Sakshi Breaking News
-
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి.. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. CM Jagan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ ఎదుటి వారి కష్టం వినాలే కానీ, వెంటనే స్పందించడంలో తన తర్వాతే ఎవరైనా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర్రెడ్డి దంపతుల మూడున్నరేళ్ల కుమారుడు యుగంధర్రెడ్డికి లివర్ దెబ్బతింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీడీపీ అంతర్గత సర్వే ఏం చెబుతోంది?.. షాక్లో మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లా పార్టీలో తిరుగులేదనుకున్న దేవినేని ఉమాకు, గన్నవరం ఇన్చార్జిగా ఇటీవల వెళ్లిన బచ్చుల అర్జునుడుకు పార్టీ తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గురుకులాల్లో కొలువులు 12,000.. అతి త్వరలో నోటిఫికేషన్లు? రాష్ట్రంలో మరిన్ని ప్రభు త్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసు, గ్రూప్స్ కొలువులకు నోటిఫికేషన్లు జారీకాగా.. తాజాగా గురుకులాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) చర్యలు చేపట్టింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ ‘‘ఆటంక్, లట్కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పేదలను లూటీ చేసినవారు తనను దూషిస్తున్నారని చెప్పారు. అవినీతికి చరమగీతం పాడినందుకు నిత్యం తిడుతున్నారని ఆక్షేపించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్ విద్యార్థినిపై ఫ్రొఫెసర్ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనలో తప్పించుకున్న బాధితురాలు.. గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. International Disability Day: నిశ్శబ్ద విజయం పూర్తిగా వినపడకపోతే ఏమవుతుందో తెలుసా?’ అని అడుగుతుంది సోను ఆనంద్ శర్మ. పూర్తిగా వినపడని వారు దానికి పూర్తి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా వినపడని వారికే ఆ బాధ తీవ్రత తెలుస్తుంది. ‘వినడం వల్లే భాష మాట్లాడతాం. వాక్యాన్ని నిర్మిస్తాం. గ్రామర్ నేర్చుకుంటాం. పూర్తి వాక్యం రాస్తాం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సొంత ఇల్లు కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..! ప్రస్తుతం శివారు ప్రాంతాలలో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి... ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, విల్లా ఏ ప్రాజెక్ట్ చేయాలని బిల్డర్ నిర్ణయించుకుంటాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బంగ్లాదేశ్తో తొలి వన్డే.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ఆటగాడు దూరం బంగ్లాదేశ్తో తొలి వన్డేకు ముందు టీమిండియా భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మొత్తం వన్డే సిరీస్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్కు ముందు ప్రాక్టీస్లో భాగంగా మహ్మద్ షమీ చేతికి గాయమైనట్లు బీసీసీఐ ఆధికారి ఒకరు తెలిపారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. లేట్ అయినా లేటెస్ట్గా వస్తామంటున్న స్టార్ హీరోలు అభిమాన హీరో సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ చెప్పిన తేదీకి ఆ సినిమా రాకపోతే నిరుత్సాహపడతారు. 2022లో అలా అభిమానులను నిరాశపరచిన స్టార్స్ ఉన్నారు. ఈ ఏడాది సిల్కర్ స్క్రీన్పై కనిపించాల్సిన ఆ హీరోల సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. జన సునామీ.. మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకతో మదనపల్లె కిక్కిరిసింది. సభా ప్రాంగణం, రోడ్లన్నీ కిటకిటలాడాయి. ఇంత వరకు ఏ రాజకీయ నేతకు, ముఖ్యమంత్రికి దక్కని ఘన స్వాగతం, జన నీరాజనం ఆయనకు లభించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్ మదనపల్లెలో బుధవారం సీఎం వస్తున్న దారిలో హమీదా అనే మహిళ తన ఏడాదిన్నర వయసున్న చిన్నారిని చేతులపైకి ఎత్తుకుని ‘జగనన్నా.. నా బిడ్డను కాపాడన్నా’ అని వేడుకుంది. బస్సులో నుంచి ఆ దృశ్యం గమనించిన సీఎం.. ఆమెను సభాస్థలి వద్దకు పిలిపించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కవిత, షర్మిల ట్వీట్ల యుద్ధం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ట్విట్టర్ వేదికగా పరస్పర విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.పేదల బియ్యంతో కోట్లకు పడగ రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా ఓ మాఫియాగా తయారైంది. గ్రామాలు, పట్టణాల్లోని బస్తీల నుంచి సేకరించే బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్నా, రైస్ మిల్లులకు చేరవేయాలన్నా.. జిల్లాల స్థాయిలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న తొలి విడత పోలింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 89 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించునేందుకు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. భారత్లో అబ్బాయిలకే కేన్సర్ వ్యాధి ఎక్కువ భారత్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే అధికంగా కేన్సర్ బారిన పడుతున్నారని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. సమాజంలో లింగ వివక్షే దీనికి కారణమై ఉండవచ్చునని అభిప్రాయపడింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.ఐసిస్ చీఫ్ హతం.. కొత్త అధినేతను ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు. సిరియా తిరుగుబాటు శక్తులతో జరిగిన భీకర పోరులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఐసిస్ బుధవారం ఓ ఆడియో సందేశంలో తెలిపింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం చైనాకు చెందిన అలీబాబా కంపెనీ అలీపే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో తనకున్న వాటాల నుంచి 3.07 శాతాన్ని (26,28,73,507 షేర్లు) విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూపంలోనే ఈ విక్రయం జరిగింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాలీవుడ్ బ్యూటీ మాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ చిత్రాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గార్గీ వంటి సక్సెస్ఫ/ల్ చిత్రంతో నిర్మాతగానూ మారారు. ఇటీవల అమ్ము అనే చిత్రంతో టైటిల్ పాత్ర పోషించింది. ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అయి మంచి పేరును తెచ్చిపెట్టింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్కు ఊహించని షాక్! కానీ.. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి అందరి కంటే ముందుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించిన ఫ్రాన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్కు అనూహ్య పరాజయం ఎదురైంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. నేడు జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేయనున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: టీచర్లు.. టీచింగ్కే విద్యారంగ సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల సమగ్ర పురోభివృద్ధికి వీలుగా ప్రభుత్వ టీచర్లకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించరాదని నిర్ణయించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఎదురుదాడికి టీఆర్ఎస్ స్పెషల్ స్ట్రాటజీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీపై సాగుతున్న ప్రతికూల ప్రచారానికి పకడ్బందీగా అడ్డుకట్ట వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు? మంత్రి మల్లారెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు మంగళవారం రెండోరోజు కూడా విచారణ కొనసాగించారు. మల్లారెడ్డి ఆడిటర్తోపాటు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అందరి చూపు సుప్రీం వైపు.. సరిహద్దుల్లో భారీగా బలగాలు కర్ణాటక–సరిహద్దు వివాదంపై బుధవారం సుప్రీంకోర్టులో అతి ముఖ్యమైన విచారణ జరగనుండగా, అందరి చూపు సర్వోన్నత న్యాయస్థానంపై కేంద్రీకృతమైంది. తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ సర్కారుతో పాటు ప్రజల్లోనూ నెలకొంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గుజరాత్ ఎన్నికలు: కాంగ్రెస్ను ఊడ్చేస్తుందా? గుజరాత్లో అధికార పీఠం కోసం మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎడాపెడా హామీలతో ప్రచార పర్వాన్ని ఇప్పటికే రక్తి కట్టించాయి. రేపు తొలి దశకు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 5న రెండో, తుది దశ పోలింగ్తో అన్ని పార్టీల భవితవ్యమూ ఈవీఎంల్లోకి చేరనుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. యూనివర్సిటీలు ఖాళీ చైనాలో ‘జీరో కోవిడ్’ నిబంధనలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై షీ జిన్పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిరసనలు, ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులను వారి ఇళ్లకు బలవంతంగా పంపిచేస్తుండడం గమనార్హం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. యాకమ్మ ఒక గొప్ప వెలుగు తాళ్లపల్లి యాకమ్మ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. కథలు అంటే తెలియదు. మహబూబాబాద్ దళితవాడలో అర్ధాకలితో పెరిగిన యాకమ్మ తల్లిదండ్రుల్ని కోరింది ఒక్కటే – చదివించమని. ఇంటర్లో పెళ్లయినా ఆ తర్వాత పిల్లలు పుట్టినా యాకమ్మ చదువు మానలేదు. తెలుగులో పిహెచ్డి చేసింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మీరిద్దరు ఏం చేశారు? అది ఎటాక్లా లేదే.. దొరికిపోయావ్ శ్రీహాన్! బిగ్బాస్ ఆరో సీజన్ ముగింపు దశకు వచ్చింది. 13వ వారంలో హౌస్లో 8 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ని పెట్టాడు బిగ్బాస్. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్కు చేరుకుంటారు 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. బీసీసీఐ అధ్యక్షుడిపై ఆరోపణలు.. ఆమె కారణంగా..! బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా ఈ విషయంపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్కు ఫిర్యాదు చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. AP: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. ఆ రెండు శాఖల్లోనే ఎక్కువ ఖాళీలు.. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వంటి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల వివరాలు ఇవే.. పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త! 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. Neena Rao: విజేత తల్లి ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! ‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్లో మొదలైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. టాలీవుడ్లో మాస్ జాతర.. పూనకాలు తెప్పిస్తారట! టికెట్లు బాగా తెగాలంటే మాస్ ప్రేక్షకులు రావాలి. అందుకే ఏడాదికి రెండొందల సినిమాలు వస్తే.. వాటిలో తొంభై శాతం మాస్ సినిమాలే ఉంటాయి. ఆ మాస్ బొమ్మ (సినిమా) బాగుంటే ఇక మాస్ ప్రేక్షకులకు పండగ... వసూళ్లతో బాక్సాఫీస్కి పండగ. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘మాస్ బొమ్మ’లపై ఓ లుక్కేద్దాం... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 28న అకౌంట్లలో నగదు జమ 2022 ఖరీఫ్ సీజన్లో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఆ సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘పండంటి’ రాష్ట్రం.. దేశంలోనే ఏపీ అగ్రగామి ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే అన్నదాత అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. పండ్ల తోటలు తగ్గిపోతున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులను ఉత్సాహపరుస్తున్నాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. ఆ లాకర్స్లో ఏమున్నాయి? తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, భాగస్వాములపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనంగా మారింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో తీవ్ర నష్టం కలుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. యువతరం.. ఎవరి పక్షం...! ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా అందరి దృష్టి యువతపైనే. ప్రధాని మోదీకి యువతలో క్రేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పులో కాస్త మార్పు కనిపించింది. ఈ సారి యువ ఓటర్ల మదిలో ఏముందో తెలుసుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పక్షులు చూపిన ‘బుల్లెట్’ మార్గం.. నిజమే.. ఆ కథేంటంటే జపాన్ అంటేనే టెక్నాలజీకి మారుపేరు.. సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకూ మూలం. గంటకు నాలుగైదు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు ఆ దేశానికి ప్రత్యేకం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఓటీటీలకు షాక్: సీవోఏఐ కొత్త ప్రతిపాదన ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్స్ సేవలు అందించే సంస్థలకు కూడా లైసెన్సింగ్ విధానం, తేలికపాటి నియంత్రణ ఫ్రేమ్వర్క్ ఉండాలని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ‘తోడేలు’ మూవీ రివ్యూ తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా పోర్చ్గల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. వరుసగా ఐదు వరల్డ్ కప్ టోర్నీల్లో గోల్ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని హెచ్.మురవణి నాలుగవ మైలు రాయి వద్ద గురువారం చోటుచేసుకుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాను అని ఎంపీ రఘురామ అన్నట్లు సమాచారం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్టాప్పై హైడ్రామా.. అసలేం జరిగింది? తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు లభించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. 2 నెలల్లో 1.25 లక్షల తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం? క్రికెట్ మ్యాచ్లో వెంట వెంటనే వికెట్లు పడిపోతుంటే అభిమానుల గుండె బరువెక్కిపోతుంది తప్ప ఇతరత్రా కష్టనష్టాలు ఉండవు. అదే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు టపటప ఊడిపోతుంటే.. కుటుంబాలు కుటుంబాలు కష్టాలపాలవుతాయి. ఆ కుటుంబాల మీద ఆధారపడ్డ చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్లోని అమృత్సర్లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య ఇద్దరూ పెద్ద కంపెనీల్లో టెక్కీలు, కావలసినంత జీతం వస్తుంది, విలాసవంతమైన జీవితం ముందుంది. కానీ భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర ఆవేదనకు లోనైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తి నగర రిచర్డ్ గార్డెన్లో ఈ నెల 10వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు సత్యం స్కామ్ చార్టర్డ్ అకౌంటెంట్ల వైఫల్యమేనని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ అకౌంట్ పుస్తకాలను ఆడిట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమైనట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరేఖ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బంగ్లాతో వన్డే సిరీస్తో పాటు టెస్టులకు కూడా దూరమయ్యాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో మోకాలి గాయం బారిన పడిన జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Kamal Haasan: కమల్ హాసన్కు అస్వస్థత స్టార్ హీరో కమల్హాసన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంలో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్లో ఆయనను చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, డిశ్చార్ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. ఏపీ సర్కార్ కొత్త చరిత్ర.. మీ భూమి మా హామీ అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సాకారం చేసి కొత్త చరిత్రను లిఖిస్తోంది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.ఏపీకి కేంద్ర బృందం కితాబు.. దేశమంతటా సచివాలయాలు గ్రామీణ ప్రజలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా సేవలందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలన్నీ సర్వత్రా ప్రశంసలు అందుకోగా దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మల్లారెడ్డి కుమారుడికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రికి తరలింపు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన కుమారులు, బంధువులు, బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. దక్షిణం గాలి ఎటువైపు? ఆప్ దెబ్బకు బీజేపీ ఆశలు గల్లంతేనా? దక్షిణ గుజరాత్. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. ఒకవైపు వ్యాపారులు, మరోవైపు ఆదివాసీల సమ్మేళనమైన ఈ ప్రాంతవాసులు ఎటు వైపున్నారు? 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. నవతరం నయా ట్రెండ్ ‘వీ’ ట్యూబింగ్.. ఇంతకి ఏంటది? మన దేశంలో టాప్ యూట్యూబర్స్ ఎవరు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం కాకపోవచ్చు. కానీ ‘వీట్యూబర్స్ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం రాకపోగా ‘ఇంతకీ వారు ఎవరు?’ అనే ఎదురు ప్రశ్న ఎదురుకావచ్చు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆర్థిక వ్యవస్థ: 40 లక్షల కోట్ల డాలర్లకు భారత్! స్వచ్ఛ ఇంధనం, డిజిటలీకరణ విప్లవాల దన్నుతో 2047 నాటికి భారత ఎకానమీ 13 రెట్లు వృద్ధి చెందనుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ధీమా తెలిపారు. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 40 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని చెప్పారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. త్రిష పారితోషికం డబుల్.. ఒక్కో సినిమాకు ఎన్నికోట్లో తెలుసా? అదృష్టం ఎవరిని ఎప్పుడు? ఎలా? వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసొస్తే ప్రతిభ అనేది రెండోది అవుతుంది. ముఖ్యంగా సినీ రంగంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సౌదీ అరేబియా కమాల్ కియా... లుజైల్ స్టేడియం 88 వేల మంది ప్రేక్షకులతో హోరెత్తిపోతోంది... అందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా అభిమానులే అయినా... అర్జెంటీనాను ఆరాధించేవారు కూడా తక్కువేమీ కాదు! 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా.. వరకట్న వేధింపులకు మరో అబల బలైన ఘటన నెలమంగల తాలూకా భూసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. శ్రుతి (29) తన భర్త క్రిష్ణమూర్తి చేతిలో హత్యకు గురైంది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఐదు బ్యాక్టీరియాలకు.. భారత్లో 6.8 లక్షల మంది బలి ఈ.కోలి. ఎస్ నిమోనియా, కె.నిమోనియా, ఎస్.ఏరియస్, ఎ.మౌమనీ. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలు 2019లో భారత్లో ఏకంగా 6.8 లక్షల మంది ఉసురు తీశాయని లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 560 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. లంకమల అడివి కానరాని కలివి కోడి.. ట్విక్–టూ.. ట్విక్–టూ అరుపులేవి! వైఎస్సార్ జిల్లాలో ఓ వైపు శేషాచలం.. మరోవైపు నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. అదే జిల్లాలోని సిద్ధవటం–బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఓ పక్షి ‘ట్విక్–టూ.. ట్విక్–టూ’ అని అరుస్తోంది. ఎంత అన్వేషించినా దాని జాడ మాత్రం కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో పెరిగే కలివి పొదల్లో నివసించే ఈ నిశాచర పక్షిని ‘కలివి కోడి’ అని పిలుస్తున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే! ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ ఇప్పట్లో హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సిట్ గతంలో ఇచ్చిన నోటీసు మేరకు బీఎల్ సంతోష్ సోమవారం విచారణకు కావాల్సి ఉంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను? బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ అద్దె బస్సులను కొనుక్కునే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3,100 అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు సొంతంగా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుతున్న విషయం తెలిసిందే. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మానవుడు తొలిసారి వండుకున్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నాడో తెలుసా? ఆది మానవుడు ఆహారాన్ని వండుకుని కాకుండా పచ్చిగానే తినేవాడని పుస్తకాల్లో చదువుకున్నాం. పచ్చిమాంసం, ఆకులు అలములు తిన్నట్లు కూడా చదువుకున్నాం. మానవుడు క్రమక్రమంగా పచ్చి ఆహారాన్ని కాకుండా వండుకుని తినడం నేర్చుకున్నాడు. అయితే, మానవుడు తొలిసారి వండుకున్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నాడో తెలుసా?! పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. గుజరాత్లో బీజేపీకి షాక్ తగులుతుందా? గుజరాత్లో విద్యుత్ బిల్లుల భారం తడిసిమోపెడు అవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ప్రభుత్వం నాలుగు సార్లు చార్జీలను పరోక్ష పద్ధతిలో పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో నేరుగా గుజరాత్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చార్జీల భారాన్ని మోపకుండా ఫ్యూయెల్ అండ్ పవర్ పర్చేజ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్పీపీపీఏ) రూపంలో పెంచింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అసలే డిజిటలైజేషన్ డేస్.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం! జీతం మీద ఆదాయం పన్నుకి గురవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 17 (1) ప్రకారంజీతం అంటే ఏమిటో విశదీకరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో యజమాని నుండి ఒక ఉద్యోగి పుచ్చుకున్న మొత్తాన్ని జీతం అని అన్నారు. ఇంతటితో వదిలిపెట్టకుండా ఏయే అంశాలుంటాయో ఏకరువు పెట్టారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. హార్దిక్ ఆదేశించాడు.. అలా చేయమని!నేను పూర్తి చేశాను టీ20 ప్రపంచకప్లో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్.. ఇప్పడు న్యూజిలాండ్తో టీ20 సిరీస్లోను అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఆదివారం కివీస్తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో సూర్య అద్భుతమైన శతకం సాధించాడు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 'వారిసు' చిత్ర వివాదం.. విజయ్ ఏం ప్రకటన చేయనున్నారు? సూపర్స్టార్ రజినీకాంత్ తర్వాత ఆస్థాయిలో అభిమానులను కలిగిన నటుడు విజయ్. ఈయన తన అభిమాన సంఘాల ద్వారా తమిళ ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విజయ్కి రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆసక్తి ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. పూజలో పాల్గొనేందుకు గుమిగూడిన జనం.. ట్రక్కు దూసుకెళ్లి 12 మంది దుర్మరణం.. బిహార్లోని వైశాలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు గుమిగూడిన జనంపైకి వేగంగా వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. ‘తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ మీడియాను వాడుకుంటున్నారు’ మార్గదర్శి చిట్ఫండ్స్ కేసు విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అరుణ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. వెంటిలేటర్లు తీస్తే అంతిమ యాత్రే: స్పీకర్ తమ్మినేని చంద్రబాబు అధికారం కోసం ఎంతకయినా దిగజారుతారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్రెడ్డి బహిష్కరణ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీకి క్యాన్సర్ సోకిందన్న వ్యాఖ్యలపై టీపీసీసీ చర్యలు తీసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఫాంహౌస్ కేసులో బీజేపీ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీఎల్ సంతోష్ను తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పంచెకట్టులో మోదీ.. కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించిన ప్రధాని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ-తమిళ సంగమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అబ్బబ్బే అలాంటిదేం లేదు, క్లారిటీ ఇచ్చిన గౌతమ్ అదానీ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార కార్యకలాపాల్ని విదేశాల్లో ప్రారంభించే యోచనలో ఉన్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. బిగ్బాస్: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయింది ఎవరంటే? ఊహించని ఎలిమినేషన్లతో వరుస ట్విస్టులిచ్చిన బిగ్బాస్ ఈసారి మాత్రం ఊహించని కంటెస్టెంట్నే బయటకు పంపించాడు. ఈవారం ఎవరు బయటకు వెళ్తున్నారో మీకీపాటికే అర్థమై ఉంటుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. సిరీస్ సొంతం సిడ్నీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సాగర తీరంలో రయ్ రయ్.. రేసింగ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది. నెక్లెస్రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్లో ఈ పోటీలు సాగాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష.. ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశాలు మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు. రూ.3,364 కోట్లతో హాస్టళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం వర్గాలకు ఆందోళన కలిగించేవి. ఇంతకాలం లేస్తే మనిషిని కానట్లుగా డబాయిస్తూ రాజకీయం చేసేవారు. కానీ ఈసారి ఆయన బేలగా, తాను అసెంబ్లీకి వెళ్లాలంటే టీడీపీని అధికారంలోకి తేవాలని అన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 'ఇండోర్లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆయనను చంపేస్తామని బెదిరింపులు రావడం పార్టీ శ్రేణులకు ఆందోళన కల్గిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఎంపీ ఇంటిపై దాడి.. తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు తెలంగాణ భవన్ ముట్టడి చేసేందుకు బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. ఇక తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమైన క్రమంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పాపం శ్రద్ధా వాకర్.. అప్పుడు కూడా అదే టార్చర్.. 2020 ఫోటో వైరల్ శ్రద్ధా వాకర్కు సంబంధించిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2020లో తీసిన ఫోటో ఇది. దీనిని చూస్తుంటే అఫ్తాబ్ అమిన్ పునావాలాతో ఆమె రిలేషన్ ఎంత భయంకరంగా ఉందనే దానికి అద్దం పడుతోంది. ఈ ఫోటోలో శ్రద్ధా కళ్లు, ముక్కు, చెంప చుట్టూ గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మరో షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో! ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య చేయడానికి కేవలం అయిదు రోజుల క్రితమే వీరిద్దరికి పరిచయం ఏర్పడటం గమనార్హం. వివరాలు.. అబు బాకర్ అనే యువకుడు సప్నా అనే యవతితో సహజీనం చేస్తున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. బెండకాయ వేపుడు.. బెండకాయ పులుసు.. బెండకాయ 65.. బెండకాయ కూర.. వంటకం ఏదైనా అందులో బెండీ ఉంటే చాలు లొట్టలేసుకుని భోజనం లాగించేస్తారు. కేవలం నోటికి రుచిగా ఉండటం మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది బెండకాయ. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్కు మరో షాక్! ట్విటర్ కొత్త బాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో షాక్ తగిలింది. తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆరోపిస్తూ ట్విటర్కు చెందిన దివ్యాంగ ఉద్యోగి ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో కోర్టులో మూడు కేసులు నమోదైనాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది' న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మాత్రం స్కై స్టేడియం సిబ్బందిని ఎండగట్టాడు. మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన సైమన్ డౌల్ స్టేడియంలో ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తి కలిగించింది. ఆ ఫోటోలో ఒక మసి గుడ్డను కుర్చీపై ఉంచాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. విడాకులకు సిద్ధమైన మరో యంగ్ హీరో నిఖిల్? ఫోటోతో తేల్చేశాడుగా! టాలీవుడ్లో చై-సామ్ల విడాకుల విషయం ఇప్పటికీ హాట్టాపిక్గానే ఉంది. తాజాగా మరో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ భార్య పల్లవితో విడిపోతున్నట్లు కొద్దికాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో భార్య పల్లవితో విడిపోయేందుకు నిఖిల్ సిద్ధమయ్యాడని, కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడని రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఒక్క పోస్ట్తో క్లారిటీ ఇచ్చారు నిఖిల్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. MLAs Purchase Case: బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్కు సిట్ నోటీసులు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్కు గురువారం సిట్ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 21న ఉదయం 10:30కి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అబద్ధాలపై పేటెంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఒక రికార్డు ఉంది. దేశంలోనే మరే నేత అంతలా అబద్దాలు ఆడలేరన్నది ఆయన రికార్డుగా చాలామంది చెబుతుంటారు. ఆయన విశిష్టత ఏమిటంటే ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్న అబద్దాన్ని అలవోకగా చెప్పడం. దానిని ప్రజలు నమ్మాలన్న ఉద్దేశంతో పదే, పదే వల్లె వేస్తుండడం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలంగాణలో ఎన్నికల వేడి.. కారు ఫైరింగ్.. అనూహ్యంగా ఎదిగిన కమలం ఇటీవల పర్యటనలో ప్రధాని మోడీ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేరుగా కెసిఆర్ పైన, ఆయన కుటుంబంపైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాకపోతే కెసిఆర్ పేరు ఎత్తలేదు. కాని మోడీ ప్రసంగంలో విమర్శల తీవ్రత భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంగా తీసుకోవచ్చు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇక ఈ జన్మకి మళ్లీ ముఖ్యమంత్రి కాలేవు.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశావ్ చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. చివరి అవకాశం అంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా ప్రజల మీద పడ్డావు అని మండిపడ్డారు. కులపిచ్చితో రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని నాశనం చేశావని మండిపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారికి భారీగా పెరగనున్న జీతాలు రైల్వే ఉద్యోగులకు శుభవార్త. సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అమెరికా అధ్యక్ష బరిలో బరాక్ ఒబామా భార్య.. స్పందించిన మిచెల్ అమెరికా మాజీ ప్రథమ మిచెల్ ఒబామాకి తరుచుగా ఎదరవుతున్న ప్రశ్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారా? లేదా అని. ఈ ప్రశ్న ఆమెకి తన భర్త ఒబామా అధ్యక్షుడిగా (2009 నుంచి 2017) ఉన్న సమయంలో కూడా ఈ ప్రశ్న ఎదురైంది. తదుపరి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా అంటూ పలువురు ఇప్పటికీ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. శ్రద్ధా హత్య కేసు: అంతుపట్టని మరో ట్విస్ట్....నివ్వెరపోయిన పోలీసులు యావత్తు దేశాన్ని భయబ్రాంతులకు గురి చేసిన ఢిల్లీ మెహ్రౌలీ హత్య కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అప్తాబ్ పూనావాలా, శ్రద్ధ ఇద్దరూ ఢిల్లీలో ఒక ఫ్లాట్లో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే పోలీసులు ఫ్లాట్ విషయంలో క్లూస్ కోసం దర్యాప్తు చేస్తుండగా.. నీటిబిల్లుల విషయం వారిని ఆశ్చర్యపరిచింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం! సూపర్స్టార్ కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్తో తొలి టీ20 కష్టమే! టీ20 ప్రపంచకప్లో ఘోర పరాభవం అనంతరం టీమిండియా తొలి టీ20 సిరీస్కు సిద్దమైంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టీ20 సిరీస్కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ కావడంతో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ను సొంతం చేసుకున్న బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగామరో సంచలన విషయాన్ని వెల్లడించారు. తారు అసలు ఏం కంపెనీకి సీఈవోగా ఉండాలని కోరుకోవడం లేదని ఈ క్రమంలోనే త్వరలోనే ట్విటర్కు కొత్త సీఈవోను ఎంపిక చేయనున్నామని ప్రకటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐకి నో చెప్పిన హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ సింగిల్ జడ్జి విజయ్సేన్రెడ్డి అధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. రేపు హైదరాబాద్కు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్కు వెళ్లనున్నారు. సూపర్స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్ టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు నానక్రామ్గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న కేసీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Viral Video: ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు ఖెర్సన్ నుంచి రష్యా బలగాలు వైదొలగడంతో ఉక్రెయిన్లో పండగ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నగరమంతా రష్యా బలగాలను తరిమికొట్టేశాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఆనందంగా ప్రకటించారు. ఈ మేరకు వెనక్కు మళ్లుతున్న రష్యా సేనాలు ఎలాగో పోరాడలేకపోయం కదా పోతూపోతూ... ఖెర్సన్ ప్రాంతంలో జూలోని జంతువులను పట్టుకుపోతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ హీరోగా వందల సినిమాలు చేసిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. హీరో, నిర్మాత, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్ అందించి చరిత్ర సృష్టించారాయన. అయితే తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ చివరికి ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రపంచకప్లో ఘోర వైఫల్యం! ధోనికి కీలక బాధ్యతలు.. త్వరలోనే బీసీసీఐ ప్రకటన ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియాది నెం1 స్థానం. ద్వైపాక్షిక సిరీస్లలో దుమ్మురేపుతున్న భారత జట్టు.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. చివరిసారిగా 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుచుకుంది. అప్పటి నుంచి భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 150 అడుగుల లోయలో చావు బతుకుల్లో బాలుడు..‘యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది సార్’ ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్కు వెళ్లాడు. ట్రెక్కింగ్ సమయంలో జోరున వర్షం. వర్షం ధాటికి వెనక్కి రాలేం. ముందుకు రాలేం. అలా అని అక్కడే ఉండిపోలేం. అచ్చం ఆ కుర్రాడు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి పై నుంచి 130 నుంచి 150 అడుగుల లోయలో పడ్డాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పిక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బి నీలం, ఎరుపు రంగులో కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే కాళ్ల దగ్గర ఉండే ఈ సిరలు దెబ్బతినడం, లేదా పై వైపునకు వెళ్లాల్సిన రక్తం సాఫీగా ప్రవహించకపోవడంతో కాళ్ల కింది భాగంలో, ప్రధానంగా పిక్కల వంటి చోట్ల రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఇలా కనిపించడాన్ని ‘వేరికోస్ వెయిన్స్’ అంటారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ప్రేయసి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్దా వాకర్ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు ఆదాయార్జన శాఖలపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అరెస్ట్ ఉప ఎన్నిక ముగిసి వారం రోజులు దాటినా కానీ మునుగోడులో రాజకీయ కాక మాత్రం తగ్గలేదు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ: మంత్రి కాకాణి ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ అంటూ ఎద్దేవా చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. 'కాంగ్రెస్కి వేసి ఓట్లను వృధా చేయకండి': అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను కాంగ్రెస్కి ఓటు వేసి ఓట్లను వృధా చేయకండి అన్నారు. అందుకు బదులుగా ఆప్కి ఓటు వేసి గెలిపించండి అని ప్రజలను అభ్యర్థించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. భర్తను చంపేందుకు ఆరుసార్లు యత్నం...మహిళకు 50 ఏళ్లు జైలు శిక్ష మురికవాడలో పెరిగిన ఒక నిరుపేద మహిళను పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇచ్చాడు. రాజకీయ నాయకురాలిగా ఎదిగేలా చేశాడు. అందుకు ప్రతిఫలంగా భర్తనే కడతేర్చేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. యువతితో సహజీవనం, హత్య, ముక్కలుగా నరికి.. ఢిల్లీ అంతటా 18 రోజుల్లో.. ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని యువకుడు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. యువతితో పరిచయం, సహజీవనం, హత్య, మృతదేహాన్ని ముక్కలుగా కోయడం, ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని భద్రపరిచిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’ టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది కుడి మోకాలికి గాయమైన విషయం విదితమే. ఈ గాయం తీవ్రతరం కావడంతో అతడు స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్తో సిరీస్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. అత్యవసర చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. షాకింగ్,ఎలాన్ మస్క్ భారీ షాక్.. మరోసారి వేల మంది ట్విటర్ ఉద్యోగుల తొలగింపు మల్టీమిలియనీర్, ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇవ్వనున్నారు. గత వారంలో ట్విటర్లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం అంటే సుమారు 3500 మందిపై వేటు వేశారు. అయితే ఈ వారం ముగిసేలోపే భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Children's Day 2022: పిల్లలవాణి.. స్కూల్ రేడియో! అంతా వాళ్లిష్టమే బడి అంటే పాఠాల బట్టీ కాదు.. వినోదం.. విజ్ఞానం కూడా! వాటిని పంచే ఓ సాధనం రేడియో! ఎస్.. ఆకాశ వాణి! కాకపోతే ఇది పిల్లల వాణి.. దీనికి కేంద్రం స్కూల్! అనౌన్సర్లు, రైటర్లు, స్టోరీ టెల్లర్లు, ఆర్టిస్టులు, ప్రోగ్రామ్ డిజైనర్లు.. స్టేషన్ డైరెక్టర్లు అందరూ పిల్లలే! అంటే విద్యార్థులే!! మరి శ్రోతలు..? 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్ మంగళగిరిలో జనసేన నాయకులపై టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లను పరిశీలించడానికి జనసేన కార్యకర్తలు మంగళగిరిలోని జగనన్న నగర్కి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులను లబ్ధిదారులు అడ్డుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు ఊహించని షాక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్ను ప్రజలు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్ టూర్ అట్టర్ఫ్లాప్.. తీవ్ర అసహనం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంకలాం జగనన్న కాలనీ పర్యటన అట్టర్ ప్లాప్ అయింది. జగనన్న గృహ లబ్ధిదారుల నుంచి కనీస స్పందన కరువైంది. గత కొద్ది రోజులుగా జనసేన నాయకులు జగనన్న ఇళ్లు పేదల కన్నీళ్లు అంటూ ప్రచారం చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నందకుమార్కు చెందిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫిల్మ్నగర్లోని హోటల్ డెక్కన్ కిచెన్లో కొంతభాగాన్ని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మోదీ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం! ఉదయ్పుర్- అహ్మదాబాద్ రైల్వే ట్రాక్పై భారీ పేలుడు రాజస్థాన్లోని ఉదయ్పుర్ జిల్లాలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. ఓడ బ్రిడ్జ్ నుంచి ఈ పేలుడు శబ్దం వచ్చినట్లు గమనించిన స్థానికులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరి అంత తక్కువా? చాలా మందికి ఒక ఇల్లు లేదా విల్లా కొనుగోలు చేయలానే కల ఉంటుంది. కానీ, ఎవరికైనా ఒక గ్రామాన్ని కొనుగోలు చేయాలనుంటుందా? బాగా డబ్బు ఉన్న వాళ్లు రెండు మూడు ప్రాంతాల్లో నివాస గృహాలు కొనుగోలు చేయటం సహజమే. అయితే, ఒక గ్రామం మొత్తం అమ్మకానికి ఉంటే.. అది కేవలం ఒక ఇంటి ధరకే వస్తే..? ఆ ఆలోచనే నమ్మశక్యంగా లేదు కదా! 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. T20 WC 2022 Final Winner: పాకిస్తాన్ను చిత్తుచేసి విశ్వవిజేతగా ఇంగ్లండ్ పొట్టి ఫార్మాట్ క్రికెట్లో ఇంగ్లండ్ మరోసారి జగజ్జేతగా నిలిచింది. 2010లో పాల్ కాలింగ్ వుడ్ బృందం ట్రోఫీ గెలవగా.. బట్లర్ సేన టీ20 ప్రపంచకప్-2022 కప్ను సొంతం చేసుకుంది. దీంతో మరోసారి వరల్డ్కప్ టైటిల్ గెలవాలన్న పాక్ ఆశలు అడియాసలయ్యాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పుష్ప-2 మేకర్స్పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్.. గీతా ఆర్ట్స్ వద్ద టెన్షన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. హైదరాబాద్లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు బన్నీ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప- 2 మూవీ అప్ డేట్స్ త్వరగా ఇవ్వాలంటూ అభిమానులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సామాన్యులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు! కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యవసరాల సరుకుల ధర పెరగడంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు కాస్త ఊరటరానుంది. దేశంలో కుకింగ్ ఆయిల్ రేట్లు (Cooking Oil) దిగివచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. IBS Ragging: ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్ కళాశాల ర్యాగింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్పల్లి పోలీస్లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి: సీఎం జగన్ దేశ ప్రగతి రథసారథి నరేంద్ర మోదీ అని, సహృదయంతో ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై కేసు నమోదు జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు నమోదయ్యింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్విత్ 177ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదయింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడన్న సంగతి ప్రధాని మోదీకి తెలిసిపోయిందా?! ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రావడం, పవన్ కళ్యాణ్ను కలవడం.. ఇది ఎల్లో మీడియాకు మహాదానందం కలిగించిందన్నది వారి పత్రికల్లో అచ్చేసిన రాతలను బట్టి సగటు ఆంధ్రులందరికీ అవగాహన కలిగిన విషయం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. నన్ను ఎంత తిట్టినా ఫర్వాలేదు, కానీ..: ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే తెలంగాణలో చీకట్లు తొలగిపోవాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. హిమాచల్లో పోలింగ్.. దృష్టి మాత్రం ‘కాంగ్రా’పైనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా పోలింగ్ జరుగుతోన్నా.. అందరి చూపు మాత్రం ఒక్క జిల్లాలో ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయన్నదానిపైనే ఉంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకమని ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితమయింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఎట్టకేలకు పుతిన్ సేనలకు ఊహించని పరాభవం.. ఫుల్ జోష్లో ఉక్రేనియన్లు ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా సేనలు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా రష్యా సైన్యం.. ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. బాంబు దాడులతో ఉక్రెయిన్ సేనలను, ఆ దేశ పౌరులను భయభాంత్రులకు గురిచేసిన విషయం తెలిసిందే. అయితే, 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. వణుకుతున్న ఉద్యోగులు.. ఏడాది చివరికల్లా మాంద్యంలోకి ఆ దేశాలు! ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ స్టార్ నటి బిపాసా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె 2016లో కరణ్ సింగ్ గ్రోవర్ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాలో పంచుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టీమిండియాకు వచ్చిన ప్రైజ్మనీ ఎంతంటే? టి20 ప్రపంచకప్లో భాగంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాజయం చవిచూసి ఇంటిబాట పట్టింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్ తుది సమరంలో పాకిస్తాన్తో తలపడనుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. జనసేన నాయకుల ఓవరాక్షన్.. దెబ్బకు జారుకున్నారు కృష్ణా జిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన నాయకులు ఓవరాక్షన్ చేశారు. జగనన్న లే ఔట్ను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నాయకులు సౌకర్యాలు లేవని చెప్పాలంటూ లబ్ధిదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వెంటే తాను ఉంటానని తుమ్మల స్పష్టం చేశారు. ములుగు జిల్లా వాజేడులో గురువారం ఆయన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: రామచంద్రభారతిపై ప్రశ్నల వర్షం.. కీలక స్టేట్మెంట్.. అందులో ఏముంది? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను రాజేంద్రనగర్ సీఎస్లో పోలీసులు విచారించారు. తొలి రోజు విచారణలో సుమారు 7 గంటల పాటు నిందితులను ప్రశ్నించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రమాణం చేయగలవా..? చంద్రబాబుకు కొడాలి నాని సవాల్ లిక్కర్ స్కాంలో అరెస్టయిన వారిలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరని.. అరబిందో సంస్థతో నీకు సంబంధం లేదని ప్రమాణం చేయగలవా..? అంటూ చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా పలువురు సీనియర్ నాయకులు పోటీ విముఖత చూపారు. తాము పోటీ చేయడం లేదని, అభ్యర్థుల ఎంపికలో తమ పేర్లు పరిశీలించొద్దని అధిష్టానానికి తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. గొప్ప మనసు చాటుకున్న లాలూ కూతురు.. తండ్రికి కిడ్నీ దానం చేయాలని నిర్ణయం బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె గొప్ప మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కొత్త జీవితం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. సింగపూర్లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అన్నంత పనిచేస్తున్న పుతిన్... చిన్నారులకు సైతం సైనిక శిక్షణ ఉక్రెయిన్పై గెలుపు కోసం పుతిన్ పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు లక్షల మందికి పైగా సైనికులను సైతం రిక్రూట్ చేసుకుంది రష్యా. ఇప్పుడూ ఏకంగా చిన్నారులకు పాఠశాల స్థాయి నుంచి సైనిక శిక్షణ ఇవ్వమంటూ ఆదేశాలు జారీ చేసింది రష్యా. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Ind Vs Eng: టీమిండియా ఓటమి.. ఫైనల్కు చేరుకున్న ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో టీమిండియాను చూడాలనుకున్న అభిమానుల ఆశ నెరవేరలేదు. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్తో తలపడ్డ రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. కన్నీరు పెట్టుకున్న రోహిత్ శర్మ ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్-2022 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. బౌలర్లు మాత్రం తీవ్ర నిరాశపరిశారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అంశం ఐటీలో కలకలం రేపుతోంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ! కారణం ఇదేనా? నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హోమ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఇటు వైపు అడుగులు వేస్తున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పెద్ద మనసు చాటుకున్న సీఎం జగన్ తలసేమియా వ్యాధితో బాధపడుతోన్న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణపేటకు చెందిన బాలుడు దంగేటి యశ్వంత్(7) చికిత్సకు సీఎం వైఎస్ జగన్ సహాయం అందించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్మార్టం.. ఆ నివేదికలో ఏముంది? మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం రాత్రి వరకు కొనసాగడంతో బూత్ల వారీగా పోలింగ్ సరళిపై టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం పోస్ట్మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనాకు వచ్చింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. పీఎంఓ సీరియస్..! టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం చినికిచినికి గాలివానలా మారుతుండటం, నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలపైనే ఆరోపణలు రావడంతో.. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5.కొలీజియంలో పారదర్శకత లేదు.. న్యాయవ్యవస్థలో రాజకీయాలు సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నన్ను చంపజూసింది ప్రధానే ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను చంపేందుకు కుట్ర పన్నారని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. సెలూన్ వ్యాపారంలోకి రిలయన్స్! వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇప్పుడు సెలూన్ వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. గ్రూప్ సంస్థ, దేశీయంగా అతి పెద్ద రిటైలింగ్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ తాజాగా చెన్నైకి చెందిన నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. తప్పయింది క్షమించండి: మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి కాంతార సినిమా తరహాలో పంజర్లి దేవుడి వేషం వేసి రీల్స్ చేసి తుళునాడు (కొడగు) ప్రజల ఆక్రోశానికి గురైన హైదరాబాద్కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి ధర్మస్థల మంజునాథస్వామి సన్నిధిలో క్షమాపణలు కోరారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్లు.. విరాట్ కోహ్లి ఇవాళ(నవంబర్ 5న) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లి గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.అయితే ప్రతీ మనిషికి ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రేమించొద్దని చెప్పినా వినలేదని.. ప్రేమ వ్యవహారం వద్దని నచ్చజెప్పినా వినలేదని కన్న కూతురిని తండ్రి హత్యచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. తూర్పుగోదావరికి సీఎం జగన్.. పర్యటన షెడ్యూల్ ఇదే.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. టీడీపీ దొంగాట!.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వక్రబుద్ధి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన విద్యాసంస్థలు, కళాశాలలు ఉండడంతో రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో నాన్టీచింగ్ సిబ్బందినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. కేసీఆర్ విడుదల చేసిన 70 నిమిషాల వీడియో సంభాషణ ఇదే.. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి సంబంధించి మొయినాబాద్ మండలంలోని అజీజ్నగర్ ఫామ్హౌస్లో బీజేపీ దూతలుగా చెబుతున్న వారి మధ్య జరిగిన వీడియో సంభాషణల రికార్డింగ్ను (మొత్తం నాలుగు క్లిప్లు) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం బహిర్గతం చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పెరిగిన ఓటింగ్ శాతం.. బీజేపీ ఏమంటోంది? మునుగోడులో ఓటింగ్ సరళి, వివిధ వర్గాల ఓటర్ల స్పందనను బట్టి బీజేపీదే గెలుపు అని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు న్నారు. పెరిగిన ఓటింగ్ శాతం, సాయంత్రం దాకా ఓటర్లు పోలింగ్ బూత్లకు వెల్లువెత్తడం వంటివి తమకు అనుకూలమని అంచనా వేస్తున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.గుజరాత్లో ముక్కోణపు పోటీ! గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలయ్యింది. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆగమనంతో ఈసారి ముక్కోణపు పోటీ జరగబోతోంది. రాష్ట్రంలో దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఎన్నికల పోటీ కొనసాగుతోంది. ఇప్పుడు ‘ఆప్’ సైతం ఆ రెండు పార్టీలకు సవాళ్లు విసురుతూ రణరంగంలోకి అడుగు పెడుతోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు ఆయన పేరు మైక్ మెరిల్. అమెరికాలోని పోర్ట్లాండ్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ‘టెక్ సపోర్ట్, వెబ్3 డెవలప్మెంట్’ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు 2008లో ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. కంపెనీలు, షేర్లు ఎందుకుగానీ.. తనకు తానే ఓ కంపెనీగా చేసుకుని, తన జీవితాన్నే షేర్లుగా మార్చి అమ్ము కోవాలని నిర్ణయించుకున్నాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Shikha Khanna: నూరు తల్లుల కథ 31 ఒక్క దేశాలు. 100 మంది తల్లులు. వారు టీచర్లు, సైంటిస్ట్లు, క్రీడాకారులు, సంగీతకారులు, మహిళా సైనికులు... రంగాలు వేరు. కాని మాతృత్వం ఒకటే. ఒక మహిళ నిర్వహించే అత్యుత్తమ కర్తవ్యం తల్లి కావడం. అందుకు ప్రతి తల్లీ ఒక భిన్న ప్రయాణం చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అక్టోబర్లో ‘సేవలు’ బాగున్నాయ్! భారత్ సేవల రంగం అక్టోబర్లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుందని ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సూచించింది. సెప్టెంబర్లో ఆరు నెలల కనిష్టం 54.3కు పడిపోయిన సూచీ, అక్టోబర్లో 55.1కు ఎగసింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" ఆరోపణలు .. వివరణ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్ బంగ్లాదేశ్తో అఖరి హోరాహోరీగా జరిగిన పోరులో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" చేశాడని బంగ్లా బ్యాటర్ నూరల్ హసన్ ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వివాదాస్పద ఘటనపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘బనారస్’మూవీ రివ్యూ సిద్ధార్థ్(జైద్ ఖాన్) ఓ ధనవంతుడి కుటుంబానికి చెందని యువకుడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో తండ్రి గారాబంగా పెంచుతాడు. స్నేహితులతో పార్టీలు.. ట్రిప్స్ అంటూ లైఫ్ని ఎంజాయ్ చేసే సిద్ధార్థ్.. ఓ పందెంలో నెగ్గడం కోసం ధని(సోనాల్ మోంటెరో)కి దగ్గరవుతాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. Munugode Bypoll 2022: ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు నిరీక్షిస్తున్నారు. చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికేతర టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బీజేపీ ఆందోళనకు దిగింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. నాపై ఈగ వాలినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊరుకోదు.. ఈటల హెచ్చరిక తన హత్యకు కుట్ర జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని చెప్పారు. సీఎం ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, పక్కా స్కెచ్ ప్రకారమే మంగళవారం మునుగోడులో తనపై దాడి జరిగిందని అన్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పిల్లల్ని చదువుకోనివ్వండి రామోజీ! ఇంకెన్నాళ్లు కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ము కాసే ఈ రాతలు? ప్రభుత్వ స్కూళ్లపై విషం చిమ్మటం వెనక రామోజీరావు ఆందోళన ఒక్కటే. ప్రభుత్వ స్కూళ్లను ఫణంగా పెట్టి తాము పెంచిపోషించిన కొన్ని కార్పొరేట్ స్కూళ్లకు నూకలు చెల్లుతున్నాయన్నదే!. గాలీవెలుతురూ లేని భారీ భవనాల్లో.. విద్యార్థులను బట్టీపట్టే యంత్రాల్లా మార్చేసే ఈ ‘కార్పొరేట్’ స్కూళ్లకు కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబు ఇపుడు అధికారంలో లేరన్నదే ఆయన బాధ. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. గెహ్లాట్ VS సచిన్ రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మరోసారి సీఎం అశోక్ గెహ్లాట్పై దాడికి దిగారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమంలో గెహ్లాట్పై ప్రశంసలు కురిపించడాన్ని సీరియస్గా తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ ఇజ్రాయెల్లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అంతన్నావు.. ఇంతన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్? టీమిండియాతో మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాము టైటిల్ గెలవడానికి రాలేదని, టీమిండియాను మాత్రం ఓడించితీరతామని అని షకీబ్ కామెంట్ చేశాడు. అయితే బుధవారం భారత్తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు టీవీ సీరియల్స్లో జరిగే ట్విస్ట్లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. డీజిల్పై ఇప్పటికీ రూ.4 నష్టమే! ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) డీజిల్పై లీటరుకు ఇప్పటికీ రూ.4 చొప్పున నష్టపోతున్నాయని కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం పేర్కొన్నారు. అయితే పెట్రోల్ విషయంలో కంపెనీల మార్జిన్లు సానుకూలంగానే ఉన్నాయని తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పవన్కళ్యాణ్ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, బయటకు వెళ్లినప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్టు ఫోర్జరీ లేఖ వైరల్.. స్పందించిన బండి దొంగ పాస్పోర్టులు తయారుచేసిన వాడికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం పెద్ద కష్టం కాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫోర్జరీ లేఖ వైరల్ కావడంపై మంగళవారం రాత్రి ఆయన స్పందించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు స్థానికేతర నేతలు, శ్రేణులంతా మునుగోడు నియోజకవర్గం బయటకు వచ్చినా ఈ నెల 3న పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఓటర్లపై పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రిజిస్ట్రేషన్ల అధికారంపై వ్యాజ్యం మూసివేత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని కల్పించడం సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని అడ్డుకున్నట్టు కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులతో పాటు సబ్ రిజిస్ట్రార్లు కూడా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హులేనని స్పష్టం చేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Rain Forecast: వచ్చే రెండు రోజులు వర్షాలు రాబోయే రెండ్రోజులూ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. గుర్తింపుకు నోచని రక్తచరిత్ర.. మాన్గఢ్ ధామ్.. మరో జలియన్ వాలాబాగ్ ఆదివాసీల ప్రాబల్యమున్న మాన్గఢ్ ప్రాంతమది. బ్రిటిష్ పాలనలో రక్తమోడింది. జలియన్వాలాబాగ్ ఘటనకి ఆరేళ్ల ముందు ఇక్కడ తెల్లదొరలు మారణహోమం సాగించి అక్షరాలా 1500 మంది ఆదివాసీల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మా వైఫల్యం వల్లే ఆ 156 మంది చనిపోయారు: పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ రాజధాని సియోల్లో శనివారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు తమ వైఫల్యమే కారణమని దేశ పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ అంగీకరించారు. హాలోవిన్ ఉత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 156 మంది చనిపోగా, మరో 151 మంది గాయపడ్డారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. జాబ్ మానేయ్!.. నిజమే కదా! అనుకుని త్యాగం.. డిప్రెషన్లోకి వెళ్లి.. ఉద్యోగం చేసే స్త్రీ విషయంలో కుటుంబంలో ఎదురయ్యే ప్రతీ సమస్య ఆమెకు ఎప్పుడూ ఓ సవాల్గానే ఉంటుంది. పిల్లల సంరక్షణ, పెద్దల ఆరోగ్యం, ఆఫీస్ ఇంటికి దూరమైనా, ఆర్థికంగా బాగున్నాం అనుకున్నా... ముందుగా ‘ఆమె’ను ‘ఉద్యోగం మానేయ్!’ అని అంటుంటారు ఇంట్లో. ‘నిజమే కదా! నా అవసరం మొదట ఇంటికే ఉందనుకుంటూ కుటుంబం కోసం కెరియర్ను త్యాగం చేసేస్తుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Elon Musk క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా? బిలియనీర్, టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ బ్లూ టిక్ చార్జీపై క్లారిటీ ఇచ్చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో యూజర్లు తమ బ్లూ టిక్ను నిలుపు కోవాలన్నా, కొత్తగా బ్లూటిక్ కావాలన్నా ఇక చెల్లింపులు చేయాల్సిందే. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్తో కీలక మ్యాచ్లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే తమ సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్కు చేరే జట్లను భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అంచనా వేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. Bigg Boss 6: నిందలు తట్టుకోలేక బాత్రూంలోకి ఇనయా.. రంగంలోకి బిగ్బాస్ బిగ్బాస్ హౌస్లో ప్రస్తుతం 9వ వారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్లో హౌస్మేట్స్ అంతా ఇనయాను టార్గెట్ చేశారు. ఆమె పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తూ హేళన చేశారు. ముఖ్యంగా సూర్య విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. దీంతో ఇనయా మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ నేడే అమరావతి రాజధాని కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు. లలిత్ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కల్లు కిస్తీలు రద్దు.. ఐదేళ్లకు కల్లుగీత పాలసీ మార్గదర్శకాలు విడుదల ఏపీలో కల్లుగీత వృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదేళ్ల విధానాన్ని ప్రకటించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడుపై కేసీఆర్ది కపటప్రేమ.. అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే.. మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధిపొందాలనే చండూరు సభలో సీఎం కేసీఆర్ కపటప్రేమ ప్రదర్శించారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో కొనసాగుతూ చేయని పనులు పక్షం రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. చివరి ఘట్టానికి మునుగోడు ఉప ఎన్నిక.. అంతుచిక్కని ఓటరు నాడి! మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంటోంది. అయితే ఈ ఎన్నికలో రాజకీయ పార్టీలకు ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు.. ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఏ పార్టీ నిర్వహించినా హాజరయ్యారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. జూబ్లీహిల్స్లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం.. మునుగోడులో ఆ అభ్యర్థి కోసమే.. జూబ్లీహిల్స్లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.82లో తనిఖీలు నిర్వహించిన వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 89.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. జో బైడెన్, కమలా హారిస్ సంతాపం గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రత్యేక కోర్టులు అక్కర్లేదు: సుప్రీం మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా బంగ్లాదేశ్తో కీలక మ్యాచ్కు టీమిండియా సన్నద్దం అవుతోంది. ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్పై విజయం సాధించి తమ సెమీ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. సమంత 'మయోసైటిస్' వ్యాధిపై కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ ఇప్పుడు చర్చంతా నటి సమంత గురించే. ఇంతకుముందు ఈమె వ్యాఖ్యలు, గ్లామరస్ పొటోలు, నాగచైతన్య నుంచి విడిపోవడం గురించి రకరకాలుగా చర్చించుకున్న సినీ వర్గాలు ఇప్పుడు ఆమె బాధపడుతున్న వ్యాధి గురించి చర్చించుకుంటున్నాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. ది హిందూ ఇంటర్వ్యూ: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు సీఎం ఎక్కడి నుంచి పాలించాలనే దానిపై ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఈసీ నోటీసు.. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం మునుగోడు నియోజకవర్గంలోని బ్యాంకు ఖాతాలకు రూ.5.24 కోట్ల బదిలీకి సంబంధించి వివరణ ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏపీలో మారుతున్న రాజకీయం! టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారతాయా? ఆ పరిణామాలు ఏ పార్టీకి ప్రయోజనం? ఏ పార్టీకి నష్టం ? అన్న చర్చ సహజంగానే జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేనలు కలిసి పొత్తు పెట్టుకుని వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీచేస్తే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్కు నష్టం కలుగుతుందా అన్న సందేహం కొందరికి రావచ్చు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పలకని పవన్.. నాదెండ్ల సైగ చేసినా సరే మౌన ప్రేక్షకుడిగానే ! జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఈసారి విలేకరుల సమావేశంలో పూర్తి ప్రేక్షక పాత్ర వహించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పవన్కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేతల సమావేశం జరిగింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోర్బీ జిల్లాలోని ప్రాంతంలో మచ్చు నదిపైనున్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఉన్నట్టుండి బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100కు చేరిన మృతుల సంఖ్య సోమాలియా రాజధాని మొగదిషులో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించడంతో మరో 300 మంది గాయపడినట్లు వెల్లడించారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్ కోవిడ్తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా? మనిషి శ్వాస తీసుకుంటేనే ప్రాణాలతో ఉంటాడు. శ్వాస తీసుకునేందుకు ఊపిరితిత్తులు ఎంతో కీలకం. మనిషి సాధారణంగా ఒక్క రోజులో దాదాపు 25,000 సార్లు ఊపిరి తీసుకుంటాడు. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్, నత్రజని, తక్కువ మొత్తంలో ఇతర వాయువులు, తేలియాడే బ్యాక్టీరియా, వైరస్, వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాలు ఉంటాయి. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ట్విటర్లో ఉద్యోగాల కోతలు షురూ మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్ను సొంతం చేసుకున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ .. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు. ఉద్యోగులు ఎక్కువగా ఉన్న విభాగాలను భారీగా కుదించడంపై దృష్టి పెట్టారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. T20 WC 2022: మేము చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయాం! సూర్య అద్భుతం టీ20 ప్రపంచకప్-2022లో భారత్కు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాప్రికాతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 49 పరుగులుకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. విశాల్తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా? నటుడు, నిర్మాతగా బిజీగా ఉన్నా విశాల్పై తాజాగా ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో దొర్లుతుంది. అయితే ఇలాంటి వదంతులు ఆయనకు కొత్తేమీ కాదు. స్టార్ హీరోగా రాణిస్తున్న విశాల్ చిత్ర పరిశ్రమకు చెందిన సంఘాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లకే ప్రధాని.. చరిత్రలో ఒకేఒక్కడు రిషి..! కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ను గాడినపెట్టే బాధ్యతలు తీసుకున్న రిషి సునాక్కు మొదట్నుంచి ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టు ఉంది. చిన్నతనంలో తల్లి పనిచేసే ఫార్మసీ షాప్లో పని చేసినప్పుడే వాటి జమా ఖర్చులన్నీ చూసేవారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.ప్రధాని పదవి పూలపాన్పు కాదు.. రిషికి ముందుంది ముళ్లబాటే..! అపజయం ఎదురైన చోటే విజయాన్ని అందుకొని బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్కు ఆ పదవి పూలపాన్పు కాదు. ముందున్నది అంతా ముళ్లబాటే. బ్రెగ్జిట్, కోవిడ్–19 సంక్షోభం, , రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థికంగా కుదేలైపోయిన బ్రిటన్ను దారిలోని తీసుకురావాల్సిన అతి పెద్ద సవాల్ ఆయన ఎదురుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 27న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 27న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్కో ప్రాజెక్టు మూడో యూనిట్(800 మెగావాట్లు)ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం మొదట ఓ పిటిషన్ వేసి, ఆ విషయాన్ని దాచి పెట్టి... అదే అంశంపై మరో పిటిషన్ దాఖలు చేసిన విశాఖ వాసి పి.రంగారావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘చేనేతపై జీఎస్టీ కోరింది కేటీఆరే.. దీనికేం చెప్తరు ట్విట్టర్ టిల్లు?’ చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధానికి మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డీఏవీ స్కూల్ నిర్వహణలో మరో ఉల్లంఘన వెలుగు చూసింది. పాఠశాలకు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నట్లు విద్యాశాఖాధికారుల పరిశీలనలో వెల్లడైంది. సఫిల్గూడ బ్రాంచి పేరుతో ఆరు, ఏడు తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.Deepmala Pandey: స్పెషల్ టీచర్ స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఓటీటీలకూ భారీ షాక్.. ఇకపై అలా కుదరదండి! కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్–ది–టాప్) కమ్యూనికేషన్ యాప్స్కు కూడా వర్తింపచేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి?.. కానీ ఐసీసీ మాత్రం అంతే! సిడ్నీలో నెట్ సెషన్ సందర్భంగా తమకు సరైన భోజనం లభించలేదంటూ టీమిండియా ఆటగాళ్లలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రాక్టీస్ ముగించుకుని హోటల్కు వెళ్లిన తర్వాతే వారు లంచ్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. భార్య వైపు చూస్తున్నాడని తుపాకీతో వచ్చి కాల్పులు.. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా.. తన భార్య వైపు చూస్తున్నాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ దళితుడు, అతడి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోగా అతడి ఇద్దరు సోదరులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దామోహ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి: సీఎం వైఎస్ జగన్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సందర్భంగా భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలని అధికారులను ఆదేశించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. బాబు, పవన్ సస్పెన్స్ పాలిటిక్స్కు తెర.. ముసుగు తొలగింది! ఏపీ రాజకీయాల్లో ముసుగు తొలగింది. గత మూడేళ్ల నుంచి తెర వెనుక జరుగుతున్న రాజకీయాలు ఈరోజు దాదాపుగా బహిర్గతమయ్యాయి. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పని చేస్తున్నాడని ఇన్నాళ్ల నుంచి వైఎస్సార్సీసీ చేస్తున్న ప్రకటనలకు పూర్తి ఆచరణ రూపం ఇచ్చిన చంద్రబాబు.. నేరుగా విజయవాడ నొవాటెల్కు వెళ్లి పవన్కళ్యాణ్తో భేటీ అయ్యాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘సినిమా డైలాగులతో నీ నోటి తీట తీరుతుంది.. అంతే తప్ప ఏమీ పీకలేవు’ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ముసుగు తొలిగిపోయింది. ముసుగు వెనకాల చంద్రబాబు గులాంగిరి ఉంది. చంద్రబాబుకు లబ్ధి కలిగించడమే పవన్ అంతిమ లక్ష్యం. సన్నాసి నాలుక చీరేస్తా.. అని నేను అనలేనా?. కానీ.. నాకు సంస్కారం అడ్డు వస్తోంది అంటూ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మునుగోడులో డబ్బు ప్రవాహం.. మరో వాహనం! మునుగోడు ఉపఎన్నికలో ధన ప్రవాహం వెల్లువెత్తుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులు.. డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్కు అప్పగిస్తారా? అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్లు భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు. వీరిద్దరు పాకిస్థాన్లో తలదాచుకున్నారని ప్రపంచానికి తెలిసిన విషయమే. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్పోల్ అసెంబ్లీ సమావేశంలో వీరిద్దరి గురించి ఓ ప్రశ్న పాకిస్థాన్ హోంల్యాండ్ ఉన్నతాధిరి మోహ్సిన్ భట్కు ఎదురైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో బలపరీక్ష! స్పీకర్ను కలిసిన బీజేపీ రాజస్థాన్లో రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని బీజేపీ నేతల బృందం మంగళవారం ఉదయం కలవడం చర్చనీయాంశమైంది. గత నెలలో రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు స్పీకర్ను కోరినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మీ కారు, బైక్ ఏ కంపెనీవి..దొంగలు టార్గెట్ చేస్తున్న వాహనాల జాబితా ఇదే! వాహన కొనుగోలు దారులకు అలెర్ట్. ఇప్పటికే కింద పేర్కొన్న కార్లు కొనుగోలు చేసినా, లేదంటే కొనుగోలు చేయాలని అనుకున్నా తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే? దేశంలో దొంగలు రూటు మార్చారు. నిన్న మొన్నటి వరకు చోరీకి వెళ్లి చేతికి ఏది దొరికి అది దొంగిలించేవారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. T20 World Cup Records: టీ20 వరల్డ్కప్లో అత్యుత్తమ రికార్డులివే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 8వ టీ20 వరల్డ్కప్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే సంచలనాలకు వేదికైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో పసికూన నమీబియా.. ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు షాకివ్వగా, రెండో రోజు మరో పసికూన స్కాట్లాండ్.. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్కు ఫ్యూజులు ఎగరగొట్టింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Bigg Boss 6: కంటెస్టెంట్స్పై బిగ్బాస్ ఫైర్.. షాకింగ్ నిర్ణయం! బిగ్బాస్-6లో కెప్టెన్సీ కంటెడర్ టాస్కులు అంతగా పేలడం లేదు. కంటెస్టెంట్స్ అతిగా ఆలోచించి.. వాళ్లకు వాళ్లే కొత్త రూల్స్ పెట్టుకుంటున్నారు. ఫలితంగా బిగ్బాస్ ఆశించిన ఔట్పుట్ రావడంతో లేదు. ఈ వారం కూడా కంటెస్టెంట్స్ అలాంటి పనే చేసి బిగ్బాస్ ఆగ్రహానికి గురైయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. షాకింగ్.. కదులుతున్న రైలు నుంచి యువకుడ్ని కిందకు తోసేసిన ప్యాసెంజర్ పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడ్ని తోటి ప్యాసెంజర్ కదులుతున్న రైలులోనుంచి కిందకు తోసేశాడు. ఇద్దరు గొడవపడిన అనంతరం ఆగ్రహంతో ఈ పని చేశాడు. అయితే యువకుడు రైలు నుంచి కిందపడిపోయినా అతడ్ని తోసేసిన వ్యక్తి ఏమాత్రం పశ్చాతాపం, ఆందోళన లేకుండా యథావిధిగా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. వైఎస్సార్ రైతు భరోసా: రైతన్నలకు రూ.2,096.04 కోట్ల నగదు జమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా నిధుల్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల సాయాన్ని అందించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో.. పవన్పై పేర్ని నాని స్ట్రాంగ్ కామెంట్స్ పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడా? లేక ఫ్యాక్షన్ ముఠా నడుపుతున్నారా? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షూటింగ్ గ్యాప్లో పవన్ విశాఖకు వెళ్లారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘మీ వల్లే నాన్న బతికారు.. మిమ్మల్ని చూడాలని వచ్చారు’ రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, వైఎస్సార్ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆర్బీకే కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ మరో షాక్.. రుణాల పేరిట మోసం చేసిన కేసులో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను ఈడీ జప్తు చేసింది. నామా కుటుంబానికి చెందిన రూ.80.65 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. జూబ్లీహిల్స్లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని ఈడీ అటాచ్ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు.. 600 మంది మృతి.. 2 లక్షల ఇళ్లు ధ్వంసం దక్షిణ ఆఫ్రికా దేశం నైజీరియాను వరదలు ముంచెత్తాయి. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వివిధ ప్రమాదాల్లో మొత్తం 600 మంది మరణించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీకి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆరోపించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అమానవీయం.. అప్పు చెల్లించలేదని స్కూటర్కు కట్టేసి.. నడిరోడ్డుపై.. ఒడిశా కటక్ నగరంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ యువకుడ్ని స్కూటర్కు కట్టేసి పరుగెత్తించింది ఓ గ్యాంగ్. అతని చేతులకు తాడు కట్టి నడిరోడ్డుపై చాలా దూరం లాక్కెల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. రూపాయి పతనం: ఆమెకు నోబెల్ ఇవ్వాల్సిందే! సోషల్ మీడియా కౌంటర్లు దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఇంటర్నెట్లో ప్రకంకపనలు పుట్టిస్తున్నాయి. రూపాయి విలువ తగ్గడం లేదు.. డాలర విలువ పెరుగుతోందని పేర్కొన్నారు డాలర్ నిరంతరం బలపడుతూ ఉండటంతో అన్ని కరెన్సీలు బలహీన పడుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తప్పదా? ఇంతకీ అతడికి ఏమైంది? టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా ఈసారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. స్వదేశం, విదేశాల్లో వరుస టీ20 సిరీస్లు గెలిచిన రోహిత్ సేన.. టైటిల్ విజేతగా నిలవాలని భావిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రపంచంలో అందమైన మహిళలు.. టాప్ టెన్లో బాలీవుడ్ నటి..! బాలీవుడ్లో దీపికా పదుకొణే అంటే పరిచయం అక్కర్లేని పేరు. 2007లో కెరీర్ ప్రారంభించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ తన ఉనికి చాటుకుంది. తాజాగా ఆమె పేరు అరుదైన జాబితాలో చేరింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. ‘అందుకే అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు దాక్కుంటున్నారు’ ప్రజల్లోకి వెళ్తే ధైర్యం చంద్రబాబుకు లేదని.. అందుకే అసెంబ్లీకి కూడా రాకుండా దాక్కుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఎద్దేవా చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్ కల్యాణ్కు అర్థమవుతుందా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి రాజకీయం చేస్తున్నారో ఆయన పార్టీ వారికే అర్థం కాదు. పార్టీ క్యాడర్కు కాకపోతే, ఆయనకైనా అర్థం అవుతుందా అన్న అనుమానం వస్తుంటుంది. కాకపోతే ఒక సినీ నటుడు కనుక, ఆయన ఏమి మాట్లాడినా మీడియా కవరేజి వస్తుంటుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. భూముల ధరలకు రెక్కలు.. ‘రింగ్’ రియలేనా? గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్న రియల్ వ్యాపారం ఒక్కసారిగా జోరందుకుంది. రింగ్రోడ్డు వస్తుందంటూ వార్తలు రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లయింది. అయితే “రింగ్’ రియల్గా ఎక్కడి నుంచి వెళ్తుందో ఎవరి భూములు రోడ్డుకు పోతాయో, ఎవరి భూ ములు మిగులుతాయో అంటు స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. సల్మాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు యోగా గురువు బాబా రాందేవ్ బాలీవుడ్ ఇండస్ట్రీపై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని మొరాదాబాద్లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో రాందేవ్ పాల్గొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మనీష్ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్ చేస్తుంది: ఆప్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సీసోడియాకు సమన్లు జారీ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. వెనక్కి తగ్గేదేలే! రాజీపడం అంటున్న తైవాన్.... చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్ బీజింగ్లో ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తైవాన్పై బలప్రయోగాన్ని ఎప్పటికి వదులుకోమని కరాఖండిగా చెప్పారు. అలాగే హాంకాంగ్పై పట్టు సాధించి నియంత్రణలోకి తెచ్చుకున్నామని తర్వాత తైవానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్లా... పోలీసులే క్రిమనల్స్లా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఇద్దరు డిల్లీ పోలీసులు సేల్స్ ట్యాక్స్ ఏజెంట్ని శనివారం షహదారాలోని జీటీబీ ఎనక్లేవ్ వద్ద కిడ్నాప్ చేసి తప్పుడు కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. హమ్మయ్యా.. కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిటర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎఫ్డీలపై 10 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ వరకు వడ్డీ రేట్లను పెంచింది. ఎస్బీఐ (SBI) వెబ్సైట్ ప్రకారం, కొత్త రేట్లు అక్టోబర్ 15, 2022 నుంచి అమలులోకి వస్తాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఐసీసీ సంచలన నిర్ణయం.. కరోనా వచ్చినా వరల్డ్కప్ మ్యాచ్లు ఆడవచ్చు..! టీ20 వరల్డ్కప్-2022లో పాల్గొనే జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుభవార్త చెప్పింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కోవిడ్ ప్రోటోకాల్స్ను ఎత్తివేయడంతో ఇకపై కోవిడ్ టెస్ట్లు, ఐసోలేషన్ తప్పనిసరి కాదని ఐసీసీ ఇవాళ ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఇది ఊహించలేదు.. ప్రభుత్వానికి నయన్ దంపతుల బిగ్ ట్విస్ట్! నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. జన సంద్రాన్ని తలపించిన ‘ విశాఖ గర్జన’ విశాఖ గర్జన.. జన సంద్రాన్ని తలపించింది. వికేంద్రీకరణకే మా ఓటు అంటూ నినదించింది. విశాఖ జన తుఫాన్లో వర్షం కూడా ‘చిన్న’ బోయింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీకి భారీ వర్ష సూచన.. రానున్న మూడు రోజులపాటు.. ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురువనున్నట్లు వాతవారణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తమిళనాడు తీరాల వెంబడి విస్తరించి ఉందని పేర్కొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. మళ్లీ ప్రయోగిస్తారేంటి?’ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. రాహుల్ గాంధీ ఓ విఫలమైన క్షిపణిగా అభివర్ణించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీం కోర్టులో షాక్.. విడుదలపై స్టే ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మావోయిస్టు లింకుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జీఎన్ సాయిబాబాకు భారీ షాక్ తగిలింది. ఆయన విడుదలను అడ్డుకుంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పాకిస్తాన్పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అణ్వాయుధాల సమన్వయం లేని పాకిస్తాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఈ మేరకు బైడెన్ లాస్ ఏంజిల్స్లో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కాంగ్రెస్కు షాక్.. గులాబీ గూటికి పల్లె రవికుమార్ దంపతులు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, ఆయన సతీమణి శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్’ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్బీఐ భారీ షాకిచ్చింది. ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ ఫీజుపై అదనంగా రూ.100, అలాగే కొత్తగా రెంట్ పేమెంట్పై ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. రెండుసార్లు చూశా.. థ్రిల్లింగ్ క్లైమాక్స్..కాంతారాపై ప్రభాస్ రివ్యూ కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన తాజా చిత్రం ‘కాంతారా’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుని సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్ మహిళల ఆసియాకప్-2022 విజేతగా భారత్ నిలిచింది. షెల్లాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. విశాఖ ఎయిర్పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం.. విశాఖపట్నం ఎయిర్పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై దాడులకు దిగి అద్దాలు ధ్వంసం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. మోగిన ఎన్నికల నగారా.. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల దేశంలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. గొంతు పిసికి చంపేశాడు! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?’ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు. తన మాట వినమని! వినల! గొంతు పిసికి చంపేశాడు!! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. విశాఖ గర్జన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు రాబోయే తరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జేఏసీ మీడియా సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, రేపు(శనివారం) విశాఖ గర్జనలో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలుపుతామన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. భారత సంతతి విద్యార్థిపై దాడి...మోదీజీ సాయం చేయండి అంటూ వేడుకోలు భారత సంతతి విద్యార్థిపై ఒక దుండగుడు 11 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు బాధితుడని శుభమ్ గార్గ్గా గుర్తించారు. అతను సిడ్నీలోని న్యూ సౌత్వేల్స్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నట్లు తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో.. నగరంలో మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.6 కోట్ల మోసం జరిగింది. 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వారి బంధువులే టార్గెట్గా వారి నుంచి 6 కోట్లు వసూళ్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్లతో కూకట్పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి,నాగం ఉమాశంకర్లు మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) తన యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు జియో యూజర్లు రీచార్జ్ చేసుకుంటే కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్తో పాటు డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చేది. కానీ తాజాగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లలో డిస్నీ+ హాట్ స్టార్ని తొలగించినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బుమ్రా స్థానంలో వరల్డ్కప్ ఆడేది అతడే: బీసీసీఐ ప్రకటన టీ20 ప్రపంచకప్-2022 జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయనున్న బౌలర్ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి వెల్లడించింది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీని బుమ్రా స్థానంలో ఈ మెగా ఈవెంట్కు ఎంపిక చేసినట్లు తెలిపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. రోహిత్ను పక్కన పెట్టేసిన హౌస్మేట్స్, అతడికే ఫుల్ సపోర్ట్! బిగ్బాస్ ఇచ్చిన బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ముగిసింది. ఈ టాస్క్లో రోహిత్కు తీవ్ర అన్యాయం జరిగింది. హౌస్మేట్స్ కోసం రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ అయిన రోహిత్కు కనీసం ఫోన్ మాట్లాడేందుకు ఛాన్సే ఇవ్వలేదు. తన త్యాగానికి తగిన గుర్తింపు దక్కలేదని రోహిత్ ఎమోషనలయ్యాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా? గుప్పెడంత ఉండే గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు కలిగిన సూపర్ ఫుడ్గా గుడ్డును పేర్కొంటారు నిపుణులు. భారత పౌష్టికాహార సంస్థ గుర్తించిన 650 ఆహార పదార్థాల్లో గుడ్డు మొదటిది కావడం గమనార్హం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలం.. కట్చేస్తే అంతర్జాతీయ స్థాయిలో మా అబ్బాయి బొమ్మలు భలే వేస్తాడు’ అని ఫ్రెండ్స్తో చెప్పుకొని మురిసిపోయేవాడు ఆ తండ్రి. ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాక ‘నేను ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాను’ అన్నాడు. ఇది తండ్రికి నచ్చలేదు. ఎందుకంటే ఆర్ట్ అనేది ఆయన దృష్టిలో అనేకానేక అభిరుచుల్లో ఒకటి మాత్రమే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మునుగోడు దంగల్.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు కేసీఆర్ పెన్షన్లు పెంచితే.. మోదీ పెద్దోళ్లకు దోచిపెడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరుకు టీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. Monkeypox: 70 వేలు దాటిన మంకీపాక్స్ కేసులు.. ఇదే డేంజర్ టైమ్! ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్కును దాటాయి. కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి మంకీపాక్స్ బాధితుల సంఖ్య 70వేలు దాటిందని, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ నివేదిక సమర్పించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె! తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్ధి రుతుజా లట్కేను తమవైపు లాక్కునేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపినట్లయింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. నరబలి ఘటన మరువక ముందే క్షుద్రపూజల కలకలం.. కన్నతండ్రే కూతుర్ని.. కేరళలో మహిళల నరబలి ఘటన మరువక ముందే గుజరాత్లో మరో దారుణం వెలుగుచూసింది. కన్నతండ్రే క్షుద్రపూజలు చేసి 14ఏళ్ల కూతుర్ని చంపాడు. ఆమెకు గంటలపాటు నరకం చూపించి చావుకు కారణమయ్యాడు. గిర్ సోమ్నాథ్ జిల్లా ధవా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రిస్క్లో 90 లక్షల కస్టమర్ల సమాచారం.. ఎస్బీఐ సహా పలు సంస్థల డేటా లీక్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులతో సహా 90 లక్షల కార్డ్ హోల్డర్ల ఆర్థికపరమైన డేటా భారీ లీకైనట్లు సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు బయటపెట్టారు. సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు జరుపుతున్న CloudSEK సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బీసీసీఐ అధ్యక్ష పదవి కోల్పోవడంపై నోరు విప్పిన గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డ సౌరవ్ గంగూలీ.. పదవి కోల్పోవడంపై తొలిసారి నోరు విప్పాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన దాదా ఈ విషయంపై స్పందిస్తూ.. ఆటగాడిగా, అడ్మినిస్ట్రేటర్గా జీవిత కాలం కొనసాగడం కుదురదని, ఏదో ఒక రోజు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందేనని వైరాగ్యంతో నిండిన మాటలు మాట్లాడాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎట్టకేలకు విడాకుల వార్తలపై స్పందించిన దీపికా బాలీవుల్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్లు విడాకులు తీసుకోబుతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రణ్వీర్ నగ్న ఫొటోషూట్ వివాదం నుంచి వారి వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చాయని, అందువల్లే వీరు విడిపోతున్నారనే వాదనలు వినిపించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్కు షాక్.. గుజరాత్ పార్టీ చీఫ్ అరెస్టు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియాను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను సరిత విహార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 2019 నాటి ఓ వీడియోలో ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఇన్స్టాగ్రామ్లో బ్లూటిక్ ఉందా?! ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు సోషల్ మీడియా వేదికగా బ్లూ టిక్ మేనియా గురించి మనకు తెలిసిందే. దీని ఆధారంగానే మన సందేశం లేదా ఫొటో అవతలి వారు చూశారు అన్నది తెలిసిపోతుంది. మన ఆలోచనలను ప్రదర్శించడానికి, షేర్ చేయడానికి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వేదిక ఇన్స్టాగ్రామ్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇంధనశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అంతర్గత రహస్యాలున్నాయ్.. జూనియర్ ఎన్టీఆర్పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ స్వయం కృషితోపైకి వచ్చాడని.. ఎవరి మీద ఆధారపడ లేదని.. అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఆయన అభివృద్ధిలో ఎవరి పాత్ర లేదన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడులో స్పీడ్ పెంచిన బీజేపీ.. కోమటిరెడ్డి, ఈటల సంచలన కామెంట్స్ మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి అధికార టీఆర్ఎస్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆ ఉద్యోగులకు దీపావళి కానుక.. 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈమేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. శశి థరూర్తో పోలిక.. మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు! కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పోటీలో నిలిచిన మల్లిఖార్జున ఖర్గే తన ప్రత్యర్థి శశిథరూర్పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అధికార వికేంద్రీకరణ దిశగా వెళతానన్న శశిథరూర్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా. ఆయనతో తనను పోల్చవద్దని ఖర్గే స్పష్టం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్ అదృశ్యం.. రష్యా పనే! జపోరిజజియా అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్ వలెరియ్ మార్టిన్యుక్ను రష్యా కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. ఆయనను ఎక్కడ నిర్బంధించి ఉంచారో తెలియడం లేదని పేర్కొంది. ట్రేస్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Jio True 5G: అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో సేవలు రాష్ట్రంలో 5జీ సేవలను అతి త్వరలో ప్రారంభించేందుకు జియో సమాయత్తమవుతోంది. రాష్ట్ర ప్రజలకు 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో తన నెట్వర్క్ పై దృష్టి పెట్టింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. దగా పడ్డ గంగూలీ.. ఐసీసీ పదవి కూడా లేనట్టే..! బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డ సౌరవ్ గంగూలీకి మరో అవమానం తప్పేలా లేదు. బీసీసీఐ పదవి పోతే పోయింది.. ఐసీసీలోనైనా చక్రం తిప్పొచ్చని భావించిన దాదాకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురయ్యేలా కనిపిస్తుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. జూనియర్ ఆర్టిస్ట్పై అత్యాచారం.. యంగ్ హీరో అరెస్ట్! వర్ధమాన నటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్పై ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడని సదరు మహిళా ఫిర్యాదులో పేర్కొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త ప్రపంచ వ్యాప్తంగా బీపీ, షుగర్, క్యాన్సర్ జబ్బుల రోగుల కంటే ఆర్థరైటిస్ సమస్యే ఎక్కువ మందిలో ఉంది. కానీ దీనిపై అవగాహన అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యం రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచుకోవచ్చు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. పొగాకు రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్ ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. రాజాసింగ్ పీడీయాక్ట్ కేసు.. తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ పీడీ యాక్టు కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ఈనెల 20లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీడీపీతో బీజేపీ పొత్తు లేదన్నాక వారిలో మరింత అసహనం! ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియాను ఎల్లో అంటే పచ్చ మీడియాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాత్రమే అబివర్ణిస్తుంటుంది. తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ పదాన్ని వాడడం విశేషమే. మూడు మీడియా సంస్థలు ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నిత్యం కధలు తయారు చేసి జనం మీదకు వదలుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. చావనైనా చస్తా కానీ.. ఆ పని మాత్రం చేయను: కేటీఆర్ బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ను కట్టబెట్టినట్లు.. నల్లగొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. గుంతల రోడ్డు.. పెద్దల కాన్వాయ్కి దారివ్వబోయి పేదోడి వాహనం బోల్తా ఉత్తర్ప్రదేశ్ సీతాపుర్లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గుంతలమయం, వర్షపు నీటితో కూడిన రోడ్డుపై జిల్లా మెజిస్ట్రేట్ కాన్వాయ్ వెళ్తుండగా.. దానికి ఆటోరిక్షా(ఈ-రిక్షా) సైడ్ ఇవ్వబోయింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. దిగ్గజ నేతకు అంతిమ వీడ్కోలు.. జనసందోహమైన సైఫాయ్ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్లో జరుగుతున్నాయి. అంతిమ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎన్నారై కుటుంబ హత్యోదంతం.. ఆ మానవ మృగాన్ని వదలొద్దు! ఎనిమిది నెలల పసికందు అనే కనికరం లేకుండా.. పాత గొడవలు పట్టుకుని ఎన్నారై కుటుంబాన్ని పొట్టనబెట్టన బెట్టుకున్న మానవ మృగంపై నేరారోపణలు నమోదు అయ్యాయి. నిందితుడు మాన్యుయెల్ సల్గాడో(48)పై నాలుగు అభియోగాలు, అదనంగా మరో రెండు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్తో షాకైన కంపెనీ! భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్(EV) మార్కెట్ రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్రం ఆదేశాలు, ఇంధన లభ్యతతో పాటు వాటి ధరలు పెరుగదల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కంపెనీలు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. తిప్పేసిన స్పిన్నర్లు.. సౌతాఫ్రికా చెత్త రికార్డు టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 11) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ జట్టు వన్డేల్లో నాలుగో అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది. నేటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. 27.1 ఓవర్లలో కేవలం 99 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కంటెంట్ రేవంత్ వెనకాల పరిగెడుతోంది.. ప్రతి బిగ్బాస్ సీజన్లో ఎంటర్టైన్మెంట్, టాస్కులు అంటూ వాటి వెనక పరుగులు తీస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఈ సీజన్లో మాత్రం అదిగో కెమెరా, ఇదిగో కంటెంట్ అంటూ కాస్త అతి చేస్తున్నారు. ఆరో సీజన్ మొదలై ఐదు వారాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కొందరు పూర్తిగా గేమ్లో దిగనేలేదు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. వాటిపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్ కీలక ఆదేశాలు ఎస్ఐపీబీలో గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అన్నిరకాలుగా ఆయా సంస్థలకు చేయూతనివ్వాలన్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్ష నిర్వహించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మోదీ, అమిత్షాకు మంత్రి జగదీష్రెడ్డి చాలెంజ్ తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. చిక్కుల్లో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. బహిరంగంగా మద్యం తాగుతూ కెమెరాలకు చిక్కారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన మల్లారెడ్డి ప్రచారం తర్వాత తన అనుచరులతో కలిసి మందు తాగుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ట్విట్టర్లో కాదు పవన్.. దమ్ముంటే విజయవాడకు రావాలి: జోగి రమేష్ సవాల్ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి జోగి రమేష్ ఫైరయ్యారు. కాగా, మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ చంద్రబాబు చెంచా. పవన్ నువ్వు ఉండేది హైదరాబాద్లో.. షూటింగ్స్ విదేశాల్లో.. ఏపీలో గ్రౌండ్ రియాలిటీస్ నీకేం తెలుసు? 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ములాయం సొంత కొడుకునే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలుసా? సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి! అన్నం కోసం వెళ్తే.. అమృతం దొరికినట్లు.. మూవీ చూద్దామని వెళ్తే.. మెగాస్టార్ ఎదురొచ్చినట్లు..కొన్నిటిని వర్ణించడానికి మాటలు సరిపోవు.. అలాంటి సన్నివేశమే ఇది.. ఉరిశిక్ష పడి.. నేడో రేపో ప్రాణం తీసేస్తారు అన్నోడికి సడన్గా క్షమాభిక్ష పెట్టేస్తే వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది? 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆర్థికశాస్త్రంలో నోబెల్: ఈ ఏడాది ముగ్గురికి పురస్కారం ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్రను వివరించడంలో చేసిన కృషికి గాను ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ , ఫిలిప్ డైబ్విగ్లకు సోమవారం నోబెల్ బహుమతిని ప్రకటింశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టీమిండియా బౌలర్ల విజృంభణ.. 37 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా పసికూన థాయ్లాండ్తో ఇవాళ (అక్టోబర్ 10) జరిగిన మ్యాచ్లో టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి ధాటికి ప్రత్యర్ధి చిగురుటాకులా వణికిపోయింది. 15.1 ఓవర్లు ఆడిన థాయ్ జట్టు కేవలం 37 పరుగులకే కుప్పకూలింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఆదిపురుష్ వివాదం.. ప్రభాస్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ ట్రోల్స్, మీమ్స్తో నిండిపోయాయి. యానిమేటెడ్ చిత్రంలా ఉందని ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు ఇందులో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను చూపించిన విధానంపై పలు హిందు సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. తుపాకీతో బెదిరించి మహిళపై అత్యాచారం.. సర్వీస్ నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. మహిళను కిడ్నాప్, లైంగిక దాడి నేరారోపణల నేపథ్యంలో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సోమవారం ఉత్వర్వులు జారీ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్ కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో జరిగిన యువతి దారుణ హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కుప్పం కోసం కుస్తీ: ఫోన్లు చేసినా.. బుజ్జగించినా.. మాకొద్దు బాబూ! కుప్పంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. గతనెల 23న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. 30 ఏళ్ల బానిస సంకెళ్లను తెగ్గొట్టి టీడీపీ కేడర్ మొత్తం వైఎస్సార్సీపీ వైపు చూస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అంతా గందరగోళం.. థరూర్.. ఓ విఫల ప్రయత్నం.! కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఒకపట్టాన అర్థం కావు. అంతా తెలిసినట్టుగానే ఉంటుంది. మొత్తం గందరగోళంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ చీఫ్ ఎన్నిక కూడా ప్రస్తుతం అలాగే తయారైంది. తమకిష్టుడైన ఖర్గేని హైకమాండ్ తరపున బరిలోకి దింపారు. మళ్ళీ ఎవరైనా పోటీ చేయవచ్చని కమ్మని కబుర్లు చెప్పారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.రష్యాకు మరో ఎదురుదెబ్బ ఉక్రెయిన్పై కొనసాగిస్తున్న యుద్ధంలో రష్యాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే వంతెనపై శనివారం పేలుడు సంభవించి కొంతభాగం దెబ్బతింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.ఈయనగారిని ఇలాగే వదిలెయ్యకండిరా.. బీజేపీ బాబులూ! సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘కేసీఆర్ ఫాంహౌస్లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘4జీ నుంచి 5జీకి ఇలా అప్గ్రేడ్ అవ్వండి’ సైబర్ నేరస్తులు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మార్కెట్ బూమ్ను బట్టి జేబులు నింపుకుంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్, ఆధార్ కార్డు, బ్యాంకు సర్వీసులు, యూపీఐ పేమెంట్స్ ఇలా సందర్భాన్ని టెక్నాలజీని అడ్డు పెట్టుకొని ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.లాహిరి లాహిరి ‘క్రూయిజ్’లో..! సముద్రం.. ఎవరినైనా చిన్న పిల్లాడిలా మార్చేస్తుంది! ఎగసిపడే కెరటాల్లా మనసును కేరింతలు కొట్టిస్తుంది!! మరి అలాంటి సముద్రంపై ప్రయాణమంటే... అది కూడా 11 అంతస్తుల కదిలే లగ్జరీ హోటల్లాంటి క్రూయిజ్లో విహరిస్తే? తేలియాడే నగరంలో చక్కర్లు కొడితే? పోలా... అదిరిపోలా... 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.‘మెగా’ డైరెక్టర్తో ‘అక్కినేని’మల్టీస్టారర్.. స్క్రిప్ట్ రెడీ! తండ్రీకొడుకు నాగార్జున, అఖిల్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట మోహన్ రాజా. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.'ధోని భయ్యాను చాలా మిస్సవుతున్నాం' రాంచీ అనగానే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని. టీమిండియాకు రెండు వరల్డ్కప్లు అందించిన ఏకైక కెప్టెన్గా ధోని చరిత్రకెక్కాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి చౌళూరు గ్రామంలోని ఆయన ఇంటి వద్ద వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు రాష్ట్రంలోని మరిన్ని ఆలయాల్లో స్వామివార్లకు నిత్య నైవేద్యాలు జరగనున్నాయి. ఆలయాల అభివృద్ధి, నిత్యం ధూప, దీప, నైవేద్యాలకు ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి మరో 2091 ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. నడిబజారులో నిలబెడతాం.. బీజేపీపై మంత్రి కేటీఆర్ నిప్పులు ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ, పనికిమాలిన, ప్రచార కండూతి తప్ప మరో ధ్యాసలేని వ్యక్తి అంటూ మోదీపై విరుచుకుపడ్డారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నేనేం సోనియా రిమోట్ను కాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల తర్వాత పార్టీకి డమ్మీ చీఫ్గా మల్లికార్జున ఖర్గే ఉండబోతారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆయన దీటైన సమాధానమిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం అహ్మదాబాద్లో ఖర్గే మాట్లాడారు.‘ నేనేం సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ను కాదు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆ సత్తా భారత్ సొంతం ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్ పారిశ్రామిక, లాజిస్టిక్ పార్క్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతూ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా రూపాంతరం చెందుతున్న విశాఖపట్నం కేంద్రంగా లాజిస్టిక్ రంగం అభివృద్ధికి కీలకమైన అడుగులు పడుతున్నాయి. పారిశ్రామికాభివృద్ధితో పాటు ఎగుమతి, దిగుమతులు సులభతరం చేసేలా 110 ఎకరాల విస్తీర్ణంలో మరో ఇండ్రస్టియల్ లాజిస్టిక్ 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పారేద్దామనుకున్న టికెట్కు 1.6 కోట్లొచ్చాయి వెదుకుతున్నది దొరికితే కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అలాంటిది పారేద్దామనుకున్న టికెట్కు రూ.కోట్లు దక్కితే... ఆనందానికి అవధులుండవు. ఈ యూఎస్ మహిళ విషయంలో అది నిజమైంది. రోపర్కు చెందిన 60 ఏళ్ల జాక్వలిన్ లేహ్ ఓ స్టోర్ నుంచి ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ టికెట్ హాట్‘5’ను ఐదు డాలర్లకు కొన్నది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది.. తర్వాతే.. రాజకీయ నాయకులు, సినిమా నిర్మాతలను ముగ్గులోకి దింపి, మోసం చేసిన మాయలాడిని ఖండగిరి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందిత మహిళ న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. అయితే పోలీసులు ఈ విషయమై అధికారికంగా సమాచారం జారీ చేయలేదు. ఆమె వద్ద 2 పెన్డ్రైవ్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Nayanathara: నయన్ అంత పెద్ద షాక్ ఇస్తుందా! దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి నయనతార. ఈమె గురించి నిత్యం ఏదో ఒక వార్త ప్రచారం అవుతునే ఉంటుంది. ఎక్కడో కేరళలో పుట్టి కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి కథానాయికగా గుర్తింపు పొంది నంబర్ వన్ స్థానానికి చేరుకోవడమే కాకుండా లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకుంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. '110 శాతం ఫిట్గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం' పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది టి20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రజా వెల్లడించాడు. షాహిన్ అఫ్రిది అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడని పేర్కొన్నాడు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. 'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్ప్రైజెస్, ఫ్యూచర్ కన్జూమర్ తాజాగా విఫలమయ్యాయి.సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కాఫీ డే వెల్లడించింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమీక్షలో నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ తదితర అంశాలపై చర్చించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఈడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ప్రభాకర్రెడ్డితోపాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డిని హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి రూ.40లక్షల చెక్కు అందజేసిన సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్ను ప్రగతి భవన్లో శుక్రవారం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మా టార్గెట్ అదే.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికలే తమ టార్గెట్ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఈ దేశానికి గుదిబండ. 2024 తర్వాత కాంగ్రెస్ కనుమరుగయ్యే ఛాన్స్. ప్రధాని అసమర్థుడు, చేతకాని వారు’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మోదీజీ.. ఆయనంటే మీకు ఎందుకంత భయం? చైనా జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉయ్ఘర్లపై జరుగుతున్న మనవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు ముసాయిదా తీర్మానం వచ్చింది. అయితే దీనిపై చర్చకు జరిగిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మానవ హక్కుల పోరాటానికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉక్రెయిన్, రష్యాలకు చెందిన రెండు మానవ హక్కుల గ్రూప్లతో పాటు బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీలకు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ లిబర్టీస్, బెలారస్ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీల పేర్లను నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకొచ్చింది. విడా వీ1, వీ1 ప్రొ అనే రెండు వేరియంట్లలో దీన్ని శుక్రవారం లాంచ్ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. గంగూలీ, జై షా కాదు.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అతడేనా..? బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ఈ నెల 18న ముగియనున్న నేపథ్యంలో కొత్తగా ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే అంశంపై చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం విధితమే. చాలామంది ప్రస్తుత కార్యదర్శి జై షా బీసీసీఐ కొత్త బాస్ అవుతాడని.. బీసీసీఐ సారధి సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో నిలుస్తాడని భావించగా.. తాజాగా అధ్యక్ష పదవి రేసులో కొత్త పేరు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. అనుష్కను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, ఎందుకంటే.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. తన కూతురు వామిక ఫొటోలను తీస్తున్న మీడియాపై అనుష్క అసహనం వ్యక్తం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు! కొన్ని పదార్థాలు (అలర్జెన్స్) మాత్రమే కాకుండా ఒక్కోసారి కొన్ని ఆహారాలూ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అయితే మరికొన్ని ఆహారపదార్థాలు ఆస్తమాను నివారిస్తాయి కూడా. ఆస్తమాను అదుపులో ఉంచుకోడానికి మనకు సరిపడని ఆహారాలకు దూరంగా ఉంటూ, ఆస్తమాను నివారించే వాటిని తీసుకోవడం మంచిది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. WHO: ఆ భారత కంపెనీ సిరప్లను వాడొద్దు భారత్కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్వో. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఓవర్ స్పీడ్.. కేరళలో ఘోర ప్రమాదం ఓ డ్రైవర్ నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు బలిగొంది. కేరళలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. పాలక్కడ్ వడక్కన్చ్చెర్రి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును ఓ టూరిస్ట్ బస్సు ఢీ కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అమ్మవారి విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి.. 8 మంది మృతి, షాకింగ్ వీడియో విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పైగురిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 8 మంది మృతి చెందారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మాల్ నదిలోకి దిగారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియా గాంధీ గురువారం ఉదయం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. 75 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ అనారోగ్యంతో చాలాకాలంగా ఆమె పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. KCR Party: బీఆర్ఎస్పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఏర్పాటు చేసిన జాతీయపార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయస్థాయిలో విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆకాంక్షించారు. హైదరాబాద్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఏపీ వాసులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. YV Subba Reddy: తిరుపతి అభివృద్ధికి మరో కీలక అడుగు తిరుపతి శ్రీనివాససేతు రెండో దశ ఫ్లైఓవర్ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.684కోట్లతో శ్రీనివాససేతు నిర్మాణంను చేపట్టినట్లు తెలిపారు. త్వరితగతిన మూడో దశ ఫ్లైఓవర్ పనులను కూడా పూర్తి చేసి జనవరి నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సిరాజ్కు కలిసిరాని మూడో టీ20.. బౌండరీ లైన్ వద్ద క్యాచ్.. కెప్టెన్ రోహిత్ సీరియస్ దక్షిణాఫ్రికాతో ఇండోర్లో జరిగిన మూడో టీ20తో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఏదీ కలిసిరాలేదు. ఎన్నో అంచనాల మధ్య జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్ తన స్థాయి మేర రాణించలేదు. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన అతను వికట్లేమీ లేకుండా ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Bigg Boss 6 : ట్రాక్ తప్పిన ఇనయా గేమ్.. పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్ బిగ్బాస్ ఫైమాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్మేట్స్ నిద్ర లేపాల్సి ఉంటుంది. ఇక ఆమె టాస్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్న టైంలో వసంతి, మెరీనాలు దెయ్యం గెటప్లు వేసి ప్రాంక్ చేస్తారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మూన్ లైటింగ్ దుమారం: విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన! ఒకే సమయంలో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన విప్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' పేరు మార్పు కేసీఆర్ కొత్తగా ఎలాంటి రాజకీయ పార్టీని స్థాపించడం లేదు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.. జాతీయ స్థాయి కార్యకలాపాలకు వీలుగా ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చుతున్నారు. నిబంధనల ప్రకారం పార్టీ జెండా, రంగు, ఎన్నికల చిహ్నం అన్నీ ప్రస్తుతమున్నవే కొనసాగుతాయి. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. డీజిల్ వాహనాలు.. ఇకపై ఎలక్ట్రిక్! తొలుత హైదరాబాద్లో ఆటోలకు బ్యాటరీల బిగింపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్ వాహనలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ(టీఎస్ రెడ్కో) ప్రణాళికలు సిద్ధం చేసింది. కాలుష్యనియంత్రణ దిశగా రెడ్కో ఈ చర్యలు చేపడుతోంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా విజయసాయిరెడ్డి కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వైఎస్సార్పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గుడ్న్యూస్: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’ వాతావరణంలో కాలుష్యం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా డౌన్ పేమెంట్ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం పంపింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ట్రాన్స్కో ఆస్తులు ప్రైవేటుకు! విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. దానితో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. కానీ కేంద్రం కొత్తగా విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థ (ట్రాన్స్కో)ల ఆస్తుల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను జారీ చేసింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. India vs South Africa 3rd T20: చివరిది వదిలేశారు.. పోరాడకుండానే.. టీమిండియా టి20 ప్రపంచకప్ సన్నాహకం పరాజయంతో ముగిసింది. మెగా టోర్నీకి ముందు ఆడిన చివరి పోరులో భారత్ ఓటమి పాలైంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న దక్షిణాఫ్రికా మూడో టి20లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చి 49 పరుగులతో భారత్పై విజయం సాధించింది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Godfather Twitter Review ‘గాడ్ ఫాదర్’ టాక్ ఎలా ఉందంటే.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అందుబాటులోకి 5జీ, భారత్లో ఇక టెక్నాలజీకి తిరుగుండదు భారత్లో 5జీ సేవలు అందుబాటులోకి రావడమనేది టెక్నాలజీని మెరుగుపర్చుకోవడానికి సంబంధించి ఒక ఉత్ప్రేరకం లాంటి ఘటనగా ఉండగలదని చిప్సెట్ దిగ్గజం క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో అమోన్ తెలిపారు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Dussehra 2022: పాలయమాం దేవీ! ముక్తి కోసం సాధన చేసేందుకు ఉపకరించే దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. ఆసేతు హిమాచలం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలలో ఒకటైన ఈ దసరా గురించి... 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఏదైనా స్పెషల్ చేసి పెట్టు, త్వరగా వస్తానంటవి.. ఇంతలోనే ఎంత పనైంది దేవుడా! విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు యమపాశాల్లా తెగిపడుతున్నాయి. వీటి బారిన పడి ఇప్పటికే చాలా మంది మృతి చెందారు. పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అయినా విద్యుత్ శాఖ అధికారుల్లో మార్పు రాలేదు. 👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మునుగోడుపై టీఆర్ఎస్ ఫుల్ ఫోకస్! రంగంలోకి కేటీఆర్, హరీశ్ కూడా? మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడటంతో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో సర్వశక్తులూ ఒడ్డి అయినా మునుగోడులో విజయం సాధించాలని భావిస్తోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఇక కొత్త రోస్టర్.. ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెరగడంతో భారీ మార్పులు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో నూతన రోస్టర్ రూపకల్పన అనివార్యమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం ఉండగా తాజాగా 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 12 వరకే గడువు.. పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మరోసారి రెచ్చిపోయిన నార్త్కొరియా.. జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం నార్త్ కొరియా మరోసారి రెచ్చిపోయింది. మంగళవారం జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్ ప్రావిన్స్ నుంచి బాలిస్టిక్ పణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. సర్వేలో చేదు నిజాలు.. యువతలో గుండె సమస్యలు తీవ్రం ఆరోగ్య రాజధాని బెంగళూరులో యువత గుండె ఒత్తిడితో సమతమవుతోంది. మంచి చదువులు, ఉద్యోగం, ఇంకా రకరకాల లక్ష్యాలతో విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వయసుకు మించిన ఒత్తిడిని హృదయం అనుభవిస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇంట్లోనే ఐపీఎస్ అధికారి దారుణ హత్య.. పనిమనిషి పరార్ జమ్ముకశ్మీర్ జైళ్ల ఉన్నతాధికారి హేమంత్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన ఇంట్లో శమమై కన్పించారు. నిందితులు ఆయనను గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గిన 11 రకాల నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలలో 11 రకాలైన నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. IND vs SA 2nd T20: క్లీన్స్వీప్పై భారత్ గురి ఆస్ట్రేలియాపై సిరీస్ సొంతమైంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కింది. ఇక శనివారం ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరేముందు మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే రెండు సిరీస్లు సాధించినా, ఒక ప్రధాన సమస్య మాత్రం జట్టును ఇంకా ఇబ్బంది పెడుతోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Bigg Boss 6 Telugu: ఈసారి కాస్త డిఫరెంట్గా.. నామినేషన్స్లో ఉన్నది వీళ్లే ఈవారం నామినేషన్స్ ప్రక్రియలో రోహిత్ అండ్ మెరీనాలకు షాక్ ఇచ్చాడు బిగ్బాస్. గతంలో పోలిస్తే ఈసారి నామినేషన్స్ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగింది. వారిలోనే ఎవరో ఒకరు నామినేట్ అయి, మరొకరు సేవ్ అవ్వాల్సిందిగా ఆదేశించాడు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్.. హనీ వైద్యం కోసం రూ.కోటి మంజూరు ఓ చిన్నారి ప్రాణాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీరామరక్షలా నిలిచారు. ఆమెకు సోకిన అరుదైన వ్యాధి వైద్యానికి లక్షలాది రూపాయల ఖర్చును జీవితాంతం భరిస్తానని భరోసా ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అబద్ధాలే.. రామోజీకి నిత్యావసరం! నిత్యం అబద్ధాలాడటం... రామోజీరావుకు నిత్యావసరం!!. చంద్రబాబు నాయుడు ఐదేళ్లూ ఏమీ చేయకపోయినా... అదో గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా రోజూ కీర్తిస్తే జనాన్ని కొంతయినా నమ్మించగలమనేది ఆయన దింపుడు కళ్లం ఆశ. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కలల కొలువు సులువే పోటీ ప్రపంచంలో ఇప్పుడంతా ఆన్లైన్ మయం. ఇందులో ముందుండాలంటే మిగిలిన వారితో పోలిస్తే భిన్న ప్రతిభా పాటవాలు అవసరం. తాము చదువుకున్న కోర్సుకు సంబంధించి అదనపు నైపుణ్యాలు ఉన్న వారికే కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. టీఆర్ఎస్ నేతలపై గోనె ప్రకాశ్రావు సంచలన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పాలనలో ఎంపీటీసీలు మొదలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అవినీతి అడ్డూఅదుపు లేకుండా పోయిందని, అందుకే మావోయిస్టుల హెచ్చరికలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు అన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. దశమి రోజు ధ్వంస రచనకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు దసరా రోజున హైదరాబాద్లో భారీ విధ్వంసానికి పాకిస్తాన్ కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్రను కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో నగర పోలీసులు భగ్నం చేశా రు. లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీ ఆదేశాలతో నగరంలో దసరా ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధ్వంసాలు సృష్టించడంతోపాటు నగరానికి చెందిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల్ని హతమార్చాలనుకున్న ముగ్గురు ముష్కరులను అరెస్టు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గుజరాత్లో అధికారం బీజేపీకే.. ఆప్కు రెండు సీట్లే! గుజరాత్లో అధికార పీఠాన్ని మళ్లీ బీజేపీ దక్కించుకోనుందని ఏబీపీ న్యూస్–సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఆదివారం వెల్లడించింది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ సంవత్సరం ఆఖర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి 135–143 సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ తెలియజేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. పోరాటాలకు సిద్ధం కావాలి రాబోయే కాలంలో అతిపెద్ద పోరాటాలకు, ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటినుంచే సంసిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. స్వదేశంలో టీమిండియా కొత్త చరిత్ర.. స్వదేశంలో సౌతాఫ్రికాపై టి20 సిరీస్ గెలవలేదన్న అపవాదును టీమిండియా చెరిపేసింది. ఆదివారం గుహవటి వేదికగా జరిగిన రెండో టి20లో పరుగుల జడివానలో టీమిండియా 16 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మహేశ్-త్రివిక్రమ్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో! తెలుగు సినిమాలపై మరింత ఫోకస్ పెట్టినట్లున్నారు మలయాళ దర్శక-నిర్మాత, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ చిత్రంలో పృథ్వీరాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Suzlon Energy: ‘సుజ్లాన్’ తులసి తంతి తుది శ్వాస పవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, విండ్ మ్యాన్గా పేరొందిన తులసి తంతి (64) కన్నుమూశారు. ఆయన శనివారం గుండెపోటుతో మరణించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. తులసి తంతికి భార్య (గీత), ఇద్దరు సంతానం (కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి) ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. సచివాలయాల ఉద్యోగుల కుటుంబాలపై సీఎం జగన్ ‘కారుణ్యం’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ఉదార నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఎవరైనా ప్రొబేషన్ ఖరారుకు ముందే చనిపోయి ఉంటే, వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించేందుకు ఆమోద ముద్ర వేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ గడువు పెంపు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్ధన్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన శనివారం వివరాలు వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. వీఆర్ఏలపై సీఎం కేసీఆర్ సీరియస్.. వినతిపత్రం విసిరేసి.. వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. ఆయన స్నేహితుడు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న లక్ష్మీకాంతరావును పరామర్శించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కానరాని పాలపిట్ట.. జాడలేని జమ్మిచెట్టు! తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ ఆ రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఫుట్బాల్ మైదానంలో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం ఫుట్బాల్ మైదానంలో తొక్కిసలాట జరిగి 127 మంది దుర్మరణం పాలైన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. 26 ఏళ్ల తరువాత న్యాయం: విధి చేసిన గాయం.. భక్తుడు చేసిన సాయం! పదవీ విరమణానంతరం తనకు రావాల్సిన నగదు మొత్తం దక్కక పోవడంతో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ అధికారి ఒకరు భిక్షగాడిగా మారాడు. ఆయన దీనగాథను తన స్నేహితుడి ద్వారా తెలుసు కున్న న్యాయవాది కోర్టు తలుపుతట్టారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. హైదరాబాద్: మైండ్బ్లోయింగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు.. లేట్ చేయకండమ్మా! మొబైల్ రిటైల్రంగంలో ఏపీ, తెలంగాణల్లో వేగంగా విస్తరించిన మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లను ప్రారంభించింది. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, హోం థియేటర్ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. DOCTOR G : మగ గైనకాలజిస్ట్ తిప్పలు ‘పేషెంట్లు మహిళా గైనకాలజిస్టునే ప్రిఫర్ చేస్తారు’ అంటాడు గైనకాలజీలో పి.జి. చేస్తున్న ఆయుష్మాన్. ‘ఈ ఆడ, మగ తేడా ఏంటి? డాక్టర్ డాక్టరే ఎవరైనా’ అంటుంది సీనియర్ మహిళా గైనకాలజిస్ట్ షేఫాలి షా. ‘పేషెంట్లు అలా అనుకోరు కదా’ అంటాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో చిన్న గ్రామానికి చెందిన ప్రియ స్వరభారతి. నలుగురు సంతానంలో ఒకరు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు స్కూలు టీచర్స్. భారతికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. మెరుగైన చికిత్సనందించేందుకు పాట్నాకు తీసుకెళ్లారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. తీవ్ర విషాదం.. రెండు రోజుల క్రితం తమ్ముడు.. ఇప్పడు రశ్మితా స్థానిక పారాబెడలో నివసిస్తున్న గదాధర నాయిక్ ఇంటిలో మరో విషాదం నెలకొంది. తన 12 ఏళ్ల కుమారుడు శిభాశిస్ నాయిక్ ఆత్మహత్య చేసుకొని మరణించి రెండు రోజులు గడవక ముందే కూతురు రశ్మితా నాయిక్(24) శనివారం ఆత్మహత్య చేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వ దీవెన రాష్ట్రంలో పేదోళ్ల ఆడ బిడ్డల కళ్యాణానికి ప్రభుత్వం నగదు దీవెనలు అందించనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ రాష్ట్రంలో గ్రూప్–1 కేడర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్లో గ్రూప్–1 పోస్టులతో పాటు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. గిరిజనులకు 10% కోటా.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు (జీవో నం.33) జారీ చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. కేటీఆర్ ట్వీట్కు రేవంత్ కౌంటర్.. చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదేళ్ల కిందట జరిగిన సాగరహారం ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ‘పిట్టపోరు’కు వేదికైంది. సాగరహారం ఫొటోలను ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్లో కామెంట్ చేసిన మంత్రి కేటీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దీటుగా సమాధానమిచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు ఉక్రెయిన్లో నాలుగు ప్రాంతాల విలీనం ఒప్పందంపై సంతకాలు చేయడానికి కొన్ని గంటల ముందే రష్యా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో ఉక్రెయిన్లోని పలు నగరాలపై విరుచుకుపడింది. జపోరిజియా నగరంలోని మానవతా కాన్వాయ్పై జరిపిన దాడిలో 30 మంది మరణించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. కాంగి‘రేసు’.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపైనే అందరి దృష్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గాంధీ కుటుంబానికి చెందిన సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉండడంతో పోటీ అనివార్యమైంది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది నాలుగోసారి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. మాటల మాంత్రికుడు శశి థరూర్ మామూలోడు కాదు.. అప్పుడు మోదీ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచిన మాటల మాంత్రికుడు శశి థరూర్ (66) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాను ఎవరో ఆడించినట్లు ఆడే తోలుబొమ్మను కాదని చెబుతున్నారు. విభిన్న రాజకీయవేత్తగా థరూర్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చుట్టూ వివాదాలకు లెక్కలేదు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. రెపో రేటు పెంచుతూ ఆర్బీఐ వీర బాదుడు.. నిపుణులు ఏమంటున్నారో తెలుసా! రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ పెంపు నిర్ణయంపై నిపుణుల ఏమంటున్నారంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. Womens Asia Cup 2022: ఫేవరెట్గా భారత్ మహిళల ఆసియా కప్ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు చాంపియన్గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. Ponniyin Selvan: మణిరత్నం కల నెరవేరిందా? దర్శకుడు మణిరత్నం మూడు దశాబ్దాల కల పొన్నియిన్ సెల్వన్. దీనిని సాధ్యం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో రెండుసార్లు విఫలమయ్యారు. పరిస్థితులు అనుకూలించకపోవడమే ప్రధాన కారణం అయినప్పటికీ మణిరత్నం నిరుత్సాహ పడలేదు. తన ప్రయత్నాన్ని వదులుకోలేదు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ముగ్గురు ఎమ్మెల్యేల హత్యకు కుట్ర? టైమ్బాంబు తరహా పేలుళ్లకు మావోయిస్టుల ప్లాన్? ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో మావోయిస్టులు అలజడికి వేసిన ప్రణాళికను నిఘావర్గాలు, పోలీసులు ముందుగానే గుర్తించారు. బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కోరుకంటి చందర్ను హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.గుడ్ న్యూస్.. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని 269 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్–4, మెడికల్ ఆఫీసర్లు, లెక్చరర్ తదితర పోస్టులు వీటిలో ఉన్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. రష్యాకే జైకొట్టిన ఉక్రేనియన్లు.. త్వరలో లాంఛనంగా విలీనం! ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లెహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ తదితర ఆక్రమిత ప్రాంతాలను లాంఛనంగా విలీనం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘మిషన్ తెలంగాణ’పై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ‘మిషన్ తెలంగాణ–2023’కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా గెలిచి కాషాయజెండా ఎగురవేసి తీరాలన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల నిర్దేశిత లక్ష్యసాధన దిశగా పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఘోర రోడ్డు ప్రమాదం.. గాయపడిన చిన్నారిని చూసి కన్నీరు పెట్టుకున్న మహిళా అధికారి ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరీ పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 41 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిచించి చికిత్స అందిస్తున్నారు. 730 నంబర్ జాతీయ రహదారిపై బస్సు, మినీ ట్రక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గుండెపోటు ఎలా గుర్తించాలి.. గుండెపోటు రాకుండా ఉండాలంటే.. ఈ బిజీ జీవితంలో ఒత్తిడులు, శారీరక శ్రమ లేకపోవడం మన గుండెను ప్రమాదంలోకి నెడుతోంది. మారిన ఆహార అలవాట్లు గుండె నాళాలను దెబ్బతీస్తున్నాయి. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే.. అందువల్ల మన గుండెను మనం ఎంత ప్రమాదంలోకి నెడుతున్నామో తెలుసుకోవాల్సిన అవసరముంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మనకి అన్ని ప్రభుత్వ బ్యాంకులు అవసరం లేదు: ఎస్బీఐ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు దేశీయంగా పటిష్టమైన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొన్ని ఉన్నా సరిపోతుందని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య అభిప్రాయపడ్డారు. చిన్నా చితకా పీఎస్బీలను విలీనమో లేదా ప్రైవేటీకరించడమో చేయొచ్చని తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సూర్యకుమార్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తిరువనంతపురం వేదికగా ప్రోటీస్తో జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో టీమిండియా ముందంజ వేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్ నానమ్మను తలుచుకుంటూ సితార సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. నిన్న(సెప్టెంబర్ 28) సూపర్స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’ అనంతపురం వేదికగా బుధవారం నిర్వహించిన ‘గాడ్ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషాదాన్ని మిగిల్చింది. తమ అభిమాన హీరోని చూడాలన్న ఆత్రుత ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. తిరుమల: నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్ తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. సూపర్స్టార్ మహేశ్బాబుకు మాతృవియోగం టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. సూపర్స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. లిక్కర్పై టక్కరి ఎత్తులు! మద్యం తయారీ ధరల పెంపు కోసం డిస్టలరీలు ఎత్తులు వేస్తున్నాయి. పండుగ సీజన్ను ఆసరాగా చేసుకుని చీప్ లిక్కర్ కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే దెబ్బకు దెబ్బ అన్నట్టు ఎక్సైజ్ శాఖ ఏకంగా మద్యం దిగుమతులకు సిద్ధమవుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కేంద్రం కీలక నిర్ణయం.. పీఎఫ్ఐపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఈ సంస్థతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న 8 సంస్థలను చట్టవ్యతిరేక సంస్థలుగా గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం! అంతరిక్ష సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా కీలక ముందడుగు పడింది. భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించగలమన్న భరోసా ఏర్పడింది. భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) విజయవంతమైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి! తమిళ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన బన్రూటి రామచంద్రన్తో అన్నాడీఎంకే ముఖ్య నేతలు మంగళవారం బంతాట ఆడుకున్నారు. ఓ వర్గం నేతగా ఉన్న పళణిస్వామి బన్రూటిని పదవీ నుంచి తప్పిస్తే.. మరో వర్గం నేత పన్నీరు సెల్వం ఆయనకు కొత్త పదవిని కట్టబెట్టారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. వీడియోలు, ఓటీటీ కంటెంట్.. 70 శాతం మంది ఆ వయసు వారే! మొబైల్ ఫోన్ దైనందిన జీవితంలో భాగమైంది. ఖాళీ సమయాల్లో 63.36 శాతం మంది యువత మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారని ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో తేలింది. ఇందులో 51 శాతం మంది వీడియోలు, 29 శాతం ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. India Vs South Africa 1st T20: సఫారీతో ‘సై’ ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ కోసం గట్టి ప్రత్యర్థులతో ఏర్పాటు చేసిన సిరీస్లలో ఒకటి ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలోనే సఫారీతో రెండో వేటకు సిద్ధమైంది. మేటి జట్టయిన దక్షిణాఫ్రికాతో మూడు టి20ల సిరీస్లో రోహిత్ బృందం తలపడనుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పెళ్లికి సిద్ధమవుతున్న అనుష్క? అభిమానులు స్వీటీ అని పిలుచుకునే నటి అనుష్క. అందం, అభినయంలో విశేష గుర్తింపు ఆమె సొంతం. మంగళూరుకి చెందిన యోగా టీచర్ అయిన ఈమె 2005లో సూపర్ చిత్రంతో నాగార్జునకు జంటగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘నా పరిస్థితి ఎవరికీ రావొద్దు’.. యువతి సెల్ఫీ వీడియో కలకలం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతోపాటు అతడి బంధువుల వేధింపులు తాళలేక క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటగండి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. తిరుమల పర్యటనలో సీఎం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను ఆయన దర్శించుకున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ పోస్టుల భర్తీని పూర్తిచేయాలి: సీఎం జగన్ పశు సంవర్ధక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పశువుల ఆస్పత్రుల్లో నాడు– నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్ తరహాలో పశువులకు వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఉద్దవ్ థాక్రేకు బిగ్ షాక్.. షిండేకు అనుకూలంగా వెలువడ్డ సుప్రీం తీర్పు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రష్యా చెర నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు రష్యన్ల బంధిఖానా నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్ అనే ఉక్రెయిన్ సైనికుడి ఫోటోలను ట్విట్టర్లో పంచుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు లోకేష్.. అమ్మవారి కిరీటాలు ఎత్తుకెళ్లిందెవరు?’ ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ప్రతీ విషయాన్ని వివాదాస్పదం చేస్తూ రెచ్చిపోతున్నారు. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓవర్గా కామెంట్స్ చేసిన నారా లోకేష్కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బంగారు మైన్స్లో పెట్టుబడులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్న ఈడీ! ఇటీవలి కాలంలో పలు కేసుల్లో తెలంగాణలో ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారించడం తెలంగాణలో సంచలనంగా మారింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు.. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధమేనా? సుప్రీంలో విచారణ దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో తీసుకున్న సంచలన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నల్లధనం, నకిలీ నోట్ల చలామణికి చెక్ పెట్టేందుకంటూ రాత్రికి రాత్రే ప్రకటించిన ఈ నిషేధం పెను దుమారాన్ని సృష్టించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విషాదం.. జబర్దస్త్ కమెడియన్ కన్నుమూత టాలీవుడ్లో విషాదం నెలకొంది.మిమిక్రీ ఆర్టిస్ట్, జబర్దస్త్ కమెడియన్ మూర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధ పడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ స్వయంగా ధ్రువీకరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆనందం మాటున పొంచి వున్న ప్రమాదాలు గత రెండేళ్లుగా వేసవి, సంక్రాంతి, దసరా వంటి సెలవులు వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా ప్రజలు ఎవరూ కూడా ఆనందంగా గడిపి ఆస్వాదించలేక పోయారు. ఇక విద్యార్థులు కూడా సెలవుల్లో ఆటలకు దూరంగా ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మూడు రాజధానులపై రౌండ్ టేబుల్ సమావేశం.. మేధావులు ఏమన్నారంటే.. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమే: మంత్రి బొత్స తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవకూడదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని ఆయన వివరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కేసీఆర్ కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు: కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. సందర్భంగా వచ్చిన ప్రతీసారి రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్.. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తుండగా.. బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రాజస్థాన్ సీఎం పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా! కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జైపూర్లోని అశోక్ గహ్లోత్ నివాసంలో ఆదివారం రాత్రి 7గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. వందేళ్ల బామ్మకి గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా రెండో ప్రపంచ యుద్ధం నాటి సమయంలోని వ్యక్తులను స్మరించుకుంటూ ..నాటి నుంచి ఇప్పటి వరకు మనుగడ సాధించి ఉన్న ఎందర్నో గౌరవించి సత్కరించాం. ఆ సమయంలో వారి శక్తి యుక్తులను ప్రశంసించాం కూడా. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా లేదా వాడుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గమనించాలి లేదంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. చిరంజీవి 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా ‘లూసిఫర్’రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో చిరు పొలిటికల్ లీడర్గా కనిపించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 18న ఎన్నికలు జరగనుండగా.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరగనున్న టీ–20 మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. రాచకొండ పోలీసులు 2,500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. బ్లాక్ దందా.. రూ.850 టికెట్ రూ.11,000 ఉప్పల్ స్టేడియం సమీపంలో బ్లాక్ టికెట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేడియంకు సమీపంలో టికెట్లను విక్రయిస్తున్న గగులోత్ వెంకటేష్, ఇస్లావత్ దయాకర్, గగులోత్ అరుణ్ అనే ముగ్గురు వ్యక్తులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. చంద్రబాబు కుప్పం నుంచి కావాల్సింది తీసుకున్నాడు.. చేసిందేం లేదు: సీఎం జగన్ నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నాడని, అలాంటి వ్యక్తి కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప.. చేసిందేమీ లేదని సీఎం జగన్ చాటిచెప్పారు. కుప్పం అనిమిగానిపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అవ్వా, తాతలకు సీఎం జగన్ గుడ్న్యూస్.. కీలక ప్రకటన కుప్పం వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. కుప్పం అనిమిగానిపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న రూ.2500 పెన్షన్ను ఈ జనవరి నుంచి రూ.2,750లకు పెంచుతున్నామని ప్రకటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. సిగరెట్ వేరు.. మద్యం వేరు.. అందుకు నో చెప్పిన సుప్రీంకోర్టు దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బీజేపీకి వెన్నుపోటు పొడిచి ప్రధాని కాగలరా? నితీశ్పై అమిత్షా ధ్వజం కేంద్ర హోంమంత్రి అమిత్షా.. బిహార్ సీఎం నితీశ్ కుమార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో ప్రధాని కావాలనే లక్ష్యంతో ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచి లాలూ ప్రసాద్ యాదవ్ ఒళ్లో కూర్చున్నారని ధ్వజమెత్తారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. నువ్వా నేనా.. అనంత అసెంబ్లీ టికెట్ దక్కేదెవరికో..?.. జేసీ ఎత్తులకు ప్రభాకర్ చెక్ పెడ్తాడా? అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పెండింగ్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు.. ఎందుకిలా? దేవుడు వరం ఇచ్చినా... పూజారి కరుణించని చందంగా తయారైంది షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల పరిస్థితి. ఉన్నతాధికారుల ఉదాసీనవైఖరితో నిరుపేద ఆడబిడ్డల ఆర్థిక చేయూతకు గ్రహణం పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. గ్లోబల్ మాంద్యం భయాలు: 5 లక్షల కోట్లు ఢమాల్ బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్మాంద్యం, ముఖ్యంగా ఫెడ్ రిజర్వ్ వడ్డింపుతో దేశీయ స్టాక్మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టానికి చేరింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. IPL 2023: ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే? ఐపీఎల్-2023 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ, ఐపీఎల్ నిర్హహకాకులు ఆయా ఫ్రాంచైజీలకు సమాచారం కూడా అందించినట్లు తెలస్తోంది. కాగా ఈ మినీ వేలం దాదాపు డిసెంబర్ 16న జరిగే అవకాశం ఉంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Chhello Show: ఆ నిర్ణయం సరైంది కాదు.. పునరాలోచించండి.. సినిమా చూడకుండానే..! అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ నామినేషన్స్కు ఎంపికైన గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో'. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆస్కార్ వేడుకల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్'( ఉత్తమ అంతర్జాతీయ చిత్రం) విభాగంలో పోటీకి ఎంపికైంది ఈ చిత్రం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే.. హై బీపీ.. హెవీ బ్లడ్ ప్రెషర్.. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అధిక రక్తపోటును నిశ్శబ్ద కిల్లర్గా సూచిస్తారు. ఇది తరచుగా ఎలాంటి సంకేతాలు, హెచ్చరికలు, లక్షణాలు లేకుండా వస్తుంది కాబట్టి చాలామందికి రక్త పోటు యొక్క ప్రమాద సూచిక అసలు అర్థం కాదు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టండి: సీఎం జగన్ ఇళ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ, రెవెన్యూ, పురపాలక-పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణంలో ప్రగతిపై సమగ్రంగా సమీక్షించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్ష పదవిపై సజ్జల క్లారిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల అధ్యక్ష పదవీ తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరస్కరించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం జగన్ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్లోకి ఎక్కలేదన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. హెచ్సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్ జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హెచ్సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఏపీని ముందుండి నడిపిస్తున్న పాలనాదక్షుడు సీఎం జగన్: మంత్రి కేటీఆర్ ప్రశంసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీ కష్టాల్లో కూరుకుపోయినపుడు జగన్ ముందుండి నడిపించిన తీరును ఆయన కొనియాడారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే? సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉదయం ఆసీస్-భారత్ మ్యాచ్ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ లేడీ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న మహిళకు వెంటనే సీపీఆర్ చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అధ్యక్ష పదవికి పోటీపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు.. గహ్లోత్ పరిస్థితి ఏంటో? కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ అధ్యక్ష పదివికి పోటీ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. చైనా సర్కార్కు సవాల్ విసురుతున్న దెయ్యాల నగరాలు ఒక్క రియల్ ఎస్టేట్ రంగం నష్టాల్లో కూరుకుపోతే దేశ ఆర్ధిక వ్యవస్థే తల్లకిందులైపోతుందా ఏంటి? అని చాలా మంది బుగ్గలు నొక్కుకోవచ్చుకానీ.. చైనా విషయంలో మాత్రం అది నూటికి నూరు పాళ్లూ నిజమే అంటున్నారు ఆర్ధిక వేత్తలు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. హెచ్సీఏ కీలక నిర్ణయం! రాత్రి 7 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లు! భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సిరీయస్గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్తో చర్చల అనంతరం హెచ్సీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘పగ పగ పగ’ మూవీ రివ్యూ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం ‘ పగ పగ పగ’.అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్, మూవీ మోషన్ పోస్టర్, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. జాబ్ కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త.. లింక్డ్ ఇన్ ప్లాట్ఫారమ్లో.. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న లింక్డ్ ఇన్ ప్లాట్ఫారమ్ వృత్తిపరమైన వ్యక్తులతో కనెక్ట్ అవడానికి, జాబ్సెర్చ్లకు సహాయపడుతుంది. జనాదరణ పొందిన ఈ ప్లాట్ఫారమ్ను స్కామర్లు మోసాలకు ఉపయోగించుకుంటున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్ ఆర్బీకేలతో వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అలాంటివాళ్లు సభకు రావడం దురదృష్టకరం: ఏపీ స్పీకర్ పోడియంపైకి వచ్చి విపక్ష ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం బాధాకరమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అలాంటివాళ్లు సభకు రావడం దురదృష్టకరమన్నారు. అరాచకం సృష్టించేవాళ్లను చూస్తే బాధగా ఉందన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. దసరా సెలవులు కుదింపు వాస్తవమేనా?.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని.. సెలవుల కుదింపుపై వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ ఖండిచింది. కుదింపుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Chiranjeevi: ఏపీసీసీ డెలిగేట్గా మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఏపీసీసీ డెలిగేట్గా గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తింపు కార్డును జారీ చేసింది. కొవ్వూరు నుంచి చిరంజీవి పీసీసీ డెలిగేట్గా ఉన్నారు. 2027వరకు చిరంజీవిని పీసీసీ డెలిగేట్గా గుర్తిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఐడీ కార్డు మంజూరు చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పార్టీ చాలా ఇచ్చింది.. ఏం అడిగినా చేసేందుకు రెడీ.. కానీ! వచ్చే నెలలో జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పోటీ చేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉక్రెయిన్ని నివారించేలా రష్యా ఎత్తుగడ.. పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాలపై పైచేయి సాధిస్తూ...రష్యా ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా అధ్యక్షుడు బహిరంగంగా మరిన్ని సైనిక సమీకరణలను చేయనున్నట్లు ప్రకటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Hurun India Rich List 2022: అదానీ రోజు సంపాదన ఎంతో తెలుసా? కరోనా మహమ్మారి సంక్షోభం తరువాత సంపదలో భారతీయ కుబేరులు గ్లోబల్ బిలియనీర్లను దాటి ట్రిలియనీర్లుగా దూసుకు పోతున్నారు. దేశంలో 12 మంది అపర కుబేరుల నికర విలువ రూ. ఒక ట్రిలియన్ కంటే ఎక్కువేనని తాజా నివేదిక తేల్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Ind Vs Aus 1st T20: ఐసీసీ ర్యాంకింగ్స్లో బాబర్ను వెనక్కినెట్టిన సూర్య.. కోహ్లి మాత్రం! ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను అధిగమించి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్! అసలు కారణమిదేనా? సూపర్ స్టార్ మహేశ్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. హోటల్ రూమ్లో లవర్తో భర్త రాసలీలలు.. భార్య ఎంట్రీతో సీన్ రివర్స్! వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారుకిడుస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఇలాంటి క్రమంలో కుటుంబ సభ్యులకు దొరికిపోయి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. బసవతారకం ఆస్పత్రిలో కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయి: సీఎం జగన్ వైద్యరంగంలో నాడు-నేడుతో భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. నిర్మాణంపైనే కాదు నిర్వహణపైనా దృష్టి పెట్టాం: సీఎం జగన్ విద్యారంగంలో నాడు- నేడుపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో విద్యావవస్థ వేగంగా మారుతోందన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. సీఎంగా? వర్కింగ్ ప్రెసిడెంట్గానా... కుదిరితే రెండునా!.. సందిగ్ధ స్థితిలో రాజస్తాన్ సీఎం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్న సంగతి తెలిసింది. కాంగ్రెస్ 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పదేపదే కోరారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రాణికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యారీ ప్రవర్తనపై విమర్శలు! బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రాజకుటుంబంలోని సభ్యులందరితో పాటు 2,000 మంది అతిథులు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Viral: మ్యాట్రిమోనీలో యాడ్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాల్ చేయద్దంటూ.. ఒకప్పుడు బంధువులు, తెలిసిన వారి ద్వారా పెళ్లి సంబంధాలు కుదిరేవి. ఇప్పుడు కాలం మారింది. మ్యాట్రిమోనీ సైట్లు వచ్చాక ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నారు. తమ వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేసేస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. Dussehra 2022: నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధం హైదరాబాద్ మహానగరం మరో వేడుకకు సిద్ధమవుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాలకు సమాయత్తమవుతోంది. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి అనంతరం నిమజ్జనం గావిస్తారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. వన్ప్లస్ కళ్లు చెదిరే డీల్స్, ఆఫర్లు ఫెస్టివ్ సీజన్లో కస్టమర్లను ఆఫర్ల వర్షం రారమ్మని పిలుస్తోంది. ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సెప్టెంబర్ 23 నుంచి డిస్కౌంట్సేల్కు తెరలేవనుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆస్ట్రేలియాతో మూడో టీ20.. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ విషయంలో రగడ! టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మంగళవారం(సెప్టెంబర్ 20) మోహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మల్టీప్లెక్సుల్లో 75 రూపాయలకే హ్యాపీగా సినిమా చూసేయండి.. మూవీ లవర్స్కి గుడ్న్యూస్. మల్టీప్లెక్సుల్లో కేవతం 75 రూపాయలకే సినిమా చూసే ఛాన్స్ రాబోతుంది. సాధారణంగా మల్టీప్లెక్సుల్లో 250 నుంచి 400వరకు( పెద్ద సినిమాలకు) టికెట్ రేటు ఉంటుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సంబంధంలేని గొడవలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు గొడవతో సంబంధం లేదు... గొడవ పడుతున్న వారితోనూ ఎటువంటి స్నేహం లేదు.. స్నేహితుడి ఇంటి వద్ద దించేందుకని వచ్చిన యువకుడు సంబంధం లేని తగాదాలోకి వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకున్న విషాదకర సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. 11.43% గ్రోత్రేట్తో దేశంలోనే ఏపీ నంబర్ వన్: సీఎం జగన్ మూడేళ్లలో 99 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. భారీ పరిశ్రమల ద్వారా 46,280కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. వీటి ద్వారా రాష్ట్రంలో 62వేల 541 మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మార్గదర్శికేసులో రామోజీకి సుప్రీంకోర్టు నోటీసులు మార్గదర్శి కేసులో రామోజీరావుకు, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై సోమవారం విచారణ జరిగింది. కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తరపున వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏపీ అసెంబ్లీకి ఫోన్ ట్యాపింగ్ హౌస్ కమిటీ నివేదిక చంద్రబాబు హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్పై ఏపీ అసెంబ్లీకి హౌస్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదికను హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి.. స్పీకర్కు అందజేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ప్రతిపాదనల్లోనే ‘మినీ ట్యాంక్బండ్’.. మంత్రి కేటీఆర్ ఆదేశాలు బేఖాతర్! నగర శివారులోని ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు చేరువలో ఆహ్లాదాన్ని పంచే చెరువు.. దాని పక్కనే మట్టి, బండరాళ్లతో కూడిన కొండ.. ఇలా ప్రకృతి అందాలతో ఆకట్టుకొనఖాజాగూడ పెద్ద చెరువు రూపురేఖలు మార్చే ప్రక్రియ ఇంకా ప్రతిపాదన దశకే పరిమితమైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్ల ఆఫర్! బలపరీక్షకు సీఎం సై ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల మొదట్లో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బ్రిటన్ రాణి మరణంతో... వజ్రాలను తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ మృతి తర్వాత బ్రిటన్ రాజ కుంటుంబం అధీనంలో ఉన్న వజ్రాలను తమ దేశాలకు ఇచ్చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభమైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. వందల మంది ఉద్యోగులకు భారీ షాక్, ‘ఓలా.. ఎందుకిలా!’ ప్రముఖ రైడ్ షేరింగ్ దేశీయ దిగ్గజ సంస్థ ఓలాలో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. సంస్థ పునర్నిర్మాణం పేరుతో ఇప్పటికే వందలాది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ఓలా.. తాజాగా 500 మందిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టీ20లలో రోహిత్ తర్వాత అరంగ్రేటం.. ఇప్పటికే రిటైరైన 10 మంది భారత ఆటగాళ్లు వీరే! హెడ్కోచ్ సైతం.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసి నేటికి(సెప్టెంబరు 19) సరిగ్గా పదిహేనేళ్లు. ఐసీసీ టీ20 వరల్డ్కప్-2007లో భాగంగా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు హిట్మ్యాన్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సహనం కోల్పోయిన ఆదిరెడ్డి.. ఎమోషనల్ అయిన సుదీప బిగ్బాస్ ఇంట్లో మూడోవారం నామినేషన్స్ హీట్ మొదలైంది. డబుల్ ఎలిమినేషన్తో జలక్ ఇచ్చిన బిగ్బాస్ ఈసారి నామినేషన్స్లోనూ తాము చెప్పాలనుకున్న అభిప్రాయాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పాలంటూ ఆదేశించాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా అధికారులతో 'సిట్' చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. సొంత అన్నకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పవన్: పేర్ని నాని చిరంజీవి, పవన్ కల్యాణ్కు అసలు పొంతనే లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి పోరాటం చేశారని ప్రస్తావించారు. ఆయన ప్రజారాజ్యం పెట్టి 18 సీట్లు గెలిచారని గుర్తు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మహిళను వాటేసుకుని ముద్దుపెట్టబోయిన కాంగ్రెస్ నాయకుడు.. చితకబాదిన బాధితురాలి ప్రియుడు మహిళను లైంగికంగా వేధించిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు మనోజ్ కర్జాగిని పోలీసులు అరెస్టు చేశారు. తన సెలూన్లో బ్యుటీషియన్గా పనిచేసే మహిళతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. వీడియో లీక్ ఘటనపై సీఎం స్పందన: వారితో టచ్లో ఉన్నా.. దయచేసి వదంతులు నమ్మొద్దు చండీగఢ్ యూనివర్సిటీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ వ్యవహారంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిటన్లు తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. హైవేపై బస్సు బోల్తాపడి 27 మంది దుర్మరణం.. మరో 20 మందికి గాయాలు.. చైనాలో ఆదివారం ఉదయం ఘోరో ప్రమాదం జరిగింది. గిజావ్ రాష్ట్రం సాండు కౌంటీలో హైవేపై బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. సినిమాను తలపించిన ఎటాక్ సీన్.. స్విగ్గీ డెలివరీ బాయ్పై వెంటపడి మరీ.. మద్యం మత్తులో ముగ్గురు యువకులు స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి చేసి కొట్టిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారంకిరణ్ అనే డెలివరీ బాయ్ శనివారం ఉదయం భవానీనగర్లోని వరలక్ష్మి టిఫిన్స్ వద్దకు ఆర్డర్ తీసుకునేందుకు వచ్చాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక ఇది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుగా ఆరుబయటి స్విమ్మింగ్ పూల్. విశాలమైన సినిమా థియేటర్ వంటి భారీ హంగులతో అట్టహాసంగా ‘గ్లోబల్ డ్రీమ్–2’ పేరిట దీని నిర్మాణం చేపట్టారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. కస్టమర్లతో స్థానిక భాషల్లో మాట్లాడండి.. బ్యాంకర్లతో నిర్మలా సీతారామన్ దేశంలో అన్నీ బ్యాంకుల్లో బ్రాంచ్ లెవల్ అధికారులు స్థానిక భాషల్లో మాట్లాడాలని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలా మాట్లాడితే వినియోగదారుల వ్యాపార సంబంధిత అవసరాలు తీరుతాయని అన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Gautam Gambhir: భారత జట్టులో వారిద్దరి కంటే రాహుల్కే ఎక్కువ సత్తా టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాలలో భాగంగా స్వదేశంలో టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబర్20) జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విఘ్నేశ్ శివన్కు నయన్ బర్త్డే సర్ప్రైజ్.. ఏంటో తెలుసా..? కోలీవుడ్ సమ్థింగ్ స్పెషల్ జంట విఘ్నేశ్, నయనతార. ఇవాళ విఘ్నేశ్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు ఆమె స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా విఘ్నేశ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా నిర్వహించింది నయన్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. వింత మనుషులు.. చీకటి గదిలో నుంచి వెలుగులోకి.. మూడేళ్లుగా చీకటి గదిలో మగ్గిన జీవితాల్లో వెలుగులు నిండాయి. స్వీయ నిర్బంధంలో ఉన్న అన్నా చెల్లెళ్లు పోలీసుల చొరవతో జనంలోకి వచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన డోకా ఏమీ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అవాక్కయ్యే ఘటన.. ‘జయహో జగదీష్రెడ్డి’.. జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ ఒక జిల్లా ఎస్పీనే అత్యుత్సాహం ప్రదర్శించారు. వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్.. ‘జయహో జగదీష్రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మా ఫ్యామిలీ, కృష్ణంరాజు ఫ్యామిలీ కలిసి ఆ సినిమా చూశాం: రాజ్నాథ్ సింగ్ గోహత్య నిషేదంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు ప్రవేశపెట్టింది కృష్ణంరాజు అని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తర్వాత కాలంలో యోగి ఆదిత్యనాథ్ కూడా గోహత్య నిషేద బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారని కృష్ణంరాజు సంతాపసభలో రాజ్నాథ్సింగ్ గుర్తుచేసుకున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. SCO Summit: చైనా అధ్యక్షుడికి దూరం దూరంగా మోదీ.. నో స్మైల్, నో షేక్హ్యండ్ ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్ నగరంలో ఫాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధినేత షీ జిన్పింగ్ తదితర నేతలు హాజరయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ప్రధాని పుట్టినరోజు.. రూ.8.5 లక్షలు గెలుచుకునే లక్కీ ఛాన్స్! అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. ఢిల్లీలో ఓ రెస్టారెంట్ యజమాని ప్రధానీ నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా థాలి ఆఫర్ ప్రకటించాడు. తన హోటల్ని థాలి తింటే..రూ.8.5 లక్షల నగదు గెలుచుకువచ్చని బంపర్ ప్రకటించి ప్రధానిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. 45 ఏళ్ల తర్వాత సీడబ్ల్యూసీ పోస్టులకు ఎన్నికలు.. చివరకు కాంగ్రెస్కు ఇలాంటి స్థితి! గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్లో మునుపెన్నడూ లేనంత సంక్షోభ స్థితి కనిపిస్తోంది. గాంధీ కుటుంబం డామినేషన్పై వ్యతిరేకత.. అసమర్థ నిర్ణయాల వల్లే ఇవాళ్టి పరిస్థితి నెలకొందని ఆరోపిస్తూ సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బ్లాక్ ఫ్రైడే, దలాల్ స్ట్రీట్లో బ్లడ్ బాత్ దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. అంతర్జాతీయప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక సూచీసెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లకు పైగా కుప్పకూలింది. వారాంతంలో దాదాపు రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. న్యూజిలాండ్తో సిరీస్.. కెప్టెన్గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన న్యూజిలాండ్- ఏ జట్టుతో వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. చెన్నై వేదికగా జరుగనున్న ఈ మూడు మ్యాచ్ల సిరీస్కు కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు తెలిపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘సకల గుణాభిరామ’ మూవీ రివ్యూ బిగ్బాస్ షోతో పాపులర్ అయ్యాడు నటుడు విజే సన్నీ. అంతకు ముందే పలు సిరియల్స్తో పాటు సినిమాలలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు కానీ.. బిగ్బాస్ 5లో పాల్గొని విన్నర్గా నిలవడంతో సన్నీ పేరు రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసింది. బిగ్బాస్ షో తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘సకల గుణాభిరామ’. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కనిపెంచిన తండ్రి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దేవుడా ఎంత శిక్ష వేసావయ్యా ఒక రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. తండ్రిని, భర్తను పోగొట్టుకున్న కుమార్తె ఒక వైపు, భర్తను, అల్లుడిని పోగొట్టుకున్న తల్లి మరొకవైపు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంట తడి పెట్టించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. 58 ఏళ్లలో చంద్రబాబు ఏ రోజూ ఇలా చేయలేదు: సీఎం జగన్ అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాలా అని ప్రశ్నించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఖమ్మంలో కార్పొరేటర్గా గెలవలేని ఆమె అమరావతి గురించి మాట్లాడటమా? మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. నితీశ్ కుమార్ ఆ పని చేస్తే చేతులు కలుపుతా.. ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు బిహీర్ సీఎం నితీశ్ కుమార్తో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్. ఆయనతో మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధమే అని స్పష్టం చేశారు. కానీ ఒక్క షరతు విధించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. నాలుగు రోజుల్లో నన్ను అరెస్టు చేయాలి.. లేదంటే క్షమాపణలు చెప్పాలి.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆ పార్టీ విడుదల చేసిన స్టింగ్ వీడియోపై మండిపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘లక్ష రూపాయల ల్యాప్టాప్..రూ.40వేలకే ఇవ్వొచ్చు’! వేదాంత రిసోర్సెస్..దేశంలో మెటల్ తయారీలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. స్టీల్, కాపర్, అల్యూమీనియం తయారీలో దూసుకుపోతోంది. దేశంలో యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న కంపెనీల్లో ఇది ఒకటి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్! టీ20 ప్రపంచకప్-2022కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ తగిలే అవకాశం కన్పిస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్ టీ20 సిరీస్తో పాటు, టీ20 ప్రపంచకప్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టాలీవుడ్ నెం.1 హీరో ప్రభాస్.. హీరోయిన్ సమంత! బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా మారాడు ప్రభాస్. ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమా చేస్తూ ఫ్యాన్స్ని అలరిస్తున్నాయి. అయితే బహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. భారీ గుమ్మడిపండును డొల్లగా చేసి.. దానినే పడవగా మార్చి.. నదిని దాటి.. ఆపై! భారీ గుమ్మడిపండును డొల్లగా చేసి, దానినే పడవగా మార్చుకున్నాడు. గుమ్మడిపండు డొల్లలో కూర్చుని, తెడ్డు వేసుకుంటూ నదిని దాటేసి, గిన్నిస్ రికార్డు సాధించాడు. విచిత్రమైన ఈ రికార్డు సాధించిన వ్యక్తి వయసు అరవయ్యేళ్లు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కూతురితో అసభ్య ప్రవర్తన..హెడ్ కానిస్టేబుల్పై కేసు వరుసకు కూతురయ్యే బ్యూటీషియన్పై అసభ్యంగా ప్రవర్తించిన ఏపీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి షాక్.. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇందుకు ఆరు వారాలు గడువిస్తూ నోటీసులు పంపింది. సుబ్రహ్మణ్యస్వామికి కేంద్రం 2016 జనవరిలో ఢిల్లీలో అధికారిక నివాసం కేటాయించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. లాస్ట్ ఫ్టైట్ జర్నీ...మిమానంలో క్వీన్ మృతదేహాన్ని మోసుకెళ్లి.... బ్రిటన్ని సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్ సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బల్మోరల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్ధం స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్లోని రాణి అధికారిక నివాసం రుడ్హౌస్ ప్యాలెస్కు తరలించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది? చైనా పైకి కనిపించేంత బలంగా లేదా? పైకి డాబుగా కనిపించే చైనా పరిస్థితి పైన పటారం.. లోన లొటారమేనా? ఆర్ధికంగా అగ్రరాజ్యం అమెరికానే తలదన్నేస్తామనే చైనా ధీమా ఉత్తుత్తిదేనా? అసలు చైనాలో ఏం జరుగుతోంది? ఇపుడీ ప్రశ్నలే ప్రపంచ ఆర్ధిక రంగ నిపుణులను వెంటాడు తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మండలి ఛైర్మన్, స్పీకర్ సమీక్ష ఈ నెల 15వ తేదీ నుంచి జరుగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు, శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కేసీఆర్ సర్కార్ను గవర్నర్ ఇరుకున పెట్టారా? తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి వార్తలలోకి ఎక్కారు. ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలే చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఆమెకు మధ్య విబేధాలు ఏర్పడిన నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించేలా ఉన్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్ హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్ తనదైన నటన, స్టైల్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోలలో ఒక్కడిగా మారాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. దూసుకొస్తున్న రన్ మెషీన్.. ఆఫ్ఘన్పై సెంచరీతో భారీ జంప్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారీ జంప్ చేశాడు. ఆసియా కప్-2022లో ఆఫ్ఘనిస్తాన్పై సూపర్ శతకం (61 బంతుల్లో 122 నాటౌట్) సాధించి మళ్లీ టాప్-10 దిశగా దూసుకొస్తున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బెజోస్,మస్క్ సరే! మరి అదానీ, అంబానీ సంపద మాట ఏంటి? అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి బిలియనీర్లు బిలియన్ డాలర్ల సంపదను కోల్పోతున్నారు. టాప్ 10లో ఉన్న అక్కడి బిలియనీర్ల సంపదకు ఈ ఏడాది గడ్డుకాలంగా నిలుస్తోంది. ఒక్క జులై మినహా ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికా మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Health Tips: తలనొప్పి.. ప్రధాన కారణాలు! ఇలా చేశారంటే.. తలనొప్పికి చాలా సర్వసాధారణమైన కారణం ఆకలి. మనకి ఆకలి వేసినప్పుడు మన శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. షుగర్ లెవల్స్ పెరిగినపుడు శరీరంలో నరాలు సంకోచించి మెదడుకు సిగ్నల్ను పంపడం వలన తలనొప్పి వస్తుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. వైద్యం, ఆరోగ్యం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు వైద్యం, ఆరోగ్య విభాగాల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్యాన్సర్ నివారణ, చికిత్సలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. దూసుకొచ్చిన వీఆర్ఏలు.. తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్ తెలంగాణ ఇంటెలిజెన్స్ మరోసారి విఫలం అయింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ వీఆర్ఏల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. ఇంటెలిజెన్స్ ఛలో అసెంబ్లీని పసిగట్టలేకపోయింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. రాజధాని అమరావతి అసైన్డ్ భూముల స్కామ్లో ఐదుగురు అరెస్ట్ రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో ఐదుగురిని సీఐడీ అరెస్ట్ చేసింది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. జిన్పింగ్ పుతిన్, మోదీని కలుస్తారా? నిరాకరించిన చైనా ! ఈ వారంలోనే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎన్సీఓ) ప్రాంతీయ భద్రతా బ్లాక్ సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు సంబంధించిన ప్రణాళికా విషయాలు గురించి వెళ్లడించడానికి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. తూర్పు లద్దాక్లో బలగాలను ఉపసంహరించుకున్న భారత్, చైనా భారత్-చైనా సరిహద్దు వివాదంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా కీలక ముందడుగు పడింది. తూర్పు లద్దాక్ పెట్రోలింగ్ పాయింట్ 15 సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఇరుదేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. తగ్గేదేలే.. 20లోపు జీవో రాకపోతే ఉద్యమం ఉధృతం: వీఆర్ఏలు మంత్రి కేటీఆర్ హామీతో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వీఆర్ఏలు అన్నారు. మంత్రిపై తమకు నమ్మకం ఉందన్నారు. ఆందోళన విరమించాలన్న కేటీఆర్ ప్రతిపాదనలపై చర్చిస్తున్నామని వీఆర్ఏ నేతలు పేర్కొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘పెళ్లి కాకపోయిన పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కంటాను’ ‘సీతారామం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకుర్. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్తో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ జాబితాలో చెరిపోయింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. హెచ్సీఎల్ ఉద్యోగులకు భారీ షాక్! ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. హెచ్సీఎల్ సంస్థ మైక్రోసాఫ్ట్ న్యూస్ విభాగానికి చెందిన ప్రొడక్ట్పై వర్క్ చేస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. యంత్రాన్ని ప్రేమించు... మనిషిని ద్వేషించు! కోపం వస్తోందా? వచ్చేసింది.. కృత్రిమ మేధ , మరమనుషుల ఉపయోగం , డిజిటలైజేషన్, ఆటోమేషన్ యుగం! రానున్న 15 ఏళ్ళల్లో భారీగా తగ్గిపోనున్న ఉద్యోగాలు/ వృత్తులు.. డ్రైవర్ , వ్యవసాయదారుడు , ప్రింటర్, పబ్లిషర్ , క్యాషియర్, ట్రావెల్ ఏజెంట్ , వైటర్స్ , డిస్పాచ్ క్లర్క్, ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగాలు, మిలిటరీ పైలట్, సోల్జర్ 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. టి20 ప్రపంచకప్కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా.. ఆసియా కప్ టోర్నీలో నిరాశజనక ప్రదర్శన అనంతరం టీమిండియా మరో మెగాటోర్నీకి సిద్ధమైంది. అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదిక పొట్టి ప్రపంచకప్ జరగనుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్ను తిరస్కరించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.కాలిపోతున్న ఆర్ఎస్ఎస్ నిక్కర్.. కాంగ్రెస్ ఫోటోపై రాజకీయ దుమారం భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆర్ఎస్ఎస్ ధరించే ఖాకీ నిక్కర్ కాలిపోతున్న ఫోటోను షేర్ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. విద్యాశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై ఆడిట్ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఆడిట్ నిర్వహించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. నేను రాజీనామా చేస్తా..! సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్.. కేంద్రం ఇచ్చిన గెజిట్లో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఉందని, మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్ కూడా ఇవొద్దని బిల్లులో చెప్పారంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. చనిపోయే ముందు వాళ్లకు స్పెషల్ గ్రీటింగ్స్ పంపిన బ్రిటన్ రాణి బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు వివాహబంధంలో 60 ఏళ్ల పూర్తి చేసుకున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్రీటింగ్స్ పంపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘కృష్ణంరాజు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే వింతగా చూసేవారు!’ యండమూరులోని చిన్నమ్మ, చిన్నాన్నల ఇంటి వద్ద ఉండి సినీనటుడు కృష్ణంరాజు పాఠశాల విద్యనభ్యసించారు. 9, 10వ తరగతి వరకూ పెద్దాపురప్పాడు హైస్కూల్లో చదువుకున్నట్టు ప్రజలు చెబుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. టీ20 వరల్డ్ కప్ 2022లో పాల్గొనే టీమిండియా ఇదే ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును సెలెక్టర్లు కొద్ది సేపటి కిందే ప్రకటించారు. 15 మంది సభ్యుల భారత బృందానికి రోహిత్ శర్మ నాయకుడిగా, కేఎల్ రాహుల్ ఉప నాయకుడిగా వ్యవహరించనున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు! ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! అత్యధిక కాలం బ్రిటన్ను పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 అస్తమయం కావడంతో యూకే రాజుగా ఆమె కుమారుడు, ప్రిన్స్ ఛార్లెస్ నియమితులు అయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. కృష్ణంరాజు మృతి.. వెక్కెక్కి ఏడ్చిన జయప్రద ‘రెబల్’ స్టార్ కృష్ణం రాజు మృతిపై సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద భావోద్యేగానికి లోనయ్యారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతరమయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. పబ్స్పై తెలంగాణ హైకోర్టు కొరడా.. కీలక ఆదేశాలు నగరంలోని పబ్స్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజేలు ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. AP Assembly: ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ గట్టి షాక్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఒడిశా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతల్లో కోతలు విధించగా తాజాగా ఛత్తీస్గఢ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని పూర్తిగా తప్పించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. గాడి తప్పిన గురుకులం! ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడిన వాస్తవాలు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంక్షేమ గురుకులాలు గాడి తప్పాయి. నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సదుపాయాలు సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పాన్ ఇండియా పార్టీ.. దసరాకు విడుదల! జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరాను ముహూర్తంగా ఎంచుకున్నారు. విజయదశమి రోజున హైదరాబాద్ వేదికగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Regional Ring Road: రాయగిరి రైతులకు కష్టాల ‘రింగ్’! బతికేదెట్లా? అది రాయగిరి గ్రామం.. చుట్టూ పొలాలు, చేన్లతో కళకళాడేది.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు, హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉంటుంది. ఆ ప్రధాన రహదారి విస్తరణ కోసం గ్రామంలో కొంతమేర పొలాలు, భూములు పోయాయి.. అభివృద్ధి కోసమేకదా అనుకున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రాకుమారునిగా వెళ్లి... రాజుగా లండన్కు చార్లెస్ రాణి ఎలిజబెత్–2 ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే గురువారం ఉదయం రాకుమారుని హోదాలో లండన్ వీడిన చార్లెస్, ఆమె మరణానంతరం శుక్రవారం బ్రిటన్ రాజు హోదాలో తిరిగి రాజధానిలో అడుగు పెట్టారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆగండి.. ఒక్క క్షణం ఆలోచించండి! కష్టమనేది లేని రోజంటు లేదు కదా.. కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా’ అన్నారో సినీ కవి. ఇది అక్షర సత్యం. ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదనేది జీవితం నేర్పిన పాఠం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆస్ట్రేలియా కెప్టెన్ సంచలన నిర్ణయం.. వన్డేలకు గుడ్బై ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్కు ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం విలేకరుల సమావేశంలో ఫించ్ వెల్లండించాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టాలీవుడ్లో విషాదం.. ‘మహర్షి’ ఫేం నటుడు గురుస్వామి మృతి ‘మహర్షి’ ఫేం నటుడు, కర్నూలుకు చెందిన మిటికిరి గురుస్వామి (80) శుక్రవారం సాయంత్రం మరణించారు. ఆయనకు 15 రోజుల కిందట బ్రె యిన్ స్ట్రోక్ రాగా, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చికిత్స పొంది, మూడు రోజుల కిందట కర్నూలు బాలాజీనగర్లోని స్వగృహానికి వచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. డిజిటల్ లెండింగ్ నిబంధనలు..వినియోగ హక్కుల పరిరక్షణ కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన డిజిటల్ లెండింగ్ నిబంధనలు వినియోగ హక్కుల పరిరక్షణకు అలాగే రెగ్యులేటరీ పరమైన అడ్డంకులను అధిగమించడానికి ఉద్దేశించినవి డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. CM YS Jagan: 22న సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 22న కుప్పం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ స్థలాలను గురువారం పరిశీలించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. LIVE Updates: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.. Telangana: గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరాల్లో సెలవు గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 9న శుక్రవారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మళ్లీ మహోగ్రం.. పోటెత్తిన కృష్ణమ్మ :కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టికి దిగువన తుంగభద్ర, వేదవతి, భీమా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,26,201 క్యూసెక్కులు చేరుతుండగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 12,500, హంద్రీ–నీవా ద్వారా 1,125, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.. Human Development Index: మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విలవిలలాడిన ప్రపంచ దేశాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కుదేలైపోయాయి. రెండేళ్ల పాటు విజృంభించిన ఈ వైరస్తో మానవాభివృద్ధి అయిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. 400 ఏళ్ల క్రితమే పక్కా ప్లాన్తో బెంగళూరు నిర్మాణం.. నేడు గజగజ వణకడానికి కారణాలేంటి? చెరువుల నగరంగా ఒకప్పుడు పేరున్న బెంగళూరులో ఆ చెరువులు, వాటి అనుబంధ కాలువలు ప్రభుత్వ నిర్మాణాలకు, కబ్జాల వల్ల అదృశ్యమైపోయాయి. ఫలితంగా వర్షాలు వస్తే ఆ నీరు ఒకప్పుడు జల వనరులు ఉన్న చోటికే వెళ్తోంది. చివరికి ముంపు తయారవుతోంది. దీనివల్ల లక్షలాది జీవితాలు అవస్థల పాలయ్యాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.. Kohli-KL Rahul: రోహిత్ లేకుంటే ఫ్రీ హ్యాండ్ తీసుకుంటారా! 1020 రోజులు... ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడేళ్లుగా ఎదురు చూసిన క్షణం... సింగిల్ తీసినంత సులువుగా సెంచరీలు సాధించిన కోహ్లి 70 నుంచి 71కి చేరేందుకు మైళ్ల కొద్దీ సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న భావన... ఆటలో లోపం కనిపించలేదు, పరుగులు చేయడం లేదనే సమస్య రాలేదు... అయితే 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.. ద్రవ్యోల్బణ కట్టడి బాధ్యతను ఆర్బీఐకే వదిలేయలేం..! ద్రవ్యోల్బణం నియంత్రణ బాధ్యతలను కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధానానికే వదిలివేయలేమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం, కేవలం ద్రవ్య పరమైన అంశాలే కాకుండా ద్రవ్యోల్బణాన్ని పలు అంశాలు నిర్దేశిస్తున్నాయని సూచించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.. Regina Cassandra: అది అప్పుడే ముగిసిపోయింది.. ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో.. చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాళ్ మొదల్ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అవకాశాలను రాబట్టుకుంది. కానీ కోలీవుడ్లో స్టార్డమ్ను అందుకోలేకపోయింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. నగల వ్యాపారి హనీట్రాప్లో కొత్త ట్విస్ట్ మండ్యకు చెందిన బంగారం వ్యాపారి హనీట్రాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గతనెల ఓ లాడ్జీలో యువతితో ఉన్న జగన్నాథశెట్టిని ఇద్దరు యువకులు, ఓ మహిళ లాడ్జికి వచ్చి బెదిరించారు. ఆ సమయంలో జగన్నాథ శెట్టి తాను ఓ కళాశాల ప్రిన్సిపల్ అని చెప్పుకుని ట్యూషన్ కోసం యవతిని పిలుచుకుని వచ్చానని వారికి చెప్పాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ‘నీట్–యూజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల నీట్–అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాజస్తాన్కు చెందిన తనిష్క టాప్ ర్యాంకు దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలీ మూడో ర్యాంకు సాధించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. నాడు – నేడు స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’ స్కూళ్లు విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా తాజాగా కేంద్ర ప్రభుత్వానికీ స్ఫూర్తిదాయకమైంది. నాడు – నేడు తరహాలో అన్ని సదుపాయాలతో ‘పీఎం శ్రీ’ పేరిట కొత్తగా స్కూళ్లను ప్రారంభించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. NEET Result 2022: జాతీయ స్థాయి ర్యాంకు లక్ష వచ్చినా తెలంగాణలో సీటు.. నీట్ నిపుణుల విశ్లేషణ ఇదే వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు కాళోజీ విశ్వవిద్యాలయం తెలిపింది. నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అందులో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Nims Hospital: ‘నిమ్స్ డైరెక్టర్కు అపోలోలో చికిత్సా?’ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్కు ఛాతీ నొప్పి రావడంతో అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారన్న వార్త వినడానికే విచిత్రంగా ఉందని ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేశ్ అభిప్రాయపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రూ.27,360 కోట్లతో ‘పీఎం–శ్రీ’ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం–శ్రీ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం–శ్రీ యోజన, పీఎం గతిశక్తికి సంబంధించిన రైల్వే ల్యాండ్ పాలసీ సవరణకు ఆమోదం తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు బ్రెజిల్లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏముందంటారా? చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. సదరు యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడం ఇందుకు దారి తీసిందట!! 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పాకిస్తాన్ ఫైనల్కు.. టీమిండియా ఇంటికి భారత్ అభిమానుల్లో ఆశలు రేపేలా ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్లో చివరకు పాకిస్తానే వికెట్ తేడాతో అఫ్గానిస్తాన్పై గెలిచింది. దీంతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాక్, శ్రీలంక జట్లు ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు రెండేసి విజయాలు సాధించగా, ఆడిన రెండూ ఓడిన భారత్, అఫ్గానిస్తాన్ ఆసియా కప్ టి20 టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ విడుదల, ధర ఎంతంటే! ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి ఐఫోన్ 14 సిరీస్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ గురించి ఫీచర్లు, వాటి ధరల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. డైరెక్టర్తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈషా రెబ్బా? టాలీవుడ్ బ్యూటీ, తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ప్రస్తుతం ఆమె పెళ్లి వార్తుల నెట్టింట చర్చనీయాంశమవుతున్నాయి. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది ఈషా. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. దశాబ్దాల స్వప్నం సాకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన òనెల్లూరు బ్యారేజీను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఎస్పీ సీహెచ్ విజయారావు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Rain Alert: 9న అల్పపీడనం! రాష్ట్రంలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 48 గంటల అనంతరం అంటే ఈ నెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్! మునుగోడు ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు కాకుండా జనవరిలో జరిగితే పార్టీకి మరింత ప్రయోజనమని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ముఖ్య నేతలు ఈ అభిప్రాయంతో ఉన్నట్టు పార్టీవర్గాల సమాచారం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అప్పుడేమో పెళ్లై పిల్లలు పుట్టాక.. ఇప్పుడేమో అప్లికేషన్ పెడ్తేచాలు.. మునుగోడు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరవుతోంది. వివాహమైన ఏడాదికో రెండేళ్లకో, పిల్లలు పుట్టాక వచ్చే కల్యాణలక్ష్మి చెక్కులు.. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటికి సంబంధించిన చకచకా సాగిపోతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. జింబాబ్వేను వణికిస్తున్న మీజిల్స్ వ్యాధి.. 700 మంది చిన్నారులు మృతి జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. యాత్రతో రాత మారేనా? ఎన్నికల్లో వరుస పరాజయాలు.. కీలక నేతల నిష్క్రమణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’కు బుధవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. రోహిత్, కోహ్లి కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే! ఆస్ట్రేలియా వేదికగా జరగన్న టీ20 ప్రపంచకప్-2022కు సమయం దగ్గర పడతుండడంతో ఆయా జట్లు తమ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ మెగా ఈవెంట్కు ముందు ధ్వైపాక్షిక సిరీస్లతో జట్లు బీజీ బీజీగా గడపనునున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టెలికం కంపెనీలకు ‘సిమ్’ పోటు.. ఈ– సిమ్ పంచాయితీ! టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్డౌన్లతో సెమీకండక్టర్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను వేధిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బాత్రూంలో ‘హెయిర్స్’ లొల్లి.. అతి చేసిన గీతూ! పక్కా లోకల్ పాటతో నిద్రలేచారు ఇంటి సభ్యులు. అభినయ శ్రీ తన మాస్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇంతలోనే గలాట గీతూ బాత్రూం గొడవ మొదలుపెట్టేసింది. బాత్రూంలో ఎవరివో హెయిర్స్ ఉన్నాయని, తలస్నానం చేసినప్పుడు ఎవరి హెయిర్స్ వాళ్లే తీసి పడేయాలి, బిగ్బాస్ తనకు ఈ టాస్క్ ఇచ్చినా చేయనని చెప్పుకొచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. హైదరాబాద్ వైద్య విద్యార్థినిపై పుదుచ్చేరిలో లైంగిక దాడి యత్నం వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడి ప్రయత్నం కేసులో పుదుచ్చేరి పోలీసుతో పాటు అతని స్నేహితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జిప్మర్ వైద్య విద్యాలయం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ న్యూస్: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. YSR Kadapa: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. స్పీకర్కు ఎంఐఎం లేఖ.. రాజాసింగ్పై సంచలన కామెంట్స్ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని పేర్కొంది. సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటిస్ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్కు బెయిల్ ఇచ్చారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. Dellhi Liquor Scam: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట.. సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిటీ సివిల్ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కవితపై ఆరోపణలు చేసిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కుప్పం నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొంగణపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. బల పరీక్షలో నెగ్గిన నితీష్ ప్రభుత్వం.. బీజేపీపై అటాక్ బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం ఏకగ్రీవంగా నెగ్గింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం నితీష్ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేదని వ్యాఖ్యానించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ట్రంప్ రికార్డు బ్రేక్ చేసిన బైడెన్.. 130 మంది భారత సంతతి వ్యక్తులకు చోటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన పాలనా యంత్రాంగంలో ఏకంగా 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో వీరికి చోటు కల్పించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘లైగర్’ ఫస్ట్ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే.. విజయ్ దేవరకొండ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ కోసం ‘రౌడీ’ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రేపే(ఆగస్ట్ 25) ఈ చిత్రం విడుదల కోబోతుంది. దీంతో విజయ్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. విడుదల కానున్న ఐఫోన్14 సిరీస్, భారతీయులు ఏమంటున్నారంటే! టెక్ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ -14 సిరీస్ సెప్టెంబర్ 7న లాంచ్ కానుంది. కొత్త ఐఫోన్ సిరీస్ విడుదలతో యూజర్లు తమ ఫోన్లను అప్గ్రేడ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. కళ్లన్నీ కోహ్లి మీదే! తిరుగులేని రన్మెషీన్.. టోర్నీలో ఎన్ని సెంచరీలంటే? ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎందురు చూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు కౌంట్డౌన్ మొదలైంది. దాయాదుల పోరుకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. చింతపండు సిరప్ను ముఖానికి రాసుకున్నా, నేరుగా తాగినా సరే! అద్భుత ప్రయోజనాలు! కూరల్లో పులుపు, రుచికోసం వాడే చింతపండు ఆరోగ్యాన్ని కాపాడడంలో, చర్మాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. చింతపండులో విటమిన్స్, ఐరన్, పొటాషియం, ఖనిజపోషకాలు, పీచుపదార్థంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ న్యూస్: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. నుపూర్ శర్మ ఎపిసోడ్తో రాజాసింగ్పై తక్షణం చర్యలు చేపట్టింది పార్టీ హైకమాండ్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. విద్య, వైద్యంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. రేవంత్కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి రాజకీయాలలో నోరు జారితే ఒక్కోసారి అది ప్రమాదకరంగా మారుతుంది. అందులోను ముఖ్యమైన స్థానాలలో ఉన్నవారు మరీ జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి పలు విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి. అలాగే నేతలు పలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతుంటారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. 502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ 502 టీచర్ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్ స్కూళ్లలో 15 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్ లోథ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. అవసరమైతే ధర్మం కోసం తాను చనిపోయేందుకైనా సిద్ధం కానీ... వెనక్కి తగ్గనని ఆయన తేల్చిచెప్పారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. శివసేన గుర్తు ఎవరికి? 8 ప్రశ్నలు రూపొందించిన సుప్రీంకోర్టు శివసేన అధికారిక గుర్తును ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంపై మొత్తం 8 ప్రశ్నలను రూపొందించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. డెబిట్, క్రెడిట్ కార్డు నిబంధనలు: చివరి తేదీ వచ్చేస్తోంది ఆన్లైన్ షాపింగ్ సౌలభ్యం కోసం ఆర్బీఐ‘టోకనైజేషన్’ అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. అలాగే చాలా సురకక్షితంగా కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసుకోవచ్చని కేంద్ర బ్యాంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పాక్తో మ్యాచ్లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి! ఈ మధ్య విరాట్ కోహ్లితో నేను మాట్లాడలేదు. అయితే, గొప్పవాళ్లుగా పేరొందిన ఆటగాళ్లు సరైన సమయంలో కచ్చితంగా తామేంటో నిరూపించుకుంటారు. కోహ్లి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆసియా కప్ రూపంలో మంచి అవకాశం వచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. అప్పట్లోనే బిగ్బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్గా కవర్ ఫొటో మెగాస్టార్ చిరంజీవి నిన్నటితో (ఆగస్ట్ 22న) 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. సోమవారం కుటుంబసభ్యుల సమక్షంలో చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ ఘనంగా జరిగాయి. ఇక అభిమానులు, సెలబ్రెటిల నుంచి ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. నిజమాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన సురేష్ హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1.జయహో జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీదే అధికారం.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. సార్వత్రిక ఎన్నికలు జరిగి 40 నెలలు పూర్తవుతున్నప్పటికీ, వైఎస్సార్సీపీ హవా ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.అక్కడో మాట.. ఇక్కడో మాట.. అచ్చెన్న దొంగాట! పాతపట్నంలో టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. ఎవరు ఎవర్ని ప్రోత్సహిస్తున్నారో, ఎవరు ఎవర్ని వాడుకుంటారో, అగ్ర నేతల మధ్య ఏ నేత బలి పశువు అవుతారో అంతు చిక్కని విధంగా తయారైంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీ (75)పై శుక్రవారం అమెరికాలో హత్యాయత్నం జరిగింది. న్యూయార్క్లో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆయన సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.పడగ విప్పిన కరువు, జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్.. 500 ఏళ్ల విపత్తు! బ్రిటన్లో థేమ్స్ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మునుగోడులో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్ మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.ఎకానమీ.. శుభ సంకేతాలు! అంతర్జాతీయ, దేశీయ సవాళ్ల నేపథ్యంలోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. పలు రంగాలకు సంబంధించి శుక్రవారం వెలువడిన అధికారిక రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతుల గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. లైగర్ నుంచి ముచ్చటగా మూడో సాంగ్ కోకా 2.0 రిలీజ్ ఈ చిత్రంలోని ‘కోకా 2.0..’ అనే పాటని శుక్రవారం విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను గీతా మాధురి, రామ్ మిరియాల పాడారు. ఈ పాటలో పూరి జగన్నాథ్ కూడా కనిపిస్తారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.టీమిండియా కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్.. మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా వ్యవహరించనున్నాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని నిర్ధారించారు. జింబాబ్వే సిరీస్కు, ఆసియా కప్కు మధ్య తక్కువ వ్యవధి ఉండటమే అందుకు కారణం. ‘టీమిండియాకు హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ జింబాబ్వేకు వెళతారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య.. తులసిచెట్టుకు పూజ తనకు పెళ్లి చేయడం లేదన్న కోపంతో తండ్రిని, చిన్నాన్నను హతమార్చాడో యువకుడు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల ఉద్యోగంలో చేరిన దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎంపీడీవోలకు పదోన్నతులు లభించాయి. 12 మంది జెడ్పీ డిప్యూటీ సీఈవోలుగా, మరో 225 మంది డీఎల్డీవో స్థాయి హోదాలో ఒకేసారి 237 మంది ఎంపీడీవోలు గురువారం పదోన్నతుల పత్రాలను స్వీకరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా! పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది జూలై రెండో వారంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీఆర్ఎస్లో రోజుకో జిల్లాలో అసమ్మతి రాజకీయం.. ఇప్పుడు వికారాబాద్ పంచాయితీ! టీఆర్ఎస్లో రోజుకో జిల్లాకు సంబంధించిన అసమ్మతి రాజకీయం ప్రగతిభవన్కు చేరుకుంటోంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గ నేతలు బుధవారం ప్రగతిభవన్ మెట్లెక్కారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇంజనీరింగ్లో సీట్లపై ఉత్కంఠ! పదివేలు దాటినా సీఎస్సీ పక్కా తెలంగాణ ఎంసెట్ రాసిన 1.56 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఇంజనీరింగ్లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో.. ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో సీటు దొరుకుతుంది? కోరుకున్న బ్రాంచ్లో సీటు రావాలంటే ఎంత ర్యాంకు రావాలి? 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. యంగిస్తాన్! నరాల బిగువు, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించే మేధో సంపత్తితో కూడిన యువ శక్తి భారత దేశ సొంతం. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత యువ జనాభా మన దగ్గరుంది. మన దేశ సగటు వయసు కేవలం 28 ఏళ్లు! 