంది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా గత నెలలో హైదరాబాద్, విజయవాడలో ప్రారంభించాం. మా సేవలకు సానుకూల స్పందన వస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ యాప్ తీసుకురానున్నామ’ని చెప్పారు సంజయ్. -
గంజాయ్..
ఏలూరుకు చెందిన ఎండీ ఖాన్ ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన విద్యార్థి.సరదాగా తన స్నేహితులతో కలిసి కిక్ కోసం గంజాయి కలిపిన సిగరెట్ తాగాడు. మెల్ల గా దానికి బానిసగా మారాడు. ఇంట్లో తల్లి అనేకమార్లు హెచ్చరించింది. ఏడాది గడిచిపోయింది.. కానీ ఆ మత్తు నుంచి బయటకు రాలేకపోతున్నాడు. గంజాయి తాగుతూ పోలీసులకు చిక్కాడు.’ ఇలా ఎందరో యువకులు.. మత్తుమాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా.. ఏలూరు టౌన్: జిల్లాకేంద్రం ఏలూరు డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారింది. ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా చేసుకుంటూ జోరుగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు. ఏలూరులో సత్రంపాడు, వట్లూరు, బీడీ కాలనీ, చొదిమెళ్ల, అమ్మపాలెం తదితర ప్రాంతాల్లో గంజాయి, హుక్కా, ప్రమాదకర ఇతర మత్తు పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఏలూరులోనే 200 మందికి పైగా విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గంజాయి తాగుతూ పట్టుబడిన ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు నగరంలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు చెందినవారు కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ మాఫియాలోని వ్యక్తులు ఆన్లైన్ నెట్వర్క్ను వినియోగిస్తూ జిల్లాలో విస్తృతంగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. విద్యార్థులు మత్తుకు చిత్తవుతూ తమ విలువైన భవిష్యత్తును నిలువునా బుగ్గిపాలు చేసుకుంటున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా మాఫియా వందలాది మంది విద్యార్థులకు మత్తు పదార్థాలు అలవాటు చేస్తూ బానిసలుగా మార్చేస్తున్నారు. గంజాయి మాఫియాల్లో హనుమాన్ జంక్షన్కు చెందిన ప్రవీణ్ వంటి విద్యార్థులు, హైదరాబాద్లో ఉంటున్న ఏలూరుకు చెందిన చిరుద్యోగి రఘువర్థన్ వంటి వారు సైతం ఉండటం విశేషం. మొదట్లో గంజాయికి అలవాటు పడిన కొందరు విద్యార్థులు ఆ తర్వాత గంజాయి వ్యాపారాలుగా అవతారం ఎత్తి తమలాంటి విద్యార్థులను ఈ మత్తులోకి లాగుతుండడం విశేషం. ఏలూరుతో పాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, జంగారెడ్డిగూడెం కేంద్రాలుగా డ్రగ్స్ మాఫియా తమ కార్యకలాపాలు సాగిస్తోందని తెలుస్తోంది. భారీగా గంజాయి అక్రమ రవాణా పశ్చిమలోకి గంజాయిని సరిహద్దు జిల్లా ఖమ్మం నుంచి, అటు విశాఖపట్నం, అరకు నుంచి, ఇటు హైదరాబాద్, తెలంగాణ జిల్లాల నుంచి భారీ ఎత్తున డంప్ చేస్తున్నారు. నల్లజర్ల, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం తదితర ప్రాంతాల్లో భారీస్థాయిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ఇక గంజాయి రవాణా చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు, విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం ఏర్పడుతుందనే కారణంగా కేసులు నమోదులో కొంత వెసులుబాటు కల్పిస్తున్నారు. విద్యార్థులకుకౌన్సెలింగ్ ఇస్తున్నాం మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును పాడుచేసుకుంటోన్న విద్యార్థులను గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంజినీరింగ్ కళాశాలల్లో అవగాహన సదస్సులు సైతం ఏర్పాటు చేస్తున్నాం. గంజాయి అక్రమ రవాణాపై నిఘా ఉంచాం. –కె.ఈశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు -
పతంజలి.. మరింత ‘క్లిక్’!!
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రామ్దేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థ.. ఆన్లైన్ అమ్మకాలను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, గ్రోఫర్స్, షాప్క్లూస్, బిగ్బాస్కెట్, 1ఎంజీ, పేటీఎం మాల్, నెట్మెడ్స్ వంటి 8 ఈ–కామర్స్ దిగ్గజాలతో జట్టు కట్టింది. ఈ పోర్టల్స్లో తమ ఉత్పత్తుల శ్రేణి మొత్తం అందుబాటులో ఉంటుందని బాబా రామ్దేవ్ మంగళవారం చెప్పారు. ఆన్లైన్ అమ్మకాల ద్వారా తొలి ఏడాదే రూ.1,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే ’దివ్య జల్’ పేరిట బాటిల్డ్ వాటర్, ’పరిధాన్’ బ్రాండ్ కింద దుస్తులు, పాదరక్షలు ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నట్లు రాందేవ్ తెలిపారు. ‘సంప్రదాయ రిటైల్ మార్కెట్ పరిధిని మరింతగా విస్తరించేందుకు ఆన్లైన్ ఉపయోగపడుతుంది. ఈ ఏడాది రూ.1,000 కోట్ల అమ్మకాల లక్ష్యం పెట్టుకున్నాం. సాధ్యపడితే అంతకు మించి కూడా చేయాలనుకుంటున్నాం‘ అని తెలియజేశారు. 2016–17లో పతంజలి ఆయుర్వేద్ టర్నోవరు రూ. 10,500 కోట్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండు రెట్ల వృద్ధిని లకి‡్ష్యంచుకుంది. సొంత పోర్టల్తో డిసెంబర్లో రూ.10 కోట్లు .. ప్రయోగాత్మకంగా తమ సొంత పోర్టల్ ‘పతంజలిఆయుర్వేద్.నెట్’ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల శ్రేణిని ఆన్లైన్లో విక్రయిస్తున్నామని, డిసెంబర్ నెలలో ఏకంగా రూ.10 కోట్ల విక్రయాలు జరిగాయని, మిగతా ఏ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ కూడా ఒక నెలలో ఈ స్థాయి అమ్మకాలు సాధించలేదని రామ్దేవ్ తెలియజేశారు. రిటైల్ స్టోర్స్ సంఖ్యను కూడా పెంచుకోనున్నట్లు చెప్పారాయన. గ్రామాల్లోని కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అందుబాటు ధరల్లో మరిన్ని ఉత్పత్తులను చిన్న ప్యాక్లలో అందించే ప్రణాళికలు కూడా ఉన్నట్లు తెలియజేశారు. ‘ప్రస్తుతం 5,000 పైచిలుకు ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఉండగా.. వీటిని ఇంకా పెంచుతాం. జనవరి 26న స్వదేశ్ సమృద్ధి పేరిట కొత్తగా లాయల్టీ కార్డును ప్రవేశపెడుతున్నాం‘ అని వెల్లడించారు. బీమా ప్రయోజనం కూడా (మరణం, అంగవైకల్యం) కల్పించే ఈ లాయల్టీ కార్డు ద్వారా అయిదు కోట్ల మందికి చేరువ కావాలని నిర్దేశించుకున్నట్లు రామ్దేవ్ చెప్పారు. ప్రస్తుతం తమ ఉత్పత్తులు 15–20 లక్షల కిరాణా దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయంటూ ఈ ఏడాది వీటిని 50 లక్షలకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. 20వేల మంది నియామకం.. కార్యకలాపాల విస్తరణ ప్రణాళికల నేపథ్యంలో 20,000 మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నామని .. సేల్స్ మేనేజర్, జోనల్ మేనేజర్, రీజనల్ మేనేజర్ స్థాయి దాకా వివిధ హోదాల్లో ఈ పోస్టులుంటాయని రామ్దేవ్ తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా మరింతగా పెంచుకుంటున్నట్లు చెప్పారు. ‘వార్షికంగా రూ. 50,000 కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీ సామర్థ్యం మాకు ఉంది. ఎఫ్ఎంసీజీలో ఇదే అత్యధికం. హరిద్వార్, తేజ్పూర్, అసోమ్లలో ప్లాంట్లున్నాయి. అటు నోయిడా, నాగ్పూర్, ఇండోర్లలో కూడా ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది‘ అని వివరించారు. ప్రిస్క్రిప్షన్ అవసరమయ్యే పతంజలి ఔషధాలు మాత్రమే నెట్మెడ్స్, 1ఎంజీ పోర్టల్స్లో లభ్యమవుతాయి. పతంజలి ఉత్పత్తులు ఆన్లైన్లో విక్రయిస్తున్నప్పటికీ.. ప్రత్యేక డిస్కౌంట్లేమీ ఉండవు. రిటైల్ అవుట్లెట్స్కి ధరలపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఎగుమతులు.. నాగ్పూర్లోని మిహా దగ్గర నిర్మిస్తున్న ఎగుమతి ఆధారిత ప్లాంటు అందుబాటులోకి వచ్చాక.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎగుమతులు కూడా ప్రారంభించనున్నట్లు రామ్దేవ్ తెలిపారు. యూఏఈ, అమెరికా, కెనడా, యూరప్, దక్షిణ అమెరికా, ఆఫ్రికన్ దేశాలతో పాటు పలు ప్రాంతాలకు ఎగుమతులు చేసేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన చెప్పారు. పతంజలి ఇటీవలే పిల్లలు .. పెద్దల డైపర్స్, చౌక శానిటరీ నాప్కిన్స్ను కూడా ప్రవేశపెట్టింది. సౌర విద్యుదుత్పత్తి పరికరాల తయారీలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. -
‘ఆన్లైన్లో పెట్రోల్’
సాక్షి,న్యూఢిల్లీ:డిజిటల్ విప్లవం ప్రపంచాన్ని చుట్టేయడంతో అన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేశాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ సహా పెట్రో ఉత్పత్తులను ఈ-కామర్స్ వేదికపై విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీటి సాధ్యాసాధ్యాలపై కసరత్తు సాగిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులన్నింటినీ ఈ కామర్స్ ఫ్లాట్ఫాంపైకి తీసుకువస్తామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.అయితే దీనిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో పెట్రో ఉత్పత్తుల విక్రయం అసాధ్యమేమీ కాకున్నా ఈ విషయంలో అత్యంత భద్రతా ప్రమాణాలను పాటించాలని ఈ రంగంలో అనుభవం కలిగిన నిపుణులు సూచిస్తున్నారు. ఈ-కామర్స్ సైట్లలో పెట్రోల్ను ఆఫర్ చేసి ఆ తర్వాత కస్టమర్ల తలుపు తట్టి డెలివరీ చేయడం సాంకేతికంగా సాధ్యమేనని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ఆలోచనను ఇటీవల పార్లమెంటరీ సలహా సంఘం ఎదుట పంచుకున్నారు. అయితే పెట్రో ఉత్పత్తులను సరిగ్గా సీల్ చేయడం, సున్నితంగా వాటిని హ్యాండిల్ చేయడం వంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉందని చమురు, సహజవాయు వ్యవహారాలను పర్యవేక్షించే దీపక్ మహుర్కార్ చెబుతున్నారు. ఇది కార్యరూపం దాల్చే ప్రతిపాదనేనని, భద్రతాపరంగా గట్టి చర్యలు చేపట్టాలని ఓఎన్జీసీ మాజీ సీఎండీ ఆర్ఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. -
‘మందుల’ కష్టం
– మెడికల్ షాపుల బంద్ విజయవంతం – ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలు అనంతపురం మెడికల్ : ఆన్లైన్లో ఔషధ విక్రయాలకు వ్యతిరేకంగా చేపట్టిన మెడికల్ దుకాణాల బంద్ సామాన్యులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ బతుకులు బజారున పడతాయని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఒక్క రోజు షాపులు తెరుచుకోకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు అక్కడక్కడ దుకాణాలు తెరచి ఉంచడంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, కదిరి డివిజన్ల పరిధిలో సుమారు 1600 మెడికల్ షాపులున్నాయి. వీటిపైనే ఆధారపడి వందలాది మంది జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో ఔషధ విక్రయాలు చేయాలని భావిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్త బంద్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. అనంతపురంలో పెద్ద సంఖ్యలో ఔషధ విక్రయాలు జరిగే సప్తగిరి సర్కిల్, టవర్క్లాక్, శ్రీకంఠం సర్కిల్, పాతూరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లోని మెడికల్ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఆస్పత్రులకు అనుసంధానంగా ఉన్న మెడికల్ షాపులు తెరచుకోవడంతో కాస్త ఊరట కలిగించింది. ఆన్లైన్లో మందుల అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రంగారెడ్డి తెలిపారు. తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సర్వజనాస్పత్రి సమీపంలో జనరిక్ మందుల అమ్మకాలు జరిపే అన్న సంజీవని దుకాణం కూడా మూతపడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
కొరియర్లో కూరగాయలు!
డీడీఎస్ ఆధ్వర్యంలో వినియోగదారులకు పంపిణీ అందుబాటులో 18రకాల కూరగాయలు, ఆకుకూరలు నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ ప్రతి మంగళవారం, శుక్రవారం సరఫరా ప్రయోగాత్మకంగా 200 కుటుంబాలకు అందజేత ఆరునెలల నుంచి విజయవంతంగా సాగుతున్న పథకం నెత్తిన గంపతో వీధుల్లో కేకలు వేస్తూ తిరుగుతూ కూరగాయలు అమ్మేవారిని చూశాం. చిన్నపాటి దుకాణం ఏర్పాటు చేసుకొని అమ్మకాలు చేపట్టే పద్ధతీ చూశాం.. ప్యాకింగ్ చేసి షాపింగ్మాల్స్లో అమ్మడమూ చూశాం.. కానీ జహీరాబాద్ పట్టణంలో కూరగాయల అమ్మకంలో కొత్త పద్ధతి అమలవుతోంది. ఇంటికి కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నట్టు... కూరగాయలను కూడా ఫోన్ చేసి బుక్ చేసుకుంటే కొరియర్ సంస్థల్లాగా ఇంటికి తెచ్చి ఇచ్చే విధానం ఇక్కడ సాగుతోంది.అది కూడా సేంద్రియ కూరగాయలు కావడంతో వీటికి డిమాండ్ ఎక్కువగా పలుకుతోంది. జహీరాబాద్ : సేంద్రియ వ్యవసాయ సాగు విధానంలో పండించడంతో పాటు వాటిని వినియోగదారులకు ‘ఇంటికి సరఫరా’ పథకం విజయవంతంగా సాగుతోంది. జహీరాబాద్ పట్టణంలో ఆరునెలల క్రితం డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. 2016 ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి డిమాండ్ లభిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కింద 150 నుంచి 200 కుటుంబాలకు సరిపడా సేంద్రియ కూరగాయలను సేకరించి సరఫరా చేస్తోంది. ప్రతి మంగళ శుక్రవారాలలో వినియోగదారులకు ఇంటింటికీ మొబైల్ వాహనం ద్వారా సరఫరా చేస్తున్నారు. లోపాలు లేకుండా పర్యవేక్షణ ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు పలువురికి బాధ్యతలు అప్పగించారు. పొలంలో కూరగాయలను సాగుచేసే దగ్గరి నుంచి వినియోగదారులకు చేరేవరకు ఎలాంటి లోపాలు లేకుండా డీడీఎస్ సంస్థ పర్యవేక్షిస్తోంది. వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాలు రాకుండా నాణ్యవంతమైన కూరగాయలను సేకరించి అందిస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ, దత్తగిరి కాలనీ, మహీంద్రాకాలనీ, శ్రీనగర్, ఎంఆర్హెచ్ఎస్ కాలనీల్లోని వినియోగదారులకు సరఫరా చేస్తోంది. డీడీఎస్కు చెందిన వ్యవసాయ పొలంలో 18 రకాల కూరగాయలు, ఆకు కూరలను సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. వీరి పొలంలో పండించే కూరగాయలు వినియోగదారులకు సరిపోనందున క్రిష్ణాపూర్, బిడకన్నె, కాశీంపూర్, పస్తాపూర్, కుప్పానగర్, బర్దీపూర్ గ్రామాల్లో ఎంపిక చేసిన 66 మంది రైతుల పొలాల్లో సేంద్రియ విధానంలో కూరగాయలను సాగు చేయిస్తున్నారు. సాగు చేసిన కూరగాయలను రైతుకు మార్కెట్లో లభించే ధర కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు పొలంలో కూరగాయలు సాగు చేసేందుకు అవసరమైన విత్తనాల ఎంపిక దగ్గరి నుంచి సేంద్రియ విధానంలో వేప కషాయం, పంచగవ్య, వర్మీవాష్లను పిచికారీ చేయించి పురుగులు, తెగుళ్లు రాకుండా చూస్తున్నారు. వీటిని సూపర్వైజర్గా ఉన్న కిష్టయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాడు. రైతులు తీసుకువచ్చిన కూరగాయల నాణ్యతను డీడీఎస్ డిప్యూటీ డైరెక్టర్ జయప్ప పరిశీలిస్తాడు. ఒక్కో కుటుంబానికి ఇచ్చే బుట్టలో కిలో టమాటతో పాటు 4 రకాల కూరగాయలు పావు కిలో వంతున, 4 రకాల ఆకు కూరలతో పాటు కొత్తిమీర, కరివేపాకు, పచ్చి మిర్చిని ఇస్తున్నారు. ఒక్కో బుట్టకు రూ.120 నుంచి రూ.140 ధరకు విక్రయిస్తున్నారు. అన్ని కలిపి 9 కిలోల వరకు అందిస్తున్నారు. మార్కెట్లో లభించని ఆకు కూరలైన అవిష కూర, ఓమ కూర, దొగ్గలి, మునగ ఆకు, జొన్న సించలి కూర, గునుగు ఆకు, పప్పు కూర, పాయిలి కూర, పుంటికూరలను కూడా అందిస్తున్నారు. గత ఆరు నెలల కాలంగా డీడీఎస్ వారు అందిస్తున్న కూరగాయలను కొంటున్నా. మంచి నాణ్యంగా ఉంటున్నాయి. వారు ఇంటి వద్దకే తీసుకుని వచ్చి ఇస్తుండడంతో సౌకర్యంగా కూడా ఉంది. బయట లభించని ఆకు కూరలు కూడా ఇస్తున్నారు. నేను బయట కూరగాయలను కొనుగోలు చేయడం పూర్తిగా మానేశా. జి.హేమశ్రీ,, గృహిణి, మహీంద్రా కాలనీ సేంద్రీయ వ్యవసాయంతో పండించిన కూరగాయలు, ఆహారం తీసుకోవడం ద్వారానే మానవుడు మనుగడ సాధిస్తాడు. ప్రస్తుతం ఏది కొనాలన్నా వినియోగదారుడు భయంతోనే కొంటున్నాడు. వాటిలో ఏ మేరకు రసాయనం, పురుగు మందుల అవశేషాలు ఉన్నాయనేది వారిని భయాందోâýæనలకు గురిచేస్తోంది. వాటి నుంచి బయట పడవేసేందుకే సేంద్రియ కూరగాయలను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుని విజయవంతంగా కొనసాగిస్తున్నాం. పీవీ సతీష్, డీడీఎస్ డైరెక్టర్ -
అమెజాన్కు పోటీగా వాల్-మార్ట్ డీల్
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు పోటీగా వాల్-మార్ట్ అడుగులు వేయడం ప్రారంభించింది. ఇంటర్నెట్ రీటైలర్ జెట్.కామ్ను 3.3 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.22,080 కోట్లకు) సొంతం చేసుకునేందుకు వాల్-మార్ట్ స్టోర్స్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం వివరాలను వాల్-మార్ట్ సోమవారం వెల్లడించింది. అమెరికా ఈ-కామర్స్ స్టార్టప్ చరిత్రలో అతిపెద్ద డీల్ గా అవతరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంప్రదాయ రీటైలర్గా ఉన్న వాల్-మార్ట్ ఇప్పటికే 15కు పైగా స్టార్టప్లను కొనుగోలుచేసింది. తన 5 దశాబ్దాల వ్యాపార వృద్ధికి ముప్పుగా వచ్చిన మార్కెట్ లీడర్ అమెజాన్ పై పోటీని తీవ్రతరం చేసేందుకు ఈ స్టార్టప్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అమెజాన్తో పోలిస్తే వాల్-మార్ట్ ఆన్లైన్ డివిజన్ తక్కువగా నమోదవుతోంది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో ఆన్లైన్ అమ్మక వృద్ధి కొంత నెమ్మదించింది. కన్సూమర్లను ఆకట్టుకోవడంలో ముఖ్యంగా మిలీనియల్స్ ను ఆకర్షించడంలో చాలా సంఘర్షణకు గురైవడంతో ఆన్ లైన్ అమ్మకాలు కేవలం 7శాతం మాత్రమే పెరిగాయి. ఈ ఒప్పందం వల్ల ఆన్లైన్లో వాల్-మార్ట్ తన ఉనికిని విస్తరించుకుని, తక్కువ ధరల ఆఫర్తో వినియోగదారులను తన సొంతంచేసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డీల్ ప్రకారం 3 బిలియన్ డాలర్లను నగదు రూపంలో, మరో 300 మిలియన్లను షేర్ల రూపంలో జెట్కు చెల్లించనున్నట్టు వాల్-మార్ట్ ప్రకటించింది. ఈ నగదు కొనుగోలు జెట్ రెవెన్యూలకు ఆరింతలు ఎక్కువగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జెట్.కామ్ను 2015 జూలైలో ఇంటర్నెట్ ఎంటర్ప్రైన్యూర్ మార్క్ లోర్ స్థాపించారు. ఈ సంస్థ వినియోగదారులకు ఎక్కువ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ధరల్లో మార్పుల ఆఫర్లను ఈ సంస్థ ప్రకటిస్తూ ఉంటోంది. యూజర్లు వారి వర్చ్యువల్ షాపింగ్ కార్ట్ పై మరిన్ని ఉత్పత్తులు పొందే అవకాశం కూడా ఉంది. సెలెక్టెడ్ ఐటెమ్స్పై ధర ప్రోత్సహకాలనూ జెట్.కామ్ ఆఫర్ చేస్తోంది.జెట్ తొలి ఏడాది ఆపరేషన్లో 12 మిలియన్ ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. 10 మిలియన్లగా ఉన్న ఆన్లైన్ ఉత్పత్తులను కోట్లాది ఉత్పత్తులకు విస్తరించుకుంటామని వాల్మార్ట్ ఇంతకుముందే ప్రకటించింది. తన ప్రత్యర్థి అమెజాన్ ప్రస్తుతం 200 మిలియన్ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తోంది. -
హైదరాబాద్లో వి-గార్డ్ స్విచ్గేర్స్ ప్లాంటు
♦ రెండు కంపెనీలను కొంటున్నాం ♦ ఆన్లైన్ విక్రయాలకు ప్రత్యేక పోర్టల్ ♦ సాక్షితో వి-గార్డ్ ఎండీ మిథున్ చిట్టిలప్పిలి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీలో ఉన్న వి-గార్డ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్లో స్విచ్గేర్ల తయారీ ప్లాంటును నెలకొల్పాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విభాగం నుంచి కంపెనీకి రూ.40 కోట్ల ఆదాయం సమకూరుతోంది. రూ.150 కోట్లకు చేరుకోగానే తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని వి-గార్డ్ ఎండీ మిథున్ చిట్టిలప్పిలి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. రెండేళ్లలోనే లక్ష్యానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అందుబాటు ధరలో నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తామన్నారు. దక్షిణాది మార్కెట్లో పోటీ ధరలో స్విచ్గేర్లను అందించేందుకు హైదరాబాద్ ప్లాంటు దోహదం చేస్తుందని వివరించారు. స్విచ్గేర్లతోపాటు కిచెన్ అప్లయాన్సెస్ రంగంలో ఉన్న కంపెనీని కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ఒక ఏజెన్సీని నియమించామని, ఏడాదిలో ఈ డీల్స్ పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్లో ఫ్యాన్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. రెండేళ్లలో నాలుగింతలు.. ప్రస్తుతం కిచెన్ అప్లయాన్సెస్ ద్వారా కంపెనీకి రూ.50 కోట్ల ఆదాయం వస్తోంది. రెండేళ్లలో దీనిని నాలుగు రెట్లకు చేర్చాలన్నది సంస్థ లక్ష్యం. ఇందుకోసం ఏటా నూతన విభాగాలను పరిచయం చేస్తామని మిథున్ చెప్పారు. గ్యాస్ కుక్ టాప్స్ కొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో వినూత్న ఉత్పత్తులను రూపొందిస్తామన్నారు. సోలార్ ఇన్వర్టర్లు, రూఫ్ టాప్ విభాగంపై మరింత ఫోకస్ చేస్తామన్నారు. వైర్లు, పీవీసీ ఇన్సులేటెడ్ పవర్ కేబుల్స్ తయారీకై కోయంబత్తూరులో రూ.35 కోట్లతో ప్లాంటు స్థాపిస్తున్నట్టు వెల్లడించారు. ఆన్లైన్కు ప్రత్యేకంగా.. వి-గార్డ్ ఇండస్ట్రీస్లో 1,800 మంది పనిచేస్తున్నారు. 3,000 పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఏటా ఉద్యోగుల సంఖ్యను 10 శాతం పెంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఆదాయంలో దక్షిణాదియేతర రాష్ట్రాల వాటా 33 శాతముంది. అన్ని మార్కెట్లలో లోతుగా విస్తరించడం ద్వారా దీనిని 50 శాతానికి చేర్చాలన్నది కంపెనీ భావన. ఇక ఆన్లైన్ కోసం ప్రత్యేకంగా సొంత వెబ్సైట్ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ఎండీ వెల్లడించారు. ఈ-కామర్స్ కంపెనీల ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తామన్నారు. రెండు మూడేళ్లలో ఆన్లైన్ వాటా ప్రస్తుతమున్న రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్లకు చేరుస్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వి-గార్డ్ ఇండస్ట్రీస్ రూ.1,850 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2016-17లో రూ.2,100 కోట్ల టర్నోవర్ను లక్ష్యంగా చేసుకుంది. -
కూలర్స్.. భలే హాట్ గురూ!!
► కంపెనీలకు కలిసొచ్చిన భానుడి ప్రతాపం ► ఎండలతో పాటే పెరిగిన అమ్మకాలు ఈ మార్కెట్లోకి బ్లూస్టార్ వంటి ఏసీల కంపెనీలు కూడా.. ► మున్ముందు ఆన్లైన్ విక్రయాల వాటా పెరుగుతుందని ధీమా సాక్షి, బిజినెస్ బ్యూరో:- ఏడాదికేడాది ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భానుడు మే నెలలో చూపించాల్సిన పవర్ను ఈసారి మార్చి నుంచే మొదలెట్టాడు. మరి పరిస్థితేంటి? ఏసీలు ఉన్నవారి సంగతి సరే!! లేని వారి మాటో!? అందుకే ఈసారి కూలర్లు హాట్ కేకులయ్యాయి. సింఫనీ, బజాజ్ ఎలక్ట్రికల్, వోల్టాస్, ఉషా ఇంటర్నేషనల్, మహారాజా వైట్లైన్ వంటి కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో మార్కెట్ను ముంచెత్తాయి. బ్రాండింగ్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. పరిస్థితి చూసిన ఏసీ కంపెనీలు... రూ.3,000 కోట్ల ఎయిర్ కూలర్ల విపణిలోకి ప్రవేశించటం విశేషం. రెండింతలు నమోదైన విక్రయాలు... అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూలర్ల విక్రయాలు బాగా పెరిగినట్లు బజాజ్ ఎలక్ట్రికల్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మార్కెటింగ్ హెడ్ (కన్సూమర్ ప్రొడక్ట్స్) అమిత్ సేథి చెప్పారు. ఒడిశా, బెంగాల్తో పాటు దక్షిణాదిలో కూలర్ల విక్రయాలు జోరుగా ఉన్నట్లు ఉషా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ (అప్లయెన్సెస్) హర్విందర్ సింగ్ తెలిపారు. మొత్తంగా ఈ సీజన్ విక్రయాల్లో 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. ‘‘గతేడాది మంచి పనితీరు కనబరిచాం. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తాం’’ అని మహారాజా వైట్లైన్ సీఈవో సునీల్ వాద్వా తె లియజేశారు. 2016లో 1.5 లక్షలకు పైగా కూలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారాయన. గత ఏడాదితో పోలిస్తే మార్చి, ఏప్రిల్లో ఊహించని స్థాయిలో భారీ అమ్మకాలు నమోదైనట్లు టీఎంసీ బేగంపేట మేనేజర్ కె.శ్రీనివాస్ తెలియజేశారు. ‘‘100 శాతం వృద్ధి నమోదైంది’’ అని చెప్పారాయన. కొడితే సీజన్లోనే కొట్టాలి... కంపెనీలు చెబుతున్న దాని ప్రకారం... కూలర్లను ఆఫ్ సీజన్లో కొనటానికి జనం ఇష్టపడరు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నపుడే వీటికి డిమాండ్. ఇదే పరిశ్రమకు సవాలుగా మారిందని కంపెనీలు చెబుతున్నాయి. కొన్ని కంపెనీలు ఈ సీజనల్ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన కొత్త ఉత్పత్తులను విడుదల చేశాయి. ఐ-ప్యూర్ పేరిట ప్రపంచంలో తొలిసారిగా మల్టీ స్టేజ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ కూలర్లను సింఫనీ ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీకి కంపెనీ పేటెంటు దరఖాస్తు కూడా చేసింది. ‘‘పరిశ్రమలో అత్యధిక డిజైన్లు, ట్రేడ్ మార్కులు మాకే ఉన్నాయి’’ అని సింఫనీ సీఎండీ ఆచల్ బకేరి వెల్లడించారు. ఉషా కంపెనీ విండో కూలర్స్, టవర్ కూలర్స్, పర్సనల్ కూలర్స్ వంటి పలు విభాగాల్లో కొత్త ఉత్పత్తుల్ని తెచ్చింది. ఇవి ఆరోగ్యకరమైన జీవనానికి అనువుగా ఉంటాయని పేర్కొంది. ఇక మహారాజా కూడా ఇంధన పొదుపు ఫీచర్తో పలు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. మహారాజా కూలర్ల నిర్వహణ వ్యయం గంటకు రూ.2 ఉంటుందని, ఇది ఏసీల విషయంలో రూ.10 అని వాద్వా తెలిపారు. సరౌండ్ కూల్ టెక్నాలజీతో బజాజ్ ఎలక్ట్రికల్ తన ఉత్పత్తులను బ్రాండింగ్ చేస్తోంది. దిగ్గజ ఏసీ కంపెనీలు సైతం... ఏసీల తయారీలో ఉన్న దిగ్గజ కంపెనీ బ్లూ స్టార్ కూలర్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. మూడేళ్లలో కూలర్ల వార్షిక అమ్మకాలు రూ.150 కోట్లకు చేర్చాలన్నది తమ లక్ష్యమని బ్లూస్టార్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ విభాగం ప్రెసిడెంట్ బి.త్యాగరాజన్ చెప్పారు. మరో దిగ్గజ సంస్థ వోల్టాస్ సైతం ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018 నాటికి సంస్థ అమ్మకాల్లో కూలర్ల వాటా 10 శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015లో వోల్టాస్ ఒక లక్ష కూలర్లను విక్రయించింది. ఈ ఏడాది 2.5 లక్షలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విక్రయాలు బాగుండే అవకాశముందని వోల్టాస్ ప్రెసిడెంట్ ప్రదీప్ బక్షి చెప్పారు. ఐటీ విడిభాగాల తయారీలో ఉన్న జీబ్రానిక్స్ సైతం కూలర్స్ విపణిలోకి ప్రవేశించింది. ఇక టైర్-1, టైర్-2 వంటి పట్టణాల్లోని విక్రయాలదే కీలకపాత్ర అని కంపెనీలు చెబుతున్నాయి. కరువు ఛాయలు కొంత ఆందోళన కలిగిస్తున్నా, వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని చెప్పటంతో విక్రయాలపై ధీమాగా ఉన్నట్లు సింగ్ చెప్పారు. డిస్కౌంట్లతో ఆన్లైన్లో... తమ విక్రయాల్లో ఈ-కామర్స్ వాటా 10 శాతంగా ఉందని వాద్వా చెప్పారు. అయితే ఈ-కామర్స్ వ్యవస్థలో ఎయిర్ కూలర్ల రవాణా పెద్ద సమస్యగా మారిందన్నారు. ఉషా కంపెనీ ఈ మధ్యనే ఈ-టెయిలింగ్లో అడుగుపెట్టింది. ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్ముతోంది. మున్ముందు వినూత్న ఉత్పత్తులతో ఆన్లైన్ విభాగంలో అధిక వాటా కైవసం చేసుకుంటామని హర్విందర్ సింగ్ చెప్పారు. కాగా, భారత ఎయిర్ కూలర్ల మార్కెట్ 15-20 శాతం వృద్ధి రేటుతో రూ.3,000 కోట్లు ఉన్నట్టు అంచనా. ఇందులో వ్యవస్థీకృత రంగ సంస్థల వాటా 30 శాతం. మొత్తం అమ్మకాల్లో 60 శాతం ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలవి కాగా... వ్యవస్థీకృత రంగంలో విలువ పరంగా 50 శాతం వాటా తమదేనని సింఫనీ చెబుతోంది. -
ఒక్క సెకన్లో 10,000 ఫోన్లు సేల్!
ఆన్లైన్ సేల్స్లో లెనోవా ఫోన్స్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అమెజాన్ ఆన్లైన్ మార్కెంటింగ్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైన లెనోవా కె4 నోట్ మోడల్ ఒక్క సెకన్లో పదివేల ఫోన్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ ఇదే స్థాయిలో సంచలనాలు నమోదు చేసింది లెనోవా. కొంత కాలంగా ఈ మోడల్ మొబైల్ కోసం అడ్వాన్స్ బుకింగ్ అవకాశం కల్పించిన లెనోవా సంస్థ 4,80,566 రిజిస్ట్రేషన్లను స్వీకరించింది. 3 జీబీ రామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి అధునాతన ఫీచర్స్తో హై ఎండ్ మొబైల్గా రూపొందిన లెనోవా కె4 ధర రూ.12,499. ప్రస్తుతానికి అమెజాన్ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారానే అందుబాటులో ఉన్న ఈ మొబైల్ జనవరి 5న ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేయగా, జనవరి 19 నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. తొలి సెకన్లోనే 10,000 ఫోన్లు అమ్ముడయినట్టుగా సంస్థ తన అఫీషియల్ ట్విట్టర్లో వెల్లడించింది. We are overwhelmed by your response. 10,000 K4 Note VR bundles sold in just 0.9 seconds. Thank you for all the love. pic.twitter.com/Dj6NDCtyNN — Lenovo India (@Lenovo_in) January 19, 2016 -
రేపు మందుల షాపుల బంద్
హైదరాబాద్: ఆన్లైన్లో మందుల కొనుగోలు, అమ్మకాలు సాగించే విధానాలను నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా 8 లక్షల మందుల దుకాణాలు బంద్ పాటిస్తాయని తెలంగాణ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటపతి, గౌరవ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మధుసూదన్ తెలిపారు. ఆన్లైన్లో మందుల కొనుగోలు అమ్మకాల వల్ల అనేకరకాల నష్టం వాటిల్లుతుందన్నారు. అర్హత కలిగిన డాక్టర్ను సంప్రదించకుండా పరిమితిలేని మందులను వాడటం వల్ల సొంత వైద్యం ఎక్కువై తద్వారా ఆరోగ్య నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానాలను నిరసిస్తూ జరిగే బంద్కు సహకరించాలని వారు కోరారు. మందుల దుకాణాదారుల నిర్ణయంతో రాష్ట్రంలో అన్ని మెడికల్ షాపులు బంద్ పాటిస్తాయి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రతినిధి ఒకరు తెలిపారు. అన్ని చోట్లా ప్రభుత్వ ఆధ్వర్యంలోని దుకాణాలు, జనరిక్ మందుల దుకాణాలు, సింగరేణికి చెందిన దుకాణాలు, అపోలో, మెడ్ఫ్లస్ దుకాణాలు, ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ల్లో అన్ని ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల దుకాణాలన్నీ తెరిచే ఉంటాయని వెల్లడించారు. -
వ్యూ టెక్నాలజీస్ నుంచి 15 కొత్త స్మార్ట్ టీవీలు
న్యూఢిల్లీ: టీవీలు తయారు చేసే వ్యూ టెక్నాలజీస్ సంస్థ గురువారం 15 కొత్త స్మార్ట్ టీవీలను ఆవిష్కరించింది. 19 నుంచి 85 అంగుళాల సైజుల్లో ఉండే ఈ టీవీల ధరలు రూ.9,000 నుంచి రూ.9,00,000 లక్షల రేంజ్లో ఉన్నాయని సంస్థ డిజైన్ హెడ్, సీఈఓ దేవిత సరాఫ్ వెల్లడించారు. టీవీలను ఆల్ట్రా హెచ్డీ లేదా 4కే టెక్నాలజీతో రూపొందించామని, ఇతర టీవీలతో పోల్చితే తమ టీవీల ధరలు 40% తక్కువని వివరించారు. వీటిని పూర్తిగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారానే విక్రయిస్తామని తెలిపారు.తమ ఆదాయంలో 55% ఆన్లైన్ అమ్మకాల ద్వారానే వస్తున్నాయరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లుగా ఉన్న తమ టర్నోవర్ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లకు (రూ.300 కోట్లకు) పెంచుకోవడం లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే 35 వేలుగా ఉన్న టీవీల విక్రయాన్ని లక్షకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. -
ఆన్లైన్లోనూ ఫర్నిచర్ జోరు
దుస్తులు, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్.. ఇవే కాదు ఆన్లైన్ మార్కెట్లో ఫర్నిచర్ కొనేవారి సంఖ్య కూడా పెరిగిందని ఆన్లైన్ ఫర్నిచర్ కంపెనీ అర్బన్ లాడర్ సీఈవో ఆశిష్ గోయల్ తెలిపారు. దీంతో తమ కంపెనీని విస్తరిస్తున్నామని, ప్రస్తుతం హైదరాబాద్తోసహా ఆరు నగరాల్లో తమ డెలివరీ సెంటర్లు ఉన్నాయని, 2015కల్లా 25 నగరాలకు విస్తరిస్తామని కంపెనీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కౌస్తబ్ చక్రవర్తి అన్నారు. తమ ఉత్పత్తుల ధరలు దుకాణాల కంటే 15-20% తక్కువని చెప్పారు. ప్రతిరోజూ కంపెనీ వెబ్సైట్ను 15,000 మంది సందర్శిస్తున్నారు. సరాసరి బిల్లు రూ.20 వేలుందని చెప్పారు. ఎక్స్చేంజ్లో కొనే సౌకర్యాన్ని రెండు నెలల్లో తేనున్నట్టు ఆయన వెల్లడించారు. దుకాణాల్లోకి వెళ్లి ఫర్నిచర్ను ప్రత్యక్షంగా చూసి, సోఫా, బెడ్ అయితే కొద్ది సేపు వాటిపై కూర్చుంటేగానీ కస్టమర్లు ఒక అంచనాకు రారని, దాంతో తాము ఒక అడుగు ముందుకేసి ట్రయల్ రూమ్ పేరుతో కస్టమర్ ఇంటికే సోఫాను తీసుకు వచ్చి మరీ చూపిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదీ ఫర్నిచర్ మార్కెట్.. ఫర్నిచర్ మార్కెట్ దేశవ్యాప్తంగా 2013-14లో రూ.80 వేల కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు ఉంది. 13-14 శాతం పరిశ్రమ వృద్ధి చెందుతోంది. వ్యవస్థీకృత రంగంలో మార్కెట్ పరిమాణం రూ.4,000 కోట్లు మాత్రమే. గోద్రెజ్ ఇంటీరియో, జువారీ ఫర్నిచర్, హోమ్ టౌన్, ఎట్ హోమ్, నీల్కమల్, ఇవోక్, డ్యూరియన్, స్టైల్ స్పా, దమ్రో, హౌస్ ఫుల్ వ్యవస్థీకృత రంగంలో ప్రముఖమైనవి. ఇక మొత్తం ఫర్నీచర్ వ్యాపారంలో ఆన్లైన్ వాటా దేశంలో రూ.200 కోట్లు నమోదైంది. 2016 నాటికి ఇది రూ.1,000 కోట్లకు చేరుకుం టుందన్న అంచనాలున్నాయి. పడకలే ఎక్కువ.. ఆన్లైన్లో ఫర్నిచర్ కొనుగోలు విషయంలో హైదరాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది. పడకల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నది హైదరాబాదీలేనట. వార్డ్రోబ్లను వెతకడంలో రెండో స్థానం, సోఫాలు సెర్చ్ చేయడంలో మూడో స్థానంలో భాగ్యనగరం నిలిచింది. ఇక హైదరాబాద్ వాసులు ఆన్లైన్లో అధికంగా బెడ్స్ను కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో కాఫీ టేబుల్స్, డ్రాయింగ్ టేబుల్స్ నిలిచాయి. -
'నమో' ల్యాప్టాప్లు.. 'రాగా' ఫోన్లు.. 'ఆప్' టోపీలు..
-
సందడే సందడి
సాక్షి, న్యూఢిల్లీ:దసరా కొనుగోళ్లతో మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది దసరా, బక్రీద్ పండుగలు కలిసి రావడంతో కొనుగోళ్లు మరికాస్త పెరిగాయి. నగరంలోని ప్రధాన మార్కెట్లయిన సరోజినీ నగర్, కరోల్బాగ్, పాలికాబజార్, కన్నాట్ప్లేస్, చాందినీ చౌక్, సదర్ బజార్లలో రద్దీ బాగా పెరిగింది. రాంలీలాతో రాత్రి వేళల్లో సందడి వాతావరణం నెలకొంటోంది. వారం రోజులుగా ప్రదర్శిస్తున్న రాంలీలా వద్ద ప్రేక్షకుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. దసరా పండుగకు వివిధ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లతో మార్కెట్లన్నీ సందడిగా మారాయి. వార్తా పత్రికల్లో, టీవీల్లో విరివిగా వస్తున్న ప్రకటనలతో వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు తదితరాలను స్థానికులు కొనుగోలు చేస్తున్నారు. పండుగ సమీపించడంతో దుకాణాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని సరోజినీ మార్కెట్లోని ఆభరణాల దుకాణం యజమాని సంజయ్ తెలిపారు. ఈ ఏడాది ఎక్కువమంది ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. మొబైల్ఫోన్లు, టీవీలు, కంప్యూట ర్లు తదితర వస్తువులు బాగా అమ్ముడవుతున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా స్నేహితులు, బంధువులకు బహుమతులు పంపేవారి సంఖ్య ఈ ఏడాది ఎక్కువగానే ఉంది. రాంలీలాలో బాలీవుడ్ తారల సందడి రాజధాని నగరంలో దసరా వేడుకలు అంటే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేది రాంలీలా ప్రదర్శనలు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ ఏడాది నగరంలోని పలు చోట్ల భారీ స్థాయిలో రాంలీలాలు ఏర్పాటు చేశారు. వరుణుడు కాస్త ఆటంకం కలిగించినా నగరవాసులు ఏమాత్రం నిరుత్సాహపడకుండా రాంలీలాకు తరలివెళుతున్నారు. కొన్ని చోట్ల రాంలీలా ప్రదర్శనల్లో బాలీవుడ్ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు .రోహిణి సెక్టార్-3, మంగోలిపురిలోని కళా మైదానంలో ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమాల్లో గుల్షన్ గ్రోవర్, అఫ్తాబ్శివ్దాసానీ, రవీనాటాండన్, మహిమా చౌదరిలతోపాటు ప్రముఖ గాయకుడు శంకర్సహానీ పాల్గొననున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వీటితోపాటు 70 ఎంఎం తెరపైన రామాయణ ధారావాహికను ప్రదర్శిస్తున్నారు. వర్షం కారణంగా సీబీడీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న రాంలీలా వేదిక చుట్టుపక్కల నిలిచిన నీటిని కమిటీ సభ్యులు మోటార్లతో తోడించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాంలీలాకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుండడం నిర్వాహకులకు ఆనందం కలిగిస్తోంది. కళకళలాడుతున్న ఆలయాలు తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక పూజలతో నగరంలోని ప్రముఖ ఆలయాలన్నీ ఉదయం పూల అలంకరణలు, రాత్రి వేళల్లో విద్యుద్దీప కాంతులతో ప్రత్యేక శోభను సంతరించుకుంటున్నాయి. ఝండేవాలామందిర్, కల్కాజీ మందిర్, చత్తర్పూర్ మందిర్, గౌరీశంకర్ మందిర్తోపాటు బెంగాలీలు ఎక్కువసంఖ్యలో చిత్తరంజన్పార్క్ ప్రాంతాల్లో ప్రతి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అమ్మవారికోసం తయారు చేసిన ప్రత్యేక ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. నవరాత్రులు ఉపవాసాలతో ఏ ఇంట్లో చూసినా పండుగ శోభ కనిపిస్తోంది. నిఘా నీడలో నగరం: ఒకేసారి రెండు పండుగలు రావడంతో అన్ని ప్రధాన మార్కెట్లు, ఆలయాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇదే అదనుగా అసాంఘిక శక్తులు ఎలాంటి దాడులకు తెగబడకుండా భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. ప్రతి చోటా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయడంతోపాటు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రధాన ఆలయాలన్నింటికీ భద్రత పెంచారు. ఆలయ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేయడంతోపాటు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మహిళా శక్తిని ఆవిష్కరించిన దేవతామూర్తుల చిత్రాలు మహిళలకు స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చేవిధంగా అమ్మవార్ల చిత్రాలను ప్రదర్శించినట్లు ఎగ్జిబిషన్ పర్యవేక్షకురాలు విజయలక్ష్మి దోగ్రా తెలిపారు. నగరంలోని చాణక్యపురిలో ఉన్న ఆర్ట్ ఇండస్ గ్యాలరీలో శుక్రవారం ‘దేవి దేవి’ పేరిట దేవతా మూర్తుల ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ‘దేవతా మూర్తుల శక్తివంతమైన రూపాలను చిత్రీకరించడం ద్వారా మన మధ్య నివసిస్తున్న శక్తిస్వరూపుణులైన మహిళలకు నివాళులర్పిస్తున్నాం..’ అని చిత్రకారిణులు అర్పణ కౌర్, సీమా కోహ్లీ, షిప్రా భట్టాచార్య, జయశ్రీ బర్మన్, గోసి సరోజ్పాల్ తదితరులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 24వ తేదీవరకు కొనసాగుతుంది. ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన సింహవాహనంపై దుర్గామాత, ధ్యానముద్రలో ఉన్న పార్వతీ దేవి, పరమేశ్వరుడి తలపై నుంచి ఉరకలెత్తుతున్న గంగాదేవి వంటి చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ‘సేవా’ ఆధ్వర్యంలో నేడు దసరా వేడుకలు సాక్షి, న్యూఢిల్లీ: విజయదశమి వేడుకలను ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి నిర్వహించనున్నట్టు సమైక్య తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (సేవా) ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్.మురళి ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక కమ్యూనిటీ పార్కు, బ్లాక్ నంబర్ 43-48, గోల్ మార్కెట్లో ఈ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాత్రి ఎనిమిది గంటల వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొదట విఘ్నేశ్వర ప్రార్థన, లలితా పారాయణం, భక్తిగీతాలాపన, శ్రీ దుర్గామాత భజన, ప్రముఖ భక్తి పాటల గాయకుడు ఆసా ్తచానల్ ఫేం జస్బీర్సింగ్లఖా బృందంతో భక్తిపాటల ఆలాపన, వివిధ దేవుళ్ల అవతార ప్రదర్శన, అనంతరం రావణ దహనం, ప్రసాదం పంపిణీ తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు.