peddi reddy ramachandra reddy
-
పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
-
వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
-
పుంగనూరుకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. బాలిక కుటుంబానికి పరామర్శ
-
చంద్రబాబు, నారా లోకేష్ పై పెద్దిరెడ్డి ఫైర్
-
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పేర్ని నాని వ్యాఖ్యలు
-
‘రాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తున్న మైనింగ్ సంస్కరణలు’
సాక్షి,విజయవాడ: మైనింగ్ రంగంలో ప్రగతి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా రెవెన్యూ లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మైనింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంను తీసుకువచ్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన పలు సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నామని తెలిపారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం గనులశాఖ, ఎపిఎండిసి అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1)2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.4500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా దానిని అధిగమించి రూ.4692 కోట్లు ఆర్జించడం జరిగిదని అన్నారు. లక్ష్యాన్ని అధిగమించిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. మేజర్ మినరల్స్ లో 81 శాతం సాధిస్తే, మైనర్ మినరల్స్ లో ఏకంగా 125 శాతం పురోగతిని సాధించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 2వేల మైనింగ్ ఏరియాలకు ఈ-ఆక్షన్ ఇవ్వాలని నిర్ణయించగా, దానిలో 539 ఏరియాలకు ఈ-ఆక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీనిలో 405 ఏరియాలకు ఆక్షన్ ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యే దశలో ఉందని, వాటిల్లో 117 ఏరియాలకు ఈ-ఆక్షన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని, మరో 134 ఏరియాలకు ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 2)రాష్ట్రంలో నాన్-వర్కింగ్ లీజులను అన్నింటిలోనూ మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మొత్తం 4222 లీజుల్లో ఇప్పటికే 3142 లీజుల్లో మైనింగ్ జరుగుతోందని తెలిపారు. మరో 1080 లీజుల్లో మైనింగ్ కోసం గనులశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అన్ని లీజుల్లో మైనింగ్ ప్రారంభమైతే రాష్ట్రానికి అవసరమైన ఖనిజాల లభ్యత, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ లభిస్తాయని తెలిపారు. 3) ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ కలెక్షన్ లను అవుట్ సోర్సింగ్ ద్వారా వసూలు చేసే విధానంను మన రాష్ట్రంలోనూ అమలు చేయడం ద్వారా రెవెన్యూను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 5 జిల్లాల్లో ఇందుకు సంబంధించి టెండర్లను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ ఈ విధానం అమలుకు టెండర్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మైనింగ్ నుంచి సీనరేజీ, కన్సిడరేషన్ మొత్తాల రూపంలో స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. 4)ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఎపిఎండిసి గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఈ ఏడాది తన ఆదాయాన్ని రెట్టింపు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.902 కోట్లు రెవెన్యూ వస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంకు ఏకంగా రూ.1801 కోట్లు సాధించడం జరిగిందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంకు గానూ మొత్తం రూ.2137 కోట్లు మేర రెవెన్యూ ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. 5) జాతీయస్థాయిలో ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలతో ధీటుగా మధ్యప్రదేశ్ లోని సుల్యారీలో ఎపిఎండిసి నిర్వహిస్తున్న బొగ్గుగని ద్వారా గత ఏడాది 1.9మిలియన టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి, విక్రయించడం జరిగిందని అన్నారు. గత ఏడాది సుల్యారీ ద్వారా రూ.483.5 కోట్లు రెవెన్యూ ఆర్జించామని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో దానిని రూ.1624 కోట్లకు పెంచుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మంగంపేటలోని బెరైటీస్ గనుల నుంచి ఎపిఎండిసి చరిత్రలోనే మొట్టమొదటి సారి ఏకంగా 3 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసి, రూ.1000 కోట్ల రెవెన్యూ మైలురాయిని అధిగమించడం జరిగిందని అన్నారు. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.1201 కోట్లు బెరైటీస్ ద్వారా రెవెన్యూ సాధించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1369 కోట్లు రెవెన్యూ ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 6) ఝార్ఝండ్ లోని బ్రహ్మదియాలో కూడా కోకింగ్ కోల్ మైనింగ్ ఈ జూలై నెలలో ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే హెచ్ఎంబిసి, ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ లను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని మైనింగ్ సంస్థలు, కేంద్ర మైనింగ్ సంస్థలతో పోలిస్తే మైనింగ్ పురోగతిలో ఎపిఎండిసి ముందంజలో ఉందని, దీనిని మరింత మెరుగుపరుచు కోవడం ద్వారా సంస్థను అగ్రగామిగా నిలబెట్టాలని కోరారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి, ఎపిఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డి, ఎపిఎండిసి వైస్ ప్రెసిడెంట్ రామ్ నారాయణన్, సలహాదారు డిఎల్ఆర్ ప్రసాద్, గనులశాఖ జెడి రాజబాబు, డిడి రవిచంద్, ఎపిఎండిసి జీఎంలు టి.నతానేయల్, ఎ.నాగేశ్వరరెడ్డి, డిజిఎం సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం
-
‘హామీలు ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు’
సాక్షి, అనంతపురం: నారా చంద్రబాబు నాయుడు ఎల్లోమీడియా కుట్రను దీటుగా ఎదర్కొవాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపినిచ్చారు. ఈ మేరకు ఆయన అనంతపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..‘ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నాయకత్వంలో 98 శాతం హామీలు అమలు చేయడం చారిత్రాత్మకం అని ప్రశంసించారు. కానీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ ఒక్క మంచిపనైనా చేశారా? అని నిలదీశారు. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని మంత్రి పెద్దిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం టీడీపీ అవశాన దశలో ఉందని, మళ్లీ అధికారంలోకి రావడం ఒక కల అని ఎద్దేవా చేశారు. అంతేగాదు చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేకపోగా, వాళ్లను వంచనకు గురిచేశారంటూ ఆరోపణలు చేశారు. ఐతే బీసీ సామాజిక వర్గానికి చెందిన 80 వేల మందికి పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందని నొక్కి చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యకర్తలను ఉద్దేశిస్తూ... జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుక మనమంతా గర్వపడాలన్నారు. ఈ మేరకు అనంతలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉష శ్రీ చరణ్ తదితరలు పాల్గొన్నారు. (చదవండి: 'రాజకీయ నేత ఎలా ఉండకూడదో చెప్పేందుకు.. చంద్రబాబే ఉదాహరణ') -
నారాయణ అరెస్ట్లో కక్ష సాధింపు ఏముంది?
సాక్షి, అమరావతి: టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నారాయణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నారాయణ విద్యాసంస్థల నుంచే ఈ లీకేజ్ జరిగినట్లు పోలీసులు సైతం నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో.. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పందించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం నారాయణ విద్యాసంస్థల్లోనే ఈ ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ జరిగిందని అన్నారు. ఇప్పటికే ప్రశ్న పత్రాలు మాల్ ప్రాక్టీస్ కేసులో 60 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అందులో పూర్తి విచారణ జరిగాకే.. ఇప్పుడు నారాయణను అరెస్ట్ చేశారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ‘ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు. విచారణలోనే అంతా తేలింది. వాస్తవాల ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేశారు’ అని స్పష్టం చేశారు. ఇక పొత్తులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపైనా మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ‘‘చంద్రబాబుకి మతిమరుపు వచ్చి రోజుకో మాట మాట్లాడుతున్నాడు. పొత్తులపై మాట్లాడింది ఆయనే, మాట మార్చింది ఆయనే. చంద్రబాబుకి జనం ఎలాగూ తనను గెలిపించరని తెలుసు. అందుకే పొత్తుల కోసం రోజు మాట్లాడుతారు. వైఎస్సార్సీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసి మళ్ళీ గెలిచి తీరుతుంద’’ని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. చదవండి👉: ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ -
సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రులు స్పష్టం చేశారు. పునర్విభజన తర్వాత మొదటి సారి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం(డీఆర్సీ) శనివారం స్థానిక వైఎస్సార్ సభావేదిక ప్రాంగణంలో నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉషశ్రీచరణ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కే.నారాయణస్వామి, ఆర్కే రోజా హాజరయ్యారు. కలెక్టర్ హరినారాయణన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో చేపడుతున్న పలు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో నాడు–నేడు పథకం ద్వారా పాఠశాల లు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో సప్లయ్చానల్స్ సర్వే చేసి, వాటి మరమ్మతు పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలన్నారు. అన్ని రంగాల్లో ప్రగతి పరుగు చిత్తూరు జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఇన్చార్జి మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. రైతులకు అధునాతన సాగు పద్ధతులపై వ్యవసాయ శాఖాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పారు. మందుల కొరత లేకుండా అందుబాటులో పెట్టాలన్నారు. స్పందన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. శాఖల వారీగా చర్చ ∙పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లాలో రూ.318.19 కోట్లతో 72,272 గృహాల నిర్మాణంలో 72 శాతం గ్రౌండింగ్ చేసి చిత్తూరు జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపారని జిల్లా గృహనిర్మాణశాఖ పీడీ పద్మనాభం వివరించారు. జిల్లాలో రూ.316.70 కోట్లతో టిడ్కో ద్వారా నిర్మిస్తున్న గృహాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో నాడు నేడు పథకం రెండో విడతలో 783 పాఠశాలల్లో రూ.217 కోట్లతో పనులు చేపడుతున్నట్లు సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణారెడ్డి వివరించారు. రెండో విడతలో 784 అదనపు తరగతులను నిర్మించనున్నట్లు చెప్పారు. నాడు నేడు పథకంలో జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.11.95 కోట్లతో పనులు చేపడుతున్నామని డీఎంహెచ్ఓ శ్రీహరి వివరించారు. ∙జిల్లాలోని 370 గ్రామాల్లో రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని సర్వే శాఖ ఏడీ గిరి« తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 1,50,682 జాబ్కార్డులు కలిగిన వారికి 79,68,671 పని దినాలు కల్పించినట్లు డ్వామా పీడీ చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకు రూ.181.311 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతుల పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారి మురళీ కృష్ణ వివరించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, మిల్క్ బల్క్ యూనిట్ల శాశ్వత భవనాల పనులను నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, వెంకటే గౌడ, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు మేయర్ అముద, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, డీసీసీబీ చైర్ పర్సన్ రెడ్డెమ్మ, కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్కుమార్, జెడ్పీ సీఈఓ ప్రభాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ... రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధిలోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందుకు కలెక్టర్, జేసీలతోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పథకాల అమలులో చిత్తూరు జిల్లా ముందుండేలా పనిచేయాలని చెప్పారు. పార్టీలకతీతంగా కుల, మత, వర్గ, పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. నాడు–నేడు పథకంతో సర్కారు బడుల రూపురేఖలు మారాయని చెప్పారు. చెరువులు, శ్మశానవాటికలు ఆక్రమణకు లోనుకానుండా రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం
-
ఇది ఇంటర్వెల్ మాత్రమే.. శుభం కార్డు వేరేగా ఉంటుంది
తిరుపతి రూరల్: బిల్లులో టెక్నికల్ సమస్యల వల్లే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించామని పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఇది ఇంటర్వెల్ మాత్రమేనని, సినిమా శుభంకార్డు ముగింపు వేరేగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయన సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. న్యాయపరమైన చిక్కుల వల్లే వెనక్కి తగ్గామని, సమస్యలను సరిదిద్ది మూడుప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా మెరుగైన బిల్లుతో వస్తామని చెప్పారు. వ్యక్తిగతంగా తాను మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. పాదయాత్ర చేస్తోంది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమేనని, ఆ పాదయాత్రను చూసి చట్టం ఉపసంహరించలేదని చెప్పారు. -
గ్రామ సర్పంచ్లతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్
-
జులై 1 నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా అమలు
-
సరిహద్దు చెక్పోస్టులను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం
-
కరోనా బాధితులను వేధిస్తే సహించం: పెద్దిరెడ్డి
-
‘రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు’
సాక్షి, అమరావతి: రాజకీయ దురుద్దేశంతోనే ఇసుక టెండర్లపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందని, విచ్చల విడిగా ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక టెండర్లలో టీడీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ద్వారానే టెండర్లు పిలిచామన్నారు. రూ.120 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ చేసిన సంస్థ దివాళా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వినియోగదారులకు సక్రమంగా ఇసుక సరఫరా అందిస్తున్నామని, సొంతంగా వినియోగదారులే ఇసుక తరలించేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. అలాగే ఇసుక అక్రమాలపై ఫిర్యాదులకు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం పెద్దిరెడ్డి వివరించారు. -
కర్నూలు రోడ్డు ప్రమాదం: ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం
సాక్షి, విజయవాడ /కర్నూలు: కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం కర్నూలు: ప్రమాద ఘటనపై ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు ప్రమాద ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. మృతులు 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. గాయపడిన నలుగురికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. రేపు మదనపల్లికి వెళ్లి చెక్కులు అందజేస్తామని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం ఆదేశించారని ఆయన గుర్తు చేశారు. డ్రైవర్ నిద్ర మత్తువల్లే.. టెంపో మినీ బస్సు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ వెల్లడించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయ సహకారాలు అందించి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. ప్రమాద కారణాలను ప్రత్యేక సాంకేతిక బృందంతో సమగ్ర విచారణ చేపడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. మృతుల వివరాలను చిత్తూరు జిల్లా అధికారులకు సమాచారం అందించామని ఆయన తెలిపారు. బాధితులకు అండగా ప్రభుత్వం: ఆళ్ల నాని కర్నూలు ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి చెందారు. కర్నూలు జిల్లా కలెక్టర్, డీఎంహెచ్వోతో ఫోన్లో ఆళ్ల నాని మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను అడిగితెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. అంతా మదనపల్లి వాసులే!) -
ప్రగల్భాలు పలికి ‘స్టే’ తెచ్చుకుంటారా?
సాక్షి, అమరావతి: రాజధాని భూముల వ్యవహారాల్లో దమ్ముంటే విచారణ చేసుకోవాలని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి ‘స్టే’ ఎందుకు తెచ్చుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సవాల్ చేసి పారిపోవడంపై చంద్రబాబు, టీడీపీ నేతలు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి బొత్స బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కోర్టుల్లో స్టేలు తెచ్చుకొని మేం నిస్వార్థపరులం, రుషి పుంగవులం అంటే ఎలా? అని వ్యాఖ్యానించారు. ► అమరావతి భూముల వ్యవహారాల్లో పలు అక్రమాలు, దోపిడీ జరిగిందని మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాం. చంద్రబాబు, లోకేష్, వాళ్ల తాబేదారులు ఆ ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు అక్రమంగా కొనుగోలు చేశారు. దీనిపై దమ్ముంటే విచారణ జరిపించాలని టీడీపీ నేతలు సవాళ్లు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదైంది, ఏం తేల్చారంటూ వ్యాఖ్యలు చేశారు. ► అసెంబ్లీలో చర్చించిన అనంతరం దీనిపై సిట్ దర్యాపునకు ఆదేశిస్తే కోర్టుకు వెళ్లారు. ఏసీబీ కేసు పెడితే దానిపైనా కోర్టుకు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? మీడియా ఈ విషయాన్ని చర్చకు పెట్టాలి. చర్చకు మేం సిద్ధం. ► ఈ వ్యవహారాల్లో కొందరు వ్యక్తుల పాత్రకు సంబంధించి ఆధారాలున్నట్లు ప్రాథమికంగా నిర్థారణ కావడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగానే ఏసీబీ కేసులు నమోదు చేసింది. ► రాజధాని భూముల వ్యవహారాల్లో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. సామాన్యులకు అన్యాయం చేశారు. అందుకు సాక్ష్యాలు చూపించాం. చట్టం తన పని తాను చేస్తుంది. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేసులు పెడుతున్నారన్న టీడీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదు. పక్కదారి పట్టించేందుకు ఏ సమస్య ఉందో చెప్పాలి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వమేప్రశంసించింది. ఈ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో చంద్రబాబు చివరకు దేవాలయాల పేరుతో విమర్శలు చేస్తున్నారు. విజయవాడ దుర్గగుడిలో రథాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వినియోగించలేదు. -
చిత్తూరు: పాల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ
సాక్షి, చిత్తూరు : జిల్లలోని పూతలపట్టు మండలంలో గురువారం రాత్రి అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో 20మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 100మందికి పైగా కార్మికులు ఉండగా వారిలో 14మంది మహిళా కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. పూతలపట్టు మండలం బండపల్లి హట్సన్ పాల డెయిరీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాలు కోల్డ్ స్టోరేజ్ కోసం అమ్మోనియం వాయువును ఉపయోగిస్తుంటారు. ఆ వాయువు లీక్ కావడంతో 14మంది అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్వాహకులు చిత్తూరు, గుడిపాల ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు. పాల డెయిరీ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.మరోవైపు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా హట్సన్ పాల డెయిరీని పరిశీలించారు. అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ లీక్ సంఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సీరియర్ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. -
వీధి దీపాల నిర్వహణ సచివాలయాలకు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, ఫిర్యాదుల పర్యవేక్షణ ప్రక్రియను గ్రామ సచివాలయాలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014కి ముందు గ్రామ పంచాయ తీల పర్యవేక్షణలో ఉన్న వీధి దీపాల నిర్వహణను టీడీపీ హయాంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. గ్రామాల్లో చాలా వీధి దీపాలు రేయింబవళ్లు వెలుగుతుండడం, మరికొన్ని రాత్రివేళ వెలగకపోవడంపై పంచాయతీరాజ్ శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎనర్జీ అసిస్టెంట్కు బాధ్యతలు.. ► ఇక నుంచి వీధి దీపాల మరమ్మతులు, నిర్వహణను గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్కు అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు అందిన 24–48 గంటల లోపే సమస్య పరిష్కరిస్తారు. ► రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ వీధి దీపాలు లేని 2,000 గ్రామాల్లో కొత్తగా నాలుగు లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఇక నుంచి జగనన్న పల్లె వెలుగుగా పేరు మార్చారు. ఇళ్ల పట్టాల లేఔట్ల వద్ద భారీగా మొక్కల పంపిణీ జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మొక్కలు నాటాలని సమావేశంలో నిర్ణయించారు. 25,814 కిలోమీటర్ల పొడవునా రహదారుల వెంట ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ ఏడాది చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ సూచనలకు అనుగుణంగా ఈ ఆర్థిక ఏడాది ఉపాధి హామీ పథకం కూలీలకు 25 కోట్ల పనిదినాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. మంగంపేట బైరటీస్ విస్తరణ వేగవంతం చేయాలి మంగంపేట బైరటీస్ విస్తరణ, ఉత్పత్తి పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన సులియేరి, మదన్పూర్ బొగ్గు బ్లాకుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగారు. బొగ్గు బ్లాకుల కోసం కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు. -
ఈఎస్ఐ కుంభకోణంలో చట్టం తన పని తాను చేస్తుంది
-
‘చంద్రబాబు డైరెక్షన్లోనే ఈఎస్ఐ స్కాం’
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ కుంభకోణం కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు అరెస్ట్పై టీడీపీ కుల ప్రస్తావన తీసుకురావడం దారుణమన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని తెలిపారు. (కౌంట్డౌన్ స్టార్ట్.. అచ్చెన్న ఆటకట్టు) వందల కోట్ల ప్రజాధనం నొక్కేసి ఇప్పుడు కులాలను ఎలా ప్రస్తావిస్తారంటూ టీడీపీ నేతలపై మంత్రులు మండిపడ్డారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడుతో పాటు చంద్రబాబుకు కూడా సంబంధం ఉందని ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే దోపిడీ జరిగిందన్నారు. టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. అందరి బండారం బయటపడుతుందన్నారు. త్వరలో మరికొన్ని అరెస్ట్లు తప్పవని మంత్రులు స్పష్టం చేశారు. (అచ్చెన్న.. ఖైదీ నెంబర్ 1573) -
ముందస్తు ప్రణాళికతో మంచినీటి ఎద్దడికి చెక్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ ఇబ్బందుల మధ్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యేక దృష్టి సారించింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 2,837 గ్రామాలకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది జనవరిలోనే రూ. 204.75 కోట్లతో గ్రామీణ మంచినీటి ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► ఈ వేసవిలో 2,055 గ్రామాల్లో పశువుల అవసరాలకు కూడా నీటి సరఫరా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ► 347 వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని, ఆ నీటిని సమీప గ్రామాల్లోని మంచినీటి పథకాలకు అనుసంధానం చేశారు. ► సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో, గ్రామాల్లోని బావుల్లో పూడిక తీత వంటి అవసరాలకు రూ. 5.80 కోట్లు కేటాయింపు. ► మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు మండల స్థాయిలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ సభ్యులుగా కమిటీలను ప్రభుత్వం నియమించింది. ► భూగర్భ జలాలు కలుషితమైన చోట వైఎస్సార్ సుజల పథకంలో మంచినీటి ప్లాంట్ల ద్వారా క్యాన్ వాటర్ సరఫరాకు రూ. 46.56 కోట్ల ఖర్చుకు ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. ► రాష్ట్ర వ్యాప్తంగా రూ. 55.86 కోట్లతో సోలార్ స్కీంల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. -
వీధి దీపం వెలగలేదా?
సాక్షి, అమరావతి: ఎల్ఈడీ వీధి దీపాలు వెలగలేదని ఫిర్యాదు అందిన 72 గంటల్లో సమస్యను పరిష్కరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వేగవంతమైన స్పందన యంత్రాంగాన్ని (రాపిడ్ రెస్పాన్స్ మెకానిజం–ఆర్ఆర్ఎం) ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ కమిటీతో మంత్రి సోమవారం భేటీ అవుతారు. ఇందుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. గ్రామాల్లో నూరు శాతం వీధిదీపాలు వెలగాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎల్ఈడీ వీధిదీపాల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలంటే క్షేత్రస్థాయిలో పటిష్టమైన, విస్తృతస్థాయి నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు స్పందించి 72 గంటల్లో పరిష్కరించాలన్నారు. ఎల్ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశామని అధికారులు మంత్రికి వివరించారు. గ్రామ వలంటీర్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పంచాయతీ కార్యదర్శి సదరు పోర్టల్లో నమోదు చేస్తే ఈఈఎస్ఎల్ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో దాదాపు 25.04 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చామని, వీటిలో 1.5 లక్షల వీధి దీపాలు నెడ్క్యాప్ చేయగా, 23.54 లక్షల వీధి దీపాలను ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేసిందని, దీనివల్ల ఏడాదికి 260 మిలియన్ యూనిట్ల విద్యుత్, రూ.156 కోట్ల నిధులు ఆదా అవుతాయని అంచనా వేసినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో మరో 35 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వివరించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ ఎల్ఈడీ కార్యక్రమం అమలుతీరుపై వెరిఫికేషన్ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహిస్తుందని, దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు, ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు అనువైన సిఫారసులను చేస్తుందని వివరించారు. -
చంద్రబాబు వైఖరి దొంగే.. దొంగ అన్నట్లు ఉంది
పిచ్చాటూరు (నాగలాపురం): ప్రతిపక్ష నేత చంద్రబాబు, అతని కుమారుడు, గత టీడీపీ ప్రభుత్వంలోని మంత్రులు ఐదేళ్ల పాటు ఇసుకను ఎడాపెడా దోచుకుని..ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విధానంలో చంద్రబాబు మాటలు వింటుంటే దొంగే.. దొంగ అన్న చందంగా ఉందన్నారు. శనివారం చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురుటపల్లి ఇసుక రీచ్ వద్ద నిర్వహించిన ఇసుక వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, ఎమ్మెల్యే కె.ఆదిమూలంతో కలసి మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పారదర్శకంగా ఇసుక అందేలా రీచ్లను ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నారని, దీనిని చూసి ఓర్వలేని చంద్రబాబు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నామని సీఎం, మంత్రులు ఎమ్మెల్యేలపై చార్జిషీట్ వేశారని విమర్శించారు. -
నిత్యం 45 వేల టన్నుల ఇసుక సరఫరా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిరోజూ 45 వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నట్టు గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మైనింగ్ శాఖ కార్యదర్శి రామ్ గోపాల్తో కలిసి ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల్లో నెలల తరబడి వరద ప్రవాహం కొనసాగుతుండడం వల్ల ప్రధానమైన రీచ్ల నుంచి అనుకున్నంత ఇసుక సరఫరా జరగడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. దీన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇసుక రీచ్లను గుర్తిస్తున్నామని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే... ‘‘గత పదేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా నదిలో 70 రోజులుగా, గోదావరిలో 40 రోజులుగా వరద కొనసాగుతుంది. నదుల్లో రీచ్లు వరదతో నిండిపోతే ఇసుకను తవ్వితీయడం ఎలా సాధ్యం? దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి వాడుకోవడం సమంజసం కాదు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో 5 వేల టన్నుల ఇసుక సరఫరాకు అవకాశం ఉండగా, దాన్ని ఇప్పుడు 45 వేల టన్నులకు పెంచగలిగాం. వరద ప్రవాహం వల్ల నదులు, వాగుల్లో ఇసుక తవ్వే అవకాశం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను సేకరిస్తున్నాం. ఇందుకోసం టన్నుకు రూ.100 చొప్పున చెల్లిస్తామని భూయజమానులతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇప్పటికే 82 మంది పట్టా భూముల యజమానులు ఇసుక తవ్వకాల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. 10 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి కూడా ఇచ్చాం. మరో 15 రోజుల్లో ఇసుక కొరత లేకుండా అడిగిన వారందరికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ‘క్రెడాయ్’కి 50 వేల టన్నుల ఇసుక అందించాం కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత గత 30–40 రోజుల్లో ఇసుక కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారికి 6 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సరఫరా చేశాం. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) ప్రతినిధులతో మాట్లాడి, వారి అవసరాలకు మరో 50 వేల టన్నుల ఇసుక అందించాం. నిర్మాణ రంగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, వారి అవసరాలు ఎంత, ఏ మేరకు ఇసుకను అందించాలి అనేదానిపై అవగాహనకు వచ్చాం. ఆదాయం పోయిందనే అక్కసుతోనే... నదుల్లోని ఇసుకను యథేచ్ఛగా దోచుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు అధికారం, ఆదాయం పోయిందనే అక్కసుతోనే ఇసుక లభ్యతపై రాజకీయం చేస్తున్నారు. సాధారణంగానే వర్షాకాలంలో భవన నిర్మాణ రంగంలో పనులు నెమ్మదిస్తాయి. నదుల్లోని ఇసుకను టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దోచుకున్న ఫలితంగా కృష్ణా నదిలో ఇసుక గోతుల్లో ఓ బోటు మునిగి చాలామంది మరణించారు. ఇసుక దోపిడీపై గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా కూడా విధించింది. అలాంటి తప్పుడు విధానాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. ఎంశాండ్ యూనిట్లకు ప్రోత్సాహం రాష్ట్రంలో ఇసుకకు ప్రత్యామ్నాయంగా కంకర నుంచి తయారుచేసే ఎంశాండ్ యూనిట్లకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న మెటల్ క్వారీల్లో ఎంశాండ్ యూనిట్లు నెలకొల్పే వారికి పావలా వడ్డీకి రుణాలు అందించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలిస్తున్నారు’’ అని మంత్రి వివరించారు. భవిష్యత్తులో ఇసుక కొరతే రాదు తాజా వరదల కారణంగా నదుల్లో దాదాపు 10 కోట్ల టన్నుల ఇసుక చేరింది. సాధారణంగా రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారు. అంటే మరో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో భవిష్యత్తులో ఇక ఇసుక కొరతే ఉండదు. మరో పదిహేను రోజుల్లో వరదలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. వరద నీరు తగ్గగానే రీచ్ల నుంచి కావాల్సినంత ఇసుకను వినియోగదారులకు అందజేస్తాం. -
టిడిపి పాలనలో ఇసుకతో రాజకీయం చేశారు
-
వదంతులు నమ్మొద్దు
సాక్షి, అమరావతి: ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు, నియామకాల ప్రక్రియ సాగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు–భూగర్భ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి నిరుద్యోగ యువత మోసపోవద్దని ఆయన హితవు పలికారు. సచివాలయంలోని తన చాంబర్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులను అరెస్టు చేయించినట్టు ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కాగా, సెప్టెంబరు 1 నుండి 8 వరకూ జరిగే ఈ రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లుచేసినట్టు మంత్రి వివరించారు. మొత్తం 5,314 పరీక్ష కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ జిల్లాలో స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాల నిఘా, సాయుధులైన భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను భద్రపరుస్తున్నట్లు వివరించారు. పరీక్ష నిర్వహణకు 1,22,554 మంది సిబ్బందిని ఇప్పటికే నియమించామన్నారు. 12.85 లక్షల మంది హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ మొత్తం 15.50 లక్షల మంది పరీక్షలు రాస్తుండగా.. మంగళవారం ఉదయానికి 12.85 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. పరీక్షలకు హాజరయ్యే వారు హాల్ టికెట్తో పాటు ఏదైనా వ్యక్తిగత గుర్తింపు పత్రం (ఆధార్, ఓటర్ గుర్తింపు, పాన్కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఏదో ఒకటి ఒరిజినల్) తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ 13 జిల్లాల్లో సుమారు 10,082 సర్వీసులు నడుపుతోందన్నారు. అంధత్వం, శారీరక చలనం లేని వ్యక్తులకు పరీక్షలో 50 నిమిషాలపాటు అదనపు సమయం కేటాయిస్తామన్నారు. అభ్యర్థులను సులభంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి ఆర్టీవో అధికారులు ఆటో యూనియన్లతో మాట్లాడుతున్నారన్నారు. అలాగే, ఎస్ఎంఎస్ల ద్వారా పరీక్షా కేంద్రాల లొకేషన్ను కూడా అభ్యర్థులకు తెలియపరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు మూడ్రోజుల్లోఇసుక ధరలు ఇదిలా ఉంటే.. ఇసుక కొత్త ధరలను రెండు మూడ్రోజుల్లో వెల్లడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. కొత్త పాలసీలో రీచ్ల నిర్వహణ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ విధానంలో ఎవరైనా సిండికేట్ అయి రీచ్ల నిర్వహణ టెండర్లలో పాల్గొని ఉంటే.. అలాంటి వాటిని రద్దుచేస్తామని మంత్రి స్పష్టంచేశారు. ఉద్యోగం ఇప్పిస్తానన్న వ్యక్తి అరెస్టు చిత్తూరు అర్బన్ : గ్రామ సచివాలయం ఉద్యోగం ఇప్పిస్తానంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. రాష్ట్ర మంత్రి తనకు తెలుసని చెబుతూ ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల ఇవ్వాలని ఫోన్లో చెప్పడం.. మరో వ్యక్తి దీన్ని వాట్సప్లో షేర్ చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్రెడ్డి మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న పోరుమావిళ్ల రమేష్బాబు (52) అనే వ్యక్తి తన సన్నిహితుడైన అహ్మద్ అనే వ్యక్తితో.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి బంధువులు తెలుసునని, పోస్టుకు రూ.5లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని ఫోన్లో మాట్లాడాడు. ఈ సంభాషణను అహ్మద్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో విషయం మంత్రి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో దర్యాప్తు చేసిన సీఐ భాస్కర్రెడ్డి రమేష్రెడ్డిని అరెస్టుచేశారు. అభ్యర్థులు ఇలాంటి వాటిని నమ్మొద్దని.. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు పేర్కొన్నారు. -
రూ.30 వేల కోట్లు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఇంటింటికీ నల్లా నీరు’ పథకానికి రూ. 60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని, దీనిలో రూ. 30 వేల కోట్ల మేర సాయం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్రాన్ని కోరారు. ‘జల్ జీవన్ మిషన్’ అమలుపై కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరై ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్ని రాష్ట్రాలతో కేంద్ర మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. ఆగస్టు 15న ప్రధాని ఈ మిషన్కు సంబంధించి చేసిన ప్రకటనకు ముందే ఏపీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రోజుకు 100 లీటర్ల చొప్పున నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు రూపొందించింది. గ్రామాలు, పట్టణాల్లోనూ నీరు సరఫరా చేస్తాం. ఈ ప్రాజెక్టుకు వచ్చే నెలలో టెండర్లు కూడా పిలవబోతున్నాం. మొదటి విడతలో కొన్ని జిల్లాలకు, రెండో విడతలో మిగిలిన జిల్లాలకు ఇచ్చే విధంగా ఈ పథకం రూపొందిస్తున్నాం. జల్ జీవన్ మిషన్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రంలో త్వరగా మా పథకాన్ని అమలుచేయాలన్న సంకల్పంతో పనిచేస్తాం’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్లో పోలవరం సందర్శనకు షెకావత్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తాజా స్థితిగతులపై కేంద్రానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేంద్రం సహకరిస్తుందని భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ‘పోలవరం అంశం నా పరిధిలో లేదు. అయితే ముఖ్యమంత్రి సూచన మేరకు పోలవరం రావాలని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను ఆహ్వానించాను. సెప్టెంబర్లో వస్తామన్నారు. కేంద్రం ఏవిధమైన నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. మేం టెండర్లు పిలిచాం. ఈ ప్రక్రియ పూర్తయి రికార్డు సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుంది’ అని తెలిపారు. ఈ ఏడాదికి రూ. 300 కోట్లు మంజూరు జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమలుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదికి రాష్ట్రానికి రూ. 300 కోట్లు నిధులను మంజూరు చేసినట్టు అధికారులు చెప్పారు. మంచి నీటి పథకాల నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చులో 50 శాతం నిధులు కేంద్రం విడుదల చేస్తే, మిగిలిన 50 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలు కలిపి మొత్తం రూ. 600 కోట్లు ఈ పథకంలో ఖర్చు పెడితే, అందులో రూ. 120 కోట్ల మేర ఇళ్లకు మంచి నీటి కొళాయిల ఏర్పాటుకే ఖర్చు పెట్టాల్సి ఉంది. జల్ జీవన్ మిషన్ ప్రారంభం.. జాతీయ గ్రామీణ మంచి నీటి కార్యక్రమం (ఎన్ఆర్డీడబ్ల్యూపీ) నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసి కొత్తగా ‘జల్ జీవన్ మిషన్’ను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచి నీటి వసతి కల్పించడమే జల్ జీవన్ మిషన్ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా కేంద్రం పేర్కొంది. ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు మంజూరు చేసే నిధుల్లో 20 శాతం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు మంచినీటి కొళాయిల ఏర్పాటుకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అనంతరం వాటి నిర్వహణ వ్యయాలను సంబంధిత గ్రామ పంచాయతీనే భరించాల్సి ఉంటుంది. అవసరమైతే కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించుకునే వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
అత్యంత పారదర్శకంగా కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం జరిపే కొనుగోళ్లకు అత్యంత పారదర్శకమైన, అవినీతికి తావులేని విధానం అవలంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు ఏయే మార్గదర్శకాలు పెట్టాలో సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రూ.కోటి పైబడి ఏ కొనుగోళ్లు జరిపినా ఏపీ వెబ్సైట్లో పెట్టాలని, మన ప్రొక్యూర్మెంట్ విధానం దేశానికి ఆదర్శం కావాలని సీఎం అన్నారు. ఎవరి నుంచి కొనుగోలు చేస్తున్నామో వారి వివరాలను కూడా వెబ్సైట్లో పెట్టాలని, అంతకంటే తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకొచ్చే వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. కుంభకోణాలకు ఏమాత్రం ఆస్కారం ఉండరాదని నొక్కి చెప్పారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఏదీ స్కామ్లకు అనర్హం కాదన్నట్లుగా ప్రతిదానిలో కుంభకోణాలు రాజ్యమేలాయి. ట్రాక్టర్లు, ఆటోలు, కార్ల కొనుగోలు, యూనిఫారాలు, స్కూలు పుస్తకాలు, కోడిగుడ్లు, స్కూలు విద్యార్థులకు పంపిణీ చేసే షూలు.. ఇలా అన్నింటా కుంభకోణాలు సాగాయి. ఈ వ్యవస్థను ఇకనైనా శుద్ధి చేయాల్సిన అవవసరం ఎంతైనా ఉంది. అన్నింటికంటే మన ప్రభుత్వం విభిన్నం అని చూపాలి. మనకు తెలియకుండానే చాలా జరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటికి కచ్చితంగా మనం అడ్డుకట్ట వేయాలి. ఇందుకు అధికారులు ఆలోచించి ఒక పరిష్కారాన్ని చూపాలి’ అని సూచించారు. టెండర్ల ద్వారానే కొనుగోలు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రొక్యూర్మెంట్ (సేకరణ –కొనుగోలు) విధానాన్ని సీఎం వైఎస్ జగన్ సమీక్షిస్తూ.. ఏమి కొనుగోలు చేయాలన్నా టెండర్లు ఆహ్వానించాలని చెప్పారు. ఇందులో ఎవరు తక్కువకు కోట్ చేశారో వారి పేరును, ధరను వెబ్సైట్లో పెట్టి రివర్స్ టెండరింగ్ కోసం కొంత సమయం ఇవ్వాలన్నారు. నిర్ధిష్ట గడువులోగా ఈ ధర కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకొచ్చి కోట్ చేస్తే వారికే అవకాశం ఇవ్వాలని సూచించారు. కొనుగోళ్లలో అమలు చేస్తున్న ఉత్తమ పారదర్శక విధానాలపై అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా సీఎం మార్గనిర్దేశం చేశారు. ఇలా చేయడం ద్వారా వ్యవస్థలో స్వచ్ఛత తేవచ్చని చెబుతూ.. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి ఈనెల 28వ తేదీన మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇక పక్కాగా ఇసుక సరఫరా
సాక్షి, అమరావతి : కొత్త విధానం ద్వారా ఇసుక సరఫరాకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అవసరమైతే కొత్త రీచ్లకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబరు అయిదో తేదీ నుంచి కొత్త విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ముందస్తు కసరత్తు, సన్నద్ధతపై మంగళవారం సచివాలయంలో మంత్రి రామచంద్రారెడ్డి భూగర్భ గనులు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారులతో సమీక్షించారు. ‘ఎక్కడా ఇసుక దుర్వినియోగం కావడానికి వీల్లేదు. అవసరమైన చోట తక్షణమే స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయండి. వాటికి సమీపంలో వేబ్రిడ్జిలు ఉండేలా చూడండి. ఇసుక రేవుల్లోనూ, స్టాక్ యార్డుల్లోనూ సీసీ కెమెరాలతో పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలి. ఇసుక లోడింగ్ చేసినప్పటి నుంచి వాహన కదలికలన్నీ జీపీఎస్ ద్వారా పర్యవేక్షించడం ద్వారా ఎవరు బుక్ చేసుకున్నారో వారికే ఇసుక వెళ్లేలా చూడొచ్చు. ప్రజలకు ప్రస్తుతం అందుతున్న ధరకంటే ఏమాత్రం పెరగకుండా ఇసుకను అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఈ దిశగా త్వరగా అన్ని ఏర్పాట్లుచేయండి’ అని మంత్రి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరుకే అన్నీ సిద్ధంచేయాలి వచ్చే నెల నుంచి కొత్త విధానం ద్వారా ఇసుక అందించాల్సి ఉన్నందున ఈ నెలాఖరుకే సర్వ సన్నద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఇసుక బుక్ చేస్తే త్వరగా పంపలేదనే చెడ్డ పేరు ప్రభుత్వానికి రాకుండా అధికారులు చూడాలని మంత్రి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. 46 స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేస్తున్నామని, ఈ నెలాఖరుకల్లా రాష్ట్రవ్యాప్తంగా 124 రీచ్లలో ఇసుక తవ్వకాలు సాగించడానికి వీలుగా పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకుంటామని అధికారులు మంత్రికి వివరించారు. విశాఖ జిల్లాలో నదులు లేకపోవడం, ఎక్కువ ఇసుక వినియోగం ఉన్నందున అక్కడకు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇసుకను సరఫరా చేసేందుకు ఏర్పాట్లుచేస్తామన్నారు. -
ఉధృతంగానే గోదారి
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఎగువ ప్రాంతంలో ఉపనదుల నుంచి భారీగా వరద నీరొచ్చి చేరుతుండడంతో గోదావరిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద 28.1 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి నుంచి 13,58,163 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకోవడంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం పెరుగుతూ మధ్యాహ్నం ఒంటిగంటకు 14.20 అడుగులకు చేరుకుంది. అక్కడి నుంచి రాత్రి 7 గంటల వరకూ నిలకడగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, ఎటపాక, వీఆర్పురం, చింతూరు, కూనవరం తదితర మండలాల్లో 168 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల్లోని 216 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొత్తంగా 74 వేల మంది వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాధితులకు ఆహార పొట్లాలు, నీటి ప్యాకెట్లు, బియ్యం, కిరోసిన్, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఉచితంగా పంపిణీ చేశారు. పూర్తిగా నీట మునిగిన గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తూర్పు గోదావరిలో సుమారు 4,190 హెక్టార్లలో వరి చేలు, 1,198 హెక్టార్లలో ఉద్యాన పంటలు పశ్చిమలో 4,746 హెక్టార్లలో పంటలు వరదలో మునిగిపోయాయి. పలుచోట్ల రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కరెంట్ సరఫరా ఆగిపోయి కొన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. కాగా, ఉభయ గోదావరి జిల్లాల్లో వరద వల్ల ముంపునకు గురైన, నీరు చేరిన గ్రామాల్లోని బాధితులకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను టీఆర్ –27 కింద డ్రా చేసుకునేందుకు రెండు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతించింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సబ్ కలెక్టర్ సలీమ్ఖాన్లు నరసాపురం పార్లమెంట్ పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తాగునీటి ఇబ్బందులు రానీయకండి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి టెలికాన్ఫరెన్స్ తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వరదల కారణంగా ముంపునకు గురైన గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. ఆదివారం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఈఎన్సీ సుబ్బారెడ్డిలతో కలసి మూడు జిల్లాల కలెక్టర్లతో పాటు జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీవోలతో మంత్రి టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. వరద ప్రాంతాల్లో ప్రజలు కలుషిత నీటిని తాగకుండా మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేయడంతో పాటు గ్రామాల్లో నివాసిత ప్రాంతాల మధ్య మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలపై అక్కడి ప్రజలకు అవగాహన పెంచడం, పందులు వంటి వాటిని గ్రామాలకు దూరంగా ఉంచడం వంటి విషయాల్లో మండల స్థాయి అధికారుల ద్వారా తగిన చర్యలు చేపట్టాలన్నారు. పోటెత్తిన కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్ట్/రాయచూరు రూరల్: శ్రీశైలం జలాశయానికి సోమవారం వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం పేర్కొంది. గత 4 రోజులుగా జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 857 అడుగులకు, నీటి నిల్వ 98.9024 టీఎంసీలకు చేరింది. నీటి మట్టం 854 అడుగులు దాటడంతో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదన కు జనరేటర్లను సిద్ధం చేశారు. ఆదివారం ఆల్మట్టి డ్యాం నుంచి ఏకంగా 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని నదికి వదిలారు. -
లగడపాటి మాటలకు చేతలకు సంబందం ఉండదు
-
బాబు నీకు చివరి ఎన్నికలు: మోహన్బాబు
పుంగనూరు : చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలని, అబద్ధాల చంద్రబాబును ఇంటికి సాగనంపాలని విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీనటుడు, వైఎస్సార్సీపీ నాయకుడు మంచు మోహన్బాబు అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఇందిరా సర్కిల్ నుంచి బస్టాండు, పోలీస్స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ వరకు రోడ్షో నిర్వహించారు. ‘చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా వాసిగా ఉండి, అపద్దాలు చెబుతాడు నమ్మకండి.. నేను అల్లా సాక్షిగా , సాయిబాబా సాక్షిగా అపద్దాలు చెప్పను నిజాలే చెబుతా‘ అంటూ మోమన్బాబు ప్రసంగాన్ని ప్రారంభించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు, చంద్రబాబుకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఆయనను ఈయన ఏం చేశారో తెలుసా అంటూ ప్రశ్నించడంతో సభలో రకరకాల సమాధానాలు ఇచ్చారు. మోహన్బాబు నవ్వుతూ నాలుగు ఎకరాల భూమి మాత్రమే ఉన్న చంద్రబాబునాయుడుకు లక్షల కోట్లు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అంతా అవినీతి సొమ్మేనని ఆయన తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై 32 కేసులు ఉన్నాయంటూ అబద్ధపు మాటలు చెప్పే చంద్రబాబునాయుడుపై 11 కేసులు ఉన్నాయన్న విషయం ఎవరికైనా తెలుసా ? అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా యువనాయకుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, వైఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఫ్యాన్ను చేతబట్టుకుని ప్రజలకు చూపుతూ.. డైలా గులతో సభను విజయవంతం చేశారు. మునిసిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి యాదవ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్కుమార్, విశ్వనాథ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. 25 వేల ఓట్లు అదనంగా వేయాలి ‘నా ప్రచారంతో వైఎస్సార్సీపీకి అదనంగా 25 వేల ఓట్లు ప్రజలు వేయాలి. ఇది నా విన్నపం’ అని మోహన్బాబు ప్రజలను కోరారు. ‘ 2.30 లక్షల ఓట్లలో 2 లక్షలు మీరు వైఎస్సార్సీపీకి వేసేలా నిర్ణయించుకున్నారు. మిగిలిన 30 వేలలో 25 వేల ఓట్లు నా తరఫున వేయండి , ఐదువేల ఓట్లు మాత్రం ఇతరులకు వేయండి’ అని మోహన్బాబు కోరగానే జనం కేరింతలతో చప్పట్లు కొట్టారు. -
బీసీలపై చిత్తశుద్ది ఉంటే నాలుగేళ్లుగా ఎందుకు మేలు చేయలేదు
-
రాష్ట్రప్రజల అభ్యున్నతే వైఎస్ జగన్ లక్ష్యం
-
చంద్రబాబు పర్యటన.. అనేక సందేహాలు..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అనేక సందేహాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అవినీతి, మంత్రి లోకేష్పై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో బాబు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని కేసుల నుంచి కాపాడుకునేందుకు ఢిల్లీలో రాజకీయంగా లాబియింగ్ చేస్తున్నారని చెప్పారు. మరో మూడు రోజుల్లో పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడుతుంటే, చంద్రబాబుకు ఇప్పుడు ఢిల్లీ గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలకు ప్రత్యేక హోదా కోసం ఏ మేరకు దిశానిర్దేశం చేశారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు చివరి వరకూ అవిశ్వాసంపై పట్టుబడతామని లేకపోతే రాజీనామా చేసి వెంటనే ఆమరణ దీక్షకు దిగుతామని చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు ఎందుకోసం ఇప్పటివరకూ ఎంపీల కార్యచరణను ప్రకటించలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో బాబు దేనికోసం రాజకీయ పక్షాలతో లాబీయింగ్ చేస్తారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. -
ప్రత్యేక హోదా జగన్తోనే సాధ్యం
పుంగనూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డితోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని, ఇది ప్రజలందరి అభిప్రాయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత చాలా రాజకీయ పరిణామాలు చేసుకుంటున్నాయని తెలిపారు. మోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఎన్ని కల్లో రాష్ట్ర ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేదని చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి తీవ్రమైన అన్యాయం చేశారని, అందుకు గొప్పగా సహకరించిన మహానుభావు డు చంద్రబాబునాయుడు విమర్శించారు. సచివాలయానికి పునాది వేయడానికి ప్రధానమంత్రిని పిలిస్తే ఒక చెంబులో నీరు, ఇంకో చెంబులో మట్టి ఇచ్చి వెళ్లారంటే ఏ మాత్రం రాష్ట్రంపైన ప్రేమాభిమానాలు ఉన్నాయో చెప్పకనే అర్థమవుతుందన్నారు. చంద్రబాబు విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయారన్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీనే ముద్దు అనడంతో పాటు గత బడ్జెట్లో ఏ రాష్ట్రానికి ఇంత గొప్పగా చేయలేదని ప్రధానమంత్రికి కితాబు ఇచ్చారని తెలిపారు. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ప్రస్తుతం నాలుగైదు రోజుల నుంచి ప్రత్యేక హోదా ఎందుకివ్వరని మాట్లాడం రాజకీయ దురుద్ధేశంతో కూడుకున్నదని విమర్శించారు. ప్రత్యేక హోదాకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్రెడ్డికి మైలేజి వస్తోందని, ఇందులో పాల్గొనకపోతే రాజకీయంగా నష్టపోతామనే నీచరాజకీయంతో ఇలా మాట్లాడుతున్నాడంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడా ? అన్నది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఏదేమైనా ఏప్రిల్ ఐదో తేదీదాకా పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని, అప్పటికి కేంద్ర ప్రభుత్వంలో స్పందన లేకపోతే ఆరో తేదీ తమ పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా కోసం అన్ని విధాలా పోరాడుతోందని తెలిపారు. ఎన్నికలు అయిన తరువాత కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఒత్తిడి చేసి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత జగన్మోహన్రెడ్డి తీసుకుంటారని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు ఎన్ రెడ్డెప్ప, నాగరాజరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డియాదవ్ పాల్గొన్నారు. -
ఎన్నిక లేకపోతే హామీలిచ్చేవారు కాదు
-
చంద్రబాబుకు జనం బుద్ధిచెబుతారు
► రాష్ట్రంలో నియంతృత్వ పాలన ► వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం! ► జిల్లాలో వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలను గెలుస్తుంది ► పార్టీ మారిన ఎమ్మెల్యేలు సిగ్గుంటే రాజీనామా చేయాలి ► వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలమనేరు: గతంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు రాష్ట్రంలో నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలంలో శనివారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో కలసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు జనం త్వరలో గుణపాఠం చెబుతారని అన్నారు. ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. బాబు సొంత జిల్లాలో ఆధిపత్యం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారనీ, అది తానుండేంతవరకు కుదిరే పని కాదని స్పష్టంచేశారు. తనకు నీతిమాలిన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. మడమ తిప్పని మహానేత తనయుడు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేదాకా విశ్రమించే సమస్యే లేదన్నారు. వైఎస్సార్సీపీలో గెలిచి ప్రలోభాలకు గురై జిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని ఓడించడమే తన లక్ష్యమన్నారు. అమర్ తండ్రి రామకృష్ణారెడ్డి కుటుంబంతో తమకు రాజకీయ వైరమున్నా ఆయనకున్న వ్యక్తిత్వం ఆయన తనయునికి లేదన్నారు. నిజంగా పార్టీమారిన వారికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలముందుకు వెళ్లాలన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి మాట్లాడుతూ పెద్దిరెడ్డి నేతృత్వంలో జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేస్తుందన్నారు. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో పెద్దిరెడ్డిని చూసి నేర్చుకోవాలన్నారు. చంద్రబాబు మాత్రం వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ రాజకీయాన్ని మోసకీయంగా మార్చేశానన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ మాట్లాడుతూ ఓ పార్టీ ఓట్లతో గెలిచి వాటిని అమ్ముకుని కోట్లు గడించే నాయకులకు జనం బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు రెడ్డెమ్మ, సీవీ కుమార్, రాకేష్రెడ్డి మాట్లాడుతూ పార్టీకి మోసం చేసిన వారికి తరతరాలు తెలిసొచ్చేలా జనం తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పెద్దపంజాణి మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పలమనేరులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికిచ్చినా గెలిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శులు కృష్ణమూర్తి, మురళీకృష్ణ, వాసు, సంయుక్త కార్యదర్శులు వెంకటేగౌడ, దయానంద్ గౌడ, మండల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. పెద్దపంజాణి వైఎస్సార్సీపీ నాయకులకు పార్టీ పదవులు పెద్దపంజాణి: పెద్దపంజాణి మండల నాయకులకు వైఎస్సార్సీపీలో పదవులు దక్కాయి. శనివారం ఇక్కడికి విచ్చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పదవులు ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శిగా పెద్దపంజాణి మండల మాజీ ఎంపీపీ విజయభాస్కర్రెడ్డి, జిల్లా కార్యదర్శులుగా రాయలపేటకు చెందిన సీనియర్ నాయకులు డా.చంద్రశేఖర్ రెడ్డి, తమ్మిరెడ్డి, జిల్లా మైనారిటీ కార్యదర్శిగా రహంతుల్లా, జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శిగా గుండ్లపల్లి రవికుమార్, మండల కన్వీనర్గా బాగారెడ్డిని ప్రకటించారు. తాము పార్టీ కోసం శక్తివంచనలేకుండా కృషిచేస్తామని పదవులు దక్కినవారు తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు వైఎస్ ఎంపీపీ సుమిత్ర, ఎస్ భాస్కర్రెడ్డి, ఆర్ సురేంద్ర, ఎంపీటీసీ సభ్యుడు క్రిష్ణప్ప, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'రైతులకోసం మేం పోరాడుతాం'
అమరావతి: ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గ్రామ కంఠాల సమస్యలు పరిష్కరించకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు. లంక భూములిచ్చిన ఎస్సీ ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో తమకు ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిందంటూ పలువురు ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తాత్కాలిక ఏపీ తాత్కాలిక సచివాలయం పరిశీలనకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల బృందాన్ని రైతులు కలిశారు. స్థలాల కేటాయింపు, ప్లాట్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. రాజధాని ప్రాంత రైతులకు భూములు ఇస్తామన్న భూములు ఇప్పటికీ ఇవ్వలేదని పెద్దిరెడ్డి తెలిపారు. తాత్కాలిక సచివాలయం పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడంబరాలకు చేస్తున్న ఖర్చుపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఏపీ తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. అనంతరం మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డిలను ఎమ్మెల్యేలు కలిశారు. అసెంబ్లీ నియోజక వర్గాల నిధులు విడుదల చేయాలని ఈ సందర్బంగా వారు మంత్రులను కోరారు. అయితే నిబంధన ప్రకారం గత ఏడాది నిధులను విడుదల చేశామని.. ఈ ఏడాది ఇంకా నిధులు విడుదల కాలేదని యనమల అన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్, అసెంబ్లీ నిర్మాణాలపై ఎమ్మెల్యేలు మంత్రులతో చర్చించారు. -
'రైతులకోసం మేం పోరాడుతాం'
-
'తొలగించిన చోటే విగ్రహం పెట్టాలి'
విజయవాడ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి హోదాలో విగ్రహ ఏర్పాటుకు తానే అనుమతిచ్చానని వెల్లడించారు. అన్ని అనుమతులు ఉన్నా.. ప్రభుత్వం కుట్రపూరితంగా విగ్రహాన్ని తొలగించిందని ఆయన మండిపడ్డారు. తొలగించిన చోటే విగ్రహాన్ని పనరుద్ధరించాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. -
బాబుకు ప్రజలు తగిన బుద్ధి చేప్తారు
-
మైనార్టీల అభ్యున్నతే లక్ష్యం : పెద్దిరెడ్డి
రొంపిచెర్లలో ఇస్తిమా ఏర్పాట్ల పరిశీలన రొంపిచెర్ల: మైనార్టీల అభ్యున్నతే తన లక్ష్యమని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శనివారం రొంపిచెర్లలో జరుగుతున్న ఇస్తిమా ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో జెడ్పీ చెర్మన్ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా రొంపిచెర్లకు చెందిన నీలుఫర్ను ఎంపిక చేశామన్నారు. అయితే తమ పార్టీ అభ్యర్థి తక్కువ సీట్ల తేడాతో ఓడి పోయిందన్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ పదవిని మైనార్టీలకే ఇచ్చామన్నారు. కల్లూరు, రొంపిచెర్ల పంచాయతీల్లో సర్పంచ్లుగా మైనార్టీ మహిళలను గెలిపించామన్నారు. తన గెలుపునకు మైనార్టీలు కృషి చేశారని తెలిపారు. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేను మత పెద్దలు కోరారు. ఇస్తిమా జరగనున్న 15,16 తేదీల్లో 24 గంటలు విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ముస్లింలు వచ్చేందుకు అనువుగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులను ఏర్పాటు చేయిస్తామన్నారు. ఇస్తిమా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం బజారువీధిలోని వేణుగోపాల్రెడ్డి, సత్యనారాయణశెట్టి, రాధాకృష్ణయ్యశెట్టి ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టెలికం బోర్డు సభ్యుడు షఫీ, పీలేరు జెడ్పీటీసీ సభ్యులు రెడ్డిబాషా, సలీంబాషా, ఇబ్రహీంఖాన్, కరీముల్లా, మహ్మద్బాషా, అల్ల్లాబక్ష్, రాజా, సూర్యనారాయణరెడ్డి, కోట వెంకటరమణ, రెడ్డిమోహన్రెడ్డి, హరినాథ్, ప్రభాకర్రెడ్డి, చంద్ర, బాలకృష్టారెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రజాద్రోహి
ఏడు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యం - ఎంపీ మిథున్రెడ్డి వాల్మీకిపురం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాద్రోహి అని వై ఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎం పీ మిథున్రెడ్డి శనివారం పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా వీరికి చింతల రామచంద్రారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలను మ్యాజిక్ మాటలతో నమ్మించి గద్దెనెక్కి లాజిక్కులతో చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను డొంకతిరుగుడు లేకుండా ఓక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నిం చారు. ఏడునెలల కాలంలోనే ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిల చిపోతారని విమర్శించారు. ప్రభుత్వపాలనపై ప్రజల్లో నిరాశ కనిపిస్తుందన్నారు. రైతుల బంగారు వేలం ప్రకటనలు చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతోందని తెలిపారు. బ్యాంకు అధికారులు రైతుల బంగారు వేలానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఎంపీ మిథన్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. పడమటి మండలాల్లో పశు వులు గడ్డి, నీరు లేక, ప్రజలు, రైతులు తాగునీరు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బం దులు పడుతున్నా సీఎంకు కనిపించ డంలేదని విమర్శించారు. పేదల అ భ్యున్నతి కోసమే వైఎస్సార్ సీపీ పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రవేశపెడుతున్న క్లస్టర్ విధానం సరైంది కాదని తెలిపారు. ఈ విధానం అమలులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు చదువుకు దూరమవుతారని తెలిపారు. బీఈడీచదివి న వారికి ఉద్యోగాలు తగ్గి నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతుందన్నారు. ఈనిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
మైనారిటీలకు ‘మణిదీపం’ వైఎస్సార్ సీపీ
వైఎస్లాగే ముస్లింలకు అండగా జగన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి మదనపల్లె, న్యూస్లైన్: మైనారిటీలకు మణిదీపం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో మైనారిటీ నాయకులు మెట్రోబాబ్జాన్, 30 వ కౌన్సిలర్ వార్డు అభ్యర్థి మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీకట్లో మగ్గుతున్న ముస్లిం మైనారిటీలకు దివంగత మాహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి నాలుగుశాతం రిజర్వేషన్ కల్పించి ఉజ్వల భవిష్యత్తుకు దారిచూపారన్నారు. మతతత్వ బీజేపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 2002లో నరేంద్రమోడీ గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలను ఊచకోత కోశారన్నారు. మోడీ తొలినుంచీ ముస్లింల వ్యతిరేకి అన్నారు. ఇదే బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్ పెంచకూడదని సుప్రీంకోర్టును ఆశ్రయించడం తగదన్నారు. వైఎస్లాగే జగన్మోహన్రెడ్డి కూడా ముస్లిం మైనారిటీలకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ఖాయమన్నారు. మదనపల్లెలో మతతత్వ బీజేపీతో కలిసి టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడం సిగ్గుగా ఉందన్నారు. ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మైనారిటీలను ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం పట్టణంలోని కోట్లాది రూపాయలు విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్నారు. గత దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న షాదీమహల్ నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దేశాయ్తిప్పారెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితీలతో పారదర్శకంగా పనిచేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అన్నారు. మదనపల్లెలో తన ఆస్తులకన్నా ముస్లిం ఆస్తుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. కులమతాలకు అతీతంగా సేవచేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షమీం అస్లాం మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఐదేళ్లు పనిచేసిన షాజహాన్బాషా షాదీమహల్ను పూర్తిచేయడంలో విఫలమయ్యారని, మైనారిటీలకు ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. సమావేశంలో మైనారిటీ సీనియర్ నాయకులు బాబ్జాన్, నాయకులు ఎన్.బాబు, మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఇర్ఫాన్ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు అడివిలోపల్లె గోపాల్రెడ్డి, పాల్ బాలాజీ, మస్తాన్ఖాన్, అహ్మద్, దావూద్, రఫీ, బుల్లెట్ షఫీ, ఖాజా, ఫిర్దోస్ ఖాన్, న్యాయవాది యహసానుల్లా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్కుమార్, కార్యదర్శి ఎస్ఎ కరీముల్లా, జింకా వెంకటాచలపతి, హర్ష వర్ధన్రెడ్డి, సురేంద్ర, కోటూరి ఈశ్వర్, అధిక సంఖ్యలో మైనారిటీలు, మత పెద్దలు పాల్గొన్నారు. అనంతరం ముస్లిం మైనారిటీలు పెద్దిరెడ్డి, తిప్పారెడ్డిలను ఘనంగా సన్మానించారు. -
వలసనేత పురందేశ్వరికి గుణపాఠం చెప్పండి
వలసనేత పురందేశ్వరికి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సూట్కేసు పట్టుకుని రాష్ర్టమంతా వెతుక్కుంటూ రాజంపేట పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా వచ్చిన ఆమెను ఇంటికి సాగనంపాలని కోరారు. పుంగనూరు, న్యూస్లైన్: ఎంపీ పదవి కోసం రాష్ర్టంలో పలు నియోజకవర్గాలను వెతుకులాడుతూ సూట్కేస్ లగేజీతో రాజంపేటకు వలస వచ్చిన పురందేశ్వరికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. వలస నేతను ఇంటికి పంపాలని కోరారు. పుంగనూరులో మంగళవారం జెడ్పీటీసీ అభ్యర్థి వెంకటరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రిగా ఉన్న పురందేశ్వరి రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు దోహదం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేడు ఎంపీ పదవి కోసం మతతత్వ బీజేపీలో చేరిన ఆమెకు రాజంపేట లోక్సభ నియోజకవర్గ ప్రజలు సత్తా ఏమిటో చూపాలన్నారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు కలసికట్టుగా ఉంటూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రను విభజించినందుకు ఓట్లు వేయాలా? టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నందుకు ఓట్లు వేయాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం కొత్త నాటకాలు ఆడుతున్నారని, ఈ నాటకాలకు తెరదించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. వలస నేతలతో దోస్తీ పెట్టుకుని టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజు ప్రజలను మోసగించేందుకు రెండోసారి వస్తున్నారని, ఆయనకు ప్రజలే గుణపాఠం చెప్పాలని కోరారు. 2009 ఎన్నికల్లో పోటీచేసిన వెంకటరమణరాజు ఆ తర్వాత ఐదేళ్లు నియోజకవర్గంలో ఎన్నిసార్లు తిరిగారంటూ ప్రజలు నిలదీయాలన్నారు. ఓట్ల కోసమే ప్రజల ముందుకు వచ్చే వారికి తగిన శాస్తి చేయాలని సూచించారు. పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదేళ్లలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఆయన తెలిపారు. అయితే కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉంటూ తనపై వ్యక్తిగత కక్షతో పనులు ప్రారంభించకుండా ఆపివేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సమస్యలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయిస్తామన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సరైన నేతలను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. మాయమాటలతో ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు వచ్చే వారికి ఓట్ల రూపంలోనే గుణపాఠం చెప్పాలన్నారు. మే 7వ తేదీ జరిగే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ముద్రించి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డిని అఖండ మెజారిటీగెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నేతలు అమరనాథరెడ్డి, గంగిరెడ్డి, మేలుపట్ల కృష్ణారెడ్డి, అక్కిసాని భాస్కర్రెడ్డి, చదళ్ల విజయభాస్కర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని ఎంపికలో జగన్ కీలకపాత్ర
పుంగనూరు, న్యూస్లైన్: ప్రధానమంత్రి ఎంపికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈసారి కీలకపాత్ర పోషిస్తారని మాజీ మంత్రి డాక్టర్ పెద్ద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్.పేట, బీడీవర్కర్స్ కాలనీ, చింతలవీధి, ఈస్ట్పేట, గాంధీనగర్, ఉబేదుల్లా కాంపౌండు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య తో కలసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం లో మాట్లాడారు. జనమే ఊపిరిగా.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారని తెలి పారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రాష్ర్టంలో జగ న్మోహన్రెడ్డి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తారని తెలిపారు. 130కు పైగా ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తామని తెలిపారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నా రు. సుమారు 30 ఎంపీ స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కైవశం చేసుకుంటారని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ఎంపికలో జగన్మోహన్రెడ్డి ఖచ్చితంగా కీలకపాత్ర పోషిస్తారని స్పష్టం చేశారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో పేద ప్రజల హృదయాలను ఆకర్షిస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా మేనిఫెస్టో ఉందని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం, జైసమైక్యాంధ్ర పార్టీలు ఎన్నికల్లో కలిసి పోయాయని దుయ్యబట్టారు. ఈ పార్టీలు అన్ని స్థానాల్లో అభ్యర్థులను పెట్టడంలో విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలు ఒక్కటై జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనేందుకు అడ్డదారులు వెతుకుతున్నాయ ని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ర్ట ప్రజలు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేం దుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్, టీడీపీ మనుగడ కనుమరుగు కావడం ఖాయమని పేర్కొన్నారు. ఆ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరే రోజులు దగ్గరలో ఉన్నాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పోకల అశోక్కుమార్, కొండవీటి నాగభూషణం, బెరైడ్డిపల్లె క్రిష్ణమూర్తి, అక్కిసాని భాస్కర్రెడ్డి, నాగరాజారెడ్డి, అమరేంద్ర, రమేష్రెడ్డి, త్యాగరాజు, చలపతి, కిజర్, రాజేష్, సూరేష్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
45 రోజుల్లో బడుగుల ప్రభుత్వం
శ్రీకాళహస్తి రూరల్, న్యూస్లైన్: 45 రోజుల్లో సీవూంధ్ర ప్రాంతంలో బడు గు బలహీనవర్గాల ప్రభుత్వం రానుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియుర్ నాయుకుడు పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి అన్నారు. వుండలంలోని వాంపల్లి గ్రావుంలో వుంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయున పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి వ్యవసాయు వూర్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు, ఏర్పేడు వుండలం కాంగ్రెస్ పార్టీ సీనియుర్ నాయుకుడు పొనుగోటి భక్తవత్సలంనాయుుడు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పెద్దిరెడ్డి వూట్లాడు తూ త్వరలో జరుగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది ప్రధానవుంత్రి స్థానాన్ని శాసించే స్థారుులో పార్టీకి గుర్తింపు వస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో శ్రీకాళహస్తి ప్రాంతం లో వున్నవరం వద్ద ఎన్బీపీపీఎల్ ప్రాజెక్టుకు వైఎస్. రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. వేల ఎకరాల మెట్ట భూవుులను సాగులోకి తీసుకురావడానికి సోవుశిల-స్వర్ణవుుఖి కాలువను ఏర్పాటు చేశారని పే ర్కొన్నారు. ఆయున వురణానంతరం పాలకులు వాటి ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వురో 45 రోజుల తర్వాత ప్రాజెక్టు పనులను సీఎం హోదాలో జగన్మోహన్రెడ్డి వేగవంతం చేస్తారన్నారు. కిరణ్కువూర్రెడ్డి స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీకి రాష్ర్టంలో ఒక్క సీటు కూడా రాదన్నారు. పీలేరులోనూ ఆయున ఓటమిపాలు అవుతారన్నారు. ఇటీవల జరిగిన ము న్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయుం సాధిస్తుందన్నారు. పార్టీ తిరుపతి పార్లమెంట్ పరిశీల కులు వెలగపల్లి వరప్రసాద్ వూట్లాడుతూ చంద్రబా బు అబద్దాల వూటలను ప్రజలు నమ్మే స్థితిలో లేర న్నారు. అనంతరం పార్టీ నియోజకవర్గ సవున్వయుకర్త బియ్యుపు వుధుసూదన్రెడ్డి వూట్లాడుతూ స్థానిక సవుస్యలపై పోరాటం చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎన్బీపీపీఎల్ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తావుని హామీ ఇచ్చారు. పార్టీ నాయుకులు బర్రి హేవుభూషణ్రెడ్డి, వయ్యూల కృష్ణారెడ్డి, చెలికం.వేణుగోపాల్రెడ్డి, రమేష్యూదవ్, యుువత కన్వీనర్ హరిబాబు రాయుల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మనిషి జగన్ కావేటిగారిపల్లె(కల్లూరు), న్యూస్లైన్: రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం పరితపించే వ్యక్తి వైఎస్.జగన్మోహన్రెడ్డి అని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా పులిచెర్ల మండలంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వై ఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం చూస్తారని చెప్పారు. ఆల్ఫ్రీ వాగ్దానాలు చేస్తున్న చంద్రబా బు వాటిని ఎలా నెరువేరుస్తారో ప్రజలకు చెప్పాలన్నా రు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి, పోకల అశోక్కుమార్, మురళీధర్, మురళీ మోహన్రెడ్డి, నాథమునిరెడ్డి, సురేంద్రనాథ్రెడ్డి, పృథ్వీరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి, సర్పంచ్లు రాణెమ్మ, మంజుల, రాఘవరెడ్డి, రాజశేఖర్రెడ్డి, చక్రవర్తిరెడ్డి, బాలాజీ నా యుడు, రమణారెడ్డి, ప్రభాకర్, గోవింద్రెడ్డి, ఎస్వీ.రమణ, కోదండ, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీలోకి భక్తవత్సలనాయుడు
శ్రీకాళహస్తి రూరల్, న్యూస్లైన్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎస్సీవీ నాయుడు ప్రథ మ అనుచరుడు, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పొనుగోటి భక్తవత్సలనాయుడు తన అనుచరులు 500 మంది తో మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. మండలంలోని వాంపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాద్, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచుకున్నారు. ఆయనతోపాటు పార్టీలో చేరిన వారిలో సుబ్బారావునాయుడు, శాంతారావునాయుడు, తిరుపాల్ నాయుడు, వెంకటేశ్వర్లు నాయుడు, సుబ్బానాయుడు, రాజానాయుడు, భాస్కర్, అరుణాచలం, యూర్లపూడి రామచంద్రారెడ్డి ఉన్నారు. -
ప్రాదేశిక పోరులో ఫ్యాను జోరు
ప్రచారంలో వైఎస్సార్సీపీ ముందంజ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీవైపే మొగ్గు టీడీపీకి రెబల్స్ బెడద ముమ్మరంగా తమ్ముళ్ల తాయిలాల పంపిణీ నేడు మదనపల్లె డివిజన్లో తొలివిడత పోలింగ్ 445 ఎంపీటీసీలు, 31 జెడ్పీటీసీలకు ఎన్నికలు సాక్షి, చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం లో వైఎస్సార్సీపీ ముందంజలో నిలి చింది. తొలివిడతగా మదనపల్లె డివి జన్లో 31 మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరుగనున్నాయి. 31 జెడ్పీటీసీ, 445 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తిచేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చాలా ప్రాంతాల్లో రెబల్స్ బెడద ఉండ గా, కాంగ్రెస్ పార్టీ పోటీ నామమాత్రంగా ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో వైఎస్సాఆర్సీపీ శ్రేణులు చురుగ్గా పనిచేశాయి. అన్ని పంచాయతీల్లోని ఓటర్లను అభ్యర్థులు నేరుగా కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమపథకాలు మళ్లీ అమలుకు నోచుకోవాలంటే వైఎస్సార్సీపీని గెలిపించాలని వా రు కోరారు. మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, పీలేరు నియోజకవర్గంలో పార్టీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు మిథున్రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డిని కలుపుకుని ప్రచారం చేశారు. మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డితో ఉన్న క్యాడర్ మొత్తం వైఎస్సాఆర్సీపీ వైపు రావడంతో పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైఎస్ఆర్సీపీ పుంజుకుంది. దీనికితోడు మైనారిటీ ఓటు బ్యాంకు వైస్సార్సీపీ వైపే ఉంది. తంబళ్లపల్లెలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న కలిచెర్ల ప్రభాకర్రెడ్డి ఆపార్టీ అభ్యర్థులకే జర్కిచ్చారు. అన్ని మండలాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా జెడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్థులను నిలిపారు. అదే సమయంలో తంబళ్లపల్లె నియోజకవర్గ వైఎస్సాఆర్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్కుమార్రెడ్డి గ్రామస్థాయిలో నాయకులను, కార్యకర్తలను కలుపుకుని అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక్కడ టీడీపీ మూడుగ్రూప్లుగా మారడం వైఎస్సాఆర్సీపీ అభ్యర్థుల విజయానికి దోహదం చేస్తోంది. కుప్పం నియోజకవర్గంలో సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి, మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి సంయుక్తంగా ప్రచారం చేశారు. టీడీపీకి రెబల్స్ బెడద మొదటి విడత స్థానిక పోరులో తెలుగుదేశం పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో రెబెల్స్ తలనొప్పి ఎక్కువగా ఉంది. పుంగనూరులో టీడీపీ లోని రెండు గ్రూపులు తాము సూచించినవారికి టికె ట్టు ఇవ్వని చోట అధికారిక టీడీపీ అభ్యర్థి విజయానికి గండికొట్టి, తిరుగుబాటు తమ్ముళ్లను ప్రొత్సిహ ంచారు. స్వంతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన తిరుగుబాటు తమ్ముళ్లకే ఓట్లు వేయాల్సిందిగా ప్రచారం చేశారు. విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ గెలుపుపై అశలు లేకపోవడంతో తెలుగుతమ్ముళ్లు చాలా చోట్ల మద్యం, డబ్బులు, కానుకల పంపిణీకి తెరలేపారు. పుంగనూరు నియోజకవర్గంలో ఓట్లు సరిగ్గా రావనుకున్న పంచాయతీల్లో ముక్కుపుడకలు, చీరలు, నగదును తెలుగుతమ్ముళ్లు విచ్చలవిడిగా పంచారు. -
గెలుపే లక్ష్యం
సాక్షి, విజయవాడ : జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోనేరు రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో అంతర్గత సమీక్షాసమావేశం నిర్వహించారు. తొలుత ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల పరిస్థితిపై చర్చించారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలకసంస్థలో పార్టీ అభ్యర్థుల పరిస్థితి, నిర్వహించిన ప్రచారశైలి, సమన్వయకర్తల పనితీరు అంశాలపై చర్చించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతల్ని సమన్వయకర్తలు భుజాన వేసుకుని పనిచేయడం అభినందనీయమని, అన్ని ఎన్నికల్లోనూ ఇదే కొనసాగించాలని సూచించారు. అనంతరం ఈ నెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించారు. జిల్లాలోని 49 జెడ్పీటీసీ స్థానాలు, 836 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం అన్నిస్థానాల్లో పోటీలో ఉన్నారా? లేక స్థానికంగా పొత్తులు పెట్టుకుని కొన్ని స్థానాల్లో పోటీకి దూరంగా ఉన్నారా? అనే అంశంపై నియోజకవర్గాలవారీగా సమీక్షించారు. జెడ్పీ పీఠం మనదే.. జెడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని కచ్చితంగా కైవసం చేసుకోవాలని, పార్టీ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో నిత్యం రెండు పూటల ప్రచార కార్యక్రమాలు సాగాలని సూచించారు. దివంగత వైఎస్సార్ హయాంలో రైతాంగానికి, గ్రామీణ ప్రజలకు జరిగిన మేలును వివరిస్తూ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని ఓటర్లను కోరాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి పార్టీ ముఖ్య నేతలు వస్తారని వివరించారు. గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలు కావడంతో ఇక్కడ ఇబ్బందులు తల్తెతకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పార్టీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతితో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా సాగుతున్న ప్రచారం గురించి చర్చించారు. పార్టీ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు కోనేరు రాజేంద్రప్రసాద్, కుక్కల విద్యాసాగర్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు జోగి రమేష్ (మైలవరం), జలీల్ఖాన్ (విజయవాడ పశ్చిమ), పడమట సురేష్బాబు (పెనమలూరు), ఉప్పులేటి కల్పన (పామర్రు), మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు), రక్షణనిధి (తిరువూరు), మొండితోక జగన్మోహనరావు (నందిగామ), దూలం నాగేశ్వరరావు(కైకలూరు) పాల్గొన్నారు. కోనేరుతో నేతల భేటీ.. పార్టీ సమన్వయకర్తలు కోనేరు రాజేంద్రప్రసాద్తో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఎన్నికలు పూర్తయిన మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలకసంస్థలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతిఒక్కరు పనిచేయాలని కోనేరు సూచించారు. -
టీడీపీ పోటీ నామమాత్రమే
మున్సిపాలిటీల్లో ఎన్నికల సరళి పుంగనూరులో నామమాత్రంగా ప్రచారం పలమనేరు, మదనపల్లెలోఉనికి చాటుకునే ప్రయత్నం సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, మదనప ల్లె మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్సీపీ విజయ దుందుభి మోగించనుంది. ఈ మున్సిపాలిటీల్లో తాము గెలిచే అవకాశం లేదని టీడీపీ వారు చేతులెత్తేశారు. పుంగనూరులో నామమాత్రంగా ప్రచారం చేస్తున్నారు. పుంగనూరులోని 24 వార్డుల్లో ఒకచోట వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. 23 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. వైఎస్ఆర్ సీపీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పీ.ద్వారకనాథరెడ్డి ప్రచారం చేస్తున్నారు. రాజకీయా ల్లో అపార అనుభవం ఉన్న పెద్దిరెడ్డి తన శక్తిని ఉపయోగించి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేయనున్నారు. టీడీపీ నుంచి వెంకటరమణరాజు, శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి ఒకటిరెండు రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం వెంకటరమణరాజు, శ్రీనాథరెడ్డి పోటీ పడుతున్నారు. దీంతో టీడీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పుంగనూరులో 20 వార్డుల్లో వైఎస్ఆర్ సీపీకి పూర్తి మెజారిటీ వస్తుందని, మూడు వార్డుల్లో మాత్రమే పోటీ ఉంటుందని స్థానిక రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పలమనేరులో.. పలమనేరు మున్సిపాలిటీలోనూ వైఎస్ఆర్ సీపీకి సంపూర్ణ మెజారిటీ రానుంది. మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. ఇందులో 18 వార్డుల్లో వైఎస్ఆర్ సీపీ సునాయాసంగా గెలుస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అమరనాథరెడ్డి నాయకత్వంలో పీవీ.కుమార్, పీ.శారద, హేమంతకుమార్రెడ్డి (మిలటరీ హేమంత్), మండి సుధ, మురళీకృష్ణ, ఖాజా, చాంద్బాష, రహీంఖాన్ వంటి ముఖ్య నాయకులు మున్సిపాలిటీలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఎనిమిది వార్డుల్లో ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దించారు. వీరంతా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీలో 37,900 ఓట్లు ఉండగా ముస్లిం ఓట్లు సుమారుగా 13,900 ఉన్నాయి. ఇక్కడ ముస్లిం ఓట్లన్నీ వైఎస్ఆర్ సీపీకేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ తరఫున గల్లా అరుణకుమారి అనుచరులు ఐదుగురు వార్డుల్లో పోటీ చేస్తున్నారు. ప్రచారంలో సుభాష్చంద్రబోస్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నాయకులు ఎవ్వరూ టీడీపీ తరఫున కనిపించకపోవడంతో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులు కూడా నీరసించారు. మదనపల్లెలో.. మదనపల్లె మున్సిపాలిటీలో టీడీపీ పోటీ నామమాత్రమేనని స్థానికులు చెబుతున్నారు. వైఎస్ఆర్ సీపీ పది వార్డుల్లో సునాయాసంగా గెలుస్తుందని, 18 చోట్ల టీడీపీకి, వైఎస్ఆర్ సీపీకి పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రెండు పార్టీల మధ్య 18 వార్డులకు జరిగే పోటీలో మూడొంతుల వార్డులు వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని, అంటే సుమారు 14 వార్డుల్లో తప్పకుండా గెలుస్తామనే ధీమాలో వైఎస్ఆర్ సీపీ వారు ఉన్నారు. వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు షమీమ్అస్లామ్, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్తిప్పారెడ్డిల నాయకత్వంలోజిల్లా నాయకులు ఉదయ్కుమార్, గాయత్రీదేవి, మైనారిటీల నాయకులు బాబ్జాన్, అక్తర్ మహమ్మద్, మాధవరెడ్డి వార్డుల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరులోనూ వైఎస్ఆర్ సీపీ అంటే ఎంతో అభిమానం ఉందని వారు చెబుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ తరపున రాందాస్ చౌదరి, బోడపాటి శ్రీనివాస్, నాదెండ్ల విద్యాసాగర్, శ్రీరామ్చినబాబు, మిట్స్ కృష్ణకుమార్, బీఆర్ తులసీప్రసాద్ ప్రచారం సాగిస్తున్నారు. -
పుంగనూరు చైర్మన్ సీటు ముస్లింలకే
మైనారిటీలకు సముచిత స్థానం అందరితో చర్చించాకే అభ్యర్థుల పేర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు, న్యూస్లైన్: పుంగనూరు మున్సిపల్ చైర్మన్ పదవిని ముస్లిం మహిళకు కేటాయిస్తున్నామని వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చైర్మన్ అభ్యర్థి, వైస్ చైర్మన్ అభ్యర్థులు ఎవరనే విషయం ఇంకా నిర్ణయించలేదని, ఈ విషయమై అందరితో చర్చించి ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయం తెలియడంతో నియోజకవర్గంలోని ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సమితుల ఏర్పాటునుంచి మున్సిపాలిటీగా ఏర్పాటైన తరువాత కూడా పుంగనూరులో ఎక్కువసార్లు ముస్లింలు చైర్మన్ పదవిలో కొనసాగారు. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడు కొండవీటి నాగభూషణంను మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నారు. అప్పట్లో ముస్లిం మైనారిటీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ పెద్దిరెడ్డి మైనారిటీలకు నచ్చజెప్పారు. ఇప్పుడు కూడా కొండవీటి నాగభూషణం సతీమణి కాంతమ్మకు చైర్మన్ పదవి ఇస్తారని ఊహించారు. కానీ పెద్దిరెడ్డి మనోగతం గ్రహించిన కొండవీటి నాగభూషణం తమకు చైర్మన్ పదవి వద్దని, ముస్లిం మహిళకు ఇవ్వాలని కోరడంతో మార్గం సుగమమైంది. -
బంద్ సంపూర్ణం
ఎన్జీవోల మద్దతు స్తంభించిన జనజీవనం రోడ్డెక్కని బస్సులు మూతపడిన కార్యాలయాలు, వాణిజ్యసంస్థలు తిరుపతిలో ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం సాక్షి, చిత్తూరు: లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో బంద్ విజయవంతమైంది. ఎన్జీవోలూ మద్దతు ప్రకటించడంతో జనజీవనం పూర్తిస్థాయిలో స్తంభించింది. వాణిజ్య సంస్థలు, సినీ థియేటర్లు, హోటళ్లు మూతపడ్డాయి. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు ఏ ఒక్క డిపోలోనూ రోడ్డెక్కలేదు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, పుత్తూరులో పార్టీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, సత్యవేడులో సమన్వయకర్త ఆదిమూలం బంద్ను పర్యవేక్షించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో జాతీయ రహదారి దిగ్బంధనంలో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. చిత్తూరులో రాస్తారోకోకు సమన్వయకర్త ఏఎస్.మనోహర్, మదనపల్లెలో రాస్తారోకోకు సమన్వయకర్త షమీమ్ అస్లాం నాయకత్వం వహించారు. తిరుపతిలో ఉదయం ఆరు గంటల నుంచే ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభం సర్కిల్ వద్ద రోడ్డును దిగ్బం ధించారు. నాయకులు, కార్యకర్తలు పట్టణంలో తిరుగుతూ బంద్ను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే స్వయంగా బంద్ను పర్యవేక్షించడంతో కార్యకర్తలు వందలాది మంది సమైక్యాంధ్ర నినాదాలతో ముందుకు కదిలారు. రమణమ్మ, గీత అనే మహిళా కార్యకర్తలు శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వీరిని పోలీసులు వారించి అదుపులోకి తీసుకున్నారు. కొందరు విద్యార్థులు ఒక హోటల్ పైకి ఎక్కి దూకేందుకు యత్నించగా పోలీసులు నచ్చజెప్పి కిందకు దించారు. పూర్ణకుంభం సర్కిల్ వద్ద పెద్ద చెక్కమొద్దులు మంటేసి వాహనాలు పోకుండా అడ్డుకున్నారు. పుంగనూరులో ఉదయం 5.30 నుంచి సా యంత్రం 4 గంటల వరకు బంద్ నిర్వహిం చారు. జనజీవనం పూర్తిగా స్తంభించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బంద్ను జయప్రదం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, అన్ని జేఏసీలు వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించి బంద్లో పాల్గొన్నా యి. వాణిజ్య సంస్థలు, హోటళ్లు, థియేటర్లు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచి పోయాయి. సోనియా పశ్చాత్తాపం చెంది విభజన బిల్లును ఉపసంహరించుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్, ఏటీఎం సర్కిల్, చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అన్ని రోడ్లలో రాళ్లు అడ్డుగా పెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. బంద్లో ఎన్జీవోలు పాల్గొన్నారు. చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గాంధీబొమ్మ వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. అనంతరం మోటార్బైక్ ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో దర్గా సర్కిల్లో మహిళలు నిరసన తెలిపారు. అక్కడ నుంచి ఆర్టీసీ డిపోకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కుప్పంలో బంద్ విజయవంతమైంది. నియోజకవర్గ సమన్వయకర్త ఎం.సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో బంద్ పాటించారు. అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు, దుకాణాలు మూతపడ్డాయి. శాంతిపురం జాతీయ రహదారి దిగ్బంధించారు. ఆర్టీసీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పీలేరులో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. విభజన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పుత్తూరులో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. నారాయణస్వామి కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. అంబేద్కర్కు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరిలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే.కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు మద్దతు ప్రకటించి ర్యాలీ చేపట్టారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో బి.కొత్తకోట, కురబలకోట, తం బళ్లపల్లె, ములకచెరువు మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అంగళ్లు వద్ద జరిగిన జాతీయ రహదారి దిగ్బంధనంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో సమన్వయకర్త ఆదిమూలం, కార్మికవర్గ జిల్లా అధ్యక్షుడు బీరేంద్రవర్మ, రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ర్యాలీలు చేపట్టారు. గాంధీరోడ్, నేతాజీరోడ్లలో దుకాణాలు మూయించారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. మదనపల్లెలో పార్టీ సమన్వయకర్త షమీం అస్లాం, మైనారిటీ నాయకుడు పీఎస్.ఖాన్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఏపీ ఎన్జీవోలు, విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ సీపీ నాయకులు గుమ్మడి బాలక్రిష్ణ, మిద్దెలహరి, సిరాజ్బాషా ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, పెండ్లి మండపం, సూపర్బజార్ సర్కిళ్లలో రాస్తారోకోలు నిర్వహించారు. వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూ రు, పాలసముద్రం, వెదురుకుప్పం, కార్వేటినగరం, ఎస్ఆర్.పురం మండలాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళెం మండలంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలోనూ బంద్ విజ యవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. -