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మీ ప్రతిభాశక్తి ఆదర్శనీయం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అనుక్షణం ఆచరిస్తూ అత్యున్నత శిఖరాలకు ఎదిగిన మిమ్మల్ని సదా అనుసరిస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధాని మోదీ శ్లాఘించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మరో సంస్థను అమ్మకానికి పెడుతోన్న కేంద్రం! మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్లో ప్రభుత్వానికిగల వాటా విక్రయ నిర్వహణను చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 6 ఏళ్ల తర్వాత భారత్తో సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్ దూరం! స్వదేశంలో టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. అయితే ఈ సిరీస్కు కూడా జింబాబ్వే రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ గాయం కారణంగా దూరమయ్యాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విషాదం.. గుండెపోటుతో ప్రముఖ సింగర్ కన్నుమూత సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్, నేషనల్ అవార్డు విన్నర్ శివమొగ సుబ్బన్న(83) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. అన్నా.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే.. ‘అన్నా.. నువు నన్ను వదిలి వెళ్లిపోయావు.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే.. ఈ రోజే రాఖీ కొని తీసుకువచ్చాను.. ఒక్కగానొక్క అన్నవు.. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోతే ఎలా.. అన్నా..’ అంటూ మృతుడి సోదరి ఉపాసన రోదించిన తీరు కంటతడి పెట్టిచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. సీఎం జగన్ రాఖీ శుభాకాంక్షలు రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. విద్యార్థులకు రూ.11,715 కోట్ల లబ్ధి రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. గాలి రాతలైతేనే అచ్చేస్తాం! రామోజీ పచ్చ రాతలు.. నిజాలకు పాతరేస్తూ ‘ఈనాడు’ కథనం ఓబుళాపురం ప్రాంతంలోని మూడు ఇనుప ఖనిజం గనులకు ఉన్న 50 సంవత్సరాల లీజు కాలపరిమితి గత ఏడాదితో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి కాలపరిమితి ముగిసిన గనులకు 1957 గనుల చట్టం ప్రకారం ఈ–ఆక్షన్ ద్వారా తిరిగి లీజులు కేటాయించాలి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! జెండాల పంపిణీలో ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనలు మూడు వర్ణాల్లో ఒక్కో వర్ణానిది ఒక్కో సైజు.. రంగులు సరిగ్గా అద్దక మధ్యలో తెల్లటి చారలు.. తెలుపు వర్ణం మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం పక్కకు జరగడం.. జెండాలపై చేతి రాతలు.. వెరసి జాతీయ పతాక నియమావళి (ఫ్లాగ్ కోడ్) ఉల్లంఘనలు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. జెండా కొంటేనే రేషన్.. తీవ్ర విమర్శలు దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయజెండాను రేషన్కార్డు పేద లబ్ధిదారులతో బలవంతంగా కొనుగోలుచేయిస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘రూ.20 పెట్టి జెండా కొనాల్సిందే. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? సాధారణంగా ఎన్ని గొడవలున్నా శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి ఒక్కటిగా కలుసుకుంటాం. అందుకు భిన్నంగా ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడంలో సిద్ధహస్తులుగా మారుతున్నారు టీడీపీ నగర నేతలు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. టీఆర్ఎస్లో టికెట్ లొల్లి.. అసమ్మతి లేఖాస్త్రం.. చల్లార్చే యత్నం మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు వేగవంతం చేస్తున్నాయి. అయితే అధికార పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సవరించని అమ్మకాల ధరలు, ఆయిల్ కంపెనీలకు భారీ షాక్! పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. వాటి విక్రయ ధరలను సవరించకుండా నిలిపివేయడం వల్ల ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాభాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభావం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం చెస్ ఒలింపియాడ్లో కాంస్యం గెలిచిన భారత మహిళల ‘ఎ’ జట్టులో ద్రోణవల్లి హారిక కూడా సభ్యురాలు. ప్రస్తుతం 9 నెలల గర్భవతి అయిన హారిక...ఒక దశలో టోర్నీలో ఆడటం సందేహంగా మారింది. అయితే ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టులో భాగం కావడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఒకేరోజు షూటింగ్లో గాయపడిన ఇద్దరు హీరోయిన్స్ సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్లో తీవ్రంగా గాయపడింది.బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బైక్స్తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం : సీఎం వైఎస్ జగన్ ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మొహర్రం సందర్భంగా సీఎం జగన్ సందేశం విడుదల చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. వెంకయ్య భావోద్వేగం పార్లమెంట్ ఎగువ సభ గౌరవాన్ని మరింత ఉన్నత స్థానానికి చేర్చేందుకు చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు విశేషమైన కృషి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నితీశ్లో ఎందుకీ అసంతృప్తి? బిహార్లో బీజేపీ, జేడీ(యూ) బంధం బీటలుబారుతోంది. రెండు పార్టీల మధ్య తెగతెంపులు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆ కారణం వల్లే ప్లాన్ ప్రకారం జీవన్రెడ్డికి పిస్టల్ గురిపెట్టి ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ.జీవన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త పెద్దగాని ప్రసాద్గౌడ్ను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డెవిస్ సోమవారం ప్రకటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కరోనా అంతమెప్పుడో చెప్పిన చైనా నోస్ట్రాడమస్ బ్రహ్మంగారి కాలజ్ఞానం మనకు తెలిసిందే. అలా ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే ఊహించి చెప్పినవాడు ‘నోస్ట్రాడమస్’. 465 సంవత్సరాల క్రితమే వేల అంచనాలతో ‘లెస్ ప్రొఫెటీస్’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆయన చెప్పినవాటిలో కొన్ని నిజమయ్యాయి కూడా. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. వీఆర్వోల అంశంపై తెలంగాణ సర్కార్కు షాకిచ్చిన హైకోర్టు గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు(విలీనం) ప్రక్రియ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 121 అమలుపై హైకోర్టు స్టే విధించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. రూ. 1.62 లక్షల కోట్ల విలువైన ఆస్తులు మోనిటైజ్,రాహుల్కి ఆస్తుల మోనిటైజ్ అంటే ఏంటో తెలుసా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ. 1.62 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ఆస్తులు మోనిటైజ్ (ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలంపాటు లీజుకు ఇవ్వడం లేదా ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి మార్గం ద్వారా ఆదాయ సముపార్జన) సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పతకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే..! బర్మింగ్హామ్లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్ క్రీడోత్సవం సోమవారంతో ముగిసింది. మొత్తం 216 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మొదట ప్రపోజ్ చేసింది ఎవరంటే.. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్బాబు-నమ్రత కూడా ఒకరు. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్గా వీరికి పేరుంది. వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రాణం తీసిన వాటర్ బాటిల్ తోటి విద్యార్థినులతో కలిసి.. సంతోషంగా పాఠశాలకు బయల్దేరింది. వెళ్లొస్తాను.. బై అంటూ అమ్మానాన్నకు చెప్పింది. ఆ పిలుపే వారికి చివరి పిలుపు అయ్యింది. అలా బయల్దేరిందో లేదో.. అంతలోనే ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రికి వన్ జన్పథ్లో బస చేసి, 7వ తేదీ (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. రివర్స్ ప్లాన్తో గేర్ మార్చిన కేసీఆర్.. మునుగోడుపై అదిరిపోయే వ్యూహం! కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిపై ముందే అప్రమత్తమైన కాంగ్రెస్ శుక్రవారం ఆ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించి శంఖారావం పూరించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 24 గంటల్లోనే ఆ బాలుడికి పింఛన్.. రూ.10 వేల తక్షణ సాయం, వీల్ ఛైర్ అందజేత వచ్చే నెల నుంచి బాలుడు వికలాంగ పింఛన్ అందుకునేలా గురువారం మంజూరు పత్రం అందజేసినప్పటికీ, సీఎం ఆదేశాలతో 24 గంటలు తిరక్కుండానే శుక్రవారం పింఛన్ సొమ్ము అందజేశారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం సచివాలయంలో నక్కా ధర్మతేజకు ఎంపీడీఓ జె.రాంబాబు, సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యంలు పింఛన్ అందజేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రేవంత్ ‘హస్త’వాసి బాగోలేదు.. తెరపైకి సంచలనలతో సీనియర్లు క్యూ! కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కల్లోలం రేపుతున్నాయి. దాదాపు ఏడాది నుంచి వివాదాలు, అలకలు, బుజ్జగింపులు, వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్లో.. ఎన్నికలు సమీపిస్తున్నా లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అక్కడ 52 ఏళ్లుగా ఎగరని జాతీయ జెండా.. మోదీ జీ మీరైనా చెప్పండి ప్లీజ్! ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్కు జాతీయ జెండాను కొరియర్లో పంపారు ఛత్తీస్గఢ్ పీసీసీ అధ్యక్షుడు మోహన్ మార్కం. ఖాదీతో తయారు చేసిన ఆ త్రివర్ణ పతాకాన్ని మహారాష్ట్ర నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎగురవేయాలని కోరారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కరోనా ఎంత పనిచేసింది.. ప్రతీ 8 మందిలో వారికి ఈ లక్షణాలు! కరోనా బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిపై ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందట. శ్వాసకోస సమస్యలు, నీరస, రుచి, వాసన తెలియకపోవడం వంటి వ్యాధి లక్షణాల్లో కనీసం ఒక్కటైనా వారిని చాలాకాలం బాధిస్తున్నట్టు లాన్సెట్ జర్నల్ శుక్రవారం విడుదల చేసిన తాజా సర్వే పేర్కొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. రాతపూర్వకంగా కూడా తలాక్ చెల్లదు.. తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు నోటి మాటగా మూడుసార్లు తలాక్ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధమైనప్పుడు, తలాక్నామా రూపంలో లిఖితపూర్వకంగా రాసుకున్నా కూడా చెల్లదని, వివాహం రద్దుకాదని హైకోర్టు తేల్చి చెప్పింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. నాలుగో టి20.. గెలిస్తే సిరీస్ వశం అమెరికా గడ్డపై సిరీస్ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా నేడు వెస్టిండీస్తో నాలుగో టి20లో తలపడనుంది. నేడు, రేపు వరుసగా జరిగే రెండు మ్యాచ్ల్లో భారత్ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం చాలు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రిస్క్గా మారిన రీమేక్స్.. ఇష్టం లేకున్నా మళ్లీ మళ్లీ! టాలీవుడ్ అంటేనే రీమేక్స్ అడ్డా. వేరే ఇండస్ట్రీస్లో సూపర్ హిట్టైన సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తుంటారు. ప్రస్తుతం చిరు మాలీవుడ్ బ్లాక్ బస్టర్ లూసీఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మూఢ విశ్వాసం: ఆడపిల్ల దున్నితే అరిష్టమట! మహమ్మారి కమ్ముకుంటుందట! రెండు రోజుల క్రితం జార్ఖండ్లో ఈ వింత జరిగింది. తన పొలంలో దున్నడానికి కొత్తగా కొనుక్కున్న ట్రాక్టర్తో బయలుదేరిన 22 ఏళ్ల యువతి మంజును గ్రామస్తులు ఆపేశారు. ఆడపిల్ల పొలం దున్నడం అరిష్టమన్నారు. మహమ్మారి కమ్ముకుంటుందన్నారు. జరిమానా వేస్తామన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మంకీపాక్స్ను తేలిగ్గా తీసుకోవద్దు.. హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన బైడెన్ సర్కార్ ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మహమ్మారిపై పోరాటం కోసం ఎక్కువ నిధులు కేటాయించడమే గాక, సమాచార సేకరణ కోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. 'టార్గెట్ 175' కుప్పం నుంచే తొలి అడుగు రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేసే వాతావరణం కుప్పం నుంచే ప్రారంభం కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ కార్యకర్తలకు ఉద్బోధించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. చైనా ఎంత పని చేసింది.. ప్రపంచ దేశాలకు పెను సవాల్! కోవిడ్ ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ ప్రభావం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. పులి మీద పుట్రలా తైవాన్ చుట్టూ చైనా చేస్తున్న సైనిక విన్యాసాలు, క్షిపణి దాడులు ఆందోళన పెంచుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆజం ఖాన్.. పరామర్శించిన అఖిలేశ్ యాదవ్ ఎస్పీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ గురువారం అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. న్యూమోనియా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఆజం ఖాన్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. నగరవాసులకు అలర్ట్ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం నగరంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సాధారణ జనజీవనం స్తంభించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్.. మునుగోడు ఉపఎన్నికలో సామాజిక అస్త్రంగా! తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి, పీడీ యాక్టు కింద జైలు జీవితం గడిపిన ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. భారతీయులకు గుడ్న్యూస్.. డేటా రక్షణకు కొత్త బిల్లు వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించి కొత్త బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాటికి తీసుకొస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును లోక్సభ నుంచి బుధవారం ఉపసంహరించుకున్న నేపథ్యంలో మంత్రి వైష్ణవ్ దీనిపై మాట్లాడారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టీమిండియా వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి! ఆసియా కప్ 2022కు సంబంధించి టీమిండియా జట్టును ఆగస్టు 8(సోమవారం) ప్రకటించనున్నారు. ఉపఖండంలో జరిగే ఈ మెగాటోర్నీని టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న టి20 ప్రపంచకప్కు ఇది సన్నాహకంగా మారుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మునుగోడులో కాల్పుల కలకలం! కారణాలివేనా? వాటర్ బాటిల్స్ సరఫరా చేసే డీలర్పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ద్విచక్ర వాహనంపై వచ్చి దాడి చేసి వెంటనే పరారయ్యాడు. మూడు చోట్ల బుల్లెట్ గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. రామోజీ ‘మేనేజ్మెంట్’కు ఇదో ఉదాహరణ ‘అక్రమంగా రూ.2,600 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేసిన మార్గదర్శి కేసులో రామోజీరావు రూ.6,000 కోట్లు జరిమానాగా కట్టాలి. రామోజీరావు వసూలు చేసిన డబ్బు కట్టేసి కేసు నుంచి బయటపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కేసీఆర్కు కీలకంగా మారిన మునుగోడు.. ఐ ప్యాక్ నివేదికలో ఏముంది! మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయంగా కన్పిస్తున్న నేపథ్యంలో అక్కడ గులాబీ జెండా ఎగిరేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. సుమారు పక్షం రోజుల క్రితమే ఉప ఎన్నికపై స్పష్టంగా ఉప్పందడంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడులో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఒకే చోట నుంచి రాష్ట్రమంతా వీక్షణ.. పోలీస్ టవర్స్ ప్రత్యేకలివే.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయంగా కన్పిస్తున్న నేపథ్యంలో అక్కడ గులాబీ జెండా ఎగిరేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. సుమారు పక్షం రోజుల క్రితమే ఉప ఎన్నికపై స్పష్టంగా ఉప్పందడంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడులో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి కోరారు. సీబీఐ విచారణ కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని.. ఆయన రాయకపోతే తానే లేఖ రాస్తానన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘పునరావాస కేంద్రం నుంచి అధికారులు గెంటేయలేదు’.. వాస్తవానికి భిన్నంగా ‘ఈనాడు’ కథనం ప్రభుత్వంపై బురద చల్లేందుకు పత్రికా ప్రమాణాలకు తిలోదకాలిస్తూ ఈనాడు పత్రిక మరోసారి దిగజారుడు రాతలకు దిగింది. వాస్తవాలను దాచిపెట్టి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మంగళవారం ‘చంద్రబాబుకు బాధలు చెబితే పునరావాస కేంద్రం నుంచి గెంటేస్తారా?’ అంటూ ఏలూరు జిల్లాలోని గోదావరి ముంపు గ్రామమైన వేలేరుపాడు గ్రామానికి చెందిన ఎర్రా వనజాకుమారి చెప్పినట్టు ఓ కథనాన్ని వండి వార్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర చైనాను రెచ్చగొడుతూ, ఉద్రిక్తతలను మరింతగా పెంచుతూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (82) తైవాన్ పర్యటన బుధవారం ముగిసింది. ‘‘తైవాన్కు అమెరికా అన్నివిధాలా అండగా నిలుస్తుంది. అందుకు మేం కట్టుబడ్డామని ఈ పర్యటనతో మరోసారి చాటిచెప్పాం’’ అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘మహా’దారిలో జార్ఖండ్ ? కాంగ్రెస్ భయానికి కారణాలివీ... జార్ఖండ్ మరో మహారాష్ట్ర కానుందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తుంది. మహారాష్ట్రలో 40 మంది పై చిలుకు ఎమ్మెల్యేలతో ముంబై నుంచి బిచాణా ఎత్తేసి వేరుకుంపటి పెట్టుకున్న శివసేన నేత ఏక్నాథ్ షిండేతో బీజేపీ రసవత్తర రాజకీయ నాటకం ఆడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. వర్క్ ఫ్రమ్ హోమ్: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి! కరోనా అనంతరం మారిన పరిస్థితుల్లో.. మహిళలు ఇంటి నుంచి పనిచేసేందుకే (వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అవకాశం కల్పించే కంపెనీల వైపు చూస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. హైజంప్లో భారత్కు కాంస్యం.. తొలి అథ్లెట్గా రికార్డు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. హైజంప్లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ హైజంప్ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్గా తేజస్విన్ శంకర్ రికార్డు సృష్టించాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. టాలీవుడ్ అసలు శత్రువు ఎస్ఎస్ రాజమౌళి, యూట్యూబ్ చానళ్లు ప్రస్తుతం టాలీవుడ్లో షూటింగ్ సంక్షోభం నెలకొంది. ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్స్పై పలువురు సినీ ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్.. 4 రోజులు తిరక్కముందే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి అభ్యర్థించి 4 రోజులు తిరక్కముందే ఆర్థిక సహాయం మంజూరు కావడంతో ఆ పేద దంపతుల ఆనందానికి అవధుల్లేవు. కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన చీమల సునీత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్రం విఫలం.. తిరుమల వెంకన్నపైనా జీఎస్టీ ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పవ్యవధి చర్చలో ఆయన మాట్లాడారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీఆర్ఎస్కు మంత్రి ఎర్రబెల్లి సోదరుడు గుడ్బై! బీజేపీలోకి ప్రదీప్రావు? పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు, టీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఇటీవల హుజూరాబాద్లో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో భేటీ అయ్యాక.. వరంగల్ తూర్పు బీజేపీ నేతలతోనూ ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇది మూసీనేనా..? స్వచ్ఛ జల ప్రవాహం చూసి సెల్ఫీలు తీసుకుంటున్న జనం ఇటీవల కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాల గేట్లను జలమండలి వరుసగా తెరుస్తోంది. మూసీలో వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. నగరంలో నది ప్రవహించే మార్గంలో బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ) మార్గంలో పేరుకుపోయిన ఘన వ్యర్థాలు, మురికి వదిలింది. దీంతో చాదర్ఘాట్, మూసారాంభాగ్ వంతెనలపై నుంచి వీక్షిస్తే.. నదిలో నీరు స్వచ్ఛంగా దర్శనమిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయనక్కర్లే.. ఒబామా కీలక వ్యాఖ్యలు డ్రోన్ దాడితో అల్ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా ముట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివెేళ్లతో పెకలించివేయవచ్చు అనేందుకు జవహరి ఘటనే నిదర్శనమన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్కు తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లుండగా, 2021–22లో రద్దైన మొండి బకాయిలు రూ.1,57,096 కోట్లకు తగ్గినట్లు వివరించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్.. బీసీసీఐ కీలక అప్డేట్.. ఆసియా కప్కు దూరమయ్యే చాన్స్ వెస్టిండీస్తో జరిగిన మూడో టి20 మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో బాధపడిన రోహిత్ 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు రిటైర్డ్హర్ట్గా క్రీజును వదిలాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సాంగ్ చూపించేశాం మావా... పాట వినిపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు.. ఇది ఒకప్పటి ట్రెండ్. పాట చూపించి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది ఇప్పటి ట్రెండ్. ప్రేక్షకులను థియేటర్కి రప్పించాలంటే గతంలో ఆడియో, సినిమా పోస్టర్స్ని పబ్లిసిటీలో భాగంగా విడుదల చేసేవాళ్లు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రూపాయి విలువ భారీగా పతనం.. ఆర్థికమంత్రి కీలక ప్రకటన డాలర్ మారకంలో రూపాయి విలువ భారీ పతన ఆందోళనల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. భారత్ రూపాయి విలువ కుప్పకూలలేదని స్పష్టం చేశారు. అది తన సహజ స్థాయిని కనుగొంటోందని ఆమె వ్యాఖ్యానించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మల్లారెడ్డి హత్య వెనుక భారీ స్కెచ్.. రూ.10 లక్షలకుపైనే సుపారీ! న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్యకు ఓ గ్యాంగ్ రూ.10 లక్షలకుపైనే సుపారీ మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే ఆ గ్యాంగ్కు సుపారీ ఇచ్చిందెవరు?.. మల్లారెడ్డిని హత్యచేసే అవసరం ఎవరికుంది?.. ఆయనను మట్టుపెడితే మేలు ఎవరికీ?.. ఈ హత్యకు కారణం మైనింగ్ వివాదమా.. భూ వివాదాలా?.. మర్డర్కు ప్రణాళిక రచించిందెవరు? 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. అల్ఖైదా చీఫ్ అల్ జవహరి హతం... వెల్లడించిన జో బైడెన్ అల్ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో డ్రోన్ దాడులు జరిపి అతడ్ని హతమార్చింది. అల్ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అక్టోబర్ 2న ‘సెల్యూట్ సీఎం సర్’ సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ 2న ప్రతి సచివాలయం పరిధిలో సెల్యూట్ సీఎం సర్ కార్యక్రమం నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా పిలుపునిచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఇతర శాఖల్లోకి వీఆర్వోలు, జీవో జారీ.. భగ్గుమన్న జేఏసీ నేతలు రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల) శకం ముగిసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూపరిపాలన విభాగంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న 5,385 మందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఒక్కరోజే రూ.1,383.34 కోట్ల పింఛన్ల పంపిణీ రాష్ట్రంలో అవ్వాతాతలతోపాటు వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు తదితరులకు ప్రభుత్వం సోమవారం ఒక్క రోజే రూ.1,383.34 కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం.. ఎటూ తేల్చని కాంగ్రెస్ హైకమాండ్ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. ఈ విషయంలో పార్టీపరంగా రాజగోపాల్రెడ్డిపై చర్యలు ఉంటాయంటూ ఊహాగానాలు వెలువడ్డా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మరో రెండు, మూడు రోజులపాటు వేచిచూసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. యూపీలో తేలియాడే రామసేతు రాయి! భక్తుల పూజలు ఉత్తరప్రదేశ్లోని మొయిన్పురిలో ఇషాన్ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయిపై ‘రామా’ అనే అక్షరాలు ఉండటం విశేషం. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం జరుగుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బెంబేలెత్తించిన విండీస్ బౌలర్.. టీమిండియా ఓటమి వరుసగా నాలుగు పరాజయాల తర్వాత వెస్టిండీస్ ఎట్టకేలకు బోణీ కొట్టగలిగింది. టీమిండియాతో సోమవారం ఆలస్యంగా జరిగిన రెండో టి20 వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు బాబూరాజ్ వాజపల్లి(59) కన్నుమూశారు. బాబూరాజ్కు ఛాతిలో నొప్పి రావడంతో కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవికరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే! ప్రయివేట్ రంగ సంస్థ సహారా ఇండియా గ్రూప్నకు చెందిన వివిధ సంస్థలు, పథకాలలో దాదాపు 13 కోట్లమంది ఇన్వెస్టర్లు ఇరుక్కున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంటులో వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. అమానవీయ ఘటన: బైక్పై తల్లి మృతదేహంతో 80 కిలోమీటర్లు! ఆస్పత్రిలో శవ వాహనం లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులకు రూ.5 వేలు చెల్లించుకోలేక తల్లి మృతదేహాన్ని ఓ పేద యువకుడు ఏకంగా 80 కిలోమీటర్లు బైక్ మీదనే తీసుకెళ్లాడు! బెడ్షీట్లో చుట్టిన తల్లి శవాన్ని 100 రూపాయలతో కొన్న చెక్కపై పెట్టి బైక్కు కట్టి, మరొకరిని వెనక కూచోబెట్టి నడుపుకుంటూ వెళ్లాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మరింత చేరువగా.. ఆరోగ్యశ్రీ, గ్రామ స్థాయి నుంచే రిఫరల్ విధానం రాష్ట్రంలో 1.40 కోట్లకు పైగా పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యాలకు శ్రీరామ రక్షగా నిలుస్తోంది.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం. టీడీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన ఈ పథకానికి ఊపిరిలూదుతూ వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు భేష్.. సీడబ్ల్యూసీ కమిటీ ప్రశంసలు పోలవరం ప్రాజెక్టులోకి 30 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద వచ్చినా, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును ఒక మీటర్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టార్గెట్ కాంగ్రెస్! చేవెళ్లతో మొదలై మునుగోడు మీదుగా.. నెక్ట్స్? దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు తెరవెనుక మంతనాలు సాగిస్తోంది. చేవెళ్లతో మొదలు పెట్టిన చేరికల గేమ్.. ఇప్పుడు మునుగోడు మీదుగా ఎక్కడివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అడవి మీదుగా రింగురోడ్డు.. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ను ఖరారు భాగ్యనగరానికి చేరువగా ఉన్న ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే ఉన్న అటవీ ప్రాంతాన్ని చీలుస్తూ ఇప్పుడు రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణం జరగనుంది. రీజినల్ రింగురోడ్డుకు సంబంధించి కేంద్రం అనుమతించిన 162 కి.మీ. ఉత్తరభాగం రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఓవైపు ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న నేపథ్యంలో చైనా, తైవాన్ మధ్య తారస్థాయికి చేరుతున్న ఉద్రిక్తతలు కలవరపరుస్తున్నాయి. ఇది చివరికి చైనా–అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. నిఖత్ పంచ్ అదిరె.. పతకం దిశగా దూసుకెళ్తున్న తెలంగాణ చిచ్చర పిడుగు కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో నిఖత్ పంచ్ల ధాటికి ప్రత్యర్థి హెలెనా (మొజాంబిక్) తట్టుకోలేక విలవిలలాడింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్ ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Hero Suman: షూటింగ్లతో బిజీ.. రాజకీయాల్లోకి..? ‘తరంగణి’ సినిమాతో తెలుగులో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. తిరుగులేని కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అందాల నటుడు సుమన్. సుమన్గా సుపరిచితుడైన తల్వార్ సుమన్ గౌడ్ దక్షిణ భారత సినీ నటుడు. తెలుగు, తమిళ్, కన్నడ, ఆంగ్ల, ఒడియా తదితర భాషల్లో నటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. కాల్పుల కలకలం.. మాదాపూర్లో రౌడీ వార్.. ఒకరి మృతి మాదాపూర్ నీరూస్ చౌరస్తాలో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ మృతి చెందగా, జహంగీర్కు తీవ్ర గాయలయ్యాయి. ఇస్మాయిల్పై పాయింట్ బ్లాంక్లో రౌడీషీటర్ మహ్మద్ కాల్పులు జరిపాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రాణాల మీదకు తెచ్చిన డీజే.. కరెంటు షాక్తో 10 మంది మృతి.. పలువురికి గాయాలు పశ్చిమ బెంగాల్ కూచ్బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురై అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాను జల్పేష్ వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి