Rescue team
-
ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం.. రంగంలోకి రోబోలు! : సీఎం రేవంత్
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మీకులను బయటకు తీసేందుకు తీవ్ర అవాంతరాలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. మరో రెండు, మూడురోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. రోబోలను సైతం వినియోగించి కార్మీకులను వెలికితీసే ప్రయత్నాలను చేస్తామని వెల్లడించారు. మళ్లీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలను చేపడుతున్నామని వివరించారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్దనున్న ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకున్న ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలునాయక్తో కలిసి నిపుణులతో సహాయక చర్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ‘ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్నగర్ జిల్లాకు చిరకాల వాంఛగా ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. పదేళ్లలో కనీసం 3 కి.మీ కూడా పూర్తిచేయలేదు. బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టు కంపెనీని ఇబ్బంది పెట్టారు. కరెంట్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ను కట్ చేయడంతో మోటార్లు నడవని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని జాగ్రత్తలు తీసుకుని పనులు ప్రారంభించింది. టన్నెల్ బోరింగ్ మిషిన్ మరమ్మతు కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని అమెరికా పంపి స్పేర్పార్ట్స్ను తెప్పించాం. ప్రాజెక్టు పూర్తయితే రూపాయి ఖర్చు లేకుండానే 30 టీఎంసీల నీరు గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు అందుతుంది. మేము శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా దుర్ఘటన జరిగింది. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు. ఇది మనందరి సమస్య..విపత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ అండగా ఉండాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. దేశంలోని వ్యవస్థలన్నీ ఇక్కడే ఉన్నాయి.. ‘దేశ భద్రత కోసం కష్టపడే ఆర్మీ వ్యవస్థ ఇక్కడ పనిచేస్తోంది. టన్నెల్ నిపుణులు, ప్రైవేటు ఏజెన్సీలతో పాటు దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం 11 సంస్థలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి, వారందరినీ అభినందిస్తున్నా. ప్రమాద స్థలంలో మట్టి, నీరు ఎక్కువగా ఉండటం, కన్వేయర్ బెల్టు రిపేరులో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమవారం సాయంత్రానికి బెల్టు అందుబాటులోకి వస్తుంది. జీపీఆర్ గుర్తించిన చోట కార్మీకుల ఆనవాళ్లు దొరకలేదు. ప్రభుత్వం ఇంకా పట్టుదల, చిత్తశుద్ధితో సహాయక చర్యలను చేపడుతోంది. ప్రమాదం జరిగిన గంటలోనే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావులను సంఘటన స్థలానికి పంపా. ప్రధాని మోదీతోనూ మాట్లాడా.. దేశంలోని వ్యవస్థలతో పాటు మంత్రులు ఇక్కడే ఉండి పనిచేస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీతో మాట్లాడా. కేంద్రం సహకారంతోనూ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచి్చన వారిపై సానుభూతి, మానవత్వంతో వ్యవహరిస్తున్నాం. సహయక చర్యలను చూసేందుకు వస్తున్న ప్రతిపక్షాలతో పాటు ఎవరినీ నియంత్రించ లేదు, నిర్భంధించ లేదు. పూర్తి పారదర్శకంగా ఉన్న మమ్మల్ని తప్పుబడుతున్నారు..’ అని రేవంత్ విమర్శించారు. రెండు ఉదంతాలకు మధ్య తేడా ఉంది.. ‘గతంలో బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు పనుల్లో 9 మంది చనిపోతే ఐదేళ్ల తర్వాత వాళ్ల మృతదేహాలు దొరికిన విషయం మర్చిపోయారా? శ్రీశైలం పవర్హౌస్ ఘటనలో చనిపోయిన వారిని చూసేందుకు పీసీసీ అధ్యక్షుడిగా నేను వస్తుంటే అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పటి ఘటనకు, ఇప్పటి ప్రమాదానికి తేడా ఉంది. అక్కడ నిర్లక్ష్యం ఉంది. తాగి నడిపి మనిషిని గుద్దితే జరిగిన ప్రమాదం లాంటిది కాళేశ్వరం ఉదంతం.. తాగి వస్తున్న వాడిని బతికించేందుకు చెట్టును గుద్దిన ఘటన లాంటిది ఈ ప్రమాదం. ఈ రెండింటి మధ్య కూడా తేడా ఉంది. కేసీఆర్ ఎక్కడా కని్పంచడం లేదు. ప్రతిపక్షంగా నిలదీసే బాధ్యత ఆయనకు లేదా? నేను ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నానని కిషన్రెడ్డి అంటున్నాడు. మా వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది. టీం లీడర్గా నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. హరీశ్ నీ పాస్పోర్టు బయటపెట్టు.. ‘ప్రమాదం జరిగితే నేను ఎన్నికల ప్రచారానికి వెళ్లానని హరీశ్ అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హరీశ్ దుబాయ్లో దావత్ చేసుకున్నది నిజం కాదా? అబుదాబిలో రెండురోజులు దావత్లో మునిగి తేలారు. మత్తు దిగినాక వచ్చి ఇష్టం వచి్చనట్టు మాట్లాడుతున్నారు. హరీశ్.. మీ పాస్పోర్టును బయట పెట్టండి. ఎయిర్పోర్టులో వివరాలు చూడండి. నేను వస్తే రెస్క్యూ చర్యలకు ఇబ్బంది కలుగుతుందనే రాలేదు. ఇట్ల సోయి లేకుండా మాట్లాడవచ్చా?..’ అని రేవంత్ మండిపడ్డారు. అనుమానిత ప్రాంతాలు తాజాగా గుర్తింపుసాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఇతర ప్రాంతాలను.. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీ సహాయంతో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) తాజాగా గుర్తించింది. నలుగురు కార్మీకులు టన్నెల్ బోరింగ్ యంత్రం (టీబీఎం)కు వెనుక మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ఉన్నట్టు అనుమానిస్తుండగా, మరో నలుగురు టీబీఎం ఉన్న ప్రాంతంలోనే శిథిలాల కింద ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్జీఆర్ఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు ఆదివారం ఊహా చిత్రం రూపొందించారు. దీని ఆధారంగా డయాగ్రామ్ను తయారు చేసి, దాని ఆధారంగా మూడు దశల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు వ్యూహం సిద్ధం అయ్యింది. -
SLBC Tunnel: 24 గంటల్లో బయటికి!
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల్లో నలుగురిని ఆదివారం బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద స్థలంలో ఒకచోట నలుగురు, మరోచోట నలుగురు కార్మికుల ఆనవాళ్లను గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్ ) గుర్తించింది. సొరంగం పైకప్పు కూలిపడిన సుమారు 150 మీటర్ల స్థలంలో ముందు భాగంలో నలుగురు, చివరి భాగం (ఎండ్ పాయింట్)లో నలుగురు ఉన్నట్టుగా ‘నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)’ నిపుణులు అంచనా వేశారు. ముందు భాగంలో ఉన్న నలుగురిని బయటికి తీసేందుకు సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మ్యాన్యువల్గా తవ్వకాలు చేపట్టారు. కొన్ని గంటల్లోనే వీరిని వెలికితీసే అవకాశం ఉందని తెలిసింది. ఇక చివరి భాగంలో ఉన్న నలుగురు టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) హెడ్కు సుమారు 15 మీటర్ల వెనకాల చిక్కుకొని ఉన్నట్టుగా భావిస్తున్నారు. అక్కడ సుమారు 18 అడుగుల ఎత్తున మట్టి, శిథిలాలు పేరుకుని ఉండటంతో.. అక్కడున్న నలుగురిని బయటికి తీసేందుకు ఒకటి, రెండు రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. బురద, ఊట నీటితో ఆటంకం.. సొరంగం పైకప్పు కూలిన ప్రాంతంలో సుమారు 18 అడుగుల ఎత్తులో, 200 మీటర్ల వరకు మట్టి, బురద, శిథిలాలు పేరుకుని ఉన్నాయి. అందులో కాంక్రీట్ సెగ్మెంట్లు, టీబీఎం భాగాలు, రాళ్లు, మట్టి కాకుండా అసాధారణ అవశేషాలు ఉన్న స్పాట్లను జీపీఆర్ గుర్తించింది. ఆయా చోట్ల మ్యాన్యువల్గా తవ్వకాలు చేపట్టగా.. తవి్వన కొద్దీ ఏర్పడుతున్న బురద, ఊట నీటితో ఇబ్బంది ఎదురవుతోంది. సొరంగంలో నిమిషానికి సుమారు 5 వేల లీటర్ల సీపేజీ వస్తుండటంతో పది పంపులతో డీవాటరింగ్ పనులు చేపడుతున్నారు. హైడ్రాకు చెందిన మినీ డోజర్తో బురదను తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్టు మరమ్మతుకు మరో 2 రోజులు: సొరంగంలో 13 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. అక్కడి నుంచి మినీ డోజర్ ద్వారా బురద, మట్టి తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలానికి ముందు 200 మీటర్ల వరకు చేరుకునేందుకు రెస్క్యూ సిబ్బంది సిద్ధం చేసిన ఫ్లోటింగ్ బెల్టు మీదుగా నడిచి వెళుతున్నారు. ఈ శిథిలాలు, మట్టి తొలగించేందుకు కన్వేయర్ బెల్టు అందుబాటులోకి రాక ఆలస్యం అవుతోంది. కన్వేయర్ బెల్టు ఎండ్ పార్ట్ వద్ద మెషీన్ పూర్తిగా ధ్వంసం కావడం, బెల్టును తిరిగి వినియోగంలోకి తేవాలంటే కొత్త ఫౌండేషన్ వేయాల్సి ఉండటంతో.. ఇందుకోసం మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ.. సహాయక చర్యల్లో ఆధునిక సాంకేతికతను, పరికరాలను వినియోగిస్తున్నారు. శిథిలాల్లో అవశేషాలను గుర్తించేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్), మానవ రక్తం ఆనవాళ్లను గుర్తించే ఆక్వా–ఐ, ప్రోబోస్కోప్, టీబీఎం విడిభాగాలు, శిథిలాలను కట్ చేసేందుకు అల్ట్రా థర్మికల్ కటింగ్ మెషీన్, ప్లాస్మా కట్టర్స్, సొరంగంలోని బురద, మట్టిని తొలగించేందుకు ఆర్మీకి చెందిన రెండు మినీ బాబ్ క్యాట్ మెషీన్లు, ఎస్కవేటర్ను వినియోగిస్తున్నారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ ఐజీ మోహ్సెన్ షహది పర్యవేక్షిస్తున్నారు. శనివారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎన్జీఆర్ఐ నిపుణులతో సమీక్షించారు. డాక్టర్గా చెబుతున్నా.. వాళ్లు బతికుండే అవకాశం లేదు: ఎమ్మెల్యే వంశీకృష్ణ సొరంగంలో కార్మికులు మట్టి, బురద, శిథిలాల కింద కూరుకుపోయారని.. ఒక డాక్టర్గా చెబుతున్నానని, వాళ్లు బతికి ఉండేందుకు అవకాశం లేదని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. కార్మికులను బయటికి తీసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని.. ఒకట్రెండు రోజుల్లో బయటికి తీసే అవకాశం ఉందని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సర్వే కోసం నేడు ఎన్ఆర్ఎస్సీ బృందం.. సొరంగంలో కుప్పకూలిన ప్రాంతానికిపైన భూఉపరితలం వద్ద ‘నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)’ అధికారులు సర్వే చేపట్టారు. ఈ ప్రాంతానికి సమీపంలో మల్లెల తీర్థం జలపాతం ఉండటం, దానికి నల్లవాగు (ఏనిగే)కు మధ్యలో సుమారు 400 మీటర్ల లోతున టన్నెల్లో ప్రమాదం జరగడంతో... టన్నెల్లో భారీగా నీటి ఊటకు కారణాలపై పరిశీలన చేపట్టారు. అయితే ఎన్జీఆర్ఐ పరికరాల ద్వారా 150 మీటర్లలోతు వరకు మాత్రమే మట్టి పొరలు, రాళ్ల ఆకృతుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. సొరంగం 400 మీటర్ల లోతులో ఉన్న నేపథ్యంలో... పరిశోధించేందుకు ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’ చెందిన నిపుణులు ఆదివారం రంగంలోకి దిగనున్నారు. వెళ్లి చూస్తే పరిస్థితి ఎంత క్లిష్టమో తెలుస్తుంది: మంత్రి జూపల్లి కృష్ణారావు సొరంగంలో చిక్కుకున్న 8 మందిని బయటికి తీసే చర్యల్లో పురోగతి కనిపించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం దోమలపెంట సొరంగం వద్ద మంత్రి ఉత్తమ్తో కలసి అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోపల చిక్కుకున్న కార్మికులు బతికి ఉండే అవకాశం 99శాతం లేదన్నారు.రెస్క్యూ బృందాలు ప్రమాదంలో పడొద్దన్న ఉద్దేశంతో జాగ్రత్తగా పనులు చేపడుతున్నామని, అందుకే ఆలస్యం అవుతోందని జూపల్లి తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యమంటూ విమర్శలు చేస్తున్నవారు ఒకసారి టన్నెల్లో ప్రమాదస్థలానికి వెళ్లి చూస్తే.. పరిస్థితి ఎంత కష్టంగా ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు. -
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 'మరో సొరంగం'!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టులో భాగంగా ప్రధాన సొరంగానికి అనుసంధానంగా మరో టన్నెల్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణ సులభంగా సాగేలా, ఒకవేళ ఏవైనా ప్రమాదాలు జరిగితే వేగంగా చర్యలు చేపట్టడానికి వీలుగా ‘అడిట్’ టన్నెల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రధాన సొరంగంలో (ఇన్లెట్ నుంచి) 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద కలిసేలా.. మధ్యలో ఏదో ఒక వైపు నుంచి సమాంతరంగా (హారిజాంటల్)గా ఈ ‘అడిట్’ టన్నెల్ను నిర్మించనుంది. ప్రధాన సొరంగంలోకి గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్ల తొలగింపునకు, మనుషులు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఈ టన్నెల్ ఉండనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, ప్రాజెక్టుకు అయ్యే వ్యయం, ఇతర అంశాలతో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. నిపుణుల సూచనలకు అనుగుణంగా... ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల పైకప్పు కుప్పకూలి, 8 మంది గల్లంతై ఇప్పటికి ఆరు రోజులు దాటింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు టన్నెల్ వద్దే ఉంటూ సహాయక చర్యలను, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో టన్నెల్ నిర్మాణంలో నిష్ణాతులైన దేశ, విదేశీ నిపుణుల సూచనలు, ఇంజనీర్ల అభిప్రాయాలను పరిశీలించారు. ప్రపంచంలో టన్నెల్ ప్రమాదాలు చాలా జరిగినప్పటికీ.. ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాదం చాలా క్లిష్టమైనదని నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద అనుసంధానం అయ్యేలా భూఉపరితలం నుంచి ‘అడిట్’ సొరంగం నిర్మించాలని నిర్ణయించారు. గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్ల తొలగింపు వంటివాటికి ఈ ‘అడిట్’ టన్నెల్ ఉపయోగపడుతుందని నిపుణులు సూచించడంతో.. ఆ దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. మరో మార్గం లేకపోవడంతో.. ఎస్ఎల్బీసీ సొరంగాన్ని భూమి ఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. 43 కిలోమీటర్ల ఈ టన్నెల్లో ‘ఇన్లెట్, ఔట్లెట్ ’ మినహా మధ్యలో ప్రత్యామ్నాయ మార్గమేదీ లేదు. ప్రస్తుతం ప్రమాదం 13.9 కిలోమీటర్ల పాయింట్ వద్ద జరిగింది. ఇలాంటి సమయంలో మధ్యలో మరో మార్గం ఉంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచించారు. అయితే ఇక్కడ ఎక్కువ లోతు ఉండటంతో నిలువునా బావిలా సొరంగం తవ్వే అవకాశం లేదు, తవ్వినా ప్రయోజనం ఉండదని, కూలిపోయే అవకాశాలు ఎక్కువని తేల్చారు. ఈ క్రమంలో 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద కలిసేలా.. ఉపరితలంపై నుంచి ‘అడిట్’ టన్నెల్ను ఒక దారిలా నిర్మించాలని నిర్ణయించారు. నిపుణుల పర్యవేక్షణలో... ఎస్ఎల్బీసీ సొరంగానికి భవిష్యత్తులో ప్రమాదాలు ఎదురుకాకుండా తీసుకోవలసిన చర్యలపై సూచనల కోసం టన్నెల్ నిర్మాణాల్లో నిపుణులైన ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ అదనపు డీజీ కేపీ పురుషోత్తంలను మంత్రి ఉత్తమ్ ఎస్ఎల్బీసీ వద్దకు రప్పించారు. సివిల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఈ ‘అడిట్’ సొరంగంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక ‘అడిట్’ టన్నెల్ తవ్వడానికి అటవీ, పర్యావరణ అనుమతులు ప్రత్యేకంగా అవసరం లేదని... ఎస్ఎల్బీసీ సొరంగంలో భాగంగానే దీనిని నిర్మిస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు పొందడం కష్టం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి టన్నెల్ క్యాంపు వద్ద విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బి.సంతోష్, ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ అదనపు డీజీ కేపీ పురుషోత్తం, ఎన్ఆర్ఎస్ఏ, ఎన్జీఆర్ఏ, కాంట్రాక్టు సంస్థలు రాబిన్సన్, జేపీ అసోసియేట్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సహాయక చర్యలపై సమీక్షించారు. అధికారులు, నిపుణులు చేసిన సూచనలపై చర్చించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని స్పష్టం చేశారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)తో తవ్వకాలు జరుపుతున్నప్పుడు పైకప్పు కూలడం, మట్టి, నీరు, ఇతర ఖనిజాలు పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ‘అడిట్’ సొరంగం నిర్మాణం జరపాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకోసం ఎంత ఖర్చయినా వెచ్చిస్తామని చెప్పారు. టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్లో నిరంతరం వివిధ టీంలకు చెందిన 20 మంది నిపుణులు మూడు షిఫ్టుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. టన్నెల్లో సిల్ట్ తొలగింపు, డీవాటరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని.. పనిచేయకుండా ఉన్న కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. శుక్రవారం చేపట్టే రెస్క్యూ ఆపరేషన్ కీలకం కానుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రోజుల్లో సహాయక చర్యలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. -
అప్రమత్తంగా..ఆచితూచి..
సాక్షి, హైదరాబాద్/నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ఒకటో సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన 8 మంది కార్మీకుల అన్వేషణలో భాగంగా గురువారం నుంచి సొరంగం లోపల తవ్వకాలను ప్రారంభించనున్నారు. గత ఆరు రోజుల్లో ఏడు రెస్క్యూ బృందాలు సొరంగం లోపలికి వెళ్లి పరిస్థితులను అంచనా వేసి బయటకు తిరిగి వచ్చాయి. అయినా కార్మికుల జాడ తెలుసుకోవడంలో పెద్దగా పురోగతి సాధ్యం కాలేదు. ఈ పరిస్థితుల్లో తవ్వకాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపితే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతానికి తేలికపాటి పరికరాలతో రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరిపించాలని నిర్ణయించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) మాజీ డీజీ/ఆర్మీ మాజీ ఈఎన్సీ జనరల్ హర్పాల్ సింగ్, సొరంగాలకు సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ నిపుణుడు క్రిస్ కూపర్, బీఆర్ఓ అదనపు డీజీ కేపీ పురుషోత్తం, మరో ప్రముఖ సొరంగాల నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రతో కూడిన నిపుణుల బృందం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ర్యాట్ హోల్ మైనర్లతో కలిసి సొరంగం లోపలికి వెళ్లింది. సాయంత్రం 4.10 గంటలకు బయటకు వచ్చింది. అనంతరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో సమావేశమై విస్తృతంగా చర్చించింది. నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వం వ్యూహాన్ని ఖరారు చేసింది.. చివరి వరకు నెమ్మదిగా తవ్వకాలు గల్లంతైన కార్మీకుల ఆచూకీ తెలుసుకోవడంలో భాగంగా సొరంగం కూలిన ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, రాళ్లు, శిథిలాలు, తుక్కును తేలికపాటి పరికరాలతో తవ్వకాలు జరిపి తొలగించవచ్చని నిపుణుల బృందం సూచించింది. సొరంగం కూలిన సమయంలో అక్కడున్న కార్మీకులు బయటకు వచ్చేందుకు పరుగెత్తి ఉంటారని, వారు శిథిలాల కింద ఈ వైపే ఉండి ఉంటారనే తమ అంచనాను వివరించింది. ఈ నేపథ్యంలో రెసూ్క్క బృందాలు తవ్వకాలు ప్రారంభిస్తే ఒకటీ రెండురోజుల్లోనే కార్మీకుల ఆచూకీ లభ్యం కావచ్చని భావిస్తున్నారు. తవ్వకాలు, శిథిలాల తొలగింపు చర్యలు ఈ వైపు నుంచి ప్రారంభించి సొరంగం చివరి భాగం వరకు నెమ్మదిగా కొనసాగించాలని నిపుణులు సూచించారు. తవ్వకాలు కొద్దిగా పురోగమించిన వెంటనే సొరంగం పైకప్పు మళ్లీ కూలకుండా రక్షణగా రీఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, జనరల్ హర్పాల్ సింగ్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)కి చెందిన ఒకే బ్యాచ్ అధికారులు కావడం గమనార్హం. ఉత్తమ్కుమార్ రెడ్డి గతంలో భారత వాయుసేనలో కెపె్టన్గా పనిచేసిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే పరికరాల తరలింపు.. సొరంగం లోపల తవ్వకాలు, శిథిలాల తొలగింపు పనులకు కార్మీకులు ముందుకు రావడం లేదు. సొరంగం మళ్లీ కూలుతుందేమోనని భయపడుతున్నారు. దీంతో సింగరేణి రెస్క్యూ బృందాలను అత్యవసరంగా రప్పిస్తున్నారు. గురువారంలోగా వారు ప్రమాద స్థలానికి చేరుకోనున్నారు. ఇక సొరంగంలోని మట్టి, శిథిలాల్లో కూరుకుపోయిన టన్నుల కొద్దీ బరువు ఉన్న తుక్కును కట్ చేయడానికి రైల్వే శాఖ నుంచి యుద్ధ ప్రాతిపదికన హెవీ స్టీల్ గ్యాస్ కట్టర్లను రప్పిస్తున్నారు. బుధవారం రాత్రికే ఈ పరికరాలన్నీ సొరంగంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఇక టీబీఎం ముక్కలు ముక్కలే.. సొరంగం కూలడంతో శిథిలాల కింద కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)ను హెవీ స్టీల్ గ్యాస్ కట్టర్ సహాయంతో ముక్కలు ముక్కలుగా కట్ చేసి సొరంగం నుంచి తొలగించాలని నిర్ణయించారు. దీనిని తొలగిస్తేనే గల్లంతైన కార్మీకుల ఆచూకీని కనుక్కోవడానికి వీలుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ రెస్క్యూ ‘మార్కోస్’ ప్రత్యేకత గురువారం నుంచి జరిగే సహాయక కార్యక్రమాల్లో ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ (మార్కోస్) కూడా పాల్గొననుంది. అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ రెస్క్యూ నిర్వహించే ఈ దళం బీఆర్ఓ, ఆర్మీ, నేవీ నిపుణులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ర్యాట్ హోల్ మైనర్స్తె కలిసి పని చేయనుంది. కాగా అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీని వినియోగిస్తూ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెస్క్యూ సిబ్బందికి అవసరమైన ఆక్సిజన్, లైఫ్ సపోర్ట్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. -
ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్/నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎల్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన 8 మంది కార్మికులు, ఉద్యోగుల క్షేమంపై ఆశలు ఆవిరవుతున్నాయి. ఆరో ప్రయత్నంలో భాగంగా మంగళవారం సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లతో కూడిన రెస్క్యూ బృందం ఎట్టకేలకు సొరంగం చివరివరకు చేరుకుని ప్రమాద స్థలంలో విస్తృతంగా గాలించింది. పైకప్పు కూలడంతో పెద్ద మొత్తంలో కిందపడిన బండ రాళ్లు, కంకరతో నిండిపోయిన ఆ ప్రాంతంలో ఎక్కడా కార్మికుల ఉనికి కనిపించలేదు. ఈ బృందం పూర్తిగా ప్రమాద స్థలానికి చేరుకుని లోపలి నుంచి ల్యాండ్లైన్ ఫోన్ ద్వారా బయటకి ఈ సమాచారం అందించగానే కార్మికుల క్షేమంపై అధికారులందరూ దాదాపుగా ఆశలు వదులుకున్నారు. టన్నుల కొద్దీ బండరాళ్లు, కంకర, మట్టి, యంత్రాల తుక్కు కిందే కార్మికులు నలిగిపోయి ఉంటారనే అనుమానాలు మరింతగా బలపడ్డాయి. అయితే కార్మికుల క్షేమంపై మంగళవారం రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నాక బుధవారం ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. చివరి వరకు వెళ్లిన తొలి బృందం ఇదే..: మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆరో రెస్క్యూ బృందం సొరంగంలో ప్రవేశించింది. ర్యాట్ హోల్ మైనింగ్ టీం ప్రత్యేకంగా తమకు కావాల్సిన వస్తువులను సేకరించి, వెల్డింగ్ చేయించుకుని టన్నెల్లోకి తీసుకెళ్లింది. టన్నెల్లో బురద దాటేందుకు వీలుగా, టన్నెల్ సైడ్ గోడలకు రాడ్లు కొడుతూ ప్రత్యేక దారి నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని వెంటబెట్టుకుని వెళ్లింది. గంటన్నర ప్రయాణించి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సొరంగం చివరి అంచువరకు వెళ్లిన ఆరో బృందం గాలింపులు నిర్వహించింది. సొరంగం చివరన ప్రమాద స్థలానికి చేరుకున్న తొలి రెస్క్యూ బృందం ఇదే కావడం గమనార్హం. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లు, స్నైఫర్ డాగ్స్, డ్రోన్ ఆపరేటర్లు, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నిపుణులతో సహా మొత్తం 35 మంది బృందంలో ఉండగా, సొరంగం చివరికి 11 మంది ర్యాట్ హోల్ మైనర్లతో పాటు నలుగురు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రమే చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద స్థలంలో 15–18 మీటర్ల ఎత్తులో 140 మీటర్ల మేర శిథిలాలు పేరుకుపోయాయి. ‘కూలిపోయే ప్రమాదం ఉంది..’ : అక్కడి పరిస్థితిని రెస్క్యూ టీం సభ్యులు వీడియో తీశారు. ‘ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది.. పైకప్పునకు క్రాక్ వచ్చింది. కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్దాం పదండి..’ అంటూ రెస్క్యూ టీం సభ్యులు వీడియోలో మాట్లాడారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బృందం తిరిగి బయటకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సొరంగంలోకి వెళ్లిన ఐదో రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి 40 మీటర్ల సమీపం వరకే వెళ్లగలిగింది. నేడు ఏడో ప్రయత్నం.. : ఏడో ప్రయత్నంలో భాగంగా బుధవారం ఉదయం మళ్లీ ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లతో కూడిన బృందం సొరంగంలోకి వెళ్లనుంది. ప్రమాద స్థలంలో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన తుక్కును గ్యాస్ కట్టర్లతో కట్ చేయడంతో పాటు కంకర, బండ రాళ్లు, మట్టిని తొలగించే ఆపరేషన్ను ప్రారంభించనుంది. సహాయక బృందాల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి జేసీబీ యంత్రాలు వినియోగించకుండా ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ల బృందాలతో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ఎన్నిరోజుల సమయం పడుతుందో చెప్పలేమని ర్యాట్ హోల్ మైనర్ ఫిరోజ్ ఖురేషీ ‘సాక్షి’తో అన్నారు. కన్పించిన టీబీఎం ఉపరితల భాగం: మంగళవారం సొరంగంలోకి వెళ్లిన రెస్క్యూ బృందానికి టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) ఉపరితల భాగం కనిపించింది. బండ రాళ్లు, కాంక్రీట్ పడడంతో ఈ భాగం ఊర్తిగా ధ్వంసమై కనిపించగా, మిగిలిన భాగం మట్టి, కంకర, శిథిలాల్లో కూరుకుపోయింది. శిథిలాలను తొలగించి పరిశీలించిన తర్వాతే టీబీఎం మళ్లీ పనిచేయగలుగుతుందో లేదో తేలనుంది. సొరంగం పైకప్పునకు రక్షణగా ఉన్న కాంక్రీట్ సెగ్మెంట్లు కూడా కొంతవరకు కూలిపోయి, మరికొన్ని వంగిపోయి కనిపిస్తున్నాయి. కిందనుంచి శిథిలాలను తొలగించే క్రమంలో కాంక్రీట్ సెగ్మెంట్లు, శిథిలాలు ఊడిపోయి రెస్క్యూ టీంకు కూడా ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. టీబీఎం మిషన్పై పడిన మట్టి, బురదను తొలగించేందుకు మెష్ ప్రేమ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా బురద నుంచి నీటిని వేరుచేసి డీ వాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు.ప్రస్తుతం నిమిషానికి సుమారు 5 వేల లీటర్ల వరక నీరు సీపేజీ రూపంలో వస్తోంది. ఈ నీటిని బయటకు తోడేందుకు ఐదు మోటార్లతో డీ వాటరింగ్ చేపడుతున్నారు. బుధవారం సాయంత్రానికి మొత్తం నీటిని డీవాటరింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్ని రోజులైనా తమ వారి జాడ తెలియకపోవడంతో, ఏ క్షణంలో ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందోనని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.వారిని కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతాం» రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి»డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో టన్నెల్ ఇన్లెట్ పరిశీలన» మంత్రులు జూపల్లి, కోమటిరెడ్డితో కలిసి సహాయక చర్యల పర్యవేక్షణ సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: శ్రీశైల ఎడమ కా ల్వ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని, ఇందు కోసం అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞా నాన్ని ఉపయోగించుకుంటామని రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ను పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.అనంతరం ఎస్ఎల్బీసీ సొరంగం, జేపీ కార్యాలయంలో రెండుసార్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయక చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ సహా ఆయా శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ, సహాయ చర్యల్లో పాల్గొంటున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. బురదను తొలగించడమే సమస్య‘ఎస్ఎల్బీసీ సొరంగంలోకి అకస్మాత్తుగా వచ్చిన నీటి ఊటతో 40 నుంచి 50 మీటర్ల మేర బురద పేరుకుంది. టన్నెల్లో 11 కి.మీ తర్వాత ప్రాంతం నీటితో నిండి ఉంది. 13.50 కి.మీ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ఉంది. ఎయిర్ సప్లయ్ పైప్లైన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం టన్నెల్లో 10 వేల క్యూబిక్ మీటర్ల బురద ఉందని ప్రాథమికంగా అంచనా వేశాం. దీనిని తొలగించడమే ప్రధాన సమస్య’ అని మంత్రి ఉత్తమ్ చెప్పా రు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, స్పెషల్ ఆఫీసర్ ఇ.శ్రీధర్, కలెక్టర్ బదావత్ సంతోష్, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.గ్రౌటింగ్ విఫలం కావడంతోనేనా..? సొరంగం కూలిన ప్రాంతంలో కొన్నిరోజుల కింద నిర్మాణ సంస్థ పీయూ గ్రౌటింగ్ చేసింది. జీఎస్ఐ నుంచి జియాలజిస్టు వచ్చి పరిశీలించి, పనులు కొనసాగించవచ్చని చెప్పాకే టన్నెల్ పనులు పునః ప్రారంభించారు. అయితే సొరంగం కూలిన ప్రాంతంలో మొత్తం పీయూ గ్రౌటింగ్ కోసం వినియోగించిన రసాయన అవశేషాలు పెద్ద మొత్తంలో పేరుకుపోయి కనిపించాయి. దీంతో గ్రౌటింగ్ విఫలం కావడంతోనే సొరంగం కూలిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఫాల్ట్ లైన్ గుర్తించేందుకు జీఎస్ఐ అధ్యయనం సొరంగం కూలడానికి కారణమైన ఫాల్ట్ లైన్ను గుర్తించడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. సొరంగం ఉపరితలం నుంచి వారు సర్వే చేసి ఏ ప్రాంతంలో మట్టి వదులుగా, బలహీనంగా ఉందో గుర్తించి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది. బుధవారం మరో జీఎస్ఐ బృందం రాబోతోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) నిపుణుల బృందం సైతం బుధవారం సొరంగం వద్దకు రానున్నారని అధికారవర్గాలు తెలిపాయి. తక్షణమే నివేదిక ఇవ్వండి : ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనపై తక్షణమే నివేదిక సమరి్పంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) దక్షిణాది విభాగం.. రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. శ్రీశైలం జలాశయంతో సొరంగం అనుసంధానం కానుండడంతో ఈ ప్రమాదంతో జలాశయంపై ఉండనున్న ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ నివేదిక కోరినట్టు తెలుస్తోంది. మా వాళ్లను క్షేమంగా అప్పగించండిజార్ఖండ్ కార్మికుల కుటుంబ సభ్యుల ఆవేదనఅచ్చంపేట: బతుకుదెరువు కోసం మా పిల్లలు ఇక్కడికి వచ్చారు.. వారు క్షేమంగా బయటికి తిరిగి వస్తారు కదా.. అంటూ దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమా దంలో చిక్కుకున్న కార్మికుల తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సొరంగంలో వాళ్లు ఎలా ఉన్నారో తలుచుకుంటేనే భయమేస్తోంది. మా పిల్లలను మాకు క్షేమంగా అప్పగిస్తే చాలు..’ అని వేడుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా జిల్లాకు చెందిన నలుగురు కార్మికుల కుటుంబ సభ్యులు మంగళవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చారు. స్థానిక అధికారులు వారితో మాట్లాడి భరోసా కల్పించారు. తమవారు క్షేమంగా బయటికి రావాలని సొరంగంలో చిక్కుకున్న జగ్దాక్షేస్ అన్న జల్లామ్క్షేస్ చెప్పాడు. ‘నా పెద్ద కొడుకైన సందీప్ సాహు ఆరేళ్ల క్రితం కంపెనీలో పనిచేసేందుకు వచ్చి ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. నా కొడుకు క్షేమంగా వస్తే మా ఊరికి తీసుకెళ్లిపోతా..’ అని సందీప్ తండ్రి జీత్రామ్ సాహు అన్నాడు. -
సొరంగంలో ఆశలు గల్లంతు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్/ సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) తొలి సొరంగం పైకప్పు కుప్పకూలడంతో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. కార్మీకులను బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ సహాయక బృందాలు ఆదివారం రోజంతా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రమాదం జరిగి 40 గంటలైనా కార్మీకుల జాడగానీ, వారి యోగక్షేమాలుగానీ తెలియకపోవడంతో... వారు సురక్షితంగా బయటపడే అవకాశం తక్కువనే చర్చ జరుగుతోంది. ఆదివారం ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలతో కలసి లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లి.. సుమారు 6 గంటల తర్వాత తిరిగి వచి్చన మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా.. పరిస్థితి నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. సొరంగం లోపలి వరకు వెళ్లి బయటికి వచి్చనవారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలిన చోట దాదాపు 200 మీటర్ల మేర మట్టి, బురద నీరు, శిథిలాలతో సొరంగం మూసుకుపోయింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో 12 కిలోమీటర్ల వద్ద సైతం మోకాలి లోతు నీళ్లు ఉన్నాయి. కూలిన మట్టి, శిథిలాలను తొలగిస్తేగానీ గల్లంతైన కార్మికులను చేరుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలేమీ ప్రారంభం కాలేదు. ఏదైనా అద్భుతం జరిగితే కానీ.. సొరంగం లోపల పరిస్థితి భీతావహంగా ఉండటం, మళ్లీ పైకప్పు కూలవచ్చనే ఆందోళనల నేపథ్యంలో రెస్క్యూ కష్టసాధ్యంగా మారింది. దోమలపెంట వద్దనున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకునేందుకు ఒక్క లోకో ట్రైన్ మాత్రమే ఆధారం. దాని ద్వారా 12.6 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంది. అక్కడి నుంచి కన్వేయర్ బెల్టు మీద లోపలికి చేరుకోవాల్సి వస్తోంది. సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం వరకే సహాయక బృందాలు వెళ్లగలిగాయి. శిథిలాలు కొట్టుకురావడంతో వాటిని తొలగించకుండా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న నీటి ఊటను మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు. నిమిషానికి 10 వేల లీటర్ల నీటిని ఎత్తిపోసే మోటార్లను వినియోగిస్తున్నారు. లోపలికి వెళ్లి బయటికి వచి్చన రెస్క్యూ బృందాలతో ‘సాక్షి’ మాట్లాడింది. గల్లంతైన కార్మీకుల మీద కాంక్రీట్ సెగ్మెంట్లు, మట్టి, శిథిలాలు పడి ఉండవచ్చని వారు పేర్కొన్నారు. లేదా వారు సొరంగం కూలిన ప్రాంతానికి ఆవలివైపు చిక్కుకుని ఉన్నా.. రెండు వైపులా మూతపడి ఉండటంతో ఆక్సిజన్ లభించడం కష్టమేనని భావిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా అద్భుతం జరిగితేనే వారు ప్రాణాలతో ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సొరంగం కూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం దాకా వెళ్లిన రెస్క్యూ సిబ్బంది.. కార్మికులను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ పిలిచినా ఎలాంటి స్పందన రాలేదని అంటున్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య.. ఎస్ఎల్బీసీ సొరంగం–1 ఇన్లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల శనివారం ఉదయం 8.30 గంటలకు పైకప్పు కూలిపడింది. ఆదివారం అర్ధరాత్రి సమయానికి 40 గంటల కీలక సమయం గడిచిపోయింది. దీనితో కార్మీకుల క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, అగ్నిమాపక శాఖ, ఆర్మీకి చెందిన రెస్క్యూ సిబ్బంది మూడు వేర్వేరు బృందాలుగా ఏర్పడి సొరంగం లోపలికి లోకో ట్రైన్ ద్వారా వెళ్లారు. వారు తిరిగి వచ్చి గల్లంతైన కార్మీకుల యోగక్షేమాల గురించి చెబుతారేమోనని.. సొరంగం బయట అధికారులు, నేతలు, మీడియా ప్రతినిధులు ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ మంత్రితోపాటు రెస్క్యూ సిబ్బంది నిరాశ వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో ఆర్మీ ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ బైసన్ డివిజన్కు చెందిన ఇంజనీర్ టాస్్కఫోర్స్ (ఈటీఎఫ్) ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్మీ వైద్య బృందాలను సైతం టన్నెల్ వద్ద అందుబాటులో ఉంచారు. తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్లను సమన్వయం చేస్తున్నారు.శిథిలాలు, బురద తొలగించేదెలా?సొరంగం కూలిపడి పేరుకుపోయిన మట్టిని, శిథిలాలను తొలగించనిదే కార్మీకుల వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకోలేని పరిస్థితి. కానీ నీటి ఊటల కారణంగా.. మట్టిని తొలగించిన కొద్దీ పైకప్పు మళ్లీ కూలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సొరంగం భూఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల దిగువన ఉందని, కూలిన చోట మట్టిని తీసినకొద్దీ.. పైన వదులుగా ఉన్న మట్టి మళ్లీ సొరంగంలోకి పడిపోతుందని రెస్క్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే సొరంగంపైన భూమి ఉపరితలం నుంచి డ్రిల్లింగ్ చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపినా.. 400 మీటర్ల లోతున రంధ్రం చేయడానికి చాలా రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సొరంగంలో పేరుకున్న మట్టి, నీళ్లు, ఇతర శిథిలాలను తొలగించేందుకూ కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.పైకప్పు కూలిన చోట.. కాంక్రీట్ సెగ్మెంట్ లేదు! సొరంగంలో ప్రమాదం జరిగిన చోట పైకప్పుకు రక్షణగా కాంక్రీట్ సెగ్మెంట్లు లేవని తెలిసింది. టన్నెల్ చివరన పనులు జరిగిన చోట సుమారు 100 మీటర్ల మేర కాంక్రీట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేయలేదని సమాచారం. అంతేగాకుండా సొరంగంలో నాలుగేళ్లుగా నీటి ఊటలు (సీపేజీ) కొనసాగుతుండటంతో మట్టి వదులుగా మారడం, తవ్వకం పనుల్లో రక్షణ గోడ నిర్మించకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో పైకప్పు కుప్పకూలిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటేనే.. సొరంగం లోపల చిక్కుకున్న కార్మీకులను బయటికి తెచ్చేందుకు ఏదైనా వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ఆచరణలో పెడితేనే ఫలితమిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యేక వ్యూహం లేకుండా రెస్క్యూ బృందాలు లోపలి వరకు వెళ్లి వచి్చనట్టు తెలిసింది. సొరంగంలో పేరుకున్న మట్టిని తొలగించి కన్వేయర్ బెల్టుల ద్వారా, లేదా లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపితే గానీ చిక్కుకున్న కార్మీకుల జాడ కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. అడ్డంకులన్నీ అధిగమించి కార్మీకులను చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. టీబీఎం మెషీన్ దగ్గరికి చేరుకోవడమే కష్టంగా ఉంది సొరంగంలో పైకప్పు కూలిన చోట ఉన్న టీబీఎం మెషీన్ వద్దకు చేరుకోవడమే కష్టంగా ఉంది. ఇప్పటివరకు రెండు సార్లు లోపలికి వెళ్లి వచ్చాం. మెషీన్ వద్ద 200 మీటర్ల దాకా భారీగా బురద పేరుకుని ఉంది. దాన్ని దాటడం వీలుపడటం లేదు. టన్నెల్ పైకప్పు మళ్లీ కుంగకుండా సేఫ్టీ కోసం రాక్ బోల్టింగ్ చేస్తున్నాం. నీటి తొలగింపు కొనసాగుతోంది. – కలేందర్, సింగరేణి మైనింగ్ సేఫ్టీ సూపర్వైజర్ వారి జాడ కనిపించలేదు.. టన్నెల్లో భారీగా మట్టి, శిథిలాలు పేరుకుపోవడంతో మెషీన్ దగ్గరికి వెళ్లేందుకు కుదరడం లేదు. చిక్కుకున్న వారి జాడ ఏదీ కనిపించలేదు. ఎలాంటి అరుపులు సైతం వినిపించలేదు. – రాందేవ్, సుబేదార్, ఆర్మీ రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది టన్నెల్ రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది. 200 నుంచి 500 మీటర్ల మధ్య టన్నెల్ బోరింగ్ మెషీన్ బురదలో కూరుకుపోయింది. 35 మందిమి సహాయక చర్యలకు అవసరమైన సామగ్రి తీసుకొని వెళ్లాం. రాత్రంతా కష్టపడి దగ్గరకు చేరుకోగలిగాం. – రవినాయక్, ఎన్డీఆర్ఎఫ్ టీం, విజయవాడ పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి.. మేం పనుల కోసం టన్నెల్ చివరికి చేరుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి. సిమెంట్ దిమ్మెలు కూలి, పెద్ద ఎత్తున మట్టి కుంగింది. మేమంతా భయంతో వెనక్కి పరుగెత్తుకు వచ్చాం. చేతులు, కాళ్లు, ముఖానికి చిన్న గాయాలయ్యాయి. – చమేల్ సింగ్, ప్రమాదం నుంచి బయటపడిన ఫోర్మెన్ ఏం జరుగుతోందో అర్థం కాలేదు శనివారం ఉదయం టన్నెల్లో ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మా వాళ్లు కొందరు మెషీన్ వైపు ఉన్నా, ఏమీ చేయలేక భయంతో వెనక్కి వచ్చాం. వాళ్లు మట్టి, బురదలో మునిగారు. ప్రాణాలతో బయటికి వస్తారో, లేదో తెలియదు. – ఎడుమలై, ప్రమాదం నుంచి బయటపడ్డ కన్వేయర్ బెల్ట్ ఫోర్మెన్ మా వాళ్ల పరిస్థితి ఏంటో తెలియదు.. టీబీఎం ముందు భాగంలో 8 మంది ఉన్నారు. మేం వెనక భాగంలో ఉన్నాం. ఒక్కసారిగా పైకప్పు కూలడంతో భయాందోళన నెలకొంది. మాతో కలసి పనిచేసే వాళ్ల పరిస్థితి ఏమిటో తెలియదు. చాలా బాధగా ఉంది. – జగదీశ్ పాండా, ప్రమాదం నుంచి బయటపడ్డ మెకానికల్ ఫోర్మెన్ -
అంతగనం ఏముంది అనుకోకండి : కోటి దిశగా దూసుకుపోతోంది!
సోషల్ మీడియాలో ఏది సంచలనంగా మారుతుందో.. ఏది వైరల్గా మారుతుంది ఊహించలేం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.నైజీరియాకు కెందిన వైవన్నే అనే యూజర్ ఒక వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ది బ్యూటిఫుల్ రెస్క్యూ టీం అనే క్యాప్షన్తో పోస్ట్ అయిన ఈ వీడియో నెటిజనులకు బాగా నచ్చేసింది. రీట్వీట్లు, లైక్ల వర్షం కురుస్తోంది. సూపర్.. క్యూట్ అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఇది 90 లక్షలకు పైగా వ్యూస్ను దక్కించుకుంది.ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే...మీరే చూసేయండి!That was a beautiful rescue team😁🥰 pic.twitter.com/75AZNcFi64— Yvonne (@Yummy_yvy) November 24, 2024 -
ఆ నలుగురు.. సొరంగం రెస్క్యూ ఆపరేషన్లో కీలక పాత్ర వీరిదే..
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు. నవంబర్ 12న టన్నెల్ కూలిపోయి లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేసింది. చివరకు ర్యాట్-హోల్ పద్ధతిలో డ్రిల్లింగ్ చేసి కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సొరంగం లోపల కార్మికులు చిక్కుకున్న చోటకు పైప్లైన్ ఏర్పాటు చేసి ఆహారం, ఇతర అత్యవసర వస్తువులు పంపించడంతో వారు ఇన్ని రోజులు సజీవంగా ఉండగలిగారు. సహాయక చర్యల్లో దేశ విదేశాల నిపుణులు సైతం పాలుపంచుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన నేపథ్యంలో ఇందులో కీలకంగా పాత్ర వహించిన నలుగురి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సభ్యుడు, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఎంఏ పాత్రను పర్యవేక్షిస్తున్నారు. ఈయన శ్రీనగర్లోని భారత సైన్యం జీవోసీ 15 కార్ప్స్లో మాజీ సభ్యుడు. 2018 జూలై 13న అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్శిటీకి ఛాన్సలర్గా లెఫ్టినెంట్ జనరల్ హస్నైన్ను నియమించారు. మైక్రో టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్ నవంబర్ 19న ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ప్రయత్నాల్లో చేరిన మెల్బోర్న్కు చెందిన చార్టర్డ్ ఇంజనీర్ క్రిస్ కూపర్స్ మైక్రో టన్నెలింగ్ స్పెషలిస్ట్. తన దశాబ్దాల అనుభవంలో ఆయన మెట్రో సొరంగాలు, పెద్ద గుహలు, ఆనకట్టలు, రైల్వేలు, మైనింగ్ వంటి ప్రాజెక్టులలో పనిచేశారు. కూపర్ రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టుకు అంతర్జాతీయ సలహాదారుగా కూడా ఉన్నారు. ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న పలు కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్ను నోడల్ అధికారిగా సీఎం ధామి నవంబర్ 18న నియమించారు. గత పది రోజులుగా ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వాటి గురించి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయాలకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఆయన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ ఆస్ట్రేలియాకు చెందిన ఆర్నాల్డ్ డిక్స్ ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో సేవలందించాలని కోరడంతో నవంబర్ 20న ఆయన రంగంలోకి దిగారు. ఆయన వ్యక్తిగత వెబ్సైట్ ప్రకారం.. ఆర్నాల్డ్ బారిస్టర్, శాస్త్రవేత్త, ఇంజనీరింగ్ ప్రొఫెసర్. భూగర్భ, రవాణా మౌలిక రంగంలో నిపుణుడు. నిర్మాణ ప్రమాదాలను అంచనా వేయడం నుంచి కార్యాచరణ భద్రతా పనితీరుకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం వరకు ఆయనకు విశేష నైపుణ్యం ఉంది. -
‘కూలిన’ బతుకులు
మొయినాబాద్: నాణ్యత లోపం.. ఇంజనీర్లు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇద్దరు వలస కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంది. నిర్మాణంలో ఉన్న షెడ్ కుప్పకూలడంతో శిథిలాలకింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఫైర్ఫాక్స్ క్లబ్లో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫైర్ఫాక్స్ క్లబ్లో షెడ్ మాదిరి నిర్మాణం చేపడుతున్నారు. సుమారు 100 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తుతో ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసి నాలుగు వైపులా 40 అడుగుల ఎత్తు గోడలు నిర్మించారు. వాటిపై ఇనుప బీమ్లు పెట్టి వాటిపై ఐరన్ షీట్లు బిగించారు. షీట్లపై ఆర్సీసీ స్లాబ్ వేశారు. బీహార్, పశ్చిమబెంగాల్కు చెందిన వలస కార్మికులు కొంత కాలం క్రితం ఇక్కడికి వచ్చి కూలీ పనుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం 14 మంది కార్మికులు నిర్మాణంలో ఉన్న షెడ్లో పని చేస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పశ్చిబెంగాల్కు చెందిన బబ్లూ(35), బిహార్కు చెందిన సునీల్ (26), రాకేష్, సంజయ్, విజయ్, సంతోష్, ప్రకాష్, వికాస్కుమార్, రాజన్లు శిథిలాల కింద ఇరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీంను రప్పించారు. శిథిలాలను తొలగిస్తూ అందులో ఇరుకున్నవారిని బయటకు తీశారు. బబ్లూ, సునీల్ మృతి చెందగా.. మిగిలిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మరో ఐదు మంది ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. దీనిపై మృతుల కుటుంబాల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ ఏవీ రంగా తెలిపారు. నాణ్యతా లోపంతోనే... ఫైర్ఫాక్స్ క్లబ్లో నిర్మిస్తున్న షెడ్ నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం వల్లే కుప్పకూలిందని స్థా నికులు ఆరోపిస్తున్నారు. షెడ్ నిర్మాణం చేపట్టి ఇనుప షీట్లపై ఆర్సీసీ స్లాబ్ వేయడం వల్లే కూలిందని, షెడ్ డిజైనింగ్లో ఇంజనీర్ల నిర్లక్ష్యం ఉందని మండిపడుతున్నారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కాగా బాధితులను ఆదుకుంటామని నిర్మాణదారులు చెప్పారు. -
Rescue operation Specialist: ప్రమాదమా..? టాన్యా ఉందిగా..!
కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు... సెలవుల్లో స్నేహితులతో కలసి ట్రెక్కింగ్కు వెళ్తుంటారు చాలామంది యువతీ యువకులు. అయితే అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని ఎవరు కాపాడతారు? అందుకే అలాంటి వారికి అండగా ఉంటోంది టాన్యా. అవును, సరదాగా గడపాల్సిన వయసులో ఇతరుల ప్రాణాలను రక్షిస్తోంది టాన్యా కోలి. ఐదోఏటి నుంచే కొండలు ఎక్కడం నేర్చుకుని, టీనేజ్లోకి వచ్చినప్పటినుంచి ఏకంగా రెస్క్యూ టీమ్ను నిర్వహిస్తూ ఎంతోమందిని ఆపదల నుంచి బయటపడేసింది. పెద్ద పెద్ద్ద కొండలను అవలీలగా ఎక్కేస్తూ, మరొకరికి సాయంగా నిలబడుతూ.. నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది టాన్యా. నాసిక్కు చెందిన టాన్యా కోలి ఐదేళ్ల వయసు నుంచే పర్వతాలు ఎక్కడం నేర్చుకోవడం మొదలు పెట్టింది. టాన్యా తండ్రి దయానంద్ కోలి నాసిక్ క్లైంబర్స్ అండ్ రెస్క్యూయర్స్ అసోసియేషన్లో పనిచేస్తుండడంతో తరచూ ట్రెక్కింగ్, రెస్క్యూ అనే పదాలను తండ్రి నోట వెంట వినేది. టాన్యాకూ ట్రెక్కింగ్పైన ఆసక్తి ఏర్పడడంతో తండ్రి దగ్గర ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది. అలా ట్రెక్కర్గా మారిన టాన్యా, రెస్క్యూటీమ్ కలిసి ఎంతోమందిని ప్రమాదాల నుంచి బయటపడేస్తోంది. తండ్రి దగ్గర నేర్చుకున్న ట్రెక్కింగ్ మెళకువలతోపాటు, హిమాలయాల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడడంతోపాటు, పర్వతారోహకులకు ట్రెక్కింగ్లో శిక్షణ ఇస్తోంది టాన్యా. పర్వతాన్ని అధిరోహించేటప్పుడు జరిగే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. టాన్యా దగ్గర శిక్షణ తీసుకుంటున్నవారిలో మహారాష్ట్ర ΄ోలీసు అకాడమీ ట్రైనీలు కూడా ఉన్నారు. ప్రతిసారీ తను అందుబాటులో ఉండడం కష్టం కాబట్టి ఇతరులకు నేర్పించడం ద్వారా ప్రమాద సమయంలో వారిని వారే కాపాడుకోవడంతోపాటు, ఇతరులను కూడా కాపాడగలరు. అందుకే మరింతమందికి రెస్క్యూలో శిక్షణ ఇస్తున్నాను అని టాన్యా చెబుతోంది. ‘‘ప్రమాదంలో ఉన్నారు, కాపాడాలి అని సమాచారం తెలిస్తే వెంటనే బయలుదేరతాం. అది అర్ధరాత్రి అయినా ఫస్ట్ ఎయిడ్ కిట్తో సిద్ధంగా ఉంటాం. ట్రెకింగ్ చేసేవారిని, ప్రమాదంలో ఉన్న వ్యక్తుల్ని రక్షించడం థ్రిల్లింగ్ ఇచ్చేదే అయినప్పటికీ చాలా సవాళ్లతో కూడుకున్నది. సమస్యలు ఉన్నప్పటికీ అవతలి వారిని ప్రమాదం నుంచి కాపాడగలిగామన్న సంతృప్తి ముందు ఆ సమస్యలు, సవాళ్లు చిన్నబోవలసిందే’’ అని చెబుతోంది తాన్యా. -
భల్లూకాన్ని చూసి..బెంబేలెత్తిపోయారు..
కొత్తపల్లి (కరీంనగర్): కరీంనగర్ శివారు రేకుర్తి, సీతారాంపూర్, సూర్యనగర్ ప్రాంతాల్లో భల్లూకం హడలెత్తించింది. సుమారు 14 గంటల పాటు స్థానికులను బెంబేలెత్తించిన గుడ్డెలుగు.. ఎట్టకేలకు వరంగల్ నుంచి వచ్చిన రెస్క్యూ టీంకు పట్టుబడింది. సుమారు రెండు గంటల పాటు రెస్క్యూ టీంను ముప్పుతిప్పలు పెట్టింది. శనివారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో కుక్కతో బయటకు వెళ్లిన సూర్యనగర్ వాసికి ఎలుగు కనిపించింది. కుక్క మొరగడంతో వెనక్కి తగ్గిన ఎలుగుబంటి.. అక్కడి నుంచి రేకుర్తి వైపు వెళ్లింది. ఎస్సారెస్పీ కెనాల్ మార్గం గుండా ప్రధాన రహదారిపై సంచరిస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం వరంగల్ నుంచి వచ్చిన ఫారెస్ట్ రెస్క్యూ టీం రేకుర్తి సబ్స్టేషన్ ప్రాంతంలోని సమ్మక్క గుట్ట పొదల్లో దాగిన ఎలుగుబంటిని పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేసింది. ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే క్రమంలో టీం సభ్యుడిపైకి దూసుకొచ్చింది. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వలకు చిక్కిన ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్కు తరలించారు. కాగా, మరో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
4 గంటలు ముప్పుతిప్పలు.. రూ.21,000 రివార్డ్ ఉన్న మోస్ట్ వాంటెడ్ కోతిని..
భోపాల్: రెండు వారాల భయాందోళనల తర్వాత సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని ఎట్టకేలకు అధికారులు నిర్బంధించారు. అధికారులు, రెస్క్యూటీం, స్థానికులు నాలుగు గంటలు పాటు శ్రమించి చివరికి దాని బోనులో పెట్టగలిగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఒక కోతి జనసంచారంలో సంచరిస్తూ ఇళ్ల పైకప్పులు, కిటికీల గుమ్మాలపై కూర్చుని, అకస్మాత్తుగా ప్రజలపైకి దాడి చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో గత 15 రోజుల్లో 20 మంది స్థానికులు ఆ కోతి దాడి వల్ల గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ కోతిని పట్టుకోవడంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది చేతులెత్తేశారు. ప్రజలపై దాడి చేస్తున్న ఆ కోతిని పట్టుకోవడానికి అనేకసార్లు చేసిన ప్రయత్నించి విఫలం కావడంతో చివరికి స్థానిక అధికారులు.. కోతిని పట్టుకున్నవారికి ₹ 21,000 నగదు బహుమతిని ప్రకటించారు. చివరికి జిల్లా కలెక్టర్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఎలా పట్టుకున్నారంటే! జిల్లా కలెక్టర్ ప్రమేయంతో ఉజ్జాయినీ అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ రాజ్గఢ్కు చేరుకున్నారు. వీరితో పాటు మున్సిపాలిటీ సిబ్బంది, స్థానికులు ఇందుకు సహాయం చేశారు. ఇంతమంది సహకారంతో చివరికి.. ఆ కోతిని పట్టుకోవడానికి 4 గంటల సమయం పట్టుకోగలిగారు. డ్రోన్ సహాయంతో కోతి ఎక్కడ ఉన్నదో అన్నది గుర్తించారు. అలాగే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. దాన్ని పట్టుకుని బోనులో బంధించారు. కోతిని పట్టుకున్నందుకు దానిపై ఉన్న ఉన్న 21,000 నగదు బహుమతిని జంతు రక్షక బృందానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. చదవండి: పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే! -
సంగారెడ్డి : చిరుత చిక్కింది
-
కృష్ణానదిలో గల్లంతైన విద్యార్థుల్లో ఐదుగురి మృతదేహాలు లభ్యం
-
రాజుకు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీ
కామారెడ్డి టౌన్: గుట్టపైకెళ్లి ప్రమాదవశాత్తు బండరాళ్ల కింద ఇరుక్కుపోయి సురక్షితంగా బయటపడిన రాజు పూర్తిగా కోలుకున్నాడని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి శుక్రవారం కౌన్సెలింగ్తోపాటు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీని మానసిక వైద్య నిపుణులు, జిల్లా మెంటల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి.రమణ అందించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు వన్యప్రాణుల వేటకు వెళ్లి మాచారెడ్డి మండలం సింగరాయిపల్లి అడవిలోని ఓ గుట్టపైనున్న బండరాళ్ల కింద మంగళవారం ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. రెండ్రోజులు నరకయాతన అనుభవించాడు. సహాయక బృందం బండరాళ్లను పగులగొట్టి రాజును సురక్షితంగా బయటకు తీసి గురువారం కామారెడ్డి జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించింది. ఈ సందర్భంగా రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ కొన్నిగంటలపాటు తలకిందులుగా ఉండటం, రాళ్లు బరుసుగా ఉండటంతో కాళ్లు, చేతులు రాపిడికి గురై గాయాలయ్యాయని చెప్పాడు. తొడభాగంలో కాస్త పెద్ద గాయమైందని, ఒళ్లునొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నాడు. రాజును శనివారం డిస్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. జీవితంలో తీవ్రమైన బాధ కలిగించిన ఘటనలు, ప్రతికూల పరిస్థితుల(రేప్, పెద్ద ప్రమాదం, అగ్నిప్రమాదం)ను ఎదుర్కొన్నవారు మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని, ఆ భయంకరమైన జ్ఞాపకాల నుంచి బయటకురాలేక చాలామంది మానసికంగా కుంగిపోతుంటారని వైద్యులు తెలిపారు. సాధారణ వైద్యంతోపాటు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఇలాంటివారిని సాధారణస్థితికి తీసుకురావచ్చన్నారు. రాజుతోపాటు కుటుంబసభ్యులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రాం సామాజిక కార్యకర్త డాక్టర్ విరాహుల్ కుమార్, డ్యూటీ డాక్టర్ కాళిదాసు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడ కృష్ణానదిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు
-
‘కృష్ణా’లో గల్లంతైన ఐదుగురూ మృత్యువాత
పెనమలూరు/పటమట (విజయవాడ తూర్పు): కృష్ణానదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఐదుగురూ మృత్యువాత పడ్డారు. నిన్న రెండు మృతదేహాలు లభించగా, ఈరోజు(శనివారం) మరో మూడు మృతదేహాలు దొరికాయి. విజయవాడ పటమట ప్రాంతంలోని దర్శిపేట అంబేడ్కర్ నగర్కు చెందిన షేక్ బాజీ (15), షేక్ హుస్సేన్ (15), తోట కామేష్ (15), మద్దాల బాలు (17), ఇనకొల్లు గుణశేఖర్ (14), పిన్నింటి శ్రీను, షేక్ ఖాశిం అలీ స్నేహితులు. బాజీ, కామేష్ చదువు మానేయగా, హుస్సేన్, గుణశేఖర్ తొమ్మిదో తరగతి, బాలు ఇంటర్ చదువుతున్నారు. వీరంతా ఆడుకోవటానికి వెళ్తున్నామని ఇళ్లలో చెప్పి యనమలకుదురు వద్ద కృష్ణా నది రేవు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడ క్రికెట్ ఆడి, యనమలకుదురు పాయ నుంచి మూడున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పాతూరు ఏటిపాయ ఒడ్డుకు చేరుకున్నారు. పిన్నింటి శ్రీను తప్ప మిగిలిన ఆరుగురు నదిలో స్నానానికి దిగారు. కొద్దిసేపటికే వారంతా మునిగిపోవటం గమనించిన శ్రీను గట్టిగా అరుస్తూ స్థానికంగా ఉన్న పశువుల కాపర్లు, జాలర్లకు చెప్పటంతో వారు వెంటనే నదిలో దూకి ఖాసిం అలీను రక్షించగలిగారు. మిగిలిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పెనమలూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, రెస్కూ సిబ్బంది సాయంతో శివలింగాల గట్టు ప్రాంతంలో గాలించారు. నిన్న రెండు మృతదేహాలు వెలికి తీయగా, ఈరోజు మిగిలిన ముగ్గురు విగత జీవులయ్యారు. దాంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. దర్శిపేటలో విషాదఛాయలు ఇనకొల్లు గుణశేఖర్, తోట కామేష్ మృతిచెందడం, షేక్ హుస్సేన్, షేక్ బాజీ, మద్దాల బాలు గల్లంతవడంతో దర్శిపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక ఇంకొల్లు గుణశేఖర్, దూదేకుల హుస్సేన్, మద్దాల బాలుకు తండ్రి లేకపోవటంతో వారి తల్లులే పండ్లు, పూలవ్యాపారం చేస్తూ తమ రెక్కల కష్టంపై పిల్లల్ని సాకుతున్నారు. మృతిచెందిన పిల్లల కుటుంబాలన్నీ నిత్యం రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలే. -
కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి..
సాక్షి, కామారెడ్డి: అడవిలో షికారుకెళ్లి గుట్టల మధ్య ఇరుక్కుపోయిన రెడ్డిపేటకు చెందిన చాడ రాజు సురక్షితంగా బయటపడ్డాడు. దాదాపు 43 గంటలుగా గుహలోనే తలకిందులుగా ఉన్న రాజును.. పోలీసులు, గ్రామస్తులు 18 గంటల పాటు శ్రమించి గుహ నుంచి బయటకు తెచ్చి, ప్రాణాలు కాపాడారు. డ్రిల్లింగ్ మిషన్స్, జిలిటెన్ స్టిక్స్తో బండలను పేల్చుతూ, నాలుగు జేసీబీలతో మట్టిని బండరాళ్లను తొలగించుకుంటూ పక్కా ప్లాన్ ప్రకారం రెస్క్యూ టీమ్ ఆపరేషన్ను విజయవంతం చేసింది. రాజును అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. కాగా, రెడ్డిపేటకు చెందిన చాడ రాజు, మహేశ్లు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సింగరాయపల్లి అటవీ ప్రాంతంలోకి షికారు కెళ్లారు. ఈ క్రమంలో గుట్టపై పెద్ద బండరాళ్ల మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. మహేశ్ ఎట్టకేలకు మంగళవారం పొద్దుపోయాక బయటకు వచ్చాడు. కానీ చాడ రాజు అందులోనే చిక్కుకుపోవడంతో మహేశ్ కూడా రాత్రంతా అక్కడే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు రాజుకు మహేశ్ నీళ్లు, ఆహారం తీసుకెళ్లి ఇచ్చాడు. అప్పటికీ అతను బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ అధికారులు.. రెడ్డిపేట, సింగరాయపల్లి గ్రామస్తులతో కలిసి రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చదవండి: (షికారుకెళ్లాడు.. బండరాళ్ల మధ్య చిక్కుకుపోయాడు..) -
గర్భిణిని రక్షించేందుకు వరదలోకి దిగి.. ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతి
దహెగాం(సిర్పూర్)/శ్రీరాంపూర్: పురిటినొప్పులు పడుతున్న ఓ గర్భిణిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వెళ్లి గల్లంతైన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పెద్దవాగులో బుధవారం గ్రామస్తులను వాగు దాటించేందుకు ప్రయత్నిస్తుండగా ఇద్దరు రెస్క్యూ సిబ్బంది గల్లంతయ్యారు. వీరి కోసం రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తుండగా.. గురువారం ఉదయం మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాలు.. భారీ వర్షాలకు కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పెద్దవాగు ఉప్పొంగి దహెగాం మండలంలో పలుచోట్ల ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన నేర్పల్లి సరస్వతికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో దహెగాం పీహెచ్సీకి తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. దహెగాం, ఐనం, పెసరికుంట వద్ద పెద్దవాగు వరద కారణంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి. మధ్యాహ్నం కాగజ్నగర్ రూరల్ సీఐ నాగరాజు, స్థానికులు ట్రాక్టర్ సాయంతో దహెగాం సమీపంలో ప్రధాన రహదారిపై వరద దాటే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ మొరాయించడంలో వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న సింగరేణి రెస్క్యూ టీంకు చెందిన ఆరుగురు తిరుపతి, మధుకర్, నర్సింగ్, చిలుక సతీష్, అంబాల రాము, గణేశ్ దహెగాంకు చేరుకున్నారు. గణేశ్ బయట ఉండగా మిగిలిన ఐదుగురు, సీఐ నాగరాజు, మర్రిపల్లి గ్రామానికి చెందిన బాదవత్ తిరుపతి, జర్పుల శ్యాం, జర్పుల సతీశ్ మొత్తం తొమ్మిది మంది తాడు సాయంతో వరద నీటిలోకి దిగారు. ఒకరికొకరు రెండు మీటర్ల దూరంలో ఉంటూ దాటుతుండగా రెస్క్యూటీం సభ్యులు సీహెచ్ సతీశ్, రాము నీటిలో గల్లంతయ్యారు. మిగిలిన వారు ఒడ్డుకు చేరుకుని విషయం అధికారులకు తెలిపారు. అక్కడే ఉన్న ఆర్డీవో దత్తు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు చేరవేశారు. అదనపు కలెక్టర్ రాజేశం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు బృందాలతో గాలింపు.. విషయం తెలియగానే శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై చర్చించారు. శ్రీరాంపూర్ నుంచి మరో మూడు రెస్క్యూ బృందాలను ఘటన స్థలానికి పంపించారు. మందమర్రి, బెల్లంపల్లి నుంచి మరో రెండు బృందాలను పంపారు. పరిస్థితిని ఎప్పకటికప్పుడు అక్కడికి వెళ్లిన వారితో చర్చించారు గర్భిణి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం.. బీబ్రా గ్రామంలో ఉన్న గర్భిణి నేర్పల్లి సరస్వతిని ఆస్పత్రికి తరలించేందుకు వరంగల్ నుంచి 22 సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం దహెగాంకు చేరుకుంది. నాలుగు బోట్ల సాయంతో మెడికల్ సిబ్బంది గ్రామానికి బయలుదేరారు. గనులపై ఆందోళన.. రామకృష్ణాపూర్ రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న అంబాల రాము ఆర్కే 5 గనిలో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్పందన, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గని మేనేజర్ అబ్దుల్ ఖాదర్, సంక్షేమ అధికారి రణధీర్, టీబీజీకేఎస్ నేతలు మహేందర్రెడ్డి, నీలం సదయ్య కార్మికుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే నస్పూర్ షిర్కేలో నివాసం ఉంటున్న చిలుక సతీశ్ శ్రీరాంపూర్ ఓసీపీలో ఈపీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే ఆపరేషన్లో పాల్గొన్న రెస్క్యూ సభ్యులెవ్వరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రెస్క్యూ స్టేషన్ నుంచి వీరిని పంపిన అధికారులు జాకెట్లు ఇచ్చి పంపారా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. -
భూకంప బాధితుల రక్షణకు రెస్క్యూ ఆపరేషన్
గన్నవరం రూరల్/సాక్షి, అమరావతి: ‘అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి.. భూకంపంతో భవనం కుప్పకూలింది.. జనం హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు.. మరికొందరు శిథిలాల మధ్య చిక్కుకున్నారు. స్థానికులు వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్)కు సమాచారం అందించడంతో హుటాహుటిన రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది’.. ఏంటి ఇదంతా వాస్తవం అనుకుంటున్నారా? కాదు.. కేవలం మాక్ డ్రిల్ మాత్రమే. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను మంగళవారం ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ సందర్శించారు. అనంతరం భూకంపం సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ స్పందించే విధానం, హైరిస్క్ భవనాల్లో చిక్కుకున్న బాధితులను రెస్క్యూ రోప్ టీమ్ రక్షించే విధానాలపై ప్రదర్శన ఏర్పాటు చేయగా ఆయన వీక్షించారు. మాక్ డ్రిల్ ఇలా: మాక్ డ్రిల్లో భాగంగా.. భవనం కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు వచ్చిన రెస్క్యూ టీమ్ భవనం స్ట్రక్చరల్ ఇంజనీర్ సాయంతో గ్యాస్, కరెంట్ సరఫరాను నిలిపివేసింది. అనంతరం డాగ్ స్క్వాడ్ శిథిలాల కింద ఉన్న బాధితులను గుర్తించగా యంత్రాలతో గోడలు బద్దలుకొట్టి వారిని రక్షించింది. అనంతరం బహుళ అంతస్తుల భవనంలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రోప్ టీమ్ రంగంలోకి దిగింది. పై అంతస్తుల్లో ఉన్నవారి నడుముకు బెల్టులు అమర్చి రోప్ సహాయంతో వారిని సురక్షితంగా కిందకు చేర్చింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. బెటాలియన్ కమాండెంట్ జాహిద్ ఖాన్, డిప్యూటీ కమాండెంట్లు జఫరిల్ ఇస్లాం, దిల్భాగ్ సింగ్, సుఖేందు దత్త, అఖిలేష్ చౌబే ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్లు నిర్వహించారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం.. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు సత్వరం సహాయ చర్యలు చేపట్టేందుకు దేశంలో 26 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు 12 ఉండగా వాటిని 16కు పెంచాం. విపత్తుల సమయంలో ప్రాణనష్టం లేకుండా చూసేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో శిక్షణను బెటాలియన్లలో అందిస్తున్నాం. భవిష్యత్ సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం. – అతుల్ కర్వాల్, డీజీ, ఎన్డీఆర్ఎఫ్ -
64 మందిని కాపాడిన సహాయక బృందాలు
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, అగ్నిమాపక బృందాలు నాలుగు జిల్లాల్లో వరదల్లో చిక్కుకుపోయిన 64 మందిని రక్షించారు. వైఎస్సార్ జిల్లాలో పాపాగ్ని నది వరదలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని రోప్ల సాయంతో కాపాడారు. హేమాద్రిపురంలో ఒక సీఐ సహా ఏడుగురిని రక్షించారు. పాపాగ్ని నదికి గండి పడడంతో కొట్టుకుపోతున్న ముగ్గురు వ్యక్తులు, 15 పశువులను ఫైర్ సిబ్బంది కాపాడారు. కడప నగరంలో బుగ్గవంక వరద నీటితో నిండిపోయిన ఒక ఇంటి నుంచి గర్భిణిని రక్షించారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతిలో చిక్కుకుపోయిన పది మందిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించారు. వైఎస్సార్ జిల్లా చెయ్యూరులో వరద నీటిలో ప్రమాదకరంగా చిక్కుకుపోయిన మూడు ఆర్టీసీ బస్సుల నుంచి 35 మందిని రక్షించారు. 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎయిర్ ఫోర్స్, ఫైర్ సర్వీస్ బృందాలు సహాయక చర్యల్లో ప్రాణాలకు తెగించి పాల్గొన్నాయి. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో జల దిగ్భంధమైన వారిని రక్షించేందుకు రెండు హెలికాఫ్టర్లను ఉపయోగించారు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 243 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 20,923 మందిని అక్కడికి తరలించారు. వారికి ఆహారంతోపాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. వరద సహాయక చర్యల్లో తూర్పు నౌకాదళం వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యల్లో తూర్పు నౌకాదళానికి చెందిన బృందాలు నిమగ్నమయ్యాయి. ఐఎన్ఎస్ డేగా నుంచి ఒక సీకింగ్ హెలికాఫ్టర్లో నౌకాదళ బృందం బయలుదేరి కడప జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. వరదల్లో చిక్కుకున్న అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతం, నందలూరు ప్రాంత ప్రజలకు 6,600 ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, 3,600 కిలోల రిలీఫ్ మెటీరియల్ను అందించారు. ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, పూర్తి సమాచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. కాగా వరదలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో కోస్టుగార్డు బృందాలు చురుగ్గా పాల్గొన్నాయి. చిత్తూరు జిల్లాలో 16 సెం.మీ సగటు వర్షం నాలుగు రోజులుగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సగటున 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లాలో 14.4 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లాలో 12.6, అనంతపురం జిల్లాలో 11.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా 24 మంది మృత్యువాతపడ్డారు. 17 మంది గల్లంతయ్యారు. 1,532 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. 121 చోట్ల రోడ్లకు గండ్లు పడగా, 525 చోట్ల రోడ్లపై వరద నీరు ప్రవహించింది. 541 చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. 380 చోట్ల చిన్న నీటి వనరులు దెబ్బతిన్నాయి. 33 కేవీ ఫీడర్లు 85, 33 కేవీ స్తంభాలు 137, 11 కేవీ స్తంభాలు 1307, ఎల్టీ స్తంభాలు 1753, 11 కేవీ ఫీడర్లు 592, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 82 దెబ్బతిన్నాయి. 33 పంచాయతీ రోడ్లు 121 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. తక్షణ అవసరాల కోసం నాలుగు జిల్లాలకు రూ.7 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కలెక్టరేట్లలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్, ఇతర సౌకర్యాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సహాయక శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. -
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఐదుగురు మృతి
సాక్షి, అనంతపురం: కదిరిలో విషాదం చోటుచేసుకుంది. పాత చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్నమూడంతస్తుల భవనం.. పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం మీద పడింది. ఈ ఘటన జరిగినప్పుడు బిల్డింగ్లో 15 మంది ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెంటనే నలుగురు వ్యక్తులు బిల్డింగ్నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఇప్పటికి బిల్డింగ్లో చిక్కుకున్న కొందరు బాధితులతో.. ఫోన్లో మాట్లాడుతున్నారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కుండపోత వర్షం కారణంగానే భవనం దెబ్బతిని.. ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో.. గాయపడిన వారికి ఎమ్మెల్యే డా . సిద్ధారెడ్డి స్వయంగా వైద్యం అందించారు. -
రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!
