Privacy
-
టోటలైజర్ విధానం తేవాలి
న్యూఢిల్లీ: ఓటరు గోప్యతను కాపాడేందుకు టోటలైజర్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పదవీ విరమణ చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. దీనివల్ల, బూత్ల వారీ ఓటింగ్ సరళిని బయటకు తెలియదని చెప్పారు. ప్రవాస భారతీయులు స్థానికంగానే ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో కమిషన్పై తప్పుదోవ పట్టించే ఆరోపణల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన పదవీ విరమణ చేయనున్న సీఈసీ రాజీవ్ కుమార్ సోమవారం జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రతి ఈవీఎం నుంచి పోలైన ఓట్లను సేకరిస్తున్నాం. ఇందులో ఒక్కో అభ్యర్థికీ పడిన ఓట్లను కలిపి ఫలితాలను ప్రకటిస్తున్నాం. ఇందులో లోపమేమంటే..ఏ ప్రాంతం నుంచి తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే వివరాలు అభ్యర్థులకు తెలిసిపోతాయి. ఎన్నికల అనంతర హింసకు ఇదే కారణంగా మారుతోంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లను వేధించడం, అభివృద్ధి కార్యక్రమాల నుంచి వారిని దూరంగా పెట్టడం వంటి చర్యలకు దిగుతున్నారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘దీనిని నివారించడానికి టోటలైజర్ విధానాన్ని తేవాలి. దీనిని ఇప్పటికే ఎన్నికల సంఘం అభివృద్ధి పరిచింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు పోలింగ్ బూ త్ల వారీగా పడిన ఓట్లను వెల్లడించబోరు. రాజకీ య ఏకాభిప్రాయంతో ఈ విధానాన్ని అమ ల్లోకి తేవాలి. ఓటరు గోప్యతను కాపాడేందుకు, ఓటింగ్ ప్రక్రియ సమగ్రతను పెంచేందుకు ఇది ఎంతో అవసరమని నమ్ముతున్నా’అని ఆయన అన్నారు. రిమోట్ ఓటింగ్ విధానం రావాలికోట్లాది మంది వలస కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రిమోట్ ఓటింగ్ విధానాన్ని తప్పనిసరిగా అందుబాటులోకి తేవాలన్నారు. దొంగ ఓట్లు, ఒకే వ్యక్తి పలుమార్లు ఓటేసే వ్యవహారాలను సమర్థంగా అడ్డుకునేందుకు పోలింగ్ బూత్లలో బయోమెట్రిక్ ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని సూచించారు. రాజకీయ పార్టీలు నిధులు, ఖర్చు వివరాలను ఆన్లైన్లో వెల్లడించే ప్రక్రియ మొదలైందన్నారు. ఆర్థిక పారదర్శకత, విశ్లేషణల కోసం ఈ ప్రక్రియను తప్పనిసరి చేయాలని సూచించారు. ఆరోపణలు ఆందోళనకరంఓటర్లు ఉత్సాహంగా, పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న చోట కూడా ఫలితాల అనంతరం రాజకీయ పార్టీలు ఈసీ, అధికారులపై సందేహాలను వ్యక్తం చేయడం ఖండించాల్సిన అంశమని రాజీవ్ కుమార్ చెప్పారు. ‘పోలింగ్ లేదా కౌంటింగ్ ముమ్మరంగా జరుగుతున్న వేళ తప్పుడు ఆరోపణలు, వదంతులు మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికలపై ఒక్కసారిగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడం, వారిని అయోమయానికి గురి చేయడమే వీటి లక్ష్యం. అయితే, ఎన్నికల సమగ్రతను కాపాడటం, ప్రశాంతంగా ఎన్నికలు జరపడాన్నే లక్ష్యంగా పెట్టుకున్న ఈసీ ఇటువంటి వాటిని పట్టించుకోలేదు’అని అన్నారు. ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని వారు ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేసే ధోరణులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసే వారిని ప్రజలు నమ్మబోరని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి అంశాలపై ఎన్నికల కమిషన్ సంయమనం పాటిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ అధికార బీజేపీకి కొమ్ముకాస్తోందని, ఓటింగ్లో అవకతవకలపై తాము చేసే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నియంత్రణలు లేని సోషల్ మీడియా విశ్లేషణలు, అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియకు తీవ్ర ప్రమాదకరంగా మారాయంటూ రాజీవ్కుమార్.. ఇవి చేసే నిరాధార, ఉద్దేశపూర్వక విమర్శలను ఎదుర్కోవడానికి ఎన్నికల సంఘం సామర్థ్యాలను పెంపొందించుకోవాలని నొక్కి చెప్పారు. -
వాట్సాప్ హ్యాకింగ్: ఈ టిప్స్ పాటిస్తే మీరు సేఫ్
స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. అయితే.. సైబర్ మోసగాళ్ల ఆగడాలు మితిమీరుతున్న తరుణంలో ఆన్లైన్ స్కామ్లు పెరిగిపోతున్నాయి. వాట్సాప్ ద్వారా కూడా ప్రజలను మోసాలు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కొన్ని సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలివాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే.. టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయడం ఉత్తమం. దీని కోసం ముందుగా వాట్సాప్ ఖాతా ఓపెన్ చేసి.. అందులో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా ఒక పిన్ కూడా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీ ఖాతాను ఎవరూ హ్యాక్ చేసే అవకాశం లేదు.వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలివాట్సాప్ ఖాతాను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మెటా ఎప్పటికప్పుడు ఫీచర్స్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇది మీ భద్రతను పెంచడంలో సహాయపడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. యాప్ అప్డేట్ పేరుతో వచ్చే సందేశాల విషయంలో కూడా యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాప్ అప్డేట్ పేరుతో ఫేక్ మెసేజ్లు వస్తుంటాయి.తెలియని కాల్స్ స్వీకరించకండితెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ (ఆడియో & వీడియో) స్వీకరించకపోవడం ఉత్తమం. కొంతమంది డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు వాట్సాప్ కాల్స్ ఉపయోగించే ప్రజలను మోసం చేస్తుంటారు. కాబట్టి తెలియని కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాట్ (DoT) హెచ్చరిస్తోంది.వైఫై నెట్వర్క్లకు దూరంగా ఉండండిపబ్లిక్ వైఫై నెట్వర్క్లు.. అంత సురక్షితమైనవి కాదు. కాబట్టి హ్యాకర్లు ఎక్కువగా ఇలాంటి నెట్వర్క్లను ఉపయోగించి హ్యాక్ చేస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ వైఫై ఉపయోగించడాన్ని తగ్గించాలి. తప్పనిసరిగా ప్రైవేట్ నెట్వర్క్ను ఉపయోగించాలి. అప్పుడే మీ డేటా సేఫ్గా ఉంటుంది.స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించండిమీ ఫోన్లో డేటా భద్రంగా ఉండాలంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించాలి. సింపుల్ పాస్వర్డ్లను సెట్ చేసుకుంటే.. హ్యాకర్స్ సులభంగా మొబైల్స్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ లేదా పేస్ ఐడెంటిటీ వంటివి సెట్ చేసుకోవడం కూడా ఉత్తమం. 123456 లేదా abcdef వంటివి సెట్ చేయడం పూర్తిగా మానేయాలి. -
‘లొకేషన్’తో ప్రైవసీ చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: ‘లొకేషన్ పంపు.. నేను వచ్చేస్తా..’ ఎవరినైనా కలవడానికి వెళ్తేనో, కొత్త ప్రదేశానికి వెళ్తేనో ఈ మాట తప్పకుండా వినిపిస్తుంది. ఎవరికైనా మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పాలన్నా.. కొత్త ప్రాంతంలో నిర్దిష్టమైన ప్రాంతానికి వెళ్లాలన్నా ఈ లొకేషన్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరం. పెద్దగా తికమక పడాల్సిన అవసరం లేకుండానే అవసరమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. కానీ ఇది ఎంత సౌకర్యవంతమో అంతే స్థాయిలో ఇబ్బందికరం కూడా అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మన ప్రైవసీని దెబ్బతీస్తుందని.. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఎంత సేపు ఉన్నామనే ప్రతి అంశం ఈ లొకేషన్తో తెలిసిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఏదైనా షాపింగ్ మాల్కు వెళ్లామా? సినిమా థియేటర్లో ఉన్నామా? ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లామా? అన్న వివరాలు గూగుల్తో పాటు మన ఫోన్లోని వివిధ యాప్ సంస్థలకు చేరిపోతాయి. ఇది మన వ్యక్తిగత అంశాలను బహిరంగం చేయడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే మన మొబైల్ ఫోన్లలోని లొకేషన్ను ఆన్ చేసుకోవాలని.. తర్వాత ఆఫ్ చేసి పెట్టడం వల్ల మనపై ఎవరూ నిఘా పెట్టకుండా ఉంటుందని వివరిస్తున్నారు. నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివీ.. మొబైల్ ఫోన్లలోని అన్ని అప్లికేషన్స్ (యాప్ల)కు లొకేషన్ సర్వీసెస్ అనుమతులు (పర్మిషన్) ఇవ్వొద్దు. అపరిచిత, అనుమానాస్పద యాప్లకు మన లొకేషన్ యాక్సెస్ ఇస్తే.. అది మన వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారుతుంది. కొన్ని యాప్లకు మనం ఇచ్చే పర్మిషన్లతో.. మన లొకేషన్ వివరాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం, మన కదలికలపై నిఘా పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. లొకేషన్ ఆన్లో ఉండటంతో మనం ఎప్పుడు ఎక్కడ ఉంటున్నామన్న సమాచారం ఇతరులకు సులువుగా తెలిసే అవకాశం ఉంది. లొకేషన్ను ఆధారంగా చేసుకుని కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. మొబైల్లో ఎప్పుడూ లొకేషన్ ఆన్లో ఉండటం వల్ల బ్యాగ్రౌండ్లో ఈ యాప్ పనిచేస్తూ, బ్యాటరీలో చార్జింగ్ త్వరగా తగ్గుతుంది. మొబైల్లో డేటా కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. -
మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్లు యూజర్ల ఏటాను చోరీ చేస్తున్నాయా? అంటే నివేదికలు అవుననే అంటున్నాయి. మోడ్రన్ టాప్ బ్రాండ్స్ కార్లలో డేటా ప్రైవసీ అనేది పీడకలే అంటూ కాలిఫోర్నియాకు చెందిన మొజిల్లా ఫౌండేషన్ తన తాజా పరిశోధనలో వెల్లడించింది. దాదాపు 25 కార్ బ్రాండ్లను సమీక్షించింది. ఆ సందర్బంగా సెక్స్ లైఫ్ నుంచి ఇష్టా ఇష్టాలు, పాలిటిక్స్ గగుర్పాటు కలిగించే ఇతర విషయాలు అన్నీ లీక్ అవుతున్నాయంటూ సంచలన అధ్యయన నివేదికను ప్రకటించింది. (గుడ్ న్యూస్: టీసీఎస్ వేల కోట్ల రూపాయల మెగా డీల్ ) మొజిల్లా ఫౌండేషన్ నిర్వహించిన వినియోగదారు గోప్యతా పరీక్షల్లో అవన్నీ విఫలమయ్యాయని తేలింది. పరిశోధనలో 84శాతం కార్ కంపెనీలు కారు యజమానుల నుండి సేకరించిన డేటాను సమీక్షించాయి, పంచుకుంటాయి లేదా విక్రయించాయి అని వెల్లడించింది. డ్రైవింగ్ డిజిటల్గా మారుతున్న యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, విక్రయించడంపై ఆందోళన వ్యక్తం చేసిన మొజిల్లా అసలు తమ పరిశోధనలోని కంపెనీలేవీ గోప్యతపై దాని ప్రమాణాలను పూర్తిగా సంతృప్తి పరచలేదని తెలిపింది. సెక్స్ టాయ్లు ,మానసిక ఆరోగ్య యాప్ల తయారీదారులతో సహా ఇంత పేలవమైన సమీక్ష రాలేదని తెలిపింది. కార్ల తయారీదారులు తమ కార్లను 'కంప్యూటర్ ఆన్ వీల్స్' అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అంతా డొల్ల అని ప్రైపసీ ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్కు ప్రసిద్ధి చెందిన మొజిల్లా రిపోర్ట్ చేసింది. "ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే డోర్బెల్లు, గడియారాలు తమపై గూఢచర్యం చేస్తున్నాయని ఆందోళన నేపథ్యంలో కార్ బ్రాండ్లు కూడా తమ వాహనాలను డేటా-గాబ్లింగ్ మెషీన్లుగా మార్చడం ద్వారా నిశ్శబ్దంగా డేటా వ్యాపారంలోకి ప్రవేశించాయని మొజిల్లా పేర్కొంది. అధ్యయనం ప్రకారం టెస్లా టాప్లో ఉందంటూ మరో బాంబు పేల్చింది.నిస్సాన్ రెండో స్థానంలో నిలిచింది. నిస్సాన్ సేకరించే డేటాలో “లైంగిక కార్యకలాపాలు” ఎక్కువగానూ, అలాగే కియా కంపెనీ ప్రైవసీ సిస్టం ప్రకారం, జాతి, మతపరమైన లేదా తాత్విక విశ్వాసాలు, లైంగిక ధోరణి, లైంగిక జీవితం, రాజకీయ అభిప్రాయాలతోపాటు "ట్రేడ్ యూనియన్ సభ్యత్వం" సమాచారంతో సహా "ప్రత్యేక వర్గాల" డేటాను ప్రాసెస్ చేయవచ్చని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!) 84 శాతం బ్రాండ్స్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు , ఇతర బహిర్గతం చేయని వ్యాపారాలతో పంచుకున్నట్లు అంగీకరించినట్లు అధ్యయనం తెలిపింది. ఎక్కువమంది, 76 శాతం కస్టమర్ల డేటాను విక్రయించినట్లు చెప్పడం గమనార్హం. సగం కంటే ఎక్కువమంది డేటాను షేర్ చేస్తున్నట్టు చెప్పారు. కనెక్టెడ్ వాహనాలు డ్రైవింగ్ డేటామాత్రమే కాకుండా, వాహనంలోని వినోదం, శాటిలైట్ రేడియో మ్యాప్ లాంటి థర్డ్-పార్టీ ఫంక్షన్లను ట్రాక్ చేస్తున్నాయట. అత్యధిక సంఖ్యలో కార్ బ్రాండ్లు, 92 శాతం, కేవలం ఫ్రాన్స్కు చెందిన రెనాల్ట్, Dacia బ్రాండ్తో వినియోగదారులకు వారి వ్యక్తిగత డేటాపై ఎటువంటి నియంత్రణ లేకుండా అందిస్తోంది. బహుశా యూరోపియన్ యూనియన్ చట్టానికి లోబడి డేటా డిలిట్ రైట్ను వినియోగదారులకు అనుమతించి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. కనీస భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్నుటికీ ఫోర్డ్, చేవ్రొలెట్, టయోటా, వోక్స్వ్యాగన్ , BMW వంటి కార్ల బ్రాండ్లు ఏవీ కూడా గత మూడేళ్లుగా 68 శాతం డేటా లీక్లు, హ్యాక్లు లేదా ఉల్లంఘన బారిన పడుతున్నాయని మొజిల్లా ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్టడీపై టాప్ కంపెనీలేవీ ఇంకా ఎలాంటి స్పందన ప్రకటించలేదు. (రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?) కాగా ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కార్లు, భద్రత, డేటా నియంత్రణ, ఏఐ కి సంబంధించిన అన్ని రివ్యూల్లో ఫెయిల్ అనే విమర్శలను ఎదుర్కొంది. కస్టమర్ల కార్లలోని కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు,ఫోటోలు ను ఉద్యోగులు పంచుకోవడం దుమారాన్ని రేపింది. అయితే 2021లో, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా చైనా సైనిక మిలిటరీకి ఈ వాహనాలను నిషేధించిన తర్వాత చైనాలో కెమెరాలు నిలిపివేసినట్టు టెస్లా ప్రకటించింది. -
పౌరుల డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధం : నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి, ఉపాధి కల్పనే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం దారికొస్తోందని, దీనిపై దీర్ఘకాలంపాటు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని కూడా ఈ సందర్భంగా విశ్లేషించారు. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వృద్ధి, దేశ సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశంగా పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీని కట్టడే లక్ష్యంగా మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 1.4 శాతం (ప్రస్తుతం 5.4 శాతానికి పెరుగుదల) పెంచిన నేపథ్యంలో సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. రెపో రేటు పెంపునకు తక్షణం ఇక ముగింపు పడినట్లేనా అన్న సందేహాలకు ఆమె ప్రకటన తావిస్తోంది. ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ►రిటైల్ ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా దిగివస్తోంది. దీనిని మనం నిర్వహించగలిగిన స్థాయికి తీసుకురాగలుగుతున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యతలు ఉపాధి కల్పన, వృద్ధికి ఊపును అందించడం. (ఆర్బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. ఏప్రిల్లో 7.79 శాతం, మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 7.01 శాతానికి దిగివచ్చింది. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4శాతం, 5.8శాతాలుగా నమోదవుతాయని ఆర్బీఐ పాలసీ అంచనావేసింది. 2023– 24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది. ► అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు వైఖరి నుండి ఉద్భవిస్తున్న అస్థిరతను ఎదుర్కొనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. భారత్ ద్రవ్య విధానాన్ని పెద్ద అవాంతరాలు లేదా తీవ్ర ఒడిదుడుకులు లేకుండా నిర్వహించగలమన్న ఆర్బీఐ అధికారులు విశ్వసిస్తున్నారు. ►కోవిడ్–19 కాలంలో కేంద్రం ఆర్థిక నిర్వహణ పటిష్టంగా ఉంది. లక్ష్యంతో కూడిన ఆర్థిక విధానంతో భారత్ డబ్బును ముద్రించకుండా సవాళ్లతో కూడిన సమాయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. ►రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభ వల్ల ముడి చమురు, సహజ వాయువు లభ్యతపై అనిశ్చితి కొనసాగుతోంది. ►చెల్లింపులకు సంబంధించి సాంకేతికతతో సహా అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్– అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. భారత్, అమెరికాలు కలిసి పని చేస్తే, మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 30 శాతానికి చేరుకుంటాం. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో 30 శాతం వాటాను అందిస్తాము. ఈ పరిస్థితి భారత్–అమెరిలను ప్రపంచ వృద్ధికి ఇంజిన్గా మారుస్తుంది. ►భారత్ డేటా డేటా గోప్యత, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్రం కొత్త డేటా గోప్యతా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ►అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతల ను తీసుకోనుంది. డిసెంబర్ 1నుంచి 2023 న వంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల స మయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఐఎంఎఫ్ కోటా సమీక్ష సకాలంలో జరగాలి... కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. జీ20 బాధ్యతలు స్వీకరించనున్న భారత్తో పలు అంశాలపై చర్చించడానికి దేశంలో పర్యటిస్తున్న ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివాతో సమావేశం అనంతరం కోటా అంశంపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
తప్పు చేశావ్ ట్విటర్! రూ.1163 కోట్ల ఫైన్ కట్టాల్సిందే?
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్కి షాక్ మీద షాక్ తగులుతోంది. ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించారంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. చేసిన తప్పులకు జరిమానాగా 150 మిలియన్ డాలర్లు (రూ. 1,163 కోట్లు) ఫైన్ కట్టాలంటూ తీర్పు ఇచ్చింది. ట్విటర్ సంస్థ 2013 మే నుంచి 2019 సెప్టెంబరు మధ్యలో ట్విటర్ యూజర్లకు సంబంధించిన ఫోన్ నంబరు ఇతర కీలక సమాచారాన్ని అడ్వెర్టైజర్లకు ఇచ్చిందనే ఆరోపణల మీద యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ)లు విచారణ చేపట్టాయి. సుదీర్ఘ కాలం కొనసాగిన విచారణ అనంతరం యూజర్ల డేటా ప్రైవసీ కాపాడటంతో ట్విటర్ విఫలమైనట్టుగా తేల్చాయి. దీంతో 150 మిలియన్ డాలర్లు ఫైన్గా విధించింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామని, అదే విధంగా యూజర్ల డేటా సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో న్యాయస్థానం చేసిన సూచనలకు తప్పకుండా పాటిస్తామని ట్విటర్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియేన్ కైరన్ తెలిపారు. గతంలో ప్రైవసీ హక్కుల ఉల్లంఘన విషయంలో ఫేస్బుక్ 2019లో 5 బిలియన్ డాలర్లను జరిమానాగా చెల్లించింది. చదవండి: గుడ్బై ట్విటర్.. ఇక సెలవు.. -
ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త..! సరికొత్త ప్రణాళికతో గూగుల్..అదే జరిగితే..!
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ త్వరలోనే శుభవార్తను అందించనుంది. యూజర్ల ప్రైవసీ విషయంలో భారీ మార్పులను తెచ్చేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. దీంతో ఆండ్రాయిడ్ యూజర్లకు యాపిల్ తరహాలో భద్రత కలగనుంది. యాపిల్ బాటలో... యాపిల్ బాటలోనే గూగుల్ నడవనుంది. ఐఫోన్లకు అందించే యూజర్ ప్రైవసీను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు తెచ్చేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. 2021 ఏప్రిల్లో ఐఫోన్ల కోసం కొత్త యూజర్ ప్రైవసీ పాలసీని యాపిల్ తీసుకొచ్చింది. దీని సహాయంతో థర్డ్ పార్టీ యాప్స్ సదరు యూజర్ను ట్రాక్ చేయకుండా చేసే ఫీచర్ను యాపిల్ అందిస్తోంది. ఇదే ఫీచర్ ను గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు తెచ్చే పనిలో పడింది. ప్రైవసీ సాండ్ బాక్స్..! థర్డ్ పార్టీ యాప్ యూజర్ల డేటాను షేర్ చేసే విషయంలో గూగుల్ కొత్తగా ప్రైవసీ సాండ్ బాక్స్ ఫీచర్ ను తీసుకురానుంది. ప్రైవసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆంథోనీ చవెజ్ ఓ బ్లాగ్లో అభిప్రాయాలను వెల్లడించారు. ప్రైవేట్ అడ్వర్టయిజింగ్ సొల్యూషన్లు, కొత్త ప్రైవసీని తీసుకొచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని మేం ప్రకటిస్తున్నమని చెప్పారు. థర్డ్ పార్టీలతో డేటాను షేర్ చేయడాన్ని తగ్గిస్తామని చెప్పారు. కాగా ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. అయితే ఈ పాలసీల్లో ఈ మార్పులను తీసుకొచ్చేందుకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని, దీన్ని అమలు చేసేందుకు భాగస్వాములతో కలిసి గూగుల్ పని చేస్తుందని ఆంథోని వెల్లడించారు. మరో వైపు ఆండ్రాయిడ్ డివైజ్ల్లో ట్రాకింగ్ను కట్టడి చేస్తే చాలా సంస్థలకు ఇబ్బందిగా మారే అవకాశము ఉన్నట్లు తెలుస్తోంది. -
చైనాకు భారత్ మరో షాక్.. 54 చైనా యాప్లపై నిషేధం
న్యూఢిల్లీ: దేశ భద్రతకు, ప్రైవసీకి ప్రమాదంగా మారుతున్నాయంటూ మరో 54 చైనా మొబైల్ యాప్లను సోమవారం కేంద్రం నిషేధించింది. కేంద్ర హోం శాఖ సిఫార్సు మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ‘‘ఈ యాప్స్ యూజర్ల తాలూకు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని, ఎప్పటికప్పుడు శత్రు దేశపు సర్వర్లకు పంపుతున్నాయి. తద్వారా దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి సమస్యగా మారాయి. దేశ రక్షణకు కూడా ముప్పుగా తయారయ్యాయి’’ అని వివరించాయి. గెరెనా ఫ్రీ ఫైర్–ఇల్యుమినేట్, టెన్సెంట్ ఎక్స్రివర్, నైస్వీడియో బైదు, వివా వీడియో ఎడిటర్, బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్డీ, మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ప్లస్, వాల్యూమ్ బూస్టర్, వీడియో ప్లేయర్స్, యాప్లాక్, మూన్చాట్, బార్కోడ్ స్కానర్–క్యూఆర్ కోడ్స్కాన్ వంటివి ఈ జాబితాలో ఉన్నట్టు వివరించాయి. -
Facebook Whatsapp: దొంగచాటుగా మెసేజ్లు చదువుతూ..
ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్.. వాట్సాప్ మొదటి నుంచి ఇస్తున్న భద్రత హామీ. యూజర్ల మధ్య జరిగే వాట్సాప్ చాట్, అందులోని ఇతరత్ర సమాచారం ఎట్టిపరిస్థితుల్లో మూడో మనిషి చేతికి వెళ్లదంటూ చెప్తూ వస్తోంది. అయితే వాట్సాప్ ఓనర్ కంపెనీ ఫేస్బుక్ ఈ విషయంలో నైతిక విలువల్ని పక్కనపెట్టిందన్న ఆరోపణలు ఫేస్బుక్పై వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఇన్వెస్టిగేషన్ మీడియా సంస్థ ‘ప్రొపబ్లికా ఇన్వెస్టిగేషన్’ కథనం ప్రకారం.. కోట్లలో యూజర్ల వాట్సాప్ అకౌంట్లపై ఫేస్బుక్ కన్నేసిందని, ఆస్టిన్, టెక్సాస్, డబ్లిన్, సింగపూర్లలో వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఈ వ్యవహారం నడిపిస్తోందని ఆరోపించింది. వాట్సాప్ నిఘాపై కన్నేయడంతో పాటు ఈ వ్యవహారం కోసం ఫేస్బుక్ తన సొంత ఆల్గారిథంనే ఉపయోగిస్తోందని ఈ కథనం వెల్లడించింది. చదవండి: యూట్యూబ్ థంబ్నెయిల్స్ కన్నా దారుణంగా ఫేస్బుక్లో.. అయితే దొంగచాటుగా మెసేజ్లు చదువుతోందన్న ఆరోపణల్ని ఫేస్బుక్ ఖండించింది. కథనంలో ఆరోపిస్తున్న టీం.. వాట్సాప్ యూజర్ల ప్రైవసీని పరిరక్షించడమే పనిగా పెట్టుకుందని, యూజర్లు పంపించే రిపోర్ట్ అబ్యూజ్.. ఇతరత్ర ఫిర్యాదుల్ని సమీక్షించడం కోసమేనని చెప్పింది. ఎన్క్రిప్షన్ కారణంగా.. వాట్సాప్ కాల్స్, వ్యక్తిగత మెసేజ్లను ఫేస్బుక్ ఎట్టిపరిస్థితుల్లో చదవలేదని స్పష్టం చేసింది ఫేస్బుక్. అంతేకాదు ఫేస్బుక్ యూజర్ల విషయంలోనూ తాము భద్రతకు కట్టుబడి ఉన్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. 2014లో నాస్సెంట్ నుంచి వాట్సాప్ మెసేజింగ్ యాప్ను 19 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది ఫేస్బుక్. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి పైగా వాడుతున్న వాట్సాప్లో.. మొత్తంగా రోజుకి వెయ్యి కోట్లకి పైగా మెసేజ్లు పంపించుకుంటున్నారని అంచనా. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ల మధ్య సురక్షితమైన ఛాటింగ్ ఉంటుందని, యూజర్ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగబోదని ఫేస్బుక్-వాట్సాప్ ఎప్పటి నుంచో చెప్తోంది. క్లిక్: వాట్సప్ యూజర్లకు షాక్ -
మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు: సిద్ధార్థ్ కుటుంబం
బాలీవుడ్ నటుడు , బిగ్బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 40 ఏళ్ల ఈ నటుడి మరణవార్త విని ఎందరో బాలీవుడ్ ప్రముఖులు, అతని అభిమానులు షాక్కి గురయ్యారు. ఈ క్రమంలో నటుడి అంత్యక్రియల అనంతరం అభిమానులు, సన్నిహితులను ఉద్దేశించి సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. సిద్ధార్థ్ మరణంతో తాము షాక్లో ఉన్నామని.. ఈ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అతని జీవితంలో భాగమైన అందరికి సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్) "సిద్ధార్థ్ జీవితంలో భాగమై, అంతులేని ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఇక్కడితో ముగిసిపోలేదు. సిద్ధార్థ్ ఎల్లప్పుడూ మన గుండెల్లోనే నిలిచి ఉంటాడని’’ ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా సిద్ధార్థ్ తన ప్రైవసీకి ఎంతో విలువ ఇచ్చేవాడని, తాము అలాగే ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఆ విషయంలో తమను ఇబ్బంది పెట్టవద్దని సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు కోరారు. అతని అంతిమయాత్రకు సంబంధించి ఎంతో ఓపికతో వ్యవహారించిన ముంబై పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు. (చదవండి: 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు') హిందీలో హిట్ సీరియల్ బాలిక వధుతో గుర్తింపు పొందిన సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల్లో ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతోమంది సెలబ్రీటీలు సంతాపం తెలిపారు. సిద్ధార్థ్ మరణ వార్త తెలిసి అతని ప్రేయసీ, బిగ్బాస్ 13 పార్టిసిపెంట్ షెహనాజ్ కంటతడి పెట్టిన వీడియోలు నెటిజన్లను కలిచివేశాయి. వారిద్దరూ ఆ షో నుంచి "సిద్నాజ్"గా గుర్తింపు పొందారు. కాగా, వరుణ్ ధావన్, అలియా భట్ జంటగా నటించిన హంప్టీ శర్మకి దుల్హనియా సినిమాతో బాలీవుడ్కి పరిచయమైన సిద్ధార్థ్ అనతరం కొన్ని ప్రైవేట్ వీడియోల్లో నటించాడు. అందులో రెండింట్లో తన ప్రేయసి షెహనాజ్తో చేశాడు. సిద్ధార్థ్ తండ్రి చినప్పుడే మరణించగా ప్రస్తుతం తల్లితో పాటు ఇద్దరు అక్కలు ఉన్నారు. -
వాట్సాప్ స్కాన్.. ఫోన్లోని ఫొటోలన్నీ లీక్??
సోషల్ మీడియా యాప్లలో అభ్యంతకర కంటెంట్ వైరల్ కావడం ఈమధ్య కాలంలో పెరిగింది. ఈ తరుణంలో వాట్సాప్లోనూ అలాంటి వ్యవహారాలు నడుస్తుండగా.. ‘రిపోర్టింగ్’ ద్వారా సదరు యూజర్ అకౌంట్, గ్రూపుల మీద చర్యలు తీసుకుంటోంది వాట్సాప్. అయితే ఇలాంటి కంటెంట్ కట్టడి కోసం యాపిల్ తీసుకున్న ఓ నిర్ణయం.. యూజర్ ప్రైవసీకి భంగం కలిగించేదిగా ఉందన్న చర్చకు దారితీసింది. ఫొటో ఐడెంటిఫికేషన్ ఫీచర్ పేరిట ఐఫోన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలని.. తద్వారా వాట్సాప్ ఫొటోలను స్కాన్ చేసి ఆటోమేటిక్గా అభ్యంతరకర ఫొటోలను తొలగించే దిశగా యాపిల్ చర్యలు చేపట్టింది. కానీ, ఈ నిర్ణయాన్ని గట్టిగానే వ్యతిరేకిస్తోంది వాట్సాప్. ఈమేరకు వాట్సాప్ హెడ్ విల్క్యాథ్కార్ట్.. యాపిల్ కంపెనీ మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. అశ్లీలత కంటెంట్ గుర్తింపు-కట్టడి కోసం యాపిల్ ఎంతో కాలంగా కృషి చేస్తోంది. ఈ ప్రయత్నం అభినందనీయమే. కానీ, ఫొటో ఐడెంటిఫికేషన్ సాప్ట్వేర్ అనేది యూజర్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించాలనే ప్రయత్నంగా భావించాల్సి వస్తుంది అని విల్ పేర్కొన్నాడు. యాపిల్ రూపొందించబోయే సాఫ్ట్వేర్ కేవలం వాట్సాప్ స్కానింగ్తోనే ఆగదు. ఫోన్లోని వ్యక్తిగత ఫొటోలను, డేటాను సైతం స్కాన్ చేసే అవకాశం లేకపోలేదు. అంటే.. ఇది భద్రతాపరంగా కాకుండా.. యూజర్పై నిఘా వ్యవస్థలా పని చేస్తుంది. కాబట్టి ఇలాంటి టూల్స్ను వాట్సాప్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోదు. అని స్పష్టం చేశాడు విల్. మరోవైపు సైబర్ నిపుణులు కూడా వాట్సాప్ వాదనతో ఏకీభవిస్తున్నారు. ఇదిలా అశ్లీల కంటెంట్, ముఖ్యంగా చైల్డ్ ఎబ్యూజ్ కంటెంట్ కట్టడి కోసం చేసే ప్రయత్నమని యాపిల్ బలంగా చెప్తోంది. అయినప్పటికీ ‘రిపోర్ట్’ చేసే ఆప్షన్ యూజర్కి ఉండగా, వాళ్ల అనుమతి లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా ఫోన్ను, డివైజ్లను స్కానింగ్ చేయడం సరైందని కాదని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యాపిల్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. యూజర్ వ్యక్తిగత భద్రతపై ఎలాంటి హామీ ఇవ్వకుండానే.. ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఐవోస్, మాక్ఓస్, వాచ్ఓస్, ఐమెసేజ్ డివైజ్లలో వీలైనంత తొందరగా ఈ సాఫ్ట్వేర్ను యూజర్లకు అందించనున్నట్లు ప్రకటించింది. కొత్త వెర్షన్ అప్డేట్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ కథనాల మ్యాగజీన్ ‘ది వర్జ్’ ఓ కథనం ప్రచురించింది. -
మీ ఫేస్బుక్ అకౌంట్ భద్రమేనా..ఇలా చేస్తే బెటర్..!
ఇంటర్నెట్ యుగంలో ఫేస్బుక్ అకౌంట్ లేని వారు చాలా అరుదు. ఇతరులతో ఫేస్బుక్ మమేకమవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత్లో ఫేస్బుక్ అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్, మనలో చాలా మంది ఫేస్బుక్లో కాలక్షేపం చేస్తూ అందులో మునిగితేలుతాము. కాగా ప్రస్తుతం హాకర్లు ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలో యూజర్ల ఖాతాలనుంచి విలువైన సమాచారాన్ని పొందడానికి అనేక పద్దతులను వాడుతున్నారు. మన ఫేస్బుక్ ఖాతాలు హాకర్ల బారినుంచి తప్పించుకోవడానికి ఫేస్బుక్లో ఉండే సెట్టింగ్లతో హాకింగ్కు గురికాకుండా చూసుకోవచ్చును. మీ ఫేస్బుక్ ఖాతాను ఇలా భద్రపర్చుకోండి... స్టెప్ 1: ముందుగా మీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తరువాత కుడివైపు ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయండి. తరువాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీపై క్లిక్ చేయండి. స్టెప్ 2: మెను బార్ నుంచి ‘సెక్యూరిటీ అండ్ లాగిన్’పై క్లిక్ చేయండి. స్టెప్ 3: అందులో ‘వేర్ యూఆర్ లాగ్డ్ ఇన్’ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్ మీరు ఫేస్బుక్లో లాగిన్ అయిన సెషన్లను చూపిస్తోంది. అందులో మీరు గుర్తించని లాగిన్ సెషన్లు ఏమైనా ఉంటే, త్రీ-డాట్ మెనుపై క్లిక్ చేసి, ‘లాగ్ అవుట్’ను ఎంచుకోవడం ద్వారా వెంటనే సంబంధిత సెషన్ నుండి లాగ్ అవుట్ అవ్వండి. ఒకవేళ మీరు అన్ని సెషన్ల నుంచి ఒకేసారి లాగ్అవుట్ అయ్యే అప్షన్ కూడా ఉంటుంది. స్టెప్ 4: తరువాత, ‘లాగిన్’ ఆప్షన్ కింద ఉన్న , ‘సేవ్ యూవర్ లాగిన్ ఇన్ఫర్మేషన్’ పై క్లిక్ చేయండి. ఇలా చేయడంతో మీరు లాగిన్ సమాచారం సేవ్ అవుతుంది. ఇది కేవలం మీరు మీ పర్సనల్ కంప్యూటర్ ఐతేనే ఇలా చేయాలి. స్టెప్ 5: సెట్టింగ్ మెనులో ఉన్న ‘టూ ఫ్యాక్టర్ అథనిటికేషన్( 2FA)’పై క్లిక్ చేసిన తరువాత ‘యూజ్ టూ ఫ్యాక్టర్ అథనిటికేషన్’ పై ఎడిట్ అప్షన్ను క్లిక్ చేయాలి. అథనిటికేటర్ యాప్తో లాగిన్ కోడ్ను జనరేట్ చేయవచ్చును. లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చును. ఈ ప్రాసెస్లో వచ్చిన బ్యాక్ఆప్ కోడ్స్ను మర్చిపోకూడదు. ఇలా చేయడంతో మీరు ఎక్కడైనా లాగిన్ కావాల్సిఉంటే 2FA ద్వారా లాగిన్ అవాల్సి ఉంటుంది. ముందుగా మీ అకౌంట్ పాస్వర్డ్ను ఎంటర్ చేసిన తరువాత మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. లాగిన్ అయ్యే సమయంలో ఆరు అంకెల ఓటీపీ ఎంటర్ చేసిన తరువాతనే మీ అకౌంట్ మీ ముందు ప్రత్యక్షమైతుంది. స్టెప్ 6: ‘సెట్టింగ్ ఆప్ ఎక్సట్రా సెక్యూరిటీ’ అప్షన్ మీద క్లిక్ చేసి, లాగిన్ అలర్ట్ సెట్టింగ్ను అన్ చేయాలి. ఇది లాగిన్ అలర్ట్ ను అందిస్తోంది. ఒకవేళ మీ ఫేస్బుక్ అకౌంట్లోకి వేరే మొబైల్ నుంచి లాగిన్ అయితే వెంటనే గుర్తించి మీకు ఈ-మెయిల్ లేదా ఫేస్బుక్ మెసేంజర్కు మెసేజ్ను పంపి హెచ్చరిస్తుంది. స్టెప్ 7: చివరగా, ‘సెట్టింగ్ ఆప్ ఎక్సట్రా సెక్యూరిటీ’ ఆప్షన్లో భాగంగా ఫేస్బుక్లోని మీ ముగ్గురు నుంచి ఐదు స్నేహితులను ఎంచుకోండి. దీంతో మీరు ఎప్పుడైనా మీ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతే వారి అకౌంట్లనుపయోగించి లాగిన్ అవ్వచ్చును. చదవండి: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కొత్త బెడద..! వారికి మాత్రం పండగే... -
భర్త ఫోన్పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు
దుబాయ్: ''నా అనుమతి లేకుండా భార్య తన ఫోన్లోని ఫోటోలను వేరేవాళ్లకు పంపించి ప్రైవసీకి భంగం కలిగించింది. నాపై నిఘా పెట్టిందని.. అది నాకు ఇష్టం లేదని.. నష్ట పరిహారం ఇప్పించాలంటూ'' కోర్టుకెక్కాడు. అతని వాదనలు విన్న కోర్టు వ్యక్తి భార్యకు 5,400 దిర్హమ్లను నష్టపరిహారంగా చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. ఈ వింత ఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. అబుదాబికి చెందిన దంపతులు పెళ్లైన కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కాలం గడిచు కొద్ది భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. తన భర్త ఆమెకు తెలియకుండా ఫోన్లో ఏవో సీక్రెట్స్ దాస్తున్నాడని తనలో తాను భావించింది. ఈ క్రమంలో ఆమె తన భర్త ఫోన్పై నిఘా పెట్టింది. అంతటితో ఊరుకోకుండా తన భర్త ఫోన్లో ఉన్న ఫోటోలను అతనికి తెలియకుండా తన వాళ్లకే పంపించింది. విషయం తెలుసుకున్న భర్త భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. భర్త తరపు లాయర్ మాట్లాడుతూ... '' తన క్లయింట్ వ్యక్తిగత గోప్యతను అతని భార్య హరించింది. అతని అనుమతి లేకుండా ఫోటోలను కుటుంబసభ్యులకు పంపించి అతన్ని మానసిక ఒత్తిడికి గురయ్యేలా చేసింది. ఈ కేసు కారణంగా అతను ఉద్యోగానికి కూడా వెళ్లలేకపోయాడని.. దీంతో అతను ఆర్థికంగా నష్టపోయాడు'' అని తన వాదన వినిపించాడు. ఇంతలో భార్య తరపు లాయర్ మాట్లాడుతూ.. తన క్లయింట్ ఎటువంటి తప్పు చేయలేదని.. భర్త చేతిలో తాను మానసిక క్షోభను అనుభవించిందని తెలిపాడు. ఇరువరి వాదనలు విన్న కోర్టు భర్త ప్రైవసీకి భంగం కలిగించి అతని గోప్యతను దెబ్బతీసిన అతని భార్యకు 5,400 దిర్హమ్లు( రూ. లక్ష) నష్టపరిహారంగా చెల్లించాలంటూ వినూత్న తీర్పు ఇచ్చింది. చదవండి: ఫ్లైట్లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్ ‘క్యూబూల్ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు -
కేంద్రం కొత్త నిబంధనలపై వాట్సాప్ న్యాయపోరాటం
-
WhatsAp: కొత్త ఐటీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చిన నూతన డిజిటల్ (ఐటీ) నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలియజేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల సదుపాయం తమ ఖాతాదారులకు ఉందని గుర్తుచేసింది. సందేశం పంపినవారు, స్వీకరించిన వారు తప్ప ఇతరులు ఆ మెసేజ్లను చదివే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం కోరినపుడు లేదా కోర్టులు అడిగినపుడు తొలుత సందేశాన్ని సృష్టించిన వారిని గుర్తించాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయని, ఇది సరైన విధానం కాదని వెల్లడించింది. దీనివల్ల ఖాతాదారుల గోప్యతకు భంగం కలుగుతుందని వాట్సాప్ ఆందోళన వ్యక్తం చేసింది. వాట్సాప్లో ఒక సందేశం మొదట ఎక్కడ పుట్టింది, దాన్ని మొదట ఎవరు సృష్టించారు అనేది గుర్తించి, ధ్రువీకరించాలని ఆదేశించడం... గోప్యత హక్కుకు భంగకరమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. పౌర సమాజంతో కలిసి పనిచేస్తాం: వాట్సాప్ కొత్త ఐటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో తాము వ్యాజ్యం దాఖలు చేయడం నిజమేనని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలియజేశారు. ‘‘కొత్త డిజిటల్ నిబంధనలు అనుచితంగా ఉన్నాయి. వాట్సాప్లో ఒకరికొకరు పంపుకొనే మెసేజ్లను ట్రేస్ చేయాలని, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వం చెబుతోంది. ఇలా చేయడం అంటే వాట్సాప్లో షేర్ అయ్యే ప్రతి ఒక్క మెసేజ్ తాలూకు సమాచారాన్ని భద్రపర్చమని కోరడమే. అలాగే ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేసినట్లు అవుతుంది. కోట్లాది మంది ప్రజల గోప్యత హక్కును కూడా పణంగా పెట్టినట్లే. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులైన... గోప్యత హక్కు, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే హక్కును ఉల్లంఘించడమే’ అని బుధవారం వాట్సాప్ పేర్కొంది. డాక్టర్లు– పేషెంట్లు, లాయర్లు– కక్షిదారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు... ఇలా ఎందరో వాట్సాప్ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని పంచుకుంటారంది. తమ ఖాతాదారుల ప్రైవసీని కాపాడడానికి పౌర సమాజంతో, ప్రపంచవ్యాప్తంగా నిపుణులతో కలిసి పని చేస్తామని తెలిపింది. 36 గంటల్లోగా తొలగించాల్సిందే.. సామాజిక మాధ్యమాల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు–2021ను ప్రకటించింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఏదైనా కంటెంట్ను తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే సోషల్ మీడియా కంపెనీలు 36 గంటల్లోగా తొలగించాలి. ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిపై స్పందించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్టు ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించుకోవాలి. అభ్యంతరకరమైన సందేశాలు, అశ్లీల ఫొటోలు, వీడియోలను (పోర్నోగ్రఫీ) తొలగించడానికి ఆటోమేటెడ్ ప్రాసెస్ వాడాలి. ఏదైనా సందేశాన్ని/ సమాచారాన్ని మొదట ఎవరు సృష్టించారనేది గుర్తించే ఏర్పాటు ఉండాలని కొత్త నిబంధనల్లోని రూల్ 4(2) చెబుతోంది. దీనినే వాట్సాప్ కోర్టులో సవాల్ చేసింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి నూతన ఐటీ నిబంధనలను అంగీకరించడానికి కేంద్రం 3నెలల గడువిచ్చింది. ఇది మంగళవారంతో ముగిసింది. సోషల్ మీడియా సంస్థలకు ఇదివరకు ‘మధ్యవర్తి హోదా’తో రక్షణ ఉండేది. తమ ఖాతాదారులు పోస్ట్ చేసే కంటెంట్కు సంబంధించి వీటిపై క్రిమినల్ కేసులు, నష్టపరిహారం కేసులకు వీల్లేకుండా ఈ మధ్యవర్తి హోదా కాపాడేది. కొత్త ఐటీ నిబంధనలను అంగీకరించకపోతే ఈ ‘మధ్యవర్తి హోదా’ను కోల్పోతాయి. ఫలితంగా ఎవరు, ఏది పోస్ట్ చేసినా దానికి ఈ సామాజిక మాధ్యమాలు బాధ్యత వహించాల్సి వస్తుంది. అత్యంత తీవ్ర నేరాలను అడ్డుకునేందుకే! కొత్త నిబంధనలన్న ఐటీ శాఖ న్యూఢిల్లీ: దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే అత్యంత తీవ్ర నేరాలకు సంబంధించిన విషయాల్లో సోషల్ మీడియాలో ప్రచారమైన సందేశాల మూలం తెలుసుకునేందుకే కొత్త డిజిటల్ నిబంధనలను తీసుకువచ్చామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. వ్యక్తుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర ఐటీ శాఖ పేర్కొంది. విదేశాలతో సత్సంబంధాలు, దేశ రక్షణ, దేశంలో శాంతి భద్రతలు మొదలైనవాటికి విఘాతం కలిగించే అవకాశమున్న నేరాలు, లైంగిక నేరాలు, చిన్నారులపై లైంగిక దాడులు తదితరాలను అడ్డుకోవడానికి, అలాంటి తీవ్ర నేరాల విచారణకు సంబంధిత సోషల్ మీడియా సందేశాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో, ఎలా వ్యాప్తి చెందాయో తెల్సుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాంటి సందేశాల వివరాలు వాట్సాప్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పంచుకోవాల్సి ఉంటుందని వివరించింది. డిజిటల్ నిబంధనలను ‘వాట్సాప్’ చివరి నిమిషంలో కోర్టులో సవాలు చేయడం దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల్లో అమల్లో ఉన్న నిబంధనలతో పోలిస్తే.. భారత్ ప్రతిపాదిస్తున్న నిబంధనలు అంత తీవ్రమైనవి కావని వెల్లడించింది. ప్రైవసీ హక్కును ప్రాథమిక హక్కుగా తమ ప్రభుత్వం గుర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనలతో వాట్సాప్ సాధారణ కార్యకలాపాలకు, వాట్సాప్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఐటీ మంత్రి రవిశంకర్ తెలిపారు. వారి కాంటాక్ట్ వివరాలు ఇవ్వండి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలను పాటించే విషయంలో తాజా పరిస్థితిని తక్షణమే తమకు తెలియజేయాలని కేంద్ర ఐటీ శాఖ ప్రధాన సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. అప్రమత్తతతో వ్యవహరించాలంది. తాజా సోషల్ మీడియా నిబంధనల్లో పేర్కొన్న మేరకు.. భారత్లోని తమ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్ల వివరాలను తమకు అందించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. సంబంధిత సామాజిక మాధ్యమానికి చెందిన యాప్ పేరు, వెబ్సైట్ పేరు, అందించే సేవలు వివరాలను తెలియజేయాలంది. ఒకవేళ తాము ఈ నిబంధనల పరిధిలోకి రామని భావిస్తే అందుకు కారణాలను వెల్లడించాలి. సాధ్యమైనంత త్వరగా, వీలైతే ఈ రోజే తాము కోరిన వివరాలను అందించాలని బుధవారం ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర ప్రధాన సోషల్ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఆదేశాలను పాటించని పక్షంలో అవి ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌలభ్యాలను కోల్పోవడంతో పాటు, వాటిపై వచ్చే ఫిర్యాదులపై చట్టబద్ధంగా క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని హెచ్చరించింది. ఇదీ ‘సోషల్ పవర్’ సోషల్ మీడియా వేదికలకు భారత్ అతిపెద్ద మార్కెట్గా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలో వివిధ సంస్థలకు ఉన్న వినియోగదారుల సంఖ్య ఇలా ఉంది. వాట్సాప్ 53 కోట్లు ఫేస్బుక్ 41 కోట్లు యూట్యూబ్ 44.8 కోట్లు ఇన్స్టాగ్రామ్ 21 కోట్లు ట్విట్టర్ 1.75 కోట్లు -
ప్రమాదంలో 10 కోట్ల మంది మొబైల్ యూజర్ల డేటా
స్మార్ట్ఫోన్ల వాడకం రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూ పోతుంది. దీని వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఈ స్మార్ట్ఫోన్తో పనులు ఈజీగా మారాయని సంతోషించే లోపే సైబర్ నేరగాళ్ల దాడితో భద్రత కరువై పోతోంది. కరోనా కాలంలో సైబర్ దాడులు ఎక్కువ అయ్యాయి. తాజాగా చెక్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు కొన్ని ఆండ్రాయిడ్ యాప్లు స్మార్ట్ ఫోన్ యూజర్ల డేటాను కాజేస్తున్నట్లు వెల్లడించారు. చెక్పాయింట్ రీసెర్చ్ పరిశోధకులు ఈ యాప్ల జాబితాను విడుదల చేశారు. భారీగా డౌన్లోడ్ చేసిన కొన్ని ప్రసిద్ధ యాప్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి పలు యాప్లను 10 కోట్ల మంది తమ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ యాప్ల్లో కొన్ని ఆస్ట్రాలజీ, ఫ్యాక్స్, ట్యాక్సీ సర్వీసెస్, స్క్రీన్ రికార్డింగ్ కు సంబంధించినవి ఉన్నాయని చెక్పాయింట్ రీసెర్చ్ నివేదిస్తుంది. వీటిలో ముఖ్యంగా ఆస్ట్రోగురు, టీలావా (ట్యాక్సీ యాప్), యాప్ లోగో మేకర్ వంటి యాప్లున్నాయి. ఈ యాప్ల్లోని లోపాల కారణంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉంది. ఈ-మెయిల్, పాస్వర్డ్, పేరు, పుట్టిన తేదీ, లింగ సమాచారం, ప్రైవేట్ చాట్, పరికర స్థానం, వినియోగదారు ఐడెంటిఫైయర్లు వంటి సమాచారం ఇందులో ఉంది. ఆ మాల్వేర్ యాప్లు వినియోగదారు సమాచారం, డేటాను సేకరిస్తున్నాయి కాబట్టి ఈ యాప్స్ ను వెంటనే డిలీట్ చేయాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న వాట్సాప్ -
రెండు స్మార్ట్ఫోన్లు.. అద్భుత కెమెరా (స్పాన్పర్డ్)
వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై శాంసంగ్ పలు అప్డేట్స్ అందిస్తోంది. వీటిలో మీ గ్యాలరీ, వెబ్బ్రౌజర్, వాట్సాప్ వంటి యాప్స్ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్స్ మధ్య మార్చేందుకు వెసులుబాటు కల్పించే క్విక్ స్విచ్ కీలకమైనది. ఫీచర్ భాగస్వామి, హెచ్టీ బ్రాండ్ స్టూడియో మనం తీపిజ్ఞాపకాలను నిక్షిప్తం చేయడం, ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడటం, ఓటీటీ కంటెంట్ వీక్షించడం, స్కూల్/వర్క్ కోసం వీడియో కాల్స్ మాట్లాడటం, నోట్స్ రాసుకోవడం వంటి పలు పనులను చక్కబెట్టేందుకు మనం స్మార్ట్ఫోన్లను వాడుతుంటాం. నిత్య జీవితంలో ప్రతి విషయంలోనూ స్మార్ట్ఫోన్లు మనకు ఉపకరిస్తున్నాయి గేమింగ్, ఫోటోలను క్లిక్ చేయడం, ప్రొఫెషనల్ వర్క్ పూర్తి చేయడం వంటి అన్ని అవసరాలను నెరవేర్చేలా శాంసంగ్ గెలాక్సీ ఏ51, దీని బిగ్ బ్రదర్ గెలాక్సీ ఏ71అందుబాటులోకి వచ్చాయి. రెండు స్మార్ట్ఫోన్లు అద్భుతమైన స్క్రీన్, అత్యద్భుత కెమేరా, దీర్ఘకాలం మన్నే బ్యాటరీ లైఫ్ అనుభవాన్ని మనకు అందస్తాయని శాంసంగ్ భరోసా ఇస్తోంది. ►గెలాక్సీ ఏ51 ఈఏడాది తొలి క్వార్టర్లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్గా నిలిచిందని పరిశోధన సంస్థ స్ట్రేటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది ►మరి వీటిలో ఇంకా మెరుగైన విషయం ఏంటంటే ఈ స్మార్ట్ఫోన్లతో మీరు మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్గా ఉంచే అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. అల్ట్ జడ్ జీవితం : ప్రైవసీకి ప్రాధాన్యం నేటి ఆధునిక జీవితంలో జనరేషన్ జడ్, మిలీనియల్స్ వారి స్మార్ట్ఫోన్లకు సంబంధించి పలు ప్రైవసీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ అల్ట్ జడ్ జీవితానికి మార్గం సుగమం చేసింది. మీ ప్రైవసీపై ఎలాంటి ఆందోళనకు గురవకుండా గెలాకీ ఏ51, గెలాక్సీ ఏ71తో మీరు అన్ని ఫీచర్లను మీరు ఆస్వాదించవచ్చు. ►మీ స్మార్ట్ఫోన్ను చూస్తామని మీ స్నేహితులు, సోదరులు అడిగిన ప్రతిసారీ ఎంతో అసౌకర్యంగా ఫీలవుతుంటా. వారు మీరు తీసిన ఓ ఫోటో కోసమో, మీరు సూచించిన గేమ్ను ఆడేందుకో వారు మీ స్మార్ట్ఫోన్ను అడిగినా మీరు కొంత అసౌకర్యానికి లోనవుతుంటారు. ►ఈ సమయాల్లో మీరు ఎలాంటి ఆందోళన, విచారం లేకుండా మీ స్మార్ట్ఫోన్ను వారికి అందించే రెండు ఫీచర్లను శాంసంగ్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై ప్రవేశపెట్టింది. ►క్విక్ స్విచ్ పేరుకు తగ్గట్టే మీ స్మార్ట్ఫోన్లో మీరు గ్యాలరీ, వాట్సాప్, ఇతర యాప్స్ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్లోకి వేగంగా మార్చేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. పవర్ బటన్ను రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా ఈ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు. ఆఫీస్లో మీరు ప్రెజెంటేషన్ ఇవ్వడం, మీ ఆఫీస్లో పార్టీకి సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులకు చూపే సందర్భాల్లో క్విక్ స్విచ్ మీకు మీ జీవితాన్ని కాపాడే కీలక ఫీచర్గా ముందుకొస్తుంది. ►ఇక స్మార్ట్ఫోన్లో పొందుపరిచిన ఏఐ ఆధారిత సొల్యూషన్గా ఇంటెలిజెంట్ సజెషన్స్ గ్యాలరీలో ప్రైవేట్ వెర్షన్లో భద్రంగా కాపాడే ఫోటోలను గుర్తించి సూచనలు చేస్తుంది. వారాంతం వెకేషన్ నుంచి నేరుగా ఆఫీస్కు వెళ్లడం వంటి పలు సందర్భాల్లో ఈ ఫీచర్ మీకు ఉపకరిస్తుంది. ప్రైవేట్గా ఉంచదలిచిన ఫోటోలు,ఇమేజ్లను మీరు ఎంపిక చేస్తే వాటిని ఎవరి కంటా పడకుండా ఏఐ మిగిలిన పని చక్కబెడుతుంది. ప్రముఖ వినూత్న ప్రైవసీ ఫీచర్లు ►నటి రాధికా మదన్ క్విక్ స్విచ్ పవర్ను ఉపయోగించి తన సోదరి (శిఖా తల్సానియ) ఆమె ఊహించిన దాని కంటే భిన్నమైనవి చూసేలా చేశారో గమనించవచ్చు ►ఫీచర్లను మరింత మెరుగ్గా అర్దం చేసుకోవడానికి వీడియోను వీక్షించండి ►ఈ తరహా ప్రైవసీని ఆస్వాదించేందుకు ఎవరు మాత్రం ఇష్టపడరు? గెలాక్సీ ఏ51, ఏ71 స్మార్ట్ఫోన్ల హార్డ్వేర్, సాఫ్ట్వేర్లో బహుళ భద్రత లేయర్లతో కూడిన శాంసంగ్ నాక్స్ భద్రతతో క్విక్ స్విచ్ రూపొందింది. విశిష్ట కెమెరా ఫీచర్లు ఈ రెండు ఫోన్ల విశిష్ట కెమెరా ఫీచర్లను పరిశీలిద్దాం ►మీ ఫ్రెండ్ రన్నింగ్ రేస్ ఫోటోను సమగ్రంగా కెమెరాలో క్లిక్ చేయాలనుకుంటున్నారా? ఇండియా గేట్ వైడ్ యాంగిల్ షాట్ తీయాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్ పోర్ట్రయిట్ను కెమెరాలో బంధించాలనుకుంటున్నారా? ఆకుపై వాలిన కీటకాన్ని ఫోటో తీయాలనుకుంటున్నారా? గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71తో ఇవన్నీ సాధ్యమే. ఈ రెండు స్మార్ట్ఫోన్లు తమ సొంతవైన క్వాడ్-కెమెరా సెటప్స్తో ముందుకొచ్చాయి. ►గెలాక్సీ ఏ51 స్మార్ట్ఫోన్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 12-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో ముందుకొచ్చింది. ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ►ఇక గెలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్పై 64-మెగాపిక్సెల్ లెన్స్, 12-మెగాపిక్సెల్ అల్ర్టా-వైడ్ లెన్స్లు, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, రియర్పై 5-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ►గెలాక్సీ ఎస్20 నుంచి అద్భుత కెమెరా ఫీచర్లను గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లకు శాంసంగ్ అందిస్తోంది. మిమ్మల్ని ఉద్వేగానికి గురిచేసే ఫీచర్లను ఓసారి ప్రయత్నించండి సింగిల్ టేక్ : ఇది గెలాక్సీ ఎస్20ల్లో ఉత్తమ ఫీచర్, ఇది ఇప్పుడు గెలాక్సీ ఏ51పై అందుబాటులో ఉండటం వినియోగదారులకు సంతోషకరమైన అంశం. సింగిల్ టేక్ ఫీచర్ 10 ఫోటోలు, వీడియోల వరకూ క్యాప్చర్ చేస్తుంది. సరైన ఫోటోను ఎలా ఫ్రేమ్ చేయాలని మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. కెమెరాను ఓపెన్ చేసి సింగిల్ టేక్ను సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ►ఫోటోలను చూసేందుకు గ్యాలరీకి వెళ్లడం మామూలే. శాంసంగ్ సింగిల్ టేక్ ఫీచర్ మీ ఫోటోల్లో బెస్ట్ షాట్స్, మొమెంట్స్ను ఎంపిక చేసి వాటన్నింటినీ ఒక ఆల్బమ్లో అమర్చుతుంది. ఏఐని వాడుతూ మీరు షార్ట్ మూవీని, జీఐఎఫ్ యానిమేషన్స్ను, పలు స్టైలైజ్డ్ ఇమేజ్లను పొందవచ్చు. నైట్ హైపర్లాప్స్ : పర్యాటకుడిగా నగరాన్ని చుట్టిరావడం గొప్ప అనుభూతి. ఆ క్షణాలను ఫోటోలుగా మలచి ఆ తర్వాత వాటిని చూసి మురిసిపోవడం మనందరం ఇష్టంతో చేసే పనే. ప్రజలు తమ సమయాన్ని ఆస్వాదించే వీడియోలను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించే హైపర్లాప్స్ ఫీచర్కు ఆదరణ పెరుగుతోంది ►శాంసంగ్ నైట్ హైపర్లాప్స్ ఫీచర్ ద్వారా గెలాక్సీ ఏ51పై హైపర్లాప్స్ వీడియోలు అర్ధరాత్రిలో క్యాప్చర్ చేసినా అత్యంత స్పష్టంగా, బ్రైట్గా ఉంటాయి. లాంగ్-ఎక్స్పోజర్ షాట్లను కాంతి, చలన మార్గాలతో వీడియో ఆర్ట్ పనిగా మార్చబడతాయి. కస్టమ్ ఫిల్టర్ : మీ ఫోటోలపై మీరు సొంతంగా వినూత్నంగా తీర్చిదిద్దుకునే నూతన పద్ధతిని ఇది అందుబాటులోకి తీసుకువస్తుంది. కలర్స్ను ఎంపిక చేసుకోవడం నుంచి భిన్నమైన షేడ్స్తో కూడిన బ్యాక్గ్రౌండ్ను మార్చడం వరకూ మీకు వెసులుబాటు కల్పిస్తుంది. న్యూ కస్టమ్ ఫిల్టర్ మోడ్ మీకు విస్తృత ఊహాశక్తికి ఊతమిస్తుంది. స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ : ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటే కెమెరా తెలివిగా వైడ్ యాంగిల్ మోడ్లోకి వెళుతుంది. ప్రతిసారి అద్భుత సెల్ఫీలు తీసుకోవచ్చు. క్విక్ వీడియో : కెమెరా బటన్ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా క్విక్ వీడియోను తీసుకోవచ్చు. వీడియో మోడ్ను పొందేందుకు సెట్టింగ్స్లో కుస్తీ పడుతూ వీడియో తీసే సమయాన్ని మిస్ అవడం వంటి రోజులకు కాలం చెల్లింది. మీ స్మార్ట్ఫోన్ తీసుకుని కెమెరా బటన్ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ప్రత్యేక క్షణాలను వెంటనే రికార్డ్ చేయవచ్చు. మీ ఫ్రెండ్ రన్నింగ్ రేసు లేదా మీ బర్త్డే పార్టీలో మీ బంధువు పాట పాడటం వంటివి ఏవైనా వెంటనే వీడియో రికార్డు చేయవచ్చు. రికార్డింగ్లో స్విచ్ కెమెరా : ఫ్రంట్ నుంచి రియర్ కెమెరాకు మారేందుకు రికార్డింగ్ను నిలిపివేయడం, మళ్లీ ఫ్రంట్ కెమెరాకు మారడం వంటివి ఏమంత సౌకర్యంగా ఉండవు. గెలాక్సీ ఏ51లో లభించే ఫీచర్తో మీ మధురమైన క్షణాలను ఎలాంటి అవాంతరం లేకుండా రికార్డింగ్ చేస్తూనే ఫ్రంట్, రియర్ కెమెరాలకు మారే వెసులుబాటు ఉంటుంది ఏఐ గ్యాలరీ జూమ్: ఏఐ గ్యాలరీ జూమ్తో మీ శాంసంగ్ స్మార్ట్ఫోన్ తక్కువ రిజల్యూషన్ కలిగిన ఇమేజ్ల నాణ్యతను మెరుగుపరిచేందుకు అనుమతిస్తుంది. బ్లర్, పిక్సలేటెడ్ ఇమేజ్లను ఆర్ట్ వర్క్స్గా మెరుగుపరుస్తుంది గెలాక్సీ ఏ51 గురించి మరిన్ని వివరాలు ►ఇది రెండు వెర్షన్లలో లభిస్తుంది ►6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ - రూ . 22,999 ►8జీబీ ర్యామ్ మరియు 128జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ - రూ . 24,499 ►ఈ రెండు వెర్షన్లు ప్రిస్మ్ క్రష్ వైట్, ప్రిస్మ్ క్రష్ బ్లాక్, ప్రిస్మ్ క్రష్ బ్లూ, హేజ్ క్రష్ సిల్వర్ వంటి నాలుగు రంగుల్లో లభిస్తాయి. గెలాక్సీ ఏ51 కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ►గెలాక్సీ ఏ51 6.5 ఇంచ్ల సూపర్ అమోల్డ్ ఫుల్- హెచ్డీ+ (1080x2400 పిక్సెల్స్) డిస్ప్లేతో ముందుకొస్తోంది. ఆక్టా-కోర్ ఎక్సినాక్స్9611 ఎస్ఓసీ ఆధారిత పంచీ డిస్ప్లేతో అందుబాటులో ఉంది. మీరు మీ స్నేహితులు ఎలాంటి అసౌకర్యానికి లోనవకుండా ఫోటోలను, యూట్యూబ్ వీడియోలను వీక్షించదగిన గొప్ప వీక్షణా యాంగిల్స్తో కూడిన డిస్ప్లే ఆకట్టుకుంటుంది. ►ఈ స్మార్ట్ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అందుబాటులో ఉంది. దీర్ఘకాలం గేమింగ్, అపరిమిత వాచింగ్ సెషన్స్కు సరిపడా చార్జింగ్ సామర్ధ్యం కలిగిఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఒన్ యూఐ 20 సాఫ్ట్వేర్పై ఈ స్మార్ట్ఫోన్ రన్ అవుతుంది. గెలాక్సీ ఏ 71పై ఇతర మెరుగైన ఫీచర్లు ►గెలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్ 6.7 ఇంచ్ల (1080x2400 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-0 సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730 ఓక్టా-కోర్ చిప్సెట్తో ముందుకొచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్తో దైనందిన జీవితంలో భిన్నమైన టాస్క్లను నిర్వర్తించే వెసులుబాటు కల్పిస్తుంది. ►4500 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్తో పాటు 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కల్పిస్తుంది. గెలాక్సీ ఏ71 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ . 29,499 ►ఆకర్షణీయ ప్యాకేజ్, దీర్ఘకాల వీక్షణ, కాల్ ఆఫ్ డ్యూటీ : రెండు స్మార్ట్ఫోన్లపై మొబైల్ సెషన్లు, ఫోటో షూట్లు ఆహ్లాదభరిత అనుభూతిని అందిస్తాయి. వాటిపై ఏ టాస్క్ను మీరు ప్రయత్నించినా విశ్వాసంతో వాటిని నిర్వర్తిస్తాయి. అంతేనా..మీ స్మార్ట్ఫోన్ గోప్యతను చెక్కుచెదరకుండా ఉంచడం గురించి మీరు ఇక బాధపడరు! -
ఇది చాలా సరళమైన ప్రక్రియ! (స్పాన్పర్డ్)
మీ స్మార్ట్ఫోన్ ప్రైవసీ కష్టాలన్నింటికీ శాంసంగ్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ సరైన సమాధానం. జనరేషన్ జడ్, మిలీనియల్స్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫీచర్లు యూజర్కు పూర్తి ప్రైవసీని అందించడమే కాకుండా మనశ్శాంతిని అందిస్తాయి. పూర్తి వివరాలను పరిశీలిద్దాం.. ఫీచర్ భాగస్వామి : హెచ్టీ బ్రాండ్ స్టూడియో ఇలా ఊహించుకోండి : మీరు ఆఫీసులో ఉండగా మీ బాస్పై చేసిన మీమ్స్ను చూసేందుకు మీ కొలీగ్స్ మీ ఫోన్ చుట్టూ గుమికూడారు. మీతో సహా వారంతా ఆ మీమ్స్ చూసి నవ్వు ఆపుకోలేని పరిస్ధితి. హఠాత్తుగా మీ బాస్ అక్కడ ప్రత్యక్షం కావడంతో మీరు అచేతనంగా చూస్తుండిపోయారు. బాస్ నా ఫోన్ అడిగితే అప్పుడు ఏం చేయాలి? తర్వాత ఏమవుతుంది? అని మీ మనసులో అలజడి రేపుతుంది. ఇలాంటి క్షణాల్లో మీమ్ కనిపించని వెర్షన్లోకి మారిపోయే ఫీచర్ మీ ఫోన్లో ఉండటం మీరు ఇష్టపడతారు కదా? దీన్ని మీకు మేం అందిస్తాం! క్విక్ స్విచ్ : కేవలం డబుల్ క్లిక్తో మీ ప్రైవసీ పటిష్టం క్విక్ స్విచ్ పేరిట శాంసంగ్ వినూత్నమైన ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్లో క్షణాల వ్యవధిలో ఫోటోలను ప్రైవేట్ నుంచి మెయిన్ గ్యాలరీకి తరలించవచ్చు. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడంతోనే ఈ వెసులుబాటు లభిస్తుంది. ఇది చాలా సరళమైన ప్రక్రియ! ఈ ఫీచర్ నటి రాధికా మోహన్కు ఎలా ఉపయోగపడిందో చూద్దాం. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై అందుబాటులో ఉన్న క్విక్ స్విచ్ వాట్సాప్, బ్రౌజర్, ఇతర యాప్ప్పైనా పనిచేస్తుంది. దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. జనరేషన్ జడ్, మిలీనియల్స్ కోరుకునే వెసులుబాటు, అవాంతరాలు లేని అనుభూతిని క్విక్ స్విచ్ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇది మీ వ్యక్తిగత జీవితానికి రహస్య లాకర్గా మీరు భావించవచ్చు ఫ్రెండ్ లేదా కొలీగ్కు స్మార్ట్ఫోన్లు ఇవ్వాలంటే తటపటాయించే రోజులు పోయాయి. వారికి ఫోన్ ఇస్తే వారు నా కంటెంట్, చాట్లను చూస్తారు కదా ? అనే భయాలు యూజర్ మనసులో మెదిలేవి. వీటన్నింటికీ క్విక్ స్విచ్ సరైన సమాధానంగా ముందుకొచ్చింది. మరోవైపు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై ఉండే సెక్యూర్ ఫోల్డర్లో ఉండే ఆయా యాప్స్ ప్రైవేట్ వెర్షన్లను శాంసంగ్ నాక్స్ భద్రత కాపాడుతుంది. క్విక్ స్విచ్తో కూడిన మీ స్మార్ట్ఫోన్ను నిరభ్యంతరంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఎవరికైనా ఇవ్వవచ్చు. మీ ఫోన్ లాక్ చేయడం మరిచిపోయినా భయపడాల్సిన పనిలేదు! మీ ప్రైవేట్ సమాచారాన్ని మీరు మినహా మరెవరూ చూడకుండా క్విక్ స్విచ్ కాపాడుతుంది. ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ - మీకు అవసరమని మీరు ఊహించని వినూత్న ఆవిష్కరణ శాంసంగ్ ప్రైవసీ వినూత్న ఫీచర్లకు జోడింపుగా ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. స్మార్ట్ఫోన్లో నిర్మితమైన ఏఐ ఫీచర్గా ఇది గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లకు పూర్తి ప్రైవసీని కల్పిస్తుంది. ముందుగా గుర్తించిన ఫోటోల ఆధారంగా ఆయా ఫోటోలను సెక్యూర్ ఫోల్డర్కు ఇది తరలిస్తుంది. మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ వీడియో వీక్షించండి మీరు మీ సోదరికి చెప్పకుండా హాజరైన పార్టీకి సంబంధించిన ఫోటోలను ఆమె కంటపడటం నుంచి ఈ ఫీచర్ మిమ్మల్ని కచ్చితంగా కాపాడుతుంది. మధ్యశ్రేణి సెగ్మెంట్ను బలోపేతం చేసిన శాంసంగ్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లతో ఒత్తిడి రహిత అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్తో మీ స్పేస్ ఎప్పటికీ మీకు సురక్షితమైన స్పేస్గానే ఉంటుంది. జనరేషన్ జడ్, మిలీనియల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ ఫీచర్లు యూజర్కు పూర్తి ప్రైవసీని, మనశ్శాంతిని అందిస్తాయి. స్మార్ట్ఫోన్లలో నిక్షిప్తమైన వ్యక్తిగత, వృత్తిగత డేటా అంతటినీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్గా ఉంచడాన్ని దృష్టిలో ఉంచుకుని నిల్వ చేయడం సవాళ్లతో కూడినదే. ఈ వినూత్న ఫీచర్లతో ఈ సమస్యను శాంసంగ్ దీటుగా పరిష్కరించింది. నేటి ప్రపంచంలో గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 నిజమైన ఆల్రౌండర్లుగా ముందుకొస్తున్నాయి. ఈ ఫోన్లతో జీవితాన్ని వినోదభరితంగా స్వేచ్ఛాయుతంగా మార్చుకోవచ్చు. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లను సొంతం చేసుకుంటే ఇక మీరు ఎన్నడూ వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. (Advertorial) -
ఇకపై నిశ్చింతగా ఉండవచ్చు.. (స్పాన్సర్డ్)
శాంసంగ్ గలాక్సీ ఏ 51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్లలో ప్రవేశపెట్టిన ప్రైవసీ ఫీచర్ను జెడ్ జనరేషన్, మిలీనియల్స్ అత్యధికంగా ఇష్టపడుతున్నారు. క్విక్ స్విచ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫీచర్ ద్వారా గ్యాలరీ, వెబ్ బ్రౌజర్, వాట్సాప్ తదితర యాప్స్ వినియోగంలో ప్రైవేట్ నుంచి వేగంగా పబ్లిక్ వెర్షన్కు మారేందుకు వీలుంటుంది. ఇందుకు పవర్ కీని రెండుసార్లు క్లిక్ చేస్తే సరిపోతుంది! ఫీచర్ భాగస్వామి, హెచ్టీ బ్రాండ్ స్టూడియో జెడ్ జనరేషన్, మిలీనియల్స్ తమ స్మార్ట్ఫోన్లపై అత్యధిక సమయాన్ని గడుపుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లేదా స్నాప్చాట్లో ఫొటోలను అప్లోడ్ చేయడం, లేకుంటే.. ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్లలో చాట్ చేయడం కోసం అధిక సమయాన్ని వినియోగిస్తున్నారు. రోజువారీ జీవనంలో మరే ఇతర గాడ్జెట్కంటే స్మార్ట్ఫోన్పైనే అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఆధునిక శాంసంగ్ గలాక్సీ ఏ 51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్ల ద్వారా జెడ్ జనరేషన్, మిలీనియల్స్కు సరికొత్త ప్రపంచం పరిచయమవుతుంది. ఈ స్మార్ట్ఫోన్లు అమోలెడ్ డిస్ప్లేలతోపాటు.. క్యాడ్ కెమెరా సెటప్, అధిక సమయం నిలిచే బ్యాటరీ శక్తితో లభిస్తాయి. ఎలాంటి టాస్క్నైనా సులభంగా నిర్వహించుకోవచ్చు. ఆల్ట్ జెడ్ జీవితంలో శాంసంగ్ స్మార్ట్ఫోన్లతో ఒత్తిడిని దూరం(స్ట్రెస్ ఫ్రీ) చేసుకోవచ్చు. మీ జీవితంలో ప్రైవేట్ మొమెంట్స్ను ప్రైవేట్గానే ఉంచుకోవచ్చు. మీరు మినహా ఎవరూ వీటిని పొందలేరు. క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ పేరుతో పరిశ్రమలోనే తొలిసారి రెండు ఆధునిక ప్రైవసీ ఫీచర్స్ను ప్రవేశపెట్టింది. వీటితో వెనుదిరిగి చూడవలసిన అవసరం ఉండదు. ప్రైవసీ ఫస్ట్ స్మార్ట్ఫోన్లను రోజువారీ వినియోగించేందుకు ఇష్టపడేవారైతే.. అన్ని వేళలా మీ ప్రైవసీ రక్షణను కోరుకుంటారు. ఇతరులు ఫోటోలు తీసుకునేందుకు మీ స్మార్ట్ఫోన్ను వినియోగించుకోవడాన్ని చాలా సందర్భాలలో ఎదుర్కొనే ఉంటారు. తద్వారా మీకు సంబంధించిన ఫొటోలు తదితరాలను చూడటం జరుగుతూ ఉంటుంది. అయితే మీ కొత్త స్మార్ట్ఫోన్ను పరిశీలించడం ద్వారా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎవరైనా మీకు వచ్చిన మెసేజ్ను చదివే అవకాశముండవచ్చు. ఇలాంటి సందర్భంలో మనకు సంబంధించిన వ్యక్తిగత, ప్రైవేట్ డేటాను ఇతరులు చూస్తారన్న ఆందోళన కలుగుతుంది. ఇలాంటప్పుడు పవర్ బటన్ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఆందోళనకు చెక్ పెట్టవచ్చు. క్విక్ స్విచ్గా పిలిచే ఈ విశిష్ట ఫీచర్.. శాంసంగ్ గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ 71 స్మార్ట్ఫోన్లకు ప్రత్యేకం. నటి రాధికా మదన్ జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. ఈ ఫీచర్ను సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఈ వీడియోలో తన బాయ్ఫ్రెండ్(సన్నీ సింగ్ నటించారు)కు పుట్టిన రోజు పార్టీతో సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. అయితే ఊహించని విధంగా సన్నీ వచ్చాడు. అయితే రాధిక ఎలాంటి పరిస్థితుల్లోనూ సర్ప్రైజ్ పార్టీ ఆలోచనకు విఘాతం కలగకూడదనుకుంది. ఇందువల్ల ఆమె క్విక్ స్విచ్ను వినియోగించడం ద్వారా సీక్రెట్ను సేఫ్గా ఉంచగలిగింది. క్విక్ స్విచ్ ఫీచర్ కారణంగా ఎవరైనా తమ స్మార్ట్ఫోన్ను ఫొటో తీసేందుకు మరొకరికి సంకోచం లేకుండా ఇవ్వవచ్చు. లేదంటే యూట్యూబ్లో వైరల్ అవుతున్న వీడియోను వీక్షించేందుకు ఇవ్వవచ్చు. ఫోన్ పవర్ బటన్ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఫోన్లోని యాప్స్- గ్యాలరీ, బ్రౌజర్, వాట్సాప్ వంటివన్నీ ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్కు మారిపోతాయి. అంతేకాకుండా మీరు ప్రైవసీ కోరుకునే ఇమేజ్లను ప్రైవేట్ చేయమంటూ ఏఐ ఆధారిత కంటెంట్ సజెషన్స్ సూచిస్తుంది. ఈ ఫీచర్ సులభంగా సెట్ చేసుకోవచ్చు. కొన్ని ముఖాలు లేదా ఇమేజిలను ఎంపిక చేసుకోవాలి. వీటిని ప్రైవేట్ ఫోల్టర్లోకి బదిలీ చేయాలి. శాంసంగ్ నాక్స్(Knox)ద్వారా కంటెంట్ సజెషన్స్కు డిఫెన్స్ ప్రమాణాల స్థాయిలో భద్రత ఉంటుంది. దీంతో మీ ప్రైవసీకి గతంలో ఎన్నడూలేని విధంగా రక్షణ లభిస్తుంది. ఇక కెమెరా విశిష్టతలను పరిశీలిస్తే.. సింగిల్ టేక్ కెమెరా ఫీచర్లలో మొదటిగా చెప్పుకోవలసింది సింగిల్ టేక్. ఫొటోలు తీసుకోవడంలో పెర్ఫెక్ట్ ఫ్రేమ్ను ఎంచుకునేందుకు వీలుగా మీ స్మార్ట్ఫోన్లో సింగిల్ టేక్ ఫీచర్ను ఎంపిక చేసుకుంటే చాలు. మిగతా పని ఫోన్ చూసుకుంటుంది. ఈ ఫీచర్ ద్వారా 10 రకాల ఫొటోలు, వీడియోలను ఫోన్ క్యాప్చర్ చేస్తుంది. వీటిలో 7 ఫొటోలు, 3 వీడియోలు నమోదవుతాయి. ఇవి గ్యాలరీలో వెనువెంటనే లభ్యమవుతాయి. ఉత్తమ షాట్స్ను తీయడం ద్వారా సింగిల్ టేక్ ఒకే ఆల్బమ్కింద రూపొందిస్తుంది. ఏఐ సహకారంతో కెమెరా సాఫ్ట్వేర్.. షార్ట్ మూవీ, జిఫ్ యానిమేషన్స్, స్టైలిష్ ఇమేజెస్ తదితరాలను ఆటోమాటిక్గా తీయగలుగుతుంది. సింగిల్ టేక్ ఫీచర్తో అత్యుత్తమ ఫొటోను పొందగలుగుతారు. తద్వారా వీటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. సింగిల్ క్లిక్తో షేర్ చేయగలగడంతో సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. నైట్ హైపర్ల్యాప్స్ సింగిల్ క్లిక్ తదుపరి నైట్ హైపర్ల్యాప్స్ను ప్రస్తావించాలి. సోషల్ మీడియా ఫీడ్స్ను గమనిస్తే జెడ్ జనరేషన్, మిలీనియల్స్ ప్రతి రోజూ మరిన్ని ఫొటోలను తీసుకుంటూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. భోజనానికి ఏదైనా రెస్టారెంట్కు వెళ్లినా లేదా పార్క్లో కూర్చున్నా ఆ సమయాన్ని హైపర్ల్యాప్స్గా పిలవవచ్చు. మూవింగ్ టైమ్ ల్యాప్స్గా పేర్కొనే ఈ సమయంలో శాంసంగ్ నైట్ హైపర్లాప్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీంతో తక్కువ లైటింగ్ పరిస్థితుల్లోనూ అందమైన ఫొటోలను తీసుకునేందుకు వీలుంటుంది. కెమెరాలో గల ఇతర ఫీచర్ల విషయానికివస్తే.. కస్టమ్ ఫిల్టర్, క్విక్ వీడియో రికార్డింగ్, స్విచ్ కెమెరా వైల్ రికార్డింగ్(ప్రస్తుతం ఏ51లో లభ్యం), ఏఐ గ్యాలరీ జూమ్, స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ను ప్రస్తావించవచ్చు. ఆల్ట్ జెడ్ లైఫ్లో రిలీఫ్ శాంసంగ్ స్మార్ట్ఫోన్ల ద్వారా ఇతరులకు ఫోన్ ఇచ్చే సమయంలో ఆందోళనలకు చెక్ పెట్టవచ్చు. ఈ విషయంలో ఇకపై నిశ్చింతగా ఉండవచ్చు. గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్లను సరికొత్త ఆవిష్కరణలుగా చెప్పవచ్చు. క్వాడ్ కెమెరా సెటప్తో సులభంగా ఫొటోలను తీయవచ్చు. దీనికితోడు అత్యుత్తమ డిస్ప్లే, అధిక సమయం నిలిచే బ్యాటరీ అండగా ఉంటాయి. ఇంతకంటే ఆశించడానికి ఇంకేముంటుంది? ఈ ఫీచర్లతో గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్ల ద్వారా ఆల్ట్ జెడ్ జీవితాన్ని ఆనందించండి. మరింకెందుకు ఆలస్యం? (Advertorial) -
ఏ ఒక్కరికి మీ సమాచారం తెలియదు (స్పాన్సర్డ్)
ఆల్ట్ జడ్ జీవితంలో భాగంగా క్విక్ స్విచ్ పేరుతో శాంసంగ్ నూతన స్మార్ట్ఫోన్ ప్రైవసీ ఫీచర్ను ప్రవేశపెట్టింది. కేవలం పవర్ కీని డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఫోటోలు, యాప్స్ వంటివి ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్కు సులభంగా మార్చుకునే వెసులుబాటు లభిస్తుంది. ఫీచర్ భాగస్వామి, హెచ్టీ బ్రాండ్ స్టూడియో స్మార్ట్ఫోన్లు మన జీవితంలో అంతర్భాగమయ్యాయి- స్మార్ట్ఫోన్లు లేకుండా మనం ఏమీ చెయ్యలేం.. మిలీనియల్స్, జడ్ జనరేషన్ అయితే వారి స్మార్ట్ఫోన్ల పైనే పూర్తిగా ఆధారపడతారు. పని, ఆటల మధ్య సరైన సమతూకం పాటించేందుకు వారికి స్మార్ట్ఫోన్లు కీలకం. మీరు రోజంతా జర్నలిస్టుగా పనిచేసి సాయంత్రం డీజేగా మారితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. పనికి సంబంధించిన కీలక సమాచారం నుంచి వ్యక్తిగత ఫోటోల వరకూ మీ ఫోన్లో ఎన్నో నిక్షిప్తమై ఉంటాయి. ఇతరులు మీ ఫోన్ వంక చూస్తే మీరు ఎంత కంగారు పడతారో ఆలోచించండి? సరిగ్గా ఇక్కడే ప్రైవసీ ముందుకొస్తుంది. ప్రైవసీ కేవలం ఇతరులకే పరిమితం కాదు. ఇది మీ ప్రైవేట్ సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచడం కూడా. మిలీనియల్స్లా మనం మన ఫోన్లను ఏ ఒక్కరికీ ఇవ్వడానికి సంకోచిస్తాం. ఫోన్ ఎవరికైనా ఇచ్చినా, వారు మన ప్రైవేట్ సమాచారాన్ని చూస్తారా అనే భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. యూజర్ తన తొలి ప్రాధాన్యంగా భావించే శాంసంగ్ అందుకే మీకోసం గెలాక్సీ ఏ71, గెలాక్సీ ఏ51లపై క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ వంటి పరిశ్రమలోనే తొలి వినూత్న ప్రైవసీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. శాంసంగ్ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ ఫీచర్లను ప్రవేశపెట్టింది. యూజర్లు, ప్రత్యేకించి జడ్ జనరేషన్ వారి స్మార్ట్ఫోన్లను ఇతరులతో పంచుకున్న సందర్భాల్లో ఎదురయ్యే ఆందోళనను ఈ ఫీచర్లు తొలగించడమే కాకుండా వారి అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించేందుకు వెసులుబాటు కల్పిస్తాయి. మీ ప్రైవసీని ఎవరైనా హరిస్తారనే విచారం లేకుండా పూర్తి స్వేచ్ఛతో జీవితాన్ని అనుభవించడమే ఆల్ట్ జడ్ జీవిత సారాంశం. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీ చేతుల్లోనే ప్రైవసీ మిలీనియల్స్, జడ్ జనరేషన్ అసంఖ్యాక సెల్ఫీలు, వీడియోలు తీస్తుంటారన్నది తెలిసిందే. వాటిని ఏ ఒక్కరూ చూడరాదని కూడా వారు కోరుకుంటారు. గతంలో గ్యాలరీని లాక్ చేసే ఒకేఒక్క ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా మీ స్నేహితులు పాస్వర్డ్ అడిగితే ఇవ్వాల్సి వచ్చేది. మీకు అసౌకర్యం వాటిల్లినా మీ ప్రైవసీకి భంగం కలిగేది. క్విక్ స్విచ్తో మీరు ఇలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడంతో మీ ఫోటోలు, యాప్స్ సహా అన్నింటినీ ప్రైవేట్, పబ్లిక్ మోడ్లోకి మార్చేసుకోవచ్చు. అవును మీరు సరిగ్గానే విన్నారు! (ఏ ఒక్కరికి మీ సమాచారం తెలియదు) ఉదాహరణ తీసుకుంటే.. మీరు ఆఫీసులో ఉన్నారు... మీ బాస్పై మీరు చేసిన మీమ్స్ కొలీగ్స్కు చూపుతున్నారు.. అయితే ఇలా చేస్తే ఏమవుతుందో ఊహించండి. మీ బాస్ మీ దగ్గరకు వచ్చి మీ ఫోన్ను చూపించమని కోరితే.. మీరు ఏం చేస్తారు? ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు నటి రాధికా మోహన్ క్విక్ స్విచ్ను వాడే పద్ధతిని అనుసరించండి. రాధిక కూడా తన బాయ్ఫ్రెండ్, సోదరిల మధ్య తన ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఈ వినూత్న ఫీచర్ను వాడారు. మన జీవితాల్లోకి తొంగిచూసేందుకు ఇష్టపడుతూ, మన ఫోన్లలో మనం ఏం చేస్తున్నామో పసిగట్టాలని ఎవరో ఒకరు ప్రయత్నిస్తారని మనందరికీ తెలుసు కదా? వినూత్న ఫీచర్లకు పేరొందిన శాంసంగ్ క్విక్ స్విచ్ ఫీచర్తో మరోసారి విశిష్టతను నిరూపించుకుంది. సౌకర్యవంతమైన, అవరోధాలు లేని మేలుకలయికగా ఈ ఫీచర్లను యూజర్ల ముందుంచింది. శాంసంగ్ గెలాక్సీ ఏ71, ఏ51 స్మార్ట్ఫోన్లపై అందుబాటులో ఉన్న క్విక్ స్విచ్ మీకు ఆల్ట్ జడ్ జీవితాన్ని అనుభవంలోకి తీసుకువస్తుంది. క్విక్ స్విచ్కు కొనసాగింపుగా ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. స్మార్ట్ఫోన్ లోపలే ఏఐ ఫీచర్గా కంటెంట్ సజెషన్స్ ఫోటోలను ప్రైవేట్ ఫోల్డర్కు తరలించాలని ఆటోమేటిగ్గా సజెస్ట్ చేస్తుంది. శాంసంగ్ నాక్స్ భద్రతతో ఇది పనిచేస్తుంది. మీరు ప్రైవేట్గా ఉంచదల్చుకున్న ఫోటోలు, వ్యక్తుల ముఖాలను ఎంపికచేసుకుంటే కంటెంట్ సజెషన్స్ ఫీచర్ ప్రైవేట్ గ్యాలరీకి తరలించాల్సిన ఫోటోలను తెలివిగా సూచిస్తుంది. ప్రైవేట్ గ్యాలరీలో ఫోటోలను ఏ ఒక్కరూ చూసే అవకాశం ఉండదు. అందుబాటు ధరల్లో అద్భుత ఫీచర్లు శాంసంగ్ మరోసారి మెరుగైన స్మార్ట్ఫోన్ ఫీచర్లను అందుబాటు ధరల్లో ప్రవేశపెట్టింది. రెండు ఫోన్లు ఇన్ఫినిటీ-ఓ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే, స్లీక్ ప్రిస్మ్ క్రష్ డిజైన్, క్వాడ్ కెమెరా మాడ్యూల్, ఫ్లాగ్షిప్ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లతో ముందుకొచ్చాయి. సింగిల్ టేక్, నైట్ హైపర్లాప్స్ వంటి కెమెరా ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటాయి. సింగిల్ టేక్ ఫీచర్ మూడు నుంచి పది సెకన్లలో 14 రకాల ఫోటోలు, వీడియోల (పది ఫోటోలు, నాలుగు వీడియోలు)ను క్యాప్చర్ చేసేందుకు మిమ్మల్ని అనమతిస్తుంది. వీటిలో కొన్ని స్టైలైజ్డ్ ఫోటోలు, షార్ట్ మూవీ, కొన్ని జిఐఎఫ్ యానిమేషన్లు కూడా ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే మీరు వీటన్నింటినీ ఒకే ఆల్బమ్లో పొందవచ్చు. మీరు సింపుల్గా ఈ ఆప్షన్ను పిక్ చేసుకుని ఎంపిక చేసుకుంటే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం చూస్తారు. నైట్ హైపర్లాప్స్తో మీరు తక్కువ వెలుతురులో మెరుగైన హైపర్లాప్స్ వీడియోలను షూట్ చేసుకోవచ్చు. రాత్రిపూట వీడియోలు తీసేందుకు ఈ ఫీచర్ మెరుగ్గా ఉంటుంది. నైట్ లైఫ్కు పేరొందిన నగరాన్ని సందర్శించేందుకు మీరు ప్లాన్ చేస్తే ఈ ఫోన్లో మీరు తీసే వీడియోలు అద్భుతంగా ఉంటూ ఔరా అనిపిస్తాయి. గెలాక్సీ ఏ71 మెరుగైన ఫీచర్లలో బ్యాటరీ లైఫ్ కూడా ఒకటి. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ మీకు రోజుకుపైగా పనిచేస్తుంది! చదవడం, వీక్షించడం, గేమ్స్ ఆడటంతో పాటు మీ హృదయానికి దగ్గరైన కంటెంట్కు సంబంధించి ఏ పనులైనా ఎలాంటి అవాంతరం లేకుండా యాక్సెస్ చేసుకోవచ్చు. వెనుక వైపు 64 ఎంపీ కెమెరా, 25 వాట్స్ వైర్డ్ చార్జింగ్, 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఏ71 తరహా డిజైన్లోనే రూపొందిన గెలాక్సీ ఏ51 చిన్న ఛేసిస్తో ఉంటుంది. 6.5 ఇంచ్ అమోల్డ్ స్క్రీన్, 48 ఎంపీ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, ఒక యూఐ 2.0 ఫీచర్లతో ఏ51 అందుబాటులో ఉంది. శాంసంగ్ నాక్స్తో ముమ్మర భద్రత భద్రత విషయంలో మరింత ముందడుగు వేస్తూ పలు అంచెల భద్రతా ఫ్లాట్ఫాం నాక్స్తో శాంసంగ్ అదనపు భద్రతను కల్పిస్తోంది. స్మార్ట్ఫోన్ హార్డ్వేర్ చిప్లో దీన్ని నిర్మించారు. కీలక ఫైళ్లను, శాంసంగ్ పే లావాదేవీలు, పాస్వర్డ్లు, ఫోటోలు, వీడియోలు, ఫోన్ ఆరోగ్యం సహా మొత్తం డేటాను నాక్స్ సంపూర్ణంగా కాపాడుతుంది. ఇక ఈ ఫోన్లు మీకు ఏమేం అందిస్తారో తెలుసుకున్నారు, అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 రిటైల్ స్టోర్లు, శాంసంగ్.కాం, ఈకామర్స్ వేదికలపై అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ఏ71పై 2600 రూపాయల వరకూ, గెలాక్సీ ఏ51పై 1500 రూపాయల వరకూ అద్భుత క్యాష్బ్యాక్ ఆఫర్ ప్రస్తుతం నడుస్తోంది. ఇది పరిమిత కాల ఆఫర్, ఇక వేచిచూడకండి! (Advertorial) -
