ramnagar
-
ఆటిట్యూడ్ స్టార్ 'చంద్రహాస్' సినిమా ఫస్ట్ లుక్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'రామ్ నగర్ బన్నీ'. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, పొడకండ ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్లో 'రామ్ నగర్ బన్నీ' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా హీరో చంద్రహాస్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఆ మొత్తాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అందజేశారు .తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ..'ప్రభాకర్ నాకు సుపరిచితులు. ఆయన రామ్ నగర్ బన్నీ సినిమా గురించి నాకు చెప్పారు. ఆయన పిలుపుమేరకు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఇందులో హీరోగా నటిస్తున్న చంద్రహాస్ మా అమ్మాయి క్లాస్ మేట్. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. మొదటి సినిమాకు హీరోలు అంతగా ఆకట్టుకోరు. కానీ చంద్రహాస్ బాగున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా.' అని స్పీకర్ తెలిపారు.'ఆటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ మాట్లాడుతూ .. మా "రామ్ నగర్ బన్నీ" ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. రెండేళ్ల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. నేను సినిమాల్లో ఒకలా, బయట మరొకలా బిహేవ్ చేయను. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటా. అది కొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను. అందుకు మా అమ్మా నాన్నలు ఎంతో సపోర్ట్ చేశారు. మా నాన్న ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతాను. నా ప్రతిభను నా సినిమాల రిజల్ట్ ద్వారానే తెలియజేయాలని భావిస్తున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటిలో ఫస్ట్ మూవీగా రామ్ నగర్ బన్నీ మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమా కలెక్షన్స్ లో 10 శాతం వరద బాధితుల సహాయార్థం అందిస్తాం.' అని ఆయన తెలిపారు. -
HYD: రాంనగర్ కూల్చివేతలు..‘హైడ్రా’ కమిషనర్ స్పందన ఇదే..
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లోని రాంనగర్ మణెమ్మ గల్లీలో కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. మణెమ్మ గల్లీలోని రోడ్డు ను ఆక్రమించి సర్వే నెంబర్ 20,21 ను కళ్ళు కాంపౌండ్, గ్రౌండ్ఫ్లోర్ ప్లస్ రెండు అంతస్తులు కట్టారని రికార్డులు పరిశీలించి వాటిని కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాల కారణంగా మణెమ్మ గల్లీలో ఉండే వారు నిరంతరం డ్రైనేజీ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాంనగర్ సర్వే నెంబర్ 20,21లో పలు అక్రమ నిర్మాణాలను శుక్రవారం(ఆగస్టు30)న కూల్చివేశామని రంగనాథ్ తెలిపారు. -
హైడ్రా దూకుడుతో ఆందోళనలో ప్రజలు
-
రాంనగర్లో హైడ్రా కూల్చివేతలు.. ఘర్షణ వాతావరణం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణకు హైడ్రా చేపట్టిన చర్యలు అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది. రాంనగర్ చౌరస్తాలోని మనమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇవాళ(శుక్రవారం) ఉదయం నుంచే కూల్చివేతలు మొదలయ్యాయి. ఆక్రమణకు గురైన చెరువులు, కాలువలు, పార్కుల గురించి హైడ్రాకు ప్రతిరోజూ కనీసం 60 నుంచి 70 ఫిర్యాదులు అందుతున్నాయి. రాంనగర్ లోని మల్లెమ్మ గల్లీలోని 1-9-189 నెంబర్ గల స్థలం తమదని విక్రం యాదవ్ పేర్కొనగా, ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు స్థానికుల ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా కమిషనర్ ఎవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఈ రోజు కూల్చివేతలు మొదలయ్యాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన 24 గంటలకే చర్యలు ప్రారంభించింది. కూల్చివేతలను భవన యజమానులు అడ్డుకుంటున్నారు. స్థానిక పోలీసులు వారిని నిలువరిస్తున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీస్ బలగాలు భారీగా మొహరించాయి. -
మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్ (ఫొటోలు)
-
రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో వ్యభిచారం
-
హైదరాబాద్ అబిడ్స్ లో వ్యభిచారం ముఠా అరెస్ట్
-
వ్యభిచార కేసులో అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
-
అబిడ్స్ వ్యభిచారం కేసు.. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్నగర్కు చెందిన అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. రామ్నగర్ అఖిల్ పహల్వాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రాంనగర్ అఖిల్ వ్యభిచారం కేసు పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డ్లను పోలీసులు బయటికి తీయగా.. అతడి మొబైల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్ నుంచి 16 మంది అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్.. ఈ 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు అఖిల్పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు. చదవండి: పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
నేడు అయోధ్యలో 51 ఘాట్లలో 24 లక్షల దీప కాంతులు!
అయోధ్యలో దీపావళిని మరింత దేదీప్యమానం చేసేందుకు ఈసారి కూడా రామనగరిని అందంగా ముస్తాబు చేస్తున్నారు. అయోధ్యలోని 51 ఘాట్లలో నవంబరు 11న(నేడు) 24 లక్షల దీపాలు వెలిగించి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 6 సంవత్సరాలుగా అయోధ్యలో జరుగుతున్న దీపోత్సవం ప్రపంచ రికార్డులను సృష్టిస్తోంది. ఈ సంప్రదాయం ఈసారి కూడా కొనసాగనుంది. దీపావళి సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున లేజర్ షో ద్వారా శ్రీరాముని జీవిత సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించనున్నారు. మనదేశానికి చెందిన కళాకారులతో పాటు రష్యా, శ్రీలంక, సింగపూర్, నేపాల్కు చెందిన కళాకారులు కూడా ఈ దీపోత్సవ్లో రామలీలను ప్రదర్శించనున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దీపావళి నాడు అయోధ్యలో త్రేతాయుగం కళ్లకు కట్టినట్లు చూపేందుకు కళాకారులు సన్నద్ధమవుతున్నారు. రామ మందిర నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈసారి యూపీతో పాటు పలు రాష్ట్రాల సంస్కృతులను ప్రదర్శనల్లో చూపనున్నారు. ఇప్పటికే అయోధ్యానగరి దీప కాంతులతో మెరిసిపోతోంది. రోడ్లు, ఇళ్లు, వీధులు జనాలతో రద్దీగా మారిపోయాయి. కాగా అయోధ్యలో జనవరి 22న రామాలయంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది? #WATCH | Ayodhya is all set to hold a grand Deeptosav on the eve of Diwali with over 24 lakh diyas at 51 ghats set to illuminate the city pic.twitter.com/p4cEjJQiCd — ANI (@ANI) November 11, 2023 -
గాయత్రి ఇల్లు కబ్జాకు కుటుంబీకుల యత్నం
గచ్చిబౌలి: సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఒకరి పేరిట ఉండగా, పొజిషన్లో వేరొకరు ఉన్నారు. యువతిపై లైంగిక దాడి ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం గాయత్రిసహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఉంటాడని భావించిన కుటుంబసభ్యులు ఆదివారం మధ్యాహ్నం తల్లి, సోదరి, సోదరుడు ప్రదీప్ రాజు, సమీప బంధువులు మల్లికార్జున్, అఖిల్ తదితరులు గాయత్రి ఇంటి వద్దకు వచ్చారు. ఆ సమయంలో వాచ్మన్ గేటుకు తాళం వేయగా అతడిపై దాడి చేసి తాళం పగులకొట్టారు. కృష్ణవేణి, సౌజన్య లోపలికి వెళ్లగా, మిగిలినవారు గేటు వద్దే ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. దీంతో ఆయన ‘డయల్–100’కు ఫోన్కాల్ చేయడంతో గచ్చిబౌలి ఠాణాకు చెందిన మహిళా ఎస్సై, కానిస్టేబుళ్లు గాయత్రి ఇంటి వద్దకు చేరుకుని అక్కడ ఉన్నవారిని బయటకు పంపేశారు. అద్దెకున్నవారికి బెదిరింపులు గాయత్రి నుంచి ఇల్లు అద్దెకు తీసుకున్న హేమంత్ వద్దకు ఈ ఏడాది మార్చి 30న సౌజన్య వెళ్లారు. ఆ ఇల్లు తనదని వెంటనే ఖాళీ చేయాలని హేమంత్ను బెదిరించి కరెంట్ కనెక్షన్ తొలగించడంతో ఆమెపై కేసు నమోదైంది. గాయత్రి తన ఇంటికి సమీపంలో ఉన్న కొన్ని దుకాణాలను అద్దెకు ఇవ్వగా, వీటిల్లో వ్యాపారాలు చేసుకుంటున్న అమిత్సింగ్, జేమ్స్, పాండు, మధుసూదన్ల వద్దకు సౌజన్య వెళ్లి హంగామా చేసింది. వారి సామాన్లను పగులకొట్టడంతోపాటు సూసైడ్ నోట్లో వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో ఆమెపై మరో కేసు నమోదైంది. (చదవండి: సినిమా స్టోరీని తలపిస్తున్న గచ్చిబౌలి గాయత్రి కేసు.. ట్విస్టులే ట్విస్టులు) -
హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతిన్న కార్పొరేటర్
-
సన్రైజర్స్ జట్టులో హైదరాబాదీ
సాక్షి, ముషీరాబాద్: లక్షలాది మంది హైదరాబాద్ క్రికెట్ అభిమానుల ఆకాంక్షలను మూటగట్టుకొని ఐపీఎల్లోఆడేందుకు శుక్రవారం (ఈ నెల 21న)బయలుదేరి వెళ్తున్నాడు రాంనగర్ కుర్రోడు భావనక సందీప్. ఐపీఎల్ మ్యాచ్లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవల జరిగిన వేలంపాటలో సందీప్ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది. హైదరాబాద్ నుంచి మొదట ముంబై వెళ్లి ఈ నెల 23న మిగతా సన్రైజర్స్ జట్టుసభ్యులతో కలిసి యూఏఈకి ప్రత్యేక చాపర్లో వెళ్లనున్నాడు. యూఏఈలో ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న అనంతరం జట్టు సభ్యులు నెట్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. సన్రైజర్స్ జట్టులో హైదరాబాద్ నుంచిప్రాతినిధ్యం వహిస్తోంది భావనక సందీప్ ఒక్కడే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సందీప్ ఏం చెప్పారంటే.. ‘సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నేనొక్కడినే హైదరాబాద్కు చెందినవాడిని ఉండడంతో సహజంగానే తనపై హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలను, ఆకాంక్షలను నేనుతప్పకుండా హైదరాబాద్ క్రికెట్ అభిమానుల మద్దతుతో నెరవేర్చడానికి కృషి చేస్తా. ఇప్పటివరకు రంజీ, దేశవాలీ క్రికెట్ మాత్రమే ఆడాను. ప్రస్తుతం ప్రపంచ మేటి ఆటగాళ్లతో ఐపీఎల్లో ఆడబోతున్నాను. ఈ అవకాశం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏబీ డివిల్లియర్స్కు బౌలింగ్ చేయడం నా చిరకాల వాంఛ. భారత జట్టులో స్థానం సంపాదించేందుకు ఇక్కడే పునాదులు వేసుకుంటాను. అవకాశం కల్పించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి, వీవీఎస్ లక్ష్మణ్కు, అంబటి రాయుడుకి, కోచ్లు జాన్, శ్రీధర్లకు, ఫిట్నెస్ సాధించేందుకు గంటల తరబడి నాకు బౌలింగ్ చేసిన మణితేజ, మధుసూదన్రెడ్డిలకు, చిన్నప్పటి నుంచే నాలోని క్రికెట్ను తట్టిలేపిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను’. సందీప్ రికార్డులివీ.. 2010లో 18 ఏళ్ల వయసులో రంజీతో రంగప్రవేశం చేసిన సందీప్ మొదటి మ్యాచ్లోనే ఝార్ఖండ్పై సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 75 ఏళ్ల హైదరాబాద్ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసిన 5వ బ్యాట్స్మన్గా సందీప్ నిలిచాడు. ఇప్పటి వరకు 54 రంజీ మ్యాచ్లు ఆడి 48.5 సగటుతో తన ప్రతిభను అజేయంగా కొనసాగిస్తున్నాడు. మొత్తం 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ రంజీ టీమ్కు వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఇతను లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కూడా. విజయ్ హజారే 50 ఓవర్ల టోర్నమెంట్లో హైదరాబాద్ నుంచి 14 వికెట్లు తీసి ఆల్రౌండర్ ప్రతిభను చాటాడు. బీటెక్ పూర్తిచేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించిన సందీప్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లలో తన నైపుణ్యాన్ని చాటుతూ తన చిరకాల స్వప్నమైన ఐపీఎల్లో స్థానం దక్కించుకున్నాడు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
అనంతపురం న్యూసిటీ : రైలుకింద పడి ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు... అనంతపురంలోని రాంనగర్లో నివాసముంటున్న చిగిచెర్ల నారపరెడ్డి (50) ఆటో డ్రైవర్. కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో బుధవారం హెచ్చెల్సీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైలుకిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ప్రేమ జంటలకు కౌన్సిలింగ్
అనంతపురం సెంట్రల్ : రాంనగర్ 80 అడుగుల రోడ్డు శివారుప్రాంతంలో ప్రేమ జంటలకు నాల్గవపట్టణ ఎస్ఐ శ్రీరామ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. సమీపంలో చిల్డ్రన్పార్కును కొన్ని ప్రేమ జంటలు అడ్డాగా చేసుకున్నాయి. దాదాపు 15 ప్రేమజంటలు పోలీసులకు తారసపడ్డారు. తెలిసీతెలియని వయస్సులో ప్రేమ అంటూ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారనే విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
రాంనగర్ ప్రభుత్వ పాఠశాల ధీనావస్థ
-
నూతన జిల్లాల్లోని భవనాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి
రాంనగర్ : నూతన జిల్లాలోని భవనాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జేసీలతో నూతన జిల్లాల భవనాలు, సదుపాయాలపై సమీక్షించి మాట్లాడారు. నూతన జిల్లాలకు ఆర్డర్లు తీసుకున్న ఉద్యోగులందరూ 11వ తేది ఉదయం 10.30గంటలకు ఆయా కార్యాలయాల్లోని రిజిష్టర్లో సంతకం చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో జెండా వందనం నిర్వహించాలని సూచించారు. కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులందరు సంబంధిత కార్యాలయాల్లో గ్రూపు ఫొటోలు దిగాలని అన్నారు. కొత్త మండలాలు, నూతన డివిజన్లకు కేటాయించే ఉద్యోగుల వివరాలను ఈనెల 10వ తేదీన ఉదయం జిల్లా కలెక్టర్లకు పంపిస్తామని అన్నారు. నూతన జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జేసి సత్యనారాయణ, ఏజేసి వెంకట్రావు, డీఆర్వో రవి, జెడ్పీ సీఈఓ మహేందర్రెడ్డి, తదితరులున్నారు. -
చిన్నారి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : రామ్నగర్లో ఓ చిన్నారి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. రామ్నగర్కు చెందిన వెంకట్, పల్లవి దంపతుల కూతురు మానస(4) ఈ నెల 14 వ తేదీన ఇంట్లో మెట్లపై నుంచి జారిపడింది. గాయపడిన పాపను పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. చిన్నారి చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ప్రమాదం వల్లే చనిపోయిందని తల్లిదండ్రులు చెబుతుండగా స్థానికులు మాత్రం తల్లిదండ్రులే చంపారని ఆరోపిస్తున్నారు. దీంతో ముషీరాబాద్ పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
రాంనగర్ : వివిధ శాఖల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజలు ఇచ్చే వినతులకు అధికారులు అధిక ప్రాధాన్యతమిచ్చి సత్వరమే పరిష్కరించాలని, పరిష్కరించలేని, ఆస్కారం లేని ఫిర్యాదులు బాధితులకు తెలియజేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో 15 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నందున నూరు శాతం జియో ట్యాగింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. జిల్లా పునర్వి విభజన ఉన్నందు వల్ల తెలంగాణకు హరితాహారం జిల్లాల వారీగా విభజిస్తామన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డీఆర్వో రవి, వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కాళోజీకి ఘన నివాళి
రాంనగర్ : కాళోజి నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రారంభించారు. అనంతరం కాళోకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా అన్ని జిల్లాలో నిర్వహించుకోవాలని ఆదేశించిందని, అందుకే కాళోజి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కాళోజి తెలంగాణ ఉద్యమానికి మూలపురుషుడని, తాను నమ్మిన సిద్ధాంతంపై చివరి వరకు నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే, ఇక్కడి ప్రజలకు నీరు, నిధులు, నియామకాలు సక్రమంగా అందుతాయని నమ్మిన వ్యక్తి కాళోజి అని, అందుకే తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందే ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను మేలుకొల్పారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ, ఏజేసి వెంకట్రావు, డీఆర్ఓ రవి, డ్వామా పీడీ దామోదర్రెడ్డి పాల్గొన్నారు. -
డ్రెస్సింగ్ టేబుల్ మీదపడి చిన్నారి మృతి
-
డ్రెస్సింగ్ టేబుల్ మీదపడి చిన్నారి మృతి
హైదరాబాద్: డ్రెస్సింగ్ టేబుల్ మీదపడి తొమ్మిది నెలల చిన్నారి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానిక అభయాంజనేయస్వామి దేవాలయం వీధిలో నివాసముంటున్న ప్రవీణ్, అనూష దంపతుల రెండో కుమారుడు అయాన్ ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు డ్రెస్సింగ్ టేబుల్ మీదపడింది. దీంతో అయాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
రుణమాఫీ నిధులను ఒకేసారి విడుదల చేయాలి
రాంనగర్ : 3వ, 4వ విడత రుణమాఫీ నిధులను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి మూడో విడత డబ్బులు నేటì కీ విడుదల చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు దాటుతున్నా రుణమాఫీపై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా సాగర్ ఎడమకాల్వ, ఏఎమ్మార్పీ, ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపి పంటలకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ శ్రీశైలం, జహంగీర్, దండ వెంకటరెడ్డి, మందడి రాంరెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, వి.నారాయణరెడ్డి, వి.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్రెడ్డి, కావలి కృష్ణ, మందడి నర్సింహ, ఇంద్రారెడ్డి ఉన్నారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
రాంనగర్: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు పి. ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గార్లపాటి కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా నేటికి జర్నలిస్టుల సమస్య ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం కొంత మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేసినా ఏ ఒక్కరికి ప్రయోజనం లేదన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులు మాటలకే పరిమితమైందని విమర్శించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు కోటగిరి ౖ§ð వాదీనం, చలసాని శ్రీనివాసరావు, పులిమామిడి మహేందర్రెడ్డి, దాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీల హక్కులను కాపాడాలి
రాంనగర్: ఆదివాసీల హక్కులను కాపాడాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.కోటేశ్వర్రావు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదని, ఆదీవాసీలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారు డేవిడ్కుమార్, జిల్లా నాయకులు రాయి కృష్ణ, రాచకొండ జనార్దన్, ఇందూరి సాగర్, బాదె రాము, పలస యాదగిరి, లక్ష్మయ్య, శంకర్రెడ్డి, జానయ్య, సతీశ్ పాల్గొన్నారు. -
ఎంసెట్కు ఏర్పాట్లు పూర్తి
-
ఎంసెట్కు ఏర్పాట్లు పూర్తి
రాంనగర్: ఈనెల 14న నిర్వహించే ఎంసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేసీ ఎన్.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అదనపు జాయింట్ కలెక్టర్ చాంబర్లో ఎంసెట్ నిర్వహణపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంజినీరింగ్, మెడిసిన్ ఎంసెట్ పరీక్షలకోసం37 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10గంటల నుండి ఒంటి గంట వరకు, మెడిసిన్ మధ్యాహ్నం 2-30 గంటల నుండి 5-గంటల వరకు జరుగుతుందని ఆయన చెప్పారు. నల్లగొండలో ఇంజినీరింగ్కు 15 పరీక్షా కేంద్రాలు, కోదాడలో 7 పరీక్షా కేంద్రాలు, మెడిసిన్కు నల్లగొండలో 9 పరీక్షా కేంద్రాలు, కోదాడలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్షకు 10329 మంది విద్యార్ధులు, మెడిసిన్కు 7045 మంది విద్యార్ధులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో వున్నందున ఎంసెట్కు హాజరయ్యే విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ నుంచి నల్లగొండలోని ఎన్జీ కాలేజీ వరకు, కోదాడలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ వరకు ఇంజనీరింగ్ విద్యార్ధుల సౌకర్యార్ధం ఉదయం 6గంటల నుంచి, మెడిసిన్ విద్యార్ధులకు ఉదయం 11గంటల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ నుంచి పరీక్షా కేంద్రాలకు, కోదాడలో ప్రభుత్వ బాలుర హైస్కూల్ నుండి పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. మండల కేంద్రాల నుండే కాకుండా విద్యార్ధులు అధికంగా వున్న ప్రాంతాల నుంచి నల్లగొండకు, కోదాడకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ బస్సులు సంబంధిత మండలాల పోలీస్ స్టేషన్ల నుండి బయలుదేరి బస్టాండు మీదుగా నిర్ధేశించిన ప్రాంతాలకు వెళతాయని ఈ బస్సులకు ఎంసెట్-2015 అని ప్రత్యేక బ్యానర్లు, స్టిక్కర్లు ఉంటాయని ఆయన తెలిపారు. అంతరాయం లేకుండా... పరీక్షా కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చూడాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద గ ట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. సెంటర్స్ దగ్గర 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ షాప్లను కూడ విధిగా మూసి ఉంచేట్లు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా పరీక్షల కేంద్రాల వద్ద మంచినీరు, ఫస్ట్ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి అదనపు జేసీ నిరంజన్, డీఆర్వో రవినాయక్, ఎంసెట్ కో-ఆర్డినేటర్ నాగేందర్రెడ్డి, రవాణాశాఖ డిప్యూటీ కమీషనర్ చంద్రశేఖర్, ఆర్ఐవో ప్రకాశ్, నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి, డీఎస్పీ రాములునాయక్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు. కోదాడకు ఉచిత బస్సులు- ఎమ్వీఐ శ్రీనివాస్రెడ్డి కోదాడ టౌన్ : ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల కోసం పలు పట్టణాల నుంచి కోదాడకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు కోదాడ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిర్యాలగూడెం, సూర్యాపేట, హుజూర్నగర్ బస్టాండ్లనుంచి ఇంజినీరింగ్ విద్యార్ధుల కోసం ఉదయం 7:30 గంటలకు, మెడిసిన్ విద్యార్ధుల కోసం మధ్యాహ్నం 12:30 గంటలకు ఉచిత బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. కోదాడ బస్టాండ్ నుంచి కేఆర్ఆర్ కళాశాలకు, ఇతర సెంటర్లకు ఉదయం 7:30 నుండి 8:45 వరకు ఉచిత బస్సులు ఉంటాయని తెలిపారు. సమ్మెతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహకులు కల్పిస్తున్న ఈ ఉచిత సౌకర్యంపై ఇబ్బందులు ఉంటే 96186 51213 నెంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. సెంటర్ల వివరాల్లో ఇబ్బం దులు ఉంటే కోదాడ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్ సహాయం తీసుకోవాలని రీజినల్ కో-ఆర్డినేటర్ తెలిపారు. -
మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం
రాంనగర్ : మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంపై స్పష్టమైన నిర్ణయం వెలువరించకపోవడం దుర్మార్గమైన చర్య అని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్రేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపకారవేతనాలకు సంబంధించి దరఖాస్తు తేదీ కూడా ప్రకటించకపోవడం ప్రభుత్వ మొండి వైఖరిని తేటతెల్లం చేస్తుందని విమర్శించారు. ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టి ఫీజు రీయింబర్స్మెంట్ను నీరుగార్చేం దుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగణంగా మెస్ చార్జీలు, ఉపకారవేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై నిర్లక్ష్యం వీడకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో నిరంజన్కు అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఐతగోని జనార్దన్, జిల్లా కార్యదర్శి బొల్లం సతీష్యాదవ్, బాడిగల శ్రవణ్, నాగరాజు, మనోహర్, ప్రవీణ్, మహేష్, ఆంజనేయులు, అశోక్ పాల్గొన్నారు. -
జనవరి నుంచి గ్యాస్పై నగదు బదిలీ
రాంనగర్ : జిల్లాలో జనవరి ఒకటి నుంచి గ్యాస్పై ఇచ్చే రాయితీ మొత్తం నగదు బదిలీ పథకం ద్వారా అమలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. సోమవారం ఆమె ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ నగదు బదిలీకి సంబంధించి ఎల్పీజీ వినియోగదారుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్నంబర్ను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా వారి ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. ఆధార్ లేకున్నా డీలర్కు బ్యాంక్ ఖాతానంబర్ ఇస్తే ఆ ఖాతాలోకి రాయితీ జమ కానుందని వివరించారు. మొదటి మూడు నెలలు పాటు ఈ పథకంలో చేరకపోయినా రాయితీ ధరకే సిలిండర్ ఇస్తారని తెలిపారు. ఆధార్పై ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే మీసేవ కేంద్రాలలో సంప్రదించాలని సూచిం చారు. ప్రతి మండల కేంద్రంలో శాశ్వత ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎల్పీజీ డీలర్లు ప్రజల అవగాహన కోసం ప్రధా న కూడళ్లలో గ్యాస్ నగదు బదిలీపై బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి డీలరు వారి కార్యాలయంలో ఒక వ్యక్తిని నియమించి ప్రజలకు సహకారం అందించాలని సూచిం చారు. వినియోగదారులు అంద రూ డిసెంబర్ 31లోగా తమ గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేసుకొని సహకరించాలని కోరారు. -
డిసెంబర్ 15 నాటికి కస్టమ్మిల్లింగ్ లక్ష్యం నూరుశాతం పూర్తి చేయాలి : జేసీ
రాంనగర్ : రబీ సీజన్ 2013-14 సంవత్సరానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని జేసీ ప్రీతిమీనా కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్మిల్లర్లతో ఏర్పాటు చేసినసమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి 60,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉందన్నారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయడానికి గాను ప్రతిరోజూ 2500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఖరీఫ్2014-15 సంవత్సరానికి కస్టమ్మిల్లింగ్ కింద ఇప్పటికే 41,767 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 40,746 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు అప్పగించామన్నారు. అయితే ఇందులో 27,707 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎవరు కూడా బియ్యాన్ని డెలివరీ చేయలేదన్నారు. ఖరీఫ్ 2014-15 సంవత్సరానికి రా రైస్ 3,08,103 టన్నులు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 15,606 టన్నులు మాత్రమే డెలివరీ చేశారన్నారు. లెవీ కింద ప్రభుత్వానికి డెలివరీ చేయాల్సిన బాయిల్డు రైస్కు బదులు రా రారైస్ను త్వరితగతిన ఇవ్వాలని కోరారు. మిల్లర్లు ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. మిల్లుల వారీగా ప్రతివారం ఎంత ధాన్యం కొనుగోలుచేశారో ప్రతి శనివారం రిపోర్టు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రైస్మిల్లర్ల అధ్యక్షుడు, రాష్ట్ర అసోసియేషన్ కన్వీనర్ జి.నాగేందర్ మాట్లాడుతు రైస్ మిల్లర్లు బాయిల్డ్ రైస్, రా రైస్ ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా అందించడానికి కృషిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ నాగేశ్వర్రావు, సివిల్సప్లయ్ డీఎం వరకుమార్, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ కార్పొరేషన్కు రూ.20వేల కోట్లు కేటాయించాలి
రాష్ట్రంలో 55శాతం ఉన్న బీసీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ను ముట్టడించారు. బీసీ కార్పొరేషన్కు రూ.20వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. రాంనగర్ :రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్కు రూ. 20 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. బడ్జెట్లో బీసీలకు రూ. 2,022 కోట్లు మాత్రమే కేటాయించినందుకు నిరసనగా మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 55 శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 2 శాతం మా త్రమే నిధులు కేటాయించిందని తెలిపారు. అన్ని రంగాలలో వెనుకబడిన బీసీల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీ సంక్షేమ శాఖకు మంత్రిని నియమించి, ఆ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భ ర్తీ చేయాలన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల కేటాయింపులో వివక్ష చూపడం శోచనీయమన్నారు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీసీనేతలను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జేసీ ప్రీతిమీనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కంది సూర్యనారాయణ, బోళ్ల కరుణాకర్, గండి చెర్వు వెంకన్నగౌడ్, కాసోజు విశ్వనాథం, వైద్యం వెంకటేశ్వర్లు, దుడుకు లక్ష్మీనారాయణ, జనగాం అంజ య్యగౌడ్, జువాజి ఇంద్రయ్య, వెంకటేశ్వర్లు, అయితగోని జనార్దన్, చొల్లేటి రమేష్, చిక్కుళ్ల రాములు, అరవింద్, మైనం నారాయణ, లింగయ్య, శ్యాంసుం దర్ తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్ 1నుంచి ఆహారభద్రత కార్డుల జారీ
రాంనగర్ : నవంబర్ 1వ తేదీ నుంచి ఆహారభద్రత కార్డులు జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, ఐకేపీ, వీఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయాలని నిర్ణయించినందున ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఒక రిజిష్టరులో నమోదు చేసి 16వ తేదీలోగా తహసీల్దార్లకు అందజేయాలని సూచించారు. అదే విధంగా పింఛన్ల కోసం నేటి(గురువారం) నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను సేకరించాలన్నారు. 16నుంచి 30వ తేదీ వరకు రెవెన్యూ అధికారులు ఈ దరఖాస్తులను సమగ్ర కుటుంబ సర్వేతో సరి చూసుకుని ఇంటింటికి వెళ్లి తనిఖీ చేయాలన్నారు. అర్హులైన వారికి నవంబరు 1వ తేదీ నుండి కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయాలని సూచించారు. అదే విధంగా పింఛన్ దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తూ ప్రత్యేకంగా లేఖలు ఇవ్వాలని పేర్కొన్నారు. అవకతవకలు జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అధికారుల పనితీరును పర్యవేక్షించేందుకు డివిజన్స్థాయిలో ఫ్లైయింగ్ స్వ్కాడ్ను నియమిస్తామని చెప్పారు. ఫాస్ట్ పథకం కింద లబ్ధిపొందేందుకు కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో గురువారం నుంచి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. తహసీల్దార్లు అట్టి దరఖాస్తులను పరిశీలించి ఈ నెలాఖరులోగా సర్టిఫికెట్లను జారీ చేయాలని కోరారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పని చేసి సామాజిక, ఆర్థిక, కుల గణనను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం కులగణన తుది నివేదిక రూపొందించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జేసీ ప్రీతి మీనా, ఏజేసీ వెంకట్రావు, డీఆర్డీఏ పీడీ సుధాకర్, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, సీపీఓ నాగేశ్వరరావు, ఎల్డీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
భార్యను చంపి భర్త ఆత్మహత్య
అనంతపురం: గొంతునులిమి భార్యను హత్య చేసి... అనంతరం ఆమె మృతదేహన్ని రైల్వే ట్రాక్పై పడేశాడు భర్త. ఆ తర్వాత అతడు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం రామ్నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికులు రైల్వే ట్రాక్పై మృతదేహాలు ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన దంపతులు స్రవంతి, నాగేంద్రలుగా స్థానికులు గుర్తించి పోలీసులకు వెల్లడించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముంచెత్తిన వాన
వరంగల్ : వరుస వర్షాలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీ ఏరియాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాతోపాటు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటిమట్టం రాత్రి వరకు 10.20 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏటూరునాగారం మండలంలోని ఐలాపురం, ముళ్లకట్ట, రాంపూర్, కోయగూడెం, ఎల్లాపూరం, రాంనగర్, ఘనపురం, చెల్పాక, వీరాపురం, బనాజీబంధం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధర్మారావుపేట-కొండాపూర్మధ్య మోరంచవాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పరకాల శివారు చలివాగు పొంగిపొర్లుతోంది. భారీ వర్షాలతో ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో 60 ఎకరాల మేరకు పంటలు నీటమునిగాయి. ఏజెన్సీలో పొంగుతున్న వాగులు ఆదివారం జిల్లాలో 32.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తాడ్వాయిలో అత్యధికంగా 124 మి.మీల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి, ములుగు ఘనపూర్, ములుగు, ఏటూరునాగారం, మంగపేట, పరకాల, రేగొండ, మొగుళ్లపల్లి, నల్లబెల్లి, ఖానాపూర్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. మోరంచవాగు, చలివాగు, బొగ్గులవాగు, దయ్యాలవాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, హన్మకొండ, వరంగల్, వర్ధన్నపేట ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. నిండుతున్న చెరువులు ఈ సీజన్లో తాజాగా కురుస్తున్న వర్షాలతో కుంటలు, చెరువులు, మధ్యతరహా నీటి వనరులు నీటితో నిండిపోతున్నాయి. మొన్నటివరకు నీటి చుక్కలేక ఎండిపోయి వెలవెలబోయిన చెరువులు ఇప్పుడు నీటితో నిండుకుండలా మారాయి. వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో చెరువుల్లోకి సగానికి కంటే ఎక్కువ నీరు చేరింది. తాజా వర్షాలతో చెరువులు పూర్తిస్థారుులో కళకళలాడుతున్నారుు. చిన్న చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. పాఖాల, లక్నవరం, రామప్ప, గణపసముద్రం చెరువుల్లోకి భారీగా నీరు చేరింది. ఇదే సమయంలో బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలకు గండ్లు పడుతున్నాయి. చెరువు కట్టల నిర్మాణ బలహీనతలు బహిర్గతమవుతున్నాయి. కాగా, రామన్నగూడెం పీహెచ్సీలో అందుతున్న వైద్యసేవలపై ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు సమీక్షించారు. ఏటూరునాగారంలోని రొయ్యూర్ ఊర చెరువు ఉధృతిని ఐటీడీఏ పీఓ పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. -
ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉండాలి
రాంనగర్ : బ్యాంకు ఖాతా ప్రతి వ్యక్తి జీవితానికి అనుసంధానంగా మారిందని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన్ధన్ యో జనను గురువారం ఉదయాదిత్య భవన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాకు మళ్లిస్తూ అనుసంధానం చేసిందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు, ఇతర రాయితీలు దళారుల ప్రమోయం లేకుండా నేరుగా ఖాతాలోకి చేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉం డాలనే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. ఒక్క రోజే దేశ వ్యాప్తంగా ఎలాంటి డిపాజిట్ లేకుం డా కోటి మందికి పైగా వ్యక్తులకు బ్యాంకు ఖా తాలు ప్రారంభించడం ప్రశంసనీయమన్నారు. ఖాతాదారుడు జన్ధన్ బ్యాంకు ఖాతా తో ఆరునెలల పాటు లావాదేవీలు నిర్వహించిన అనంతరంరూ. 5 వేల వరకు ఓవర్ డ్రాప్టు రుణ సౌకర్యం పొందవచ్చున్నారు. అంతేగాకుండా రూ.లక్ష వరకు ఖాతాదారునికి ప్రమాద బీమా కూడా వర్తిస్తుందన్నారు. పేదలను ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఆదుకోవడానికి ప్రభుత్వం బీమా పథకాన్ని ఖాతాకు అనుసంధానం చేసిందన్నారు. రైతు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధర లభిస్తే ఎన్నడు కూడా రుణ మాఫీ కోరడని అందువల్ల పండిన పం టకు ప్రభుత్వం గిట్టుబాటు ధర పెంచాల్సిన అవసరం ఉందన్నారు. లబ్ధిదారులందరూ జన్ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలను ప్రారంభించి ప్రభుత్వం నుంచి అందే లబ్ధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ బ్యాంకుల జాతీయకరణకు ముందు పేదలు బ్యాంకు మెట్లు ఎక్కలేని పరిస్థితి ఉందన్నారు. బ్యాంకుల జాతీయకరణ వల్ల పేదలకు ఎంతో మేలు చేకూరిందన్నారు. అన్ని వ ర్గాల ప్రజలు నేడు బ్యాంకుల వద్దకు వెళ్లి నేరు గా లావాదేవీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ కీలకమైందని, ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత చేరు వ చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నేరుగా బ్యాంకుల ద్వారా అందిస్తోందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్ర జలను భాగస్వాములను చేసి అభివృద్ధి సంక్షే మ కార్యక్రమాలను అందించాలని ప్రభుత్వం సంకల్పిం చిదన్నారు. 2014 ఆగస్టు నుంచి 2015 ఆగస్టు 14 నాటికి 10 కోట్ల కుటుంబాలకు 20 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలనే లక్ష్యంతో బ్యాంకులు పని చేయాల్సి ఉందన్నారు. అనంతరం ఖాతాదారులకు కలెక్టర్, ఎంపీ, జెడ్పీ చైర్మన్.. ఖాతా పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీహెచ్ ఏజీఎం ఎస్కె. నందా, సూర్యాపేట రీజియన్ ఏజీఎం రామారావు, జిల్లా లీడ్ బ్యాంకు అధికారి శ్రీధర్, నాబార్డు ఏజీఎం దయామృత పాల్గొన్నారు. -
అర్హులైన రైతుల జాబితా పంపించాలి
రాంనగర్ :మండలస్థాయి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్ టి.చిరంజీ వులు ఆదేశించారు. గురువారం స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పంట రుణాల వివరాలను బ్యాంకు అధికారులు ఇప్పటికే అందించారన్నారు. వాటిని గ్రామం వారీగా, కుటుంబం వారీగా పరిశీలించి ప్రతి కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ అయ్యే విధంగా జాబితా రూపొందించి ప్రతి గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. అలాగే ఈ నెల 29న గ్రామ సభలు నిర్వహించి లిస్టులు ఫైనల్ చేసి పంపించాలని కలెక్టర్ సూచించారు. ఒకే రైతు రెండు, మూడు బ్యాంకుల్లో రుణం పొంది ఉన్నట్లైతే వాటిని కన్సాలిడేట్ చేసి ముందు తీసుకున్న అప్పు లేదా ఏది ఎక్కువ అప్పు ఉంటే అందులో నుంచి రూ. లక్ష వరకు మాఫీ అయ్యే విధంగా లిస్టు ఫైనల్ చేయాలన్నారు. రుణమాఫీకి అర్హులైన ఏ ఒక్క రైతు కూడా జాబితాలో మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా రుణమాఫీకి అర్హులు కాని వారి పేర్లు విధిగా తొలగించాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే డాటాను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు కోరారు. కొన్ని చోట్ల డాటాను కంప్యూటరీకరించడంలో వెనుకబడి ఉన్నందున ఆయా ప్రాంతాలలో ఆర్డీఓలు చొరవ తీసుకుని వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. డాటా ఎంట్రీల విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఎక్కడైనా హాజరుకాకపోయినట్లైతే వారిని సస్పెండ్ చేయాలని డీపీఓకు ఆయన ఆదేశించారు. మున్సిపల్ ప్రాంతాలలో కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి డాటా ఎంట్రీని వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన భూమికి వెంటనే డాక్యుమెంటేషన్ను పూర్తి చేయాలని తహసీల్దార్లకు కోరారు. అతేగాకుండా రేషన్కార్డులకు ఆధార్ సీడింగ్ కూడా ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జేసీ ప్రీతిమీనా, జేడీఏ నర్సింహారావు, జెడ్పీ సీఈఓ దామోదర్రెడ్డి, డ్వామా పీడీ సునంద, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల కోసం భూములు గుర్తించాలి
రాంనగర్ :రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించి వాటి వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ జిల్లా కలెక్టర్లను కోరారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. వాటిని సర్వేచేసి వివరాలను సర్వే నెంబర్లతో సహ తెలియజేయాలన్నారు. భూమి ఒకే చోట కాకుండా వేరు వేరు ప్రాంతాలలో ఉన్నదానిని గుర్తించాలని సూచించారు. పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములు ఉన్నాయన్నారు. వాటిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గరగా ఉన్న జిల్లాలో పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో 10134 ఎకరాల భూమిని గుర్తించి నట్లు చెప్పా రు. అందులో 4500ల ఎకరాలు సర్వేచేయగా 400 ఎకరాలు మాత్రమే పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇంకా 6500ల ఎకరాల భూమిని సర్వే చేయించాల్సి ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ హరిజవహర్లాల్, అదనపు జేసీ వెంకట్రావు, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ ప్రసాదరావు, డ్వామా పీడీ సునంద, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భూపంపిణీ వివరాలు సేకరించాలి : రేమండ్ పీటర్ భూ పంపిణీకి అర్హులైన దళితులకు సంబంధించిన వివరాలను పకడ్బందీగా సేకరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఆధారిత నిరుపేద షెడ్యూల్డ్ కులాల వారికి ఆగస్టు15న ప్రతి నియోజకవర్గంలో ఒక హాబిటేషన్లో భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దానికి అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో గుర్తించబడిన హాబిటేషన్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలు, కొనుగోలు చేయాల్సిన వివరాలను జిల్లాల వారీగా సమీక్షించారు. వ్యవసాయరంగంపై ఆధారపడిన భూమి లేని ఎస్సీలను గుర్తించాలన్నారు. లబ్ధిదారులు, స్వయం సహా యక సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి భూములు అమ్మేవారీతో రేటు మాట్లాడాలని సూచించారు. జిల్లాస్థాయి కమిటీ ఆ భూమి విలువను నిర్థారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 12 హాబిటేషన్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ గ్రామాలలో ఈ నెల 30 వరకు సర్వే పూర్తి అవుతుందని తెలిపారు. భూములు కొనుగోలు చేయడంలో కమ్యూనిటీ, స్వయం సహాయక సంఘూలను భాగస్వాములను చేసి వారి ద్వారా భూములను అమ్మే వారితో మాట్లాడినట్లు చెప్పారు. వెల్త్ ర్యాంకింగ్ ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి భూములను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కాన్ఫరెన్స్లో సచివాలయం నుంచి సీఎం అడ్వయిజర్ రాంలక్ష్మణ్, షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ కమిషనర్ రాహుల్బొజ్జా, సెర్పు సీఈఓ మురళి తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాలి
రాంనగర్ :మన జిల్లా- మన ప్రణాళికలో భాగంగా అన్ని శాఖల భాగస్వామ్యంతో పకడ్బందీగా ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ టి. చిరంజీవులు కోరారు. శనివారం తన బంగ్లాలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఫ్లోరైడ్ ప్రాంతాలలో మంచినీటి సరఫరాకు గల అవకాశాలను పరిశీలించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి మంచినీరు సరఫరా చేయడానికి నిధుల లభ్యత, వ్యయం, నిధులు సమకూర్చుకోవడం తదితర అంశాలను ప్రణాళికలో పొందుపర్చాలని సూచించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హాస్టళ్లకు పక్కా భవనాలు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని భవనాలు అవసరం ఉన్నాయో, వాటికి ఎన్నినిధులు అవసరమో వచ్చే 5సంవత్సరాలలో ఏవిధంగా పూర్తి చేయాలో ప్రణాళికలో పొందుపర్చాలన్నారు. జిల్లాలో నిర్లక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు. అలాగే చదువుకున్న నిరుద్యోగ యువతీయువకులకు స్కిల్స్ డెవలప్మెంట్స్పై శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. వ్యవసాయ అనుబంధ విభాగాలు అన్నీ కలిసి సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో పండ్ల తోటలు, వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన ప్రణాళికలు తీర్చిదిద్దాలని తెలిపారు. చేపల పెంపకం, సెరీకల్చర్, హార్టికల్చర్, మార్కెటింగ్ శాఖ ద్వారా గోదాములు నిర్మించడానికి సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మండలస్థాయిలో తయారు చేసిన ప్రణాళికలో రాని అంశాలను జిల్లా స్థాయిలో పొందుపర్చాలని సూచించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలలో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తగిన ప్రణాళికను తయారుచేయాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, నియోజకవర్గానికి ఒక ఓల్డేజ్ హోం, మానసిక వికలాంగులకు పునరావాస కేంద్రం, శిశు కేంద్రాలు, వర్కింగ్ఉమెన్ హాస్టల్స్ భవనాల నిర్మాణా కోసం ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరిజవహర్లాల్, అదనపు జేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ దామోదర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
వదినను హతమార్చిన మరిది
అనంతపురం క్రైం, న్యూస్లైన్ : ప్రేమించిన వాడే సర్వస్వమనుకుని కన్నవారికి దూరమైన ఓ యువతి పెళ్లైన నాలుగేళ్లకే అత్తింటి వారి కర్కశత్వానికి బలైపోయింది. ఆమె మృతి సాధారణమేనంటూ కుటుంబ సభ్యులు బంధువులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారంతో ఈ నెల 13న ‘వివాహిత దారుణ హత్య’ పేరుతో ‘సాక్షి’ అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనంతపురంలోని రామ్నగర్లో నివాసముంటున్న ఇషాక్ చికెన్ కబాబ్ బండి నిర్వహించేవాడు. 2009లో పెద్దలను ఎదిరించి కమలానగర్కు చెందిన చందన (24)ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని అవమానంగా భావించిన యువతి కుటుంబ సభ్యులు పట్టణంలోని ఇంటిని విక్రయించి హైదరాబాద్కు వెళ్లిపోయారు. కాగా, మరో మతానికి చెందిన యువతిని వివాహం చేసుకోవడాన్ని ఇషాక్ సోదరుడు నిసారుద్దీన్ అలియాస్ దీనా తీవ్రంగా వ్యతిరేకించేవాడు. ఈ వివాహం కారణంగా తనకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పేవాడు. ఈ క్రమంలో ఈ నెల 11న శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులందరూ చికెన్ దుకాణం వద్ద ఉండగా నిసారుద్దీన్ ఇంటికి చేరుకున్నాడు. ఒంటరిగా టీవీ చూస్తున్న వదినపై కత్తితో దాడి చేసి గొంతులో పొడిచాడు. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా నోట్లో బట్టలు కుక్కి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం దుకాణం వద్దకు వెళ్లి తన అన్నతో పాటు, తల్లిదండ్రులకు విషయం చెప్పి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు రక్తాన్ని తుడిచివేసి, మృతదేహంపైనున్న దుస్తులు మార్చారు. రక్తంతో తడిసిన చీర, ఇతర దుస్తులను ఓ కవర్లో ఉంచి 44వ నెంబరు జాతీయ రహదారి సమీపంలోని మురుగు కాలువలో పడేశారు. అనంతరం చందన హఠాత్తుగా చనిపోయిందంటూ స్థానికులను నమ్మించేందుకు ప్రయత్నించారు. అదే రోజు రాత్రే హడావుడిగా మృతదేహాన్ని అశోక్ నగర్లోని శ్మశాన వాటికకు తరలించారు. వీరి వ్యవహారాన్ని గమనించిన కాటికాపరి మృతికి దారి తీసిన కారణాలపై ఆరా తీయగా, తన తల్లి చనిపోయిందంటూ ఇషాక్ సమాధానమివ్వడంతో అతను పెద్దగా పట్టించుకోలేదు. అంత్యక్రియల అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు, అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేసి సామగ్రిని మరో చోటికి తరలించడంతో స్థానికుల్లో అనుమానం బలపడింది. దీంతో ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో విషయం ‘న్యూస్లైన్’ దృష్టికి రావడంతో ఘటన వెలుగు చూసింది. పోలీసుల అదుపులో నిందితులు సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఎస్పీ సెంథిల్ కుమార్ విచారణకు ఆదేశించడంతో డీఎస్పీ నాగరాజ, సీఐ మన్సూరుద్దీన్, ఎస్ఐ రెడ్డెప్పలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిసిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. చందన చిన్నాన్న నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు నిసారుద్దీన్, భర్త ఇషాక్, వారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైద్యులతోపాటు తహశీల్దార్ లక్ష్మినారాయణ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించే ప్రక్రియను గురువారానికి వాయిదా వేసినట్లు సీఐ తెలిపారు. కాగా, చందన మృతితో ఆమె ఇద్దరు కూతుళ్లు అనాథలుగా మారారు. -
రాంనగర్లో మహిళ హత్య
రాంనగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రియుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని కోసం మూడు బృందాలను రంగంలోకి దింపారు. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ కథనం మేరకు.. ఆటోడ్రైవర్ దుర్గేశ్ భార్య, పిల్లలతో కలిసి రాంనగర్లో నివాసముంటున్నాడు. అప్పుడప్పుడు పోతురాజుగా, కూలీగా కూడా పని చేసే వాడు. కాగా, అతడు మౌనిక (36) అనే మహిళతో కలిసి రాంనగర్ డివిజన్ మేదర బస్తీలో విజయభారతి పాఠశాల సమీపంలోని గొల్ల సంధయ్య ఇంట్లో ఇరవై రోజుల క్రితం అద్దెకు దిగాడు. మంగళవారం ఉదయం ఇంటి పక్కనే నివసమించే షమీన, తలుపు తట్టగా ఎంతకీ సమాధానం రాలేదు. ఆమె గట్టిగా నెట్టడంతో తలుపు తెరుచుకోగా, గదిలో మౌనిక నేలపై పడి ఉంది. దీంతో స్థానికులు పోలీసులు సమాచారమందించారు. వారు వచ్చి చూడగా, ఆమె అప్పటికే మృతి చెందింది. గొంతు చుట్టూ నల్లగా కమిలిపోయి ఉంది. సమీపంలోనే విద్యుత్ వైర్ లభించింది. వైర్తో బిగించి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. రోజూ దుర్గేశ్, మౌనిక కలిసి మద్యం తాగి ఘర్షణకు దిగే వారని చుట్టుపక్కల వారు తెలిపారు. ఈ క్రమంలోనే అతడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మౌనిక దుర్గేష్కు రెండో భార్యా? లేక ఆమెతో సహజీవనం చేస్తున్నాడా? అన్న విషయం తెలియాల్సి ఉంది.