రెండో రోజూ ప్రభం‘జనం’
=జగన్ను అక్కున చేర్చుకున్న కుప్పం, పలమనేరు వాసులు =దారి పొడవునా అభిమాన వర్షం =కరచాలనాలు, కర్పూర హారతులు సాక్షి, తిరుపతి: కుప్పం ఆర్అండ్ బీ అతిథి గృహం నుంచి ఆదివారం సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభమైంది. వైఎస్.జగన్మోహన్రెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి తదితరులు ఉదయం 9.30 గంటలకు యాత్రకు బయలుదేరారు. దారి పొడవునా సమీప గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా సామగుత్తిపల్లె క్రాస్ వద్ద పార్టీ నాయకుడు శివకుమార్ నేతృత్వంలో స్వాగతం పలికారు. మహిళలు కర్పూర హారతులు పట్టారు. రోడ్డు పక్కన ఆగిన బస్సుల నుంచి ప్రయాణికులు చేతులు ఊపుతూ జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలిపారు. సమీపంలోనే చప్పడిగురుగులు గ్రామం వద్ద వేచి ఉన్న ప్రజలను జగన్మోహన్రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. చంటిపిల్లలను హత్తుకుని ముద్దాడారు. చిన్నశెట్టిపల్లె మార్గంలో బడుగు వర్గాలకు చెందిన ప్రజలు వేచి ఉండగా కారు ఆపి వారి వద్దకు వెళ్లారు. అందరినీ పలకరించారు. మహిళలు, చిన్నారులను దీవించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఆగి విద్యార్థులతో కా సేపు ముచ్చటించారు. వారందరికి ‘బాయ్’ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. పెద్దిశెట్టిపల్లెలో స్థానిక నాయకులు నాగరాజు, రామకుమార్ భారీ ఎత్తున స్వాగతం పలికారు. శెట్టిపల్లె క్రాస్ వద్ద మహిళలు హారతులు పట్టి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. బొగ్గుపల్లె పంచాయతీలోని పీఈఎస్ మెడికల్ కళాశాల ప్రాంగణం వద్ద కళాశాల విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున గుమికూడారు. స్థానిక నాయకుడు సెంథిల్ నేతృత్వంలో మహిళలు హారతులు పట్టారు. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. గణేషపురం, పుడూరు, కడపల్లె, శివపురం క్రాస్ వద్ద జగన్మోహన్రెడ్డికి అ పూర్వ స్వాగతం లభించింది. అక్కడ నుంచి బయలుదేరిన ఆయనకు తిమ్మరాజుపురం, కనుమదొడ్డి, మురసనపల్లె, తులసినాయుడుపల్లె వద్ద జనం సాదర స్వాగతం పలికారు. జగన్మోహన్రెడ్డి అందరినీ పలకరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు కది లారు. తుమ్మిశ గ్రామం వద్ద భారీగా జనం తరలివచ్చారు. స్థాని క నాయకులు ఆవుల గోపి, బాబు నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. శాంతిపురం మండలంలోకి ప్రవేశించిన ఆయనను స్థానిక నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అక్కడ మ హానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉన్న మఠం గ్రామం వద్దకు చేరుకోగానే, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పలువురు రోడ్డుపైకి వచ్చి జగన్మోహన్రెడ్డితో కరచాలనం చేశారు. గుండుశెట్టిపల్లె, నాయినిపల్లెకు చేరుకోగానే అక్కడివారు పూలవర్షం కురిపించారు. రాజుపేట వద్ద ఒక అభిమాని గొర్రెపిల్లను కానుకగా అందజేశారు. అక్కడి నుంచి జగన్మోహన్రెడ్డి రామకుప్పం చేరుకుని మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వి.కోటలో బహిరంగ సభకు వెళుతూ మార్గ మధ్యంలో వేచి ఉన్న అభిమానులను పల కరించారు. వి.కోటలో పలువురు టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కాన్వాయ్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ్రెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆది మూలం, ఏఎస్.మనోహర్, షమీమ్ అస్లాం, పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మిథున్రెడ్డి, తిరుపతి నేత వరప్రసాదరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, యువజన కన్వీనరు ఉదయకుమార్, తిరుపతి కన్వీనరు పాలగిరి ప్రతాప్రెడ్డి తదితరులు ఉన్నారు. -
రెండో రోజూ ప్రభం‘జనం’
=జగన్ను అక్కున చేర్చుకున్న కుప్పం, పలమనేరు వాసులు =దారి పొడవునా అభిమాన వర్షం =కరచాలనాలు, కర్పూర హారతులు సాక్షి, తిరుపతి: కుప్పం ఆర్అండ్ బీ అతిథి గృహం నుంచి ఆదివారం సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభమైంది. వైఎస్.జగన్మోహన్రెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి తదితరులు ఉదయం 9.30 గంటలకు యాత్రకు బయలుదేరారు. దారి పొడవునా సమీప గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా సామగుత్తిపల్లె క్రాస్ వద్ద పార్టీ నాయకుడు శివకుమార్ నేతృత్వంలో స్వాగతం పలికారు. మహిళలు కర్పూర హారతులు పట్టారు. రోడ్డు పక్కన ఆగిన బస్సుల నుంచి ప్రయాణికులు చేతులు ఊపుతూ జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలిపారు. సమీపంలోనే చప్పడిగురుగులు గ్రామం వద్ద వేచి ఉన్న ప్రజలను జగన్మోహన్రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. చంటిపిల్లలను హత్తుకుని ముద్దాడారు. చిన్నశెట్టిపల్లె మార్గంలో బడుగు వర్గాలకు చెందిన ప్రజలు వేచి ఉండగా కారు ఆపి వారి వద్దకు వెళ్లారు. అందరినీ పలకరించారు. మహిళలు, చిన్నారులను దీవించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఆగి విద్యార్థులతో కా సేపు ముచ్చటించారు. వారందరికి ‘బాయ్’ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. పెద్దిశెట్టిపల్లెలో స్థానిక నాయకులు నాగరాజు, రామకుమార్ భారీ ఎత్తున స్వాగతం పలికారు. శెట్టిపల్లె క్రాస్ వద్ద మహిళలు హారతులు పట్టి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. బొగ్గుపల్లె పంచాయతీలోని పీఈఎస్ మెడికల్ కళాశాల ప్రాంగణం వద్ద కళాశాల విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున గుమికూడారు. స్థానిక నాయకుడు సెంథిల్ నేతృత్వంలో మహిళలు హారతులు పట్టారు. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. గణేషపురం, పుడూరు, కడపల్లె, శివపురం క్రాస్ వద్ద జగన్మోహన్రెడ్డికి అ పూర్వ స్వాగతం లభించింది. అక్కడ నుంచి బయలుదేరిన ఆయనకు తిమ్మరాజుపురం, కనుమదొడ్డి, మురసనపల్లె, తులసినాయుడుపల్లె వద్ద జనం సాదర స్వాగతం పలికారు. జగన్మోహన్రెడ్డి అందరినీ పలకరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు కది లారు. తుమ్మిశ గ్రామం వద్ద భారీగా జనం తరలివచ్చారు. స్థాని క నాయకులు ఆవుల గోపి, బాబు నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. శాంతిపురం మండలంలోకి ప్రవేశించిన ఆయనను స్థానిక నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అక్కడ మ హానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉన్న మఠం గ్రామం వద్దకు చేరుకోగానే, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పలువురు రోడ్డుపైకి వచ్చి జగన్మోహన్రెడ్డితో కరచాలనం చేశారు. గుండుశెట్టిపల్లె, నాయినిపల్లెకు చేరుకోగానే అక్కడివారు పూలవర్షం కురిపించారు. రాజుపేట వద్ద ఒక అభిమాని గొర్రెపిల్లను కానుకగా అందజేశారు. అక్కడి నుంచి జగన్మోహన్రెడ్డి రామకుప్పం చేరుకుని మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వి.కోటలో బహిరంగ సభకు వెళుతూ మార్గ మధ్యంలో వేచి ఉన్న అభిమానులను పల కరించారు. వి.కోటలో పలువురు టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కాన్వాయ్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ్రెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆది మూలం, ఏఎస్.మనోహర్, షమీమ్ అస్లాం, పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మిథున్రెడ్డి, తిరుపతి నేత వరప్రసాదరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, యువజన కన్వీనరు ఉదయకుమార్, తిరుపతి కన్వీనరు పాలగిరి ప్రతాప్రెడ్డి తదితరులు ఉన్నారు. -
రెండో రోజూ ప్రభం‘జనం’
=జగన్ను అక్కున చేర్చుకున్న కుప్పం, పలమనేరు వాసులు =దారి పొడవునా అభిమాన వర్షం =కరచాలనాలు, కర్పూర హారతులు సాక్షి, తిరుపతి: కుప్పం ఆర్అండ్ బీ అతిథి గృహం నుంచి ఆదివారం సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభమైంది. వైఎస్.జగన్మోహన్రెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి తదితరులు ఉదయం 9.30 గంటలకు యాత్రకు బయలుదేరారు. దారి పొడవునా సమీప గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా సామగుత్తిపల్లె క్రాస్ వద్ద పార్టీ నాయకుడు శివకుమార్ నేతృత్వంలో స్వాగతం పలికారు. మహిళలు కర్పూర హారతులు పట్టారు. రోడ్డు పక్కన ఆగిన బస్సుల నుంచి ప్రయాణికులు చేతులు ఊపుతూ జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలిపారు. సమీపంలోనే చప్పడిగురుగులు గ్రామం వద్ద వేచి ఉన్న ప్రజలను జగన్మోహన్రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. చంటిపిల్లలను హత్తుకుని ముద్దాడారు. చిన్నశెట్టిపల్లె మార్గంలో బడుగు వర్గాలకు చెందిన ప్రజలు వేచి ఉండగా కారు ఆపి వారి వద్దకు వెళ్లారు. అందరినీ పలకరించారు. మహిళలు, చిన్నారులను దీవించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఆగి విద్యార్థులతో కా సేపు ముచ్చటించారు. వారందరికి ‘బాయ్’ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. పెద్దిశెట్టిపల్లెలో స్థానిక నాయకులు నాగరాజు, రామకుమార్ భారీ ఎత్తున స్వాగతం పలికారు. శెట్టిపల్లె క్రాస్ వద్ద మహిళలు హారతులు పట్టి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. బొగ్గుపల్లె పంచాయతీలోని పీఈఎస్ మెడికల్ కళాశాల ప్రాంగణం వద్ద కళాశాల విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున గుమికూడారు. స్థానిక నాయకుడు సెంథిల్ నేతృత్వంలో మహిళలు హారతులు పట్టారు. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. గణేషపురం, పుడూరు, కడపల్లె, శివపురం క్రాస్ వద్ద జగన్మోహన్రెడ్డికి అ పూర్వ స్వాగతం లభించింది. అక్కడ నుంచి బయలుదేరిన ఆయనకు తిమ్మరాజుపురం, కనుమదొడ్డి, మురసనపల్లె, తులసినాయుడుపల్లె వద్ద జనం సాదర స్వాగతం పలికారు. జగన్మోహన్రెడ్డి అందరినీ పలకరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు కది లారు. తుమ్మిశ గ్రామం వద్ద భారీగా జనం తరలివచ్చారు. స్థాని క నాయకులు ఆవుల గోపి, బాబు నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. శాంతిపురం మండలంలోకి ప్రవేశించిన ఆయనను స్థానిక నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అక్కడ మ హానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉన్న మఠం గ్రామం వద్దకు చేరుకోగానే, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పలువురు రోడ్డుపైకి వచ్చి జగన్మోహన్రెడ్డితో కరచాలనం చేశారు. గుండుశెట్టిపల్లె, నాయినిపల్లెకు చేరుకోగానే అక్కడివారు పూలవర్షం కురిపించారు. రాజుపేట వద్ద ఒక అభిమాని గొర్రెపిల్లను కానుకగా అందజేశారు. అక్కడి నుంచి జగన్మోహన్రెడ్డి రామకుప్పం చేరుకుని మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వి.కోటలో బహిరంగ సభకు వెళుతూ మార్గ మధ్యంలో వేచి ఉన్న అభిమానులను పల కరించారు. వి.కోటలో పలువురు టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కాన్వాయ్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ్రెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆది మూలం, ఏఎస్.మనోహర్, షమీమ్ అస్లాం, పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మిథున్రెడ్డి, తిరుపతి నేత వరప్రసాదరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, యువజన కన్వీనరు ఉదయకుమార్, తిరుపతి కన్వీనరు పాలగిరి ప్రతాప్రెడ్డి తదితరులు ఉన్నారు.