బ్రిటన్: మనం ఎక్కడైన అడవిలోనో లేక ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో చిక్కుకుపోయి, ఆఖరికి మొబైల్ ఫోన్లు పనిచేయనపప్పుడూ అది అత్యంత భయంకరంగా అనిపిస్తుంది. జనసంచారం లేని ఒక గుహలో రెండు రోజులుగా అది కూడా గాలి, వెలుతురు లేని ప్రదేశంలో అలా పడి ఉంటే ఎవ్వరికైన పై ప్రాణాలు పైకి పోతాయి. కానీ అతని కోసం 240 మంది సహాయ సిబ్బంది వచ్చి తక్షణ సహాయ చర్యలు చేపట్టి అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. అసలు ఎక్కడ ఏం జరిగిందే చూద్దాం రండి. (చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!) అసలు విషయంలోకెళ్లితే....యూకేలో ఒక వ్యక్తి బ్రెకాన్ బీకాన్స్లోని గుహ వ్యవస్థల గురించి అధ్యయనం చేసే పరిశోధకుడు. అనుకోకుండా 50 అడుగుల లోతులో పడిపోతాడు. దీంతో అతని ఎముకలు చాలా వరకు విరిగిపోతాయి. దీంతో అతన్ని రక్షించడం కోసం దాదాపు 240 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇందులో యూకేకి చెందిన ఎనిమిది కేవ్ రెస్క్యూ బృందాలు కూడా ఉన్నాయి. సుమారు 54 గంటల తర్వాత అతను గుహ నుండి విజయవంతంగా బయటపడ్డాడు. ఇది వెల్ష్ కేవింగ్ చరిత్రలో సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ నిలిచింది. ఆ తర్వాత సదురు వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. (చదవండి: వర్క్ ఫ్రం హోం: ఎక్స్ ట్రా వర్క్కి చెక్ పెట్టేలా కొత్త చట్టం) -
Snake: ఐదు అడుగుల నాగుపాము పట్టివేత
సాక్షి, నవీపేట(నిజామాబాద్): మండలంలోని నాళేశ్వర్ గ్రామ శివారులో గత రెండు రోజులుగా రైతులను భయపెడుతున్న ఐదు అడుగుల నాగుపాము ఆదివారం దొరికింది. గ్రామానికి చెందిన పోశెట్టి అనే రైతు పొలంలో రెండు రోజుల కిందట కనిపించిన నాగుపాము పలువురిని భయాందోళనకు గురి చేసింది. రైతులు అటువైపుగా వెళ్లేందుకు భయపడ్డారు. ఆదివారం మళ్లీ ఆ పాము కనిపించడంతో నందిపేటకు చెందిన సర్వార్ఖాన్ పాములు పట్టడంలో దిట్ట అతనికి సమాచారమిచ్చారు. ఆయన తన చాతుర్యంతో పామును పట్టేశాడు. పట్టుకున్న పామును అటవీశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: మిస్టర్ తెలంగాణగా ఎంపికైన సింగరేణి బిడ్డ -
ఐదు గంటలు.. హైరిస్క్ ఆపరేషన్: 16 మంది సురక్షితం
మంథని: ఓ వైపు గోదావరి ఉగ్ర రూపం.. ఇంటి పెద్ద చనిపోవడంతో ఆలయ నిద్ర కోసం వచ్చిన కొందరు.. పడవలు కొట్టుకుపోకుండా ఒడ్డుకు చేర్చేందుకు వచ్చిన జాలర్లు మరికొందరు.. కాసేపటికే ఒక్కసారిగా పెరిగిన వరద.. ఎటు చూసినా నీళ్లే.. ప్రాణాలు అరచేత పట్టుకుని రాత్రంతా గడిపారు.. పొద్దున్నే వారిని రక్షించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. ఏమవుతుందోననే ఆందోళన పెరిగి పోయింది. ఐదు గంటలు కష్టపడ్డ అధికారులు చివరికి వారిని ఒడ్డుకు చేర్చారు. పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వర ఆలయం వద్ద జరిగిన ఘటన ఇది. ప్రమాదకర పరిస్థితుల్లో.. మంథని మండలం కాకర్లపల్లికి చెందిన బొపెల్లి శంకరమ్మ భర్త ఈ నెల 12న చనిపోయాడు. పెద్దకర్మ అనంతరం ఆలయం వద్ద నిద్ర చేసేందుకని.. ఆమె తన ఇద్దరు కూతుళ్లు, మరో నలుగురితో కలిసి గురువారం రాత్రి 11 గంటలకు గౌతమేశ్వర ఆలయానికి వచ్చారు. అర్ధరాత్రి సమ యానికి వరద పెరిగిపోవడంతో అక్కడే చిక్కుకు పోయారు. ఒడ్డుకు చేర్చేందుకు వచ్చిన విలోచవరం గ్రామ జాలర్లు 9 మంది.. ఆలయం సమీపంలో నివాసం ఉండే రెండు కుటుంబాలకు చెందిన 15 మంది కూడా వరదలో ఉండిపోయారు. మంథని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నారు. తాళ్లతో బాధితులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా సఫలం కాలేదు. సింగరేణి రెస్క్యూ టీం 9:30కు అక్కడికి చేరుకుని ట్యూబ్ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించింది. కానీ ప్రవాహం వేగంగా ఉండటంతో 50 మీటర్లు ముందుకెళ్లగానే.. ట్యూబ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడి, వెనక్కి వచ్చేశారు. చివరకు బోట్ తెప్పించి కాకర్లపల్లికి చెందిన ఏడుగురిని, తర్వాత 9 మంది జాలర్లను ఒడ్డుకు చేర్చారు. ఆలయం సమీపంలో ఉండే 15 మంది బయటికి రావడానికి నిరాకరించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడటానికి వచ్చిన సింగరేణి రెస్క్యూ టీం పుస్తకాల కోసం వచ్చి.. వాంకిడి (ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫా బాద్ జిల్లా వాంకిడి మండలం కనర్గాం, భీంపూర్ గ్రామాలకు చెందిన 20 మంది పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 17 మంది పాఠ్యపుస్తకాలు తీసుకొనేందుకు గురువారం వాంకిడిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలకు వచ్చా రు. పుస్తకాలు తీసుకుని మూడు ఆటోల్లో తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే దుబ్బగూడ గ్రామశివార్లలో రెండు వాగుల్లో ప్రవాహం పెరి గింది. కష్టం మీద ఒక వాగును దాటారు. మరో వాగు వద్దకు వెళ్లేసరికే వరద ఉధృతి ఎక్కువై.. అక్కడే ఆగిపోయారు. సెల్ఫోన్ సిగ్నల్స్ అందని పరిస్థితి. రాత్రి 12 గంటల సమయంలో ఓ ఆటోడ్రైవర్కు సెల్ఫోన్ సిగ్నల్ అందడంతో.. కమానా గ్రామ ఎంపీటీసీకి ఫోన్ చేసి చెప్పాడు. చివరకు పోలీసులు రాత్రి 2 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. -
భైంసాలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, భైంసాటౌన్(నిర్మల్): గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదలడంతో దిగువన ఉన్న ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది. ఎగువప్రాంతాల్లో నుంచి భారీ ఇన్ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో ఆటోనగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. భట్టిగల్లి పాక్షిక భాగం, వినాయక్నగర్, రాహుల్నగర్ వెనుకభాగం, గోకుల్నగర్ ప్రాంతాల్లోకి వరదనీరు చొచ్చుకువచ్చింది. ఆటోనగర్ ప్రాంతంలోని సామిల్లో బిహార్, మధ్యప్రదేశ్కు చెందిన కూలీలు వరదనీటిలో చిక్కుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు రెస్క్యూబృందాలతో సహాయక చర్యలు చేపట్టి వరదనీటిలో చిక్కుకున్న దాదాపు 150 మంది ప్రజలు, ఎన్ఆర్ గార్డెన్లో బస చేస్తున్న మరో 14 మందిని పోలీసులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రాహుల్నగర్ ప్రాంతంలో సైతం వాననీటికి ప్రధానకాల్వ పొంగి ప్రవహించింది. బస్డిపో ప్రాంతంలోని వైకుంఠధామం పూర్తిగా నీట మునిగింది. భట్టిగల్లిలోని హనుమాన్ పెద్ద విగ్రహం వరకు నీరు చేరింది. ఎమ్మెల్యే విఠల్రెడ్డి, అదనపు కలెక్టర్ హేమంత్బోర్కడే, ఎస్పీ ప్రవీణ్కుమార్, ఏఎస్పీ కిరణ్ఖారె, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తాజ్మహల్ వద్ద పైథాన్ హల్చల్
న్యూఢిల్లీ: సాధారణంగా తాజ్మహల్ సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. మంగళవారం అనుకోని అతిధిలా ఓ పైథాన్ వచ్చేసి హల్చల్ చేసింది. తన రాకతో అక్కడి స్థానికులను, తాజ్మహల్ సిబ్బందిని కాసింత భయభ్రాంతులకు గురి చేసింది. వెస్ట్ గేట్ వద్ద ఉన్న పర్యాటక పోలీసు అధికారుల టికెట్ కౌంటర్ వద్ద 5 అడుగుల పొడవైన ఇండియన్ రాక్ పైథాన్ను చూసి జనం షాకయ్యారు. వారు వెంటనే స్పందించి సమీపంలోని వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ టీంకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం ఆ పాముని చాకచక్యంగా పట్టుకున్నారు. పైథాన్ను కొన్ని గంటల పాటు పరిశీలనలో ఉంచి, ఆ తరువాత పక్కనే ఉన్న అడవిలోకి విడిచి పెట్టారు. వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ను సమాచారం అందించిన టూరిజం పోలీస్ కానిస్టేబుల్ విద్యాభూషణ్ సింగ్ మాట్లాడుతూ.. పైథాన్ను టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నట్లు మొదట స్థానిక పర్యాటకులు గుర్తించారు. వెంటనే ఆ పరిసర ప్రాంతాలల్లో ప్రజలను అప్రమత్తం చేసి , అటు పక్క ఎవరు రాకుండా చూశాము. ఈ లోగా ఎస్ఓఎస్ రెస్క్యూ టీం రావడంతో పాముని పట్టుకోగలిగామని అన్నారు. వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ సహ వ్యవస్థాపకుడు ,సిఇఒ కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ..పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి సరైన సమయంలో వైల్డ్ లైఫ్ రక్షణ టీం కు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే పాములు చాలా సున్నితమైన ప్రాణులు, జాగ్రత్తగా వ్యవహరించకుండా ఉంటే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ( చదవండి: రిపోర్టర్ మైక్ లాక్కొని కుక్క పరుగో పరుగు..చివరికి ) -
క్రాష్ టెస్ట్: వోల్వో సంచలన నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 10 కార్లను 30 మీటర్ల ఎత్తునుంచి పడవేసి మరీ క్రాష్ టెస్ట్ నిర్వహించింది. అత్యున్నత ప్రమాణాలను సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా తొలిసారి పలు మోడళ్ల కొత్త కార్లను క్రేన్ల సాయంతో 30 మీటర్ల ఎత్తునుంచి కిందికి తోసివేసింది. తద్వారా ప్రమాదాల్లో కారులోపల ఉన్నవారి పరిస్థితిని అంచనా వేయడం, రక్షణ చర్యల్లో రెస్క్యూ సిబ్బందికి సూచనలు సలహాలు ఇవ్వనుంది. సాధారణంగా 20ఏళ్ల నాటి కార్లపై చేసే ప్రయోగాలను కొత్త కార్లతో చేయడం విశేషం. ఘోర ప్రమాదాల్లో లోపల ఉన్నవారి పరిస్థితి విషమంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ ఉపయోగించి వారిని వెలికి తీసి, వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించడంలాంటి అంశాలను పరిశీలించింది. తద్వారా వారి ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ భావిస్తోంది. రక్షణ సిబ్బంది నిరంతరం అప్డేట్ కావడం, కొత్త ఎక్స్ట్రికేషన్ టెక్నిక్లను అభివృద్ధి, సమీక్ష కీలకమని సంస్థ భావిస్తోంది. తీవ్రమైన ప్రమాదాల తర్వాత ప్రజలను వెలికితీసే కొత్త పద్ధతులను అవలంబించేలా అత్యవసర రక్షణ సిబ్బంది సహాయం చేయాలనుకుంటున్నాం. ఇందుకు సాధారణ క్రాష్ పరీక్షలు సరిపోవు. అందుకే కొంచెం విపరీతంగా ఆలోచించాల్సి వచ్చిందని వోల్వో తెలిపింది. అతివేగంతో కార్లు ప్రమాదానికి గురి కావడం, ఈ ఘోర ప్రమాదాల్లో కార్లు దెబ్బతినడం, కార్లలో ఇరుక్కుపోయిన వారిని రక్షించడం తదితర కీలక అంశాలపై నివేదికను రూపొందించడంతో పాటు, ఈ ఇంటెన్సివ్ అనాలిసిస్ రిపోర్టును సహాయక బృందాలకు ఉచితంగా అందిస్తుంది. రెస్క్యూ ప్రొవైడర్ల అభ్యర్థన మేరకు ఈ క్రాష్ టెస్ట్ చేసినట్టు వోల్వో వెల్లడించింది. ఫలితాల నుండి నేర్చుకోవడానికి, ప్రయాణీకుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను అదనంగా అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. We wanted to help our Emergency Services develop new methods of extracting people after severe accidents, but our regular crash tests weren't enough. So, we had to think of something a little more extreme.... #ForEveryonesSafety pic.twitter.com/fMGF1A4HtU — Volvo Car UK (@VolvoCarUK) November 13, 2020 -
12 గంటలు ప్రాణాలు అరచేతిలో..
బషీరాబాద్(వికారాబాద్): భారీ వర్షాలకు కాగ్నా నది ఉప్పొంగడంతో చిక్కుకుపోయిన 15 మంది ఏపీ కూలీలను ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం క్షేమంగా బయటకు తీసుకొచ్చిన సంఘటన బుధవారం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులోని జెట్టూరు వద్ద చోటుచేసుకుంది. స్థాని క పోలీసులు, కర్ణాటక అధికారులు తెలిపిన వివ రాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు, ఆత్మకూరుకు చెం దిన మూడు కుటుంబాలు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బషీరాబాద్–కర్ణాటకలోని జెట్టూరు మం డలం క్యాద్గిర సమీపంలోని కాగ్నా నది ఒడ్డున ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో కూలి పనులకు వచ్చారు. వీరు ఇక్కడే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం ఉదయం 7గంటల ప్రాంతంలో వీరు నివసిస్తున్న గుడిసెల్లోకి వరద నీరు చేరింది. దీంతో అల్కయ్య, పద్మ, సురేశ్, కుమారి, వెంగమ్మ, మేరీ, అభిరామ్, రమణయ్య, తేజ, వెంకటరమణమ్మ, ఏడుకొండలు, కల్పన, సువర్ణ, అభి.. పక్కనే నిర్మాణంలో ఉన్న కాగ్నా బ్రిడ్జిపైకి ఎక్కారు. అయితే నది ఉద్ధృత రూపం దాల్చడంతో పాటు, కర్ణాటక నుంచి వచ్చే మళ్లమర్రి నదుల సంగమం వద్ద ప్రవాహం పోటెత్తడంతో వీరు నిలబడిన వంతెన చుట్టూ కిలోమీటర్ మేర వరద చుట్టేసింది. విషయాన్ని కూలీలు తమను పనులకు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ సుబ్బారావుకు ఫోన్ ద్వారా చేరవేశారు. ఉదయం నుంచి రాత్రి 7వరకు సుమారు 12 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూశారు. కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో బషీరాబాద్, సులైపేట్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. వారు రెండు బోట్లలో నదిలోకి వెళ్లి వంతెనపై ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాధితులకు గ్రామంలోని పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. -
విషాదం: పిల్లల కోసం తండ్రి జలసమాధి
లండన్: సహజంగా పిల్లలంటే తల్లికే ఎక్కువ ప్రేమంటారు. కానీ ఆ తండ్రికి మాత్రం పిల్లలంటే చచ్చేంత ప్రేమ. ఇంగ్లండ్లోని బ్రాడ్మౌత్లో ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్న 36 ఏళ్ల జొనాథన్ జాఫ్ స్టీవెన్స్ సోమవారం పిల్లలను తీసుకొని బయటకు వెళ్లాలనుకున్నారు. 12 ఏళ్ల లాసీ, 11 ఏళ్ల లారెన్, 10 ఏళ్ల జాక్ను తీసుకొని సమీపంలోని బార్మౌత్ సముద్ర తీరానికి వెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నం పిల్లలు సముద్ర కెరటాలకు సరదాగా గంతులేస్తుండగా ఓ చోట నీటి ఒరవడి ఎక్కువగా ఉండి పిల్లలను సముద్రంలోకి లాగేసింది. వెంటనే అప్రమత్తమైన స్టీవెన్స్ ప్రాణాలకు తెగించి ఒక్కొక్కరి చొప్పున ముగ్గురు పిల్లలను కాపాడి ఒడ్డుకు చేర్చగలిగారు. అప్పటికే నీటికి ఎదురీదలేగ అలసిపోయి ఆయాస పడుతున్న స్టీవెన్స్ కడసారి వీడ్కోలు అన్నట్లుగా ముగ్గురు పిల్లలవైపు చూస్తూ ఓ చిరునవ్వుతో నీటిలో మునిగిపోయారు. ప్రమాదాన్ని ఊహించిన 11 ఏళ్ల లారెన్ ‘లైవ్ గార్డ్స్’ వద్దకు పరుగెత్తికెళ్లి తన తండ్రిని రక్షించాలంటూ వేడుకుంది. వారు పరుగెత్తుకొచ్చి సముద్రంలోకి దూకారు. మరోవైపు నుంచి రిస్క్యూ బోటు కూడా వచ్చింది. కొన ఊపిరితో ఉన్న స్టీవెన్స్ను పట్టుకొని రెస్క్యూ బోటులో ఒడ్డుకు తరలించారు. అప్పటికి స్పహతప్పిన స్టీవెన్స్కు గుండెపై ఒత్తిడి తీసుకరావడం (సీపీఆర్) ద్వారా రక్షించేందుకు ప్రయత్నించారు. దాంతో లాభం లేకపోవడంతో అక్కడికి చేరుకున్న రెస్క్యూ హెలికాప్టర్లో స్టీవెన్స్ను బ్యాంగర్లోని గ్యానెడ్ హాస్పిటల్కు హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. తమ తండ్రి నిజంగా హీరోనని, తమ ముగ్గురు ప్రాణాలను రక్షించారని ఆయన చనిపోవడం తట్టుకోలేక పోతున్నామని 12 ఏళ్ల కూతురు లాసీ మీడియాతో వ్యాఖ్యానించగా, ‘తాను మునిగిపోతూ మమ్మల్ని కాపాడగలిగానన్న తప్తితో చివరిసారిగా చిద్విలాసంగా మావైపు చూస్తూ మా నాన్న నవ్వడాన్ని నేనెప్పటికీ మరచిపోలేను’ అని లారెన్ వ్యాఖ్యానించింది. నెల రోజుల క్రితమే స్టీవెన్స్తో విడిపోయిన ఆయన భార్య లారా బర్ఫోర్డ్, అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలోని ష్రాప్షైర్లో తన చిన్న కుమారుడితో ఉంటున్నారు. పిల్లలు, స్టీవెన్స్ ప్రమాదానికి గురైన చోట నీటి ఒరవడి ఎక్కువగా ఉందని తెల్సిందని, అక్కడ ప్రమాద హెచ్చరికలు ఎందుకు ఏర్పాటు చేయలేదని లారా బీచ్ అధికారులను ప్రశ్నించారు. -
అధికారులకు చుక్కలు చూపించిన చిరుత
సూరత్ : లాక్డౌన్ నేపథ్యంలో అడవిలో ఉండాల్సిన జంతువులు ఆహార అన్వేషణలో జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా గుజరాత్లోని దాహోడ్ ప్రాంతంలో శనివారం ఒక చిరుతపులి హల్చల్ చేసింది. మొదట ఒక ఇంట్లోకి దూరిన చిరుత కారు పక్కన నక్కి కూర్చుంది. కొద్దిసేపటికి ఇంటి యజమాని కారును తీద్దామని దగ్గరకు వచ్చి చూస్తే చిరుతపులి ఉన్నట్లు గుర్తించి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దీంతో వెంటనే యానిమల్ రెస్య్కూ ఆపరేషన్ టీమ్కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఆపరేషన్ రెస్క్యూ టీమ్ అక్కడిని చేరుకొని చిరుతను బంధించడానికి నానా ప్రయత్నాలు చేశారు. అయితే చిరుత అధికారులకు చిక్కకుండా ఇళ్లలోని గోడలు దూకుతూ స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అయితే పులిని పట్టుకునేందుకు పన్నిన వలను కూడా చేధించి అక్కడి నుంచి పరుగులు తీసింది. చివరకు ఎలాగోలా పోలీసుల సాయంతో చిరుతకు మత్తు మందు ఇచ్చిన అధికారులు దానిని బంధించి అక్కడినుంచి తీసుకెళ్లారు. చిరుతను పట్టుకునే క్రమంలో ఐదుగురు అధికారులకు తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆవు చనిపోయిందని రోడ్ల పైకి జనం క్వారంటైన్లో కోడికూర ఇవ్వలేదని.. -
ఐస్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్
మలికిపురం: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని వెంకటేశ్వర ఐస్ ఫ్యాక్టరీ నుంచి అమ్మోనియా గ్యాస్ భారీగా లీకయింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఓఎన్జీసీ రెస్క్యూ టీం సహకారంతో కొద్ది సేపట్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఫ్యాక్టరీ లోంచి గ్యాస్ లీక్ కాగానే ఫ్యాక్టరీలోని సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్యాస్ కమ్ముకోవడంతో జనం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తహసీల్దారు నరసింహరావు, ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్లకు దూరంగా పంపించారు. ఓఎన్జీసీ రెస్క్యూ టీం సహకారంతో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పెనుముప్పును నివారించారు. రాత్రి 9.30 గంటలకు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. -
అదుపులోకి రాని గ్యాస్ లీక్
-
అదుపులోకి రాని గ్యాస్ బ్లో అవుట్
ఉప్పూడి నుంచి సాక్షి ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి వద్ద గ్యాస్ బ్లో అవుట్ను అదుపు చేసేందుకు సోమవారం ఓఎన్జీసీ రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బావిలోని గ్యాస్ నిట్టనిలువుగా మూడు కిలోమీటర్ల మేర సిమెంట్ కేసింగ్ కిందకు తన్నుకుని, అదే ఒత్తిడితో బయటకు ఎగదన్నుతోంది. దీనివల్ల వెల్క్యాప్ ఎక్కడ ఉందన్న అంచనాకు రాలేకపోతున్నారు. వెల్క్యాప్ను గుర్తించగలిగితే గ్యాస్ ఒత్తిడి అదుపులోకి వచ్చిన మరుక్షణం ఆ వెల్క్యాప్ను మూసేయడం సులువవుతుందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. ఇందుకు రెండు పద్ధతులు అనుసరించాలని రెస్క్యూ టీమ్ నిర్ణయించుకుంది. ప్లాన్–ఏ ప్రకారం నీటిని పంపింగ్ చేస్తూ గ్యాస్ ఒత్తిడిని తగ్గించి బావిని నియంత్రణలోకి తేవాలనుకుంది. దీనికి అనుగుణంగా ఉదయం నుంచి రాత్రి వరకూ నీటిని పంపింగ్ చేశారు. ప్రయోజనం లేకపోవడంతో ప్లాన్–బి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రసాయనాలతో కూడిన 40 వేల లీటర్ల మడ్ను సిద్ధం చేశారు. మరో 40 వేల లీటర్ల మడ్ను అందుబాటులో ఉంచారు. దీనిని పంపింగ్ చేసే ప్రక్రియ మంగళవారం చేపడతారు. ఆపరేషన్–బి ప్రారంభించిన రెండు గంటల్లోనే గ్యాస్ను నియంత్రించవచ్చని ఓఎన్జీసీ జీఎం ఆదేశ్కుమార్ చెప్పారు. రెండురోజు కూడా గ్యాస్ అదుపులోకి రాకపోవడంతో పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులు ఆందోళన చెందుతున్నారు. మనోధైర్యం కల్పించండి : సీఎం వైఎస్ జగన్ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్తో రెండు పర్యాయాలు మాట్లాడారు. ఉప్పూడి గ్రామస్తులకు చెయ్యేరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని గ్రామస్తులకు మనోధైర్యాన్ని కలిగించాలని సీఎం ఆదేశించారు. మంత్రులు ఘటనా స్థలంలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షించారు. -
గనిలో చిక్కుకున్న రెస్క్యూ బ్రిగేడియర్లు
గోదావరిఖని/రామగిరి: సమస్య పరిశీలించేందుకు బొగ్గు గనిలోకి వెళ్లి ఆరుగురు రెస్క్యూ బ్రిగేడియర్లు ఆపదలో చిక్కుకున్నారు. సింగరే ణి సంస్థ పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పరిధిలోని ఏఎల్పీ గనిలో గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు గనిలోని మూసివేసిన సీమ్లను పరిశీలించేందుకు ఆర్జీ–2 ఏరియాలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్కు చెందిన రెస్క్యూ సూపరింటెండెంట్ సలీం ఆధ్వర్యంలో 22 మంది గనిపైకి చేరుకున్నారు. మూడు బృందాలుగా వెళ్లి గనిలోని మూసివేసిన ప్యానళ్ల పరిస్థితి తెలుసుకునేందుకు గనిలోని 80వ ప్యానల్కు ఆరుగురు బృందం గల ఒక టీం, మరో ఇద్దరు స్టాండ్బైగా వెళ్లారు. 80వ ప్యానల్లోని ఎల్సీ–6 వద్ద పరిస్థితి సమీక్షించేందుకు టీం కెప్టెన్ మోహన్ ఆధ్వర్యంలో ఆరుగురు బ్రిగేడియర్లు వెళ్లారు. పరిశీలించిన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో జంక్షన్ వద్ద టీం కెప్టెన్ మోమన్ అదుపు తప్పి మూడు మీటర్ల లోతులో పడిపోయాడు. గమనించిన మిగతా బ్రిగేడియర్లు ఆయనను కాపాడే ప్రయత్నం ఫలించ లేదు. పైకి రావాలని పలుమార్లు ప్రయత్నించి మోహన్ అస్వస్థతకు గురయ్యాడు. ఇద్దరి పరిస్థితి విషమం.. రెస్క్యూ టీం మేనేజర్ మోహన్ ఆధ్వర్యంలో బ్రిగేడియర్లు దిలీప్, నవాబ్, మధుసూదన్రెడ్డి, అజయ్రాఘవ, నాగేశ్వర్రావులు టీం సభ్యులుగా మూసివేసిన పని స్థలాల్లోని గోడలను పరిశీలించడానికి వెళ్లారు. అయితే వీరిలో మూడు మీటర్ల లోతులో పడిపోయిన మోహన్ తీవ్ర అస్వస్థతకు గురికాగా, అతడిని కాపాడే ప్రయత్నంలో కొద్ది దూరం భుజాలపై మోసిన దిలీప్ (రెస్క్యూ బెస్ట్ కెప్టన్) పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. సింగరేణి ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం టీం కెప్టెన్ మోహన్ను కరీంనగర్ ఆస్పత్రికి, దిలీప్ను హైదరాబాద్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. స్వల్ప అస్వస్థతకు గురైన నవాబ్, మధుసూదన్రెడ్డి, అజయ్రాఘవ, నాగేశ్వర్రావుకు స్థానికంగా చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్జీ–1, 2, 3 జీఎంలు కె.నారాయణ, ఎం.సురేశ్, సూర్యనారాయణలు హుటాహుటిన సింగరేణి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి బాధితులను పరామర్శించి సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. -
చాలా బాధనిపించింది..
-
పునరావృతం కారాదు
భర్తను, 12 ఏళ్ల బిడ్డను పోగొట్టుకుని తానెందుకు బతికి ఉన్నానో తెలియడం లేదని ఒక మహిళ పడుతున్న బాధను చూసినప్పుడు మనసు కలచివేసింది. భవిష్యత్లో మరో కుటుంబానికి ఈ కడుపుకోత రాకూడదు అనిపించింది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధుల బృందం, రాజమహేంద్రవరం: ‘భవిష్యత్లో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదు. ఎవరింటిలోనూ ఇలాంటి కడుపు కోత ఉండకూడదు. నిబంధనలు ఉన్నా అమలు చేయకుండా జీవోలకు పరిమితం కావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు ఆపరేటర్లపై ఎవరికీ అధికారం లేకపోతే ఎలా? అవసరమైతే ప్రైవేటు లాంచీలను ఆపేయండి. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నాను. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలి. మరో మూడు వారాల్లో నివారణ చర్యలు చేపట్టాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోమవారం ఉదయం ఆయన రాజమహేంద్రవరం చేరుకుని హెలికాఫ్టర్ ద్వారా ప్రమాద స్థలాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రతి ఒక్కరినీ పలుకరించారు. ప్రమాదం ఎలా జరిగిందీ, తర్వాత ప్రభుత్వం నుంచి సేవలు ఎలా అందుతున్నాయన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. చాలా బాధనిపించింది.. ప్రమాద విషయం తెలిసిన వెంటనే చాలా బాధపడ్డానని, బాధితులను పరామర్శించినప్పుడు వారు చెబుతున్న మాటలు విని ఇంకా బాధనిపించిందని సీఎం అన్నారు. ప్రమాదానికి గురైన బోట్లో ఎంత మంది ఉన్నారు.. అందులో తెలంగాణా వారు ఎంత మంది.. ఆంధ్రా వాళ్లు ఎంతమంది? వాళ్లలో ఎంత మంది బయటపడ్డారు.. ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది? రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతోందని సీఎం కలెక్టర్ను ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ మురళీధరరెడ్డి సమాధానం చెబుతూ 73 మంది వెళ్లారని, అందులో 41 మంది తెలంగాణా వారు, 24 మంది ఆంధ్రపదేశ్కు చెందిన పర్యాటకులు ఉండగా, ఎనిమిది మంది బోట్ సిబ్బంది ఉన్నారన్నారు. రాజమహేంద్రవరం సబ్కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొత్తం 73 మందిలో 27 మంది సురక్షితంగా బయటకురాగా 46 మంది గల్లంతయ్యారని, అందులో ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయని కలెక్టర్ చెప్పారు. చనిపోయిన వారిలో ఐదుగురు తెలంగాణ వారున్నారని చెప్పారు. బోటు ప్రమాదానికి గురైన చోట 315 అడుగుల లోతు ఉన్నట్లు రెస్క్యూ టీమ్లు గుర్తించాయని, రెండువైపులా కొండలు ఉండటం వల్ల అక్కడికి ఏ విధమైన పరికరాలు తీసుకువెళ్లడానికి వీలు లేకుండా ఉందన్నారు. కాకినాడ పోర్టుకు చెందిన టీమ్ అక్కడికి చేరుకుందని, వారి సూచనల మేరకు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద కూడా లైటింగ్ ఏర్పాటు చేసి వెతికిస్తున్నామని, గేట్లను కూడా దించి వేశామని చెప్పారు. ప్రతి అంశాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటి వరకు ఎన్ని బోట్లకు అనుమతులు ఇచ్చారని కాకినాడ పోర్టు అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజంకు సంబంధించి 81 బోట్లకు అనుమతి ఇవ్వగా, అందులో 68 బోట్లు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయన్నారు. వాటికి ఏడాదికి ఒకసారి లైసెన్స్ ఇస్తున్నామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ లైసెన్స్లు ఇచ్చేటప్పుడు ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఏడాదికోసారి కాకుండా పీరియాడిక్గా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎంత వరద వచ్చినప్పుడు బోటు తిరగకూడదన్న అంశాన్ని కూడా పునఃపరిశీలించాలని సూచించారు. గతంలో మొదటి ప్రమాద హెచ్చరిక అంటే పది లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వరకూ బోట్కు అనుమతి ఇవ్వవచ్చని, కానీ ఇప్పుడు ఐదు లక్షల క్యూసెక్కులకే బోటు ప్రమాదానికి గురైనందున తగిన పరిశీలన అవసరమన్నారు. కంట్రోల్ రూమ్ లేకపోతే ఎలా? కంట్రోల్ రూమ్ ఉండాలని జీవోలలో ఉన్నా ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 2018 నవంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఈ బోటుకు అనుమతి ఉందని, అయితే వరద ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వ బోట్లు ఆపి ఉన్నాయని తెలిసి కూడా పోలీసులు ఆ బోటులోకి వెళ్లి ప్రయాణికుల ఫొటోలు తీసుకుని, బోటు మంచిగా ఉందా లేదా అని తనిఖీలు చేసి ఎలా వదిలిపెట్టారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బోట్లు ఆగినప్పుడు ఈ బోట్లు ఎందుకు తిరుగుతున్నాయో పోలీసులు ప్రైవేటు బోటు వాళ్లు ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. ‘ఇరిగేషన్, పోలీస్, టూరిజం కలిపిన కంట్రోల్ రూమ్ అన్నదే లేదు.. లైసెన్స్లు ఇచ్చేవారు లైసెన్స్లు ఇస్తారు.. కంట్రోల్ రూమ్ ఉండదు. ప్రభుత్వ బోట్లను నియంత్రించే పరిస్ధితి ఉంది గానీ, ప్రైవేటు బోట్లను నియంత్రించే పరిస్థితి మాత్రం లేదు.. లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆ బోటు పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకోనక్కరల్లేదా?’ అని ముఖ్యమంత్రి నిలదీశారు. ప్రైవేటు బోట్ల మీద అజమాయిషీ చేయలేం అనుకున్నప్పుడు ఈ కంట్రోల్ రూములు ఎందుకని ప్రశ్నించారు. ‘ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల కోసం, ప్రస్తుత ఘటనపై విచారణకు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నా. సభ్యులుగా రెవెన్యూ చీఫ్ సెక్రటరీ, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ, కమిటీ కన్వీనర్గా తూర్పు గోదావరి కలెక్టర్ ఉంటారు’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ఘటనపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని, 45 రోజులలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాను మరోసారి జిల్లాకు వచ్చేటప్పటికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, దానిని తానే ప్రారంభిస్తానని సీఎం చెప్పారు. పోర్టులను కూడా ఈ కంట్రోల్ రూమ్ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే ప్రమాదం ఈ ప్రమాదం బోటు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని, ఇందులో గత ప్రభుత్వ నిర్వాకం కనిపిస్తోందని తెలంగాణా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది వచ్చారని, చాలా వరకు మృతదేహాలు కూడా దొరకలేదన్నారు. ప్రైవేటు ఆపరేటర్లపై ఎవరికీ అధికారం లేకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి స్పందించిన తీరు బావుందని ప్రశంసించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, హోం మంత్రి సుచరిత, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, గొట్టేటి మాధవి, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, చెల్లుబోయిన వేణు, చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ నాయకులు అనంతబాబు, దవులూరి దొరబాబు, బొంతు రాజేశ్వరరావు, కవురు శ్రీనివాస్, ఆకుల వీర్రాజు, రౌతు సూర్య ప్రకాశరావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏఆర్ అనురాధ, అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్, జిల్లా ఎస్పీ నయీమ్ అస్మిన్ తదితరులు పాల్గొన్నారు. భర్తను, 12 ఏళ్ల బిడ్డను పోగొట్టుకుని తానెందుకు బతికి ఉన్నానో తెలియడం లేదని ఒక మహిళ పడుతున్న బాధను చూసినప్పుడు మనసు కలచివేసింది. భవిష్యత్లో మరో కుటుంబానికి ఈ కడుపుకోత రాకూడదు అనిపించింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు నాకు సంబంధం లేదనుకోవడం ఒక పద్ధతి అయితే, దానిని సరిదిద్దుకోవడం మరో పద్ధతి. నేను రెండో పద్ధతినే ఎంచుకుంటున్నా. అందుకే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, చిన్న చిన్న గాయాలైన వారికి రూ.3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇంతమంది ప్రాణాలు పోయాయంటే దీనికి కారణం ఎవరు? 2018లో ఇచ్చిన జీవోను గత ప్రభుత్వం అమలు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇందులో మన బాధ్యత కూడా ఉంటుంది. మన తప్పు మనం తెలుసుకోవాలి. ఇక నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. నేను ఇంకోసారి జిల్లాకు వచ్చేటప్పటికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. దానిని నేనే ప్రారంభిస్తాను. ప్రతి బోటును చెక్ చేసిన తర్వాతే పంపించాలి. -
అమ్మో.. ఎలుగుబంటి..!
సాక్షి, జనగామ: అది జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయం.. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయం.. కార్యాలయం సమీపంలో ఓ నల్లటి ఆకారం... ఏదో జంతువు మాదిరిగా అటూ ఇటూ తిరుగుతోంది.. అది గమనించిన కొంత మంది యువకులు దగ్గరగా వెళ్లి చూస్తే ఎలుగుబంటి.. వారు భయభయంగానే దానిని తరిమివేసేందుకు ప్రయత్నించారు.. అది నేరుగా ఆర్టీసీ డిపోలో చొరబడి ఓ చెట్టెక్కి కూర్చొంది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ, పోలీసు, అటవీశాఖల అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎలుగుబంటి కిందకు దిగే ప్రయత్నం చేయడంతో చెట్టుచుట్టూ ముళ్లకంపను వేశారు. పెద్ద ఎత్తున జనాలు గుమిగూడటంతో అది మరింత పైకి వెళ్లింది. చివరకు నాలుగు మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన అధికారులు ఎలాగోలా భల్లూకాన్ని బంధించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎలా వచ్చింది... చంపక్హిల్స్ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి పసరమడ్ల, శామీర్పేట గ్రామాల మీదుగా 2.30 గంటలకు జనగామ పట్టణానికి చేరుకుంది. రోడ్డుపై వస్తున్న ఎలుగుబంటిని చూసిన కొమురవెల్లి స్పెషల్ ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రయాణికులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. డీసీసీ కార్యాలయం సమీపంలోని కుర్మవాడలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎలుగుబంటిని ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు యువకులు కర్రలతో బెదిరించారు. దీంతో అది పరుగులు పెడుతూ ఆర్టీసీ బస్ డిపోలోకి చొరబడింది. గుడ్డేలుగును చూసి అందులో ఉన్న పలువురు సిబ్బంది లగెత్తారు. డిపోలోని ప్రహరీ పక్కనే వరంగల్ రోడ్డును ఆనుకుని ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కింది. 6 గంటలకు పారెస్ట్ అధికారులకుసమాచారం.. ఉదయం ఆరు గంటల సమయంలో ఫారెస్ట్ అధికారులకు గుడ్డేలుగు వచ్చిన సమాచారాన్ని అధికారులు అందించారు. మత్తుమందు.. డాక్టర్.. రెస్క్యూ టీం.. బోను.. వలలను వెంట బెట్టుకుని తొమ్మిది గంటలకు జనగామకు చేరుకున్నారు. జూసంరక్షణ పశువైద్యాధికారి ప్రవీణ్ కుమార్ గన్ సహాయంతో వరుసగా రెండుసార్లు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. పదిహేను నిమిషాల తర్వాత కూడా గుడ్డేలుగు స్పృహలోనే ఉండడంతో.. మరో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఇరవై నిమిషాలు నిరీక్షించినా.. గుడ్డేలుగు కొంతమేర తప్పటడుగులు వేసినా.. మరుక్షణమే తేరుకుంది. అప్పటికే డిపో లోపలి భాగంతో పాటు వరంగల్ హైవే పై చెట్టుకు రెండు వైపులా వలలు వేసి సిద్ధంగా ఉంచారు. చెట్టు పై నుంచి కిందకు ఎంతకూ రాకపోవడంతో గుడ్డేలుగును కర్రల సహాయంతో కిందకు నెట్టేసే ప్రయత్నం చేయడంతో.. వారిపైకి వచ్చే ప్రయత్నం చేసి.. మళ్లీ పైకి వెళ్లింది. ఇరవై నిమిషాల తర్వాత మెళ్లగా చెట్టు దిగే ప్రయత్నంలో వలలో పడేలా శతవిధాలా ప్రయత్నం చేశారు. చెట్టుపై నుంచి బస్డిపో గోడపై ఉన్న ఫెన్సింగ్ తీగలను చొచ్చుకుని..అందులో ప్రవేశించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫారెస్ట్ సిబ్బందితో పాటు ఆర్టీసీ సివిల్ ఇంజినీర్ బాబాపైకి గుడ్డేలుగు పరుగులు పెట్టడంతో వణికిపోయారు. తప్పించుకుందామనుకునే లోపే... గుడ్డేలుగు వారి పైకి వచ్చేసినంత పని చేసింది. ఆ సమయంలోనే అక్కడే న్న రోడ్డు రోలర్కు గుడ్డేలుగు బలంగా తాకడంతో... వారు తృటిలో ప్రా ణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్వల్ప గా యంతో ఇబ్బందులు పడ్డ గుడ్డేలుగు.. డిపోలోని సిబ్బంది రెస్ట్ తీసుకునే గది వెనకకు వచ్చి చేరింది. వలతో అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. గంటన్నర పాటు ముప్పు తిప్పలు.. డిపోలో చొరబడ్డ గుడ్డేలుగును పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ముప్పుతిప్పలు పడ్డారు. మూడు మత్తు ఇంజక్షన్లు ఇచ్చినా.. అటు వైపు వెళ్లిన వారిపైకి వచ్చేందుకు ప్రయత్నించిం ది. ప్రహరీ దూకి భవానీనగర్ వైపు వెళ్లేందుకు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి విఫలమైంది. గుడ్డేలుగును పట్టుకునే విజువల్స్ను కవరేజ్ చేస్తున్న మీడియాపైకి సైతం రంకెలు వేయడంతో పరుగులు పెట్టారు. రెండుసార్లు వలలో చిక్కినట్టే చిక్కుకుని.. సంకెళ్లను తెంపుకుని బయటకు వచ్చింది. అతికష్టం మీద...11.05 నిమిషాలకు గుడ్డేలుగును పట్టుకుని.. బోనులో బంధించారు. అనంతరం మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన ప్రదేశంలో.. ప్రాథమిక పరీక్షలు చేసి...ఏటూరునాగారం– తాడ్వాయి అటవీ ప్రాంతానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ అర్బన్, జనగామ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామలింగం పర్యవేక్షించగా, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్కుమార్, మంగీలాల్ రేంజ్ ఆఫీసర్ పున్నంచందర్, కంపౌండర్ ఆకేష్, రిస్క్ టీం నాగేశ్వరావు, స్వామి, క్రిష్ణ ఉన్నారు. అడవిలో ఆహారం లేకనే అడవులు అంతరించి పోతుండడంతో మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయని డీఎఫ్ఓ రామలింగం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుమారు 12 సంవత్సరాల వయస్సు కలిగి.. 80 కేజీలు ఉంటుందన్నారు. అడవుల్లో తాగునీటి కొరత లేకుండా సాసర్ కుండీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి గాయాలు లేకుండా.. యాక్టివ్గా ఉండడంతో.. జనావాసాలు లేని తాడ్వాయి– ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో వదిలి పెడతామన్నారు. చెట్టు పైనుంచి సురక్షితంగా కిందకు దింపేందుకే సమయం ఎక్కువగా తీసుకున్నామన్నారు. -డీఎఫ్ఓ రామలింగం -
గిర్జన శివంగి
చిరుతో, సింహమో గ్రామాల్లోకి వచ్చినప్పుడు రసీలాకు ఫోన్ వెళుతుంది.అప్పుడామెకు రెండు పనులు పడతాయి. ఆ మృగం నుంచి మనుషులనుకాపాడ్డం. మనుషుల నుంచి ఆ మృగాన్ని కాపాడ్డం. గిర్ ఫారెస్ట్లో రెస్క్యూ టీమ్ గార్డ్ రిసీలా. ఒక ఆడపిల్ల అంత పెద్ద అభయారణ్యంలో ఎలా డ్యూటీ చేయగలుగుతోంది. అదీ.. ఓ తల్లిలా, అడవితల్లిలా?! చదవండి. 2013 గుజరాత్లోని జూనాగడ్ జిల్లాలోని జలొందర్ అనే పల్లె గోలగోలగా లేచింది. దానికి కారణం ఊళ్లో చిరుతపులి ప్రవేశించింది. అది అటు వెళ్లి ఇటు వెళ్లి ఏకంగా బావిలో పడింది. ఆ బావి నుంచి దానిని ఎలా బయటకు తీయాలో తెలియదు. బయటకు తీస్తే ఏమవుతుందో తెలియదు. వెంటనే ఫోన్ గిర్ అభయారణ్యంలోని రెస్క్యూ టీమ్కు వెళ్లింది. ఆ ఫోన్ అందుకున్నది రసిలా వాధేర్. ఇలాంటి సందర్భాలు తరచూ వస్తాయనే ఆ రెస్క్యూ టీమ్ ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తుంటుంది. రసిలా వెంటనే తన నలుగురు జవాన్లతో చిరుత ఉన్న ప్రాంతానికి వెళ్లింది. అసలే చిన్న గ్రామం. పైగా అంత అవగాహన లేని జనం. వారిని కంట్రోల్ చేయాలి. చిరుతలోకి మత్తు తూటాను దింపాలి. ఆ తర్వాత దానిని పట్టుకోవాలి. ఏ మాత్రం తేడా జరిగినా జనం చిరుతను చంపేస్తారు. మనిషి ప్రాణం గొప్పదే కాని చిరుత ప్రాణం కూడా గొప్పదే అని రెస్క్యూ టీమ్ నేర్చుకునే మొదటి పాఠం. అందుకే రసిలా చిరుత ప్రాణం పోకుండా దానికి మత్తు అందేలా చేసి బోనులో వేసుకొని తిరిగి గిర్ అభయారణ్యంలో వదిలిపెట్టింది. అందరూ రసిలాను అభినందించారు. రసిలాకు దక్కిన అభినందనలు లెక్కపెట్టుకుంటే అవి వెయ్యిగా తేలుతాయి. అవును 2007లో గిర్ అభయారణ్యం రెస్క్యూ టీమ్లో మొదటి మహిళా గార్డ్గా చేరినప్పటి నుంచి ఆమె ఇప్పటివరకూ విజయవంతంగా వేయి సందర్భాలలో ప్రాణులను రక్షించింది. వాటిని తిరిగి ప్రాణాలతో అడవిలో వదిలిపెట్టింది. ఆ ప్రాణులలో సింహాలు ఉన్నాయి. చిరుతలు ఉన్నాయి. అడవి దున్నలు ఉన్నాయి. కొండ చిలువలు ఉన్నాయి. దాదాపు 1400 చదరపు కిలోమీటర్లు ఉంటుంది గిర్ అభయారణ్యం. నిత్యం ఏదో ఒక జంతువుకు ఏదో ఒక సంకటం ఎదురవుతూనే ఉంటుంది. వాటిని కనిపెట్టుకొని ఉండేది విమెన్ రెస్క్యూ టీమ్. ఆ టీమ్కు హెడ్ రసిలా. బతుకే సాహసం రసిలాది జూనాగడ్లోని భండోరి అనే చిన్న గ్రామం. తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు. ఇద్దరు సంతానంలో రసిలా పెద్దది. ఆమె తర్వాత తమ్ముడు. తల్లి కూలి పని చేసి ఇద్దరు పిల్లలను చదివించుకుంది. డిగ్రీ పూర్తి చేస్తున్నప్పుడే తల్లిపడే కష్టం చూసి ‘ఈ చదువేదో పూర్తయిన వెంటనే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి’ అని నిశ్చయించుకుంది రసిలా. 21 ఏళ్లు వచ్చినా ఏ ఉద్యోగమూ దొరకలేదు. అప్పుడు, అంటే 2007లో గుజరాత్ ప్రభుత్వం గిర్ అభయారణ్యంలో రెస్క్యూ టీమ్లో మొదటిసారిగా స్త్రీలకు కూడా అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించింది. అసలే అడవి. దానికి తోడు సింహాలు. నిత్యం ప్రమాదాలు. మగవాళ్లే భయపడే ఆ పనికి ఆడవాళ్లు ఎవరు వస్తారు? కాని రసిలా ఆ ప్రకటన చూసి వెంటనే స్పందించింది. జీవించి ఉండటమే పెద్ద సాహసమైన కుటుంబ పరిస్థితుల్లో పులులతో సింహాలతో మనుగడ సాధించడం పెద్ద సాహసం కాదు అని అప్లికేషన్ పెట్టింది. దేహ దారుఢ్య పరీక్ష, రిటన్ టెస్టూ, ఇంటర్వ్యూ పాసయ్యి 2008లో రెస్క్యూ టీమ్లో మొదటి మహిళా గార్డ్ అయ్యింది. ఆరంభంలో అన్నీ అడ్డంకులే రసిలా ఉద్యోగంలో చేరనైతే చేరింది గాని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న మగవాళ్లు ఆమెను చిన్న పిల్లలాగా ఆడపిల్లలాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. నీకెందుకు... అడ్మినిస్ట్రేషన్ పని చూసుకో... ఆఫీసులో కూర్చుని ఉండు... అడవిలోకి వెళ్లడం రిస్క్ అన్నట్టుగా వ్యవహరించేవారు. కాని రసిలా తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూసేది. గిర్ అభయారణ్యంలో ఉన్న సింహాలు ఒక్కోసారి దారితప్పి ఊళ్లల్లోకి ప్రవేశించడం మామూలే. అవి గాయపడి ఉన్నట్టయితే ఇంకా తిక్కగా వ్యవహరిస్తాయి. ఒకసారి భావనగర్ జిల్లాలోని దెదాకడీ ప్రాంతంలో ఒక ఆడ సింహం గాయపడి తిరుగుతున్నట్టుగా రెస్క్యూ టీమ్కు సమాచారం అందింది. ఆ సింహం చాలా వెర్రెత్తి ఉందని, శక్తి లేకపోయినా గాయపరచడానికి ప్రయత్నిస్తోందని గ్రామస్తులు చెప్పారు. ఆ టైమ్కు రసిలా డ్యూటీలో ఉంది. తోటి సభ్యులను తీసుకొని తానే ఆపరేషన్లోకి దిగింది. ఆ రాత్రంతా ఎంతో ఓపికతో సింహాన్ని గుర్తించి, దానికి మత్తు ఇచ్చి పట్టుకుంది. అప్పుడు అధికారులకు రసిలా మీద నమ్మకం కుదిరింది. ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా రసిలాను పంపడం మొదలెట్టారు. రెస్క్యూ టీమ్కు గౌరవం ఎప్పుడు వస్తుందంటే ప్రమాదంలో ఉన్న ప్రాణిని ప్రాణాలతో పట్టుకున్నప్పుడే. అవి చనిపోకుండా, గ్రామస్తులు చంపకుండా కాపాడి తీసుకురావడంలోనే రెస్క్యూ టీమ్ సక్సెస్ ఉంది. ఆ విధంగా చూస్తే నా సక్సెస్ రేట్ వంద శాతం అంటుంది రసిలా. అందుకే అధికారులు ఆమె ఒక నక్షత్రం ఉన్న యూనిఫామ్తో ఉద్యోగంలో చేరితే ఇప్పుడు ఆమె భుజాల మీద మూడు నక్షత్రాలు ఉన్న యూనిఫామ్కు ప్రమోట్ చేశారు. కొనసాగింపు రసిలా ఈ ఉద్యోగంలో చేరి సఫలం అయ్యాక గిర్ అభయారణ్యంలో స్త్రీలను ప్రోత్సహించాలని డిపార్ట్మెంట్కు కూడా అనిపించింది. క్రమంగా నియామకాలు జరిగాయి. ఇప్పుడు గిర్ అభయారణ్యంలో 150 మంది మహిళా గార్డులు పని చేస్తున్నారు. రోజూ టీమ్లు మారి వీళ్లు మోటర్ సైకిళ్ల మీద, జీపులలో అభయారణ్యం అంతా తిరుగుతుంటారు. సాటి జంతువు దాడి వల్ల గాయపడ్డ జంతువులకు, గోతులలో గుంతలలోపడ్డ జంతువులకు లేదా రైలు పట్టాలు దాటుతూ రైలు ఢీ కొట్టిన జంతువులకు, తల్లి దూరమయ్యి బిక్కుబిక్కుమంటున్న పిల్లలకు వీరంతా సేవలు చేస్తుంటారు. గిర్ అభయారణ్యంలో 109 సింహాలు, 201 శివంగులు, 213 సింహపు పిల్లలు ఉన్నాయి. వాటికి నిత్యం ఏదో ఒక సహాయం అందాల్సి ఉంటుంది. ఇవి కాకుండా నాలుగు వందల చిరుతలు ఉన్నాయి. మొసళ్లు లెక్కలేనన్ని. జింకలు, కృష్ణ జింకలు, అడవి దున్నలు, దుప్పులు, ముంగీసలు, ఉడుము... ఇవన్నీ గిర్ ప్రత్యేకం. లెక్కలేనన్ని పక్షులు ఉన్నాయి. వృక్ష జాతులు ఉన్నాయి. వీటన్నింటినీ తల్లుల వలే కాపాడుకునే దళమే ఈ మహిళా దళం. వేసవి సవాల్ మిగిలిన సీజన్ల కన్నా వేసవి కాలంలో మాకు ఎక్కువ వత్తిడి ఉంటుంది అంటుంది రసిలా. వేసవి కాలంలో గిర్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఐదు ఉపనదులు ఈ అభయారణ్యంలో ఉన్నా అవి వొట్టి పోతుంటాయి. నీటి జాడ కరువైనప్పుడు జంతువుల కదలిక పెరుగుతుంది. వాటి అవసరాలు రెస్క్య టీమ్ చూసుకోవాల్సి వస్తుంది. ‘అదొక్కటే కాదు. వేసవిలో టూరిస్ట్లు వస్తారు. ప్రతి జీప్కు ఒక గార్డ్ రక్షణ కోసం ఉండాలి. మా టీమ్ సభ్యులే ఆ పని చేస్తారు’ అంటుంది రసిలా. ‘క్రూర మృగాలతో మీకు భయం వేయదా’ అని అడిగితే ‘ఎదుటివారు హాని తలపెడతారు అనిపించినప్పుడే అవి అటాక్ చేస్తాయి. లేకపోతే ఏమీ చేయవు’ అంటుంది రసిలా. రసిలాకు రెండు ఇళ్లున్నాయి. ఒకటి నివసించే చోటు. రెండు అడవి. ఈ ఉద్యోగంలో ఉంటూనే రసిలా పెళ్లి చేసుకుంది. తల్లి కూడా అయ్యింది. అయినప్పటికీ ఉద్యోగాన్ని అంతే నిబద్ధతతో చేస్తోంది. ‘అడవిలో ఉండే అదృష్టం అందరికీ రాదు. ఇష్టపడాలే గాని ఇది చాలా ఆనందాన్నిచ్చే పని’ అంటున్న రసిలా చాలామంది ఆడపిల్లలకు మనమూ చేయగలం అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తోంది. ఈసారి విహారానికి గిర్ వెళ్లినప్పుడు తప్పకుండా రసిలాను కలవండి. ఆమె ఆటోగ్రాఫ్ తీసుకొని ఇరుగూ పొరుగూ ఆడపిల్లలకు చూపించండి. ప్రతి ఆడపిల్లా సాహసంగా జీవించడమే కదా ఇవాళ్టి రోజుల్లో కావలసింది. -
నడిసముద్రంలో చిక్కుకున్న నౌక
ఓస్లో: నార్వేతీరంలోని సముద్రంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ఆదివారం కూడా కొనసాగాయి. ఇప్పటివరకు 397 మంది ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వారా తరలించారు. దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ట్రోంసో నుంచి స్టావంగర్కు వెళ్తున్న విలాసవంతమైన ఓడలో 1,373 మంది ఉన్నారు. శనివారం ఓడలోని ఇంజిన్లలో సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. కెప్టెన్ అప్రమత్తమై అధికారులకు సమాచారమిచ్చారు. ప్రయాణికులను సముద్రం ఒడ్డుకు తీసుకువచ్చేందుకు అధికారులు హెలికాప్టర్లు పంపారు. ఇప్పటిదాకా 397 మందిని తరలించారు. బలమైన గాలులు వీస్తున్నా, ప్రమాదకర వాతావరణపరిస్థితులు ఉన్నా హెలికాప్టర్ ద్వారా ప్రయాణికుల చేరవేత కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఓడలోని నాలుగు ఇంజిన్లలో మూడింటిని సిబ్బంది మరమ్మతు చేశారు. ఓస్లోకు వాయవ్య దిశలో సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోల్డె పోర్టుకు ప్రయాణికుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. లైఫ్ జాకెట్లతో నౌకలో బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులు -
ఆరు రోజులు ప్రత్యక్ష నరకం
వాళ్లంతా మానసిక వికలాంగులు. చుట్టూ వరద నీరు ముంచేస్తున్నా ఏం జరుగుతోందో గ్రహించుకోలేని నిస్సహాయులు. ఆరు రోజులు బయట ప్రపంచంలో ఏమవుతోందో తెలీక, తమ ప్రాణాలే ప్రమాదంలో పడ్డాయనే విషయాన్ని తెలుసుకోలేక నీళ్లల్లోనే అలా కాలం గడిపేశారు. చివరికి ఎలాగోలా సహాయబృందాలు వారున్న చోటుకి వెళ్లగలిగాయి. వారి ప్రాణాలు కాపాడాయి. కేరళ తిస్సూరు జిల్లాలోని మురింగూర్ అనే మారుమూల ప్రాంతంలోని మానసిక రోగుల సంరక్షణ కేంద్రంలో 400 మంది వరకు రోగులు ఉంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారంతా తట్టబుట్ట సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోతే, వరద నీరు మింగేస్తోందని కూడా తెలుసుకోలేని వారంతా అక్కడే ఉండిపోయారు. గుబురుగా ఉండే చెట్ల మాటున ఉండే ఆ కేంద్రం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండడంతో వారి ఆలనాపాలనా పట్టించుకునేవారే లేకపోయారు. అయితే అక్కడ స్థానిక బ్లాక్ పంచాయితీ సభ్యుడు థామస్ మాత్రం ఎంతో బాధ్యతగా వ్యవహరించారు. మొదటి అంతస్తులోకి నీళ్లు వచ్చేయడంతో వాళ్లని జాగ్రత్తగా పై అంతస్తులోకి తరలించారు. ప్రతీరోజూ చిన్న మరబోటులోనే ఆ కేంద్రానికి కొంచెం కొంచెం ఆహార పదార్థాలను తీసుకువెళ్లి వాళ్లకి తినిపించేవారు. అలా ఆరు రోజులు గడిచాక ఎలాగైతేనేం సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. థామస్ ఆ సహాయ బృందాలకు ఎదురేగి మానసిక వికలాంగుల పరిస్థితిని వివరించారు. కానీ వరదనీరు భారీగా చుట్టుముట్టేయడంతో వారందరినీ తరలించడం చాలా క్లిష్టంగా మారింది. ఆహారం, మందులు లేకపోవడంతో ఇద్దరు మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కూడా కోల్పోయారు. థామస్ సహకారంతో మిగిలిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తిస్సూర్ జిల్లాలోని ఆ మారుమూల ప్రాంతానికి సహాయ బృందాలు చేరుకోవడం ఇదే ప్రథమం. గతంలో విపత్తులు సంభవించిన సమయంలోనూ అక్కడికి ఎవరూ వెళ్లలేకపోయారు. కానీ ఈ సారి సహాయ బృందాలు మెడలోతు నీళ్లల్లో 3 కి.మీ. నడుచుకుంటూ వెళ్లి మరీ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఆ గ్రామ ప్రజలనే కాదు మానసిక స్థితి సరిగా లేని వారి ప్రాణాలను కాపాడారు. అయితే ఇన్ని రోజులూ వారిని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన థామస్ని రియల్ హీరో అంటూ స్థానికులు కొనియాడుతున్నారు. -
ఊపిరి పీల్చుకున్న వరద బాధితులు
అశ్వారావుపేట రూరల్: భద్రాద్రి కొత్తగూడెం– పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులో అశ్వారావుపేట మండలం గోగులపూడి అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం చిక్కుకున్న భక్తులను ఎట్టకేలకు సురక్షితంగా బయటకు లాగారు. భారీ వర్షంతో ఆలయ సమీపంలోని కొండవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో 400 మంది భక్తులు, 100 మంది వ్యాపారులు అడవిలోనే దాదాపు 12 గంటలపాటు ఉండిపోయారు. సోమవారం ఉదయం వరకు కూడా వాగు ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు. దాంతో అడవిలో ఉన్న భక్తులు వాగు దాటే పరిస్థితి లేకుండా పోయింది. భక్తులు చిక్కుకుపోయారని ఆదివారం రాత్రి టీవీ చానళ్లలో వచ్చిన వార్తలతో ఏపీలోని బుట్టాయిగూడెం మండల రెవెన్యూ, పోలీసు అధికారులు అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నారు. కానీ భక్తులను వాగు దాటించలేక పోయారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు సాధ్యం కాలేదు. దీంతో సోమవారం ఉదయం ఏడు గంటలకు స్థానిక ఆర్డీవో మోహన్రావు, కన్నాపురం ఐటీడీఏ పీవో హరిప్రసాద్, జంగారెడ్డిగూడెం సీఐ బాలరాజు వచ్చి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. రెస్క్యూటీమ్ల ఆధ్వర్యంలో పెద్ద తాళ్ల సాయంతో భక్తులను సురక్షితంగా వాగు దాటించారు. ఎట్టకేలకు అడవి, వాగు నుంచి క్షేమంగా బయటపడటంతో ఇటు అధికారులు, అటు బాధితుల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, వాగు ప్రవాహంలో లారీతోపాటు పలు వాహనాలు కొట్టుకుపోగా వాటిని బయటకు తీయడం సాధ్యం కాలేదు. చేయి చేయి కలిపితేనే తట్టుకోగలం వాతావరణ మార్పులపై సీఎస్ జోషి సాక్షి, హైదరాబాద్: పర్యావరణ నాశనంలో మానవ తప్పిదాల పాత్ర చాలా ఉందని, పరిస్థితిని సరిదిద్దుకోకపోతే భూమ్మీద మనిషి మనుగడ కష్టమేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్లోని జి.పి.బిర్లా సైన్స్ సెంటర్లో ‘వీ 4 క్లైమెట్’ పేరుతో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, జర్మన్ సంస్థ జీఐజెడ్ నిర్వహించిన కార్యక్రమంలో సీఎస్ మాట్లాడారు. వాతావరణ పరిరక్షణకు ప్రభుత్వాల తోపాటు వ్యక్తులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వా లు విధానాలు రూపొందించగలవే గానీ అమల్లో ప్రజలదే కీలకపాత్ర అన్నారు. -
త్వరలో మహిళా రక్షక్ బృందాలు
అనంతపురం సెంట్రల్: మహిళలపై జరుగుతున్న నేరాలను ని యంత్రించాలని జిల్లా ఎస్పీ అశోక్కుమార్ పిలుపునిచ్చారు. మహిళల రక్షణ, భద్రత కోసం త్వరలో మహిళా రక్షక్ బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం పోలీసు కాన్ఫరెన్స్హాల్లో మహిళా రక్షక్ బృందాల అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజూ జరిగే నేరాల్లో 20 శాతం మహిళలకు సంబంధించవిగా నమోదవుతున్నాయని తెలిపారు. వీటికి తోడు ఈవ్టీజింగ్, వేధింపులు ఇతర కారణాలపై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వేధింపులకు పాల్పడుతున్న వారి ఆగడాలను అరికట్టేందుకు మహిళా రక్షక్ బృందాలు పనిచేస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 మహిళా రక్షక్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయన్నారు. అనంతపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం, తాడిపత్రి సబ్ డివిజన్లలో రెండు చొప్పున, గుంతకల్లు, కదిరి, పెనుకొండ, పుట్టపర్తి సబ్డివిజన్లో ఒక్కో బృందం పనిచేస్తుందన్నారు. పార్కులు, కళాశాలలు, పాఠశాలలు, దేవాలయాలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో మహిళా రక్షక్ బృందాలు నిఘా ఉంచుతాయన్నారు. ఈవ్టీచర్లు, అమ్మాయిలను వేధించే ఆకతాయిలను గుర్తించి వారిని కౌన్సిలింగ్ కేంద్రాలకు తీసుకెళ్తారని తెలిపారు. అనుభవజ్ఞులైన వారితో కౌన్సిలింగ్ ఇప్పించడంతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పిలిపించడం జరుగుతుందన్నారు. రెండోసారి పునరావృతం అయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సముద్రంలో తిరగబడిన బోటు రెస్క్యూటీం సాహసం
-
పడవ మునక.. పర్యాటకుల మృతి!
చెన్నై: పడవ మునిగిపోయిన ప్రమాదంలో 9 మంది పర్యాటకులు మృతిచెందగా, మరో 11 మందిని రెస్క్యూ బృందం రక్షించింది. ఈ ఘటన తమిళనాడులోని ట్యూటికోరిన్ సమీపంలో మనప్పాడ్ లో చోటుచేసుకుంది. బోటులో దాదాపు 20 మంది పర్యాటకులు ఆదివారం షికారుకు వెళ్లగా అలల తాకిడి ఎక్కువై సముంద్రంలో పడవ మునిగిపోయింది. దీంతో పడవలోని అందరూ గల్లంతయ్యారని అధికారులు భావించగా, ఆపై 11 మందిని రక్షించినట్లు తెలిపారు. మృతదేహాలు వెలికి తీసేందుకు ఇంకా చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తీరం దాటిన నాడా తుపాను
చెన్నై : తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రను వణికించిన నాడా తుఫాను కారైకాల్ వద్ద శుక్రవారం ఉదయం తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కడలూరు, నాగపట్నం, పుదుచ్చేరి ప్రాంతాల్లో 4 సెం.మీ.ల మేర వర్షం పడే అవకాశముందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో గంటకు 50కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో కూడా తేలికపాటి వర్షాలు పడనుందని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నాడా తుపాను తీరం దాటినప్పటకీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమిళనాడుతో పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. -
నాడా అలర్ట్!
► నేడు తీరం దాటనున్న తుపాన్ ►బలహీనపడినా, గాలితో ముప్పే ►కడలూరుపైనే గురి ►రంగంలోకి రెస్క్యూ టీం ►రాష్ట్రంలో మోస్తరుగా వర్షం! ►భారీ గండం తప్పినట్టేనా..? నాడా తుపాన్ శుక్రవారం కడలూరు - వేదారణ్యం మధ్యలో తీరం దాటనుంది. తుపాన్ బలహీన పడ్డా, తీరం దాటేసమయంలో ఈదురు గాలుల రూపంలో భారీ ముప్పు తప్పదన్న సంకేతాలతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. కడలూరు, నాగపట్నంలలో పెద్ద సంఖ్యలో రెస్క్యూ టీంను రంగంలోకి దించి ఉన్నారు. ఇక, ఈ ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరుగా వర్షం పడింది. సాక్షి, చెన్నై : బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం బలపడి తుపాన్గా మారిన విషయం తెలి సిందే. ఈ తుపాన్కు నాడా అని నామకరణం చేశా రు. దీని ప్రభావం అత్యధికంగా రాష్ట్రంలోని సము ద్ర తీర జిల్లాల మీద ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్, కార్యదర్శి చంద్రమోహన్ల నేతృత్వంలో సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచి అధికార వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆయా జిల్లాల్లోని పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. సహాయక బృందాలను ఆయా ప్రాంతాలకు పంపించారు. ఏదేని ప్రళయం చోటు చేసుకున్న పక్షంలో బాధితుల్ని ఆదుకునేందుకు తగ్గట్టుగా సర్వం సిద్ధం చేశారు. ప్రత్యేకంగా పునరావస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఎక్కడైనా ఏదేని ముప్పు వాటిల్లినా తక్షణం సమాచారం అందించేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించారు. తుపాన్ తీరం దాటనున్న కడలూరు, నాగపట్నం జిల్లాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు తగ్గట్టు సర్వం సిద్ధం చేశారు. తుపాన్ భయంతో తొమ్మిది జిల్లాల్లో స్కూళ్లకు సైతం శుక్రవారం వరకు సెలవు ప్రకటించేశారు. అరుుతే, తుపాన్ ప్రభావం రాష్ట్రంలో కనిపించలేదని చెప్పవచ్చు. గురువారం భారీ వర్షాలు పడవచ్చని సర్వత్రా ఎదురు చూసినా, అందుకు భిన్నంగా పరిస్థితి మారింది. మోస్తరుగా వర్షం: చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు సముద్ర తీరాల్లో జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో జనంలో మరో మారు భయం పుట్టుకుంది. గత ఏడాది ఇదే రోజున కురిసిన భారీ వర్షం పెను ప్రళయానికి దారి తీయడం ఇందుకు కారణం. అరుుతే, భారీ వర్షం అని చెప్పడం కన్నా, మోస్తరుగా వర్షం తెరపించి తెరపించి పడడంతో సర్వత్రా ఊపిరి పీల్చుకున్నారు. కడలూరు, నాగపట్నం, తంజావూరుల్లో కాసేపు భారీ వర్షం పడ్డా, తదుపరి చిరుజల్లులతో కూడిన వర్షం పడుతూ వచ్చింది. అత్యధికంగా వేదారణ్యంలో ఐదు సె.మీ వర్షం పడింది. చెన్నైలో అప్పుడప్పుడు తెరపించి తెరపించి వర్షం పడ్డా, మధ్యాహ్నం కాసేపు భానుడు ప్రత్యక్షం కావడంతో ఇక వర్షం కనుమరుగైనట్టేనా అన్న ప్రశ్న బయలుదేరింది. సాయంత్రానికి మళ్లీ ఆకాశం మేఘావృతంగా మారింది. అర్ధరాత్రి సమయంలో, శుక్రవారం వర్షం పడొచ్చన్న సంకేతాలు ఉండడంతో అధికార వర్గాలు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. ఇక, సాగరంలో కెరటాల జడీ మరీ ఎక్కువగా ఉండడంతో సముద్ర తీరాల్లోకి ఎవ్వర్నీ అనుమతించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బలహీన పడ్డా...ముప్పే : బుధవారం తుపాన్గా మారిన ద్రోణి గురువారం మధ్యాహ్నం కాస్త బలహీన పడింది. అందువల్లే వర్షం తీవ్రత తగ్గినట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. తుపాన్ బలహీన పడ్డా, గాలి తీవ్రత కారణంగా తీరం దాటే సమయంలో ముప్పు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. దీంతో తీరం దాటనున్న కడలూరు నుంచి నాగపట్నం వరకు అప్రమత్తంగా వ్యవహరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సమాచార వ్యవస్థకు ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తల్ని తీసుకున్నారు. అన్ని చోట్ల స్పెషల్ స్క్వాడ్స ద్వారా కంట్రోల్ రూంకు ఎప్పటికప్పుడు సమాచారాలు అందే విధంగా పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు. శుక్రవారం వేకువ జామున ఈ తుపాన్ తీరం దాటినా, రెండు రోజుల పాటు చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. నాడా తుపాన్ తీరం దాటే క్రమంలో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికతో కడలూరు, నాగపట్నం జిల్లాల ప్రజల్లో ఆందోళన బయలు దేరింది. -
షార్ట్ సర్క్యూట్తో వ్యాన్ దగ్ధం
భూపాలపల్లి : షార్ట్ సర్క్యూట్తో ఒమ్నీ వ్యాన్ దగ్ధమైన సంఘటన భూపాలపల్లి పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. మండలంలోని గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన బట్టల వ్యాపారి బండారి సదానందం పట్టణంలోని శ్రీషిర్డీ సాయిబాబా ఆలయంలో మంగళవారం జరిగే గురుపౌర్ణమి వేడుకలకు తన మారుతి ఒమినీ వ్యాన్(ఏపీ10 క్యూ 5982)లో కుటుంబ సభ్యులను తీసుకొచ్చాడు. అనంతరం వాహనాన్ని పక్కనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట పార్కింగ్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వ్యాన్ ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు లేచాయి. దీంతో సదానందం హుటాహుటిన వ్యాన్ దిగి దూరంగా వెళ్లాడు. ఆలయం వద్ద ఉన్న సింగరేణి ఎస్ అండ్ పీసీ సిబ్బంది వ్యాన్లో చెలరేగుతున్న మంటలను గమనించి రెస్క్యూ టీంకు సమాచారమిచ్చారు. వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫోం, నీటిని పంపింగ్ చేసి మంటలను చల్లార్చారు. కాగా వ్యాన్ వెనుక భాగంలో గ్యాస్ సిలిండర్ ఉండటంతో స్థానికులు, ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి అర కిలోమీటరు దూరాన్నే ఉండిపోయారు. సకాలంలో స్పందించి ధైర్యంతో మంటలను చల్లార్పిన రెస్క్యూ టీం సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
500 అడుగుల బోరుబావిలో పడిన పసికందు
గుజరాత్: గుజరాత్లోని సురేందర్ నగర్ జిల్లాలో సోమవారం ఏడు నెలల పసికందు ప్రమాదవాశాత్తూ బోరుబావిలో పడిపోయింది. 500 అడుగుల వరకు ఉన్న బోరుబావిలో 100 అడుగుల వద్ద పసికందు ఇరుక్కపోయింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని పాపను బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో తమ బిడ్డ కోసం తల్లిదండ్రులు ఆదుర్ధా పడుతున్నారు. ఎలాగైనా తమ కంటిపాపను బైటికి తీసుకురావాలని ప్రాధేయపడుతున్నారు. -
మేడలు, మిద్దెలు కూడా మునక!
-
సహాయ చర్యలకూ వెళ్లలేని స్థాయిలో..
తమిళనాడు రాజధాని చెన్నై నగరం భారీవర్షాలకు చిగురుటాకులా వణికిపోతోంది. నగరంలో ఎటు చూసినా నడుంలోతు, పీకల్లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దాంతో సహాయ చర్యలు చేపట్టేందుకు బృందాలు సిద్ధంగా ఉన్నా.. వాళ్లు కాలు కదిపేందుకు కూడా వీలు కుదరడం లేదు. దీంతో సహాయక చర్యలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. మరికొన్ని ముఖ్యాంశాలు: రిజర్వాయర్లన్నీ ఓవర్ఫ్లో అవుతున్నాయి దాంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న కాలనీలు జలమయం అయ్యాయి. సహాయ చర్యలకు కూడా వీలుకానంత పరిస్థితి ఏర్పడింది శివార్లలో ఉన్న రిజర్వాయర్లతో పాటు అడయార్ నది కూడా నిండిపోయి, ఆ వరదనీరు చెన్నై నగరంలోకి చేరుకుంది వాహనాలేవీ కదల్లేని పరిస్థితి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది అన్ని రహదారులలో పడవల్లో మాత్రమే తిరగగలిగే అవకాశం ఉంది నడుం లోతు నీళ్లు, పీకల్లోతు నీళ్లలో నగరం మునిగిపోయింది సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా వీలు కావట్లేదు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నా, ఎప్పటికప్పుడు వరదనీరు పెరుగుతుండటంతో వాళ్లు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఫోన్లు కూడా పనిచేయడం లేదు. ఎప్పుడూ సురక్షితం అనుకునే విమానాశ్రయం వరదనీటితో మునిగిపోయింది మరో మూడు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది ఇప్పటికే 70 వేల మంది సిబ్బంది సహాయపనుల్లో ఉన్నారు అయినా సురక్షిత ప్రాంతాలకు తరలించడం సాధ్యం కావట్లేదు అడయార్ నది కూడా పొంగడంతో శివార్లలో ఉన్న 4 లక్షల ఇళ్లు నీటమునిగాయి నిత్యావసర వస్తువులు కూడా కొనలేని స్థితి నెలకొంది. ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి. ఇళ్లలో ఉండేవాళ్లు మొదటి లేదా రెండో అంతస్థులకు వెళ్లి తలదాచుకుంటున్నారు ఈ పరిస్థితి ఎన్నాళ్లనేది తెలియడం లేదు చెన్నైలోని 24 జోన్ కార్యాలయాలతో పాటు అన్నిచోట్లా బృందాలు సిద్ధంగా ఉన్నాయి కానీ వాళ్ల వాహనాలు కూడా కదిలే పరిస్థితి ఎక్కడా లేదు బోట్లలో వెళ్లాలన్నా కూడా ఇబ్బందిగానే ఉందని సిబ్బంది చెబుతున్నారు సీఎం జయలలితతో ప్రధాని మోదీ చర్చించారు కేంద్ర మంత్రివర్గం కూడా చెన్నై పరిస్థితిని సమీక్షించింది భారీవర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం సాయం చేయడానికి కూడా ఏమాత్రం వీలుండకపోవచ్చన్న భయాందోళనలు నెలకొంటున్నాయి నగరం వదిలి వెళ్లిపోదామన్నా.. ఇంట్లోంచి బయటకు కాలు పెట్టలేకపోతున్నారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఇళ్లలోనే కూర్చోవాల్సిన పరిస్థితి చెన్నైలో ఉంది. -
సహాయ చర్యలకూ ఆటంకాలు
-
ఆర్కే బీచ్లో గల్లంతైన వారి కోసం గాలింపు
విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఆర్కే బీచ్లో గల్లంతైన యువకుల కోసం సోమవారం సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే రెండు మృతదేహలు సోమవారం ఉదయం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో రెండు మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారం ఆర్కే బీచ్ వద్ద సముద్రంలో స్నానాలు చేస్తున్న నలుగురు యువకులు సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. మృతుల్లో ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు కాగా. ఒకరు పర్యాటకుడు. గతేడాది సరిగ్గా ఇదే రోజున విశాఖపట్నం నగరాన్ని హుద్ హుద్ తుపాన్ అతలాకుతలం చేసిన విషయం విదితమే. -
పుష్కర ఘాట్ లో మొసలి కలకలం..
-
పుష్కర ఘాట్ లో మొసలి కలకలం..
ఇబ్రహీంపట్నం : పుష్కర ఘాట్లో మొసలి ప్రత్యక్షమై కలకలం రేపింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి బాలమ్మరేవు పుష్కర ఘాట్లో గురువారం జరిగింది. పుష్కర స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు మొసలిని చూడగానే భయాందోళలనకు గురయ్యారు. దీంతో కొద్దిసేపు నీళ్లలోకి భక్తులెవరూ దిగలేదు. భక్తుల నుంచి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని వెంటనే మొసలిని పట్టుకోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
హుదూద్ తుపాను ముంచుకొస్తోంది!
-
దొరకని అఖిల్ జాడ
చౌటుప్పల్ :హిమాచల్ప్రదేశ్లో జరిగిన ఘోర ప్రమాదంలో చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతయ్యాడు. మూడు రోజు లుగా రెస్క్యూ టీం గాలిస్తున్నా అతని జాడ దొరకలేదు. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన మాచర్ల సుదర్శన్-సబిత దంపతులకు ఇద్దరు కుమారులు. 15సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వెళ్లి దిల్సుఖ్నగర్లో స్థిరపడ్డారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనేది వీరి కోరిక. పెద్దకుమారుడు విశాల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగరీత్యా ముంబైలో శిక్షణ పొందుతున్నాడు. చిన్నకుమారుడు అఖిల్(20) బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్టడీటూర్లో భాగంగా ఈ నెల 3న కళాశాల ఆధ్వర్యంలో స్నేహితులతో కలిసి హిమాచల్ప్రదేశ్కు వెళ్లాడు. బియాస్ నదిలో గల్లంతైన 24మంది విద్యార్థులలో ఈయన కూడా ఉన్నాడు. ఈయన గల్లంతైన విషయం తెలియగానే తల్లిదండ్రులు హిమాచల్ప్రదేశ్కు హుటాహుటిన తరలివెళ్లారు. కొడుకు కడసారి చూపైనా దక్కుతుందా, లేదా అని కన్నీరుమున్నీరవుతున్నారు. మూడు రోజులుగా రెస్క్యూ టీం, గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాల కోసం గాలిస్తున్నా ఎక్కడా అఖిల్ జాడ దొరకలేదు. -
ఐ మిస్ యూ ... అంటూ ఎస్ఎంఎస్లు
ఓ వైపు పిల్లలు, పెద్దలు రక్షించండి, కాపాడండి అంటూ అర్తనాదాలు... మరో వైపు కళ్ల వెంట దారాపాతంగా కారుతున్న కన్నీరు. మృత్యువు తమను కబళించేందుకు సిద్ధంగా ఉందని తెలుసు... ఏ క్షణానైన మరణం తన కౌగిట్లోకి తమను బలవంతంగా లాక్కుపోతుంది. ఆ తరుణంలో ఆ చిన్నారి విద్యార్థులకు తల్లితండ్రులు, కుటుంబసభ్యులు గుర్తుకు వచ్చారు. అంతే ఇక ఆలస్యం చేయలేదు. తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లు బయటకు తీశారు. తర్వాత క్షణం ఏం జరుగుతోందో తెలియని ఆ విద్యార్థులు తల్లితండ్రులపై ప్రేమ, ప్రమాదంలో చిక్కుకున్నామనే భయం, జీవితం ఇక లేదనే నిరాశలతో సమ్మిళితమైన సంక్షిప్త సందేశాల (ఎస్ఎంఎస్)ను తమ తమ తల్లితండ్రులకు పంపారు. ఐ లవ్ యూ మమ్, ఐ లవ్ యూ డాడ్ , ఐ మిస్ యూ... జీవితంలో మరోసారి ఈ సందేశం పంపేందుకు అవకాశం రాకపోవచ్చు అంటూ షిన్ యంగ్ జిన్ అనే విద్యార్థి తన తల్లితండ్రులకు ఎస్ఎంఎస్ పంపగా, తాను ప్రయాణిస్తున్న నౌక ఓ పక్కకు ఒరిగిపోయింది... తమను రక్షించండి అంటూ మరో విద్యార్థి కిమ్ వూంగ్ కి తన సోదరుడిని ఎస్ఎంఎస్ ద్వారా వేడుకున్నాడు. ఆ ఎస్ఎంఎస్లు గురువారం దేశవ్యాప్తంగా వివిధ మీడియాలు సంస్థలు తమ తమ పత్రికలలో ప్రచురించాయి. విహార యాత్రకు వెళ్లి విషాద యాత్రగా మారిన తరుణంలో కన్న బిడ్డలు జాడ తెలియక ఆయా కుటుంబాలు విద్యార్థులు పంపిన సందేశాలను చూసి రోధిస్తున్న తీరు దేశవ్యాప్తంగా ప్రజలను శోక సంద్రంలో ముంచింది. దాదాపు 459 మంది (అత్యధిక మంది విద్యార్థులు)తో విహార యాత్రకు బయలుదేరిన ఫెర్రీ (నౌక) బుధవారం ఉదయం దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఫెర్రీ క్రమక్రమంగా నీటీలో మునిగిపోయింది. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న దక్షిణ కొరియా ఉన్నతాధికారులు వెంటనే తీర గస్తీ దళం, సైన్యాన్ని రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు మరణించగా, 55 మంది గాయాలతో బయటపడ్డారు. మరో 292 మంది జాడా ఇంత వరకు తెలియరాలేదు. కొరియాలో సంభవించిన ఫెర్రీ దుర్ఘటన 1912లో ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అనాటి నౌక దుర్ఘటనలో పలువురుని సైన్యం కాపాడిన 1500 మంది జల సమాధి అయిన సంగతి తెలిసిందే. -
మరో ‘టైటానిక్’ ప్రమాదం
* ద.కొరియా తీరంలో నౌక మునక * నలుగురి మృతి, 292 మంది గల్లంతు సియోల్: దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ఘోరమైన ప్రమాదం సంభవించింది. 459 మంది తో ప్రయాణిస్తున్న నౌకలో ప్రమాదం తలెత్తి బుధవారం మెల్లమెల్లగా మునిగిపోయింది. ఇది మునగడానికి గంటల సమయం పట్టడంతో ఈలోగా హెలికాప్టర్లు, ఇతర నౌకల్లో అక్కడకు చేరుకున్న సహాయక సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 55 మంది గాయాలతో బయటపడ్డారు. మరో 292 మంది జాడ లేదు. ఈ ప్రమాదం 1912లో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఉదంతాన్ని గుర్తుకుతెచ్చింది. నాటి ఘటనలోనూ నౌక కొన్ని గంటలపాటు మునగ్గా, లైఫ్బోట్ల సాయంతో పలువురిని కాపాడారు. ఆ ప్రమాదంలో 1,500 మంది దాకా చనిపోయారు. తాజా ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. జాడ తెలియని వారిలో చాలామంది ఓడలోనే చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 146 మీటర్ల పొడవైన ఈ ఓడ ద.కొరియా వాయవ్య ప్రాంతంలోని ఇంచియాన్, జెజు దీవి మధ్య వారానికి రెండు సార్లు ప్రయాణిస్తుంది. ఆ క్రమంలో మంగళవారం రాత్రి ఇంచియాన్ను నుంచి బయలుదేరిన ఈ ఓడ 14 గంటల పాటు ప్రయాణించి పర్యాటక దీవి జెజు చేరాల్సి ఉంది. అయితే మరో మూడుగంటల్లో గమ్యాన్ని చేరుతుందనగా బ్యాంగ్పుంగ్ దీవికి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఓడలో16 నుంచి 17 ఏళ్ల వయసున్న 325 మంది హైస్కూల్ విద్యార్థులు, 15 మంది టీచర్లు, 89 మంది సాధారణ ప్రయాణికులు, 30 మంది సిబ్బంది ఉన్నారని ద.కొరియా భద్రత మంత్రి కంగ్ యంగ్ యు చెప్పారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళా సిబ్బంది, ఒక హైస్కూల్ బాలుడు ఉన్నారు. 164 మందిని కాపాడామన్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం సహాయక చర్యలపైనే దృష్టి పెట్టామని చెప్పారు. నౌక మునిగిపోవడానికి గల కారణాలు తర్వాత అన్వేషిస్తామని అధికారులు చెప్పారు. 37 మీటర్ల లోతున్న సముద్రంలో బురద ఎక్కువగా ఉండడంతో నీటి లోపల అన్వేషణకు కష్టతరంగా ఉందన్నారు. -
బోరుబావిలో పడి బాలుడు మృతి
ఆలూరు మండలం హులేబేడులో గతరాత్రి బోరుబావిలో పడిన బాలుడు మృతదేహన్ని రెస్క్యూటీమ్ శనివారం వెలికి తీసింది. హులేబేడులో శుక్రవారం రాత్రి అడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ను పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలించారు. రెస్క్యూ టీమ్ గతరాత్రి నుంచి కృషి చేసి బాలుడి మృతదేహన్ని శనివారం ఉదయం బోరుబావి నుంచి వెలికితీసింది. అలాగే చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
బోరుబావిలో పడి బాలుడు మృతి
ఆలూరు మండలం హులేబేడులో గతరాత్రి బోరుబావిలో పడిన బాలుడు మృతదేహన్ని రెస్క్యూటీమ్ శనివారం వెలికి తీసింది. హులేబేడులో శుక్రవారం రాత్రి అడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ను పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలించారు. రెస్క్యూ టీమ్ గతరాత్రి నుంచి కృషి చేసి బాలుడి మృతదేహన్ని శనివారం ఉదయం బోరుబావి నుంచి వెలికితీసింది. అలాగే చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.