మీ మొబైల్లో ఫొటోలు, చాట్ దాచేయండి ఇలా? (స్పాన్సర్డ్)
నా ఫోన్ను ఎవరు టచ్ చేశారు ? ఇక గెలాక్సీ ఏ51, ఏ71పై క్విక్ స్విచ్తో ఈ పీడకలను మీరు మరిచిపోవచ్చు. క్విక్ స్విచ్ ద్వారా మీరు గ్యాలరీ, వాట్సాప్, ఇన్స్టాగ్రాం, స్నాప్చాట్ వంటి యాప్స్లో తరచూ ప్రైవేట్, పబ్లిక్ మోడ్లోకి కేవలం పవర్ బటన్ డబుల్ క్విక్ ద్వారా మారిపోవచ్చు. ఇది ఇప్పుడు మీకు అద్భుత వెసులుబాటు కాదా? ఈరోజుల్లో స్మార్ట్ఫోన్లు మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇన్స్టాగ్రాంలో ఫోటోలు అప్లోడ్ చేయడం, ట్వీట్లు చేయడం, నోట్స్ తీసుకోవడం వరకూ అన్నింటినీ స్మార్ట్ఫోన్లలో చక్కబెడుతున్నాం. జడ్ జనరేషన్, మిలీనియల్స్ ఇప్పుడు ప్రతి పనికీ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. వారి వర్క్ను స్టోర్ చేసుకోవడం నుంచి ప్యాషన్లో మునిగితేలడం, వినోదం ఇలా అన్నిటికీ స్మార్ట్ఫోన్ వాడే వారిలో మీరూ ఒకరా? అయితే మేమంటే మీకు సరిగ్గా తెలుసు! మీరు జనసమ్మర్ధ ప్రాంతంలో ఉన్నారని ఇప్పుడు ఊహించుకోండి.. మీరు మీ ఫోన్లో ఏం చేస్తున్నారో చూసేందుకు ఒకరు ప్రయత్నిస్తుంటే మీరు ముందుగా ఏం చేస్తారు. అక్కడి నుంచి తప్పుకోవడమో..వారి నుంచి మీ ఫోన్ను దాచడమో చేస్తారు.. అంతేకదా? మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులు మీ ఫోన్ను చూడాలని కోరుకోవడం వంటి పరిస్థితులు మీకు గుర్తుకురావచ్చు, అయితే మీరు మీ ఫోన్ను వారికి ఇచ్చేందుకు అసౌకర్యానికి లోనయ్యే పరిస్థితి. మీ ఫోన్ వారి చేతిలోకి వెళితే మీ ప్రైవేట్ మేసేజ్లు, ఫోటోలు వారి కంటపడతాయే ఆందోళన సహజం కదా? ఇక ఈ ఆందోళనలకు గుడ్బై చెబుతూ అల్ట్ జడ్ లైఫ్ను స్వాగతించండి. అల్ట్ జడ్ లైఫ్తో మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్గానే స్వేచ్ఛగా ఆస్వాదించండి. అల్డ్ జడ్ లైఫ్లో భాగంగా శాంసంగ్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ పేరిట వినూత్న ప్రైవసీ ఫీచర్లను ముందుకు తీసుకువచ్చింది. ‘మేక్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్లు గెలాక్సీ ఏ51, ఏ71లపై అందుబాటులో ఉంటాయి మధ్యశ్రేణి స్మార్ట్ఫోన్ పరిశ్రమలో తొలిసారిగా ఇలాంటి ఫీచర్లు ప్రవేశపెట్టడం ద్వారా శాంసంగ్ సరికొత్త నూతన ప్రమాణాలను నెలకొల్పింది. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్లు అద్భుత స్క్రీన్, అత్యద్భుత కెమెరా, దీర్ఘకాల లైఫ్తో కూడిన బ్యాటరీతో ముందుకొచ్చాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు సింగిల్ టేక్, నైట్హైపర్లాప్స్, ప్రొ కెమెరా మోడ్, కస్టమ్ ఫిల్టర్, స్మార్ట్ సెల్ఫీ యాంగిల్, క్విక్ వీడియో, ఏఐ గ్యాలరీ జూమ్ వంటి ఫ్లాగ్షిప్ కెమెరా ఫీచర్లతో కూడిన ఫీచర్ క్వాడ్ కెమెరా సెట్అప్లతో అందుబాటులో ఉన్నాయి. ప్రైవసీ ఫీచర్లు పరిశీలిద్దాం.. క్విక్ స్విచ్ - కేవలం డబుల్ క్లిక్తో మీ ప్రైవసీ పదిలం నేటి స్మార్ట్ఫోన్ యూజర్ల ప్రైవసీ అవసరాలను క్విక్ స్విచ్ పరిష్కరిస్తుంది. పేరుకు తగ్గట్టే క్విక్ స్విచ్ వేగంగా ప్రతిస్పందిస్తుంది. అల్ట్ జడ్ లైఫ్ను ఇది మరింత సరళతరం చేస్తుంది. ఇది గ్యాలరీ, వాట్సాప్, ఇన్స్టాగ్రాం, స్నాప్చాట్ సహా మీరు అధికంగా వాడే యాప్స్ నుంచి మీరు ప్రైవేట్, పబ్లిక్ మోడ్కు మారేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. క్విక్ స్విచ్ సౌకర్యవంతమే కాకుండా అవరోధాలు లేనిది కూడా. క్విక్ స్విచ్ కేవలం పవర్ బటన్ను డబల్ క్లిక్ చేయడంతో ఆన్ అవుతుంది. ఆపై మీరు మీ స్మార్ట్ఫోన్ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులకు ఎలాంటి ఆందోళన లేకుండా ఇవ్వవచ్చు. ఆ తర్వాత వారు కూడా గెలాక్సీ ఏ51, ఏ71ను కొనుగోలు చేయవచ్చు. నటులు రాధికా మదన్, సన్నీ సింగ్లతో కూడిన ఈ వీడియోను చూడవచ్చు. ఇందులో సన్నీ గర్ల్ఫ్రెండ్గా కనిపించిన రాధిక అతడు తన వద్దకు వస్తుండగా సన్నీ బర్త్డే పార్టీతో సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తారు. గెలాక్సీ ఏ71పై ఉన్న క్విక్ స్విచ్ ఫీచర్తో రహస్యం మాత్రం సురక్షితంగానే ఉంది. కంటెంట్ సజెషన్స్ - మీ ప్రైవేట్ ఫోటోలు ప్రైవేట్గానే మిగిలిపోతాయి. సంక్లిష్టమైన లుక్ను ఇంటెలిజెంట్స్ కంటెంట్ సజెషన్స్ సరళతరంగా మార్చేస్తాయి. స్మార్ట్ఫోన్లో అమర్చబడిన ఏఐ ఆధారిత ఇంజెన్ ఫోటోలను సెక్యూర్ ఫోల్డర్లోకి తరలించాలని ఇది సూచిస్తుంది. ఈ ప్రక్రియను చాలా సులభంగా చేపట్టవచ్చు. మీరు ప్రైవేట్గా ఉంచదలుచుకున్న కొన్ని ముఖాలు లేదా ఫోటోలను ఒకసారి ట్యాగ్ చేస్తే ఏఐ మిగిలిన పని చూసుకుంటుంది. ఉదాహరణగా చూస్తే..మీరు పర్వత ప్రాంతంలో మీ భాగస్వామితో వెకేషన్కు వెళ్లి ఇంటికి తిరిగి చేరుకుంటారు. మీ ఫోన్లో ఎన్నో సెల్ఫీలు మీరు ఇతరులు చూడకూడదని మీరు భావించేవి ఉంటాయి. మీ బెస్ట్ఫ్రెండ్ కూడా వాటిని చూడకూడదని మీరు అనుకుంటారు. అయితే ఏం జరుగుతుందో ఊహించండి. ఓ శుక్రవారం రాత్రి మీరు మీ గ్రూప్తో సేదతీరుతుంటే ఎవరో ఒకరు ఈ ఫోటోలను చూసేస్తారు. దీంతో మీ ప్రైవసీ కాస్తా పోతుంది. ఇక ఇలా జరగదు. కంటెంట్ సజెషన్స్ మీరు ప్రైవేట్ ఫోటోలను ప్రైవేట్గానే ఉంచుతుంది. పైన ఉదహరించిన ఉదంతంలో మీ సెల్ఫీలు పబ్లిక్ గ్యాలరీలో కనిపించవు. ఎందుకుంటే మీ భాగస్వామి ముఖాన్ని మీరు ఇప్పటికే ప్రైవేట్ ఆప్షన్గా సెలెక్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలన్నీ మీ ప్రైవేట్ ఫోల్డర్కు తరలివెళ్తాయి. ఇంతకుముందు చూడని ప్రైవసీ ఫీచర్లు శాంసంగ్ నూతన ప్రైవసీ ఫీచర్లు వాటికవే సొంతమైన లీగ్లో చేరాయి. శాంసంగ్ ఆఫర్ చేస్తున్న వాటి దరిదోపుల్లోకి మరే ఇతర కంపెనీ రాలేదు. వ్యాపార, వినియోగదారులు సంతోషం కోసం ప్రైవసీకి శాంసంగ్ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుంది. పరిశ్రమలో నూతన ప్రమాణాలను నెలకొల్పేందుకు శాంసంగ్ ప్రయత్నిస్తోంది. గెలాక్సీ ఏ సిరీస్ ఇప్పటికే అద్భుత స్క్రీన్, అత్యద్భుత కెమెరా, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో ముందుకురాగా, ఈ వినూత్న ప్రైవసీ ఫీచర్లతో వీటిని సంతోషంగా సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 రెండూ ఈకామర్స్ ప్లాట్ఫాంలతో పాటు రిటైల్ స్టోర్స్, శాంసంగ్.కాంలో అందుబాటులో ఉన్నాయి అల్ట్ జడ్ లైఫ్తో జడ్ జనరేషన్, మిలీనియల్స్ ఎంతమాత్రం విచారించాల్సిన పనిలేదు. ఎంచక్కా ఈ ఫోన్లతో మీ ప్రైవసీ ఆందోళనలకు గుడ్బై చెప్పవచ్చు. (Advertorial) -
గెలాక్సీ ఏ71, ఏ51.. వినూత్న ఫీచర్లు
గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ వంటి పరిశ్రమలో తొలి వినూత్న ప్రైవసీ ఫీచర్లతో శాంసంగ్ నూతన ప్రమాణాలను నెలకొల్పింది. శాంసంగ్ ప్రైవసీ ఇన్నోవేషన్స్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ గెలాక్సీ ఏ51, ఏ 71లపై అందుబాటులోకి వచ్చాయి. మీ ప్రైవేట్ యాప్స్, కంటెంట్ భద్రతపై ఎలాంటి ఒత్తిడి, విచారం లేకుండా మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్గా ఉంచుతూనే అల్ట్జడ్ లైఫ్ మీకు వినోదం అందిస్తుంది. ఫీచర్ భాగస్వామి, హెచ్టీ బ్రాండ్ స్టూడియో మిలీనియల్స్, జడ్ జనరేషన్ వారి స్మార్ట్ ఫోన్లను ఫోటోలు తీసుకోవడం నుంచి గేమ్స్ ఆడటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్లో ఉండటం, గూగుల్ సమాచారం వెతకడం సహా అన్ని విషయాల్లోనూ వాడుతున్నారు. ఫోన్ మీ చేతిలో ఉన్నంతవరకూ సురక్షితంగా భావిస్తుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ స్మార్ట్ ఫోన్ వైపు చూస్తే మీరు నిజంగా వారికి ఇచ్చేందుకు తిరస్కరిస్తారా..? మీ ఫోన్ను వారు చేతుల్లోకి తీసుకుని కెమెరాతో ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తే మీ ప్రైవేట్ కంటెంట్ బయటకు వచ్చే అవకాశాలు అధికం. అల్ట్జడ్ లైఫ్లో చేరడం ద్వారా మీ వ్యక్తిగత జీవితం వ్యక్తిగతంగానే నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది. క్విక్ స్విచ్ పేరుతో పరిశ్రమలోనే తొలి ప్రైవసీ ఫీచర్ను శాంసంగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ స్మార్ట్ ఫోన్ మరొకరికి ఇచ్చినప్పుడు మీకుండే యాంగ్జైటీని ఇది నివారిస్తుంది. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. శాంసంగ్ ‘మేక్ ఫర్ ఇండియా’ కార్యక్రమం కింద క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫీచర్లు గెలాక్సీ ఏ71, గెలాక్సీ ఏ51లపై అందుబాటులో ఉంటాయి. (Advertorial) ఫీచర్లపై మరిన్ని వివరాలు.. క్విక్ స్విచ్ : మీ ప్రైవసీని కాపాడుకునేందుకు వేగవంతమైన మార్గం లంచ్, టీ బ్రేక్ సమయాల్లో స్మార్ట్ ఫోన్ను వర్క్ డెస్క్ల వద్ద వదిలేసి వెళ్లే వారిలో మీరూ ఒకరా? వారి ఫోన్లలో ఇతరులు వ్యాసాలు/ డాక్యుమెంట్లను చదివేందుకు అనుమతించే వారిలో మీరూ ఉన్నారా? అందుకు చింతించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగతంగా ఉంచేందుకు క్విక్ స్విచ్ ఫీచర్ అందుబాటులో ఉంది అల్ట్ జడ్ లైఫ్లో నివసించేందుకు ప్రతిఒక్కరి అవసరాలను క్విక్ స్విచ్ తీర్చేస్తుంది. ఇది సౌకర్యవంతంగా ఉండటంతో పాటు అవరోధాలు లేకుండా ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ను ఇతరులతో పంచుకునే సమయంలో పవర్ కీని డబుల్ టాప్ చేస్తే సరిపోతుంది. ప్రైవేట్, పబ్లిక్ మోడ్స్లోకి వేగంగా మారే వెసులుబాటును క్విక్ స్విచ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ ఫీచర్ను గ్యాలరీకే కాకుండా వెబ్ బ్రౌజర్, వాట్సాప్ వంటి ఇతర యాప్స్ ప్రైవసీకి వాడవచ్చు. మీరు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంటే ఏ ఒక్కరూ పసిగట్టలేరు. మీ స్మార్ట్ ఫోన్ గ్యాలరీని చూడాలని ఎవరైనా అనుకుంటే మీరు వారికి పబ్లిక్ వెర్షన్ చూపవచ్చు. సెక్యూర్ ఫోల్డర్లో దాచిన ప్రైవేట్ కంటెంట్ మీ ఒక్కరే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇతరులతో పంచదలుచుకోలేని ఫోటోలను డిఫెన్స్ గ్రేడ్ శాంసంగ్ నాక్స్తో భద్రమైన సెక్యూర్డ్ ఫోల్డర్లో మీరు సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు. కంటెంట్ సజెషన్స్ : ప్రైవేట్, వ్యక్తిగత కంటెంట్ ఏదో నిర్ధారించేందుకు తెలివైన మార్గం కంటెంట్ సజెషన్స్ సెక్యూర్ ఫోల్డర్ లోపల ‘ఆన్ డివైజ్ ఏఐ’ ఫీచర్గా అందుబాటులో ఉంటుంది. కంటెంట్ సజెషన్స్ స్మార్ట్ ఫోన్లో నిక్షిప్తమైన ఏఐ ఆధారిత ఇంజిన్ ద్వారా నిర్ధిష్ట ఫోటోలను సెక్యూర్ ఫోల్డర్కు తరలించాల్సిందిగా సూచిస్తుంది. ఎలాంటి ఫోటోలు, ముఖాలు, ఏ తరహా ఫోటోలను ప్రైవేట్గా ట్యాగ్ చేయాలో యూజర్ నిర్ణయించుకోవచ్చు. ఆపై ఏ ఒక్కరూ వాటిని యాక్సెస్ చేయలేని విధంగా కంటెంట్ సజెషన్స్ తెలివిగా ఏయే ఫోటోలను ప్రైవేట్ గ్యాలరీకి పంపాలో సూచిస్తుంది. యూజర్ ప్రైవసీని పెంచేందుకు స్మార్ట్ ఫోన్ లోపలే ఏఐ సొల్యూషన్ ఈ పనులను చక్కబెడుతుంది. సర్వర్, క్లౌడ్తో ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండానే ఏఐ సొల్యూషన్ ఈ ప్రక్రియను చేపడుతుంది. శాంసంగ్ తొలిసారిగా ఈ ఫీచర్లను మధ్య శ్రేణి సెగ్మెంట్కు అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. జడ్ జనరేషన్, మిలీనియల్స్ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ ఫీచర్లు యూజర్ల గోప్యత, ప్రశాంతతను కాపాడతాయి. నాక్స్ సెక్యూరిటీ గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్పై యూఐ సాఫ్ట్వేర్ ద్వారా నిర్మితిమైన డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ ఫ్లాట్ఫాం శాంసంగ్ నాక్స్ భద్రతతో గెలాక్సీ ఏ 51, గెలాక్సీ ఏ71 స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సైనిక తరహా గోప్యతా విధానం మీ స్మార్ట్ ఫోన్లో డేటా అంతటినీ పూర్తిగా కాపాడుతుంది. యూజర్ల గోప్యతపై ఇంతగా ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఆలోచించని రీతిలో పరిశ్రమలోనే తొలి గోప్యతా ప్రమాణాలను పాటిస్తూ శాంసంగ్ తనదైన లీగ్లో చేరింది. అల్ట్జడ్ లైఫ్లో నివసించేందుకు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లు మెరుగైన ఎంపికలు. (Advertorial) -
బ్యాలెట్ ఓట్లలో గోప్యతేది?
కాసిపేట(బెల్లంపల్లి) : రాజ్యాంగం పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ప్రజాస్వామ్యంలో వివాదాలకు తావివ్వకుండా రహస్యంగా ఓటు హక్కును వినియోగించే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం అదే తరహాలో సౌకర్యాలు కల్పించి శాంతియుతంగా ఓటు హక్కుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల విధుల నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కల్పించిన బ్యాలెట్ ఓటులో మాత్రం గోప్యత కరువైందని ఉద్యోగులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు జంకుతున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ముందస్తుగా వారికి కేటాయించిన ఓటును వినియోగించుకోవల్సి ఉంటుంది. గ్రామాలలో నలుగురైదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా అందులో ఎన్నికల విధులు నిర్వహించే వారు ఇద్దరు, ముగ్గురు ఉంటారు. ఈ క్రమంలో బ్యాలెట్ ఓట్లపై సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓటుకు దూరంగా ఉంటున్నారు. ముందస్తుగా వేసిన ఓటుకు సంబంధించి కనీసం బ్యాలెట్పై స్వస్తిక్ ముద్ర వేయాల్సి ఉండగా అది అందుబాటులో ఉంచడం లేదు. దీంతో సంబంధిత బ్యాలెట్పై నచ్చిన అభ్యర్థికి పెన్నుతో టిక్ మార్కు చేసి వదిలేస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఓట్లు కౌంటింగ్ చేసేటప్పుడు ఒకటి, రెండు ఓట్లు కావడంతో ఎవరికి వేశారని అభ్యర్థులు విచారించుకునే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొందరు ఆర్వోలు వచ్చిన రెండు, మూడు ఓట్లను వ్యాలెట్ ఓట్లు అంటూ అభ్యర్థులకు, ఏజెంట్లకు చూపిస్తున్నారని ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల మినహా సర్పంచ్, ఎంపీటీసీ , వార్డు ఎన్నికల్లో తక్కువ మంది బ్యాలెట్ ఓటు వినియోగించుకునే ఉద్యోగ ఓటర్లు ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఉద్యోగులకు బ్యాలెట్ ఓట్లలో గోప్యత లేకుండా పోయిందని గతంలో అభ్యర్థుల గెలుపు, ఓటములు నిర్దేశించే సమయంలో మాత్రమే బ్యాలెట్ ఓట్లు లెక్కించే వారని ప్రస్తుతం ప్రమాదకరంగా పరిస్థితులు మారాయని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. అన్ని కార్యాలయాల్లో స్వస్తిక్ మార్కు ముద్ర పెట్టడంతోపాటు ఓట్లను అభ్యర్థులకు మొదట చూపకుండా పూర్తి స్థాయి ఓట్లలో కలిపితేనే ఓటుకు విలువ ఉంటుంది. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్వస్తిక్ మార్కు అందుబాటులో ఉంచాలని లేదంటే చాలా గ్రామాల్లో ఉద్యోగులు ఓటుకు దూరంగా ఉండే పరిస్థితులు నెలకొంటాయని పలువురు పేర్కొంటున్నారు. -
ఇక యాపిల్ ‘క్రెడిట్ కార్డ్’!
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా క్రెడిట్ కార్డ్ సేవల్లోకి అడుగుపెట్టింది. ‘ఆపిల్ కార్డ్’ పేరుతో నూతనతరం ఆర్థిక సేవలకు శ్రీకారం చుట్టింది. తన సొంత వాలెట్ యాప్ ఆధారంగా సునాయాసంగా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలుకల్పిస్తోంది. కార్డు నెంబర్, సంతకం, సీవీవీ సెక్యూరిటీ కోడ్ వంటి సంప్రదాయ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ల మాదిరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. చిటికెలో చెల్లింపులు జరిగిపోయే అధునాతన డిజిటల్ కార్డును ఐఫోన్ వినియోగదారులకు అందిస్తోంది. ఎక్స్పైరీ డేట్ లేని ఈ కార్డు సహాయంతో అత్యంత సులువుగా షాపింగ్ పూర్తిచేయవచ్చని యాపిల్ ప్రకటించింది. ‘ఆపిల్ పే’ యాప్లో అభివృద్ధిచేసిన డిజిటల్ క్రెడిట్ కార్డు వినియోగంపై 3% వరకు క్యాష్బ్యాక్ అందుతుంది. ఇందుకు సంబంధించిన బ్యాంకింగ్ సేవలను గోల్డ్మన్ శాక్స్ అందిస్తుండగా.. అంతర్జాతీయ చెల్లింపుల నెట్వర్క్ను మాస్టర్కార్డ్ అందిస్తోంది. ‘ఐఫోన్లోని ఆపిల్ పే యాప్లో సైన్ఇన్ అయిన క్షణాల్లోనే ఈ క్రెడిట్ కార్డ్ సేవలను పొందవచ్చు. మెషీన్ లెర్నింగ్, ఆపిల్ మ్యాప్స్ ఆధారంగా చెల్లింపు జరిగిన స్థలం, మర్చెంట్ పేరు స్టోర్ అయి ఉంటాయి. కస్టమర్ల డేటాను ఇతరులకు విక్రయించేది లేదని గోల్డ్మన్ శాక్స్ స్పష్టంచేసింది. ఇందువల్ల కార్డు భద్రత విషయంలో ఎటువంటి అనుమానం అవసరం లేదఅని యాపిల్ పే వైస్ ప్రెసిడెంట్ జెన్నిఫర్ బైలీ పేర్కొన్నారు. ఈ వేసవి నుంచి అమెరికాలో క్రెడిట్ కార్డ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ఐఫోన్లో నెట్ఫ్లిక్స్ వార్తల సమాహారం మ్యూజిక్ సేవల్లో సంచలనం సృష్టించిన యాపిల్.. నెట్ఫ్లిక్స్ సహాయంతో ఇక నుంచి తాజా వార్తలను సైతం అందించే ప్రయత్నంచేస్తోంది. ‘నెట్ఫ్లిక్స్ ఫర్ న్యూస్’ పేరుతో 300 పైగా మేగజైన్లలోని ఆర్టికల్స్ను అందుబాటులో ఉంచడంతో పాటు సమగ్ర వార్తలను అందిస్తోంది. నెలకు 10 డాలర్లను సబ్స్క్రిప్షన్ కింద చెల్లించడం ద్వారా యాపిల్ కస్టమర్లు ఈ సేవలు అందుకోవచ్చని వెల్లడించింది. -
ఫేస్బుక్లో కొత్త ఫీచర్!
న్యూయార్క్: ఫేస్బుక్ యూజర్లకు త్వరలో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేవరకు ఫేస్బుక్లో ఏయే పోస్టింగులు చూశాం? ఎవరెవరికి మెసేజ్లు, ఫొటోలు షేర్ చేశాం? తదితర విషయాలు ఇతరులెవరూ తెలుసుకోకుండా ఉండాలంటే మన ఖాతా హిస్టరీని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఇంటర్నెట్ బ్రౌజర్లను వినియోగించిన తర్వాత మాత్రమే క్లియర్ హిస్టరీ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఫేస్బుక్ వినియోగదారులకు కూడా క్లియర్ హిస్టరీ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ ఫేస్బుక్ అకౌంట్లో బ్రౌజింగ్ హిస్టరీ మొత్తాన్ని చాలా సులభంగా క్లియర్ చేసుకోవచచ్చు. దీని వల్ల యూజర్లకు మరింత ప్రైవసీ లభిస్తుంది. వారి సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది. దీంతో యూజర్లు ఫేస్బుక్లో ఏమేం చేశారో హ్యాకర్లకు కూడా తెలిసే అవకాశం ఉండదు. అయితే ఈ ఫీచర్ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది ఫేస్బుక్ వెల్లడించలేదు. -
ఎవరితో పంచుకోకూడని 6 విషయాలు
సాక్షి, హైదరాబాద్: మహిళలు వారి భర్తలతో కంటే ఆప్త మిత్రులతోనే అన్నీ విషయాలు పంచుకుంటారని తాజాగా చేసిన ఓ సర్వేలో తేలింది. ఇద్దరు మహిళలు మిత్రులైతే గొడవల నుంచి ముద్దుల వరకు వారి వ్యక్తిగత విషయాలన్నింటినీ షేర్ చేసుకుంటారని ఆ సర్వే వెల్లడించింది. తమ స్నేహితురాళ్లు చెప్పిన విషయాలను అబ్బాయిలు కూడా పాటిస్తారని తెలిసింది. అయితే అతిగా షేర్ చేసుకోవడం మంచిది కాదని, ఈసారి మీ వ్యక్తిగత విషయాలను మిత్రులతో పంచుకునేటపుడు కింది విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 1. భాగస్వామితో జరిగిన గొడవలు.. రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తితోగానీ, భాగస్వామితో జరిగిన ప్రతీ గొడవను, మనస్పర్థను మిత్రులతో పంచుకోకూడదు. అలా చెబితే వారు అతన్ని లేదా అమెను చులకన భావంతో చూసే అవకాశం ఉంది. గొడవ తర్వాత ఇద్దరూ కలసిపోయినా, అవి విన్న వారు మాత్రం ఆ విషయాన్ని మరచిపోకుండా భవిష్యత్తులో మీపై రుద్దే అవకాశం ఉంది. అత్యవసరమైనవి మాత్రమే పంచుకోవాలి. 2. బాధపడిన ప్రతీసారీ... ఏదైనా విషయంలో మీరు బాధపడిన ప్రతీసారీ మీ మిత్రులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. అలా చెప్పడానికి అలవాటు పడితే వారు దగ్గర లేని సమయంలో ఇబ్బంది వస్తే మరింత ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఒంటరిగానే సమస్యను ఎదుర్కొనేలా మారాలని నిపుణులు సూచిస్తున్నారు. 3. కుటుంబ సమస్యలు... ప్రపంచంలోని ఏ కుటుంబానికి కూడా ఇబ్బందులు లేకుండా ఉండవు. కాబట్టి మీ కుటుంబంలో జరిగే మనస్పర్థలను, కలహాలను మిత్రులతో పంచుకోకపోవడమే మంచిది. కుటుంబంలో కనీసం ఒక్కరు కూడా వినే పరిస్థితిలో లేరు అనే సందర్భంలో మాత్రమే ఇతరులతో పంచుకోవాలి. అనుకోని పరిస్థితి ఎదురై మీ స్నేహితులు శత్రువులైతే కుటుంబ వ్యవహారాలు గుట్టురట్టయ్యే ప్రమాదం ఉంది. 4. చేసిన మంచి పనులు... మనం ఇతరుల పట్ల చూపిన జాలి, సహాయం అందరికి చెప్పుకుంటూ ఉంటే అది దాని లక్ష్యాన్ని చేరుకోలేదు. మన గొప్పదనాన్ని మనం చెప్పుకునే కంటే మన క్రియలే దాన్ని రూఢిపరిస్తే అది మరింత గౌరవాన్ని అందిస్తుంది. కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలీకూడదు అన్న సామెతను మరచిపోకూడదు. 5. లైంగిక జీవితం... లైంగిక జీవితంలో ఎదురయ్యే అనుభూతులు, సమస్యలను ఎవరితోనూ పంచుకోకూడదు. సమస్యలేమైనా ఉంటే సంబంధిత వైద్యులను కలవాలి తప్ప ఇతరుల సలహా అడగకపోవడమే మంచిది. అలా పంచుకోవడం వల్ల వేధింపులకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవడమే ఉత్తమం. 6. మిత్రుల విషయాలను.. మీ మిత్రుల గురించి ఏమైనా చెడుగా వింటే, వారితోనే చర్చించి తెలుసుకోండి. అవునో కాదో అని మధ్యవర్తులను ఆశ్రయించడం ఆ విషయాన్ని మరింతగా ప్రచారం చేయడమే అనే తెలుసుకోవాలి. మీరు తమ గురించి వాకబు చేస్తున్నారన్న విషయాన్ని వేరే వారి ద్వారా మీ మిత్రులు తెలుసుకుంటే మీ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోవచ్చు. అలాగే మీ మిత్రులు మిమ్మల్ని నమ్మి పంచుకున్న రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టవద్దు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయన్న చందాన మీ మిత్రులు కూడా ఏదో ఒకరోజు శత్రువులైతే మీరు పంచుకున్న రహస్యాలే వారికి బ్రహ్మాస్త్రాలవుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే పలు సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
గోప్యత మానవహక్కే: సత్య నాదెళ్ల
లండన్: గోప్యతను మానవ హక్కుగా భావించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల టెక్నాలజీ సంస్థలకు పిలుపునిచ్చారు. సైబర్ నేరాల నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు, సంస్థలు కలసి పనిచేయాలని కోరారు. లండన్లో గురువారం జరిగిన ఓ కాన్ఫరెన్స్లో గోప్యత, సైబర్ భద్రత, కృత్రిమ మేధ తదితరాలను ఆయన ప్రస్తావించారు. డిజిటల్ ప్రపంచంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా గోప్యతను మానవ హక్కుగా గుర్తించాలని ఆయన సూచించారు. సైబర్ దాడులకు గురయ్యే వర్గాలను కాపాడటం సాంకేతిక పరిశ్రమ ఒక్కదాని వల్లే కాదని, ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలని అభిప్రాయపడ్డారు. యూరప్లో కఠిన ఆన్లైన్ ప్రైవసీ ప్రమాణాలు నెలకొల్పేందుకు తీసుకొచ్చిన చట్టం జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ను ప్రశంసించారు. -
నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు!
సెలబ్రిటీలకు ఉండే క్రేజే వేరు. అందులోనూ సినిమా నటీనటులంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే వారు ఎక్కడ కనిపించినా ఫొటోల కోసం ఎగబడుతుంటారు. ఇది ఒక్కోసారి ఆ సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగిస్తుంటుంది. తాజాగా తమిళ నటుడు శివకుమార్కి (హీరో సూర్య, కార్తీల తండ్రి) అలాంటి ఇబ్బందే ఎదురైంది. తనతో సెల్ఫీ తీసుకోబోయిన ఓ అభిమాని ఫోన్ లాక్కొని శివకుమార్ విసిరివేశారు. ఇది కాస్తా హాట్ టాపిక్ కావడంతో శివకుమార్ స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘సెల్ఫీల విషయంలో ఎవరి ఇష్టం వారిది. కానీ, ఒక సెలబ్రిటీ విషయంలో అలా చేయడం కరెక్ట్ కాదు. ఓ 25 మంది అభిమానులు సెక్యూరిటీ గార్డులను పక్కకు తోసేసి మరీ నా దగ్గరికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఒక సెలబ్రిటీతో సెల్ఫీ దిగాలనుకుంటే ముందు వారి అనుమతి తీసుకోవాలి. నేనేమీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు. నాకూ ప్రైవసీ ఉంటుంది. గతంలో చాలాసార్లు అభిమానులు సెల్ఫీ అడిగితే కాదనలేదు. నన్ను నేను ఓ బుద్ధుడిలానో లేదా ఓ సాధువులానో భావించడం లేదు. నేనూ మీలాగే సాధారణ మనిషిని. నాకు నచ్చినట్లుగా జీవిస్తున్నాను. నన్ను ఓ నేతగానో.. ఓ సూపర్స్టార్గానో చూడాలని కోరడం లేదు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో హీరోలే. కానీ, మనం చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు’’ అని శివకుమార్ పేర్కొన్నారు. -
గోప్యత పేరుతో అడ్డుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: గోప్యత పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వకుండా తిరస్కరించేందుకు వీల్లేదని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు స్పష్టం చేశారు. శ్రీధర్ ఆచార్యులు రచించిన ‘ప్రైవసీ యాజ్ సీక్రసీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఢిల్లీలోని సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీధర్ ఆచార్యులు మాట్లాడుతూ.. ‘సమాచార హక్కును గోప్యత పేరుతో అడ్డుకోరాదు. గోప్యత హక్కును దుర్వినియోగం చేసి సమాచారాన్ని నిరాకరించరాదు. ఇదే విషయాన్ని ఈ పుస్తకంలో వివరించా. గోప్యత పేరుతో ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారాన్ని నిరాకరించే ఆఫీస్ మెమోరాండంను ప్రభుత్వాలు వెనక్కు తీసుకోవాలి. అడిగిన వివరాలు వెల్లడించాల్సిందే అనే విషయాన్ని స్పష్టంగా చెబుతూ డీవోపీటీగానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ మరో ఆఫీస్ మెమోరాండంను విడుదల చేయాలి. అప్పుడే గోప్యత హక్కు దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది’ అని అన్నారు. -
కేంద్రం ప్రతిపాదనకు వాట్సాప్ నో
న్యూఢిల్లీ: సందేశాలు తొలుత ఎక్కడి నుంచి వచ్చాయో కనిపెట్టగలిగే సాంకేతికతను అభివృద్ధి చేస్తే యూజర్ల వ్యక్తిగత గోప్యతతో పాటు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉద్దేశాలు దెబ్బతింటాయని ప్రముఖ సోషల్మీడియా సంస్థ వాట్సాప్ భారత ప్రభుత్వానికి స్పష్టంచేసింది. నకిలీ సందేశాలను అడ్డుకునేందుకు వార్తల మూలాలను కనిపెట్టే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ‘దీనివల్ల వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిష్షన్(మెసేజ్ పంపేవారు, రిసీవ్ చేసుకునేవారు తప్ప మరెవరూ సమాచారాన్ని చూడలేని సాంకేతికత) ఉద్దేశాలు దెబ్బతింటాయి. ఒకవేళ అలాంటి సాఫ్ట్వేర్ను తయారుచేస్తే మా యూజర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం, గోప్యత తీవ్రమైన ప్రమాదంలో పడతాయి. యూజర్ల గోప్యత నిబంధనల్ని ఉల్లంఘించే పనులను వాట్సాప్ ఎన్నడూ చేయబోదు’ అని ఆయన అన్నారు. నకిలీ వార్తలు, వదంతుల కారణంగా సంభవిస్తున్న మూకహత్యలను నియంత్రించేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించాలని కేంద్రం గతంలో వాట్సాప్ను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ వార్తలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను తాము చేపడుతున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఇందుకోసం భారత్లో ఓ బృందాన్ని నియమించామని, వాట్సాప్లో ఓసారి గరిష్టంగా పంపగలిగే సందేశాల సంఖ్యను తగ్గించామని పేర్కొంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొనుగోలు చేసిన వాట్సాప్కు ప్రస్తుతం భారత్లో 20 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. -
ఏది గోప్యత? ఏది సమాచారం?
నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీలో 2001 నుంచి 2007 వరకు మీరెంత మంది యువతీ యువకులను సీనియర్, జూనియర్ స్కాలర్లు, ఫెలోషిప్ స్థానాల కోసం ఎంపిక చేశారు? వారి పేర్లేమిటి? ఏఏ పరిశోధనాంశాల్లో వారు అధ్యయనం చేస్తున్నారు? నిర్ణీత కాలాన్ని మించి పరిశోధన కొనసాగించిన వారు ఎంతమంది? వారెవరు? పరిశోధనా కాలాన్ని కొనసాగించే నియ మం ఉందా? లేకపోతే ఏం చేస్తారు? ఏం చేశారు? పరిశోధన విజయవంతంగా పూర్తిచేసిన వారికి చివరి వేతన చెల్లింపు సర్టిఫికెట్లు ఎప్పుడిచ్చారు? అని సమా చార హక్కు కింద 2017 సెప్టెంబర్ 20న దరఖాస్తు పెట్టుకున్నారు. దీనిపై సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా, ఈ అంశాలన్నింటినీ వ్యక్తిగత సమాచారమని వర్గీకరించారు. ఈ దరఖాస్తుపై 30 రోజులు గడిచినా ఏమీ చెప్పలేదు. ‘మా పరిపాలనాధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమాచారాన్ని నిరాక రించాం’ అని రెండో అప్పీలులో పీఐఓ చెప్పారు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(జే) ప్రకారం ఆ సమా చారం ఇవ్వవలసిన పని లేదని అనుకున్నారు. తాను ఇటీవలే పీఐఓగా చేరానని, అంతకుముందు అజిత్ కుమార్ ఈ సమాధానాన్ని 2018 మే 3న చెప్పారని కొత్త పీఐఓ వివరించారు. రెండో అప్పీలు దాఖలైన తర్వాత 2018 జులై 11న అడ్మినిస్ట్రేటివ్ అధికారి కుమారి నిధి శ్రీవాస్తవ సమాధానం ఇచ్చారు. స్కాలర్ల పేర్లు కూడా వారి వ్యక్తిగత సమాచారం ఎట్లా అవుతుందో వివరించాలని అడిగితే జవాబు లేదు. పై అధికారులను ఒక్కోసారి పీఐఓలు సమా చారం కోసం అడుగుతుంటారు. వారు తమ అధికార హోదాతో ఒక్క నిమిషంలో ఏ సమాచారమూ ఇవ్వ ద్దని తేల్చి పారేస్తారు. నెలరోజులైనా ఏ జవాబూ ఇవ్వకపోవడం సమాచారాన్ని నిరాకరించడమే. కొందరు మొదటి దశలో, మొదటి అప్పీలు దశలో కూడా సమాచారం ఇవ్వరు. రెండో అప్పీలు వేసినా పట్టించుకోరు. కాని ఫలానా కమిషనర్ ముందుకు కేసు వచ్చిందని, విచారణ నోటీసు కూడా వచ్చిందని తెలిశాకే స్పందిస్తారు. ‘‘పీఐఓ మారితే నా కన్నా ముందు అధికారి నిరాకరిస్తే నేనెందుకు ఇవ్వాలి? కమిషనర్ కూడా ఆయనకే నోటీసు ఇస్తాడు కదా. అతను బాధపడితే పడనీ’’ అనుకుంటారు. సమాచారం ఇవ్వకుండానే కమిషన్ ముందు విచా రణకు వస్తారు. కొత్త పీఐఓ ఎప్పుడు చేరారో అడిగి, ఆ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న సమాచార దర ఖాస్తులు ఎందుకు చూడలేదని అడిగే అవకాశం ఉండాలి. నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీ మౌలికమైన పని గ్రంథాలయ నిర్వహణతో పాటు, పరిశోధకులకు సాయం చేయడం. ఎవరికి స్కాలర్ షిప్ ఇచ్చారు? ఎంతకాలం పరిశోధన జరిగింది? అనే ప్రశ్నలు సామాన్యమైన సమాచార అభ్యర్థన అంశాలు. వాటిని ఏదో ఒక నెపంతో నిరాకరించడం న్యాయసమ్మతం కాదు. చట్టసమ్మతం కూడా కాదు. ఈ పనిచేసింది మొదట సీఐఓ అజిత్ కుమార్. దాంతో పాటు వారి పాలనాధికారి లోపం కూడా ఇందులో భాగం. అజిత్ కుమార్కు తప్పుడు ఆదే శాలు ఇవ్వడమే కాకుండా, మొదటి అప్పీలు అధికారి బాధ్యతలను మరొకరికి ఇవ్వకుండా పీఐఓ అయిన అజిత్ కుమార్కే అప్పగించడం చట్టవిరుద్ధం. ఇందు వల్ల సమాచార అభ్యర్థి తనకు జరిగిన చట్ట వ్యతిరేక నిరాకరణను ప్రశ్నించే అవకాశం కోల్పోయాడు. ఈ రెండు తప్పులకు ఆనాటి పాలనాధినాధికారి నిధి శ్రీ వాస్తవ బాధ్యులు కావలసి వస్తుంది. ఆర్టీఐ చట్టంలో ఉన్న బాధ్యతలను నిర్వహించడానికి పీఐఓకు మిగి లిన అధికారులు అందరూ సహకరించాలి. పై అధికా రులు, కింది ఉద్యోగులు కూడా ఈ ఉన్న తాధికారికి సాయం చేయాలి. పీఐఓ అడిగినపుడు సాయం చేయని మరొక ఉద్యోగి పైఅధికారి అయినా, కింది అధికారి అయినా సరే నిరాకరించిన పీఐఓగా ఆయ నను పరిగణించి ఆయనపై చర్యలు తీసుకునే అధి కారం ఉంది. కనుక సమాచార కమిషన్ పీఐఓ అజిత్ కుమార్కు, సమాచారం ఇవ్వడంలో సహాయం నిరా కరించిన నిధి శ్రీవాస్తవకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పబ్లిక్ అథారిటీలు, పీఐఓలు అడుగడుగునా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ కేసునే ఉదాహరణగా తీసుకుంటే, చట్టం వచ్చిన 120 రోజులలోగా తమంత తామే 17 రకాల సమాచారాన్ని సెక్షన్ 4(1) (బీ) కింద ఇవ్వాలి. ఈ కేసులో కోరిన నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీకి సంబంధించిన స్కాల ర్షిప్ వివరాల సమాచారం తమంత తామే ఇవ్వవలసి నది. 30 రోజుల్లో జవాబివ్వలేదు. మొదటి అప్పీలు అవకాశం తొలగించారు. తర్వాత తప్పుడు కారణా లపై ఈ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఇవన్నీ చట్ట వ్యతిరేక చర్యలు. అంతేకాదు 8(1)(జే) దుర్వినియోగం. (డాక్టర్ కమల్ చంద్ర తివారీ వర్సెస్ నెహ్రూ మెమో రియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, CIC/NMMA L/A/2018/616896 కేసులో ఆగస్టు 10న ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆండ్రాయిడ్ ‘పై’ వచ్చేసింది
న్యూఢిల్లీ: టెక్నాలజీ ప్రియులకు గూగుల్ తీపి కబురు తెచ్చింది. తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)లో కొత్త వెర్షన్ ‘పై’ను మంగళవారం ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ ఓఎస్ సిరీస్లో ఇది తొమ్మిదవది. ప్రస్తుతం ‘ఓరియో’ ఓఎస్ను ఎక్కువగా స్మార్ట్ఫోన్లలో వినియోగిస్తున్నారు. సమాచార గోప్యత(ప్రైవసీ)కు సంబంధించి మరిన్ని మెరుగైన ఫీచర్లతో పాటు పలు అధునాతన అంశాలను కొత్త ఓఎస్లో జతచేసినట్లు గూగుల్ పేర్కొంది. ముఖ్యంగా ‘పై’ ఓఎస్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సామర్థ్యం అత్యంత ముఖ్యమైనదిగా చెబుతోంది. ఇటీవలి కాలంలో మొబైల్స్ ఇతరత్రా స్మార్ట్ పరికరాల్లో సమాచార గోప్యత లోపాలపై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గూగుల్ నూతన ఓఎస్లో ప్రైవసీకి పెద్దపీట వేయడం గమనార్హం. కాగా, గూగుల్ పిగ్జెల్ మొబైల్ యూజర్లకు త్వరలోనే ‘పై’ ఓఎస్ ఆన్లైన్ అప్డేట్ అందుబాటులోకి రానుంది. సోనీ మొబైల్, షావొమీ, హెచ్ఎండీ గ్లోబల్, ఒపో, విపో, వన్ ప్లస్ తదితర మొబైల్ తయారీ కంపెనీలతో పాటు ఆండ్రాయిడ్ వన్ యూజర్లకు ఈ ఏడాది చివరికల్లా ‘పై’ అప్డేట్ లభ్యమవుతుందని గూగుల్ తన బ్లాగ్లో వెల్లడించింది. ఆండ్రాయిడ్ 9 ‘పై’తో కొత్త మొబైల్స్ను విడుదల చేసే విధంగా తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. మీకేం కావాలో చెప్పేస్తుంది... ఆండ్రాయిడ్ ‘పై’.. మొబైల్ వాడకాన్ని మరింత స్మార్ట్గా మార్చేస్తుందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే) సమీర్ సామత్ పేర్కొన్నారు. మొబైల్ యూజర్ వివిధ అప్లికేషన్లను వాడే విధానాన్ని ఆండ్రాయిడ్ ‘పై’లోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు గుర్తించి.. తదనుగుణంగా సూచనలు, సలహాలను అందిస్తుందని చెప్పారు. అంటే... అప్పుడున్న పరిస్థితుల్లో మీకేం కావాలో మీ మొబైల్ మీకు ఊహించి చెప్పేస్తుందన్న మాట!! అదే విధంగా ఇందులోని అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్ కూడా మీరు ఎక్కువగా వాడే యాప్స్ను గుర్తుంచుకొని.. వాటికి మాత్రమే బ్యాటరీ పవర్లో ప్రాధాన్యం ఇస్తుంది. ఇంకా అడాప్టివ్ బ్రైట్నెస్ పీచర్.. వివిధ సెట్టింగ్స్కు మీరు ఎంత స్క్రీన్ వెలుగు(బ్రైట్నెస్)ను కోరుకుంటారో గుర్తించి... ఆటోమేటిక్గా ఆ మేరకు సర్దుబాటు చేస్తుంది. అంతేకాదు కొత్త డ్యాష్బోర్డును కూడా గూగుల్ చేర్చింది. మీరు మీ డివైజ్పై దేనికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో ఇది ఇట్టే చెప్పేస్తుంది. -
అయినా మనిషి మారలేదు
‘‘ఇది చాలా పొరపాటు సుకుమార్’’. మనసులోని కోపాన్నీ, బాధనూ అణచుకుంటూ సుకుమార్ని మెత్తగా మందలించాను. సుకుమార్ నా ముందు ప్రశాంతంగా, ఏ భావం మొహంలో కనబడకుండా కూర్చున్నాడు. సుకుమార్ భార్య కోమలి రెండోసారి గర్భవతి అయ్యింది. ఏడో నెలతో ఉంది. అప్పుడే తనని పరీక్ష చేసి బయటకు పంపించి సుకుమార్తో ఏకాంతంగా మాట్లాడుతున్నాను. గుండె వైద్యుడిగా క్లినిక్లో నా రోగుల మీద, వారి బంధువుల మీద నాకు కోపం వచ్చే సందర్భాలు తక్కువే. నా కోపంతో కొద్దిగా వేడెక్కిన గదిలో కూర్చోటానికి కించిత్ ఇబ్బందిగా అనిపించింది. నాకు మాత్రమేనేమో! సుకుమార్ ప్రశాంతంగానే ఉన్నాడు. రెండు సంవత్సరాల క్రితం కోమలి మొదటి కాన్పులో బంగారం లాంటి ఒక ఆడబిడ్డని ఏ సమస్యా లేకుండా ప్రసవించింది. అయితే పిల్ల పుట్టిన నెల రోజుల నుండి కోమలికి విపరీతమైన ఆయాసం మొదలైంది. ఆయాసంతో పడుకోలేక రాత్రంతా కూర్చొని ఉండాల్సి వచ్చేది. ఆమె గైనకాలజిస్ట్ ఆమెను నా దగ్గరకు పంపించారు. ప్రాథమిక పరీక్షల తరువాత కోమలికి పెరీ పార్టం కార్డియొమయోపతి అనే వ్యాధి ఉందని నిర్ధారించాను. ఆ జబ్బులో అప్పటివరకూ ఏ సమస్యా లేని బాలింతలకు గుండె అకస్మాత్తుగా బలహీన పడుతుంది. గుండె బలహీనంగా ఉండడం ప్రమాదకరం. కొంతమందికి ఆయాసం ఎక్కువై ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. మరికొంతమంది ఏ హెచ్చరికా లేకుండా చనిపోవచ్చు కూడా. ఈ జబ్బు వున్న వారిలో కొందరు పూర్తిగా కోలుకుంటారు. కొందరికి గుండె కోలుకోక చనిపోయే అవకాశం ఉంది. కోమలికి ఈ జబ్బు తీవ్రంగా వచ్చింది. సుకుమార్ చిన్న బిడ్డతో, భార్య జబ్బుతో విపరీతంగా సతమతమయ్యాడు. రెండు రోజుల హాస్పిటల్ వైద్యం తరువాత కోమలి ఆరోగ్యం క్రమేణా మెరుగుపడింది. సుకుమార్ కొద్దిగా గాలి పీల్చుకున్నాడు. ఆరు నెలల వైద్యం తరువాత కోమలి గుండె దాదాపుగా పూర్తిగా కోలుకుంది. అయితే ఈ జబ్బు నుండి కోలుకున్న వారు ఒక్కటే జాగ్రత్త పాటించాలి. వాళ్ళు ఇంకెప్పుడూ గర్భం ధరించకూడదు. గర్భం ధరిస్తే గుండె మళ్ళీ బలహీన పడవచ్చు. రెండోసారి గుండె బలహీన పడితే ప్రాణానికి ప్రమాదం మరీ ఎక్కువ. అయితే ఎవరికి మళ్ళీ జబ్బు రావచ్చు, ఎవరికి రాదు అని చెప్పటం చాలా కష్టం. రెండో కాన్పుకి వెళ్ళటం అనేది విధితో పందెం కట్టటం లాంటిదే. భార్యను ప్రేమించే ఏ భర్తా ఆ పందెం కట్టకూడదు. మొదటి సంతానాన్ని ప్రేమించే ఏ తల్లీ ఆ పందెంలో భాగం కాకూడదు. అయితే విధి విచిత్రమయినదే కాదు. జాలి లేనిది కూడా. సుకుమార్కి భార్య అంటే ఇష్టమే కానీ మగసంతానం కావాలనేది అతని బలీయమైన కోరిక. కోమలికి తన కూతురంటే ప్రాణమే కానీ సుకుమార్ అంటే ప్రాణం కన్నా ఎక్కువ. రెండోసారి గర్భవతి అయితే గుండె జబ్బు రావచ్చు, రాకపోవచ్చు కూడా కదా! భర్త కోరిక కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి కదా? తీసుకుంటే తను అతనిని ఎంతగా ప్రేమిస్తుందో అతనికి తెలుస్తుంది కదా! కొన్ని సమయాల్లో మనసు చేసే వితండ వాదానికి పరిధులుండవు. ప్రస్తుతానికొస్తే, రెండు సంవత్సరాల తరువాత, అందుకనే సుకుమార్పై కోపంగా ఉన్నాను. కోమలికి ఏడో నెల. రెండు సంవత్సరాల బంగారు తల్లి సంయన తన మొదటి కూతురు. కోమలి ఆరోగ్యం అప్పటికి బాగానే ఉంది. మళ్ళీ గుండె జబ్బు వస్తుందో లేదో వేచి చూడటం తప్ప చేసేదేమీ లేదు. భయంతో కోమలి. కోపంగా నేను. రాగ ద్వేషాలకతీతంగా సుకుమార్. వేచి చూడటం తప్ప చేసేది నిజంగానే లేదు. కోమలిని ప్రతి నెలా గుండె పరీక్షలకు రమ్మన్నాను. కాన్పు సక్రమంగానే అయిపోయింది. తీసుకున్న రిస్క్కు తగిన ఫలంగా మగబిడ్డ కావాలనుకున్న సుకుమార్కీ, భర్త కోరికను ప్రాణాలని పణంగా పెట్టితీర్చాలనుకున్న కోమలికీ ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన వర్చస్సుతో వెలిగిపోతున్న ఆడపిల్ల, అక్కర్లేని బహుమతిలా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇంగ్లిష్లో మర్ఫీస్ సిద్ధాంతం అని చెబుతుంటారు – ‘ఒక పరిస్థితిలో ఏమేమి ఉపద్రవాలు జరగటానికి అవకాశం ఉన్నదో, అన్నీ జరుగుతాయి’. కోమలి విషయంలో మర్ఫీస్ సిద్ధాంతం మరో మూడు నెలల తరువాత నిజమైంది. ఈసారి ఆమె గుండె పూర్తిగా బలహీనపడింది. ఆమెను ఐసీయూలో అడ్మిట్ చేశాం. ఇద్దరు ఆడపిల్లలతో బయట నిలబడ్డ సుకుమార్కి పరిస్థితి పూర్తిగా అర్థమయ్యింది. తను గెలవలేని పందేనికి భార్య ప్రాణాన్ని పణంగా పెట్టానని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు సుకుమార్. అన్ని మానసిక స్థితులలోకీ భరించరాని, భరించలేని స్థితి పశ్చాత్తాపం. సుకుమార్ని ఓదార్చటానికి నాకు మాటలు మిగల్లేదు. అతను చేసింది తప్పే అయినా, తన తప్పు తను తెలుసుకున్నాడు. అయినా జాలితో బాధకి చికిత్స జరగదు. ఆరు రోజులు ఐసీయూలో ఉన్న తరువాత కొద్దిగా కోలుకున్న కోమలి ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమె గుండె బలం మెరుగుపడలేదు. విపరీతమైన ఆయాసంతో రోజూ కష్టపడుతూనే ఉంది. రెండో బిడ్డకు సాన్వితి అని పేరు పెట్టారు. కోమలి అనారోగ్యంతో సాన్వితికి పోషణా, సంయన పట్ల శ్రద్ధా తక్కువయింది. సుకుమార్కి తనపై తనకి అసహ్యం పెరిగింది. ఆయాసం పెరిగినప్పుడల్లా కోమలిని మళ్ళీ అడ్మిట్ చెయ్యవలసి వచ్చేది. ఆరు నెలలూ, నాలుగు అడ్మిషన్లూ, మూడు లక్షల ఖర్చు తరువాత కోమలి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఓ రోజు సుకుమార్ ఇంటికి వెళ్ళాను. కోమలి పరిస్థితి ఏమీ బాగుండలేదనీ, ఒకసారి ఇంటి దగ్గర చూసి వెళ్ళమని సుకుమార్ ప్రాధేయపడితే వెళ్ళక తప్పలేదు. వాళ్ళది ఒక మూడు బెడ్ రూముల అపార్ట్మెంట్. నన్ను సాదరంగా లోపలికి తీసుకెళ్ళాడు సుకుమార్. కోమలి నిస్త్రాణతతో ఒక గదిలో పడుకొని ఉంది. పసిబిడ్డ సాన్వితి తన పక్కనే పడుకుని నిద్రపోతోంది. నన్ను చూసి లేవబోయిన కోమలిని వారించి తనను క్లుప్తంగా పరీక్షించాను. తన పరిస్థితి బాగాలేదని స్పష్టంగా తెలిసింది. ఇలాగే ఉంటే తను ఎక్కువకాలం బతకదని అర్థమయ్యింది. కొన్ని మందులు మార్చి రాసిచ్చి బయలుదేరబోయాను. కాఫీ తాగి వెళ్ళమని సుకుమార్ బలవంతం చేయటంతో వేరే గదిలో అతనూ నేనూ కూర్చున్నాము. నిశ్శబ్దమైన గదిలో స్తబ్ధ్దమయిన మనసులతో మౌనంగా కూర్చున్నామిద్దరం. అక్కడినుంచి మాయమైతే బాగుండుననిపించింది. సుకుమార్ కాఫీ కొంచెం తాగి అన్నాడు – ‘‘నేను పెట్టిన కాఫీలానే ఉంది సార్ నా జీవితం. కోమలి లేకుండా నేను బతకలేను సార్. నా పిల్లల పరిస్థితి తలుచుకుంటే, నేనెంత తప్పు చేశానో నాకర్థమవుతోంది.’’ మింగుతున్న బాధతో ఇక మాట్లాడలేకపోయాడు సుకుమార్.మళ్ళీ మా మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని తట్టి లేపుతున్నట్లు సుకుమార్ కంట్లోంచి జారి కాఫీ కప్పు మీద ఒక్కొక్కటే పడుతున్న కన్నీటి బొట్లు. ‘‘ఒక మార్గం మాత్రమే ఉంది.’’ చెప్పాను. సుకుమార్ చటుక్కున తలెత్తి ఆశగా చూశాడు. ‘‘గుండెమార్పిడి ఆపరేషన్ చేయించొచ్చు. అయితే ఆపరేషన్కి ముప్పై లక్షల వరకూ అవుతుంది.’’ నా మాట విన్న సుకుమార్ మొహంలో ఆశ మెల్లగా మాయమైంది. ‘‘సార్! ఈ ఇంటి మీద నాకు ముప్పై అయిదు లక్షల అప్పుంది. ఇక నాకు అప్పిచ్చే వాళ్ళూ లేరు, తీర్చే స్థోమతా నాకు లేదు.’’ మళ్ళీ తలదించుకున్న సుకుమార్ భుజం మీద మెత్తగా తట్టి బయలుదేరాను. కోమలికి గుండె మార్పిడి తప్ప వేరే దారి లేదని తేలిపోయింది. సుకుమార్ పూర్తిగా కుంగిపోయాడు. విద్య నేర్పిన సంస్కారంతో పిల్లలను తను బాగానే చూసుకునేవాడు. కానీ గుండె మార్పిడికి తన దగ్గర డబ్బు లేదు. ప్రతిసారీ కాదుగాని, కొన్నిసార్లు డబ్బుకి ప్రాణాలను కాపాడే శక్తి ఉంటుంది. ఒకరోజు కోమలి, సుకుమార్ ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. బాగా ఆలోచిస్తే ఒక ఉపాయం దొరికింది. ఒక స్వచ్ఛంద సంస్థని నడిపే నా మిత్రులను, సినీ స్టార్స్ను సాయమడిగాను. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కొంత సాయం అందింది. ఫేస్బుక్లో విరాళాలకై సుకుమార్, కోమలి ఇద్దరి పిల్లలతో ఉన్న ఫొటోని షేర్ చేశాను. మంచితనం ఇంకా మిగిలే ఉన్న సమాజం సుకుమార్ పశ్చాత్తాపంపై జాలి పడింది. మూడు నెలల తర్వాత మొత్తానికి డబ్బులు సమకూరాయి. ఆరు నెలల తరువాత బెంగళూరులో ఒక విద్యార్థి ప్రమాదంలో మరణిస్తే గుండె కూడా దొరికింది. గుండె మార్పిడి మామూలు విషయం కాదు. ఆపరేషన్ జరిగేటప్పుడూ, ఆ తరువాత రోగి మరణించే అవకాశాలు చాలా ఎక్కువ. అదృష్టవశాత్తూ కోమలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిపోయింది. అత్యంత ఒడిదుడుకుల మధ్య మూడు నెలల తరువాత కోమలి చివరకు పూర్తిగా కోలుకుంది. సుకుమార్ ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. తను నా చేతులు పట్టుకొని ఆనందంతో ఏడుస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. సహాయం చేసిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు భార్యాభర్తలు. వారి జీవితాన్ని ఆదర్శంగా చూపించిన చాలా టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు నమ్మే అందరు దేవుళ్ళకీ మొక్కులు సమర్పించుకున్నారు. కోమలికి రెండవ జీవితం మొదలైంది. సుకుమార్కి కోమలిపై ప్రేమ రెట్టింపైంది. ఇద్దరు పిల్లలతో, ప్రేమించే భర్తతో కలిసి ఒకరోజు కోమలి క్లినిక్కి వచ్చింది. కొంతసేపు మాట్లాడిన తరువాత కోమలినీ పిల్లలనూ బయటకు పంపించాడు సుకుమార్. తనిప్పుడెంతో ఆనందంగా కనిపించాడు. మనస్ఫూర్తిగా అభినందించాను. సంతృప్తిగా కూర్చున్న నేను ఆ తరువాత అతనడిగిన ప్రశ్నకి స్థాణువులా మిగిలిపోయాను. ‘‘మగ బిడ్డ కోసం ఇప్పుడు ప్రయత్నించవచ్చా సార్?’’ సుకుమార్ ప్రశాంతంగా మొహంలో ఏ భావం కనిపించకుండా ఉన్నాడు. నా మనసునే, బాధ సునామీలా ముంచెత్తింది. ఏసీ రిమోట్ ఎక్కడో? రూమ్ ఇంత వేడిగా ఉంది! -
విషయం చెప్పకపోతే వివాహం నిలవదు
ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న సమస్య ప్రైవసీ. అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఏ వ్యవహారాల నయినా రికార్డు చేసి జనం ముందుకు తేవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరి రహస్యాలు బయటపడే అవకాశాలు పెరిగాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు ఏర్పడుతున్నపుడు తమ వివరాలు తెలపాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కొనుగోళ్లు, ఇతర ఒప్పందాలకు ముందు అన్ని విషయాలు వెల్లడించడం చట్టపరమైన బాధ్యత. పూర్తి విషయాలు చెప్పకపోయినా, కొన్ని విషయాలు దాచినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, మోసం చేసినా ఒప్పందాలు చెల్లవు. భాగస్వామ్య ఒప్పందాలు, సేవలు, వస్తువుల కొనుగోళ్ల సంబంధాలు కూడా పరస్పర సమాచార మార్పిడి మీదనే ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగత విషయాలు అనుకునేవి కూడా ఒక్కోసారి పంచుకోకతప్పదు. పెళ్లి, సంతానం, మాతృత్వం, పిల్లలను పెంచడం, వారి చదువులు తదితర అంశాలన్నీ కుటుంబానికి సంబంధించినవి. ఆ విషయాలు ఇతరులకు అనవసరం. ఒకవేళ అవసరం ఉంటే దేనికో చెప్పాలి. ప్రజా ప్రతినిధులు, ప్రజా సేవ కులు, ప్రజలందరికీ తెలిసిన నేతలు, తారలు, క్రీడా కారుల వ్యక్తిగత జీవన పరిధి మిగతా వారి కన్నా తక్కువ. ప్రాథమిక హక్కే అయినా ప్రైవసీకూడా మినహాయింపులకు లోబడి ఉంటుంది. డాక్టర్– పేషెంట్ సంబంధం ప్రైవసీని సృష్టిస్తుంది. అది ఒక కాంట్రాక్టు. సమాచారాన్ని డాక్టరు గోప్యంగా ఉంచాలి. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి దీనికి మినహాయింపు ఉంటుంది. కాబోయే జీవన భాగ స్వామి ఆరోగ్య లేదా రోగనిర్ధారిత సమాచారం భాగస్వామికి తెలియాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవ వివాహ చట్టాల్లో ఆరోగ్య సమాచార మార్పిడి అవసరమనే నియ మం ఉంది. పెళ్లయిన తరువాత జంటలో ఒకరికి ఎయిడ్స్ వంటి జబ్బు లేదా ఏదయినా తీవ్రమైన అంటురోగం ఉందని తేలితే వివాహాన్ని రద్దుచేసుకునే అవకాశం చట్టాలు కల్పిం చాయి. హిందూ వివాహ చట్టం సెక్షన్ 13, ముస్లిం వివాహాల రద్దు–1939 చట్టం సెక్షన్ 2, పార్సీ వివాహం, విడాకుల చట్టం 1936, ప్రత్యేక వివాహాల చట్టం సెక్షన్ 27 ప్రకారం భాగస్వామికి వ్యాప్తిచెందే సుఖ రోగం ఉందనే కారణంపై విడాకులు కోర వచ్చు. తనద్వారా మరొకరికి అంటువ్యాధిని నిర్లక్ష్యంగా వ్యాపించేట్టు చేస్తే, అది నేరమని, దానికి ఆరు నెలల జైలు శిక్ష విధించే వీలుందని భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 269 చెబుతోంది. రోగం తెలిసి తెలిసి అంటించేట్టు చేస్తే అందుకు రెండేళ్ల జైలు శిక్షను సెక్షన్ 270 నిర్దేశించింది. అంటే ఒక వ్యక్తికి ఎయిడ్స్ ఉందని తెలిసి, అతడిని ఒక యువతి తెలియక పెళ్లి చేసు కుంటుంటే చూసి మౌనంగా ఉండడం కూడా ఈ సెక్షన్ కింద నేరమే. తాను పరీక్షించిన వ్యక్తికి ఎయిడ్స్ ఉందని తెలిసి, అతడి ప్రేమికురాలు అడిగినా ఆ విష యం చెప్పని డాక్టర్ ఆ తరువాత ఆమెకు ఆ రోగం సోకితే ఈ సెక్షన్ కింద ప్రాసిక్యూషన్కు గురి కావ లసి వస్తుంది. నేరం రుజు వైతే డాక్టర్కు రెండేళ్ల జైలు శిక్ష తప్పదు. వివాహం చేసుకోవడం ప్రాథమిక హక్కు, ఆ విధంగానే ఆరోగ్యకరమైన జీవి తం కొనసాగించే హక్కు కూడా ప్రాథ మిక హక్కే. ఈ రెండింటి మధ్య సంఘర్షణ వచ్చినపుడు ఈ రెండింటిలో ఏది న్యాయ బద్ధమైందో, నీతివంతమైందో అది గెలు స్తుంది. రోగి అయిన వరుడి వివాహ హక్కుకన్నా వధువు ఆరోగ్యవంతమైన జీవన హక్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ వలసి వస్తుందని సుప్రీంకోర్టు చరిత్రా త్మక తీర్పు చెప్పింది. ప్రతి హక్కు ఒంటరిగా ఉండదు. తగిన బాధ్య తలతో ఉంటుంది. ఒకరి హక్కు మరొకరి బాధ్యతతో ముడిపడి ఉంటుంది. స్నేహబంధమైనా, వ్యాపార సంబంధమైనా, ఉద్యోగ అనుబంధమైనా పూర్తిగా అన్ని విషయాలు తెలియజేస్తేనే నిలుస్తాయి. కుటుం బంలో, భాగస్వామ్య వ్యాపారాలలో దాపరికం, సోమరితనం, చైతన్యరాహిత్యం వల్ల వ్యక్తులు మోస పోతుంటారు. స్నేహం కారణంగా నమ్మామని, ప్రేమవల్ల నమ్మక తప్పలేదని, భర్త కనుక గుడ్డిగా అతని మాటలు విశ్వసించాననే వివరణలు ఇస్తూ ఉంటే అవి మోసపోవడానికి కారణాలు అవుతాయే కాని, నివారణకు పనికి రావు. స్నేహం, ప్రేమ, వివా హం మొదలైన అన్ని బంధాలు నిజాయితీ అనే పునాది మీద ఆధారపడి ఉంటాయి. కుటుంబంలో, కాంట్రాక్టు భాగస్వాముల్లో సమాచార హక్కు ఈ విధంగా కీలక మైనదని అర్థం చేసుకోవాలి. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
జీమెయిల్.. న్యూలుక్
సాక్షి, నేషనల్ డెస్క్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ జీమెయిల్లో కొత్తగా 14 ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల సమాచారానికి మరింత భద్రత కల్పించడంతో పాటు గోప్యతను పెంపొందించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు దశలవారీగా ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. 1. డౌన్లోడ్, ప్రింట్ చేయకుండా బ్లాక్ వ్యాపార సంస్థల గోప్యతను పరిరక్షించేందుకు ఈ ఫీచర్ను తీసుకొచ్చింది. తాము పంపిన ఈ–మెయిల్ను అవతలివారు డౌన్లోడ్, ఫార్వర్డ్, కాపీ చేయకుండా, ప్రింట్ తీసుకోకుండా బ్లాక్ చేసే సదుపాయం కల్పించింది. 2. కాన్ఫిడెన్షియల్ మోడ్ నిర్ణీత గడువు తర్వాత ఈ–మెయిల్స్ డెలిట్ అయ్యే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ మోడ్లో అవతలివారికి ఈ–మెయిల్లో సమాచారం కాకుండా ఓ లింక్ మాత్రమే వెళుతుంది.దీనిపై క్లిక్ చేయగానే సమాచారం సాధారణ ఈ–మెయిల్లో ఉన్నట్లే కన్పిస్తుంది. 3. రెండు దశల్లో ధ్రువీకరణ అవతలి వ్యక్తి పంపిన ఈ–మెయిల్ను చూసేందుకు రెండు దశల్లో ఉండే ధ్రువీకరణను తీసుకొచ్చింది. ఈ–మెయిల్ అందుకున్న వ్యక్తి దాంట్లోని సమాచారాన్ని చూసేందుకు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. 4. ముఖ్యమైన మెయిల్స్ కోసం స్నూజ్ వినియోగదారులు ముఖ్యమైన ఈ–మెయిల్స్కు జవాబివ్వడం మర్చిపోకుండా ఈ ఫీచర్ను తెచ్చింది. ముఖ్యమైన ఈ–మెయిల్స్ ఇన్బాక్స్లో అన్నింటికంటే పైన కన్పించేలా ఈ ఫీచర్ ఉపకరిస్తుందని వెల్లడించింది. 5. ఆఫ్లైన్లోనూ వాడుకోవచ్చు ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉండని సందర్భాల్లో సైతం జీ–మెయిల్ను వాడుకునేలా ఆఫ్లైన్ ఫీచర్ను తీసుకొచ్చింది. నెట్ ఉన్నప్పుడు జీమెయిల్కు వచ్చిన సమాచారం ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. 6. చెక్చేయని మెయిల్స్ కోసం అలర్ట్స్ రెండ్రోజులు దాటినా ఓపెన్ చేయని మెయిల్స్ను ఈ ఫీచర్ వినియోగదారుల దృష్టికి తీసుకెళుతుంది. ముఖ్యమైన ఈ–మెయిల్స్ను మెషీన్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా గుర్తిస్తామంది. యూజర్లు అందుకున్న ఈ–మెయిల్స్లో ఏవైనా ప్రశ్నలుంటే వెంటనే వారి దృష్టికి తీసుకెళ్తామంది. 7.తెరవకుండానే అటాచ్మెంట్లు చూసేలా మెయిల్స్ను ఓపెన్ చేయకుండానే వాటితో వచ్చిన అటాచ్మెంట్లను చూసే ఫీచర్ తెచ్చిం ది. ఈ ఫీచర్లో అటాచ్మెంట్లు ఈ–మెయిల్ కింద కన్పించే ఐకాన్పై క్లిక్ చేసి చూడొచ్చు. 8. హై ప్రయారిటీ నోటిఫికేషన్లు ఈ ఫీచర్ ద్వారా ఇన్బాక్స్లో చేరే అనవసరమైన ఈ–మెయిల్స్కు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యమైన, అత్యవసరమైన ఈ–మెయిల్సే ఇన్బాక్స్లో చేరుతాయి. దీనివల్ల 97% అనవసరమైన ఈ–మెయిల్స్ను నిలువరించవచ్చు. 9.ఒక్క క్లిక్తో అన్–సబ్స్క్రైబ్ గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా అవసరం లేదని ఈ–మెయిల్ నోటిఫికేషన్లను ఓకే క్లిక్తో అన్సబ్స్క్రైబ్ చేయవచ్చు. 10.స్మార్ట్గా రిప్లై ఇవ్వొచ్చు ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐవోఎస్లలో అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని కంప్యూటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మెయిల్ అందుకున్న వ్యక్తులు సంక్షిప్తంగా తమ జవాబుల్ని పంపొ చ్చు. జీ–మెయిల్లో అప్పటికే ఉండే ఈ జవాబుల్ని కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. 11. జీమెయిల్లో స్లైడ్ ప్యానెల్ ఇతర యాప్లను వాడుకోవడానికి జీమెయిల్ నుంచి బయటకి వెళ్లకుండా కొత్తగా యాప్స్ ప్యానెల్ను తీసుకొచ్చింది. జీమెయిల్లో కుడివైపు కన్పించే ఈ ప్యానెల్లో క్యాలెండర్, టాస్క్స్ సహా పలు యాప్లను చేర్చారు. 12. ఆకర్షణీయంగా కన్పించేలా సరికొత్త యూజర్ ఇంటర్ఫేజ్ సాయంతో జీమెయిల్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ ఫీచర్ను ప్రస్తుతానికి వెబ్ వెర్షన్కు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. 13. ఆండ్రాయిడ్, ఐవోఎస్లకు టాస్క్స్ ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు సరికొత్త గూగుల్ టాస్క్స్(జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ తదితరాలు ఉండే) యాప్ను విడుదల చేసింది. 14. పిషింగ్ హెచ్చరికలు స్పష్టంగా.. సైబర్ నేరగాళ్లు పంపే పిషింగ్ మెయిల్స్ను మరింత సమర్థవంతంగా గుర్తించి హెచ్చరించేలా కొత్త ఫీచర్ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. పిషింగ్ తీవ్రతను బట్టి ఎరుపు, పసుపు, బూడిద రంగుల్లో ప్రమాదకర ఈ–మెయిల్స్ కన్పిస్తాయని పేర్కొంది. -
స్క్రీన్ షాట్లు... ఇక కష్టమే!
సాక్షి, టెక్నాలజీ : ఇకపై ఖాతాదారుడి ప్రైవసీని కట్టుదిట్టం చేయాలని సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ భావిస్తోంది. సేవ్ ఆప్షన్ లేకపోవటంతో ఇంతకాలం స్క్రీన్ షాట్ల, రికార్డింగ్ల ద్వారా ఇతరుల పోస్టులను కొందరు సేవ్ చేసుకుంటారన్న విషయం తెలిసిందే. ఇకపై అలా చేయటం కుదరదు. అందుకోసం ఓ ప్రత్యేక ఫీచర్ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ది ఇండిపెండెంట్ కథనం ప్రకారం... ఒకవేళ మీరు ఇతరుల స్టోరీలను స్క్రీన్ షాట్ల రూపంలో సేవ్ చేయాలనుకుంటే వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఓ పాప్ అప్ నోటిఫికేషన్ వస్తుంది. ‘మీరు చేసే పని పోస్టు చేసేవారికి తెలిసిపోతుంది’ అని అందులో ఉంటుంది. ఒకవేళ మీరు ఓకే బటన్ గనుక క్లిక్ చేస్తే వెంటనే పోస్టు చేసిన వారికి అలర్ట్ వెళ్తుందన్న మాట. స్టోరీ వ్యూవ్స్లో కూడా ఎవరైతే స్క్రీన్షాట్ల రూపంలో మీ పోస్టులను సేవ్ చేస్తారో.. వారి పేరుతోపాటు సూర్యుడి ఆకారంలోని సింబల్ ఒకటి దర్శనమిస్తుంది. ఆ లెక్కన్న మీ స్టోరీలను స్క్రీన్ షాట్లు తీసేవారి వివరాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండొచ్చు. ఇదే తరహాలో వీడియోల రికార్డింగ్ విషయంలోనూ సేఫ్ ఫీచర్ను ప్రవేశపెట్టాలని ఇన్స్టాగ్రామ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉండగా.. త్వరలోనే ఈ ఫీచర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. -
గోప్యతకు ఫేస్బుక్ రక్షణ
వాషింగ్టన్ : సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ తొలిసారిగా తన గోప్యతా నిబంధనలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా ఫేస్బుక్ ఉపయోగిస్తుండగా, ఈ సంస్థ ఇప్పటివరకు ఇలాంటి నిబంధనలను ప్రకటించలేదు. ఫేస్బుక్ అకౌంట్ ప్రారంభించేందుకు వినియోగదారులకు నిర్దేశించే నియమ, నిబంధనలకు ఇవి భిన్నమైనవి. ఈ మాధ్యమాన్ని ఉపయోగించేవారు తాము ‘యాక్సెస్’ చేసే అంశాలపై నియంత్రణకు వీటిని అమల్లోకి తెస్తున్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ఫేస్బుక్ యూజర్స్కు వారి గోప్యతపై నియంత్రణ కల్పించడంతో పాటు, వారు షేర్ చేసే సమాచారాన్ని సొంతం చేసుకునేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయని పేర్కొంది. వినియోగదారులు వారి సమాచారాన్ని ఏవిధంగా పరిరక్షించుకోవచ్చో వివరించే వీడియోలను ఫేస్బుక్ త్వరలోనే విడుదల చేయనుంది. ఫేస్బుక్ వినియోగించే వారందరూ తమ సమాచారాన్ని అందరితో పంచుకోవాలని (తమ సంస్థతో సహా) కోరుకోవడం లేదని గుర్తించినట్టు తెలిపింది. జీడీపీఆర్ చట్టం నేపథ్యంలో... యూరోపియన్ యూనియన్ (ఈయూ) తీసుకొచ్చిన నూతన డేటా పరిరక్షణ చట్టం జీడీపీఆర్ (జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్) మే 25 నుంచి అమలుకానుంది. జీడీపీఆర్ చట్టాన్ని అనుసరించడంలో భాగంగానే ఫేస్బుక్ తాజా చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమ డేటాను ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, పాత పోస్ట్లను ఏ విధంగా తొలగించవచ్చు, అకౌంట్ను పూర్తిగా తొలగించినప్పుడు డేటా ఏమవుతుందన్న విషయాలను వివరించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. గతంలో ఆన్లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేసే విషయంలో ఈయూ పర్యవేక్షకుల దర్యాప్తులను ఫేస్బుక్ ఎదుర్కొంది. జీడీపీఆర్ ప్రకారం.. ఏవైనా కంపెనీల డేటా చోరీకి గురైతే ఆ విషయాన్ని ఆయా కంపెనీలు 72 గంటల్లోనే ప్రకటించాలి. వినియోగదారులు డేటాను పంపేందుకు/తొలగించేందుకు కంపెనీలు అనుమతించాల్సి ఉంటుంది. గోప్యత నిబంధనలు ఇవే... తమ డేటాను ఫేస్బుక్ యూజర్స్ నియంత్రించుకునేందుకు దోహదపడేలా ఈ నిబంధనలను ప్రకటిస్తున్నట్లు చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ ఎరిన్ ఎగన్ చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ♦ వినియోగదారుల గోప్యతపై వారికే నియంత్రణ కల్పిస్తున్నాం. ఈ నియంత్రణలేమిటో వారే తెలుసుకుని తదనుగుణంగా వ్యవహరించాలి. ఉదాహరణకు... మా ఆడియన్స్ సెలక్టర్ టూల్ వినియోగదారులు ప్రతి పోస్ట్ను ఎవరితో షేర్ చేసుకోవాలనే దానిని నిర్ణయించే అధికారాన్ని కల్పిస్తుంది. ♦ డేటాను ఫేస్బుక్ ఎలా ఉపయోగిస్తుందన్నది యూజర్స్ అర్థం చేసుకునేలా సహాయపడతాం. రోజువారీ ఫేస్బుక్ వినియోగంలో భాగంగా ఎడ్యుకేషన్, టూల్స్ వంటి వాటిని జతచేశాం. ♦ సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు కష్టపడి పనిచేస్తున్నాం. ప్రతి ఫేస్బుక్ ప్రొడక్ట్లోనూ భద్రతాంశాన్ని పొందుపరుస్తున్నాం. దీనికోసం ‘టూ ఫాక్టర్ అథెంటికేషన్’ అనే సెక్యూరిటీ టూల్ను కూడా అందుబాటులోకి తెచ్చాం. ♦ వినియోగదారులు తమ సమాచారాన్ని వారే తొలగించవచ్చు. ఎవరితో ఏమి షేర్ చేయాలన్నది వారే నిర్ణయించవచ్చు. వినియోగదారులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సమాచారాన్ని మా సర్వర్ల నుంచి తొలగిస్తాం. -
వాట్సాప్పై షాకింగ్ రిపోర్ట్
ఒకవైపు ఆధార్డేటా బ్రీచ్ ఆందోళన రేపితే..తాజాగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో కనుగొన్న భద్రతా లోపం ప్రకంపనలు పుట్టిస్తోంది. వాట్సాప్ చాట్ చాలా భద్రంగా ఉంటుందని ప్రపంచ వ్యాపంగా కోట్లాది మంది యూజర్లు నమ్ముతోంటే.. గ్రూపు చాటింగ్ ప్రమాదంలో పడనుందని పరిశోధకులు తేల్చారని వైర్డ్ రిపోర్ట్ చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వాట్సాప్లో జోడించిన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్లో ఘోరమైన లోపాన్ని పరిశోధకులు కనుగొన్నారట. వాట్పాప్ గ్రూప్ చాట్లోకి అపరిచితులుఎవరైనా చొరబడవచ్చంటూ జర్మన్ పరిశోధకులు షాకింగ్ నివేదికను వెల్లడించారు. స్విట్జర్లాండ్, జ్యూరిచ్లోని జరిగిన రియల్ వరల్డ్ క్రైప్టో సెక్యూరిటీ కాన్ఫరెన్లో పరిశోధకులు ఈ షాకింగ్ నివేదికను సమర్పించారు. వాట్పాస్ సర్వర్పై కంట్రోల్ సాధించడం ద్వారా ప్రయివేటు గ్రూపు చాట్లోకి స్వయంగా తాముగానీ, వేరే వ్యక్తి ప్రవేశానికి అనుమతినిస్తుందని తెలిపింది. ఈ లోపం కారణంగా గ్రూప్ చాట్లోకి ఎవరైనా ఇట్టే ఎంటర్ కావచ్చని రిపోర్ట్ తేల్చింది. గ్రూప్ అడ్మిన్ అనుమతి లేకుండానే... గ్రూప్చాట్లోకి అనుమతి లభిస్తోందని తెలిపింది. అంతేకాదు ఇది గుర్తించి సదరు వ్యక్తులను తొలగించడానికి అడ్మిన్ చేసే ప్రయత్నాన్ని కూడా ఈ బగ్ నిరోధిస్తుందని వెల్లడించింది. ఇదే విషయాన్నిసంస్థ దృష్టికి తీసుకెళ్లినట్టుగా పరిశోధకులు వెల్లడించారు. మరోవైపు పరిశోధకుల రిపోర్టును వాట్సాప్ ప్రతినిధులు ధృవీకరించడం మరింత ఆందోళనకు దారి తీసింది. ఫేస్బుక్ ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అలెక్స్ స్టామస్ దీనిపై ట్విటర్లో స్పందిస్తూ గ్రూపులోకి రహస్యంగా చొరబడే అవకాశం లేదని ప్రకటించారు. ఈ రిపోర్ట్ను తాను పరిశీలించాననీ, కానీ అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు.యూజర్ల సెక్యూరిటీ, ప్రైవసీ తమకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. గ్రూప్ అడ్మిన్ అనుమతిలేకుండా రహస్యంగా ఎవరూ గ్రూప్లో చేరలేరనీ, కొత్త వ్యక్తులు చేరిన వెంటనే గ్రూపు సభ్యులకు నోటిఫికేషన్ అందుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ద్వారా పూర్తి భద్రత కల్పించినట్టు స్పష్టం చేశారు. On WhatsApp, existing members of a group are notified when new people are added. WhatsApp is built so group messages cannot be send to hidden users and provides multiple ways for users to confirm who receives a message prior to it being sent. — Alex Stamos (@alexstamos) January 10, 2018 -
ఆధార్ డేటా హ్యాకింగ్పై స్పందించిన ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ భద్రతపై మరోసారి ఆందోళనలను చెరలేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆధార్ సమాచారం హ్యాకింగ్ నుంచి పూర్తిగా సురక్షితమని యుఐఎఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) మరోసారి స్పష్టం చేసింది. కేవలం రూ. 500కే పది నిముషాల్లో కోట్లాది మంది ఆధార్ వివరాలు బహిర్గతం అన్న వార్తలపై స్పందించిన యుఐఎఐ ఇవి పూర్తిగా నిరాధారమైనవని, ఇలాంటి రూమర్లను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని కొట్టిపారేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఆధార్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమైందని, దీని గోప్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై విచారణ అనంతరం సంబంధిత వ్యక్తికి షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. పేటీఎం ద్వారా రూ.500 చెల్లిస్తే పది నిముషాల్లో ఆధార్ డేటా హ్యాకింగ్. ఓ రాకెట్ గ్రూప్ లోని ఏజెంట్ లాగిన్, ఐడీ, పాస్ వర్డ్ ఇస్తారని, ఈ పోర్టల్ లో ఏ ఆధార్ నెంబరును నమోదు చేసినా ఈ సంస్థ వద్ద నమోదైన ఆ వ్యక్తి డీటైల్స్ అన్నీ అందుతాయని వార్తలు వచ్చాయి. వందల కోట్లకు పైగా భారతీయుల ఆధార్ వివరాలను ఐదు వందల రూపాయలకే అందజేయనున్నామంటూ వాట్సాప్ లో ఓ అజ్ఞాత గ్రూప్ విక్రయదారులు చెబుతున్నారని, ఇది తమ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైందని ” ది ట్రిబ్యూన్ ” పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆధార్ డేటా బయటికి పొక్కడం లేదా చోరీకి గురి కావడంవంటిదేదీ జరగడానికి ఆస్కారం లేదని ఈ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. వ్యక్తుల డేటా పూర్తి సురక్షితంగా, భద్రంగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
వాట్సాప్లో రెండు సరికొత్త ఫీచర్లు!
న్యూఢిల్లీ : మెసేజింగ్ సర్వీసుల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వాట్సాప్, మరో రెండు కొత్త ఫీచర్లను అందుబాటలోకి తేవడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల ఐఫోన్లలో యూట్యూబ్ వీడియోలను సంభాషణ మధ్యలో ఉండగానే ప్రత్యక్షంగా చూసేలా, రెండోది లాక్ రికార్డింగ్ ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా గ్రూపు మెసేజ్లలో వ్యక్తిగత సందేశాలలు పంపే వీలు కల్పించనుంది. ప్రస్తుతం సరికొత్త ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. గ్రూపులో ప్రైవేట్ చాటింగ్ వాట్సాప్లో గ్రూప్ చాటింగ్ చేస్తుండగా.. ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు గ్రూపులోకి ఒక్క యూజర్కు వ్యక్తిగతంగా సందేశం పంపడానికి కొచ్చ ఫీచర్ త్వరలో అందిస్తామని సంస్థ ప్రకటించింది. రిప్లై ప్రైవేట్లీ (Reply Privately) అనే ఆప్షన్ ద్వారా గ్రూపు నుంచి మనకు కావలసిన వ్యక్తికి సందేశాలు పంపాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. వాట్సాప్ వెబ్ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ వాట్సాప్ బీటాఇన్ఫో ప్రకారం.. వాట్సాప్ వెబ్లో పిక్చ్ ఇన్ పిక్చర్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే, వీడియో చూస్తునే వాయిస్ కంట్రోల్ చేయడం, ప్లే/పాస్ బటన్, టైమ్లైన్ స్లైడర్ వాడవచ్చు. పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో కంటెట్ చూస్తున్నప్పుడు.. అదే స్క్రీన్ మీద అందే విండోలో యూజర్లతో ఎంచక్కా చాటింగ్ చేసుకోవచ్చు. -
బీజేపీది నీచ రాజకీయం!?
సాక్షి, అహ్మదాబాద్: సెక్స్ సీడీలు బహిర్గతం కావడం వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం ఉందని పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి అధినేత హార్థిక్ పటేల్ ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితాన్ని బీజేపీ పబ్లిక్ చేయడంపై ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత గోప్యతా ఉల్లంఘన కింద ఆ పార్టీపై న్యాయ పోరాటాన్ని చేస్తున్నట్లు హార్ధిక్ బుధవారం ప్రకటించారు. గుజరాత్ రాజకీయాలు అత్యంత దారుణంగా ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే నీచస్థాయికి దిగజారాయని హార్ధిక్ పటేల్ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత అథమస్థాయిలో ఉన్నాయి. నన్ను ఎంత దిగజార్చాలని ప్రయత్నాలు చేసినా.. వాటిని ఎవరూ నమ్మొద్దు’ అని హార్ధిక్ ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలకు పరాకాష్టగా మారిందని చెప్పిన హార్ధిక్.. ఆ పార్టీపై న్యాయపోరాటం చేస్తానని ట్విటర్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రముఖ న్యాయవాదులను సంప్రదించానని.. కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పటేల్ రిజర్వేషన్ ఉద్యమంపై సెక్స్ సీడీల ప్రభావం ఏ మాత్రం ఉండదని ఆయన చెప్పారు. కాగా హార్ధిక్ పటేల్..రాసలీలల వీడియో టేప్ రెండు రోజలు నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి సీడీలో హార్థిక్, ఒక మహిళ దగ్గరగా ఉండటం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి ఉండగా.. రెండో సీడీలో ఇద్దరు ముగ్గురు యువకులు, ఒక స్త్రీ సన్నిహితంగా ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. -
లవ్ అన్ఫెయిర్
పొగచూరిన గుండెని ఏం పెట్టి తోమితే ఆ మసి పోతుంది? ఎలా పోతుంది లెండి.. ప్రేమ జిడ్డు కదా! కొన్ని బంకల్ని వదిలించు కోవాలనిపిస్తుంది. కానీ ప్రేమ.. కాదన్నా, కాదనుకున్నా కావాలనిపిస్తుంది. అందుకేనండీ.. ప్రేమ ఫెయిరా? అన్ఫెయిరా, అఫెయిరా.. మీరే డిసైడ్ అవ్వండి. సినిమాలన్నీ ప్రేమకథలే. మనిషి జీవితం నిండా ప్రేమే కాబట్టి, దాన్నుంచి ఎస్కేపై సినిమా ఇంకో కథను చెప్పలేదు. యాక్షన్ ప్రేమ. అడ్వెంచర్ ప్రేమ. కామెడీ ప్రేమ. క్రైమ్ ప్రేమ. డ్రామా ప్రేమ. ఫాంటసీ ప్రేమ. హిస్టారికల్ ప్రేమ. ఇవేవీ కాకపోతే.. ఓ పిచ్చి ప్రేమ. రాయిని గిర్రున తిప్పి, గురి చూడకుండా కొట్టినా అది వెళ్లి తగిలిన స్క్రీన్పై అప్పటికి ఆడుతూ ఉండేదీ ప్రేమే. ప్రేమదీ సినిమాదీ పెద్ద లవ్ అఫైర్. లవ్ అఫైర్ ఒక్కోసారి ఎంత లవ్లీగా ఉంటుందో చెప్పాలా? ఊహు. చెప్తే కళ్లు క్యాచ్ చెయ్యలేవు. కళ్లు మూసుకోవాలి. 1989లోకి వెళ్లాలి. ‘గీతాంజలి’ ఆడుతున్న సినిమా థియేటర్లోకి వెళ్లి కూర్చోవాలి. కొండ ప్రాంతపు మంచు ప్రదేశం. గెస్ట్ హౌస్ అద్దాల్లోంచి శూన్యంలోకి చూస్తూ ఉంటాడు నాగార్జున. ఒక్కసారిగా పొగమంచు అతడిని కప్పేయడానికి ఇంట్లోకి వచ్చేస్తుంది. చల్లగా తాకుతుంది. వెనక్కి తిరిగి చూస్తాడు. గిరిజ! భుజం చుట్టూ చీర కప్పుకుని, చలికి చేతులు కట్టుకుని నాగార్జునకు దగ్గరగా వస్తుంది. నాగార్జునా వచ్చేస్తాడు ఆమెకు దగ్గరగా. బాగా దగ్గరగా. నువ్వు చెప్పింది నిజమేనా?’’ అంటుంది.. మెల్లగా.. మెలోడియస్గా. ప్రేమ మాత్రమే ఇవ్వగల మెలడీ అది. ఆమె చెంపల్ని నిండుగా చేతుల్లోకి తీసుకుని, కళ్లల్లోకి చూస్తూ ‘ఐ లవ్యూ’ అంటాడు. నేను చెప్పింది నిజమే అన్నట్లు. ‘ఏ?’అంటుంది. ‘ఎందుకో తెలీదు. కానీ నిజం అని మాత్రం తెలుసు’ అంటాడు. ‘ఎలా?’ అంటుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని తన గుండెకు ఆన్చుకుంటాడు. ‘గుండె బద్దలయ్యేలా కొట్టుకుంటోంది’ అంటాడు. ‘నాక్కూడా’ అంటుంది. ‘నిజంగా?’ అంటాడు. ‘అవును’ అన్నట్లు కళ్లతో చెప్పి అతడి చెవిని తన గుండెకు ఆన్చుకుంటుంది. డబ్ డబ్.. డబ్ డబ్... డబ్ డబ్.. డబ్ డబ్.. నయన శ్రుతులు, హృదయ లయలు, అధర గతులు, మధుర స్మృతులు.. లాక్డ్ విత్ లిప్స్. అదుముకున్న పెదవులు పెదవుల్లా ఉండవు. హత్తుకున్న హృదయాల్లా ఉంటాయి. ఇంకో భావం కనిపించదు. అర్జున్రెడ్డీ పెట్డాడు ముద్దు. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత.. ఇప్పుడొక కొత్త ముందు. అది గీతాంజలి ముద్దు కాదు. అదర్దేన్ హార్ట్.. దేహంలోని ఏ భాగంలోంచో మోహం తన్నుకొస్తే పెట్టిన ముద్దు. ప్రేమంటాడు దాన్ని అర్జున్రెడ్డి! కాదనలేం. ఔననలేం. ఆ పిల్లని తిడతాడు, భయపెడతాడు, బెదిరిస్తాడు. సైకో వెధవ! పిల్లల్ని ఎట్లా సినిమాకు పంపడం?! పంపకండి. అప్పుడేం జరుగుతుంది? అర్జున్రెడ్డి అనేవాడు లేకుండా పోతాడా? థియేటర్లో లేకుండా పోతాడు. లోకం లోనే లేకుండా పోతాడా? ఎవడి క్యారెక్టర్ ఏంటో అదేగా మనకు కనిపించేది? మనం చూపించాల్సింది. అర్జున్రెడ్డి ఇలాగే మాట్లాడతాడు. థియేటర్ లోపల, థియేటర్ బయటా. వాణ్ణని తప్పులేదు. ప్రేమ క్యారెక్టరే మారిపోయింది. మారిపోతోంది. ప్రేమకు క్యారెక్టరా? అవును. ప్రేమ రంగు, రుచి, వాసన.. అప్డేట్ అవుతున్నాయి. ‘ఇన్సెర్షన్’ని అర్జున్రెడ్డి ప్రేమ అంటుంటే.. మొన్నీ మధ్యే ‘ఎరకై్టల్ డిస్ఫంక్షన్’లోంచీ ఒక బాలీవుడ్ ప్రేమ రిలీజ్ అయింది.. శుభ మంగళ్ సౌధాన్. గీతాంజలికి ఎనిమిదేళ్లకు ముందే ప్రేమకు పెద్ద బ్రేక్.. ‘సీతాకోక చిలుక’ (1981). అది లేలేత ప్రేమ. పలుకులు మూగబోయినప్పుడు ఒలికిన ప్రేమ. కార్తీక్ బ్రామ్మలబ్బాయి. అరుణ క్రిస్టియన్. అది కాదు సమస్య కార్తీక్కి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అరుణంటే ఇష్టం. చెప్పడానికి భయం. ప్లేస్ కావాలి. ప్రైవసీ కావాలి. వాటికన్నా ముఖ్యం ధైర్యం. అది కావాలి. అటు వైపు పూర్తి యాంటీ. కార్తీక్ కనపడగానే అరుణ అపరకాళి అవుతుంటుంది. సముద్రం ఒడ్డున ఆడపిల్లలంతా చేరి దాగుడు మూతలు ఆడుతుంటారు. అరుణ చూపు కోసం, అరుణ మాట కోసం ఆరాటంతో ఉన్న కార్తీక్.. ఆ కొండ రాళ్లలో ఎవరికీ కనిపించకుండా, ఆమెను ఇసుకలో తన అడుగులతో తన వైపుకు దారి మళ్లించుకుంటాడు. దగ్గరికి రప్పించుకుంటాడు. గుహలాంటి ప్రదేశం అది. కార్తీక్ని చూసి షాక్ తింటుంది. అరుణ. వెంటనే అక్కడి నుంచి పారిపోబోతుంది. ‘కరుణా.. కరుణా.. నేను..’ అంటూ పరుగున వచ్చి ఆమె చెయ్యి పట్టుకుంటాడు కార్తీక్. మళ్లీ అపరకాళి అవతారం. చాచి చెంపమీద కొడుతుంది అరుణ. దవడ అదిరిపోతుంది. కార్తీక్ కంట్లోంచి నీరు. అమె చెయ్యి అతడి చెంప దిగకముందే ఆ చేతిపై చెయ్యివేస్తాడు కార్తీక్. అరుణకది రెండో షాక్. అతడినే చూస్తుంటుంది. అరుణ చేతిపై నుంచి తన చేతిని కార్తీక్ దించేసినా, ఆమె చెయ్యి ఇంకా కార్తీక్ చెంపకు అంటుకునే ఉంటుంది. ఆ వెంటనే తేరుకుని, తత్తరపడి పరుగున వెళ్లిపోతుంది. కార్తీక్ కన్నీళ్లు అరుణ దోసిళ్లలో ప్రేమ పూలై రాలుతాయి. ఈ చిత్రం ప్రారంభ దశ నుంచీ అన్ని విధాలా సహకరించిన శ్రీ అల్లు అరవింద్ (ఇలా అని ‘సీతాకోకక చిలుక’ టైటిల్స్లో ఉంటుంది) ఏం సహాయం చేశారో కానీ.. ఇరవై మూడేళ్ల తర్వాత 2004లో వచ్చిన మరో బ్రేకింగ్ ప్రేమ కథా చిత్రానికి పెద్ద సహాయం చేశారు. దానికి హీరోని అందించారు. సీతాకోక చిలుక రిలీజ్ అయినప్పుడు అల్లు అరవింద్ కొడుకు అర్జున్ (బన్నీ) రెండేళ్లవాడు. ఆ రెండేళ్లవాడే సుకుమార్ డైరెక్షన్లో ‘ఆర్య’గా ప్రేమను కొత్త ట్రాక్ ఎక్కించాడు. ఆర్యకు కాలేజ్లో అది ఫస్ట్ డే. సైకిలేసుకుని వెళ్తాడు. అక్కడ శివ బాలాజీ కాలేజ్ బిల్డింగ్ పైకెక్కి అక్కడి నుంచి కిందికి చూసి పెద్దగా అరుస్తూ అనూ మెహ్తాను ఐ లవ్ యూ చెప్పమంటాడు. లేదంటే దూకేస్తానంటాడు. అతడి చేతిలో గులాబీ పువ్వున్న కొమ్మ కూడా ఉంటుంది. బిల్డింగ్ కింద స్టూడెంట్స్ అంతగా గుమికూడి ఆదుర్దాగా పైకి చూస్తుంటారు. అనూ చుట్టూ అమ్మాయిలు చేరి, ‘ఐ లవ్ యూ చెప్పవే లేదంటే దూకేస్తాడు’ అని బలవంతం చేస్తుంటారు. ఆ భయానికి ఆ అమ్మాయి ఐ లవ్ యు చెప్తుంది. పెద్దగా చెప్పమంటాడు శివబాలాజీ. కాలేజ్ కాంపౌండ్ అంతా అదిరిపోయేలా ఐ... లవ్... యు.. అని చెబుతూ ఉంటుంది అను. సరిగ్గా అప్పుడొస్తాడు ఆర్య. ఆ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. ప్రేమలో పడిపోతాడు. ఓ మౌత్ ఆర్గాన్ ఊదుకుంటూ తన ప్రేమకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ ఉంటాడు. మ్యూజిక్లకు, మ్యాజిక్లకు అమ్మాయిలు పడిపోతారా? పోయినా పోకున్నా.. ఇదేం ప్రేమ? ఇంకొకర్ని లవ్ చేస్తున్న అమ్మాయిని లవ్ చెయ్యడం? కానీ చేస్తాడు. అనూని (సినిమాలో గీత) లవ్ చేస్తాడు ఆర్య. ఐ లవ్ యు అని కూడా చెప్తాడు. అదీ కూడా శివబాలాజీ పక్కన ఉండగానే చెప్తాడు! ఓసారి ఏకంగా లవ్ లెటర్ ఇస్తాడు! ‘ఏంటీ జోక్ చేస్తున్నావా?’ అంటుంది. ‘నో. ఐ యామ్ వెరీ సీరియస్’ అంటాడు. ‘చూడూ.. నిన్న నాతో పాటు ఉన్న అతను అజయ్’ అంటుంది. ‘తెలుసూ’ అంటాడు. ‘మీరు అతన్ని లవ్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను’ అని కూడా అంటాడు! ‘అంటే.. తెలిసే లవ్ చేస్తున్నావా?’ అంటుంది. ‘అంటే మీరొకర్ని లవ్ చెయ్యగానే మేం డ్రాప్ అయిపోవాలా?’ అంటాడు. ‘అసలలా డ్రాప్ అయితే అది ప్రేమ ఎలా అవుతుందండీ’ అంటాడు. అనూ ‘నో’ అంటుంది. ‘హే.. మీరు నన్నేం లవ్ చెయ్యక్కర్లా.. జస్ట్ ఫీల్ మై లవ్’ అంటాడు. యూత్ విరగబడి చూసింది. చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ విరగ్గాసింది. రోజ్ కాదు, జాస్మిన్.. కాదు. లీల్లీలాంటి ఓ లవ్లీ సుకుమార సమీరం అది. తర్వాత ఆరేళ్లకు వచ్చిన ఓ రేంజి లవ్వు ‘ఆరెంజ్’. ఆర్యతో తెలుగు సినిమా కొత్త ట్రాక్లోకి వస్తే, ఆరెంజ్ సినిమాతో కొత్త హైట్లోకి ఎక్కేసింది. ఆరెంజ్లో చరణ్కి ప్రేమ మీద నమ్మకం ఉండదు. అలాగని ప్రేమించకుండా ఉండడు. సముద్రమంత ప్రేమ కావాలనుకుంటాడు. నచ్చిన ప్రతి అమ్మాయినీ ప్రేమిస్తుంటాడు. నచ్చినన్నాళ్లు ప్రేమిస్తాడు. అన్నాళ్లూ సిన్సియర్గా తిప్పుతాడు, థ్రిల్స్ ఇస్తాడు, ముద్దులూ, గిఫ్టులు ఇస్తుంటాడు. హ్యాపీ బర్త్డేలు, ఐ లవ్ యూలు చెబుతుంటాడు. ఆ ప్రేమను నిలబెట్టుకోడానికి అబద్ధాలు కూడా చెబుతుంటాడు. పచ్చి అబద్ధాలు. అయితే ఇదంతా ఇంకో పిల్ల నచ్చేంత వరకే. మధ్యలోకి పాత పిల్ల వచ్చి డిస్టర్బ్ చేస్తే నచ్చదు. అలాంటి ప్రేమబోతు జెలీనియా లెఫ్లోకి వస్తాడు. ‘పాపం.. జెనీలియా’ అనిపిస్తుంది మనకు. చరణ్పై పీకల్తాగా కోపం కూడా వచ్చేస్తుంది. కానీ చివర్లో మారిపోతాడు. జెనీలియా మార్చేస్తుంది. ఆ అమ్మాయి కోపం, అలక సతాయింపు, బాధ, ఆవేదన.. అన్నీ చరణ్ని మార్చేస్తాయి. ఈ ప్రేమ జనానికి ఎక్కలేదు. చూడ్డానికి బాగుంది. బట్ మనసుకు ఎక్కలేదు. చాలా హైట్లో ఉన్న ప్రేమ మరి. ‘ఆర్య’లో ఇంకొకర్ని ప్రేమించిన అమ్మాయిని లవ్ చేస్తాడు కదా ఆర్య, ‘మహర్షి’లో ఇంకొకరి భార్యను లవ్ చేస్తాడు రాఘవ. ముందే లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి పెళ్లయిపోతుంది. తర్వాత ఆ లవ్ ఇంకా గాఢం అవుతుంది. చివరికి రాఘవ సైకో అయిపోతాడు. 1988లో వచ్చిన మహర్షికి, 2017లో వచ్చిన అర్జున్రెడ్డికి కొన్ని పోలీకలు ఉన్నాయి. థీమ్లో కాదు. క్యారెక్టర్స్లో. మహర్షి, అర్జున్రెడ్డి ఇద్దరూ కోపాన్ని అదుపు చేసుకోలేని వారు. ఇద్దరూ డిప్రెషన్లోకి వెళ్లివచ్చిన వాళ్లు. ప్రేమ టై–అప్ కాక మహర్షి, ప్రేమ బ్రేక్–అప్ అయ్యి అర్జున్ రెడ్డి థియేటర్లో అల్లకల్లోలం సృష్టిస్తారు. అవును. ప్రేమ కల్లోలమే. ప్రేమించినా కల్లోలమే, ప్రేమించకపోయినా కల్లోలమే, ప్రేమిస్తూ ఉన్నా కల్లోలమే, ప్రేమిస్తూ ఉండకపోయినా కల్లోలమే.ఎలా మరి బతకడం? కల్లోలం నుంచి ప్రేమే మళ్లీ కౌగిట్లోకి తీసుకుంటుంది. నాగార్జునలా లవ్లీగా హత్తుకున్నా, అర్జున్రెడ్డిలా రఫ్గా అదుముకున్నా ప్రేమ ప్రేమే. సినిమాలన్నీ ప్రేమ కథలే అయినా, ప్రేమే కథగా ఉన్న సినిమాల గురించి అందుకే మనం ఇలా పదే పదే మాట్లాడుకుంటుంటాం. ప్రేమ ఏ ట్రాక్లో, ఏ రూట్లో మనిషి పడేస్తుందో చెప్పలేం. పడ్డాక లేచి చూసుకోవలసిందే. ‘ఆర్య’లో నువ్వు ప్రేమించకపోతే బిల్డింగ్ పై నుంచి పడిపోతానంటాడు శివబాలాజీ. ‘ఇడియట్’లో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే బిల్డింగ్ పైనుంచి పడిపోనంటాడు రవితేజ! ప్రేమ పరిమళం లోకంలో ప్రతి దానికీ ఓ నిర్వచనం ఉంది. ప్రేమకు లేదు! మనిషిని బట్టే ప్రేమ తప్ప, ప్రేమ కంటూ సొంతంగా ఓ స్తుతీ, స్తోత్రం లేవు. ప్రేమను డిఫైన్ చెయ్యడం అంటే దేవుడికి రూపం చెక్కడమే. మనిషి ఊహకు ఏ రేఖలోస్తే అవే దేవుడు. మనిషి మనసు ఏ రెక్కలు కట్టుకుంటే అదే ప్రేమ. చెంప ఛెళ్లు మన్నప్పుడు ఆ మంటలో లేపనాల పూలు పూస్తాయి. ఆ పరిమళం ప్రేమ. ‘ఛీ.. నీ మీద ప్రేమ లేదు ఫో’ అన్నప్పుడు.. ‘లేదంటూనే ఫీల్ మై లవ్’ అంటూ అమ్మాయి చుట్టూ చక్కర్లు కొట్టడం ఫిలసాఫికల్లీ సాధింపు ప్రేమ. ఈ రెండు ప్రేమలూ తెలుగు సినిమాకు పెద్ద బ్రేక్! ‘ఆరెంజ్’ ప్రేమ ఇంకో బ్రేక్. ‘హాయ్ రే హాయ్.. జాంపండు రోయ్’ టైపు ప్రేమల్ని కోసి, కారం పెట్టి జాడీల్లో పడేసిన బ్రేక్లు ఇవి. ఎక్కువ కాలం.. తక్కువ ప్రేమ! చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి అప్పటికి ప్రేమిస్తున్న మధు వరకు మొత్తం తొమ్మిది మందిని ప్రేమించి ఉంటాడు చరణ్. నైన్ లవ్ స్టోరీస్. పదో అమ్మాయి జెనీలియా. ప్రేమించుకున్నంత కాలం ప్రేమించుకుని హ్యాపీగా విడిపోదాం అంటాడు. జెనీలియా గుండె గతుక్కుమంటుంది. ఏంటి వీడి క్యారెక్టర్... జెనీలియా డైలమా. ప్రేమ ఎవర్ గ్రీన్ కాదంటాడు చరణ్. ఎప్పుడో టక్కున రెడ్లైట్ పడుతుందంటాడు. ఎక్కువ కాలం ప్రేమిస్తే, ప్రేమ తక్కువ కాలం ఉంటుందంటాడు. ప్రేమ స్టాచ్యూ కాదు, ఎప్పుడూ ఒకేలా ఉండిపోడానికి అంటాడు. పైకి చెబితేనే అది ప్రేమ లిటిల్ మాన్హట్టన్’ (2005) సినిమాలో గేబ్ అనే పిల్లాడు ఉంటాడు. వాడికి పదేళ్లు. వాడు ప్రేమించిన అమ్మాయి రోస్మేరీ కి 11 ఏళ్లు. ఇద్దరూ క్లాస్మేట్స్. బాక్సింగ్ క్లాసులో పార్ట్నర్స్. ఒకళ్లతో ఒకళ్లు ఫైట్ చెయ్యాలి. రోస్మేరీతో ఫైట్ చెయ్యడం గేబ్కి బాగుంటుంది. ఓసారి ముద్దు కూడా పెడతాడు! ఆమెపై ఫీలింగ్స్. ఆ సంగతి వాడికీ తెలీదు. సెలవుల తర్వాత బాక్సింగ్లో రోస్మేరీకి కొత్త పార్ట్నర్ వస్తాడు. వాడు వీడికన్నా అందంగా ఉంటాడు. వీడికన్నా బలంగా ఉంటాడు. వీడికన్నా పొడవుగా ఉంటాడు. ఆ కొత్తవాడి మీద రోస్మేరీకైతే ఎలాంటి ఫీలింగ్సూ ఉండవు కానీ, వీడే ఇక్కడ కుమిలిపోతుంటాడు. రోస్మేరీతో తనను తప్ప ఇంకొకర్ని జీర్ణించుకోలేని ప్రేమ! చివరికి ఆ అమ్మాయికి చెప్తాడు. ‘నాకింకా అంత వయసు రాలేదు’ అంటుంది రోస్మేరీ. ప్రేమను మనసులోనే దాచేసుకుంటే అది ఏనాటికీ ప్రేమ అవదన్నది సినిమా. -
ఆధార్ లింక్ సంగతేంటి మరీ?
సాక్షి, ముంబై : ఆధార్ కార్డునే అన్నింటికీ ఆధారం చేస్తున్న క్రమంలో వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులకు, మొబైల్ కంపెనీ సిమ్లకు ఆధార్ కార్డు లింక్పై సందిగ్ధత ఏర్పడింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని పేర్కొన్న సుప్రీంకోర్టు, ఆధార్పై అభ్యంతరాలను ప్రస్తావించలేదు. కానీ ఆధార్ విషయంలోనే ఈ వ్యక్తిగత గోప్యత అంశం తెరపైకి వచ్చింది. ఆధార్ కార్డు లింక్ విషయంపై విచారణ సమయంలో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని కేంద్రం వాదించింది. దీంతో అసలు కేసు మొదలైంది. ఆధార్ విధానం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తోందంటూ 2015లో సుప్రీంకోర్టును పిటిషనర్లు ఆశ్రయించారు. వీటిపై పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయని ఆగస్టు 2న పేర్కొంది. కానీ నేడు వెలురించిన తీర్పులో మాత్రం ఆధార్ గురించి ప్రస్తావించకపోవడం సందిగ్థత పరిస్థితికి దారితీసింది. బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికి తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు, వ్యక్తిగత గోప్యత కిందకే వస్తాయని పలువురు న్యాయవాదులంటున్నారు. ఆధార్ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు తీసుకురావడం అప్రకటిత ఎమర్జెన్సీ కిందకే వస్తుందన్నారు. ఆధార్ అప్లోడ్తో అన్ని వివరాలు బహిర్గతమవుతాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 80 శాతం ఆధార్ కార్డు ప్రక్రియ పూర్తయింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డును లింక్చేసే గడువు ఈ ఏడాది చివరి వరకు ఉండగా... ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయాలంటే ఆధార్ నెంబర్ ఉండాలనే నిబంధన దాదాపు పూర్తయింది. పాన్ కార్డులకు ఆధార్ను లింక్ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఇవన్నీ వ్యక్తిగత గోప్యత కిందకు వస్తాయా? వస్తే ప్రభుత్వం తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ పీటముడిపై ఏర్పడిన సందిగ్థతను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోప్యత అనే ప్రాథమిక హక్కును ఆధార్ కార్డు ఉల్లంఘిస్తుందా? అనే దానిపై తీర్పు చెప్పనుంది. -
గోప్యత పరిరక్షణ ఓ విఫల యుద్ధం
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచారం దుర్వినియో గం అవుతుండటం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేటి సాంకేతిక యుగంలో గోప్యత అనే భావనను పరిరక్షించడం కష్టసాధ్యమవుతోందని పేర్కొంది. గోప్యత పరిరక్షణ ఒక విఫల యుద్ధమని అభివర్ణించింది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలా? లేదా? అన్న అంశంపై మూడు వారాలు విచారణ జరిపిన సర్వోన్నత ధర్మాసనం బుధవారం తన తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ బెంచ్కు నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 27న లేదా అంతకు ముందు తీర్పును ప్రకటించొచ్చు. మన జీవితం ప్రతి అంగుళంలోకి చొచ్చుకొచ్చిన సాంకేతికత కారణంగా గోప్యత అనే భావన ప్రాభవం కోల్పోతోందని, గోప్యత మౌలిక లక్షణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్ అభిప్రాయపడింది. ‘ప్రైవసీ పరిరక్షణ అనే విఫల యుద్ధాన్ని చేస్తున్నాం. వ్యక్తిగత సమాచారాన్ని వేటికి వాడుతున్నారో తెలియడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం’ అని వ్యాఖ్యానించింది. భారత్లో ప్రైవసీ పదాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని, సుమారు 140 కోట్ల మంది సమాచారం ప్రజాక్షేత్రంలో ఉందని బెంచ్ పేర్కొంది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లయితే , దాని కిందికి ఏమేం వస్తాయో కూడా తామే చెప్పాల్సి ఉందని వెల్లడించింది. ‘గోప్యత హక్కు’ కింద వద్దు: కనీస వ్యక్తిగత విషయాలు వెల్లడించడాన్ని గోప్యత హక్కు కింద పరిగణించరాదని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది. నేటి సాంకేతిక యుగంలో పారదర్శకత కీలకమని పేర్కొంది. గోప్యతకు చెందిన పలు అం శాలు ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్నాయంది. వ్యక్తిగత సమాచారం వాణిజ్య పరంగా దుర్వినియోగం కాకుండా టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఏదైనా పిల్ దాఖలు చేసే సమయంలో లాయర్లు కూడా తమ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఐడీ కార్డు తదితర వివరాలు ఇవ్వాలన్న సుప్రీం నిబంధనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అత్యున్నత న్యాయస్థానాలు సాంకేతికతతో ముందుకు సాగుతూ నిబంధనల పేరిట వ్యక్తిగత సమచారాన్ని కోరుతున్నాయని అన్నారు. గోప్యత హక్కును ఇతర ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేర్చితే అభ్యంతరమేమీ లేదని, దాన్ని ప్రత్యేక ప్రాథమిక హక్కుగా ప్రకటించొద్దని విజ్ఞప్తి చేశారు. హరియాణా ప్రభుత్వ లాయర్లు కూడా గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించరాదని కోర్టుకు విన్నవించారు. -
‘గోప్యత’ ప్రాథమిక హక్కే!
► కానీ పరిమితులు ఉండాలి ► సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని, అయితే దానికి కొన్ని పరిమితులు ఉండాలని కేంద్రం బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపిం ది. దీన్ని పేద ప్రజలను కనీస అవసరాలకు దూరం చేసేందుకు వాడుకోకూడదని స్పష్టం చేసింది. ప్రైవసీకి సంబంధించిన చాలా అంశాలను ప్రాథమిక హక్కుల పరిధిలోకి తీసుకురాకూడదని పేర్కొంది. ‘స్వేచ్ఛతో ముడిపడిన గోప్యత.. గుణాత్మకమైన ప్రాథమిక హక్కు కావొచ్చు. అయితే అది నిరపేక్షం కాదు. గోప్యతకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రాథమిక హక్కుగా పరిగణించకూడదు’ అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ తదితర 9 మంది సభ్యుల ధర్మాసనానికి నివేదించారు. ప్రైవసీ.. ప్రాథమిక హక్కా, కాదా? ప్రభుత్వం దాన్ని ప్రాథమిక హక్కుగా భావిస్తే ఈ కేసును మూసేస్తామని ధర్మాసనం చెప్పడంతో అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. భారత్ వంటి వర్ధమాన దేశాల్లో గోప్యత హక్కు ఏకరూప హక్కు కాదని.. కూడు, గూడు లేని 70 కోట్ల మంది ప్రజల ప్రాథమిక హక్కులను పిడికెడు మంది గోప్యత పేరుతో విఘాతం కలిగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, పంజాబ్, పుదుచ్చేరి, పంజాబ్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ..ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా కోర్టు.. ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రస్తావించింది. ‘అవి ఈ దేశ పేద ప్రజలపై చేసిన ఘోరమైన ప్రయోగం’ అని అభివర్ణించింది. ప్రభుత్వం ఒక మహిళను నీకెంతమంది పిల్లలు అని అడొగచ్చని, అయితే ఎన్నిసార్లు గర్భస్రావాలయ్యాయి అని అడగకూడదని పేర్కొంది. -
తాజ్మహల్ పైనా గోప్యతేనా?
తాజ్మహల్ని రక్షించే బాధ్యత, చట్టాన్ని అమలుచేసే బాధ్యత ఉన్న ఏఎస్ఐ.. దాని చుట్టూ అక్రమ నిర్మాణాల వివరాలు చెప్పకపోవడం.. ఎంత సమయం ఇచ్చినా వివ రాలు సేకరించి, ప్రచురించకపోవటం, ఆదేశాలను పాటించకపోవటం అన్యాయం. ప్రపంచ వారసత్వ భవనం అని యునెస్కో గుర్తించిన అద్భుత కట్టడం తాజ్మహల్ను మనం రక్షించుకుంటు న్నామా? రోజూ 30 లక్షలమంది దర్శించి కోట్ల రూపాయల పర్యాటక ఆదాయాన్ని తెచ్చే తాజ్ చుట్టూ అక్రమ నిర్మాణాలు కాలుష్యాల గురించి అడిగే వారే లేరా? తాజ్ అందాన్ని దెబ్బతీసే అంశాలను గురించి సుప్రీంకోర్టు, జాతీయ పర్యావరణ న్యాయస్థానం ఎన్నో కేసులు విచారించి కఠినమైన ఆదేశాలు జారీ చేశాయి. ఈ అద్భుత కట్టడానికి 2.4 కిలోమీటర్ల పరిధిలో చెట్లు కొట్టివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, తాజ్ ప్రహరీ నుంచి 100 మీటర్ల లోపున వాణిజ్య, నివాస నిర్మాణాలు చేపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర కాలుష్యనియంత్రణ మండలిని, భారత పురావస్తు శాఖను కట్టడిచేస్తూ తీర్పులు వెలువరించారు. ఇక్కడ నాసిరకం నిర్మాణాలను అనుమతిస్తే తాజ్ అందానికి హాని కలుగుతుందని సుప్రీం కోర్టు ఎంసీ మెహతా కేసులో హెచ్చరించింది. తాజ్ చుట్టూ నో ట్రాఫిక్ జోన్ ప్రతిపాదన అమలుపై ప్రశ్నిం చింది. ఇష్టంవచ్చినట్టు కట్టడాలను అనుమతిస్తే తాజ్ కళాత్మకతకు భంగం వాటిల్లుతుందని వివరించింది. ఆ కాలంలో ఉలి, సుత్తి తప్ప ఏ పరికరాలు లేకపోయినా అద్భుత సౌందర్య కళామందిరాన్ని నిర్మించారని, ఇప్పుడు అన్ని రకాల పరికరాలు యంత్రాలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఆ నాటి అందానికి సరితూగే నిర్మాణాలను దాని చుట్టూ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టు విమర్శించింది. పురావస్తు చట్టం 2010 ప్రకారం రక్షిత కట్టడాలలో నిర్దేశిత ప్రాంతంలో నిర్మాణాలను నిషేధించారు. 200 మీటర్ల ప్రాంతంలో కట్టడాలపైన నిషేధం లేదు కానీ కొన్ని పరిమితులు విధించారు. రెగ్యులేటెడ్ ఏరియా అని కొంత ప్రాంతాన్ని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. పురావస్తు శాఖ అధికారి తప్ప మరొకరెవరూ ఇక్కడ నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా భూమి యజమాని అయినా సరే నిర్మాణాలు సాగిస్తే 3 నెలల వరకు జైలు శిక్ష 5 వేల రూపాయల వరకు జరి మానా విధించవచ్చని ఆర్కియాలాజికల్ సైట్స్ అండ్ రిమెయిన్స్ యాక్ట్ వివరిస్తున్నది. ఒక ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆగ్రాసర్కిల్ లో 533 అక్రమ నిర్మాణాలు జరిగాయని, వాటిలో 46 తాజ్ గంజ్ ప్రాంతాల్లో ఉన్నాయని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివరించింది. ఏఎస్ఐ శాఖ వారు అక్రమ నిర్మాణాల సంఖ్య గురించి చెప్పారేగానీ వాటిపైన తీసుకున్న చర్యల గురించి వివరించనే లేదని, అసలు అక్రమ నిర్మాణాలు తొలగించారో లేదో కూడా చెప్పలేదని జమాతె ఇస్లామీ హింద్ సహాయ కార్యదర్శి ఇంతిజార్ నిజాం విమర్శించారు. అక్రమనిర్మాణాలను అనుమతించిన ఆఫీసర్లపైన, తెలిసి కూడా ఏమీ చేయని ఆఫీసర్ల మీద ఏ చర్యతీసుకున్నారని కూడా అడిగారు. తాజ్ చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలు, నివాస సముదాయాలు (కాలనీలు), వాణిజ్య సముదాయాలు ఏమిటో తెలుసుకోవాలంటే 500 మీటర్ల పరిధి ఎక్కడెక్కడ ఉందో తెలియజెప్పాలని ఒక నాగరికుడు ఆర్టీఐ కింద దరఖాస్తులో కోరాడు. తాజ్ దక్షిణ దిశలో తూర్పువైపున 500 మీటర్ల లోపున ఏ నిర్మాణాలు, ఏ కాలనీలు, ఏ రోడ్లు, ఏ ప్రాంతాలు వస్తాయో తెలపాలని కోరారు. ఈ వివరాలు తెలిస్తేనే పౌరులు కూడా చట్టాన్ని అనుసరించి నిర్మాణాల విషయంలో జాగ్రత్త పడడానికి వీలుంటుంది. ఆర్కియాలజీ శాఖ వారు ఈ వివరాలు తమవద్దలేవని జవాబిచ్చారు. మరి అక్రమ నిర్మాణాలను ఏ విధంగా గుర్తిస్తారు? సీఐసీ ఆదేశాలను కూడా నిరాదరించి సమాచారం ఇవ్వనందుకు కమిషన్ అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దానికి కూడా సమాధానం లేదు. ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ వారిని అడగాలని ఏఎస్ఐ వారు సూచించారు. చట్టం అమలు చేయడానికి, సుప్రీం కోర్టు ఎన్జీటీ ఆదేశాలు పాటించడానికి, అక్రమ నిర్మాణాలు ఆపడానికి, నిర్మాణాలకు అనుమతి తీసుకోవడానికి కూడా ఈ వివరాలు అవసరం. అధికారులు కూడా ఈ వివరాలు ఇచ్చిన తరువాతనే అక్రమంగా నిర్మిస్తుంటే ప్రశ్నించడానికి వీలుంటుంది. ఈ వివరాలను అందరికీ అందుబాటులోకి తేలేకపోతే అవినీతికి దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని దరఖాస్తుదారు వాదిం చారు. ఆగ్రా అథారిటీ దగ్గర ఉన్నాయంటే సరిపోదు, ఏఎస్ఐ దగ్గర కూడా ఈ సమాచారం ఉండాల్సిందే. తాజ్ని రక్షించే బాధ్యత, చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న ఏఎస్ఐ ఈ వివరాలు లేవనడం, ఎంత సమయం ఇచ్చినా వివరాలు సేకరించి ప్రచురించకపోవడం, ఆదేశాలను కూడా పాటించకపోవడం చాలా అన్యాయం. మొత్తం కాలనీలు, రోడ్లు, వాణిజ్య సముదాయాలు, తదితర వివరాలను తమంత తామే సెక్షన్ 4(1)(బి) కింద వివరించవలసిన బాధ్యత ఉన్న ప్రభు త్వ శాఖ ఆ బాధ్యతను విస్మరించినందుకు 25 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఇద్దరు సమాచార అధికారులపైన కమిషన్ శిక్ష విధించింది. ఆగ్రా అభివృద్ధి అథారిటీతో సమన్వయం చేసి వివరాలు సేకరించి, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి తోడ్పడాలని కమిషన్ ఆదేశించింది. తాజ్మహల్ చుట్టూ కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకున్న చర్యలను కూడా వివరించాలని ఉత్తరప్రదేశ్ కాలుష్యమండలికి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. (భీంసింగ్ సాగర్ వర్సెస్ సూపరింటెండెంట్ ఏఎస్ఐ కేసులో మే 30, 2017న సీఐసీ ఇచ్చిన ఆదేశం ఆధారంగా). - వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
'బ్లాక్ బెరీ'లో కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ: కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ బ్లాక్ బెరీ ఇప్పుడు వినియోగదారులకు మరికొన్ని కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ బెరీ మొబైల్ నుంచి ఇతరులకు పంపే సందేశాల్లో గోప్యతను పెంచేందుకు, వినియోగదారులే కంటెంట్ ను నియంత్రించే మెరుగైన అవకాశాలను కల్పిస్తోంది. ఈ కొత్త సదుపాయాన్ని ఎటువంటి ఛార్జీలు, ప్రత్యేక ఫీజులు లేకుండా యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది. యాండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లలో ఎటువంటి ఫీజు లేకుండా కొత్త ఐవోఎస్ అప్ డేట్స్ అందిస్తోంది. యూజర్ల సౌకర్యార్థం వారు షేర్ చేసుకునే సందేశాలు, కంటెంట్ తమ నియంత్రణలోనే ఉంచుకునేందుకు బీబీఎం వినియోగదారులకు ఈ కొత్త అభివృద్ధి సహకరిస్తుందని బ్లాక్ బెరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాథ్యూటాల్బోట్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తమ ఫోన్ నుంచిపొరపాటున కానీ, ఇష్టప్రకారం కానీ పంపిన మెసేజ్ లు, ఫొటోలు తిరిగి వెనక్కు రప్పించుకునే అవకాశం ఇప్పుడు బ్లాక్ బెరీలో ఉంది. అలాగే తాము పంపిన మెసేజ్ లు, ఫొటోలు ఇతరులకు ఎన్నాళ్ళ పాటు కనిపించాలో కూడా నిర్ణయించేందుకు వీలుగా టైమర్ ను సెట్ చేసుకునే అవకాశం ఇకపై అందుబాటులోకి వస్తుందని మాథ్యూ తెలిపారు. దీనికితోడు కొన్ని అదనపు కీ ఫీచర్లను కూడా బీబీఎం అందుబాటులోకి తెచ్చింది. ఒకరినుంచీ ఒకరికి ఛాట్ మెసేజ్ లను ఫార్వర్డ్ చేసే అవకాశం తోపాటు... విభిన్న వ్యక్తులతో ఛాట్ చేస్తున్నపుడు యాండ్రాయిడ్ లో మ్యూట్ నోటిఫికేషన్లు అందించే సామర్థ్యాన్ని బీబీఎం కొత్తగా కల్పించింది. అంతేకాక ఎన్నో మెరుగైన సందుపాయాలను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన బ్లాక్ బెరీ.. ఇప్పుడు వీడియో షేరింగ్ ఆప్షన్ నూ అందిస్తోంది. ఈ కొత్త పద్ధతిలో అతి పెద్ద వీడియోలను సైతం క్యాప్చర్ చేసి ఇతరులకు షేర్ చేసే అవకాశం ఉంది. ఇవే కాక కొత్త ఛాట్ స్క్రీన్ ను ఐవోఎస్ అందిస్తోంది. యాండ్రాయిడ్ మార్ష్మాల్ల (6.0) ద్వారా ఇప్పుడు బీబీఎం పని చేస్తుంది. -
ఐఫోన్ పాస్ వర్డ్ కోసం తిప్పలు..!
శాన్ బెర్నార్డినో కాల్పుల ఉగ్రవాది ఐఫోన్ పాస్ వర్డ్ ను ఎంత ప్రయత్నించినా ఎఫ్బీఐ అధికారులు తెలుసుకోలేకపోతున్నారు. ఎన్ని రకాలుగా చూసినా దాన్ని అన్లాక్ చేయలేకపోతున్నారు. ఘటన జరిగినప్పుడు కాల్పుల ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ ఐఫోన్ లోని సమాచారం సేకరించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. పాస్ వర్డ్ అన్ లాక్ చేయడం కోసం యాపిల్ సంస్థ సాయాన్ని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఐఫోన్ అన్ లాక్ చేసేందుకు సహకరించాలని యాపిల్ సంస్థను కోర్టు ఆదేశించింది. ఉగ్రవాది ఐ ఫోన్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న కొద్ది గంటల్లోనే ఆ పాస్వర్డ్ ను మార్చివేసినట్లు అధికారులు గమనించారు. రిమోట్ గా కూడా పాస్వర్డ్ రీసెట్ చేసే అవకాశం ఉండటంతో... బ్యాకప్ తొలగించి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. దీంతో కోర్టును ఆశ్రయించిన ఎఫ్బీఐకి యాపిల్ సంస్థ సహకరించాలని వాషింగ్టన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. సెక్యూరిటీ సాఫ్ట్వేర్ విషయంలో సహకరించాలని, వినియోగదారుల భద్రతపై రాజీ లేకుండా ప్రయత్నించాలని మేజిస్ట్రేట్ సూచించింది. అయితే కోర్టు ఆదేశాలను యాపిల్ సంస్థ సవాలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐఫోన్ పాస్వర్డ్ ను అన్ లాక్ చేయాలంటే పాస్ కోడ్ తప్పనిసరిగా అవసరం. పాస్ కోడ్ ను పదే పదే తప్పుగా టైప్ చేస్తే ఫోన్ డేటా కూడా డిలీట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో రిజ్వాన్ ఐఫోన్ ను డేటా డిలీట్ కాకుండా అన్ లాక్ చేయాలని యాపిల్ సంస్థకు కోర్టు సూచించింది. ఫరూక్ ఫోన్ లోని డేటాను మరో ఫోన్ కు మార్చి, తర్వాత అన్ లాక్ చేసే ప్రయత్నం చేయమని చెప్పింది. అంతేకాక విభిన్న పాస్ కోడ్ లతో ఐఫోన్ తెరిచే ప్రయత్నానికి సహకరించాలని యాపిల్ సంస్థను కోర్టు కోరింది. ఫరూక్ నాలుగు నెంబర్ల పాస్ వర్డ్ వాడినట్లుగా ఎఫ్ బీ ఐ అంచనా వేస్తుండటంతో ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలని కోర్టు చెప్పింది. అయితే విభిన్న పాస్ వర్డ్స్ తో అన్ లాక్ ప్రయత్నాలు చేయడం కంపెనీ నిబంధనలకు విరుద్ధమని, వినియోగదారుల భద్రతకు ప్రమాదమని యాపిల్ సంస్థ భావిస్తోంది. ఏ రూపంలో పాస్ వర్డ్ అన్ లాక్ చేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ ను పూర్తిగా మార్చాలని, అది ప్రపంచంలోని ఐఫోన్ వినియోగదారులందరికీ అందించాలని చెప్తున్న సంస్థ... ఫెడరల్ జడ్జి ఆర్డర్ ను సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే యాపిల్ సీఈవో టిమ్ కుక్.. కోర్టు ఆర్డర్ ను బహిరంగ లేఖద్వారా విమర్శించారు. దీని వెనుక చట్టపరమైప చిక్కులెన్నో కలిగి ఉన్నాయని అన్నారు. కాలిఫోర్నియా శాన్ బెర్నార్డినో కౌంటీ కి చెందిన ఆరోగ్య శాఖ ఉద్యోగి సయ్యద్ ఫరూక్ ఐఫోన్ వాడేవాడు. అతడు అతడి భార్య తష్ ఫీన్ మాలిక్ తో కలసి డిసెంబర్ 2న కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో ఐ ఫోన్ వారితోపాటు తీసుకెళ్ళారు. అప్పట్లో ఘటనలో 14 మంది చనిపోగా, 22 మంది గాయపడ్డారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన దంపతులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. కాల్పుల ప్రదేశంలో దొరికిన ఐఫోన్ ద్వారా ఘటన పూర్వాపరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
దప్పికతోనే మహిళ పోలీసుల విధులు!
న్యూఢిల్లీ: మహిళా సాధికారిత సాధనలో భాగంగా పోలీసుశాఖలోనూ పెద్ద ఎత్తున మహిళలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో కనీస మౌలిక సౌకర్యాలు లేక మహిళా పోలీసులు అనుభవిస్తున్న కష్టాలను తాజాగా ఓ సర్వే వెలుగులోకి తెచ్చింది. విధులు నిర్వహించే ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఒకటికి వెళ్లకుండా ఉండేందుకు కనీసం నీళ్లు కూడా తాగకుండా మహిళా పోలీసులు కర్తవ్యపాలన చేస్తున్నారు. దీనికితోడు పురుషుల శరీర దారుఢ్య కొలతలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రక్షణ జాకెట్లు రూపొందిస్తుండటంతో అవి తాము ధరించినప్పుడు చాలా బిగుతూగా ఉండి.. ఊపిరి కూడా అందడం లేదని, చాలాబరువుగా కూడా ఉంటున్నాయని మహిళా పోలీసులు ఈ సర్వేలో వెల్లడించారు. గత ఏడాది జరిగిన పోలీసుశాఖలోని మహిళల 7వ జాతీయ సదస్సు సందర్బంగా ఈ సర్వే వివరాలు, సిఫారసులను అందజేశారు. పోలీసు రీసెర్చ్, అభివృద్ధి బ్యూరో, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే వివరాలు తాజాగా వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాల గురించి చర్చించి.. వాటి పరిష్కారం కోసం సలహాలతో కూడిన ఈ సర్వే వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. కేంద్ర బలగాల్లో 33శాతం పోస్టులను, సరిహద్దు భద్రతా దళాల్లో 15 శాతం పోస్టులను మహిళలకు కేటాయించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీసుశాఖలోని మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. -
'కావాలనే బోరింగ్ పర్సన్లా కనిపిస్తా'
లండన్: బహిరంగ ప్రదేశాల్లో తాను పెద్ద చురుగ్గా కనిపించనని, బోరింగ్ పర్సన్ (పెద్దగా ఆసక్తి లేని వ్యక్తి)లా ఉండటానికే ఇష్టపడుతానని చెపుతోంది హాలీవుడ్ హీరోయిన్ ఎమ్మా వాట్సన్. 'హ్యారీపొటర్' సిరీస్ చిత్రాల్లో హెర్మియన్ గ్రాంజర్గా నటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది ఈ సుందరి. అయితే లైమ్లైట్లో ఉండి ప్రజల అందరి దృష్టి తనవైపు తిప్పుకోవడం అసలు ఇష్టం ఉండదని, తన ప్రైవసిని కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని ఆమె చెపుతోంది. 'నేను చాలా బోరింగ్ పర్సన్లా అందరికీ కనిపించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. నన్ను నేనుగా గుర్తుంచుకొని ప్రైవసీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తా. ఉదాహరణకు రెడ్కార్పెట్పై నడుస్తున్నప్పుడు కాస్తా స్తబ్దుగా, నాలో నేను ఉన్నట్టు కనిపిస్తా' అని ఎమ్మా వాట్సన్ పోర్టర్ మ్యాగజీన్కు తెలిపింది. 'నాకు ఇప్పుడు 25 ఏళ్లు వచ్చాయి. నాకు నేను నచ్చేవిధంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను ఏదైతే చెప్తానో అదే చేయాలనుకుంటాను. నాకు నేనుగా నా ప్రామాణికంగా ఉండాలనుకుంటా. పబ్లిక్ లైఫ్, వ్యక్తిగత జీవితం మధ్య పెద్దగా తేడా చూపించడం నాకు నచ్చదు' అని ఎమ్మా వివరించింది. -
గూగుల్, వాట్సాప్తో ప్రైవసీకి భంగం
న్యూఢిల్లీ: సెర్చి ఇంజిన్ గూగుల్, సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్తో పాటు వాట్సాప్ మొదలైనవి తమ యూజర్లపై నిఘా పెడుతున్నాయని, వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ అవాస్ట్ సీఈవో విన్సెంట్ స్టెక్లర్ ఆరోపించారు. యూజర్ల ఇష్టాఇష్టాల గురించి తెలుసుకుని, వారికి వాణిజ్య ప్రకటనలు పంపిస్తుంటాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి మరింత ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు. -
ఆర్థికాంశాల గోప్యత ప్రతిపాదనకు స్విట్జర్లాండ్ నో...
జెనీవా/న్యూఢిల్లీ: ఆర్థికాంశాల్లో ప్రైవసీకి భద్రత కల్పించాలన్న ప్రతిపాదనను స్విట్జర్లాండ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటి విషయాల్లో గోప్యతకు తావు లేదని స్పష్టం చేసింది. నల్లధనం సమస్యపై పోరాడుతున్న భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అనవసర గోప్యత
సంపాదకీయం అవసరంలేనిచోట దాపరికాన్ని ప్రదర్శిస్తే అది వికటించే ప్రమాదం ఉంటుంది. ఈ సంగతి రక్షణ మంత్రిత్వ శాఖకు ఆలస్యంగా అర్ధమై ఉంటుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెలక్రితం గుజరాత్ తీరంలో జరిగిందంటున్న ఒక చొరబాటు యత్నం ఉదంతం చుట్టూ ఇప్పటికే అల్లుకున్న మిస్టరీపై తీర రక్షక దళం సీనియర్ అధికారి నోరుజారి దాన్ని మరింత జటిలం చేశారు. దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉండగా... పాకిస్థాన్నుంచి మర పడవలో బయల్దేరిన ఉగ్రవాద ముఠా చొరబాటుకు చేసిన ప్రయత్నాన్ని మన తీర రక్షక దళం నిరోధించిందని కేంద్ర ప్రభుత్వం గత నెల ప్రకటించినప్పుడు దేశం ఉలిక్కిపడింది. ఎందుకంటే 2008లో కొందరు ఉగ్రవాదులు ఇదే తరహాలో ముంబై నగరంలోకి ప్రవేశించి నరమేథాన్ని సృష్టించారు. 140 మందిని పొట్టనబెట్టుకున్నారు. మళ్లీ అలాంటి దాడికి తెగించి వచ్చిన ఉగ్రవాదులను తీరరక్షక దళం అడ్డుకోగలిగిందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఉదంతంలో పడవలోనివారు తప్పించుకో వడానికి విఫలయత్నంచేసి చివరకు తమను తాము పేల్చుకు చనిపోయారని కేంద్ర ప్రభుత్వ ప్రకటన వివరించింది. ఈ కథనంలో జవాబులేని ప్రశ్నలెన్నో ఉన్నాయని ఆరోజే జాతీయ మీడియా అనుమానాలు వ్యక్తంచేసింది. ఒక సాధారణ మర పడవను తీర రక్షక దళం నౌక గంటపాటు వెంబడించినా పట్టుకోలేకపోయిందనడం, ఆ పడవలోనివారు పేల్చుకు చనిపోయారని చెప్పడం నమ్మశక్యంగా లేదని ఆ కథనాలు అభిప్రాయపడ్డాయి. తమకు ఎలాంటి పేలుడు శబ్దాలూ వినిపించలేదని ఘటన జరిగిన ప్రాంతానికి చేరువలో సంచరించిన మత్స్యకారులు చెప్పారని కూడా వివరించాయి. త్వరలోనే ఒక సమగ్ర ప్రకటన చేస్తామని కేంద్రం దీనికి స్పందనగా జవాబిచ్చింది. అది ఇంతవరకూ జరగకపోగా తీర రక్షక దళం డీఐజీ బీకే లోశాలి ఒక సమావేశంలో అత్యుత్సాహానికి పోయి ‘డిసెంబర్ 31 అర్థరాత్రి పాక్ వైపునుంచి ఒక పడవ వచ్చిందన్న సమాచారం అందగానే దాన్ని పేల్చిపారేయమని చెప్పాను. వారిని పట్టుకుని బిర్యానీలు తినిపించే ఉద్దేశం మాకు లేదు’ అని చెప్పారు. ఆ అధికారి మాటలు ఇప్పటికే ఆ ఉదంతంపై ఉన్న అనుమానాలను మరింత పెంచాయి. ఉగ్రవాద ముఠా ఒకటి దేశంలోకి జొరబడిన ఘటనపై నిజానికి ఇంత దాపరికం అవసరం లేదు. ఆ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ప్రకటన వెలువడింది గనుక అప్పుడే వివరాలన్నిటినీ సమగ్రంగా ప్రభుత్వం ప్రకటించి ఉండొచ్చు. కనీసం మరో వారం, పదిరోజుల తర్వాతనైనా వెల్లడించి ఉండొచ్చు. త్వరలోనే వెల్లడిస్తామని తానే చెప్పినందువల్ల ఆ బాధ్యత కేంద్రంపై ఉంటుంది. ఎందుకనో అది జరగలేదు. ఈలోగా ఒక అధికారి తానే ఆ పడవను పేల్చేయమన్నానని ప్రకటించడంద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. పడవలోనివారు తీర రక్షక దళాన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నించలేదని, కేవలం పారిపోవడానికి చూశారని రక్షణ శాఖ అధికారులు మొదట్లో చెప్పారు. ఇక పట్టుబడిపోతామని గ్రహించాక పేలుడు పదార్థాలున్న పడవను పేల్చేసుకున్నారని అన్నారు. జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ (ఎన్టీఆర్ఓ) సేకరించిందంటున్న ఫోన్ సంభాషణల ఆధారంగా ఆ పడవపై తీర రక్షక దళం అధికారులు నిఘా పెట్టారనుకున్నా అది మన సముద్ర జలాల్లోకి ప్రవేశించాక పట్టుకోవడంలో ఎందుకు విఫలమయ్యారో అంతుబట్టదు. వారు పారిపోవడానికి ఎంతగా ప్రయత్నించినా నౌక వేగానికి దీటుగా ఆ పడవ వెళ్లే అవకాశం లేదు. కనుక గంటసేపు దాన్ని వెంటాడాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఒకవేళ అధికారిక ప్రకటన చెబుతున్నట్టు ఉగ్రవాదులు పడవను పేల్చేసుకుని ఉన్నా...తీర రక్షక దళం డీఐజీ చెబుతున్నట్టు ఆయనే పేల్చేయమన్నా అందుకు సంబంధించిన చప్పుళ్లు దరిదాపుల్లోని మత్స్యకారులకు వినబడాలి. అదీ లేదు. మరో కోణంనుంచి చూస్తే... సోదాలకు ప్రయత్నించకుండా పడవను పేల్చేయడం తీవ్ర తప్పిదమవుతుంది. అనుమానాస్పద స్థితిలో సంచరించే పడవ అయినంత మాత్రాన ఎలాంటి ఆరా తీయకుండా...అటునుంచి ప్రతిఘటన లేకుండా పేల్చేయడం సమర్థనీయమేనా? మన చట్టాలుగానీ, రాజ్యాంగంగానీ దీన్ని అనుమతిస్తాయా? అంతర్జాతీయ న్యాయ సూత్రాలు సమర్థిస్తాయా? ఉదంతం జరిగిన ప్రాంతం మన సముద్ర జలాల పరిధికి ఆవల ఉంది. పైగా ఆ ప్రాంతంలో మత్స్యకార పడవల సంచారం విస్తృతంగా ఉంటుంది. అలాగే మాదకద్రవ్యాలనూ, మద్యాన్ని, ఆయుధాలనూ, డీజిల్నూ అక్రమ రవాణాచేసే స్మగ్లర్ల పడవలు సంచరిస్తుంటాయి. ముంబై దాడి ఘటన తర్వాత మన తీర ప్రాంతాన్ని పటిష్టం చేయడంలో భాగంగా మెరైన్ పోలీస్ స్టేషన్లను విస్తృతంగా ఏర్పాటుచేశారు. భద్రతా సంస్థలమధ్య సమన్వయం పెరిగింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, అవసరానికి అనుగుణంగా నిఘాను పెంచడం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జరిగిన ఈ ఉదంతంపై ఇంత అయోమయం ఉండవలసిన అగత్యం ఏర్పడకూడదు. దేశం పెను ప్రమాదంబారిన పడకుండా తప్పించామని చెప్పుకోవడానికే దీనికి ఎనలేని ప్రాముఖ్యమిచ్చి ప్రచారం చేశారని కాంగ్రెస్ ఇప్పటికే విమర్శించింది. కాంగ్రెస్ తీరు పాకిస్థాన్ వాదనను బలపరిచేలా ఉన్నదని బీజేపీ ప్రతి విమర్శచేసింది. వీరి వాదప్రతివాదాల సంగతెలా ఉన్నా జరిగిన పరిణామాలు అంతర్జాతీయంగా మన ప్రతిష్టను దెబ్బతీసేలా తయార య్యాయి. మన దేశ రక్షణ కోసం తీసుకున్న ఒక చర్య విషయంలో అనవసరమైన దాపరికాన్ని పాటించడం ద్వారా కేంద్రం లేనిపోని అనుమానాలకు తావిచ్చింది. పడవను పేల్చేయమని తానే ఆదేశించానని చెప్పిన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నంతమాత్రాన ఈ వివాదం సమసిపోదు. ఇకముందైనా ఇలాంటి ఉదంతాల విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని గ్రహించడం అవసరం. -
షేకీ వీడియోలను సరిచేస్తుంది!
సైకిల్ తొక్కుతూ లేదా మెట్లు ఎక్కుతూ లేదా అటూ ఇటూ తిరుగుతూ ‘గోప్రో’ వంటి కెమెరాలతో వీడియోలు తీశారా? కెమెరా కదిలినప్పుడల్లా వీడియోల్లోని దశ్యాలు షేక్ అవుతున్నాయా? అయితే ఆ సమస్యను ఫిక్స్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ‘హైపర్లాప్స్’ అనే కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ మూడు దశల్లో పనిచేస్తుంది. మొదట ప్రతి సీన్లో ముఖ్యమైన ఫీచర్స్ను విశ్లేషించి ఓ వీడియోను సుమారు అంచనాతో పునర్నిర్మిస్తుంది. రెండోదశలో కెమెరా కదలికలు లేకుండా స్మూత్ ఫ్రేమ్లతో వర్చువల్ రీకన్స్ట్రక్షన్ చేస్తుంది. చివరగా తొలుత రూపొందించిన వీడియోను ఈ స్మూత్ ఫ్రేమ్లతో కూడిన కెమెరా పాత్లో బంధిస్తుంది. ఒరిజినల్ ఫుటేజీలో లేని అదనపు ఫ్రేములను ఉత్పత్తి చేసి కెమెరా జంప్లను తీసేస్తుంది. దీంతో షేక్ అయ్యే వీడియో.. స్మూత్గా ప్లే అయిపోతుంది. అయితే ఇలాంటి ఇమేజ్-స్టెబిలైజేషన్ సాఫ్ట్వేర్లు మార్కెట్లోకి ఇంతకుముందే కొన్ని వచ్చినప్పటికీ, వాటి కన్నా ఈ కొత్త సాఫ్ట్వేర్ చాలా వేగంగా, సమర్థంగా పనిచేస్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. -
‘సారీ’ అంటే ‘సారీ’ అనుకున్నాం
మనోగతం గోప్యత ఉన్నచోటే...అనుమానం పుడుతుంది. అది పెనుభూతం అవుతుంది. నాకు ఉన్న ఒక అలవాటో దురలవాటో తెలియదుగానీ...ప్రతి విషయాన్నీ గోప్యంగా ఉంచడం. పనిగట్టుకొని ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచాలనేది నా పాలసీ కాదుగానీ... ‘అన్ని విషయాలు అందరితో ఎందుకు చెప్పుకోవాలి?’ అని ఆలోచిస్తుండేవాడిని. వృత్తిరీత్యా నాకు ఎంతోమంది అమ్మాయిలతో పరిచయం ఉంది. వాళ్లతో ఎన్నోసార్లు మాట్లాడుతుంటాను. అప్పటికి నా పెళ్లై సంవత్సరం కూడా కాలేదు. ఒకరోజు రాత్రి నేను ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే- ‘‘ఎవరితో మాట్లాడుతున్నారు?’’ అని అడిగింది మా ఆవిడ. ఆమె అడిగిన పద్ధతి నాకు నచ్చక దురుసుగా సమాధానం ఇచ్చాను. దీంతో...రెండు రోజుల వరకు మా మధ్య మౌనం! ఆరోజు ఆవిడే నా దగ్గరకు వచ్చి- ‘‘సారీ’’ అని చెప్పింది. ‘‘నేను కూడా సారీ’’ అన్నాను. ఆరోజు ఎవరితో మాట్లాడానో, ఎందుకు మాట్లాడానో వివరంగా చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మధ్య అపార్థాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. పైగా మాకు తెలిసిన భార్యభర్తలు ఎవరైనా అపార్థాలతో గొడవలు పడుతుంటే మేము వెళ్లి వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి వస్తుంటాం! - కె.శంకర్, ఏలూరు