relations
-
రక్షణ, భద్రతలపై ఫలవంతమైన చర్చలు
వాషింగ్టన్: అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్(Michael Waltz)తో ప్రధాని మోదీ(Narendra Modi) గురువారం భేటీ అయ్యారు. రక్షణ, సాంకేతికత, భద్రత వంటి అంశాలపై వారు చర్చించారు. మైఖేల్ వాల్ట్జ్తో ఫలవంతమైన చర్చ జరిగిందని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. భారత్కు ఆయన గొప్ప స్నేహితుడు అని కొనియాడారు. భారత్– అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రత.. అత్యంత ముఖ్యమైన కోణాలని, వీటిపై తమ మధ్య ఫలప్రదమైన చర్చ జరిగిందని మోదీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence), సెమీకండక్టర్స్, అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం పాల్గొన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.కి చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం, మోదీ మోదీ అంటూ నినదించారు. చలి వణికిస్తున్నా, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా మోదీకి స్వాగతం పలకడానికి తరలివచ్చారు. నగరం నడిబొడ్డున ఉన్న చరిత్రాత్మక బ్లెయిర్ హౌస్లో మోదీ బస చేశారు. రాజధానిలో అడుగుపెట్టిన తర్వాత మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్–అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్, అమెరికా ప్రయోజనాలు కాపాడడంతోపాటు మన భూగోళానికి మంచి జరిగేలా పని చేస్తామన్నారు.భారత్–అమెరికా బంధానికి మద్దతుదారు తులసి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా నియమితులైన హిందూ–అమెరికన్ తులసి గబార్డ్తో మోదీ సమావేశమయ్యారు. బ్లెయిర్ హౌస్లో ఈ భేటీ జరిగింది. భారత్–అమెరికా సంబంధాలపై వారు చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సైబర్ సెక్యూరిటీలో ఇంటెలిజెన్స్ సహకారం మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని తులసి గబార్డ్ కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. భారత్–అమెరికా బంధానికి ఆమె గట్టి మద్దతుదారు అని పేర్కొన్నారు. ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా అత్యున్నత పదవి చేపట్టినందుకు తులసి గబార్డ్కు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ట్రంప్ ‘అమెరికా ఫస్టు’ అనే విధానంతో ముందుకెళ్తూ అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా భారతీయ అక్రమ వలసదార్లపై కరుణ చూపేలా తన మిత్రుడైన ట్రంప్ను మోదీ ఒప్పిస్తారా? అనే చర్చ సాగుతోంది. భారత ఉత్పత్తులపై టారిఫ్లు పెంచక తప్పదని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. టారిఫ్ల మోత మోగించకుండా ఉపశమనం లభించేలా చూడడం ఇప్పుడు మోదీ ముందున్న కర్తవ్యం అని నిపుణులు చెబుతున్నారు.త్వరలో అమెరికా నుంచి మరో 487 మంది వలసదారులున్యూఢిల్లీ: మరో 487 మంది అక్రమ వలస దారులను అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపించనుందని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ట్రంప్ ప్రభు త్వం చేపట్టిన వలసదారుల ఏరివేతలో భాగంగా మొదటి విడతగా ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులతో కూడిన అమెరికా వైమానిక దళ ప్రత్యేక విమానం అమృతసర్కు రావడం తెలిసిందే. భారతీ యులుగా భావిస్తున్న మరో 487 మందిని గుర్తించిన అమెరికా అధికారులు వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. మరికొంతమందికి సంబంధించిన సమాచారం అమెరికా అధికారులు వెల్లడించనందున అక్రమ వలసదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధికారులు పంపించిన 487 మంది వలసదారుల పేర్లు, ఇతర వివరాల జాబితాను పరిశీలిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో పంపించిన 104 మందిలో పంజాబ్, హరియాణాలకు చెందిన వారు అత్యధికులుండటం తెలిసిందే. తమను వెనక్కి పంపే సమయంలో అమె రికా అధికారులు విమానంలో సుదీర్ఘ ప్రయాణ సమయంలో నేరస్తుల మాదిరిగా చేతులు, కాళ్లకు బేడీలు వేసి ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అమెరికా అమెరికాకు ఆందోళన తెలుపుతామన్నారు. -
చుట్టూ పక్కల చూడరా..!
కర్నూలు(హాస్పిటల్): మానవ సంబంధాల పేరుతో మనిషన్నవాడు మాయమవుతున్నాడు. అందరూ బాగుంటేనే సమాజం అన్న ధోరణి నుంచి నా కుటుంబం బాగుంటే చాలనే ధోరణితో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో చివరికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లలను సైతం దూరం చేసుకుంటున్నాడు. కేవలం భార్యాబిడ్డలు బాగుంటే చాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు పక్కింట్లో పెళ్లంటే ఆ వీధిలో ఉన్న వారందరూ తలోచేయి వేసి ఇంట్లో మనుషుల మాదిరిగా పనులు చేసేవారు. ఇప్పుడు అయిన వారు కూడా చుట్టపుచూపుగా వస్తున్నారు.అయిన వారు అందరూ ఉన్నా పనులన్నీ ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటున్నారు. పట్టణీకరణ పేరుతో మనుషులు దూరం అవుతున్నారు. కానీ ఇప్పటికీ పల్లెలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఒకప్పటి అనుబంధాలు, ఆత్మీయతలు కొనసాగుతుండటం గమనార్హం. ఉన్నత చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు మనుషులను దూరం చేయడానికా లేదా దగ్గర చేయడానికా అని ఆనాటి పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఎవ్వరికైనా ఏదైనా కష్టం వస్తే బంధువుల కంటే ముందు ఇరుగుపొరుగు వారే ముందుగా వచ్చి ఆదుకునేవారు. ఇంట్లో ఎవ్వరైనా చనిపోతే పక్కింటి వారే ఆ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్లలో, అద్దె ఇళ్లల్లో సైతం మృతదేహాన్ని ఉండనీయని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, చిన్న కుటుంబాలు ఏర్పడటం, చిన్నతనంలో పిల్లలను హాస్టల్లో, వృద్ధాప్యంలో పెద్దలను ఆశ్రమాల్లో ఉంచడంతో కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి. ఉన్నత చదువుల పేరుతో ఆధునికత సంతరించుకోవడంతో ఎవ్వరికి వారే అన్న రీతిలో సమాజంలో జీవిస్తున్నారు. నిలవని ప్రేమ వివాహాలు..తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో అధికమైంది. కొందరు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటూ వేరుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఏడాది, రెండేళ్లకే విడిపోయి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటున్నారు. ప్రతి పోలీస్స్టేషన్లో వారానికి రెండు, మూడు కేసులైనా అమ్మాయి మిస్సింగ్ అని నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల అధికంగా చూస్తున్న పోలీసులు చాలా మంది అమ్మాయిని వెతకడం అటుంచి రెండురోజులకు వారే వస్తారులే అన్న ధోరణితో మాట్లాడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను సర్దిచెప్పేవారు లేక రెండు, మూడేళ్లకే విడిపోతున్నారు. పోలీస్స్టేషన్లు, వన్స్టాప్ సెంటర్లు, ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఇలాంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించే ఉదంతాలు ఇటీవల అధికమయ్యాయి. కష్టమొస్తే భరోసానిచ్చే చేతుల్లేవు.. నాగరికత వెంట పరుగులు పెడుతున్న మనుషుల మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో ఎవ్వరికి వారు వేరుగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అపార్ట్మెంట్లో 40కి పైగా కుటుంబాలున్నా.. కష్టమొస్తే పలకరించేవారు ఎవ్వరూ రాని పరిస్థితి నెలకొంది. కానీ పండుగలు, చిన్నచిన్న శుభకార్యాలు మాత్రం చేసుకుని ఎంజాయ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎవ్వరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే అయిన వారే పలకరించే దిక్కులేదు. బంధువులు, స్నేహితులు సైతం సోషల్ మీడియాలో మాత్రమే పరామర్శలు చేస్తున్నారు. ఇంటికి వచ్చి ధైర్యం చెప్పేవారు కరువైపోయారు. పలకరించి ఎన్నాళ్లైందో.. ఒకప్పుడు ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండిపోయేవారు. సమయానికి భోజనం చేయాలన్న విషయం కూడా మరిచిపోయేవారు. కుటుంబంతో పాటు ఊళ్లో, సమాజంలో ముచ్చట్లు, రాజకీయాలు, సినిమాలు అన్నీ ఈ మాటల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు ఇంటికి ఎవ్వరైనా వస్తే ముఖస్తుతిగా పలకరించి రెండు నిమిషాలు మాట్లాడి వదిలేస్తున్నారు. ఎవ్వరి మొబైల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఎదురుగా ఉన్న వారిని పలకరించే సమయం లేకపోయినా ఎక్కడా కనిపించని వారిని సోషల్ మీడియాలో పలకరించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సమాజంలో ప్రస్తుతం మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో ఈసంఘటనలే నిదర్శనం.కర్నూలు (Kurnool) నగరానికే చెందిన రాజ్కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. మూడేళ్ల క్రితం అతని తల్లి అనారోగ్యంతో మరణించింది. విషయం తెలిసిన ఇంటి యజమాని మృతదేహాన్ని ‘మా ఇంట్లో ఉంచొద్దని, మీ బంధువుల ఇళ్లకు తీసుకెళ్లు’ అని గొడవ చేశాడు. ఎంత నచ్చజెప్పినా వినలేదు. దీంతో తప్పనిసరై నగరంలోని తన సోదరుని ఇంటికి అప్పటికప్పుడు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. నంద్యాల (Nandyala) పట్టణంలో ఇటీవల ఓ వ్యక్తి తన కుమారుడి వివాహం చేశారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎక్కువ మంది వస్తారని పెద్ద ఫంక్షన్ హాల్, పెళ్లి భోజనంలో రకరకాల స్వీట్లు, వంటకాలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి ముందు రోజు కూడా పెద్దగా బంధువులు, మిత్రులు రాలేదు. తలంబ్రాల సమయానికి హడావుడిగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి తెచ్చిన గిఫ్ట్లను చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆహార పదార్థాలు భారీగా మిగిలిపోవడంతో అనాథశ్రమానికి పంపించేశారు. ఎమ్మిగనూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పిల్లల చదువుల కోసం కర్నూలులో ఉంటున్నారు. ఆ వీధిలో అతను దాదాపు పదేళ్లుగా ఉంటున్నాడు. అయితే చుట్టు పక్కల వారితో ఇంత వరకు ఆయన మాట్లాడలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉదయాన్నే విధులకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం, కుటుంబీకులతో గడుపుతారు. పక్క ఇళ్లల్లో శుభకార్యం జరిగినా వెళ్లింది లేదు.. ఆపద వచ్చినా పలకరించింది లేదు. -
భారత్తో కుస్తీ.. పాక్తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్ వైఖరి?
న్యూఢిల్లీ: ఒకప్పుడు భారత్తో మంచి మిత్రత్వం కలిగిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్కు బద్ధ శత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. నాడు హిందువులపై ఆదరణచూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను, ముఖ్యంగా భారతీయులను ద్వేషించడం మొదలుపెట్టింది.మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టాక..బంగ్లాదేశ్లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ఆ దేశం ఛాందసవాద మార్గంలో ప్రయాణిస్తోంది. అక్కడి ముస్లింలు ఇప్పుడు భారతీయులతో స్నేహ భావాన్ని మరిచిపోయారు. హిందువులపై నిరంతరం దాడులకు పాల్పడుతున్నారు. హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారు. విగ్రహాలను తగులబెడుతున్నారు. ఇంతేకాదు హిందువులను నరికివేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు.హిందువులకు బెదిరింపులుబంగ్లాదేశ్లో ఇస్కాన్ ఆలయాన్ని, భక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. హిందువులను బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఇస్కాన్ను లక్ష్యంగా చేసుకున్న ఒక ఛాందసవాదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతను ఇస్కాన్పై నిషేధం విధించాలని ఆ వీడియోలో బహిరంగంగా డిమాండ్ చేశాడు. ప్రభుత్వం అలా చేయని పక్షంలో హింసాత్మక దాడులకు దిగుతామని బెదించాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ మాట్లాడుతూ ఈ ప్రసంగం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని, బంగ్లాదేశ్ అంతటా ఈ తరహా విద్వేషాలే చెలరేగుతున్నాయన్నారు. ఇలాంటివారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఢాకా వీధుల్లో ప్రదర్శనబంగ్లాదేశ్లోని ముస్లింలు తాజాగా ఢాకా వీధుల్లో భారత్కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల రక్షణలో ఆందోళనకారులు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు చెందిన మిలిటెంట్లు ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శించారు. అక్కడి భారత పౌరులను చంపేస్తామంటూ నినదించారు. ఈ నేపధ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బీటింగ్ రిట్రీట్ను నిలిపివేశారు.పరాకాష్టకు మత అసహనంబంగ్లాదేశ్లోని ఛాందసవాదులు ఇస్కాన్ దేవాలయాలను ఒకదాని తర్వాత ఒకటిగా కూల్చివేసి, విగ్రహాలను దహనం చేస్తున్నారు. తాజాగా ఢాకాలోని ఇస్కాన్ సెంటర్కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ మత అసహన ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ ప్రతిష్టను ప్రభావితం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ డిసెంబరు 9న ఢాకాలో పర్యటిస్తారని తెలిపారు.పాక్కు చేరువవుతున్న బంగ్లాదేశ్ ఒకవైపు భారత్- బంగ్లాదేశ్ మధ్య పరస్పరం సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పాకిస్తాన్- బంగ్లాదేశ్లు ఇరు దేశాల పౌరులకు వీసా నిబంధనలలో వివిధ సడలింపులను ఇచ్చాయి. అలాగే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా, కరాచీ నుండి ఒక కార్గో షిప్ గత నెలలో బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య తొలిసారిగా సముద్ర రవాణా సంబంధాల ఏర్పడ్దాయి. వచ్చే ఏడాది నుంచి ఇస్లామాబాద్- ఢాకా మధ్య ఎయిర్ కనెక్టివిటీ కూడా ప్రారంభమవుతుందని బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ సమయ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.క్షీణించిన భారత్- బంగ్లా సంబంధాలుషేక్ హసీనాను అధికారం నుండి తొలగించి, మొహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత, బంగ్లాదేశ్లోని హిందువులతో సహా ఇతర మైనారిటీల భద్రతపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ ఆందోళనలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. భారతదేశంతో బంగ్లాదేశ్కు సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వచ్చి చదువుకుంటుంటారు. గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ప్రజలు భారతదేశానికి వచ్చేందుకు సులభంగా వీసా పొందేవారు. అయితే గత ఆగస్టు నుండి బంగ్లాదేశ్లో వీసా విషయంలో నిబంధనలు పెరిగాయి.ఇది కూడా చదవండి: రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు -
'రాజ్ తరుణ్కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్'.. లావణ్య షాకింగ్ కామెంట్స్!
రాజ్ తరుణ్- లావణ్య టాపిక్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదురుతోంది. హీరోయిన్ తామిద్దరం 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నామని.. ప్రస్తుతం మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నాడంటూ లావణ్య ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్కు చాలామంది హీరోయిన్స్తో రిలేషన్స్ ఉన్నాయంటూ లావణ్య సంచలన కామెంట్స్ చేసింది. లావణ్య మాట్లాడుతూ..'నాకు రాజ్ తరుణ్కు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. దాదాపు 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. ఆమె నన్ను చంపేస్తానని బెదిరించింది. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో ఓ హోటల్లో ఉన్నారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను, రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తాను నన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మస్తాన్ సాయికి, నాకు గొడవైంది. అందుకే అతనిపై ఫిర్యాదు చేశా. కొందరు నాతో మైండ్గేమ్ ఆడారు. ఆ గేమ్లో నేను, మస్తాన్ సాయి ఇద్దరం బాధితులమే. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను.' అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. 'నేను, మస్తాన్ సాయి ఎప్పుడు కూడా జంటగా కనిపించలేదు. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లాం. అతను కేవలం నా మ్యూచ్వల్ ఫ్రెండ్. నాతో ఎవరు మాట్లాడినా అతనితో రిలేషన్లో ఉన్నట్లేనా? నాకు అన్యాయం జరిగింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా. నా దగ్గర రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు మొదలయ్యాయి. డబ్బుల కోసం నేను బెదిరించాల్సిన పనిలేదు. అతని కోసం చాలా భరించాను. రాజ్ తరుణ్కు చాలామంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయి. ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
నీ కోసం నువ్వు.. అన్ని బంధాలకూ మూలమిదే!
కనెక్షన్ కార్నర్కి పున: స్వాగతం.. బంధాలు, అనుబంధాల గురించి మనకు తరచూ చాలా చాలా కంప్లయింట్స్ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినడంలేదని, పేరెంట్స్ అర్థం చేసుకోవడంలేదని, భర్త పట్టించుకోవడంలేదని, భార్య మాట వినడం లేదని, కింది ఉద్యోగి గౌరవం ఇవ్వడంలేదని, పైఅధికారి వేధిస్తున్నాడని.. ఇలా రకరకాల కంప్లయింట్స్. వాటన్నింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు అన్ని బంధాలకూ మూలమైన సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుకుందాం. కనెక్షన్ కార్నర్ అని పేరు పెట్టుకుని అందులో ‘సెల్ఫ్ లవ్’ గురించి ఎందుకబ్బా అని మీకు అనిపించవచ్చు. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల అవసరమైనట్లే ఇతరులతో బలమైన బంధాలు ఏర్పడాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అవసరం. అదెంత అవసరమో తెలియాలంటే, ‘మాయ’ గురించి తెలుసుకోవాల్సిందే.ప్రేమించలేని మాయ..మాయ 25 ఏళ్ల ఆర్టిస్ట్. చక్కగా బొమ్మలు వేస్తుంది, నగరంలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో తన బొమ్మలు ప్రదర్శిస్తుంది. అందరితోనూ కలివిడిగా ఉంటుంది. కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. ఏ ప్రేమా ఎక్కువకాలం నిలబడటం లేదు. దాంతో తనలో, తన ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందేమోనని ఆందోళన చెందుతోంది. మాయతో మాట్లాడిన తొలి సెషన్ లోనే తాను సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక బాధపడుతోందని గుర్తించాను. మాయ బాల్యంలో ఆత్మవిశ్వాసంతో ఉండేది. కానీ ఆర్టిస్టుగా మారాక తరచూ ఇతరులతో పోల్చుకోవడం, విమర్శలు ఎదుర్కోవడం, నిత్యం విమర్శించే లోగొంతుతో అంచెలంచలుగా తనపై, తన సామర్థ్యంపై విశ్వాసాన్ని కోల్పోయింది. దాంతో తనను విమర్శిస్తారేమో, తిరస్కరిస్తారేమోననే భయంతో ఇతరులకు దూరంగా ఉండటం మొదలు పెట్టింది.బలమైన కనెక్షన్ లను ఏర్పరచుకోవడం స్వీయ-ప్రేమ కీలకపాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. సెల్ప్ కంపాషన్ ఉన్న వ్యక్తులు ఇతరులను అర్థం చేసుకోగలరు, వారి తప్పులను క్షమించి సురక్షిత బంధాలను పెంచుకోగలరు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు సానుకూల సామాజిక సంబంధాలను ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువని మరో అధ్యయనంలో వెల్లడైంది.అంచెలంచెలుగా పెరిగిన ప్రేమ..కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీలో అసలు సమస్యను, దాని మూలాలను తెలుసుకోవడమే కీలకం. మాయ సమస్య, దాని కారణాలు అర్థమయ్యాక ఆమెలో సెల్ప్-లవ్ ను పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారించాను. 👉: కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ ద్వారా మాయలోని ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి సెల్ఫ్-కంపాషన్ తో భర్తీ చేసుకుంది. ఉదాహరణకు, "ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో స్థానం పొందలేకపోయానంటే నేను ఫెయిలయినట్టే" అని ఆలోచించే బదులు, "ఇది ఒక ఆర్టిస్టుగా నా విలువను నిర్వచించలేదు. ఈ అనుభవం నుండి నేర్చుకుంటా, మరింత మెరుగైన బొమ్మలు వేస్తాను " అని రీఫ్రేమ్ చేయడం నేర్చుకుంది.👉: థెరపీలో భాగంగా రోజూ తనలోని మూడు సానుకూల అంశాలను, సాధించిన విజయాలను, గ్రాటిట్యూడ్ చూపించాల్సిన విషయాలను గుర్తించి, తనను తాను అభినందించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఆమె సెల్ఫ్ ఇమేజ్ పెరగడానికి, ఆమె దృష్టి తన బలాలవైపు మళ్లించడానికి ఉపయోగపడింది. 👉: తన కనెక్షన్ లలో ఎక్కడ దేనికి ఎస్ చెప్పాలో, ఎక్కడ నో చెప్పాలో గుర్తించగలిగింది, నో చెప్పడం నేర్చుకుంది. అనవసరమైన పార్టీలకు, ఫంక్షన్లకు, రిక్వెస్టులకు నో చెప్పడం సాధన చేసింది. 👉: కొద్ది సెషన్లలోనే మాయలోని అంతర్గత విమర్శకురాలు గొంతు మూగబోయింది. ఆమెలో సెల్ఫ్-లవ్, సెల్ఫ్-కంపాషన్ పెరిగింది. ఈ కొత్త స్వీయ-ప్రేమ ఆమె తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగింది. తన అవసరాలను, కోరికలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగింది. ఇది అర్ధవంతమైన కనెక్షన్లకు దారితీసింది.మీకోసం కొన్ని చిట్కాలు.. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల కావాలన్నట్లే, మంచి బంధాలు కావాలంటే సెల్ఫ్-లవ్ అవసరమని తెలుసుకున్నాం కదా. మాయలానే మీలోనూ సెల్ఫ్-లవ్ తగ్గిందనకుంటే ఈ కింది అంశాలను ప్రాక్టీస్ చేయండి. 👉: ప్రతి ఒక్కరి మనసులో ఒక అంతర్గత విమర్శకుడు ఉంటాడు. వాడి మాటలకు తలూపకుండా ‘నా స్నేహితుడితో నేనిలా మాట్లాడగలనా?’ అని ప్రశ్నించుకోండి. మీ అంతర్గత విమర్శకుడిని సవాలు చేయండి. 👉: ప్రతీ ఒక్కరి జీవితంలో మంచి విషయాలు ఉంటాయి. వాటిని గుర్తించండి. ప్రతీరోజూ మీరు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను వ్రాయండి. 👉: "నో" అని చెప్పడం, మీ స్వంత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థం కాదు; ఇది ఆత్మగౌరవానికి అవసరం. ‘నో’ చెప్పడం ప్రాక్టీస్ చేయండి. 👉: శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం విలాసం కాదు -అవసరం. అందుకే మీకు సంతోషాన్నిచ్చే అంశాలకు రోజూ సమయాన్ని కేటాయించండి. 👉: మీ విజయాలను ఇతరులు గుర్తించే వరకు వేచి ఉండకండి. పెద్దవైనా, చిన్నవైనా సెలబ్రేట్ చేసుకోండి. అది మీ స్వీయ-విలువను బలపరుస్తుంది. 👉: ఎలాంటి తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టిపెట్టే మైండ్ఫుల్నెస్ను ప్రాక్టీస్ చేయండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, సెల్ఫ్-కంపాషన్ ను పెంచుతుంది. 👉: మనమందరం తప్పులు చేస్తాము. వాటినే తలచుకుంటూ నిందించుకోవడం మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. క్షమాపణ అనేది మీకు మీరు ఇచ్చే బహుమతి.👉: సెల్ఫ్-లవ్ ను పెంపొందించుకోవడం ఒక ప్రయాణం. అందుకోసం ఇతరుల సహాయం అవసరం పడొచ్చు. అందువల్ల క్లోజ్ ఫ్రెండ్ సహాయ తీసుకోండి. అవసరమైతే సైకాలజిస్ట్ ను సంప్రదించడానికి సంకోచించకండి. 👉: సెల్ఫ్-లవ్ గమ్యం కాదు, నిరంతర అభ్యాసం. ఈ చిట్కాలను మీ దినచర్యలో భాగంగా చేసుకుని రోజూ ప్రాక్టీస్ చేయండి. మీ సెల్ప్-లవ్ పెరుగుతుంది, మీ బంధాలు బలపడతాయి.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!?
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి ఒక యువకుడికి, ఒక యువతికి ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని శ్రీరామాయణం నిర్దేశించింది. వాటిలో మొదటిది శీలం. అంటే స్వభావం. అది పుట్టుకతో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కొంతమందికి సంగీతం, కొంతమందికి ఆధ్యాత్మిక చింతన, మరికొందరికి చిత్రలేఖనం.... అలా అది వారికి బాగా ఇష్టమైన విషయంగా ఉంటుంది. పెళ్ళి సంబంధం చూసేటప్పుడు ఒకరికి ఇష్టమైన విషయం మరొకరికి కూడా ఇష్టమేనా, అయిష్టం లేదు కదా.. అని చూస్తారు. ఆ పరిశీలన పెద్దలు చేస్తారు.తరువాత వయస్సు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. రెండు కళ్ళల్లో ఏది మంచిదంటే ఏమని చెప్పగలం? బండి చక్రాలు రెండూ సమన్వయంతో పనిచేయాలి. జీవితం నుండి మొదట ఆయన నిష్క్రమిస్తే.. ఆవిడ పుణ్యకార్యం చేయదు. ఆమె వెళ్ళి΄ోతే...ఆయన తమ కడుపున పుట్టిన కూతురును కూడా కన్యాదానం చేయలేడు. ఆవిడ నిష్క్రమణతోనే ఆయనకు పుణ్యకార్యం చేసే అధికారం కూడా ΄ోతుంది. అందువల్ల ఇద్దరూ సమానమే. ఇద్దరూ కలిసి ఉంటేనే సౌభాగ్యం, సంతోషం. అంటే వాళ్ళ వయసులో ఎవరు పెద్దయితే గొప్ప అన్నదానికన్నా ప్రధానమైనది– ఒకరు నడిపించాలి, మరొకరు నడవాలి–అనేది. ఇక్కడ నడిపించేవారిది ఎక్కువ, నడిచేవారిది తక్కువ అనుకోకూడదు. అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. వరుడి వయసు పెద్దదయి ఉండాలి–అన్నారు. వయస్సు అంటే కాలం. కాలం అనుభవానికి, అవగాహనకు గుర్తు. ఎవరు ముందు ప్రపంచంలోకి వచ్చారో.. వాళ్ళుఅనుభవాన్ని, అవగాహనను ఎక్కువ సాధిస్తారు. మనం ఎంత చదివాం అన్నదానికన్నా... దానికి అనుభవం ఎంత తోడయింది... అన్నది ప్రధానం. ఒక ఉద్యోగానికి వెడితే అనుభవం ఎంత అన్నదాని ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వివాహం విషయంలో.. లోకజ్ఞానం, లోక ప్రవృత్తిని సరిగా అర్థం చేసుకుని భార్యకు అవగాహన కలిగించగలిగిన వాడయి ఉండాలి.అనుభవం అన్నమాటలోనే అంతర్లీనంగా ఉండే విషయం– భార్యపట్ల పరమ ప్రేమతో మెలుగుతూ ఆమెకు రక్షకుడయి ఉండాలన్నది. ఆమె గుణాలు, ప్రతిభ ప్రకాశించడానికి ఆయన అవకాశం కల్పించగలగాలి. ఆమె బలహీనతలు... శారీరకం కావచ్చు, నడవడిరీత్యా కావచ్చు... వాటిని కప్పగలగడంతోపాటూ ఆమె గౌరవమర్యాదలు తగ్గకుండా చూడగలగాలి. సంసారాన్ని సాఫీగా నడపడంలో ఆమెకు ఆయన అనుక్షణం అండగా నిలవాలి. ఒక అమాయకురాలైన కూతురు తెలిసీ తెలియక చేసే తప్పులను తల్లిదండ్రులు ఎలా సరిదిద్దుతూ కాపాడుతుంటారో భార్యను అలా కాపాడుకోగలిగి ఉండాలి. అది భర్త లక్షణం. భార్యది – అంకిత భావం. పిచ్చి ప్రేమ. భర్త ప్రేమకు కారణం ఉంటుంది. భార్య ప్రేమకు కారణం ఉండదు. అనుగమించడం, అంకితభావంలో మసులు కోవడం ఆమె కర్తవ్యం. ఆమెకు ప్రేమను పంచడం, ప్రతి కష్టంలో ఆమెకు రక్షణగా నిలవడం ఆయన బాధ్యత. ఆమెది పాతివ్రత్యం. ఆయనది ఏకపత్నీవ్రతం. అందువల్ల ఎక్కువ తక్కువలను వారి మధ్య ΄ోల్చిచూడకూడదు. కామసంబంధమైన ప్రవత్తి కలిగినా ఆయన దృష్టిలో ఆమె వినా మరొకరికి స్థాన ఉండదు. ఆమెకు ఆయనే సర్వస్వం. ఇది దాంపత్యం. ఇదే గృహస్థాశ్రమం. ఇది సనాతన ధర్మ వైభవం.-చాగంటి కోటేశ్వరరావు -
రిలేషన్షిప్పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో జంటగా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఇటీవల బాలీవుడ్లో బిజీ అయిన భామ.. తాజాగా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్లో మరింత బోల్డ్గా కనిపించి ఫ్యాన్స్కు ఒక్కసారిగా షాకిచ్చింది. సీతారామం చిత్రంలో పద్ధతిగా కనిపించిన భామ.. లస్ట్ స్టోరీస్తో ఐ యామ్ నాటీ అని నిరూపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు ఓపెన్గానే ఉంటానని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: హైదరాబాద్లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్? ఆమె ఏమందంటే..) మృణాల్ మాట్లాడుతూ.. 'ముందుగా దేవునికి ధన్యవాదాలు. నేను రిలేషన్స్ గురించి స్వేచ్ఛగా మాట్లాడే జనరేషన్లో పుట్టా. గతంలో నా బ్రేకప్ల గురించి మాట్లాడా. దీనివల్ల నా అనుభవాల ద్వారా ఇతరులు నేర్చుకుంటున్నారని భావిస్తున్నా. ప్రస్తుత రోజుల్లో నా చుట్టూ భాగస్వామి లేదా ప్రేమికుడి గురించి మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నందుకు సంతోషిస్తున్నా.' అని అన్నారు. భాగస్వామిని గౌరవించాలి లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడుతూ.. 'ఎవరైనా సరే మన పార్ట్నర్ మనోభావాలను గౌరవించాలి. మనకు కాబోయే భాగస్వామి తన రిలేషన్ ప్రైవేట్గా ఉంచాలనుకుంటే అలాగే ఉండాలి. నేను ఇండస్ట్రీలో ఉన్నా.. కానీ నా భాగస్వామి ఈ పరిశ్రమకు చెందిన వారు కాకపోవచ్చు. అప్పుడు అతను తన రిలేషన్ను పబ్లిక్గా ఉంచకూడదనుకుంటే.. అతని గురించి నేను ఎక్కడా చర్చించను.' అని అన్నారు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావని అనుకోవడం లేదని అన్నారు మృణాల్.. ఎందుకంటే ప్రస్తుతం నేను చాలా మెరుగైనస్థితిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. తమ రిలేషన్స్ గురించి ఒపెన్గా మాట్లాడిన నీనా గుప్తా , అంగద్ బేడీ, కరీనా కపూర్ ఖాన్, నేహా దుపియాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఇది చాలా సాధారణమైన విషయమన్నారు. కాగా.. మృణాల్ విజయ్ దేవరకొండ సరసన ఒక చిత్రంలో కనిపించనుంది. (ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..! ) -
ఇవేం‘రక్త’ సంబంధాలు..ఆస్తి కోసం అయిన వారినే తుదముట్టిస్తున్న వైనం
ఆస్తి కోసం ఒకనాడు అన్నను, ఇప్పుడు తమ్ముడిని హత్య చేశాడో వ్యక్తి. కన్న తండ్రినే చంపేందుకు ప్రయత్నించాడో యువకుడు. వివాహేతర సంబంధం కోసం ఓ భార్య.. భర్తపై హత్యా యత్నం చేస్తే.. ఆవేశంలో అన్నీ మరిచి కన్న తల్లినే చంపిందో కూతురు. బంధాలు, అనుబంధా లన్నీ మాటలకే.. మనిషిలోని మానవత్వం మాయమైపోతోంది. కన్నవారి మీద, తోబుట్టువుల పట్ల కూడా కనీస ప్రేమ కరువైంది. క్షణికావేశమో.. పగ, ప్రతీకారమో.. కుటుంబ సభ్యులను చంపేందుకు వెనుకాడటం లేదు మనిషి. అందుకు ఈ ఘటనలు ఓ ఉదాహరణ మాత్రమే! భర్తపై డీజిల్ పోసి.. నిప్పంటించి.. ♦ ఓ భార్య ఘాతుకం ♦ దాదిగూడ రాంనగర్ కాలనీలో ఘటన జిన్నారం(పటాన్చెరు): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తపై డీజిల్ పోసి హత్య చేసేందుకు ఓ భార్య యత్నించింది. ఈ ఘటన జిన్నారం మండలం ఊట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్ కాలనీలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఊట్ల గ్రామ పంచాయితీ పరిధిలోని దాదిగూడ గ్రామానికి చెందిన సంకు నర్సింహులు(32)కి దుండిగల్కు చెందిన యాదమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు దాదిగూడ సమీపంలోని రాంనగర్ కాలనీ లో ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తలు కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. యాదమ్మ కొంత కాలంగా వివాహేతర సంబం«ధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త తర చూ కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడేవాడు. ఇదే విషయమై 27వ తేదీ రాత్రి భార్యాభర్తల మధ్య గొ డవ జరిగింది. భర్త తనకు అడ్డంకిగా మారాడని భావించిన యాదమ్మ అత డిని చంపాలని నిర్ణయించుకుంది. గొడవ జరిగాక ఇంటి పక్కనే ఉన్న ఆటో నుంచి డీజిల్ తీసి పెట్టుకుంది. భర్త నర్సింహులు గాఢ నిద్రలోకి వెళ్లాక, రాత్రి 12 గంటల తర్వాత అతడిపై డీజిల్ పోసి నిప్పంటించింది. నర్సింహులు అరుపులతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయ త్నించారు. అప్పటికే 60 శాతం గాయాలయ్యాయి. అంబులెన్స్లో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నర్సింహులు పరిస్థితి విషమంగా ఉంది. నర్సింహు లు తమ్ముడు పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయరావు తెలిపారు. యాదమ్మ పోలీసుల అదుపులో ఉంది. తల్లిని రోకలితో బాది.. ♦ ఓ కుమార్తె దుర్మార్గం నందిపేట్(ఆర్మూర్): తల్లీకూతుళ్ల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. కూతురు ఆవేశంలో తల్లిని రోకలితో బాది చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో వెలుగు చూసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మెడకు చెందిన నాగం నర్సు(52) భర్త చనిపోవడంతో ఉమ్మెడలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు హరిత, అరుణ. పెద్ద కూతురు హరిత.. తల్లి ఉండే ఇంట్లోని పక్కగదిలోనే వేరుగా నివసిస్తోంది. కాగా తల్లీకూతుళ్ల మధ్య కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మృతురాలి రెండో కూతురు అరుణ ఇంట్లో ఈ నెల 26న తొట్లె ఫంక్షన్ జరిగింది. తల్లి నర్సు, పెద్ద కూతురు హరిత వెళ్లారు. అక్కడ నర్సు.. రెండో కూతురు అరుణ బంధువులతో గొడవపడి వారిని దూషించింది. ఇంటికి తిరిగొచ్చాక శుక్రవారం రాత్రి పెద్ద కూతురు హరితకు, మృతురాలికి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. హరిత ఆవేశంలో తల్లి తల, ముఖంపై రోకలితో ఇష్టం వచ్చినట్లు కొట్టి వెళ్లిపోయింది. శనివారం రాత్రి తన చెల్లిలికి, బంధువులకు ఫోన్చేసి జరిగిన విషయాన్ని తెలిపింది. వారు వచ్చి చూడగా నర్సు చనిపోయి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతురాలి మేనల్లుడు గణపురం రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆస్తి కోసం తండ్రిపై తనయుడి దాడి ♦ కత్తితో ఇష్టారీతిన పొడిచిన వైనం తొర్రూరు: వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు.. ఆస్తి కోసం హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అమీనాపురం గ్రామ శివారు టీక్యా తండాకు చెందిన మాలోతు రాములు అనే 70 ఏళ్ల వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసి, తనకున్న మూడెకరాల భూమిని కుమారులిద్దరికి సమానంగా పంచాడు. భూ పంపకాల్లో అన్నకు ఎక్కువ భూమి పంచాడని, కుమార్తెలకు డబ్బులు పంపుతున్నాడని తండ్రితో చిన్న కుమారుడు స్వామి కొంత కాలంగా గొడవపడుతున్నాడు. పలుమార్లు పెద్దమనుషుల్లో పంచాయితీ పెట్టి నచ్చజెప్పినా అతని తీరులో మార్పు రాలేదు. రాములు ఈ నెల 26న దంతాలపల్లి పడమటిగూడెం శివారు చారి తండాలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికివ వెళ్లేందుకు ఆదివారం తొర్రూరు బస్టాండుకు వచ్చాడు. బస్సు కోసం ఎదురుచూస్తున్న తండ్రిని చాటుగా ఫాలో అవుతున్న స్వామి.. హెల్మెట్ ధరించి వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రిపై దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తల, పొట్ట, చేతులపై పదునైన కత్తి గాట్లు పడ్డాయి. బస్టాండ్లోని ప్రయాణికులు అడ్డుకోవడంతో అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో అల్లాడుతున్న వృద్ధుడి గురించి పోలీసులకు అక్కడున్న ప్రయాణికులు సమాచారం అందించారు. పోలీసులు 108లో వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. క్షతగాత్రుడి పెద్ద కుమారుడు శంకర్నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నాడు అన్నను.. నేడు తమ్ముడిని.. ♦ ఆస్తి కోసం హత్య చేసిన సోదరుడు మద్నూర్(జుక్కల్): ఆస్తి తగాదాలు నిండు ప్రా ణాన్ని బలితీసుకున్నాయి. రక్త సంబంధాన్ని మరిచి తోబుట్టువును దారుణంగా హత్య చేశాడో అన్న. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాలలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సోనాలకు చెందిన గంగాధర్, గినాన్బాయికి ముగ్గురు కొడుకులు సంజయ్ పాటిల్, రాజు పా టిల్, విజయ్ పాటిల్(32). వీరికి 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆస్తి విషయంలో గొడవలతో.. గంగాధర్ పెద్ద కొడుకు సంజయ్ పాటిల్ను తమ్ముడు రాజు పాటిల్ 2011లోనే హత్య చేసి, శిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన రాజు అప్పటి నుంచి పెద్దపల్లి, హైదరాబాద్లలో ఇంగ్లిష్ టీచర్గా ప్రైవేటు స్కూళ్లలో పనిచేసేవాడు. కరోనా సమయంలో సొంతూరుకు తిరిగి వచ్చాడు. అయితే గంగాధర్ పేరున ఉన్న 18 ఎకరాల భూమిలోంచి ఐదు ఎకరాల భూమిని అప్పట్లో హత్యకు గురైన సంజయ్ భార్య పేరున చేశారు. 13 ఎకరాల్లోంచి మూడెకరాల భూమిని తమ్ముడు విజయ్ పాటిల్ అమ్మేశాడు. మిగిలిన పదెకరాల భూమిని తాకట్టు పెట్టడంతో రాజుపాటిల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆస్తి పంపకాలు జరగక ముందే ఇష్టారాజ్యంగా ఎట్లా అమ్మారని? భూమి తాకట్టు పెట్టి అప్పు చేయడం ఏమిటని? ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఒడిశా రాష్ట్రానికి వెళ్లి అక్కడే ఏదైనా ప్రైవేటు స్కూల్లో టీచర్గా చేరాలని రాజు పాటిల్ అతడి భార్య సీతిక్ష నిర్ణయించుకున్నారు. అయితే ఆదివారం వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో రాజుపాటిల్ లేచి అదే ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తున్న విజయ్పాటిల్ను విచక్షణ రహితంగా పొడిచాడు. మెడ, కాళ్లు, కడుపులో పలుమార్లు పొడవడంతో కడుపులోని పేగులు బయటకు వచ్చి విజయ్ వెంటనే మృతిచెందాడు. అక్కడి నుంచి నేరుగా మద్నూర్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయిన రాజు పాటిల్ జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్రెడ్డి, బిచ్కుంద సీఐ కృష్ణ, మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడు విజయ్ పాటిల్కు ఏడాది క్రితమే పెళ్లి జరిగిందని, భార్యాభర్తల మధ్య గొడవలతో భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. -
ఆ దేశంతో మామూలు సంబంధాలు కావాలి..కానీ ఆ విషయంలో మాత్రం..
పాకిస్తాన్తో భారత్ సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటుందని భారత్ ప్రధాని మోదీ అన్నారు. అయితే ఉగ్రవాదం లేని అనుకూలమైన వాతావరణం సృష్టించడం, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో పాక్నే భాద్యత వహిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లో జరిగే జీ7 సదస్సుకు గెస్ట్ కంట్రీగా భారత్ హాజరవనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అతిపెద్ద స్వతంత్ర వ్యాపార మీడియా గ్రూపులలో ఒక్కటైన నిక్కి ఆసియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదం విషయంలో పాక్ మద్దతుపై భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా చైనాతో సంబంధాల గురించి ప్రశ్నించిగా..దక్షిణాసియా దేశాల గొంతును, వారి ఆందోళనను తెలియజేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు గురించి మాట్లాడారు. భారత్ తన సౌర్వభౌమాధికారం, గౌరవం కాపాడుకునేందుకు సిద్దంగానే గాక అందుకు కట్టుబడి ఉందన్నారు. 2020లో చైనా సైన్యంతో చర్యలు తర్వాత తూర్ప లడఖ్లో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు. ఈ చర్చలు కొన్ని ప్రాంతాలను విడదీసేలా ఘర్షణ కలిగించాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు నెరపాలంటే సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత చాలా అవసరమని చెప్పారు. భారత్-చైనా సంబంధాల భవిష్యత్తు, అభివృద్ధి, పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాలపై మాత్రమే ఆధారపడి ఉందన్నారు. అంతేగాదు ఇరు దేశాల విస్తృత సంబంధాలు ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు. ఇక రష్యా ఉక్రెయిన్ వివాదంలో భారత్ మధ్యవర్తి పాత్ర పోషించగలదా అని సంధించిన ప్రశ్నకు..ఉక్రెయిన్ వివాదంపై తమ దేశం వైఖరి స్పష్టంగా తిరుగులేనిదని మోదీ చెప్పారు. భారత్ ఎప్పుడూ శాంతివైపు నిలుస్తుంది. ప్రాథమిక అవసరాలను తీర్చడంలో సవాళ్లను ఎదుర్కొనే వారికి మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్లతో తాము కమ్యూనికేషన్ కొనసాగిస్తామన్నారు. సహాయ సహకారాలతో సమయాన్ని నిర్వచించాలి గానీ సంఘర్షణతో కాదు అని చెప్పారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువలే జపాన్, భారత్ని మరింత దగ్గర చేశాయని ప్రధాని మోదీ అన్నారు. తాము ఇప్పుడూ ఆర్థిక ప్రయోజనాల్లో పెరుగుతున్న రాజకీయ, వ్యూహాత్మక భద్రత కలయికను చూస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం జపాన్లోని హిరోషిమా చేరుకున్నారు. ఈ సమ్మిట్కు భారత్ను అతిధిగా ఆహ్వానించారు. 2003 నుంచే జీ7 సదస్సులో భారత్ పాల్గొంటోంది. (చదవండి: నాడు అద్దె గదిలో జూనియర్ లాయర్గా ప్రారంభమై..నేడు సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి..) -
కవ్వింపులకు దిగితే మోదీ సర్కారు సహించబోదు: అమెరికా నిఘా వర్గాలు
వాషింగ్టన్: పాకిస్తాన్, చైనాలతో భారత్ సంబంధాలు నానాటికీ మరింతగా క్షీణిస్తున్నాయని, పెరుగుతున్న ఉద్రిక్తతలు సాయుధ ఘర్షణకూ దారితీసే ఆస్కారం లేకపోలేదని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పాక్ కవ్వింపులను భారత్ గతంలోలా సహించే పరిస్థితి లేదు. మోదీ హయాంలో పాక్పై సైనిక చర్యకు దిగే అవకాశముంది’’ అని అంచనా వేశాయి. అమెరికా కాంగ్రెస్కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ మేరకు పొందుపరిచాయి. ‘‘ముఖ్యంగా భారత వ్యతిరేక ఉగ్రవాద తండాలకు మద్దతిచ్చిన సుదీర్ఘ చరిత్ర పాక్ది. అందుకే ఇకపై పాక్ కవ్విస్తే మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండబోదు’’ అని నివేదిక అభిప్రాయపడింది. చైనాతో కూడా పలు సరిహద్దు సమస్యలను భారత్ చర్చల ద్వారా పరిష్కరించుకున్నా 2020 గల్వాన్ ఘర్షణ, తాజాగా అరుణాచల్ సరిహద్దుల వద్ద గొడవ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయని పేర్కొంది. చైనాతో అమెరికాకు పెనుముప్పు అమెరికా జాతీయ భద్రతకు, అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ స్థానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి అత్యంత ముప్పు పొంచి ఉందని యూఎస్ నిఘా విభాగపు నివేదిక అభిప్రాయపడింది. ‘‘రష్యాతో ఏడాదిగా చైనా బంధం బలపడుతున్న తీరు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. నానాటికీ పెరుగుతున్న ఈ చైనా సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి’’ అని ప్రభుత్వానికి సూచించింది. సెనేట్ సెలెక్ట్ కమిటీ సభ్యులకు నిఘా నివేదిక సమర్పించిన సందర్భంగా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. -
ఆ పొత్తు చైనాకు తప్పదా?
చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్లో తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి ఆ దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇంటా బయటా సమస్యలనూ, విమర్శలనూ ఎదుర్కొంటున్నారు. అమెరికా నేతృత్వంలో చైనాపై ఆంక్షలు మరింత పెరగడం, ఆసియాలో తన బలమైన పోటీదారైన భారత్కు పాశ్చాత్య పెట్టుబడులు తరలిపోతుండటం జిన్పింగ్కి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. నూరు చైనా కంపెనీలకు మైక్రోచిప్ల ఎగుమతిపై అమెరికా, దాని మిత్రదేశాలు కొనసాగిస్తున్న ఆంక్షలు జిన్పింగ్ను కలతపెడుతున్నాయి. దీంతో పాలనా విధానాలు, సంస్కరణలపై తన వైఖరిని ఆయన సడలించుకుంటున్నారు. అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా అనేక చర్యలు తీసుకున్నారు. జీరో–కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా నవంబర్లో చైనావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్త డంతో గత మూడు నెలలుగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి. ప్రజానిరసనల తర్వాత జిన్పింగ్ తన పాలసీని వదిలేయవలసి వచ్చింది. దీంతో చైనాలో కోవిడ్–19 ఇన్ఫెక్షన్ల వేవ్స్ ఉద్ధృతంగా వ్యాపించాయి. నూతన సంవత్సర వేళ తాను చేసిన ప్రసంగంలో, తన జీరో–కోవిడ్ పాలసీపై వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత గురించి జిన్పింగ్ తప్పకుండా ప్రస్తావించాల్సి వచ్చింది. ‘‘ఒక పెద్ద దేశంలో ఒకే సమస్యపై వివిధ రకాల ప్రజలు వివిధ రకాల అభిప్రాయాలను కలిగి ఉండటం సహజం’’ అని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల జనాభాలో అత్యధిక శాతం మందికి ఇన్ఫెక్షన్లు సోకాయి. వృద్ధులు, ఇతర వ్యక్తులు పెద్ద సంఖ్యలో మరణించారు. అనేక ప్రాపర్టీ కంపెనీలు దివాలా తీయడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అనేక కంపెనీలు మూసివేతకు గురవడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో జిన్పింగ్ పాలనకు వ్యతిరేకంగా అసమ్మతి గణనీయంగా పెరిగిపోయింది. దేశీయ శాంతి, సుస్థిరత, పాలనా నిర్వహణ జిన్పింగ్కే కాకుండా చైనా కమ్యూనిస్టు పార్టీ పాలనకు కూడా అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయం. దీంతో తన పాలసీలపై విమర్శను అడ్డుకోవడానికి జిన్పింగ్ అతి చురుకుగా పనిచేయాల్సి వచ్చింది. ఆయన తన నూతన సంవత్సర ప్రసంగంలో అమెరికా, తదితర దేశాలకు చేరువ కావడం కోసం చైనా మాతృభూమితో తైవాన్ పునరేకీకరణ అనే ఊతపదాన్ని వదిలేసుకున్నారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకే కుటుంబ సభ్యులు అని చెప్పారు. శరవేగంగా చైనా జాతి శ్రేయస్సు సాధించడానికి తమ రెండు దేశాలూ కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్వదేశంలోని విభిన్న గ్రూపులతో మాట్లాడుతున్న సమయంలో తన జీరో–కోవిడ్ పాలసీని జిన్పింగ్ సమర్థించుకున్నారు. ఇది దేశంలో కేసుల నిష్పత్తిని తగ్గించిందనీ, మరణాల రేటును అత్యంత తక్కువ శాతానికి తగ్గించివేసిందనీ చెప్పారు. అయితే జి¯Œ పింగ్ను దుర్వార్తలు వెంటాడుతున్నాయి. 2022లో చైనా జనాభా 8.5 లక్షల మేర పడిపోయిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ జనవరి 17న ప్రకటించింది. వరదలు, కరవుల కారణంగా, మావో అమలుపర్చిన గొప్ప ముందంజ పారిశ్రామిక విధానం 1961లో కుప్పకూలిన తర్వాత చైనాలో జనాభా తగ్గిపోవడం ఇదే మొదటిసారి. దారిద్య్రాన్ని వేగంగా అధిగమించడానికి ఒకే సంతానం పాలసీని దాని దీర్ఘకాలిక పర్యవసానాలపై అధ్యయనం చేయకుండానే అమలు చేయాలని 1979లో చైనా పాలకులు నిర్ణయించడంతో చైనా జనాభా తగ్గుతూ వస్తోంది. అమెరికాకు చెందిన పరిశోధకుడు ప్రొఫెసర్ యి ఫుక్సియన్ ప్రకారం, చైనాలో సంతాన సాఫల్య రేటు 1.3 శాతానికి పడిపోయింది. (జనాభా భర్తీ రేటు 2.1 శాతం). దేశం తన సంతాన సాఫల్య రేటును 1.2 శాతం వద్ద స్థిరపర్చగలిగితే చైనా జనాభా 2050 నాటికి 1.07 బిలియన్లకు, 2100 నాటికి 48 కోట్లకు పడిపోతుంది. జనాభా తగ్గి పోవడం అంటే... ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవటం, వృద్ధుల ఆరోగ్య సమస్యలపై ఖర్చు పెరగడం, సామాజిక సంక్షేమ అవసరాలు కుంచించుకుపోవడం, పొదుపు మొత్తాలు తగ్గిపోవడం, వీటికి మించి వస్తూ త్పత్తి, ఎగుమతులు, ప్రభుత్వ ఆదాయాలు పడిపోవడం, ప్రజల కొను గోలు శక్తి సన్నగిల్లిపోవడం, ఆర్థిక వృద్ధి పతనమవడం అని అర్థం. పైగా దేశ వస్తూత్పత్తి రంగం, వ్యవసాయం, శ్రమశక్తి, సామగ్రి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ తదితర రంగాల్లో మరింతగా రోబోలను దింపాలని చైనా పథకరచన చేసింది. అయితే ఇప్పటికే ప్రతి 10 వేలమంది ప్రజలకు 322 రోబోలను అందుబాటులో ఉంచిన చైనాపై తాజా పథకం చూపే ప్రభావం పెద్దగా ఉండదు. ప్రపంచ రోబోటిక్స్ రిపోర్ట్–2022 ప్రకారం రోబోల వినియోగంలో అమె రికాను చైనా అధిగమించడమే కాక, ప్రపంచంలో రోబోల వినియోగంలో అయిదో స్థానంలో నిలిచింది. నూరు చైనా కంపెనీలకు మైక్రోచిప్ల ఎగుమతిపై అమెరికా, దాని మిత్రదేశాలు కొనసాగిస్తున్న ఆంక్షలకు సంబంధించిన వార్తలు కూడా జిన్పింగ్ను కలతపెడుతున్నాయి. దీనికి తోడు చైనాను ‘కనీవినీ ఎరుగని వ్యూహాత్మక సవాలు’గా అభివర్ణించిన జపాన్ 2027 నాటికి జీడీపీలో రక్షణ బడ్జెట్ 2 శాతం పెంచాలని నిర్ణయించుకుంది. అంతేకాక చైనాకు, ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా జపాన్ కొత్త క్షిపణులు, మానవ రహిత వ్యవస్థలకు చెందిన టెక్నాలజీలు, సైబర్ స్పేస్, అంతరిక్షం, ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్, కృత్రిమ మేథ వంటి ఎదురుదాడి సామర్థ్యాలను మిక్కుటంగా సేకరించనుంది. 2046 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 26 లక్షల డాలర్లకు చేరుకుంటుందనీ, 2025 నాటికి చైనా నుంచి 25 శాతం అమెరికన్ సెల్ఫోన్ల ఉత్పత్తిని భారత్కు తరలించాలనీ అమెరికా సెల్ఫోన్ మాన్యు ఫ్యాక్చరింగ్ సంస్థ యాపిల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రకటించిన అంచనాలు జిన్పింగ్కి సంతోషం కలిగించవు. ఆసియా ప్రాంతంలో భారత్ పురోగతిని అడ్డుకుని తన ఆధిక్యాన్ని చాటుకోవాలని చైనా ఇప్పటికే లక్ష్యం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక శక్తిని బలహీనపర్చడానికి భారత్ – అమెరికా పొత్తు పెట్టుకోవడం మరో ఉదాహరణగా జిన్పింగ్ అభిప్రాయ పడవచ్చు. ఈ అన్ని పరిణామాల వెలుగులో అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా జిన్పింగ్ అనేక చర్యలు తీసుకున్నారు. మొదటి చర్యగా అమెరికా ప్రభుత్వంపై వాడే తీవ్ర పదజాలాన్ని చైనా ప్రభుత్వం తగ్గించుకుంది. విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత, ద్రవ్యవ్యవస్థ, పర్యావరణ మార్పు తదితర మంత్రిత్వ శాఖలతో భేటీకి చైనా అధ్యక్షుడు సమ్మతి తెలియజేశారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా తదితర దేశాలు చేసే చిన్న విమర్శలను కూడా తీవ్ర పద జాలంతో తిప్పికొట్టే ధోరణిని జిన్పింగ్ మంత్రులు ఇప్పుడు పక్కన పెట్టేశారు. తమ పట్ల అమెరికాకు మించి మరింత స్వతంత్ర వైఖరితో వ్యవహరిస్తున్న జర్మనీ, ఫ్రా¯Œ ్స, ఇటలీ దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా చైనా తహతహలాడుతోంది. గ్లోబల్ పెట్టుబడికీ, మార్కెట్ సంస్కరణలకూ తలుపులు తెరిచి మార్పునకు తాము సిద్ధమేనంటూ సంకేతాలు వెలువరించడంలో భాగంగా దావోస్లో ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సుకు చైనా ప్రతినిధిగా చైనా ఉప ప్రధాని, తన పూర్వ ఆర్థిక సలహాదారు అయిన లియూ హేని చైనా అధ్యక్షుడు పంపించారు. పాశ్చాత్య బడా కంపె నీలకు లియూ హే సుపరిచితుడు కావడం విశేషం. అయితే 2022 అక్టోబర్లో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ సందర్భంగా లియూ హేని పోలిట్ బ్యూరో పదవి నుంచి జిన్పింగ్ తొలగించడం విశేషం. అయితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అవలంబించిన లోపభూయిష్ఠ విధానాల కారణంగా అమెరికా, పలు యూరోపియన్, ఆసియా దేశాల, కంపెనీల విశ్వాసం దారుణంగా దెబ్బతింది. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వాతావరణం నుంచి బయటపడే ఎత్తుగడలో భాగంగా మాత్రమే జిన్పింగ్ విధానాల్లో వెనుకడుగు వేస్తున్నారనీ, తన వైఖరిని మార్చుకుంటున్నారనీ విదేశీ కంపెనీలు భావిస్తున్నాయి. చైనా ఆర్థిక ప్రగతిని బలహీనపరచడానికి ఆ దేశంపై తమ ఒత్తిడిని ఇవి కొనసాగించనున్నాయి. జిన్పింగ్ దూకుడునూ, ఆధిపత్యాన్నీ ప్రతిఘ టించడానికి చైనా సాంకేతిక పురోగతిని దెబ్బతీయాలని కూడా ఇవి గతంలోనే నిర్ణయించుకున్నాయన్నది గమనార్హం. యోగేశ్ గుప్తా వ్యాసకర్త మాజీ రాయబారి (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఉగ్రవాదులతో సంబంధాలు.. నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వేటు వేసింది. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు చీఫ్నని ప్రకటించుకున్న సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు, జైల్లో ఉన్న వేర్పాటువాద నాయకుడు బిట్టా కరాటే భార్యతో సహా నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ శనివారం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్కు వ్యతిరేకంగా పని చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో సంబంధాలుండడంతో వారిని ఉద్యోగుల నుంచి తీసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలతో లింకులుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ప్రభుత్వ పరమైన ఎలాంటి విచారణ చేయకుండా ఉద్యోగాలను తొలగించే అధికారం ప్రభుత్వాలకి ఉంటుంది. వాణిజ్య, పరిశ్రమల శాఖలో పని చేస్తున్న సయ్యద్ అబ్దుల్ ముయీద్, జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అసాబ్ ఉల్ అర్జామంద్ ఖాన్ (ఫరూక్ అమ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటె భార్య) , కశ్మీర్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తగా పని చేస్తున్న డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్, కశ్మీర్ యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫసర్గా పని చేస్తున్న మజీద్ హుస్సేన్ ఖాద్రిలు ఉద్యోగాలు కోల్పోయారు. సోంపెరాలోని జమ్మూ కశ్మీర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (జేకేఈడీఐ) కాంప్లెక్స్లో జరిగిన పేలుళ్లతో అబ్దుల్ ముయీద్కు సంబంధం ఉంటే, అర్జామంద్ఖాన్కు పాస్పోర్టు కోసం తప్పుడు సమాచారం అందించారు. డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్ యూనివర్సిటీల్లో విద్యార్థుల్ని భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పాఠాలు బోధిస్తూ ఉంటే, మరో ప్రొఫెసర్ మజీద్ హుస్సేన్కు నిషిద్ధ లష్కరేతోయిబా సహా పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు గతంలోనే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మూడో కుమారుడిపైన కూడా వేటు పడింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలతో లింకులున్న దాదాపుగా 40 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. -
భర్తను పరస్త్రీతో పంచుకోవడం కంటే.. చావే మేలు అనుకుంది!
భర్త విషయంలో భారతీయ స్త్రీలు విపరీతమైన ఆలోచనా ధోరణితో ఉంటారని, తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటారని, పరాయి స్త్రీతో బంధాన్ని పంచుకోవడానికి ఏమాత్రం సహించబోరని అలహాబాద్(ఉత్తర ప్రదేశ్) హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహిత మహిళలు భర్త తమకు మాత్రమే సొంతం అనుకుంటారు. వాళ్ల గురించి విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఒకవేళ అతను గనుక వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నా, వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం.. చివరికి ఆలోచనా చేసినా అది ఆ భార్యను కుదిపేసే అంశమే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలే తీసుకుంటారు. ఈ కేసులోనూ అదే జరిగింది అంటూ జస్టిస్ రాహుల్ చతేర్వేది నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. తన భర్త రహస్యంగా మరో మహిళను వివాహం చేసుకోబోతున్నాడని, లేదంటే వివాహం చేసుకున్నాడనే ఒక్క కారణం చాలూ.. ఆమె తన ప్రాణం తీసుకునేందుకు అంటూ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలు.. వారణాసి మాండువాది చెందిన సుశీల్ కుమార్ అనే వ్యక్తి, అతని కుటుంబం మీద అతని భార్య చనిపోయే ముందు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వాళ్ల మీద కేసు నమోదు అయ్యింది. అయితే భార్య ఆత్మహత్యకు తామేమీ కారణం కాదని, కేసుల నుంచి ఉపశమనం ఇప్పించాలని సుశీల్ కోర్టులను ఆశ్రయించాడు. అయితే సుశీల్ కుమార్కు ఇదివరకే రెండు వివాహాలు అయ్యాయని, మరో వివాహం చేసుకోవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ధృవీకరించినట్లయ్యింది. -
బంధువులు ఇచ్చే బహుమతులయితే ఒకే.. లేదంటే పన్ను కట్టాల్సిందేనా ?
ప్ర. బహుమతులను ఆదాయంగా పరిగణిస్తారా? – యం. రామ్ గౌడ్, నిజామాబాద్ జ. బంధువుల నుంచి వచ్చే బహుమతులను ఆదాయంగా పరిగణించరు. అంటే, ఎటువంటి పన్ను భారం ఉండదు. కానీ స్నేహితుల నుండి తీసుకుంటే అటువంటి మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. మీరు ముందుగా బంధువు నిర్వచనాన్ని తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి సంబంధించి ఈ కింది వారు బంధువుల జాబితాలోకి వస్తారు. 1. జీవిత భాగస్వామి 2. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 3. జీవిత భాగస్వామి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 4. తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 5. అటు తరం, ఇటు తరం వంశస్థులు (ముత్తాత, తాత, నాన్న, కొడుకు, మనవడు, మునిమనవడు) 6. జీవిత భాగస్వామి యొక్క అటు తరం, ఇటు తరం వంశస్థులు 7. (2) నుండి (7)వరకు పేర్కొన్న వారి జీవిత భాగస్వాములు బీరకాయ పీచు బంధుత్వం ఒక విధంగా చెప్పాలంటే ‘బంధువు‘ నిర్వచనం అనేది దగ్గర వాళ్లందరినీ చుట్టబెట్టేస్తుందని చెప్పాలి. ఈ పరిధి దాటి వెళ్లకండి. ఎత్తేస్తే ఏడు చెక్కలయ్యే బంధువుల దగ్గరకి, బీరకాయ.. బెండకాయ పీచు చుట్టాలు..బాదరాయణ సంబంధాల జోలికి వెళ్లకండి. ఇక బంధువుల నుంచి వచ్చేవే కాకుండా మరికొన్ని బహుమతులకు కూడా మినహాయింపు ఉంది. ఒక వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 విలువ దాటి బహుమతులు వస్తే మొత్తం విలువ మీద ఎటువంటి బేసిక్ లిమిట్ లేకుండా ఆదాయంగా భావిస్తారు. కానీ ఈ కింది సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. 1. వివాహ సందర్భంలో 2. వీలునామా ద్వారా 3. ఇచ్చే వ్యక్తి (దాత) చనిపోయే సందర్భంలో 4. స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వైద్య సంస్థలు, ట్రస్టులు మొదలైనవి ఇచ్చినవి (కొన్ని పరిమితుల మేరకు) 5.‘బదిలీ‘ కాని వ్యవహారాల నుండి వచ్చినవి అయితే, వ్యవహారం జరిపే ముందు తగిన జాగ్రత్త వహించాలి. దాత ఎవరైనా సరే మూడు విషయాలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు 1. దాత ఐడెంటిటీ (డమ్మీని సృష్టించకండి) 2. ఇచ్చే విషయంలో దాత సామర్థ్యం (దాతకు నిర్దిష్ట సోర్స్ ఉండాలి) 3. వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు ఇవి చూపించకపోతే, స్థాపించకపోతే ఈ మొత్తాన్ని మీ ఆదాయంగా పరిగణించే అవకాశం ఉంది. ప్ర. ఆదాయపు పన్ను రిటర్నులలో ఏమేమి ఫారాలు దాఖలు చేయాలి? – మహ్మద్ ఖదీర్ బాషా, నల్గొండ జ. ఒక్క వాక్యంలో చెప్పాలంటే రిటర్నులతో పాటు ఏ కాగితం దాఖలు చేయనక్కర్లేదు. ఇప్పుడు అమలవుతున్న నియమం ప్రకారం ఎటువంటి అటాచ్మెంటు ఇవ్వనవసరం లేదు. ఆన్లైన్లో వేసినా, ఆఫ్లైన్లో వేసినా ఇదే రూలు. అయితే, మీరు ఒక స్టేట్మెంట్ తయారు చేసుకోండి. అన్ని సోర్స్లకు సంబంధించి ఆదాయాలు, లెక్కలు, కాగితాలు, రుజువులు, సర్టిఫికెట్లు, టీడీఎస్ పత్రాలు, ట్యాక్స్ చలాన్లు, ఫారం 16, ఫారం 16 అ, ఫారం 26 అ , ధృవపత్రాలు, కన్ఫర్మేషన్ లెటర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఈమెయిల్స్, బ్యాంకు అకౌంటు స్టేట్మెంట్లు, అగ్రిమెంట్లు, సేల్ డీడ్లు, డివిడెండు వారంట్లు .. ఇలా అవసరమైనవన్నీ భద్రపర్చుకోండి. కేసీహెచ్ ఏవీఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు చదవండి: సీనియర్ సిటిజన్లకు ‘పన్ను’ లాభాలు -
పోటాపోటీ పెద్దన్నలు!
ఒకరు అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు బైడెన్... మరొకరు అగ్రస్థానానికి దూసుకువస్తున్న చైనా దేశాధినేత షీ జిన్పింగ్. ప్రపంచాన్ని శాసించే విషయంలో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్న ఈ రెండు దేశాల అధినేతలూ కలసి మాట్లాడుకొంటే, అంతకన్నా పెద్ద వార్త ఏముంటుంది? వీడియో కాన్ఫరెన్స్లో అయితేనేం, సోమవారం నాటి ఈ అగ్రజుల భేటీ మీద అందరి దృష్టీ పడింది అందుకే! కానీ, చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికా... తైవాన్ అంశంలో అమెరికా వేలు దూర్చాలనుకోవడం నిప్పుతో చెలగాటమని హెచ్చరించిన చైనా... – ఇలాంటివే పతాక శీర్షికలకు ఎక్కాయి. అంటే, మూడున్నర గంటలు సాగిన ఈ భేటీ నిజంగా సాధించినదేమిటని అనుమానం రాక మానదు. రెండు దేశాల మధ్య అనేక విభేదాలున్నాయనీ, పోటీ తప్పదనీ మినహా ఈ చర్చల్లో తేలిన విషయం, చెప్పుకోదగ్గ విజయం ఏమిటన్నది విశ్లేషకులను వేధిస్తున్న ప్రశ్న. ఈ స్థాయి చర్చలు ముగిశాక సాంప్రదాయిక సంయుక్త ప్రకటనైనా వెలువడకపోవడం గమనార్హం. ఇద్దరు నేతలూ ఈ ఏడాది రెండుసార్లు ఫోన్లలో మాట్లాడుకున్నా, ఈ వీడియో భేటీ అనేక అంశాలపై లోతైన చర్చకు తావిస్తుందని అందరూ ఆశించారు. కానీ, ‘ఈ భేటీతో మేమేమీ అద్భుతాలు ఆశించలేదు. అదే జరిగింది’ అని తేల్చేశారో అమెరికన్ అధికారి. అయితే, నికర విలువ పరంగా, అమెరికాను దాటుకొని, ప్రపంచంలోనే ధనిక దేశంగా నంబర్ వన్ స్థానానికి చైనా ఎగబాకిందని తాజా మెకిన్సే నివేదిక తేల్చింది. ఆ పురోగతికి తగ్గట్టే, వాషింగ్టన్కు సమవుజ్జీ తామేనని బీజింగ్ భావిస్తున్నట్టు చర్చల్లో ఆ దేశాధ్యక్షుడి వైఖరి చెప్పకనే చెప్పింది. మానవ హక్కుల గురించి, ఉపఖండంలో దూకుడు గురించి అమెరికా సుద్దులు చెబితే చైనా డూడూ బసవన్నలా తల ఊపే పరిస్థితి కనపడలేదు. పైపెచ్చు, తాము అంతర్భాగమని భావించే తైవాన్ స్వాతంత్య్రంపై జోక్యం చేసుకుంటే తస్మాత్ జాగ్రత్త అని చైనా మాటకు మాట అప్పగించింది. ఆత్మవిశ్వాసంతో, నిక్కచ్చిగా మాట్లాడుతున్న చైనా మాటలను అమెరికా సావధానంగా వినక తప్పలేదు. అంతే కాదు... ‘మేము ప్రధాన ప్రపంచ లీడర్. అలాగే మీరు కూడా’ అని చైనాతో అమెరికా అంటే అది సహజం. కానీ ఈ భేటీలో బైడెన్, షీని ఉద్దేశించి, ‘మీరు (చైనా) ప్రధాన ప్రపంచ లీడర్. అలాగే అమెరికా కూడా’ అంటూ, చైనాకు పెద్ద పీట వేసి మాట్లాడడం మారిన పరిస్థితులకు ప్రత్యక్ష నిదర్శనం. చైనా జోరుకు బ్రేకులు పడేలా, భావసారూప్యం ఉన్న ప్రజాస్వామ్య దేశాలతో కలసి ‘క్వాడ్’ సహా రకరకాల పేర్లతో జట్టు కట్టడం అమెరికా వ్యూహం. ఈ వ్యూహాన్ని చైనా పరోక్షంగా ప్రస్తావించింది. శిబిరాల ఏర్పాటు వల్ల ప్రపంచానికి మళ్ళీ ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఉత్పాతం తప్ప ఒరిగేదేమీ లేదన్న షీ జిన్పింగ్ వ్యాఖ్య తీవ్రమైనదే. బైడెన్ సైతం షింజియాంగ్, టిబెట్, హాంగ్కాంగ్లలో చైనా అనుసరిస్తున్న విధానాలు, మానవ హక్కుల ఉల్లంఘన వార్తల లాంటి ఘాటైన అంశాలను నిర్మొహమాటంగా షీతో ప్రస్తావించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్రయాన ప్రాధాన్యం గురించి లేవనెత్తారు. అదే సమయంలో పరస్పరం పోటీపడినప్పటికీ, ఘర్షణకు దిగకుండా, పర్యావరణ మార్పు లాంటి ఉమ్మడి ప్రయోజనాలున్న కీలక అంతర్జాతీయ అంశాల్లో కలసి పనిచేయాలంటూ అమెరికా అనడం ఆహ్వానించదగినది. ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం అంతర్జాతీయ బాధ్యతలలో ఇరుదేశాలూ భుజం కలపాలని చైనా అధినేత సైతం అంగీకరించారు. కానీ, వాస్తవంగా వాటి గురించి ఈ భేటీలో ఎంత చర్చ జరిగిందంటే, మళ్ళీ ప్రశ్నార్థకమే. ఇటీవలే ముగిసిన ప్రపంచ పర్యావరణ సదస్సు ‘కాప్–26’ సైతం పర్యావరణ పరిరక్షణకు అగ్రరాజ్యాలు చేయాల్సిన త్యాగాలను కుండబద్దలు కొట్టింది. ఆ సదస్సులో ఇరుదేశాల ప్రతినిధులూ ఒప్పందం కుదుర్చుకున్నా, ఇప్పుడీ భేటీలో అంతకు మించిన ఆచరణాత్మక ప్రణాళికను ప్రకటించే చొరవ దేశాధ్యక్షులు తీసుకోలేదు. కానీ పనిలో పనిగా అనేక అంశాల్లో చైనా తనను తాను సమర్థించుకుంది. భారత్తో వాస్తవాధీన రేఖ వెంట, జపాన్తో సముద్రజలాలపైన చైనా ప్రదర్శిస్తున్న దూకుడుపై వస్తున్న విమర్శలను తగ్గించే ప్రయత్నం చేసింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆవిర్భావం నుంచి ఇప్పటి దాకా చైనా తనకు తానుగా ఏ యుద్ధాన్నీ మొదలుపెట్టలేదనీ, ఇతర దేశాల నుంచి అంగుళమైనా ఆక్రమించలేదనీ, దురాక్రమణ – ఆధిపత్యం తమ రక్తంలోనే లేవనీ నాణేనికి ఒక వైపునే చూపెట్టింది. ప్రజాస్వామ్యమనేది ఏకరూప నమూనాలో ఉండదనీ, తమదైన పద్ధతిలో లేవని ఆ ప్రజాస్వామ్యాలను కొట్టిపారేస్తే అది అప్రజాస్వామికమనీ అమెరికాకు పాఠాలూ చెప్పింది. ట్రంప్ కాలం నుంచి ఇరుదేశాలూ వాణిజ్య, సాంకేతిక పోటీ విషయంలో వాదులాడుకుంటున్నాయి. అలాగని సరఫరా వ్యవస్థల కొరత, ద్రవ్యోల్బణం, ట్యారిఫ్లను తగ్గించే అవకాశం లాంటి ఆర్థిక అంశాలేవీ తాజా భేటీలో చర్చించినట్టు లేరు. ఇకపై జరిగే వాణిజ్య చర్చల్లో చైనా పట్ల అమెరికా కొంత మెత్తబడేందుకు ఈ పెద్దల వర్చ్యువల్ భేటీ దారులు వేస్తుందని చైనా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ‘పోటీ ఓకే కానీ, పోరాటం వద్దు. పర్యవసానంగా సంబంధాలు చెడగొట్టుకోవద్దు’ అన్నదే ఈ పెద్దన్నల మాటల్లో తేలిన విషయం. ఈ మార్చిలో అలాస్కాలో రెండు దేశాల సీనియర్ అధికారుల మధ్య రెండు రోజుల పాటు మూడు రౌండ్ల చర్చల వేళ నిందారోపణలు బయటపడితే, ఈసారి స్వరం మారడం కొంత శుభసూచకం. విభేదాలున్నా, అవి విపరీత ఘర్షణకు దారితీయకూడదన్న వివేకం ప్రపంచానికి మంచిదే! ఇటుపై దీన్ని ఎలా ముందుకు తీసుకెళతారో చూడాలి. -
ఐటీ మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం లభించింది. తమ సెనేట్లో ఈ నెల 29న జరిగే ‘యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం 2021’సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఫ్రాన్స్ ప్రభుత్వం కేటీఆర్ను ఆహ్వానించింది. తమ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ సారథ్యంలో జరిగే ఈ సదస్సుతో రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతాయని కేటీఆర్కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ తదనంతరం భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో అభివృద్ధి, భవిష్యత్తు నిర్మాణం అనే అంశంపై ప్రసంగించాలని కోరింది. ఈ సదస్సులో గతంలో కంటే ఎక్కువ కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని, ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్కు పంపిన లేఖలో ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఈ సదస్సులో ఆరోగ్య రక్షణ, వాతావరణ మార్పులు, వ్యవసాయ వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుందని వివరించింది. దీంతో పాటు ఫ్రాన్స్, భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని మంత్రికి పంపిన ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్ ప్రభుత్వ ఆహ్వానంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించే వీలు కలుగుతుందని, ఫ్రాన్స్ దేశ ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలను దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. -
పోలీసులపై ఫిర్యాదుల విచారణకు స్థాయీ సంఘం
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు మధ్య ఉండే సన్నిహిత సంబంధాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీల అండ చూసుకొని బ్యూరోక్రాట్లు ,ముఖ్యంగా పోలీసు అధికారులు ఎలా ప్రవర్తిస్తారో తనకు తెలుసునన్నారు. పోలీసుల అకృత్యాలపై అందిన ఫిర్యాదులను విచారించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఛత్తీస్గఢ్కు చెందిన సస్పెండైన పోలీసు అధికారి గుర్జీందర్ పాల్ సింగ్ తనపై దేశద్రోహం, అవినీతి, బలవంతపు వసూళ్లకు సంబంధించి నమోదైన క్రిమినల్ కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం విచారించింది. నేతల అండతో చెలరేగే పోలీసు అధికారుల్ని న్యాయవ్యవస్థ కాపాడలేదని సీజేఐ వ్యాఖ్యానించారు. పోలీసు అధికారుల దౌర్జన్యాలపై దాఖలైన పిటిషన్ల విచారణకు స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందని చెప్పారు. -
11 మంది ‘ఉగ్ర’ ఉద్యోగుల తొలగింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, బలగాల కదలికలను గురించి ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చారనే అభియోగాల మీద జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు వారిని తొలగించినట్లు శనివారం ప్రకటించారు. తొలగింపునకు గురైన వారిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ చీఫ్ సలాహుద్దీన్ కుమారులు సయీద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్లు ఉన్నారని పేర్కొన్నారు. తొలగించిన వారిలో పోలీస్, విద్య, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్య శాఖలకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. వీరిలో నలుగురు అనంతనాగ్, ముగ్గురు బుద్గమ్కు చెందిన వారు కాగా.. బారాముల్లా, శ్రీనగర్, పుల్వామా, కుప్వారా జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఉన్నట్లు తెలిపారు. వీరందరిని భారత రాజ్యాంగంలోని 311వ ఆర్టికల్ ద్వారా తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ద్వారా ఉద్వాసనకు గురైతే వారు హైకోర్టులో మాత్రమే ఆ నిర్ణయాన్ని సవాలు చేయగలరు. రెండు సమావేశాల్లో.. కశ్మీర్కు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఇటీవల రెండు సార్లు సమావేశమైందని అధికారులు వెల్లడించారు. ఇందులో మొదటి సమావేశంలో ముగ్గురిని, రెండో సమావేశంలో 8 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొలగింపునకు గురైన వారు పలు రకాలుగా ఉగ్రవాదులకు సాయం అందించారని ఆరోపిం చారు. హవాలా ద్వారా డబ్బును పొందినట్లు వెల్లడించారు. భద్రతా బలగాలు చేపట్టబోయే కార్యకలాపాల వివరాలను చేరవేసి ఉగ్రవాదులకు సాయపడినట్లు అభియోగాలు మోపారు. -
స్థావర ప్రాంతాలే అమెరికా ధ్యేయం
పాకిస్తాన్ను అమెరికా దువ్వడం వెనక ఆ దేశంలో తన సైనిక స్థావరాలను నెలకొల్పే లక్ష్యముందని నిపుణుల అంచనా. ఇకపోతే పాకిస్తాన్కి 6 బిలియన్ డాలర్ల ఐఎమ్ఎఫ్ రుణ పంపిణీకి అమెరికా మద్దతు తెలపడం.. ఆ దేశ రాజకీయ వ్యూహంలో కొత్తమలుపునకు సంకేతమేననిపిస్తోంది. 2018 జూన్ నుంచి పాకిస్తాన్ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లో ఉంచడం తెలిసిందే. ఉగ్రవాద నిరోధక చర్యలను సమర్థంగా నిర్వహించకపోవడమే దీనికి కారణం. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడానికి విధించిన గడువును కోవిడ్ సంక్షోభంతో అనేకసార్లు పొడిగిస్తూ వచ్చారు. అయితే మారుతున్న పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్ ఈసారి గ్రే లిస్టు నుంచి బయటపడవచ్చని తెలుస్తోంది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను పునర్నిర్మించుకోవడం ద్వారా మొత్తం పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకోవచ్చని పాక్ ఆశాభావంతో ఉంటోంది. అమెరికా వ్యతిరేక ఉగ్రవాదానికి సైనిక స్థావరంగా అఫ్గానిస్తాన్ను ఉపయోగించుకోవడం, అమెరికా సేనలు సెప్టెంబర్ 11, 2021వ తేదీన తన భూభాగం నుంచి నిష్క్రమించాక అఫ్గానిస్తాన్ అంతర్యుద్ధంలో చిక్కుకోవడాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్లో తన సైనిక స్థావరాలను ఏర్పర్చుకునే అవకాశాల గురించి పెంటగాన్ ప్రయత్నిస్తోందంటూ పలు ఊహలు చెలరేగుతున్నాయి. అఫ్గానిస్తాన్లో ఉగ్రవాద వ్యతిరేక సైనిక చర్యలు జరపడం కోసం పాకిస్తాన్లో అమెరికా సైనిక స్థావరాలను అనుమతించబోవడం సాధ్యపడదని పాకిస్తాన్ విదేశీ మంత్రి షా అహ్మద్ ఖురేషి తాజాగా ప్రకటించారు. మరోవైపున అమెరికా సైనిక స్థావరాలను తమతమ భూభాగాల్లో అనుమతించరాదని అఫ్గాన్ తాలిబన్లు పొరుగు దేశాలను హెచ్చరించారు. ’మా పొరుగు దేశాలు తమ భూభాగాలపై పరదేశ సైనిక స్థావరాలను అనుమతించే చర్యలకు పూనుకోవద్దని కోరుతున్నాం. ఒకవేళ అలాంటి పనికి ఎవరైనా పాల్పడితే పెద్ద చారిత్రక తప్పిదమే అవుతుంది. అలాంటి తీవ్రమైన, రెచ్చగొట్టే చర్యల పట్ల తాలిబన్ మౌనంగా చూస్తూ ఉండదు’ అని తాలి బన్లు హెచ్చరించారు. తన భూభాగంలో అమెరికా వైమానిక స్థావరాలను అనుమతించబోతున్నట్లు వస్తున్న వార్తలను పాకిస్తాన్ ఇప్పటికైతే తిరస్కరించింది. అయితే మరోవైపున ఎయిర్ లైన్స్ కమ్యూనికేషన్, గ్రౌండ్ లైన్స్ కమ్యూనికేషన్కి సంబంధించిన అత్యవసర సహకారంపై 2001లోనే అమెరికాతో తాము ఒడంబడిక చేసుకున్నందున గగనతలం నుంచి, భూతలం నుంచి అమెరికాకు తామందిస్తున్న సహకారం కొనసాగుతుందని పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం నిర్ధారించడం గమనార్హం. నిస్సందేహంగానే, అమెరికా ప్రభుత్వంతో దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ముందుకు కదలాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాలనాకాలంలో ఇది సాధ్యపడుతుందని పాక్ ఆశాభావంతో ఉంది. అమెరికన్ రక్షణ రంగ నిపుణులతో, భద్రతా విధాన నిపుణులతో గణనీయంగా సంబంధాలు నెరపిన ప్రస్తుత పాక్ జాతీయ భద్రతా సలహాదారు మోయిద్ యూసఫ్ గత కొద్ది నెలల్లోనే పాక్ ప్రభుత్వ వ్యవస్థ విశ్వసాన్ని సంపాదించుకున్నారు. తన ఎజెండాలో పాక్–అమెరికన్ సంబంధాల పునరుద్ధరణ కీలకంగా ఉంది. ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికాతో కలిసి ముందుపీఠిన ఉండి పోరాడాలని పాకిస్తాన్ గతంలో తీసుకున్న నిర్ణయం పట్ల 2018లో అధికారంలోకి వచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదేపదే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక దేశీయంగా చూస్తే అమెరికా ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో పాక్ పాత్ర పట్ల తీవ్ర ఆగ్రహం రగుల్కొంటోంది. మరోవైపున, గత రెండు దశాబ్దాలుగా చైనాతో పాకిస్తాన్ సంబంధబాంధవ్యాలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. సైనిక నిర్మాణం, 60 బిలియన్ డాలర్ల ఆర్థిక పెట్టుబడులు వంటి కీలకమైన రంగాల్లో బీజింగ్ నాయకత్వం చేస్తున్న సహాయం పట్ల పాకిస్తాన్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అన్నిటికంటే మించి భారత్ వ్యతిరేక కశ్మీర్ ఎజెండాను సమర్థించడంలో దౌత్యపరంగా చైనా అందిస్తున్న సహకారానికి పాక్ ఎంతో ప్రాముఖ్యతనిచ్చి చూస్తోంది. ఒకవైపు దేశీయంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ చైనాతో వ్యూహాత్మక పొత్తు బలంగా ఏర్పర్చుకున్న పాకిస్తాన్.. తాజాగా అమెరికాకు సైనిక స్థావరాలను కల్పించడంపై అఫ్గాన్ తాలిబన్లు మృదువుగా హెచ్చరిస్తున్నప్పటికీ, పలు కారణాల వల్ల అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల పునరుద్ధరణకు మొగ్గుచూపనున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మద్దతు ఎంతైనా అవసరముంది. స్వల్ప అభివృద్ధి రేటు, పెరిగిన అప్పులు, అత్యధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. 2019లో ఐఎమ్ఎఫ్తో 6 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని అత్యంత కఠినమైన షరతులతో పాకిస్తాన్ ప్రభుత్వం కుదుర్చుకుంది. కఠినమైన రుణ నిర్వహణ పథకాన్ని అమలు చేయాలని, పన్నులను పెంచాలని, ఇంధనరంగంలో సంస్కరణలకు తలుపులు తెరవాలని ఐఎమ్ఎఫ్ పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు అమెరికా ఇవ్వనున్న 6 బిలియన్ డాలర్ల రుణ పంపిణీ చాలా కీలకంగా మారింది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్ ఈసారి గ్రే లిస్టునుంచి బయటపడవచ్చని తెలుస్తోంది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను పునర్నిర్మించుకోవడం ద్వారా మొత్తం పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకోవచ్చని పాకిస్తాన్ ఆశాభావంతో ఉండటం విశేషం. పాకిస్తాన్ అవలంబిస్తున్న అఫ్గాన్ విధానంలో మార్పులు చోటుచేసుకోవచ్చనిపిస్తోంది. పాకిస్తాన్ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపట్ల అప్గానిస్తాన్ నాయకత్వం తన ఆగ్రహాన్ని ప్రకటిస్తూనే వస్తోంది. ఏదేమైనప్పటికీ అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమణ ద్వారా ఏర్పడనున్న అస్థిరత పాక్ సమస్యలను రెట్టింపు చేయనుంది. అఫ్గానిస్తాన్లో అస్థిరత్వం పాకిస్తాన్కి చెందిన తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ ప్రభావాన్ని రెట్టింపు చేయనుంది. సైనిక నిఘా, పరిమితమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అఫ్గాన్ భద్రతా దళాలకు దన్నుగా ఉండటం వంటి లక్ష్యాల సాధనకు సైనిక స్థావరాలను నెలకొల్పుకునే అవకాశాలను అమెరికా ఎంచుకుంటోంది. ఈ క్రమంలో అమెరికా నాలుగు సమర్థ అవకాశాలను కలిగి ఉంది. 1. అమెరికా ప్రయోజనాలకు సంబంధించి పాకిస్తాన్లో సైనిక స్థావరాల స్థాపన అత్యంత అనుకూలమైన అంశం. పైగా ఇరుదేశాల మధ్య సహకారం ఇప్పటికే ఉంది. 2. తమ వైమానిక స్థావరాల ఏర్పాటుపై మధ్య ఆసియా రిపబ్లిక్ దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోంది కానీ దీనిపై పెద్ద స్పష్టత కానరావడం లేదు. 3. ఖతార్లోని వైమానిక స్థావరంతో సహా గల్ఫ్ ప్రాంతంలో ఉంటున్న అమెరికా సైనిక స్థావరాలు అంత అనుకూలత కలిగిలేవు. ఎందుకంటే ఇక్కడి నుంచి అమెరికా తన డ్రోన్లను ప్రయోగించాలంటే దాని సైనిక విమానాలు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు ప్రయాణించాల్సి ఉంటుంది. 4. కాగా అమెరికా సైనిక విమానాలకు గగనంలోనే ఇంధనం నింపుకునే సౌకర్యం అరేబియా సముద్రంలోని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లలో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్లో అమెరికా ఉగ్రవాద నిరోధక చర్యలకు పాకిస్తాన్ ఎంత అనుకూలంగా ఉంటోందో నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఏకకాలంలోనే అటు అమెరికాతో, ఇటు చైనాతో సంబంధాలను నైపుణ్యంగా కొనసాగించే కళలో పాక్ రాటుదేలిపోయింది కూడా. అయితే ఈ మొత్తం ప్రక్రియలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాతో పాక్ నేరుగా కలిసి పనిచేస్తుందా లేదా అమెరికన్ డ్రోన్ ఆపరేషన్ల కోసం పరోక్ష మద్దతు యంత్రాంగాన్ని మాత్రాన్నే కల్పిస్తుందా? పైగా చైనాతో సంబంధాలకు విఘాతం కలగకుండానే అమెరికాతో పాత సంబంధాలను పాక్ ఏర్పర్చుకోగలుగుతుందా? అఫ్గానిస్తాన్ నుంచి అమెరికన్ సేనల ఉపసంహరణ పూర్తయిన వెంటనే ఈ ప్రశ్నలకు సమాధానాలు వెలుగులోకి రావచ్చు. అందుకే ఈ ప్రాంతంలో తన భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించుకోవడానికి గాను ప్రస్తుత పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలించాల్సి ఉంది. – వ్యాసకర్త విశిష్ట పరిశోధకురాలు, షాలిని చావ్లా సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
నిర్మలా సీతారామన్తో పనిచేయడం కష్టం..
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఏడాది తరువాత దీనికి గల కారణాలపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 31న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన శనివారం సుదీర్ఘమైన బ్లాగ్ పోస్ట్లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ఎందుకు రాజీనామా చేసిందీ బ్లాగులో ప్రచురించారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పనిచేయడం కష్టంగా తాను భావించానని పేర్కొన్నారు. ఆమెతో తనకు కలిసి రాలేదన్నారు. వాస్తవానికి ఆర్థికమంత్రి తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనీ చెప్పారు. తన రాజీనామా నిర్ణయం వెనుక రెండు కారణాలున్నాయని గార్గ్ చెప్పారు. మొదటిది 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థనుంచి కేంద్రం పక్కకుపోవడం, రెండవది ఆర్థిక మంత్రితో తన సంబంధాలు బాగా లేకపోవడం కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్థికమంత్రిత్వ శాఖ కాకుండా మరో శాఖలో పనిచేయాలని తాను భావించలేదన్నారు. భిన్నమైన వ్యక్తిత్వం, నాలెడ్జ్ ఎండోమెంట్, నైపుణ్యం, ఎకనామిక్ పాలసీలకు సంబంధించి సరియైన విధానాన్ని కలిగి ఉన్నారంటూనే ఆమెతో పనిచేయడం కష్టమని గార్గ్ వ్యాఖ్యానించారు. అలాగే 10 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంనుంచి కేంద్రం పక్కకుపోయిందనీ, ఇది సాధ్యంకాదనే విషయం తనకు ప్రారంభంలోనే స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. అలాగే దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి పనిచేయడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు చాలా ఉత్తమమైనదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజా విధాన సమస్యల నాడిని అవగతం చేసుకున్న మాస్టర్ మైండ్ జైట్లీ అని కొనియాడారు. విధానాల అమలు, శాఖ నిర్వహణ తదితర అంశాలను ఆయన కార్యదర్శులకు విడిచిపెట్టేవారని గుర్తు చేసుకున్నారు.నిర్మలా సీతారామన్కు కూడా తనపై నమ్మకం ఉన్నట్టు అనిపించలేదనీ, చాలా అసౌకర్యంగా ఉన్నట్టు గుర్తించానని గార్గ్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆర్ బీఐ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్, నాన్-బ్యాంకింగ్ సంస్థలు, పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకం విషయాలపై ఇద్దరి మధ్య తీవ్రమైన తేడాలు ఏర్పడ్డాయని మాజీ ఆర్థిక కార్యదర్శి చెప్పారు. దీంతో అధికారికంగా, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన ఒక నెలలోనే, 2019 జూన్లో తన బదిలీ కోసం సీతారామన్ పట్టుబట్టినట్లు గార్గ్ పేర్కొన్నారు. అందుకే బడ్జెట్ సమర్పించిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాను. జూలై 24 న విద్యుత్ మంత్రిత్వ శాఖకు బదిలీ ఉత్తర్వు జారీ అయిన అరగంటలోనే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దాఖలు చేశానని చెప్పారు. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయానని తన బ్లాగులో చెప్పారు. -
నేపాల్తో మళ్లీ చెట్టపట్టాలు
అయిదు నెలలక్రితం భారత్–నేపాల్ సంబంధాల్లో వినిపించిన చిటపటలు కొద్ది రోజులుగా సద్దు మణిగాయి. కారణమేమిటో తాజా పరిణామాలే చెబుతున్నాయి. మన సైనిక దళాల ప్రధానాధికారి ఎం.ఎం. నరవణే వచ్చే నెలలో ఆ దేశం పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా నేపాల్ అధ్యక్షు రాలు విద్యాదేవి భండారీ ఆయనకు నేపాల్ సైనిక గౌరవ జనరల్గా గౌరవ పురస్కారాన్ని అంద జేయబోతున్నారు. ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాల సైనిక చీఫ్లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలని నేపాల్ భావించగా, అందుకు మన దేశం కూడా అంగీకరించడం మంచి పరిణామం. వాస్తవానికి ఇది గత ఫిబ్రవరిలోనే జరగాలి. కానీ అప్పటికే కరోనా కలకలం మొదలుకావడంతో వాయిదాపడింది. మన ఉత్తరాఖండ్లో భాగంగా వున్న లింపియాధుర, కాలా పానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని మొన్న మే నెలలో నేపాల్ ప్రకటించడంతోపాటు అందుకు సంబంధించి ఒక మ్యాప్ను కూడా విడుదల చేసింది. భారత్ రాజముద్రలో ఉండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని వుంటుందని... ఆ దేశం దానికి కట్టుబడి వుంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు కూడా. దాంతో ఇటు మన దేశం నుంచి కూడా ఘాటు వ్యాఖ్యలే వెలువడ్డాయి. మ్యాప్ను విడుదల చేయడంద్వారా చర్చలకు నేపాల్ శాశ్వతంగా తలుపులు మూసిందని మన దేశం సూటిగా చెప్పింది. నేపాల్ తీసుకొచ్చిన ఈ కొత్త పేచీ వెనక ‘ఎవరో’ ఉన్నారని జనరల్ నరవణే చేసిన వ్యాఖ్యతో అక్కడి నేతలు మరింత రెచ్చిపోయారు. తాము చైనా చెప్పినట్టల్లా ఆడుతున్నామని పరోక్షంగా అన్నారని వారికి అర్ధమైంది. కొత్త సరిహద్దులతో విడుదల చేసిన మ్యాప్లకు సంబంధించిన బిల్లుల్ని అక్కడి పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టారు. ఇక రెండు దేశాల సంబంధాలూ చక్కదిద్దలేని స్థాయికి చేరు కున్నాయని అందరూ అనుకున్నారు. కానీ చాకచక్యంతో దౌత్యం నెరపితే, కాస్త సంయమనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆ సంగతి తాజాగా నిరూపణ అయింది. ఇరుగు పొరుగు దేశాల మధ్య విభేదాలుండటం కొత్తేమీ కాదు. చారిత్రకంగా, సాంస్కృతికంగా శతాబ్దాల చరిత్ర వున్న రెండు దేశాలు ఏదో ఒక ఘటన కారణంగానో, ఎవరో చేసిన వ్యాఖ్య కారణం గానో శాశ్వతంగా దూరమవుతాయని, శత్రువులుగా మిగులుతాయని భావించవలసిన అవసరం లేదు. భారత్–నేపాల్ సంబంధాలు మళ్లీ చివురిస్తున్న వైనం రెండు నెలలుగా కనబడుతూనే వుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని శర్మ ఓలితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం మన ప్రభుత్వం నేపాల్లో చేపట్టి అమలు చేస్తున్న ప్రాజెక్టులపై కఠ్మాండులో ఆగస్టు 17న సమావేశం జరిగింది. అధికారుల స్థాయిలో జరిగిన ఆ చర్చల తర్వాత పరిస్థితి మళ్లీ మెరుగుపడటం మొదలైంది. అంతమాత్రాన కొత్త మ్యాప్ల వ్యవహారం సమసినట్టు కాదు. ఆ అంశంపై చర్చలు ఇంకా జరగాల్సేవుంది. నేపాల్తో మన దేశం సంబంధాలు ఎప్పుడూ ఉండాల్సిన విధంగా లేవు. ఇందుకు ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి జనతా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో నియంతృత్వ పోకడలను అమలు చేయడమే కాక, దక్షిణాసియాలో ఆధిపత్య ధోరణులను ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. తాము అధికారంలోకొచ్చాక ఇరుగుపొరుగుతో మంచి సంబంధాలు నెల కొల్పుతామని చెప్పారు. ఆ తర్వాత జనతాపార్టీ అధికారంలోకొచ్చి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా, వాజపేయి విదే శాంగమంత్రిగా వ్యవహరించినప్పుడు విదేశాంగ విధానంలో కీలకమైన మార్పులే చేశారు. కానీ కొద్దికాలంలోనే వారు సైతం ఇందిర బాటలో పయనిస్తున్నారన్న విమర్శలొచ్చాయి. నెహ్రూ ఏలుబడిలో కూడా దక్షిణాసియా దేశాలతో సంబంధాల విషయంలో మన విధానం సరిగాలేదని నిపుణులు విమర్శించేవారు. ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి సాధించడానికి, ప్రపంచంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రాంతీయ దేశాలతో సఖ్యతే కీలకం. అందువల్ల మన సర్వశక్తులూ అభివృద్ధిపై కేంద్రీ కరించడానికి అవకాశం వుంటుంది. అవతలి దేశాలు మన స్నేహ హస్తాన్ని అందుకోవడంలో విఫలం కావొచ్చు... కావాలని మనతో పేచీలకు దిగొచ్చు... మన భద్రతకు ముప్పు తెచ్చే విధానాలు అను సరించొచ్చు. అటువంటప్పుడు దృఢంగా వుండాల్సిందే. మన రక్షణకు అవసరమైన చర్యలు తీసు కోవాల్సిందే. అదే సమయంలో వృధా వివాదాల వల్ల కలిగే అనర్థాలను అవి గ్రహించేలా చేయాలి. మనవైపుగా లోటుపాట్లు లేకుండా చూడాలి. మనం పెత్తనం చలాయిస్తున్నామని, వారి ప్రయోజనాలకు హాని కలిగిస్తున్నామని చిన్న దేశాలు అభిప్రాయపడేలా ఉండకూడదు. నేపాల్ విషయంలో మన పాలకులు మొదటినుంచీ నిర్లక్ష్యంగానే వున్నారు. 1997లో అప్పటి మన ప్రధాని ఐకె గుజ్రాల్ నేపాల్లో పర్యటించాక, మళ్లీ మోదీ ప్రధాని అయ్యేవరకూ ఏ ప్రధానీ ఆ దేశం వెళ్లలేదు. మంత్రుల స్థాయి పర్యటనలు, అధికారుల స్థాయి పర్యటనల తీరూ అంతే. చైనా దీన్ని ఆసరా చేసుకుని నేపాల్ను సన్నిహితం చేసుకోవడానికి ఎడతెగని ప్రయత్నం చేసింది. నేపాల్లో మనపై విద్వేషభావం ఏర్పడేలా ప్రచారం చేసింది. ఆ దేశంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒక్క నేపాల్తో మాత్రమే కాదు... బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, మయన్మార్ వగైరాలతో కూడా చైనా వ్యూహాత్మకంగా చెలిమి చేస్తోంది. దీన్ని మన దేశం గమనంలోకి తీసుకోవాలి. భారత్–నేపాల్ మధ్య వాణిజ్య విస్తరణ జరిగితే అది ఇరు దేశాలకూ ఎంతో మేలు చేస్తుంది. అక్కడ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మన దేశం మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వుంటుంది. ఇప్పుడు జరగబోయే జనరల్ నరవణే పర్యటన వల్ల ఏదో ఒరుగుతుందని చెప్పలేం. కానీ మెరుగైన సంబంధాల దిశగా అడుగులేయడానికి అది ఎంతో కొంత తోడ్పడుతుంది. -
చేతులకు ఫోన్ దొరక్కుండా చేస్తే..?
శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపడానికి వారంలో ఒకరోజు ఉపవాస దీక్ష ఎలా చేపడ్తామో.. బంధాలు, అనుబంధాలు పెంచుకోవడానికి డిజిటల్ డిటాక్సిఫికేషన్ దీక్ష అలా అవసరం. లంకణం పరమౌషధం అన్నారు పెద్దలు.పొట్టను మాడిస్తే జబ్బు పారిపోతుందని అంటారు.మరి చేతులను మాడిస్తే?వాటికి ఫోన్ దొరక్కుండా చేస్తే?కంప్యూటర్ దొరక్కుండా చేస్తే?టీవీ రిమోట్ దొరక్కుండా చేస్తే? చేతులకు పత్యం పెడితే?ఈ పత్యం చాలా మంచిదిఅంటున్నారు నిపుణులు.సోషల్ మీడియాకు, స్మార్ట్ఫోన్ వ్యసనానికి వారానికి ఒకసారి లంకణం పెట్టిస్తే కుటుంబ అనుబంధాలుదగ్గరికి వస్తాయి. మనుషులు దగ్గరఅవుతారు. సంతోషం దగ్గరికొస్తుంది.ఒక్కమాటలో చెప్పాలంటే దూరమైనవన్నీ దగ్గరకొస్తాయి. ఒక కుటుంబం.. అత్యంత సన్నిహితులతో ఆత్మీయసమ్మేళనం జరుపుకుంటోంది. చిన్నాపెద్దా, యూత్ అంతా కలిసి పాతిక మంది వరకూ ఉన్నారు. కాని ఆ ఇంట్లో ఏమాత్రం సందడి æలేదు. హాల్లో వినిపిస్తున్న, కనిపిస్తున్న ఎల్ఈడీ టీవీ సౌండ్ తప్ప. వయసులో పెద్దవాళ్లు నలుగురైదుగురు టీవీలో లీనమయ్యారు. మిగిలిన వాళ్లంతా స్మార్ట్ ఫోన్స్తో ఎంగేజ్ అయ్యారు. పిల్లలు ఎవరికి వారే తమ చేతుల్లో ఉన్న ట్యాబ్స్లో గేమ్స్ ఆడుకుంటున్నారు. మధ్యవయస్కులు యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటున్నారు. మగవాళ్లు తాము కూర్చున్న చోటే కాస్త పక్కకు తిరిగి ఫోన్ మాట్లాడుకుంటున్నారు. మెసేజ్ చేసుకుంటున్నారు. ఆడవాళ్లు సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమ్మేళనానికి హాజరైన వారితోనే ఫ్యామిలీ గ్రూప్లో చాట్ చేసుకుంటున్నారు. అక్కడే వాళ్ల సమక్షంలో దిగిన ఫోటోలనే అందులో పెడుతున్నారు. వాళ్ల పక్కనే ఉన్న వాళ్లు.. ‘వావ్ .. నైస్.. భలే ఉంది చీర.. డిజైన్ చేయించావా?’ ‘ హేయ్.. నీ ఫొటో వెనక కనపడుతున్న షో పీస్ భలే ఉంది... అమెజాన్లో కొన్నావా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలదైతే అదో లోకం. పబ్జీ నుంచి టిక్టాక్ల దాకా.. ఈ మూల ఒకరు.. ఆ బాల్కనీలో ఒకరు.. కారిడార్లో ఒకరు.. కిచెన్లో ఒకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోచోట ఒక్కో యాప్లో బిజీ. తీరా ఎప్పటికో పెద్దవాళ్లకు ఆకలేసి టీవీలోంచి మొహం బయటపెట్టి మిగిలిన వాళ్లను పలకరించే ప్రయత్నం చేశారు. ఎవరూ ఈ లోకంలో లేరు. అంతలోకే ఫోన్లోంచి తన చుట్టూ ఉన్న పరిసరాల మీదకు దృష్టి మరల్చిన ఆ ఇంటి కోడలికి పరిస్థితి అర్థమై ఆ ఫ్యామిలీ గ్రూప్లోనే మెసేజ్ పెట్టింది ‘లంచ్ చేద్దామా?’ అంటూ. ‘యెస్’ అంటూ ఒకరివెంట ఒకరు రిప్లయ్. లంచ్ చేసేప్పుడు కూడా చిన్న పిల్లలు తమ చేతుల్లోంచి ట్యాబ్స్ తీసి పక్కన పెట్టలేదు. నిజానికి ట్యాబ్స్ తీసేస్తే ముద్ద మింగడం లేదు వాళ్లు. దాంతో తల్లులు అందులో రైమ్స్ పెట్టి.. అన్నం తినిపించడం మొదలుపెట్టారు. ఆ ట్యాబ్ వంకే కళ్లప్పగించి గబగబా ముద్దలు మింగేస్తున్నారు. ఏం తింటున్నామో.. దాని రుచి ఏంటో కూడా తెలియనంతగా. అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి సినిమాకు వచ్చింది. అందరూ కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేసుకొని మరీ వచ్చారు. సినిమా టైమ్కు కంటే కాస్త ముందే వచ్చారు. ‘హాయ్’ అంటూ విష్ చేసుకోవడం తప్ప వాళ్లు మాట్లాడుకున్నదేమీ లేదు. ఎవరి ఫోన్లో వాళ్లు మెసేజ్లు, వీడియోలు చూసుకుంటూ ఉన్నారు. ఇంతలోకే సినిమా టైమ్ అయింది. అలాగే ఫోన్లు చూసుకుంటూనే లోపలికి వెళ్లారు. సీట్లు వెదుక్కొని కూర్చున్నారు. సినిమా విన్నారు.. సెల్ఫోన్ చూసుకున్నారు. పెళ్లవుతోంది... పెళ్లికి హాజరైన అతిథుల్లో చాలామంది చేతుల్లో ఫోన్లు. ఆ ఫోన్లలోనే వాళ్ల దృష్టంతా. పెళ్లిని చూసిందే లేదు. నవ్వుకుంటూ ఆటపట్టించుకోవడమూ లేదు. సెల్ఫీలు దిగారు. వీడియోలు తీసుకున్నారు. ఎన్నాళ్లుగానో కలవని చాలామంది ఆ పెళ్లిలో కలుసుకున్నారు. ఆ ఆనందం ఎవరి మొహాల్లోనూ లేదు పెద్దగా. మాటామంతీ జరపలేదు. కాలక్షేపం అంతా స్మార్ట్ఫోన్తోనే జరిగింది. పైన చెప్పిన ఉదంతాలన్నీ ‘హికికొమోరి’కి దగ్గరగా ఉన్నాయి. జపాన్లోని యువతను, మధ్య వయస్కులను ఇంకా చెప్పాలంటే స్కూల్కు వెళ్లే పిల్లలనూ పీడిస్తున్న మానసిక జాడ్యం హికికొమోరి. ఒక వ్యక్తి తనంతట తానుగా ఇంటికే పరిమితమైపోయి బాహ్య పరిసరాలు, మనుషులకు దూరమైపోవడం ఈ జాడ్యం లక్షణం. ప్రస్తుతం మన దేశంలో మనుషులంతా కలిసి ఒకే చోట ఉన్నా ఫోన్ల వల్ల ఎవరికి వారుగానే ఉన్నారు. అందరూ కలిసి ఒక వినోదాన్ని ఆస్వాదించాలని వచ్చినా ఎవరికి వారే సోషల్ నెట్వర్క్లో వినోదాన్ని వెదుక్కుంటున్నారు. కళ్లముందు వేడుక జరుగుతున్నా మనుషులను, పరిసరాలను గమనించడం లేదు.. గ్రహించడం లేదు. ఎలక్ట్రానిక్ డివైజే నేస్తం.. దానితోనే చెలిమి.. అదే ఒక బంధం.. బంధనంగా బతుకుతున్నారు. దాన్ని నిరోధించాలంటే జీవన శైలి మార్చుకోవాలి అంటున్నాను మానసికవైద్య నిపుణులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు. డిజిటల్ డిటాక్సిఫికేషన్ చేయాలి అంటున్నారు. అంటే శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపడానికి వారంలో ఒకరోజు ఉపవాస దీక్ష ఎలా చేపడ్తామో కుటుంబంతోపాటు చుట్టాలు, స్నేహితులు, నిత్యం మనం మెదిలే పరిసరాలతో బంధాలు, అనుబంధాలు పెంచుకోవడానికి డిజిటల్ డిటాక్సిఫికేషన్ దీక్ష అవసరం అంటున్నారు. అసలు జీవితం చిన్నదైపోతుంది స్మార్ట్ఫోన్కు అలవాటు పడిన మెదడు పూర్తిగా స్మార్ట్ఫోన్ మీదే ఆధారపడిపోతుంది. అసలు జీవితం చిన్నదైపోతుంది. చేతిలోనో కనుచూపు మేరలోనో ఫోన్ కనిపించకపోతే ఏదో అభద్రతగా అనిపిస్తుంది. ఇదొక వ్యసనం. అందులోంచి బయట పడడానికి ఈ డిజిటల్ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కసారిగా ఫోన్కు దూరంగా ఉండకుండా.. నెమ్మదిగా అంటే ముందు ఓ గంట, తర్వాత గంటన్నర, ఆ తర్వాత రెండు గంటలు.. ఇలా రోజురోజుకు దాన్ని దూరంగా ఉంచే సమయాన్ని పెంచుకుంటూ పోయి వారానికి ఒకరోజు పూర్తిగా ఫోన్ ఉపయోగించక పోవడం.. ఆ తర్వాత వారానికి రెండు రోజులు.. ఇలా పెంచుకుంటూ పోయి.. ఆ వ్యసనాన్ని మానుకోవచ్చు. ఈ అడిక్షన్ ఆల్కహాలు, స్మోకింగ్ లాంటిదే. అలవాటు పడిన మెదడు ఊరుకోదు. అందుకే ఫోన్లో గేమ్స్ ఆడాలి. అయితే ఒక్క విషయం... ఈ డిజిటల్ డిటాక్సిఫికేషన్ ప్రక్రియ ముందు పెద్దల నుంచే స్టార్ట్ అవ్వాలి. అప్పుడే పిల్లలు మనల్ని అనుసరిస్తారు. – డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, సైకియాట్రిస్ట్ వారానికి ఒకరోజు సెల్ఫోన్తోపాటు దానికి అనుసంధానంగా ఇంటర్నెట్, అది వాహకంగా ఉన్న సోషల్ మీడియాకు దూరంగా ఉండడం, రోజంతా దాన్ని ఉపయోగించకుండా మన చుట్టూ భౌతిక ప్రపంచానికి దగ్గరగా మెదలడమే డిజిటల్ డిటాక్సిఫికేషన్. మనుషులను ఆక్రమించుకున్న ఈ సాధనాల వల్ల కలిగే దుష్పరిణామాలు అర్థమై ఇప్పుడు అంతా వాటిని ఉపవసించే పనిలో పడ్డారు. ఈ ఉపవాస దీక్ష ఒక ధోరణిలా మొదలైనా... ఆరోగ్యకరమైన భవిష్యత్కు దీన్నొక శుభపరిణామంగా అనుకోవచ్చు. – కథనం : సాక్షి ఫ్యామిలీ -
వరవరరావు హార్డ్డిస్క్ డేటా రికవరీ కోసం..
పుణే: ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఇంట్లో స్వాధీనంచేసుకున్న హార్డ్డిస్క్లోని డేటా రికవరీ కోసం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) సాయం తీసుకోవాలని పుణే పోలీసులు భావిస్తున్నారు. గతేడాది ఆగస్టులో వరవరరావు ఇంట్లో సోదాల్లో లభ్యమైన హార్డ్డిస్క్లో ఏముందో తెల్సుకునేందుకు నాలుగు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపినా ఫలితం లేదు. తొలుత పుణేలోని ల్యాబొరేటరీకి పంపగా, నిపుణులు హార్డ్ డిస్క్లోని డేటాను రికవరీ చేయలేకపోయారని ఓ అధికారి చెప్పారు. తర్వాత ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినా అక్కడి నిపుణులు డేటా సంపాదించలేకపోయారు. గుజరాత్, హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల నిపుణులు రికవరీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ‘సాంకేతికతలో ఎఫ్బీఐ చాలా పురోగతి చెంది ఉంటుంది. అందుకే ఎఫ్బీఐకి హార్డ్ డిస్క్ పంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు అవసరమైన అనుమతులను కేంద్ర హోం శాఖ ఇచ్చింది’అని ఆ అధికారి చెప్పారు. -
యూఏఈ సాయం తిరస్కరణ.. కేరళ అసంతృప్తి!
వరదలు ముంచెత్తడంతో నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయానికి యూఏఈ ముందుకొచ్చింది. భారత్తో మరీ ముఖ్యంగా కేరళతో యూఏఈకి ప్రత్యేక సంబంధాలున్న నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం ఇంత భారీ సాయాన్ని ప్రకటించింది. ఈ సాయాన్ని స్వీకరించబోమని భారత ప్రభుత్వం తెలిపింది. విదేశీ విరాళాలను అంగీకరించబోవడం లేదని సమాచారం. 2004 డిసెంబర్ నుంచే అమల్లోకి 2004 డిసెంబర్లో నాటి ప్రధాని మన్మోహన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చిది. ఈ ‘విపత్తు సహాయ విధానం’లో భాగంగా విదేశీ సహాయాన్ని అంగీకరించకూడదని నిర్ణయించింది. సునామీ కారణంగా భారత్లోని వివిధ రాష్ట్రాల్లో తీవ్రనష్టం సంభవించిన సందర్భంలో ఈ విధానాన్ని ఖరారు చేశారు. సునామీ అనంతర సహాయ, పునర్నిర్మాణ కార్యక్రమాలు భారత్ సొంతంగా చూసుకోగలదని మన్మోహన్ చెప్పారు. కేరళలోని విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు దేశీయం గా అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలనే వినియోగించుకోవాలనే ఆలోచనతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉంది. దౌత్య కార్యాలయాలకు వర్తమానం కేరళ విపత్తుపై విదేశీ ఆర్థిక సహాయాన్ని స్వీకరించవద్దని ఇప్పటికే అన్ని రాయబార కార్యాలయాలకు మోదీ ప్రభుత్వం వర్తమానం పంపించింది. ఏ దేశ ప్రభుత్వమైనా సహాయం చేసే ఉద్దేశాన్ని వెల్లడిస్తే దానిని సున్నితంగా తిరరస్కరించాలని భారత రాయబార కార్యాలయాలకు పంపిన సందేశంలో పేర్కొంది. చివరగా 2004లో బిహార్ వరదలతో అతలాకుతలమైనపుడు విదేశీ ప్రభుత్వాల సహాయాన్ని భారత్ తీసుకుంది. ఆ తర్వాతి సందర్భాల్లో తిరస్కరించింది. ఎన్ఆర్ఐల విరాళాలపై పన్ను లేదు ఇతర దేశాల ప్రభుత్వాలిచ్చే విరాళాలు, ఆర్థిక సహాయాన్ని నిరాకరిస్తున్నా, ఆ దేశాల్లోని భారతీయులు కేరళ సీఎం సహాయనిధికి నేరుగా విరాళాలు పంపించవచ్చు. వాటికి పన్ను మినహాయింపు ఉంటుంది. ‘విదేశీ విరాళాల చట్టం కింద గుర్తింపు పొందిన, లాభాపేక్ష లేని స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ద్వారా వచ్చే విదేశీ సాయంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది’ అని విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి చెప్పారు. కేంద్రం నిర్ణయంపై కేరళ అసంతృప్తి! కొచ్చి: కేరళ వరదలకు విదేశాలు చేస్తున్న సాయాన్ని కేంద్రం తోసిపుచ్చడంపై కేరళ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ విరాళాలు అత్యవసరమని రాష్ట్ర సీఎం భావిస్తున్నారు. యూఏఈ విరాళంపై పునరాలోచించాలని ప్రధానిని కలిసి విన్నవించనున్నట్లు విజయన్ తెలిపారు. విదేశీ సాయం తీసుకునేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని కూడా వారు ప్రధానిని కోరనున్నారు. యూఏఈ రూ.700కోట్లు, ఖతార్ రూ.35కోట్లు, మాల్దీవులు రూ.35 లక్షల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భారత్-పాక్లపై చైనా కీలక వ్యాఖ్యలు
బీజింగ్ : భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో చైనా సానుకూల, నిర్మాణాత్మక పాత్ర పోషించనుందని చైనా విదేశాంగ ప్రతినిధి లూకుంగ్ తెలిపారు. ఆసియాలో భారత్, పాకిస్తాన్లు బలమైనా దేశాలని, ఆ రెండు దేశాల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు మెరగుపడాలని ఆయన వ్యాఖ్యానించారు. భారత్-పాక్ మధ్య అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడంలో భవిష్యత్తులో చైనా కీలక పాత్ర పోషించనున్నట్లు లూకుంగ్ వెల్లడించారు. పాక్ నూతన ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వంతో తాము చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని, భారత్-పాక్ సత్సబంధాలను చైనా ఎల్లప్పుడూ కోరుకుంటుందని ఆయన అన్నారు. రెండు దేశాలు మధ్య స్నేహం అభివృద్ధి, శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. చైనాకు పొరుగుదేశాలైన భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెరుగుదలకు చైనా రెండు దేశాలకు మద్దతునిస్తుందని.. ఇరు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలను పరిష్కరించడానికి తాము ప్రయత్నిస్తామని తెలిపారు. భారత్, పాక్ల మధ్య నిర్మాణాత్మక, అర్ధవంతమైన చర్చలు జరగాలని పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ఖాన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లేఖ రాసినట్లు లూకుంగ్ గుర్తుచేశారు. కాగా భారత్-పాక్ సంబంధాల మధ్య ఇమ్రాన్ ఖాన్ ఆసక్తి చూపుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు కోరుకుంటే ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వంగా వ్యవహరించడానికి చైనా సిద్దంగా ఉందని తెలిపింది. -
కొండంత పేదరికానికి మతిమరుపు శిక్ష
ఖాలిద్ హుస్సేనీ మూడవ నవల, ‘ద మౌంటెన్స్ ఎకోడ్’ కథ 1952లో మొదలవుతుంది. అఫ్గానిస్తాన్లోని ఓ కుగ్రామంలో అన్నాచెల్లెలు పదేళ్ళ అబ్దుల్లా, మూడేళ్ళ పరీ– తండ్రి సబూర్, సవతి తల్లి పర్వానీతో కలిసి ఉంటుంటారు. మూడో బిడ్డ ఈ లోకంలోకి రాబోతున్నప్పుడు, కటిక పేదరికాన్ని తప్పించుకోడానికి, సబూర్, ‘చేతిని కాపాడుకోడానికి ఒక వేలుని కత్తిరించేయక తప్పదు’ అని తనకు తాను నచ్చజెప్పుకుని, పిల్లలకు, ‘ఒక రాక్షసుడి కోపాన్ని చల్లార్చడానికి మనకిష్టమైన పిల్లనో, పిల్లాడినో బలిస్తే తప్ప ఊరిని నాశనం చేయకుండా ఉండడు’ అన్న కాల్పనిక కథ చెప్తాడు. పిల్లల్లేకపోయిన ధనవంతులైన సులేమాన్, నీలా దంపతులకి డ్రైవరూ, వంటవాడూ అయిన నబీ– సబూర్ బావమరిది. అతను పరీని వారికి అమ్మడంలో సహాయపడతాడు. పరీ మొదట కాబూల్లోనూ, ఆ తరువాత పారిస్లోనూ పెరిగి పెద్దదవుతుంది. అన్నాచెల్లెలు వేరయినప్పుడు, చిన్నపిల్లయిన పరీ ఇంటిని త్వరగానే మరిచిపోతుంది. కానీ అబ్దుల్లా పరీని తలుచుకోని క్షణం ఉండదు. అయితే, అతడి జీవితం గురించి పాఠకులకు పరిచయం అయ్యేది అతడు అమెరికా వెళ్ళాకే. పరీ పరోక్షం ఇతర పాత్రల మీద చూపించే ప్రభావం గురించి తెలుసుకోకుండానే సబూర్ మరణిస్తాడు. పరీ ఉద్యోగం చేస్తూ, పెళ్ళి చేసుకున్న తరువాత, తను దత్తత తీసుకోబడిందన్న అనుమానం కలిగినప్పుడు, ఎప్పుడో అప్పుడు అఫ్గానిస్తాన్ వెళ్ళి తన గతం తెలుసుకోవాలనుకుని, ‘తన ఉనికికి మౌలికంగా బాధ్యత వహించిన ఎవరో, ఏదో లేరు/దు’ అని భావిస్తుంటుంది. అబ్దుల్లా కాలిఫోర్నియాలో ఒక రెస్టారెంటు నడుపుతుంటాడు. అతనూ, భార్యా తమ ఏకైక కూతురికి, ‘పరీ’ అన్న పేరే పెడతారు. అసలు పరీ ముసలితనానికి చేరువయి, అన్న ఎక్కడున్నాడో తెలిసి కలుసుకోడానికి వెళ్ళినప్పుడు, అతను అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ, పరీని అసలు గుర్తించకపోవడం మరీ విషాదకరంగా మారుతుంది.రచయిత అన్నా చెల్లెళ్ళ పరిస్థితిని ఒక పదునైన రూపకంతో వివరిస్తారు: ‘వంతెన నదికి మధ్యనే అంతం అయింది. ఇంచుమించు ఒడ్డుకి చేరబోతూ ఉన్నప్పుడే, అటువైపు భాగం పొట్టిదయిపోయింది’.కాలం ముందుకీ వెనక్కీ మారుతూ, నాలుగు తరాల యొక్క యాబై సంవత్సరాలని –తొమ్మిది అధ్యాయాల్లో, వేర్వేరు పాత్రల దృష్టికోణాలతో చూపిస్తుంది ఈ నవల. అయితే, ‘కథ కదులుతున్న రైలువంటిది. ఎక్కడెక్కినా సరే, ఎప్పుడో అప్పుడు గమ్యానికి చేరుస్తుంది’ అంటూ, పుస్తకాన్ని అర్థం చేసుకునే బాధ్యతని పాఠకులకే వదిలేస్తారు హుస్సేనీ.రచయిత కేంద్రీకరించేది సబూర్ చర్య వల్ల కలిగిన పర్యవసానాల మీద. సంబంధాలు తెగిపోయినప్పుడు ఏమవుతుందో అన్న సంగతిని ప్రతి చిన్న పాత్రకి కూడా జీవం పోసి మాట్లాడించడం ద్వారా తెలియజేస్తారు. పాత్రల మీద ఏ కనికరమూ చూపకుండా, నిశితంగా విమర్శిస్తూ, మానవ సంబంధాలని నేర్పుగా విశ్లేషిస్తారు. నైతిక సంక్లిష్టతల గురించిన ఈ కథ, ‘ఉద్దేశాలు మంచివయితే సరిపోతుందా! మంచితనాన్ని నిర్వచించేది ఎలా? తమ పిల్లలు బాధలనుభవించకుండా కాపాడేటందుకు తల్లిదండ్రులు ఎంత దూరం వెళ్ళవచ్చు! సొంత కుటుంబం నుంచి వేరుపడటం కటిక పేదరికం భరించడం కన్నా ఎక్కువ బాధాకరమైనదా?’ అన్న ప్రశ్నలని లేవనెత్తు్తతుంది. విలియమ్ బ్లేక్ కవిత ‘పిల్లల కంఠాలతో ప్రతిధ్వనించే కొండలు’ ఈ పుస్తక శీర్షికకు ప్రేరణ. 2013లో అచ్చయింది. ‘టైమ్స్ లిస్ట్’లో ఉత్తమమైన నవలగా 33 వారాల పాటు నిలిచింది. కృష్ణ వేణి -
అమ్మా..నాన్న.. ఓ సెల్ఫోన్!
న్యూయార్క్ : తల్లిదండ్రులు.. మీరు సెల్ఫోన్కు దగ్గరవుతున్నారా?.. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయాన్ని సెల్ఫోన్ వాడుతూ వృథా చేస్తున్నారా?.. అయితే మీ పిల్లలు మీకు దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్దలు పిల్లలతో హాయిగా గడపాల్సిన సమయంలో సెల్ఫోన్ వాడుతూ ఉంటే పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతాయని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. తద్వారా పిల్లలు క్రూరప్రవర్తన, చెడు ప్రవర్తనకు అలవాటుపడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన సర్వేల్లో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. ప్రతిరోజు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ముఖాముఖి సంభాషణలు లేకపోవటాన్ని ‘టెక్నోఫెరెన్స్’ అని నామకరణం చేశారు. పిల్లల చెడు ప్రవర్తన నుంచి తప్పించుకోవాలని తల్లిదండ్రులు సెల్ఫోన్ను ఆశ్రయిస్తే అది వారిని మరింత నాశనం చేస్తుందంటున్నారు. రోజులో కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించటం ద్వారా వారు తల్లిదండ్రులకు మరింత దగ్గరవుతారని, వారికి సంబంధించిన విషయాలలో శ్రద్ధ కనబరుస్తూ ఉండటం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుందని అంటున్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సమస్యలు ఎక్కువవ్వటానికి గల ముఖ్య కారణం సెల్ఫోన్ వాడకమేనని పేర్కొన్నారు. -
ఇంట్లోని పదివేల సంగతుల్లో ఒకటి
కొత్త బంగారం తల్లికీ తండ్రికీ మధ్యనున్న సంబంధం చెడుతున్నప్పుడు, పిల్లలు కూడా ఎలా ఇంటి జగడాల్లో చిక్కుకుని, దారి తప్పుతారో ఈ నవల తెలియజేస్తుంది. జూలియా పియర్పాంట్ తొలి నవల, ‘అమంగ్ ద టెన్ థౌజండ్ థింగ్స్’లో, ఒకరోజు పదకొండేళ్ల పిల్ల ‘కే షాన్లే’ తమ న్యూయార్క్ అపార్టుమెంటు బిల్డింగ్ లోపలికి వస్తున్నప్పుడు, సెక్యూరిటీ వ్యక్తి, ‘మీ అమ్మకోసం వచ్చింది’ అంటూ ఒక పెద్ద అట్టపెట్టె అందించడంతో ప్రారంభం అవుతుంది. పెట్టె సరిగ్గా మూసి ఉండదు. దాన్లో కట్టలకొద్దీ ఉన్న కాగితాలని చదివిన ‘కే’కి సరిగ్గా అర్థం కాక, 15 ఏళ్ళ అన్న సైమన్కు చూపిస్తుంది. వాళ్ళిద్దరూ జేక్ షాన్లే, దెబ్ దంపతుల పిల్లలు. పాకెట్ తల్లికందిస్తారు. దాన్లో, ‘డియర్ దెబొరా, నాకు నీ భర్తతో క్రిత ఏడు నెలలుగా సంబంధం ఉంది...’ అంటూ మొదలైన ఉత్తరంతో పాటు, ఆ స్త్రీకీ, జేక్కూ మధ్య జరిగిన లైంగిక సంబంధపు వివరాలున్న మెయిళ్ళ ప్రింట్ ఔట్లు ఉంటాయి. పేరు పొందిన ఆర్టిస్ట్ అయిన జేక్ అప్పటికే ఆ సంబంధాన్ని వదిలివేయడం, భార్యతో అతని సంబంధం మెరుగవడం కూడా జరుగుతాయి. ‘జేక్ నన్ను గౌరవిస్తాడు. అతను సాధువని అనుకోను కానీ, జరుగుతున్నదేమిటో నేను తెలుసుకోదలచుకోలేదు’ అంటూ, స్త్రీల పట్ల భర్తకున్న బలహీనతా, ఈ సంబంధం గురించి తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్న దెబ్కు పిల్లల అనుభూతులని దృష్టిలో పెట్టుకుని, జేక్తో తనకున్న సంబంధం గురించి తిరిగి ఆలోచించుకోవలసి వస్తుంది. పిల్లలు తండ్రిమీదే కాక ఈ సంబంధాన్ని అనుమతించిన తల్లిమీద కూడా కోపం తెచ్చుకుంటారు. కుటుంబంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల, నలుగురూ తమతమ విధానాల్లో చిరాకు పడుతున్నవారే. తల్లి పరధ్యాసని ఆసరాగా తీసుకుని సైమన్ డ్రగ్స్ తీసుకోవడం, చిన్నపాటి నేరాలు చేయడం మొదలెడతాడు. కే తన క్లాసులో ఎదుర్కొంటున్న సమస్యల వల్ల మ«థనపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయికున్న అయోమయాన్నీ, జేక్ స్వార్థపూరిత స్వభావాన్నీ, అతని ప్రగల్భాలనీ నేర్పుగా విశ్లేషిస్తారు రచయిత్రి. తల్లికీ తండ్రికీ మధ్యనున్న సంబంధం చెడుతున్నప్పుడు, పిల్లలు కూడా ఎలా ఇంటి జగడాల్లో చిక్కుకుని, దారి తప్పుతారో తెలుస్తుంది. పుస్తకపు రెండవ భాగంలో కష్టకాలాన్ని ఎదుర్కునే ప్రయత్నం చేస్తున్న పాత్రల వల్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. పియర్పాంట్ పిల్లల మనస్సుల్లోకి దూరి వాళ్ళ గురించి పాఠకులకు చెప్పడం మొదలెట్టాక, పుస్తకం తిరిగి దారిలోకి వస్తుంది. మూడో భాగంలో– నవల హఠాత్తుగా భవిష్యత్తులోకి గెంతి, ప్రతీ పాత్ర జీవితంలో ఏమయిందో చెప్తూ, ‘పాత్రలన్నీ తప్పు నిర్ణయాలు తీసుకోవడం కొనసాగిస్తూనే మళ్ళీ కలుసుకుంటాయి’ అన్న ముగింపును పాఠకులకి తెలిపి, ‘అద్భుతంగా కనిపించే కుటుంబాల్లో ఏదీ అద్భుతమైనది కాదు. రహస్యాలు ఏదో విధంగా బయట పడతాయి’ అంటూ, వర్తమానానికి తిరిగి వస్తుంది. ఏ వయస్సులోనైనా సరే ఎదగడం అన్నది ఎంత బాధాకరమైనదో అన్నది, ‘పదివేల సంగతుల్లో’ ఒకటి. ‘దాంపత్య జీవితంలో మోసం’ అన్న వృత్తాంతం కొత్తదేమీ కాకపోయినప్పటికీ, చక్కటి వాక్యనిర్మాణం, స్వల హాస్యం ఉన్న నవల ఒకే ఊపులో చదివిస్తుంది. ‘ఒక వివాహబంధంలో చాలినంత ప్రేమ ఉండి ఆర్థికపరంగా సౌకర్యంగానే ఉన్నప్పుడు, వివాహేతర సంబంధాలని చూసీ చూడనట్టు వదిలేస్తేనే నయం’ అన్న అంతర్లీనమైన సందేశం ఇచ్చిన రచయిత్రి వయస్సు పుస్తకం రాసేటప్పటికి 28 ఏళ్ళు మాత్రమే. నవల అచ్చయినది 2015లో. రాండమ్ హౌస్ పబ్లిష్ చేసిన ఈ నవల ‘న్యూయార్క్ బెస్ట్ సెల్లర్’గా ఎన్నుకోబడింది. ఆడియో పుస్తకం ఉంది. - కృష్ణ వేణి -
ఆశావహం సోచి శిఖరాగ్రం
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య సోమవారం రష్యాలోని సోచిలో జరిగిన అనధికార శిఖరాగ్ర సమావేశం... గతంతో పోలిస్తే అంతంత మాత్రంగానే ఉన్న భారత్–రష్యా సంబంధాల్లో కీలక పరిణామం. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో మోదీ మొన్న ఏప్రిల్ నెలాఖరున ఇలాంటి సమావేశమే జరిపారు. దేశాధినేతల మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశాలకు పకడ్బందీ ఎజెండాలుంటాయి. అనేకానేక పత్రాలను పరస్పరం మార్చుకోవడం ఉంటుంది. ఖరారు చేసుకోవాల్సిన ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు, విదేశాంగ మంత్రులు చాలా ముందుగా భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. సంయుక్త ప్రకటనలు సరేసరి. కానీ అనధి కార శిఖరాగ్ర సమావేశాలకు ఇవేమీ ఉండవు. అధినేతలిద్దరూ ఏ అంశంపైన అయినా స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు. విభేదిస్తున్న అంశాల్లో ఎవరి వైఖరేమిటి... అది ఎంతవరకూ సహేతుకమన్న విషయాలు చర్చించుకుంటారు. పర్యవసానంగా పరస్పర అవగాహన పెరిగి, విభేదాలు తగ్గే అవ కాశం ఏర్పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అధినేతల మధ్య స్నేహసంబంధాలు నెలకొనడానికి ఇలాంటి అనధికార శిఖరాగ్ర సమావేశాలు తోడ్పడతాయి. అయితే చైనాతో శిఖరాగ్ర సమావేశం రెండు రోజులు కొనసాగితే మోదీ–పుతిన్ల సమావేశం ఒక్కరోజుతో ముగిసింది. ఇరు దేశాలూ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మన దేశం అమెరికాతో సన్నిహితమవుతున్నదని రష్యా అనుమానిస్తోంది. అందువల్లే తనతో అంత క్రితం కుదుర్చుకున్న యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుందని భావిం చింది. దీనికి ప్రతీకారంగా అది పాకిస్తాన్కు తొలిసారి ఎంఐ–35ఏ రకం సైనిక హెలికాప్టర్లను విక్ర యించింది. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. కశ్మీర్ విషయంలోనూ కొత్త రాగం అందు కుంది. అలాగే చైనాతో బంధాన్ని పెంచుకుంది. ఈ విషయంలో ఏర్పడ్డ అపోహలను నివృత్తి చేసి మళ్లీ గతం మాదిరి రష్యాతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని మన దేశం భావిస్తోంది. అయితే అంతర్జాతీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాతో అనుబంధం పెంచుకోవడం కత్తి మీద సామే. ఎందుకంటే తమ గడ్డపై ఒక పౌరుడిపైనా, ఆయన కుమార్తెపైనా విష రసాయనం ప్రయోగించి హతమార్చడానికి జరిగిన ప్రయత్నం వెనక నేరుగా పుతిన్ హస్తమున్నదని బ్రిటన్ ఆరోపించింది. ఆ ఘటన తర్వాత రష్యాకు చెందిన దౌత్య అధికారులు పలువురిని బహిష్కరిం చింది. దానికి ప్రతీకారంగా రష్యా కూడా అదే పని చేసింది. యూరప్ దేశాలతో అప్పటికే అంతం తమాత్రంగా ఉన్న రష్యా సంబంధాలు ఆ తర్వాత మరింత క్షీణించాయి. నిరుడు రష్యాపై పలు ఆంక్షలు తీసుకొస్తూ అమెరికా చట్టం చేసింది. దాని ప్రకారం రష్యాతో రక్షణ, నిఘా రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. మనకు రక్షణ సామగ్రి అమ్మే దేశాల్లో రష్యా ప్రధానమైనది. మన రక్షణ కొనుగోళ్లలో దాని వాటా 62 శాతం. అమెరికా ఆంక్షలు విధించడానికి ముందే మన దేశం ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. 4,500 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందం పర్యవసానంగా బాలిస్టిక్ క్షిపణుల దాడిని, రహస్య విమానాల దాడులను ముందే పసిగట్టి ఎదుర్కొనే శక్తి మన దళాలకు సమకూరుతుంది. దీంతోపాటు కెఏ–226టి రకం మిలిటరీ హెలికాప్టర్లను ఇక్కడే తయారు చేసేందుకు ఒప్పందానికి సిద్ధమని రష్యా ప్రకటించింది. అలాగే ప్రాజెక్ట్ 751 జలంతర్గా ములు అమ్మడానికి ముందుకొచ్చింది. అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇవి ఎంతవరకూ సాకారమవుతాయన్న అనుమానాలున్నాయి. అయితే దేశ రక్షణ విషయంలో రాజీపడబోమని మన దేశం చెబుతోంది. అమెరికా చట్టం ప్రకారం ఇరాన్తో లావాదేవీలు నెరపినా ఈ మాదిరి ఆంక్షలే వర్తిస్తాయి. అయితే మన దేశంపై చర్య తీసుకుంటే అధికంగా నష్టపోయేది అమెరికాయే. ఎందు కంటే ఆ దేశంతో మనకు రక్షణతోసహా పలు ఒప్పందాలున్నాయి. సోచి సమావేశం తర్వాత రెండు దేశాలూ విడివిడిగా విడుదల చేసిన ప్రకటనలు గమనిస్తే ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఇరు దేశాలూ సుముఖంగా ఉన్నాయని అర్ధమవుతుంది. ‘ఇండో–పసిఫిక్ ప్రాంతం’లో భారత్ పాత్ర కీలకమైనదని భావిస్తున్నట్టు పుతిన్ ప్రకటించారు. ఆసియా–పసిఫిక్ పదబంధం స్థానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త మాటపై చైనాకు అసంతృప్తి ఉన్న సంగతి తెలిసినా ఆయన దీన్ని ఉప యోగించారు. అమెరికా ఆంక్షల మాటెలా ఉన్నా తాము రష్యానుంచి ఆయుధాలు, ఇంధనం కొనడానికి సిద్ధమని ఈ చర్చల సందర్భంగా మన దేశం చెప్పడం కూడా రష్యాకు సంతృప్తి కలిగించింది. ట్రంప్ వచ్చాక నిలకడలేని అమెరికా విధానాల పర్యవసానంగా అంతర్జాతీయ రంగంలో ఒక అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏ దేశానికి ఆ దేశం స్వీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించుకుంటోంది. మన దేశం కూడా అందుకు మిన హాయింపు కాదు. అందువల్లే లోగడ ఉహాన్లో చైనాతోనూ, ఇప్పుడు సోచిలో రష్యాతోనూ నరేంద్ర మోదీ శిఖరాగ్ర సమావేశాలు జరిపారు. భద్రతామండలిలో శాశ్వతసభ్యత్వం, అణు సరఫరాదార్ల బృందంలో సభ్యత్వం వంటి అంశాల్లో రష్యా మనకు మద్దతునిస్తోంది. మొత్తానికి సోచి శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలూ తిరిగి సన్నిహితం కావడానికి ఒక ప్రాతిపదికను ఏర్పరుస్తుందని ఆశించవచ్చు. -
పాక్ డే పరేడ్లో భారత ఉన్నతాధికారులు
ఇస్లామాబాద్: భారత్, పాక్ల మధ్య సంబంధాలు క్షీణించిన సమయంలో ఓ సంచలనం చోటుచేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన పాకిస్తాన్ డే సైనిక పరేడ్కు భారత్ దౌత్యవేత్తలు, సైనికాధికారులు హాజరయ్యారు. పరేడ్నకు భారత్ అధికారులను పిలవటం ఇదే తొలిసారి. భారత్ ఉన్నతాధికారులను పరేడ్నకు ఆహ్వానించాలన్న నిర్ణయం ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాదేనని స్థానిక మీడియా తెలిపింది. భారత్తో చెలిమి కోరుకుంటున్నామని తెలిపేందుకు ఆయన ఈ మేరకు ముందడుగు వేశారని సైనిక వర్గాలు తెలిపాయి. పాక్లో భారత రాయబారి బిసారియా, డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్, రక్షణ, సైనిక సలహాదారు బ్రిగేడియర్ సంజయ్ విశ్వాస్ తదితరులు పరేడ్లో పాల్గొన్నారు. వీరంతా ఇక్కడి అధికారులు అందజేసిన ‘23 మార్చి పాకిస్తాన్ డే’ అని ఉన్న టోపీలను ధరించి పరేడ్ను తిలకించారు. పరేడ్లో పాక్ అధ్యక్షుడు మమ్నూ న్ భారత్పై నిప్పులు చెరిగారు. భారత్లోని పాక్ రాయబారి సొహైల్ గురువారం తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. దౌత్యాధికారులను భారత్ వేధిస్తోందంటూ హైకమిషనర్ మెహమూద్ను వారం క్రితం పాక్ వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే. -
మంటగలుస్తున్న మానవత్వం
పనిచేయడం లేదని భర్తను ప్రశ్నించిన భార్యతో సహా ఇద్దరు పిల్లలను హత్య చేసిన హరీందర్... సహజీవనం చేస్తున్న అమ్మాయి తన భార్యకు ఫోన్ చేసి వేధిస్తోందని ఆమెను, ఆమె కూతురు, తల్లిని అమానుషంగా చంపేసిన మధు... అనుమానంతో వివాహం చేసుకోబోయే అమ్మాయిని బండరాయితో మోది హతమార్చిన మోతీలాల్... చదువు ఒత్తిడిలో పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థి... తల్లి సెల్ఫోన్ కొనివ్వలేదని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన మరో విద్యార్థి... గ్రేటర్లో ఇటీవల చోటుచేసుకున్న ఈ సంఘటనలు సిటీజనులను కలచి వేస్తున్నాయి. నగరంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, అనుమానాలు, ఒత్తిడి, మానసిక క్షోభ, మూఢనమ్మకాలు... ఇలా కారణాలేవైనా ఇటీవల చోటుచేసుకున్న ఈ హత్యలు, ఆత్మహత్యలు మంటగలసిపోతున్న మానవ సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో : క్షణికావేశంలో మృగమవుతున్న మనిషి... బంధాలను మరిచి యముడవుతున్నాడు. ‘నా అన్న వాళ్లనే..’ నరికి చంపేస్తున్నాడు. ఓచోట భార్యాపిల్లలను, మరోచోట నిండు గర్భిణిని, ఇంకోచోట అమ్మాయిని, మూఢనమ్మకాలతో పసికందును... హతమార్చిన ఘటనలు భాగ్యనగరంలో కలకలం సృష్టిస్తున్నాయి. స్వార్థంతో, క్షణికావేశంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు.. వందల ఏళ్ల నాటి మానవీయ విలువల నిర్మాణాన్ని కూల్చేస్తున్నాయి. గత 10రోజుల్లో ఈ ఘటనల్లో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు హతమయ్యారు. ఎందుకిలా..? మనుషులు, విలువలు ఉనికి కోల్పోతున్నాయి. ప్రేమానుబంధాలు, మమతానురాగాలు శిథిలమవుతున్నాయి. కలహాలే కలిసి జీవిస్తున్నాయి. మనస్పర్థలు, ఘర్షణలే గాలివానలవుతున్నాయి. ‘నేను మాత్రమే’ బాగుండాలనే స్వార్థపూరితమైన దృక్పథం, తన సుఖ సంతోషాలకు ఎవరడ్డొచ్చినా భరించలేని అసహనం, విచ్ఛిన్నమవుతున్న కుటుంబ సంస్కృతి, ఆశలు, ఆశయాలను, అహాలను సంతృప్తి పర్చలేని దాంపత్య జీవితం... మొదలు నరికిన చెట్టులా కూలిపోతోంది. ఇలాంటి సంఘటనల్లో ఒకప్పుడు ఒకరి నుంచి ఒకరు విడిపోవాలని కోరుకునేవారు. ఇప్పుడలా కాదు. తనకు అడ్డుగా ఉన్న దాన్ని తొలగించుకోవడమే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్నారు. మగవాళ్లలో బలంగా ఉండే ఈ లక్షణం అక్కడక్కడా మహిళల్లోనూ కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల్లో మనుషులు ఎంతటి తెగింపునకైనా పాల్పడుతున్నారు. ఇలాంటి ఉదంతాల్లో పిల్లలు సైతం వాళ్ల క్రూరత్వానికి బలవుతున్నారు. అసహనం.. అనుమానం.. క్షణికావేశం అపర్ణ అనే మహిళను రెండో వివాహం చేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్న మధు... ఆ వ్యవహారం బయటకుపొక్కి గొడవలకు దారితీయడంతో గత నెల 30న అపర్ణను, ఆమె తల్లి విజయమ్మను, కూతురు కార్తికేయను హతమార్చి తలుపులు వేసి తాపీగా వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్ల నేపథ్యంలో హరీందర్ జిల్లెలగూడలో భార్యాపిల్లలను హతమార్చాడు. వారం కింద హయత్నగర్లో మోతీలాల్ అనే వ్యక్తి తనకు కాబోయే భార్యపై అనుమానంతో ఆమెను చంపేశాడు. ఈ సంఘటనల అన్నింటిలోనూ విపరీతమైన అసహనం, తనకు అడ్డుగా ఉన్నారని భావిస్తే కట్టుకున్న భార్య, పిల్లలను సైతం తొలగించుకొనే మానసిక ఉన్మాద ప్రవృత్తి కారణమని మనస్తత్వ, సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఉన్మాద ప్రవృత్తితో అనుబంధాలు, సామాజిక విలువలు హతమవుతున్నాయి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవడం, వ్యక్తులపై ఎలాంటి సామాజిక నియంత్రణ కూడా లేకపోవడం.. ఈ రకమైన నేరాలకు ఆజ్యం పోస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తరచూ విసిగిస్తే... భాగస్వామిని తరచూ విసిగిస్తూ మాట్లాడుతుంటే ఆ స్థితిని మానసిక పరిభాషలో ‘డెల్యూషన్’ అంటారు. ఇలాంటి ప్రవర్తన కలవారే హత్యలకు పాల్పడుతుంటారు. భార్య ప్రవర్తన ఎంత బాగున్నా.. ఏదో ఒక విషయంలో వేధింపులకు గురిచేస్తుంటారు. ఇవే చివరకు హత్యలకు దారితీస్తాయని మానసిక వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. సినిమాలు, సీరియళ్లలో చూపే వివాహేతర సంబంధాలు తమ ఇంట్లోనూ జరుగుతున్నాయని అపోహ పడడం, మద్యానికి బానిసవడం... ఆ దృక్పథంలో నేరాలకు పాల్పడడం జరుగుతోందని పేర్కొంటున్నారు. నిందితులు విచారణలో కొంచమైనా పశ్చాత్తాపం లేకుండా తాము చేసిన నేరాలను విపులంగా వివరించడం గమనార్హం. సామాజిక నియంత్రణ అవసరం ఈ అమానవీయమైన సంక్షోభాన్ని తొలగించి, ఉన్నత విలువలను స్థాపించేందుకు ఒక సామాజిక నియంత్రణ వ్యవస్థ అవసరం. మెగా సిటీలు, మహానగరాలు ఉనికిలోకి వచ్చిన తరువాత ఈ సామాజిక నియంత్రణ లేకుండా పోయింది. సోషల్ మీడియా అందుకు మరింత ఆజ్యం పోస్తోంది. మనిషి ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానం, విలువల స్థాపనతో మాత్రమే ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇలాంటి దారుణాలు తగ్గుముఖం పడుతాయి. – ప్రొఫెసర్ నాగేశ్వర్ సమష్టి జీవన విధానం అలవడాలి మనుషుల కంటే వస్తువులు, సుఖం, వ్యక్తిగత ఆనందాలే ముఖ్యమయ్యాయి. నూతన ఆర్థిక విధానాలు, వస్తు వినిమయవాద సంస్కృతి ఇందుకు కారణం. దీంతో సహజమైన మనిషి లక్షణాలు చనిపోయి, మృగాల్లా మారుతున్నారు. మరోవైపు డబ్బుకున్న గుర్తింపు మనుషులకు లేకపోవడంతో ఆత్మన్యూనతకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి విపరీత ధోరణులు తొలగిపోవాలంటే సమాజంలో సమష్టి జీవన విధానం అలవడాలి. ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ విలువలతోనే అది సాధ్యం. – ప్రొఫెసర్ హరగోపాల్ వాస్తవాన్ని గుర్తించలేని అజ్ఞానం శక్తికి మించిన భారీ అంచనాలు, ఆర్థికంగా బాగా సంపాదించాలనే కోరికల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వాస్తవ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేని అజ్ఞానం ఇది. ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు సిగరెట్, ఆల్కహాల్, వివాహేతర సంబంధాల లాంటి దురలవాట్లకు బానిసలవుతున్నారు. మనస్తత్వ పరిభాషలో దీనిని ‘కోపింగ్ మెకానిజం’ అంటారు. ఒక దుస్థితి నుంచి బయటపడేందుకు మరో దుస్థితిని ఎంపిక చేసుకోవడం. ఈ క్రమంలో జరిగే కలహాల కారణంగా అహం దెబ్బతిని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇది సైకోపథాలజీ మనస్తత్వం. కుటుంబ సంబంధాలు బలోపేతం కావాలంటే పెళ్లికి ముందే కౌన్సెలింగ్ అవసరం. – డాక్టర్ సి.వీరేందర్, మనస్తత్వ నిపుణులు ఒత్తిడి.. ఒంటరితనం ఒత్తిడి, ఒంటరితనమే ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో డిప్రెషన్ బాధితులే అధికంగా ఉంటున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమవడం, సమస్యలను ఎదుర్కోలేకపోవడం, పిల్లలను అతి గారాభం చేయడం, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డిప్రెషన్ బాధితులు, సున్నిత మనస్కులు, హార్మోన్ల అసమతుల్యంతో బాధపడుతున్న వారికి తప్పనిసరిగా కౌన్సెలింగ్ ఇప్పించాలి. – డాక్టర్ అనితా రాయిరాల, సైక్రియాట్రిస్ట్, రిమ్స్ జీవితం విలువ తెలియాలి ఇలాంటి దారుణాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరికీ జీవితం విలువ తెలియాలి. ఆ విలువలను నేర్పే విధంగా విద్యావిధానంలో, సామాజికంగా మార్పు రావాలి. నైతిక విలువలను చిన్నప్పటి నుంచి అలవర్చాలి. తల్లిదండ్రుల పెంపకంలో, మీడియాలోనూ మార్పులు అవసరం. నేరాలను నియంత్రించే విధంగా మీడియా బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించాలి. – లలితాదాస్, సైకాలజిస్ట్ -
10 దేశాల్లోని 27 పత్రికల్లో మోదీ వ్యాసం
సింగపూర్: భారత్, ఆసియాన్ దేశాల సంబంధాలు వివాదాలు, విమర్శలకు అతీతమైనవని మోదీ అన్నారు. గణతంత్ర దినోత్సవాన 10 ఆసియాన్ దేశాల అధినేతలు భారత్కు అతిథులుగా వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ రాసిన వ్యాసం 10 భాషల్లో, 27 పత్రికల్లో ప్రచురితమైంది. 10 ఆసియాన్ దేశాల్లోని పత్రికలు ఒకే రోజున మోదీ వ్యాసాన్ని ప్రచురించడం విశేషం. ఆసియాన్ దేశాలతో భారత భాగస్వామ్యం, భవిష్యత్తు గురించి మోదీ ఈ వ్యాసంలో రాశారు. ఆసియాన్ దేశాలతో వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకునేందుకు భారత్ ఎంతో ఆసక్తిగా ఉందని మోదీ వ్యాసంలో పేర్కొన్నారు. థాయ్లాండ్, వియత్నాం, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, మలేసియా, సింగపూర్, మయన్మార్, కాంబోడియా, లావోస్, బ్రూనై దేశాల్లో మోదీ వ్యాసం ప్రచురితమైంది. భారత్–ఆసియాన్ 25 ఏళ్ల సంబంధాలను గుర్తుచేసుకుంటూ ఆ దేశాధినేతలందరినీ 69వ గణతంత్రదినోత్సవాన భారత్లో కలుసుకోవడం తనకు గౌరవంగా ఉందని మోదీ వ్యాసంలో రాశారు. ఆగ్నేయాసియా దేశాలతో భారత్కు రెండు వేల ఏళ్లకు పైగానే సత్సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆసియాన్ నేతలతో మోదీ భేటీ ప్రధాని మోదీ శుక్రవారం మలేసియా, లావోస్ ప్రధానులతోపాటు ఇండోనేసియా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన వీరంతా శుక్రవారం గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ప్రధాని మోదీ మలేసియా ప్రధాని నజీబ్ రజాక్తో సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సహకారం, సంబంధాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. తర్వాత ప్రధాని లావోస్ ప్రధాని సిసౌలిత్తో సమావేశం సందర్భంగా ఎంతోకాలంగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహభావం, సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో ప్రధాని మోదీ జరిపిన చర్చల్లో ఆర్థిక సహకారం బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను గుర్తించారు. చైనాకు దీటుగా భారత్ కూడా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని వారు కోరినట్లు విదేశంగా శాఖ తూర్పు విభాగం కార్యదర్శి ప్రీతి సరణ్ వెల్లడించారు. -
'భారత్తో పనిచేయడం బాగుంటుంది'
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పట్ల తన సానుకూలతను వ్యక్తం చేశారు. భారత్లాంటి దేశాలతో కలిసి పనిచేయడం చాలా హాయిగా ఉంటుందని, అది చాలా మంచి విషయం అని అన్నారు. మాస్కోతో వాషింగ్టన్ సంబంధాలను మెరుగుపరుచుకుంటుందా అనే అంశంపై మీడియా ఆయనను ప్రశ్నించగా 'భారత్, రష్యా, చైనావంటి దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, కలిసి పనిచేయడం బాగుంటుంది. అది చాలా మంచి అంశం కూడా' అని ఆయన బదులిచ్చారు. అదే సమయంలో ఉత్తర కొరియా విషయంలో మాత్రం ఆయన మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశంతో కలిసి పనిచేయడం తన సమస్య కాదని, ఎప్పటి నుంచో ఆ దేశానికి ఉన్న సమస్య అని, అదే ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక తన చేతిలో ఓడిపోయిన హిల్లరీ గురించి స్పందిస్తూ దేశంలో బలమైన సైనిక శక్తికి ఆమె తగినవారు కాదని అన్నారు. అయితే, ఆమె ఇతర అంశాల్లో మాత్రం మంచి సామర్థ్యం ఉందన్నారు. ఇక దక్షిణ కొరియా విషయంపై స్పందిస్తూ 'నేను ఈ రోజు ఉదయాన్నే అధ్యక్షుడు మూన్తో మాట్లాడాను. ఇది చాలా అంశాల్లో మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం.. ఏం జరుగుతుందో' అని ట్రంప్ అన్నారు. -
ఎంతెంత దూరం?
ప్రతి చర్యకి సమానమైన, వ్యతిరిక్తమైన ప్రతిచర్య ఉంటుంది అన్నది న్యూటన్ గతి సిద్ధాంతాలలో మూడవది. ఒక ఎత్తు నుంచి బంతిని నేలకి కొడితే అది అంతకన్నా ఎంతో ఎక్కువ ఎత్తుకి ఎగురుతుంది కదా! అప్పుడు రెండు సమానం ఎట్లా అవుతాయి అని మొదటిసారి తరగతిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం గురించి ఒక చిన్నారికి సందేహం కలగటం సహజం. బంతిని నేల మీద విసిరినప్పుడు అన్నిమార్లూ ఒకే ఎత్తుకి వెడుతోందా? లేదే? ఎందుకని అన్నది అర్థమైతే సిద్ధాంతం అర్థమవుతుంది. తేడా ఎంత బలంగా కొట్టారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. దూరం, బలం రెండింటి మొత్తాన్ని తీసుకుంటే ఎంత ఎత్తు వెళ్లింది అన్నది సరిగ్గా సమానంగా ఉంటుంది. ఇది మానవ సంబంధాలకూ వర్తిస్తుంది. ‘నువ్వీ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు.’ ‘ఫోన్ చెయ్యటం లేదు.’ ‘మా ఇంటికి అసలే రావటం లేదు.’ ఇటువంటి దెప్పిపొడుపులు అయినవాళ్ళ మధ్య తరచుగా వింటూ ఉంటాం. ‘పోనీ నువ్వే ఫోన్ చెయ్యచ్చుగా.’ ‘నువ్వే రావచ్చుగా’ అంటూ సమాధానాలు చెప్పరు. పైగా ‘ఈ ఊరికా ఊరెంత దూరమో ఆ ఊరికీ ఈ ఊరంతే దూరం’ అని సమర్థించుకుంటారు. ‘వన్ వే ట్రాఫిక్లు వచ్చాక ఆ రూల్ పని చేయదు’ అని వింటున్న కుర్రదో, కుర్రాడో అంటే తెల్ల మొహం వేస్తారు పెద్దవాళ్ళు. వన్ వేలు మాత్రమే కాదు డివైడర్లు వచ్చాక అది చాలా పెద్ద విషయమే అయ్యింది కదా! మీటర్ మీద వచ్చే ఆటోకి ఒక చోటుకి వెళ్ళటానికైనా, రావటానికైనా దానికి చాలా తేడా ఉంటుంది. ఏమంటే డివైడర్లు అంటారు. జాగ్రత్తగా గమనిస్తే, డివైడర్ కారణంగా కొంచెం దూరం ఎక్కువైనా రద్దీ తక్కువై, దాని వల్ల ఇంధనం బాగా పొదుపవుతుంది. వాహనం మీద ఒత్తిడి తగ్గి దాని ఆయువు పెరుగుతుంది. ఈ ఉపయోగాలని దృష్టిలో ఉంచుకుంటే స్వంత వాహనదారులు చికాకు పడరు. మానవ సంబంధాల విషయంలో కూడా అంతే. ఉదాహరణకు తల్లితో కూతురికి పోటీ ఏమిటి? ‘‘నా ఇంటికి నువ్వెన్ని సార్లు వచ్చావో నీ ఇంటికి నేనూ అన్నేసార్లు వస్తాను’’ అని కూతురు అనటం సమంజసంగా అనిపిస్తుందా? గురువుతో అదే మాట శిష్యుడు అనవచ్చా? ఈ మాటని వృద్ధాశ్రమంలో ఉన్న తండ్రి కొడుకుతో అంటే?... ఏ ఇద్దరి మధ్యనైనా ఉండే సంబంధం ఇరుపక్షాల నుంచి సమానమే అయినా వ్యక్తీకరించే విధానం వంటి వాటిలో తేడా ఉంటుంది. కనుక ప్రతి దానికి పోటీ పెట్టటం కుదరదు. ఈ సంగతిని అర్థం చేసుకుంటే వ్యక్తుల మధ్య సంబంధాలు భద్రంగా ఉంటాయి. – డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
మృతుడి బంధువుల ఆందోళన
చింతపల్లి : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడ్ ఎక్స్రోడ్డు వద్ద బుధవారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందిన జంగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర రహదారిపై కుర్మేడ్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్కార్ట్ వాహనం ఆటోను ఢీ కొనడంతో మృతి చెందిన జంగయ్య కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి, చింతపల్లి, మర్రిగూడ, నాంపల్లి ఎస్ఐలు సంఘటన స్థలానికి చేరుకుని బంధువులకు నచ్చజెప్పారు. అనంతరం జంగయ్య అంత్యక్రియలు పోలీస్ పహారా మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా గ్రామంలో కొనసాగాయి. ఆయన అంత్యక్రియలకు చింతపల్లి ఎస్ఐ నాగభూషణ్రావు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా త్వరలో అందించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘మావో’లతో దోస్తీ!
కలసి పని చేసేందుకు ఉగ్రవాదుల ఆసక్తి ► 2010లో చోటా షకీల్ ద్వారా ఐఎస్ఐ యత్నం ► గతేడాది జేకేహెచ్ ద్వారా ఐసీస్ ప్రయత్నం ► ఈ రెండూ హైదరాబాద్ కేంద్రంగా సాగిన వ్యవహారాలే ► ఆయుధాలు, 'తంత్రాల'కోసమేననే సందేహాలు ఉగ్రవాదులు మాఫియాను పక్కన పెడుతూ మావోయిస్టుల వైపు మొగ్గు చూపుతున్నారా..? వారితో జట్టుకట్టి పని చేయడానికి ప్రయత్నిస్తున్నారా.. అంటే ఔననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన రెండు ఉదంతాలు వెలుగులోకి రావడమే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నాయి. మావోయిస్టులతో మిలాఖత్ కోసం 2010లో ఐఎస్ఐ చోటా షకీల్ ద్వారా ప్రయత్నించగా.. గతేడాది ఐసిస్ జేకేహెచ్ ఉగ్రవాది నఫీజ్ఖాన్ ద్వారా జేకేహెచ్ ముసుగుతో యత్నించింది. ఉగ్రవాదులకు ఆయుధాల సమీకరణకు తేలికైన మార్గం కావడం, వారి యుద్ధ తంత్రాలపై ఉన్న ఆసక్తి నేపథ్యంలోనే మావోయిస్టులతో దోస్తీకి మొగ్గుచూపుతున్నట్లు భావిస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్ ఆరేళ్ల క్రితం ఐఎస్ఐ మావోయిస్టులను ట్రాప్ చేయడం ద్వారా రాష్ట్రంలో భారీ విధ్వంసం సృష్టించేం దు కు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పన్నినకుట్ర 2010 ఆగస్టులో వెలుగులోకి వచ్చింది. ఐఎస్ఐ ఆదేశాల మేరకు ఉగ్రవాదులు రాష్ట్రంలోని మావోయిస్టులను ట్రాప్ చేసి, విధ్వం సం సృష్టించేందుకు దావూద్ గ్యాంగ్కు చెందిన వినయ్కుమార్, దేవయ్య అలియాస్ సచిన్లను రంగంలోకి దింపారు. వారు బెంగళూరులో మకాం వేసి పాకిస్తాన్, దుబాయ్లో తలదాచుకున్న దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్లతో సంప్రదింపులు జరిపారు. ఈ ఆపరేషన్ కోసం ఐఎస్ఐ వారికి హవాలా ద్వారా రూ.25 లక్షలు పంపింది. అనంతరం వారు హైదరాబాద్కు చెందిన శ్రీధర్, శరత్, ప్రదీప్, పవన్ల సాయంతో మావోయిస్టు నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధపడుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వారిద్దరూ ఉగ్రవాదుల్ని కలసి రావడానికి హైదరాబాద్ నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి హైదరాబాద్కు విమానం టికెట్లు కూడా కొనుగోలు చేశారు. కానీ కుట్ర అమల్లోకి రాకముందే బెంగళూరు, హైదరాబాద్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. తాజాగా ఐసిస్.. ఉగ్రవాద సంస్థ ఐసిస్ తనకు అనుబంధంగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఫిల్ హింద్ (జేకేహెచ్)’ మాడ్యూల్ను మావోయిస్టులతో మిలాఖత్ కోసం వినియోగించింది. ఆ మాడ్యూల్కు నం.2గా వ్యవహరించిన హైదరాబాదీ మహ్మద్ నఫీజ్ఖాన్ ద్వారా అవసరమైన మంతనాలు జరిపింది. పశ్చిమ బెంగాల్కు చెందిన మరో అనుచరుడు ఆషిఖ్తో కలసి రెండుసార్లు జార్ఖండ్లోని హబారీబాగ్ వెళ్లిన నఫీజ్ఖాన్... అక్కడ కొందరు మావోయిస్టులతో సంప్రదింపులు జరిపాడు. అయితే అవి కార్యరూపంలోకి రాక ముందే మాడ్యూల్ పట్టుబడింది. ఆ ‘రెండింటి’ కోసమే..! కొన్నేళ్లుగా ఉగ్రవాదుల పంథాలో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బాంబులు తయారు చేయడానికి పొరుగు దేశాల నుంచి పేలుడు పదార్థాలు ‘దిగుమతి’ చేసుకునేవారు. తర్వాత స్థానికంగానే సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. ఇలా పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాల సమీకరణకు సహాయ సహకారాలు పొందడానికే ఉగ్రవాదులు మావోల వైపు మొగ్గుతున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా లోన్వూల్ఫ్ ఎటాక్స్ పెరుగుతున్నాయి. ఎలాంటి మాడ్యూల్ లేకుండా ఎవరంతట వారే ఉగ్ర బాటపట్టి ఆపరేషన్స్ చేయడమే ఈ విధానం. అలాంటి లోన్వూల్ఫ్లకు గెరిల్లా యుద్ధ తంత్రాలు అవసరమని భావిస్తున్న ఉగ్రవాద సంస్థలు.. వాటిని నేర్పడానికి మావో ల్ని వినియోగించుకోవాలని యోచిస్తున్నాయని భావిస్తున్నారు. -
మానవ సంబంధాలు పెంపొందించుకోవాలి
అనంతపురం సిటీ: మానవ సంబంధాలను మరింత పెంపొందిం చుకోవాలని వక్తలు అన్నారు. స్థానిక మెడికల్ హాల్లో ఆదివారం ’నెపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, భావ వ్యక్తీకరణ’ అంశాలపై సదస్సు నిర్వహించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, ఐఎంఎ విద్యార్థి విభాగం అధ్యక్షుడు డాక్టర్ కొల్లి కరుణామూర్తి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.కొండయ్య హాజరయ్యారు. వైద్య విద్యార్థులు, ఫిజియో థెరపీ వైద్యులు, నర్సింగ్ విద్యార్థినులు హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు, ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. సమాజ సేవపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ఇందిరా గాంధీ అవార్డును గ్రహీత∙ఎస్ఎస్బీఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, ఇందిరా గాంధీ స్టూడెంట్ వాలంటరీ అవార్డును పొందిన కుమ్మర కృష్ణ, విజయకుమార్ను సన్మానించారు. -
అతుక్కుపోయారో.. అయిపోతారు
లండన్: మీరు సోషల్ మీడియాకు ఇప్పటికే అతుక్కుపోయి ఉన్నారా.. అయితే మీ చేజేతులారా ప్రశాంతతను కోల్పోయినట్లే. ఇప్పటికైనా తేరుకొని దూరం జరిగితే మంచిది లేదంటే పూర్తి స్థాయిలో మానసిక ఒత్తిడికి లోనై ఎలాంటి దుర్వ్యసనాల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉంది. అవునూ సోషల్ మీడియాలో విహరిస్తున్న యువత ఎక్కువగా ఒత్తిడి బారిన పడుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. 19 నుంచి 32 ఏళ్ల మధ్య గల వారిలో ఈ లక్షణాలు అధికం తెలిపింది. వారం మొత్తం కూడా నిత్యం సోషల్ మీడియాతో బిజీబిజీగా గడిపే వాళ్లకు డిప్రెషన్ లక్షణం వచ్చే అవకాశం 2.7సార్లు అధికం అని వారు వెల్లడించారు. వారంలో 30 సార్లు, ప్రతి రోజు 61 నిమిషాలపాటు సోషల్ మీడియాతో బిజీగా ఉండే మొత్తం 1,787మంది వ్యక్తులను అధ్యయనానికి తీసుకోగా వారిలో మూడో వంతుమంది తీవ్రంగా ఒత్తడికి లోనవుతున్నారని వారంతా కూడా 19 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉన్నవారేనని పిట్ సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ మీడియా డైరెక్టర్ బ్రియాన్ ప్రిమాక్ తెలిపారు. ఎవరైతే సోషల్ మీడియా కారణంగా ఒత్తిడికి గురవుతున్నారో వారు సామాజికంగా మంచి సంబంధాలు నిర్మించుకోలేరని ఆయన హెచ్చరించారు. -
కశ్మీర్కు బాటలు వేసిన ఆగ్రా
ఉభయులకు దిద్దుబాటు అనేది అలవడలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారే తప్ప, ముఖాముఖీ చర్చలకు తగిన వాతావరణాన్ని సృష్టించుకోలేక పోతున్నారు. ఆగ్రా ప్రకటన ముసాయిదా మన దేశంలో వెలుగుచూడగలిగితే మన పాలకుల ప్రకటనలు ఎన్ని అబద్ధాలతో కూడుకుని ఉన్నవో బయటపడుతుందని కూడా నూరానీ రాశారు. వాజ్పేయి, జస్వంత్ల నోళ్లు నొక్కి, అద్వానీ ప్రభృతులు ఆగ్రా ఒడంబడికను ప్రభుత్వం తిరస్కరించేటట్టు చేశారని కూడా నూరానీ పేర్కొన్నారు. ‘ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఒకరోజున మళ్లీ అఖండ భారత్గా ఏకమైపోతాయని ఆరెస్సెస్ ఇప్పటికీ విశ్వసిస్తున్నది. ఇది యుద్ధం ద్వారా గాక ఉభయ దేశాల ప్రజల సుహృద్భావంతో సాధ్యమవుతుంది. కొన్ని చారిత్రక కారణాల వల్ల అరవైయ్యేళ్ల నాడు విడిపోయిన ఈ రెండు భాగాలు తిరిగి ఏకమయ్యే రోజు వస్తుంది. అయితే ఈ ఏకీకరణ సాంస్కృతిక జాతీయవాదంతోనే సాధ్యం’. -రాంమాధవ్ (బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆరెస్సెస్ నాయకుడు, 26-12-‘15) ‘బీజేపీ, దాని నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఇండియా, పాకిస్తాన్లు రెండూ సర్వతంత్ర, స్వతంత్ర దేశాలన్న ఈ మా పార్టీ వైఖరిని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 1999లో లాహోర్ పర్యటనలోనే స్పష్టం చేశారు. పాకిస్తాన్ వేరే దేశంగా విడిపోయింది. కాబట్టి ఆ దేశ జాతీయ చిహ్నమైన మీనార్-ఎ-పాకిస్తాన్ను సందర్శించడం సరికాదని కొందరు వారించినప్పుడు ఆ వైఖరిని తాను తిరస్కరించానని ఒక విందులో వాజ్పేయి వెల్లడించారు కూడా. అప్పటి నుంచి ఆ వైఖరికే బీజేపీ కట్టుబడి ఉంది.’ -ఎం.జె. అక్బర్ (బీజేపీ అధికార ప్రతినిధి, 27-12-‘15) ఆర్థిక స్వాతంత్య్రం, ప్రగతి జయప్రదంగా నిర్వహించుకోగల ప్రభుత్వాలు విదేశాంగ వ్యవహారాలను సజావుగా తీర్చిదిద్దుకోగలుగుతాయి. అలాకాక, ఆంతరంగిక వ్యవహారాలలో పరాయి దేశాల జోక్యానికీ, తీర్పరితనానికీ అవకాశం కల్పించే పాలకుల వల్ల స్వతంత్ర విధానాలు అనుసరించి నిభాయించుకురావడం ఎంత దుర్లభమో మన దేశ అనుభవమే ఉదాహరణ. అత్యున్నత స్థాయిలో కూడా గోప్యతను పాటించి ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన రహస్య, ఆకస్మిక లాహోర్ యాత్ర గురించి రాంమాధవ్, ఎంజె అక్బర్ ఇంత కంగారుగా పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేయవలసి వచ్చింది? ఆరెస్సెస్ సహా పరివార్ను ఆశ్చర్యపరిచిన మోదీ ఈ పర్యటనకు కారణం ఏమై ఉండాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఢిల్లీ లేదా, ఇస్లామాబాద్లలో దొరకదు. ఎందుకంటే, రెండు దేశాల ప్రభుత్వాలను, ప్రధానులను (ఏ పార్టీ అయినా) ప్రభావితం చేయగల తాళాలూ, వాటి చెవులూ అమెరికా చేతుల్లోనే ఉన్నాయి. ఆ ఇనుపతెర అమెరికాదే మన వేలు విడిచిన పాత వలస సామ్రాజ్యవాదానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంగ్లో-అమెరికన్ నయా వలస పాలకులు 21వ శతాబ్దంలో కూడా ఆడింది ఆటగా, పాడింది పాటగా వ్యవహరిస్తున్నారు. దేశ విభజనకు కారకులైన ఈ శక్తులే, స్వతంత్రంగా మనుగడ సాగిస్తున్న ఇండియా, పాకిస్తాన్లను పెట్టుబడులు, అభివృద్ధి పేరుతో వలలో వేసుకున్నాయి. హిట్లర్ తరువాత కూడా ప్రపంచ ఆధిపత్యం కోసం ఆ విధానాలనే అనుసరిస్తూ, ఆసియా మీద పెత్తనం కోసం కాలు దువ్వుతున్నాయి. భారత్, పాక్ల మధ్య సఖ్యత లేకుండా చేయడం, ఇతర ఇరుగు-పొరుగుతో కూడా సుహృద్భావ సంబంధాలు ఏర్పడకుండా వ్యూహాలు రచించడం ఇందులో భాగమే. పాక్తో మాత్రమే కాదు; చైనా, శ్రీలంక, నేపాల్, మైన్మార్లతో భారత్కు స్నేహవారధి ఏర్పడకుండా ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాద పెట్టుబడి కూటాలు శతథా యత్నిస్తున్నాయి. ఇందుకోసం ఏదో ఒక మిష మీద ఆసియా దేశాలనూ, అరబ్ దేశాలనూ ఆ కూటాలు సామ్రాజ్యవాద యుద్ధతంత్రంలోకి లాగుతున్నాయి. ఈ వ్యూహంలో దిగకుండా ఎదురుతిరిగిన దేశాలను ‘ఉగ్రవాదుల’ జాబితాలో చేర్చడానికి కూడా వెనకాడడం లేదు. నిన్నటి దాకా తామే పెంచి పోషించిన తాలిబన్, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాదులను ఈ పనికోసం ఎంతకాలం ఉపయోగించుకోగలిగితే అంతకాలం అగ్రరాజ్యాలు ఉపయోగించుకుంటాయి కూడా. రెండవసారి అధ్యక్ష ఎన్నికలలో గెలవడానికి జూనియర్ బుష్ చేసిన ప్రమాదకర ప్రయోగమే ట్విన్ టవర్స్ మీద దాడి అని నిపుణులతో ఏర్పడిన ట్రూత్ కమిషన్ వెల్లడించిన సంగతిని వింటున్నాం. మొదటిసారి అధ్యక్ష ఎన్నికలలో వాస్తవ కౌంటింగ్లో ఓడిపోయిన బుష్ రెండోసారి నెగ్గడానికి పన్నిన వ్యూహమే, ఆ ఘటన అని కమిషన్ చెప్పింది. ఈ అభిప్రాయాన్ని మాఫీ చేయడానికి మళ్లీ ఉగ్రవాద ముద్రనే ఆయన వినియోగించుకున్నాడు. తాను ఎవరిని ఉగ్రవాదులని ప్రకటిస్తానో, భారత్, పాక్ సహా అన్ని దేశాలు కూడా వారిని ఉగ్రవాదులేనని చెప్పాలని, లేకుంటే ఇలా చెప్పని వారిని కూడా ఉగ్రవాదులుగానే ప్రకటిస్తానని బుష్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే అఫ్ఘానిస్తాన్, ఇరాక్లపైన దాడులకు తెగబడి పెత్త ఎత్తున ధనమాన ప్రాణాలను హరించారు. ఈ విధానంతోనే భారత్, పాక్లు తన చేయి జారిపోకుండా అమెరికా కూటమి జాగ్రత్త పడుతోందని గమనించాలి. మన పొరుగునే ఉన్న అఫ్ఘానిస్తాన్ను నాటో కూటమికి స్థావరంగా చేసినది అమెరికాయే. అంటే ఇండియా,పాక్లను ఈ పరిస్థితికి అలవాటుపడేటట్టు చేసి, కూతవేటు దూరంలోనే ఉన్న జమ్మూ-కశ్మీర్కు నాటో సేనలను నడపాలన్నది అమెరికా యోచన. నిజానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వైదొలగిన తరువాత కశ్మీర్ను ఒక వ్యూహాత్మక స్థావరంగా భావించి అమెరికా కన్నువేసింది. ఈ చూపు అప్పుడే చెదరదు కూడా. భారత్ విభజనకు కారణమై, కశ్మీర్ భవితవ్యాన్ని ప్రపంచ దేశాల ముందు ప్రశ్నించడమే కాకుండా ఆ ప్రాంత స్వతంత్ర ప్రతిపత్తిని ఒక ముల్లుగా మార్చిన వారే భారత్-పాక్ల మైత్రికి అడ్డంగా నిలుస్తూ, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగు పడకుండా చూస్తున్నారు. సానుకూల చర్చలకు సాయపడరు విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్ సమస్య ఉన్నట్టా లేనట్టా అన్న ప్రశ్నకు భారత్-పాకిస్తాన్ పాలకవర్గాలు ఎవరికి తోచిన వాదన వారు వినిపిస్తున్నారు. కశ్మీర్ సమస్యను రావణకాష్టంగా మండిస్తున్నారు. రెండు దేశాల నేతలు ఐక్యరాజ్య సమితిని తీర్పరిగా పెట్టుకున్నారు. కానీ పరస్పర ద్వేషంతో పెట్టిన అర్జీలను వాపస్ తీసుకోలేదు. వాటిని వెనక్కి తీసుకునే వరకు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడవు. సరికదా, తగాదాలు ముదిరి ఆసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుంది. మోదీ తాజాగా జరిపిన లాహోర్ రహస్య యాత్ర పైకి మనకు కనిపించేది ఒక ఊదరగా మాత్రమే. అయితే దీని వెనుక జమ్మూ-కశ్మీర్ లంపటం నుంచి మోదీని బయటపడవేయాలన్న అమెరికా వ్యూహం ఉన్నదన్న సంగతి విస్మరించరాదు. భారత్, పాక్ ప్రధానులు త్వరలో వాషింగ్టన్లో కలవబోతున్నారు. ఇంతకు ముందు ఊఫా (రష్యా) సమావేశంలోనూ, తర్వాత పారిస్ పక్కవాటు సమావేశాలలోనూ మోదీ, షరీఫ్ కలసినట్టు కనిపించినా, ఆ ఇద్దరు ఆ సమావేశాలకు వేర్వేరు భాష్యాలు చెప్పి, ఇరుదేశాల ప్రజలను మభ్యపెట్టారని చెప్పడం అతిశయోక్తి కాదు. అమెరికాలో జరగబోయే సమావేశం పేరుకు అణ్వస్త్ర కేంద్రాల రక్షణ వ్యవహారాల గురించి (మార్చి 31,ఏప్రిల్ 1, 2016) చర్చించేందుకు ఒబామా ఏర్పాటు చేసిన సమావేశం. వాస్తవానికి ఒబామా వారిని రప్పిస్తున్నది కశ్మీర్ సమస్య గురించి చర్చించుకోవడానికే. పాక్, భారత్ అణ్వస్త్రాల వైపు చూడకుండా తమ మీద ఆధారపడే దేశాలుగానే ఉండాలన్నదే అమెరికా ఆశయం. కానీ క శ్మీర్ సమస్య పరిష్కారం అయిపోయిందని ఇక్కడ ఎవరూ భావించడం లేదు. అయితే అంతిమ పరిష్కారం గురించి మాట్లాడరు. ఆగ్రా ప్రకటనను బహిర్గతం చేయాలి కశ్మీర్ సమస్య పరిష్కారానికి 1997 నుంచి వాజ్పేయి అనుకూలుడేనని ఇప్పుడు చెబుతున్నారు. పర్వేజ్ ముషార్రఫ్, వాజ్పేయి జూలై 2001లో ఆగ్రాలో సమవేశమయ్యారు. అయితే ఆ సమావేశం ఫలితం ఏమిటన్నది ఇంతవరకు వివరించలేదు. కానీ నాటి పాక్ విదేశాంగ మంత్రి అబ్దుల్ సత్తార్ మాత్రం ఆగ్రాలో ఉభయులకూ ఆమోదయోగ్యంగా వెలువడిన ముసాయిదా ప్రకటన చర్చలకు సానుకూల వాతావరణం సృష్టించిందనీ, అదే భవిష్యత్తులో చర్చలకు పునాది అనీ ప్రకటించాడు. కానీ సత్తార్ పత్రాన్ని ఆ రోజు రాత్రే వాజ్పేయి కేబినెట్ తారుమారు చేసిందని, ఈ విషయాన్ని జూలై 19, 2001న ‘ది హిందు’ వెల్లడించిందని న్యాయనిపుణుడు ఏజీ నూరానీ తెలిపారు (ది కశ్మీర్ డిస్ప్యూట్, వాల్యూం:2, 1947-2012). అక్కడికీ మన విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి నిరుపమారావు సయితం ఆగ్రాలో కుదిరిన ఒప్పంద పాఠం ముసాయిదా పత్రం తుదిరూపం పొందవలసి ఉందనే చెప్పారు. అయితే ఇలా కుదిరినట్టే కుదిరి మళ్లీ విఫలం కావడం 1955 నుంచి, 1999 వరకు జరుగుతూనే ఉంది. అంటే ఉభయులకు దిద్దుబాటు అనేది అలవడలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారే తప్ప, ముఖాముఖీ చర్చలకు తగిన వాతావరణాన్ని సృష్టించుకోలేక పోతున్నారు. ఆగ్రా ప్రకటన ముసాయిదా మన దేశంలో వెలుగుచూడగలిగితే మన పాలకుల ప్రకటనలు ఎన్ని అబద్ధాలతో కూడుకుని ఉన్నవో బయటపడుతుందని కూడా నూరానీ రాశారు. వాజ్పేయి, జస్వంత్ల నోళ్లు నొక్కి, అద్వానీ ప్రభృతులు ఆగ్రా ఒడంబడికను ప్రభుత్వం తిరస్కరించేటట్టు చేశారని కూడా నూరానీ పేర్కొన్నారు. కాబట్టి ఇరు దేశాల శ్రేయస్సు కోసం ఆగ్రా ప్రకటనను ఇప్పటికైనా విడుదల చేయాలి. 1947లో లోయలో పర్యటించినప్పుడు అమృత్సర్ ఒడంబడికను (మార్చి 16, 1846)గాంధీజీ ‘కశ్మీర్ను చుప్తాగా అమ్మేసిన విక్రయ దస్తావేజు’ అన్నారు. ఉర్దూ కవి హఫీజ్ జలందారీ లాహోర్-అమృత్సర్ ఒప్పందాలను ఇలా వ్యంగ్యంగా కవిత్వీకరించాడు, ‘క శ్మీర్ ప్రజల భవితను రూ. 75 లక్షలకు కుదువపెట్టారు/ స్వర్గతుల్యమైన కశ్మీర్ విలువను రూ. 75 లక్షలకు కుదించారు/ అవును రూ. 75 లక్షలకే/ నమ్మండి కేవలం రూ. 75 లక్షలే కశ్మీర్ విలువ’ నాటి నుంచి నేటి దాకా కశ్మీరీల కడుపుమంటకు కారణం అదే. (వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు) -
'భారత్తో సంబంధాలకు ఒబామా అత్యంత ప్రాధాన్యత'
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్రమోదీతో గల సంబంధాలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని వైట్హౌస్ డిప్యూటీ సెక్రటరీ ఎరిక్ షుల్జ్ ప్రకటించారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన సంబంధాల విస్తరణ లాంటి అంశాలలో ఒబామా, మోదీతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారని శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో షుల్జ్ తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో వైట్హౌజ్ ప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా, భారత్లు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని, వీటికి ఒబామా అత్యంత ప్రాధాన్యత ఇస్తారని షుల్జ్ ప్రకటించాడు. -
మోదీ-జీ అనుబంధం
ఆసియాలోని రెండు పెద్ద దేశాలు భారత్-చైనాలు ఎనిమిది నెలల వ్యవధిలో రెండోసారి శిఖరాగ్ర సమావేశానికి సిద్ధమవుతున్నాయి. గురువారంనుంచి చైనాలో మూడురోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ జరపబోయే పర్యటన ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్ స్వస్థలమైన జియాన్ నగరంలో ప్రారంభమవుతుంది. బీజింగ్ వెలుపల విదేశీ అతిథికి స్వాగతం ఇవ్వడం జిన్పింగ్కు ఇదే ప్రథమం కానుంది. నిరుడు సెప్టెంబర్లో మన దేశ పర్యటనకొచ్చిన జిన్పింగ్ మోదీ స్వస్థలాన్ని తొలి మజిలీగా ఎంపిక చేసుకోవడాన్ని ఇది గుర్తుకు తెస్తుంది. ‘సుదూరంగా ఉండే బంధువులకన్నా సన్నిహితంగా ఉండే పొరుగువారే మేల’ని చైనా నానుడి ఒకటుంది. మోదీ పర్యటన పర్యవసానంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలూ మరింత మెరుగుపడతాయని, సాన్నిహిత్యం ఇంకాస్త పెరుగుతుందని దౌత్య రంగ నిపుణులు విశ్వసిస్తున్నారు. పుష్కరకాలంగా ఇరు దేశాల నేతలూ పరస్పర పర్యటనలు జరుపుకోవడం, అత్యున్నత స్థాయి అధికార బృందాలు వచ్చి వెళ్లడంవంటివి కొనసాగుతున్నాయి. అయితే, ఇవన్నీ నిర్నిరోధంగా, అవాంతరాలేమీ లేకుండా సాగడం లేదన్నది వాస్తవం. సరిహద్దుల్లో చైనా దళాలు అడపా దడపా చొచ్చుకురావడం, హడావుడి చేయడం...మన అరుణాచల్ ప్రదేశ్ విషయంలోనూ, కశ్మీర్ విషయంలోనూ చైనా పేచీకోరుతనంతో వ్యవహరించడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. 1962లో నాటి ప్రధాని నెహ్రూ అన్నట్టు ఇరు దేశాలమధ్యా ఉన్న సరిహద్దు వివాదం మాత్రమే ఇందుకు కారణం కాదు. ఈ పొరపొచ్చాలకు అంతకన్నా లోతైన కారణాలే ఉన్నాయి. ఆసియా ఖండంలో రెండూ పెద్ద దేశాలు. ఆసియాలోనూ...తద్వారా అంతర్జాతీయంగానూ అవతలి వారు తమను అధిగమిస్తారేమోనన్న శంక సహజంగానే రెండు దేశాల్లోనూ ఉంటుంది. మోదీ మరో 48 గంటల్లో చైనా పర్యటించబోతుండగా... ఆ దేశం పశ్చిమ ప్రాంతంనుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా అరేబియా సముద్రానికి రహదార్లు, రైల్వేలు, పైప్లైన్లతో నిర్మించబోయే ఆర్థిక కారిడార్పై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేయాల్సివచ్చిందంటేనే ఇరు దేశాల సంబంధాల్లో ఉండే ఆటుపోట్లు ఎటువంటివో అర్ధమవుతుంది. ఈ ఆర్థిక కారిడార్పై గత నెలలో జిన్పింగ్ పాక్ పర్యటన సందర్భంగా ఆ రెండు దేశాలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది కేవలం వాణిజ్యపరమైన ప్రాజెక్టు మాత్రమేనని చైనా వివరణనిస్తున్నా...కారిడార్లో భాగమైన ఆక్రమిత కశ్మీర్ వివాదాస్పదమైన భూభాగమన్న సంగతి ఆ దేశానికి తెలియనిది కాదు. మరోపక్క చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే పత్రికలో వెలువడిన వ్యాసం...అరుణాచల్ప్రదేశ్కు సంబంధించి తమ పౌరుల మనోభావాలను మోదీ గుర్తించాలంటూ వ్యాఖ్యానించింది. ఆయన గారడీలు చేస్తారంటూ ఎద్దేవాచేసింది. తమ దేశానికి అతిథిగా వస్తున్న ఒక దేశాధినేతపై ఈ తరహా వ్యాసం ప్రచురించడం సరికాదన్న సంగతి చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలు గుర్తించకపోవడం ఆశ్చర్యకరమే. ఇలాంటి చిన్న చిన్న అంశాలు రెండు దేశాలమధ్య ఉండాల్సిన దౌత్యసంబంధాలను నిర్దేశించకపోయినా అవి అనవసర చర్చకు దారి తీస్తాయన్నది వాస్తవం. భారత్-చైనాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉన్నదని రెండు దేశాలూ గుర్తించాయి. నిరుడు సెప్టెంబర్లో జిన్పింగ్ పర్యటన సందర్భంగా వచ్చే అయిదేళ్లలో అదనంగా 2,000 కోట్ల డాలర్లమేర భారత్లో తమ పెట్టుబడులుంటాయని ప్రకటించారు. ఇందులో వెయ్యి కోట్ల డాలర్లకు సంబంధించిన ఒప్పందాలపై ఈ పర్యటన సందర్భంగా సంతకాలవుతాయంటున్నారు. ఇదిగాక ద్వైపాక్షిక వాణిజ్యం 7,000 కోట్ల డాలర్లకు పెంచాలని ఇరు పక్షాలూ ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. దానికి సంబంధించి మరింత లోతైన చర్చలు జరుగుతాయి. పాకిస్థాన్తో ఎంత సన్నిహితంగా ఉన్నా భారత్తో బంధంవల్ల లభించే స్థాయి వాణిజ్య ప్రయోజనాలు ఆ దేశంతో సాధ్యం కాదని చైనాకు తెలియనిదేమీ కాదు. ప్రధాని మోదీ ‘మేకిన్ ఇండియా’ నినాదం తమ పారిశ్రామికవేత్తలకు ఎంతగానో లాభిస్తుందని...ముఖ్యంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో తమకు మంచి అవకాశాలుంటాయని చైనా అంచనా వేస్తోంది. ఇదే సమయంలో దాని భయాలు దానికున్నాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి తమ ప్రయోజనాలను దెబ్బతీసే కార్యకలాపాల్లో భారత్ పాలుపంచుకోవచ్చునని అది అనుమానిస్తోంది. సరిహద్దు వివాదంతో సహా మన ప్రయోజనాల విషయంలోనూ, భద్రత విషయంలోనూ రాజీపడకుండా వ్యవహరిస్తామని...అందులో భాగంగానే చైనా-పాక్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టును వ్యతిరేకించామని చర్చల సందర్భంగా మోదీ తెలియజెప్పే అవకాశం ఉంది. ఆసియాలో చైనా తన ప్రభావమూ, ముద్ర ప్రస్ఫుటంగా కనబడాలని చూస్తున్నది. పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలతో సన్నిహితమవుతున్నది అందుకోసమే. సెంట్రల్ ఆసియా, యూరప్, ఆఫ్రికాలతో నేరుగా పటిష్టమైన వాణిజ్యబంధం ఏర్పర్చుకోవడానికి...వాటిపై తన పట్టునూ, ప్రభావాన్నీ పెంచుకోవడానికీ అది రహదారులు, రైల్వేలు, పోర్టులు వగైరాలతో ఆధునాతన సిల్క్ రూట్కు పునాదులు పరుస్తోంది. రెండు దేశాల అధినేతలూ నేరుగా సాగించే చర్చల్లో ఇలాంటి అంశాలపై లోతుగా చర్చించడానికీ, దురభిప్రాయాలను పోగొట్టుకోవడానికీ వీలు కలుగుతుంది. భారత్లో ఇప్పుడు పటిష్టమైన నాయకత్వం ఉన్నదని, క్లిష్టమైన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి ఇది సరైన సమయమని చైనా నాయకత్వం విశ్వసిస్తోంది. ఇందుకు మరికొంత సమయం పట్టినా ఆ దిశగా ముందడుగేయడానికి మోదీ పర్యటన ఎంతగానో దోహద పడగలదని భావిస్తోంది. పరస్పర ప్రయోజనాలు ముడిపడివుండే భారత్- చైనా సంబంధాల్లో తాజా పర్యటన మరో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందనడంలో సందేహం లేదు. -
ఫన్ - సంకల్ప్
గృహిణులకు, బయటి ప్రపంచంతో అంతగా పరిచయం లేని మహిళలకు పౌర సంబంధాలు (పీఆర్)ను పెంచే ఉదే ్దశంతో పుట్టిన క్లబ్ ‘ఫన్కార్’. ‘ప్రస్తుత సొసైటీలో రిలేషన్స్, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అవి మనకు ఉన్న ఆలోచనలకు ఆసరాగా మారడమే కాదు కొత్త ఆలోచనలను కలిగిస్తాయి’ అంటున్నారు ఫన్కార్ లేడీస్ క్లబ్ నిర్వాహకురాలు సుశీలా బొకాడియా. నగరంలో పేజ్ త్రీ సోషలైట్గా చిరపరిచితమైన సుశీల.. మరింత మంది మహిళలతో కలసి సంకల్ప్, ఫన్కార్ క్లబ్స్ను నిర్వహిస్తున్నారు. ఆమె పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... ..:: ఎస్.సత్యబాబు వ్యాపారరీత్యా ఈ నగరానికి 20 ఏళ్ల క్రితం వచ్చాం. అప్పుడు ఎవరితోనూ నాకు పరిచయాల్లేవు. ఇంటిపట్టునే ఉండేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నప్పుడు నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉండాలనిపించింది. అప్పుడే సంకల్ప్ సంస్థను ప్రారంభించాను. నెలకు ఇద్దరు చిన్నారులకు అవసరమైన స్కూల్ ఫీజు క ట్టాలనుకున్నా. బంధువులు, బాగా సన్నిహితులైన మహిళలతో జట్టుగా ఏర్పడి సంకల్ప్ ద్వారా ఈ ఆలోచనను విజయవంతంగా అమలు చేయగలిగాను. పదేళ్లుగా ఈ క్లబ్ ద్వారా 200కిపైగా విద్యార్థులకు చేయూతనందించాం. ఇటీవలే సంకల్ప్ ఆధ్వర్యంలో ఓల్డేజ్ హోమ్ కూడా ప్రారంభించాం. ఫన్కార్ పుట్టిందిలా... ఇంటి నుంచి బయటకు వచ్చి నలుగురితో కలసి తమను తాము నిరూపించుకోవాలనే ఆకాంక్ష చాలా మంది మహిళల్లో ఉన్నా, సరైన గెడైన్స్ లేక ఆ దిశగా సాగలేకపోతున్నారని నాకు అనిపించింది. అందుకే విభిన్న రంగాలకు చెందిన మహిళలతో పరిచయాలను పెంపొందించే సంకల్పంతో.. ఫన్కార్ క్లబ్ని స్టార్ట్ చేశాను. ఒక రంగం లేదా ఒక గ్రూప్ నుంచి ఒక్కరినే సభ్యురాలిగా చేర్చుకుంటూ వీలైనన్ని విభిన్న రంగాలకు చెందిన మహిళలకు స్థానం కల్పిస్తున్నాం. ప్రస్తుతానికి 40 మంది సభ్యులు ఇందులో ఉన్నారు. దీపావళి ధమాకా, దసరా దాండియా.. వంటి వేడుకలు నిర్వహిస్తూ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ బలపడేలా చూస్తున్నాం. ప్రతి డిసెంబర్ నెలలో ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ ఏర్పాటు చేసి చారిటీకి వినియోగిస్తున్నాం. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన నాలాంటి సాధారణ మహిళ ఇప్పుడు విభిన్న రకాల యాక్టివిటీస్ నిర్వహిస్తోంది. రకరకాల అంశాలకు సంబంధించి ఎన్నో సన్మానాలు, పురస్కారాలు అందుకుంది. ఇదే స్ఫూర్తి మరెందరో మహిళలకు అందివ్వాలనేదే నా ఆలోచన. అందుకు నా వంతుగా ఈ క్లబ్ ఏర్పాటు చేశాను. -
కేర్ టేకర్!
రియాల్టీ షో స్టార్ కిమ్ కర్డాషియన్ ఏం చేసినా సంచలనమే. నటించినా.. బయట తిరిగినా.. రిలేషన్స్ మెయిన్టెయిన్ చేసినా..! చెప్పొచ్చేదేమంటే... గ్లామర్ ఫీల్డ్లో పర్సనల్ మ్యాకప్మ్యాన్స్ ఉండటం కామనే. కానీ... ఈ అమ్మడు మరికాస్త ముందుకెళ్లింది. మ్యాకప్ను మరింత పర్సనల్ టచ్కు ఉపయోగించుకుంటుందట! అధరాలు, కనుబొమ్మలు, బుగ్గలు... ఓకే! ఈ సెక్సీ తార ఎద సంపదకూ టచప్ల కోసం స్పెషల్గా మ్యాకప్ ఉమన్ను పెట్టుకుందట! ఇది విని సామాన్యులే కాదు.. హాలీవుడ్ తారలూ కొత్తగా ఫీలయ్యారట. ‘ఇప్పటి వరకు కిమ్ గ్లామర్ను ఒక కోణంలోనే చూశారు. నిజానికి ఆమెలో ప్రతిదీ స్పెషలే. మెరుగులు అద్దితే ఈ అందం మరింత వికసిస్తుంది. అందుకే ఈ ప్రయత్నం’ అంటూ ఆమె హబ్బీ కాన్యే వెస్ట్ చెప్పాడన్నది ‘ది సన్’ పత్రిక కథనం. మొత్తానికి తన వంపుసొంపులతో పురుష పుంగవులకు నిద్దర లేని రాత్రులు మిగులుస్తోంది కిమ్! -
హృదయ గాయం!
చూస్తుంటే బొద్దుగుమ్మ పరిణీతిచోప్రా రిలేషన్స్లో కాస్త వీక్లా ఉంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమో... అసలు వద్దనే భావనో... మొత్తానికి ఈ అమ్మడు రెండు హృదయాలకు గాయం చేసిందట. కానీ ఈ చిన్నదాని మనసు ఇప్పుడు ఓ జతగాడిని కోరుకుంటోందట. ‘గతంలో నాకుంది రెండే రిలేషన్స్. ఆ ఇద్దరినీ కాదని బాధపెట్టా. ఆ పాపం నాకు ఎప్పుడో అప్పుడు తగులుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరో ఒకరు నా హృదయాన్ని గాయపరుస్తారు. బట్... ఓకే (నవ్వులు). హార్ట్బ్రేక్స్ ఓ మంచి నటిని చేస్తాయి. చాలామంది విషయాల్లో ఇది రుజువైంది కూడా’ అంటూ ఎంతో పరిణతిగా మాట్లాడింది పరిణీతి. -
ఎడబాటు
ఫొటో స్టోరీ కొరియా రెండుగా చీలిపోయినప్పుడు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. ఎన్నో బంధాలు తెగిపోయాయి. తమవారు అవతల, తాము ఇవతల ఉండటాన్ని తలచుకుని కొన్ని లక్షల మంది కుమిలిపోయారు. కొన్ని సంవత్సరాల పాటు అక్కడివారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రావడం వీలు కాలేదు. ఎప్పుడో ఒకసారి తప్ప తమవారిని చూసుకునే అవకాశం కలిగేది కాదు. దాంతో ఆ యెడబాటు వారి గుండెల్ని పిండేసేది. ఈ ఫొటోలోని వ్యక్తి కూడా ఆ వేదన అనుభవించినవారే! దేశ విభజన కారణంగా ఈయన తన సోదరుడికి దూరమయ్యారు. తను ఎలా ఉన్నాడో, తన కుటుంబం ఎలా ఉందోనని ఆవేదన చెందుతూ దశాబ్దాల పాటు బతికారు. యాభయ్యేడేళ్ల తర్వాత... తన సోదరుడిని కలుసుకునే అవకాశం వచ్చిందాయనకు. 2010లో ఒక రోజున... ఎప్పుడో దూరమైన తన తమ్ముడిని చూసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రేమగా వాటేసుకుని మంచీ చెడులు మాట్లాడారు. కొన్ని గంటలపాటు తనతో గడిపి ఆనందపడ్డారు. అయితే అతడు తిరిగి ప్రయాణమయ్యే సమయం ఆసన్నమయ్యేసరికి దిగులు కమ్ముకుంది. కదిలిపోతున్న రైలులో కూర్చుని తమ్ముడు చేయి ఊపి వీడ్కోలు చెబుతుంటే... బాధ పొంగి కళ్లలోకి వచ్చింది. బహుశా తన తమ్ముడిని తాను మరోసారి చూడలేనేమో, అతడు మళ్లీ వచ్చేనాటికి తాను ప్రాణాలతో ఉండనేమో అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తోన్న ఈ వృద్ధుడి వేదనను ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. కొరియా విభజన మిగిల్చిన చేదును ప్రపంచానికి స్పష్టంగా చూపించాడు! -
గాలింపు చర్యల పై తీవ్ర ఆసంతృప్తి
-
భారత్తో చైనా సంబంధం కలుపుతున్నారిలా!
-
ప్రేమ వేరు.. పెళ్లి వేరు...
ప్రేమ కేవలం మన మనసుకి సంబంధించిన విషయం. కాని పెళ్లి అలా కాదు...భర్త, అత్తమామలు, కొత్త బంధువులు, కొత్త వాతావరణం...ఇలా అన్నీ ఉంటాయి. ప్రేమించుకునే సమయంలో అబ్బాయిలోని గొప్పతనం, మంచితనం మాత్రమే మీకు తెలుస్తాయి. కానీ మనిషన్నాక మంచీ, చెడూ రెండూ ఉంటాయి. పెళ్లి తర్వాతగానీ అబ్బాయి దినచర్య, అలవాట్లు, భావోద్వేగాలు మీకు తెలియవు. కేవలం చిన్న చిన్న కారణాలతో ప్రేమపెళ్లిళ్లు విఫలమవుతున్న సందర్భాలు చూస్తున్నాం మనం. ప్రేమపెళ్లికి ముందు, తర్వాత అమ్మాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్నింటిని అర్థం చేసుకోవాలి. ఇంకొన్నిటికి సర్దుకుపోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మీ జీవితంపట్ల మీకు అంకితభావం ఉండాలి. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటిస్తే చాలా సమస్యల నుంచి బయటపడినవారవుతారు. {పేమ రెండేళ్లదయినా, నాలుగేళ్లదయినా పెళ్లికి సిద్ధపడుతున్నప్పుడు పెళ్లి తర్వాత మీ దినచర్య మొదలు సమాజంలో మీకున్న గుర్తింపు వరకూ అన్నింటి గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. మీరు పెళ్లిచేసుకోబోయే వ్యక్తి పేదవాడయితే పెళ్లి తర్వాత అతనితో కలిసున్నప్పుడు వచ్చే కష్టాలపై అవగాహన పెంచుకోవాలి. కారుని విడిచి బస్సులో వెళితే ఎలా ఉంటుందో ఒకసారి ప్రయత్నించి చూడడంలో తప్పులేదు. ‘పెళ్లయ్యాక భర్త స్వభావాన్ని మార్చుకోవచ్చు’ అని అనుకునే అమ్మాయిలు చాలామంది ఉంటారు. స్వభావరీత్యా భర్తని భార్య, భార్యను భర్త మార్చడం మాటల వరకే తప్ప నిజజీవితంలో అయ్యేపని కాదు. ఏవో చిన్న చిన్న అలవాట్లు, ఆలోచనలు మార్చగలరేమో కాని మీరు కోరుకున్నట్లు ఎదుటివారు మారిపోరు. ఇలాంటి అపోహలవల్ల కూడా చాలా ప్రేమపెళ్లిళ్లు విఫలమవుతుంటాయి. కేవలం భర్తను మార్చాలనుకునే పనిలో చాలా మంది మహిళలు తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. పెళ్లయి, పిల్లలు పుట్టాక మోసపోయానంటూ వచ్చే అమ్మాయిలుంటారు. పెళ్లి తర్వాత కనీసం ఒకటి రెండు సంవత్సరాల తర్వాత పిల్లల్ని కనడం మంచిది. ఆ సమయంలోగా మీ జీవితభాగస్వామి గురించి ఎంతో కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది. - డాక్టర్ పద్మ పాల్వాయ్, సైకాలజిస్టు, రెయిన్బో చిల్డ్రన్ అండ్ ఉమెన్ హాస్పటల్