Salman
-
ఆసీస్తో మూడో టీ20.. పాకిస్తాన్కు కొత్త కెప్టెన్! ఎవరంటే?
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై సిరీస్ను కోల్పోయిన పాకిస్తాన్.. కనీసం ఆఖరి టీ20లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.అయితే ఈ చివరి మ్యాచ్లో పాక్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్కు రెగ్యూలర్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పాక్ జట్టుకు సల్మాన్ అలీ అఘా సారథ్యం వహించనున్నాడు. రిజ్వాన్తో పాటు స్టార్ పేసర్ నషీం షాకు కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వీరిద్దరి స్థానాల్లో హసీబుల్లా ఖాన్, పేసర్ జహందాద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు. అయితే 21 ఏళ్ల జహందాద్ ఖాన్కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 కావడం గమనార్హం. దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండండంతో జహందాద్కు సెలక్టర్లు చోటు ఇచ్చారు. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లుఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, జోష్ ఇంగ్లిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జాంపాపాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, బాబర్ ఆజం, హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, జహందాద్ ఖాన్, హరీస్ రవూఫ్, సోఫియన్ ముఖీమ్చదవండి: అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడించండి: రవిశాస్త్రి -
సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?
సౌదీ అరేబియా రాజు సల్మాన్ తీవ్ర స్వస్థతకు గురయ్యారు. జెడ్డాలోని అల్ సలామ్ ప్యాలెస్లోని రాయల్ క్లినిక్ సల్మాన్కు వైద్య పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారినపడ్డట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన యాంటీబయాటిక్స్తో చికిత్స పొందుతున్నారని, తొందరలోనే కోలుకుంటారని పేర్కొంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే..ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా పరాన్నజీవులు, శ్వాసనాళాలు లేదా ఊపిరితిత్తుల కణజాలాలకు వాపు, హాని కలిగించే పరిస్థితి. ఈ పరిస్థితి కారణంగా ఒకటి లేదా రెండ ఊపిరితిత్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సంకేతాలు ఎంలా ఉంటాంటే..లక్షణాలు..దగ్గు..ఎడతెరిపి లేని దగ్గు ఊపిరితిత్తుల సంక్రమణకు సంకేతం. అలాగే స్పష్టంగా పసుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే శ్లేష్మం, జ్వరం. సాధారణంగా అయితే అధిక జ్వరం కనిపిస్తుంది.శ్వాస ఆడకపోవుట..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా..ఊపిరితిత్తుల్లో వాపు, ద్రవం పేరుపోవడానికి కారణమవుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఛాతి నొప్పి..ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్లో కూడా ఛాతీలో తీవ్ర నొప్పి కలుగుతుంది. ప్రత్యేకించి లోతైన శ్వాస తీసుకున్నా..దగ్గు తీసుకున్నా..ఛాతీలో పదునైన కత్తిపోటులా నొప్పిగా ఉంటుంది. అలసట..విపరీతంగా అలసిపోయినట్లు ఉండొచ్చు. గురకఇరుకైన వాయుమార్గాల కారణంగా ఊపిరి పీల్చుకునేటప్పుడు పెద్దగా శబ్దం రాడం. ఇది శ్లేష్మంగా కారణంగా ఏర్పడే వాపు లేదా అడ్డంకికి సంకేతం.వేగవంతమైన శ్వాసశరీరం తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు ప్రతిస్పందించినప్పుడూ జరుగుతుంది.గందరగోళం..ఇది ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తుంది.ఆకలి నష్టం..అనారోగ్యంతో పోరాడటానికి శరీరానికి తగినంత శక్తి అవసరం కానీ ఈ ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్ ఆకలిని తగ్గించేస్తుంది.వికారం వాంతులు..కొంతమందిలో లేదా పిల్లలకు వికారం, వాంతులు, అతిసారం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.ఎందువల్ల వస్తుందంటే..బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు..స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, మైకోప్లాస్మా న్యుమోనియా వంటివి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు ప్రాథమిక కారణాలు. దీని కారణంగా ఊపిరితిత్తులలో వాపు, ద్రవం చేరడం వంటివి జరుగుతాయి.వైరల్ ఇన్ఫెక్షన్లు..సార్స్ కోవీ-2తో సహా ఇన్ఫ్లు ఎంజా వైరస్లు, కరోనా వైరస్లు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు దారితీయొచ్చు. ఈ అంటువ్యాధులు తరుచుగా దగ్గు లేదా తుమ్ముల నుంచి శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లుపర్యావరణంలో శిలీంధ్ర బీజాంశాలను పీల్చడం వల్ల ఈ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో తలెత్తుంది. బలహీన రోగ నిరోధక వ్యవస్థ..హెచ్ఐవీ లేదా ఎయిడ్స్, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, కేన్సర్ చికిత్సలు లేదా అవయవ మార్పిడి వంటి పరిస్థితుల కారణంగా ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. (చదవండి: మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే..) -
సల్మాన్ ఖాన్@ 220 కోట్లు..
సల్మాన్ ఖాన్ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, తన సంపదను వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిపెట్టి కోట్లు ఆర్జిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చే డబ్బును విభిన్న మార్గాల్లో మదుపు చేసి ఏటా దాదాపు రూ.220 కోట్లు సంపాదిస్తున్నట్లు జీక్యూ ఇండియా సర్వే తెలిపింది. సల్మాన్ ఖాన్ కలిగి ఉన్న తొమ్మిది ఆదాయ మార్గాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 1. బాక్సాఫీస్: అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి అనేక ఇతర బాలీవుడ్ నటుల మాదిరిగానే సినిమా ప్రారంభించడానికి ముందే సల్మాన్ఖాన్ రెమ్మునరేషన్ తీసుకుంటారు. కొన్ని సినిమాలకు ప్రాఫిట్-షేరింగ్ ఒప్పందాల ప్రకారం వాటికి వచ్చే ఆదాయంలో దాదాపు 50శాతం వాటాను తనకు ఇవ్వాల్సి ఉంటుంది. 2. ప్రొడక్షన్ హౌస్: 2011లో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్ను ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలో చిల్లర్ పార్టీ జాతీయ అవార్డు చిత్రంతోపాటు బజరంగీ భాయిజాన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఇతర సినిమాలు సైతం ఈ బ్యానర్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. 3. స్టార్టప్లలో పెట్టుబడి: యాత్రా.కామ్ అనే ట్రావెల్ కంపెనీలో సల్మాన్ఖాన్కు దాదాపు 5శాతం వాటా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థల నివేదిక ప్రకారం తెలిసింది. ఆన్మొబైల్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ నేతృత్వంలోని చిన్న వీడియో ప్లాట్ఫారమ్ అయిన ‘చింగారి’లో ఆయన పెట్టుబడి పెట్టారు. ఈ స్టార్టప్లో బ్రాండ్ అంబాసిడర్గా చేరారు. 4. క్లాతింగ్ కంపెనీ: 2012లో స్థాపించిన బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్ కంపెనీ ద్వారా సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ సేవలందిస్తోంది. దీని ద్వారా పేదలకు ఆరోగ్య సంరక్షణ, విద్యను అందిస్తున్నారు. ఈ కంపెనీ యూరప్, మిడిల్ఈస్ట్ దేశాల్లోనూ దాని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో 90 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది. 5. ఫిట్నెస్ పరికరాలు, జిమ్: సినీ పరిశ్రమలోని ఫిట్నెస్ నటుల్లో ఒకరిగా ప్రశంసలు అందుకున్న సల్మాన్ ఖాన్ 2019లో బీయింగ్ స్ట్రాంగ్ కంపెనీను ప్రారంభించారు. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచిని లాభదాయకమైన వ్యాపార సంస్థగా మార్చుకున్నారు. ముంబై , నోయిడా, ఇందోర్, కోల్కతా, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో జిమ్లను ప్రారంభించారు. 6. రియల్ ఎస్టేట్: సల్మాన్ ఖాన్ ముంబయిలో ఇళ్లు, వాణిజ్య స్థలాలను కొనుగోలు చేశారు. ముంబయి శాంటాక్రూజ్లోని తన నాలుగు అంతస్తుల భవనాన్ని అద్దెకు ఇచ్చి నెలకు దాదాపు రూ.1 కోటి సంపాదిస్తున్నట్లు అంచనా. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని ఖాన్ 2012లో రూ.120 కోట్లకు కొనుగోలు చేశారు. గతంలో ఈ స్థలాన్ని ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన ఫుడ్హాల్కు నెలకు రూ.90లక్షల చొప్పున అద్దెకు ఇచ్చారు. ఇదీ చదవండి: వందల ఉద్యోగులను తొలగించిన అమెజాన్ అలెక్సా 7. టీవీ షోలు: 2010-11 సీజన్ నుంచి ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం వారానికి రూ.12 కోట్లు వసూలు చేస్తున్నారని కొన్ని మీడియా కథనాల్లో ప్రచురించారు. బిగ్ బాస్ సీజన్ 17 ముగిసే సమయానికి దాదాపు రూ.200 కోట్లను సంపాదించవచ్చని అంచనా. బిగ్ బాస్ కంటే ముందు ఆయన 10కా దమ్ అనే రియాలిటీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా పనిచేశారు. 8. బ్రాండ్ యాడ్లు: హీరో హోండా, బ్రిటానియా టైగర్ బిస్కెట్, రియల్మీ, రిలాక్సో, డిక్సీ స్కాట్ వంటి ప్రముఖ బ్రాండ్లకు సల్మాన్ ఖాన్ ప్రచారకర్తగా ఉన్నారు. ఇందుకోసం ఒక్కో కంపెనీ ద్వారా ఏటా దాదాపు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేస్తారని అంచనా. 9. ఎన్ఎఫ్టీ: 2021లో సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, రజనీకాంత్, సన్నీ లియోన్తోపాటు ఇతర నటులు నాన్-ఫంగిబుల్ టోకెన్లలో పెట్టుబడి పెట్టారు. దానివల్ల వారి అభిమానులు నటుడికి సంబంధించిన ప్రత్యేకమైన ఆర్ట్లు, మ్యూజిక్, వీడియోలు, ఫొటోలు వంటివి డిజిటల్ రూపంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: క్రికెట్ మ్యాచ్తో డబ్బు సంపాదన! ఎలాగంటే.. పైన తెలిపిన అన్ని మార్గాల ద్వారా సల్మాన్ ఖాన్ వార్షిక ఆదాయం రూ.220 కోట్లుగా తేలింది. అంటే నెలకు దాదాపు రూ.16 కోట్లు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన ఖాన్ ఆస్తుల నికర విలువ సుమారు 350 యూఎస్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,907 కోట్లు)గా ఉన్నట్లు కొన్ని కథనాలు వల్ల తెలుస్తుంది. -
దేశవ్యాప్తంగా ఏకకాల దాడులకు కుట్ర! విచారణలో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు భోపాల్, హైదరాబాద్లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు బయటపడింది. మధ్యప్రదేశ్, హైదరాబాద్తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు వారు సిద్ధపడ్డట్లు తెలియవచ్చింది. మంగళవారం హైదరాబాద్లో పట్టుకున్న ఐదుగురినీ ఏటీఎస్ అధికారులు బుధవారం భోపాల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారిని ఈ నెల 20 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్న జవహర్నగర్లోని శివాజీనగర్కు చెందిన మహ్మద్ సల్మాన్ కోసం ఏటీఎస్తోపాటు రాష్ట్ర నిఘా వర్గాలు, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు అతడి ఆచూకీ లభించలేదు. భోపాల్, హైదరాబాద్లలో ఇప్పటివరకు అరెస్టయిన 16 మంది విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... టాస్క్ లు ఇవ్వకపోవడంతో... భోపాల్లోని షాజహానాబాద్కు చెందిన యాసిర్ ఖాన్ నేతృత్వంలో 2018లో ఈ మాడ్యూల్ ఏర్పడింది. ఓ వర్గానికి చెందిన వారితో మతమార్పిళ్లు చేయించి యాసిర్ వారిని ఉగ్రవాద బాట పట్టించాడు. అతడి మాడ్యూల్లోని వారిలో 90 శాతం ఇలాంటి వాళ్లేనని నిఘా వర్గాలు గుర్తించాయి. యాసిర్ తొలినాళ్లలో హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్యూటీ) సంస్థలో పనిచేశాడు. మొదట్లో ఐసిస్కు అనుబంధంగా పనిచేసిన ఆ సంస్థ ఆపై దాన్నే విమర్శించింది. విదేశాల్లోని హెచ్యూటీ కేడర్తో యాసిర్ రాకెట్ చాట్తోపాటు త్రీమా యాప్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. ఎన్నాళ్లు నిరీక్షించినా ఎలాంటి టాస్్కలు ఇవ్వకపోవడంతో ఆ సంస్థకు దూరమై మహ్మద్ సలీంగా మారిన సౌరభ్రాజ్ విద్యతో కలసి సొంతంగా మాడ్యూల్ తయారు చేయడం మొదలెట్టాడు. ఆ పని మీదే సలీంను హైదరాబాద్ పంపి కొందరిని ఉగ్రబాట పట్టించడంతోపాటు మరో ముఠా తయారయ్యేలా ప్రేరేపించాడు. వాటికి హెచ్యూటీ (భోపాల్), హెచ్యూటీ (హైదరాబాద్) పేర్లు పెట్టుకున్నారు. ఎప్పుడైనా దాడులకు సిద్ధంగా ఉండేలా... టార్గెట్ కిల్లింగ్స్గా పిలిచే ఎంపిక చేసుకున్న వారిని హత్య చేయడం, తద్వారా మత కలహాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా పెట్టుకున్న యాసిర్, సలీంలు ఆ పంథాలోనే సిద్ధమవుతున్నారు. దేహదారుఢ్యంతోపాటు తుపాకులు కాల్చడం, కత్తులు, గొడ్డళ్ల వినియోగంపై దృష్టి పెట్టారు. పెల్లెట్స్తో పనిచేసే ఎయిర్ పిస్టల్స్ వాడకంపై అనంతగిరి అడవుల్లో, నాటు తుపాకులు కాల్చడంపై భోపాల్ సరిహద్దుల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేశారు. అటు యాసిర్ ఇంట్లో, ఇటు హైదరాబాద్లోని ఐదుగురి ఇళ్లలో తరచూ సమావేశాలు నిర్వహించారు. ఏడాదిన్నరగా ఈ శిక్షణ పెరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 32 గంటల వరకు ఏమీ ముట్టకుండా... టార్గెట్ కిల్లింగ్స్తోపాటు కిడ్నాప్లు, మాల్స్, సినిమా హాళ్లను అదీనంలోకి తీసుకోవడమూ వారి పథకాల్లో భాగమే. హోస్టేజ్గా పిలిచే అలాంటి సందర్భాల్లో నిర్భంధంలోని వారికి అన్నీ అందించినా... ఉగ్రవాదులు సైతం కొన్ని గంటలపాటు నీళ్లు, ఆహారం లేకుండా ఉండాల్సి వస్తుంది. పోలీసులు లేదా భద్రతా బలగాలు నీళ్లు, ఆహారంలో మత్తుమందు కలిపి తమను పట్టుకొనే ఆస్కారం ఉందని ఉగ్రవాదులు ఏమీ ముట్టకుండా ఉంటారు. ఇలా గరిష్టంగా 48 గంటల వరకు మాడ్యూల్లోని వారంతా ఏమీ తీసుకోకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలని యాసిర్ నుంచి సలీంకు ఆదేశాలు అందాయి. ఈ సర్వైవల్ టెక్నిక్స్తోపాటు పర్వతారోహణను ముష్కరులు అనంతగిరి అడవుల్లో ప్రాక్టీస్ చేసినట్లు బయటపడింది. గరిష్టంగా 32 గంటల వరకు ఏమీ తీసుకోకున్నా జీవించేలా హైదరాబాద్ గ్యాంగ్ సిద్ధమైంది. రెండు నెలల క్రితం తన ఇంటికి వచ్చిన యాసిర్కు సలీం ఈ వీడియోలను చూపించాడు. పక్కింటి వాళ్లు ఫోన్ చేయడంతో... ముష్కరులను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర నిఘా వర్గాలు హైదరాబాద్తోపాటు భోపాల్లోనూ మంగళవారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు చేశాయి. ఫలితంగా అక్కడ 11 మంది, నగరంలో ఐదుగురు చిక్కారు. నగరానికి చెందిన మహ్మద్ సలీం, అబ్దుర్ రెహ్మాన్, మహ్మద్ అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మహ్మద్ హమీద్లతోపాటు జవహర్నగర్లోని శివాజీనగర్కు చెందిన మహ్మద్ సల్మాన్ను కూడా పట్టుకోవాల్సి ఉంది. అయితే పోలీసుల దాడి సమయంలో అతడు పాల ప్యాకెట్ల కోసం బయటకు వెళ్లాడు. అయితే పోలీసుల రాకను పక్కింటి వాళ్లు ఫోన్ చేసి చెప్పడంతో సల్మాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరోవైపు పోలీసులు బుధవారం ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించగా అరెస్టయిన ఉగ్రవాదులతోపాటు వారి భార్యలూ మతమారి్పడి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. -
ఇమ్రాన్ ఖాన్ నటనలో షారుక్, సల్మాన్లను మించిపోయారు
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ దిగ్గజ నటులు సల్మాన్, షారుక్ ఖాన్లను మించి పోయారంటూ కామెంట్ చేశారు పాక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్. వజీరాబాద్లోని నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్ ఖాన్పై కాల్పలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల అనంతరం ఇమ్రాన్ ఖాన్ తనపై జరిగిన దాడిని హత్యయత్నంగా పేర్కొన్నారు. కానీ పాక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ చీఫ్ మౌలానా ఫ్లజుర్ మాత్రం ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తాను తొలుత ఇమ్రాన్ ఖాన్పై జరిగిన ఘటన గురించి విని బాధపడ్డాను కానీ ఇప్పడూ ఇది ఒక డ్రామాలా కనిపిస్తోందన్నారు. "ఖాన్ శరీరంలోకి దిగిన బుల్లెట్ ఎలా ముక్కలుగా అయిపోతుంది. శరీరంలో పేలుడు ముక్కలు దిగడం గురించి విన్నాం ఇలాంటిది ఎప్పడూ వినలేదు. ఖాన్పై దాడి గురించి విన్నప్పుడూ తాను ఖండించానని చెప్పారు. కానీ ఎక్కడైన బాంబు శకలాలు శరీరంలోకి దిగడం చూశాం కానీ బుల్లెట్ శకలాలు శరీరంలో దిగడం ఏమిటో అర్థం కావడం లేదు. ఐనా ఆయనపై జరిగింది కాల్పులు కానీ బాంబు దాడి కాదన్నారు." ఖాన్కి బుల్లెట్ గాయాలైనప్పుడూ క్యాన్సర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఖాన్ చికిత్స తీసుకుంటున్న షౌకత్ ఖనుమ్ హాస్పిటల్ ఆయన చారిటబుల్ సంస్థ నిర్వహస్తున్న ఆస్పత్రేనని చెప్పారు. అలాగే వైద్యుల స్టేట్మెంట్లు కూడా చాలా విరుద్దంగా ఉన్నాయన్నారు ఫజ్లుర్ రెహ్మాన్ . (చదవండి: రాత్రికి రాత్రే కోటిశ్వరులుగా మారిన పోలీసులు..దెబ్బకు అకౌంట్ బ్లాక్!) -
లారీని ఢీకొట్టిన బైక్
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామస్టేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఓ లారీని వెనకనుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన మేడి హరీశ్ (22), హైదరాబాద్లోని రామంతపూర్లో నివాసం ఉండే ఎం.డి.ఆసిఫ్ (22), ఎం.డి.సల్మాన్ (23)లు రామంతపూర్లోనే ఓ కంపెనీలో ఏసీ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. హరీశ్, ఆసిఫ్లు సంస్థకు చెందిన హాస్టల్లోనే ఉంటుండగా సల్మాన్ మాత్రం తల్లిదండ్రులతో కలసి స్థానికంగా ఉంటున్నాడు. ఈ ముగ్గురు శుక్రవారం సాయంత్రం పిట్టంపల్లి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు అందరితో కలసి ఆనందంగా గడిపారు. భోజనం చేశాక ఒంటిగంట సమయంలో ముగ్గురు కలసి హైదరాబాద్కు పల్సర్ బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. ధర్మోజిగూడెం స్టేజీ వద్ద, వే బ్రిడ్జి నుంచి గ్రానైట్ లోడ్ లారీని డ్రైవర్ రివర్స్ తీస్తూ అకస్మాత్తుగా హైవేపైకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో బైక్ నడుపుతున్న సల్మాన్, లారీ అకస్మాత్తుగా రావడంతో వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. -
సౌదీలో మైనర్లకు మరణశిక్ష రద్దు
దుబాయ్: నేరగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేస్తూ విమర్శలనెదుర్కొంటున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. నేరాలకు పాల్పడిన మైనర్లకు మరణశిక్షను రద్దు చేసింది. కొరడా దెబ్బలకు బదులుగా జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవను శిక్షలుగా విధించాలని రాజు సల్మాన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే కనీసం పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారికి సంబంధించిన కేసులను సమీక్షించాలని, శిక్షలను తగ్గించాలని సల్మాన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. దీని ఫలితంగా షియా వర్గానికి చెందిన ఆరుగురు మైనర్లకు మరణ శిక్ష తప్పినట్లయింది. సంప్రదాయాలకు, ఇస్లామిక్ చట్టాలకు పెద్ద పీట వేసే సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ తాజా నిర్ణయం వెనుక ఆయన కుమారుడు, మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, మహిళా హక్కుల కార్యకర్తలు, సంస్కరణ వాదులపై అణచివేత చర్యలు ఆయన పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. 2018లో సౌదీ రచయిత జమాల్ ఖషొగ్గీని టర్కీలో హత్య చేయించడంపై సల్మాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. -
యాక్షన్ షురూ
కొత్త దర్శకులతో సినిమాలు చేయడం నాగార్జునకు కెరీర్ స్టార్టింగ్ నుంచి అలవాటే. తాజాగా మరో కొత్త దర్శకుణ్ణి ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారాయన. భారీ యాక్షన్తో కూడిన ఓ పోలీస్ ఆఫీసర్ కథతో నాగార్జున కొత్త చిత్రం ఉంటుందని సమాచారం. ‘ఊపిరి, మహర్షి’ సినిమాల్లో రచనా విభాగంలో పనిచేసిన సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీస్గా కనిపించనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ మోతాదు ఎక్కువగా ఉండబోతోందని టాక్. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఈ సినిమాకు పని చేయనున్నారట. ప్రస్తుతం ప్రీ–ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. -
ఈ బాబాయ్ బిల్డప్ అంతా ఇంతా కాదు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : ఐఏఎస్ అధికారినని చెప్పుకుని తిరుగుతున్న బిల్డప్ బాబాయ్ మహమ్మద్ సల్మాన్ (37) అనే వ్యక్తి చెన్నపట్టణ తహశీల్దార్ సమయస్పూర్తితో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. సల్మాన్ను తమదైన శైలిలో విచారించిన పోలీసులు చాలా విషయాలే రాబట్టారు ఈమేరకు రామనగర ఎస్పీ అనూప్శెట్టి అందించిన వివరాల ప్రకారం... నిందితుడు మహమ్మద్ సల్మాన్ ఇతడి సహచరులు సల్మాన్ను ఐఏఎస్ అధికారి అని బిల్డప్లు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంచరించేవారు. ఖరీదైన ఇన్నోవా కారుపై కర్ణాటక గవర్నమెంట్ అని రాసుకుని తిరిగేవారు. మండ్య, మైసూరు, రామనగర, చెన్నపట్టణ, మాగడి, గంగావతి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ అమాయకులను గుర్తించి ఇళ్ల స్థలాలు, లోన్లు, ప్రభుత్వ పథకాలు వచ్చేలా చేస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. ఆర్డీపీఐ అధికారిగా చెప్పుకుని విధానసౌధ, ఎంఎస్ బిల్డింగ్లోని పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు వెళ్లి అధికారులను ప్రశ్నలు వేసి బెదిరించే వారు. అంగనవాడీ, ఉర్దూ, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పాఠశాలలను దత్తత తీసుకుంటామని నమ్మబలికేవారు. కర్ణాటక రాష్ట్ర సమగ్ర జనస్పందన వేదిక పేరుతో ఒక నకిలీ సంస్థను సృష్టించి ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడినని చెప్పుకుని అధికారులను బెదిరించేవాడు. శివమొగ్గ తాలూకా అబ్బలుగెరె గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో 7వ సంతానంగా జన్మించాడు. 2014లో శివమొగ్గ జిల్లా పంచాయతీ కార్యాలయానికి వచ్చే కొందరికి పనులు చేయించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో బెంగళూరు వచ్చాడు. నెలమంగల తాలూకా లక్కేనమళ్లి సొండేకొప్పరోడ్డులో నివసించేవాడు. అనంతరం ఇన్నోవా కారు తీసుకుని నకిలీ సంస్థ పేరు ఒకటి రాయించి రవికుమార్ అనే వ్యక్తిని డ్రైవర్ కం గన్మ్యాన్గా నియమించుకున్నాడు. నిందితుడి నుండి ఇన్నోవా కారు, ల్యాప్టాప్లు, కెమెరాలు, మొబైళ్లు, పోలీసుల డ్రస్సులు, లాఠీలు, టోపీలు, పలు నకిలీ ప్రభుత్వ రబ్బర్ స్టాంపులు, కొందరు వ్యక్తుల అధార్ కార్డులు, ప్రభుత్వానికి సంబంధించిన దాఖలు పత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కత్రినా కోసం ఖాన్స్
బాక్సాఫీస్ దగ్గర పోటీపడే బాలీవుడ్ ఖాన్స్ షారుక్, సల్మాన్ సరదాగా డ్యాన్స్ ఫ్లోర్పై పోటీ పడ్డారు. నువ్వా? నేనా అన్నట్లుండే ఈ ఖాన్స్ నువ్వూ నేనూ అంటూ ఓ సాంగ్కి చిందేశారు. షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘జీరో’. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో షారుక్ మరుగుజ్జు పాత్రను పోషించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో ‘ఇస్క్బాజీ..’ అనే సాంగ్లో కనిపించనున్నారు. ఈ పాట వీడియో సాంగ్ను మంగళవారం రిలీజ్ చేశారు. ‘జీరో’ సినిమాలో కత్రినా తన నిజ జీవిత పాత్రనే పోషించారు. ఆమె కోసం ఈ ఇద్దరు ఖాన్స్ సరదాగా పోటీ పడుతున్నట్టుగా ఈ సాంగ్ను రూపొందించారు. డిసెంబర్ 21న ‘జీరో చిత్రం రిలీజ్ కానుంది. -
ఖషోగ్గీ ఎమయ్యాడో తెలీదు: సౌదీ రాజు
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ కనిపించకుండా పోవడంపై సౌదీ అరేబియాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రాజు సల్మాన్ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఖషోగ్గీ ఏమమయ్యాడో తమకు తెలియదని చెప్పారు. సౌదీ పౌరుడైన ఖషోగ్గీ అమెరికాలోఉంటూ సౌదీపై వాషింగ్టన్ పోస్ట్లో విమర్శనాత్మక కథానాలు రాసేవారు. ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ ఎంబసీలోపలికెళ్లిన తర్వాత ఆయన కనిపించకుండా పోవడం, ఆయనను సౌదీనే హత్య చేసిందని ఆరోపణలు రావడం తెల్సిందే. సౌదీలో రాజకుటుంబానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వ్యతిరేక పోస్ట్లు కూడా వస్తున్నప్పటికీ వాటిని సౌదీ ప్రభుత్వం వెంటనే తొలగిస్తోందని తెలుస్తోంది. ఇస్తాంబుల్లోని సౌదీ ఎంబసీలో ఖషోగ్గీ అదృశ్యంపై టర్కీ పోలీసులు అక్కడ సోదాలు చేశారు. -
అతడితోనే ‘మొదలైన’ ఐసిస్!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఆనవాళ్లు నాలుగేళ్ల క్రితం అబ్దుల్లా బాసిత్ గ్యాంగ్తోనే తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన సల్మాన్ మొయినుద్దీన్ది తొలి అరెస్టు. ఆ తర్వాత పలువురి చిక్కినా.. జేకేహెచ్, జేకేబీహెచ్ వంటి అనుబంధ సంస్థల కార్యకలాపాలు సాగినా... ఏడాదిగా పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చిందని పోలీసులు భావించారు. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం అబ్దుల్లా బాసిత్తో పాటు ఖదీర్లను పట్టుకోవడంతో మరోసారి కలకలం రేగింది. 2016లో ఢిల్లీ యూనిట్ నమోదు చేసిన కేసులో వీరిద్దరినీ అరెస్టు చేసింది. ‘కోల్కతా’ నుంచి సిటీకి... ఐసిస్ భావజాల వ్యాప్తి, రిక్రూట్మెంట్ అంశాలు 2012 నుంచి భారత్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఉత్తరాదిలో అనేక అరెస్టులు సైతం చోటు చేసుకున్నాయి. అయితే 2014 సెప్టెంబర్లో వరకు దీని ఛాయలు సిటీలో ప్రత్యక్షంగా కనిపించలేదు. ఆ నెల్లో అబ్దుల్లా బాసిత్ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ మీదుగా దేశ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ చేరుకుని, అక్కడ నుంచి సిరియా వెళ్ళేందుకు ప్రయత్నించిన మాజ్, అబ్రార్, నోమన్లను పోలీసులు కోల్కతాలో పట్టుకున్నారు. ఈ నలుగురినీ హైదరాబాద్కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 మంది ఐసిస్ ఆకర్షితుల్ని గుర్తించిన పోలీసులు కౌన్సెలింగ్ చేసి వదిలిపెట్టారు. ఫస్ట్ మ్యాన్ సల్మాన్... హబీబ్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని బజార్ఘాట్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సల్మాన్ మొహియుద్దీన్ నిక్కీ జోసఫ్ అనే మహిళ ద్వారా ఐసిస్ వల్లో చిక్కాడు. ఫేస్బుక్ ఆధారంగా గాలం వేసిన జోసఫ్... దుబాయ్ మీదుగా సిరియా వెళ్లేందుకు ఇతడిని సిద్ధం చేసింది. ఆ ప్రయాణంలో ఉండగానే 2015 జనవరి 16న శంషాబాద్ విమానాశ్రయంలో సల్మాన్ చిక్కాడు. నగరంలో ఐసిస్కు సంబంధించిన తొలి అరెస్టు ఇదే. జోసఫ్ కాదు అఫ్షా... నిక్కీ జోసఫ్ పేరుతో సల్మాన్ను ఆకర్షించి, ఉగ్ర ఉచ్చులోకి దింపింది దుబాయ్లో ఉంటున్న అఫ్షా జబీన్గా పోలీసులు గుర్తించారు. హిమాయత్నగర్కు చెందిన ఈమె కొంతకాలంగా దుబాయ్లో కుంటుంబంతో సహా నివసిస్తూ ఐసిస్ ఏజెంట్గా పని చేస్తోంది. డిపోర్టేషన్ పద్దతిలో హైదరాబాద్ రప్పించిన జబీన్ను 2015 సెప్టెంబర్ 11న శంషాబాద్ విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. ఈమెవిచారణలో దేశ వ్యాప్తంగా ఐసిస్ వైపుఆకర్షితులైన అనేక మంది వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఐసిస్ త్రయం అరెస్టు... 2014 సెప్టెంబర్లో దేశ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ కోల్కతాలో చిక్కిన నలుగురిలో అబ్దుల్ బాసిత్తో మాజ్ హసన్ ఫారూఖ్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ నగరానికే చెందిన ఫారూఖ్ హుస్సేనీతో కలిసి మరోసారి ఐసిస్ వైపు పయనమయ్యారు. నాగ్పూర్ మీదుగా శ్రీనగర్ వెళ్లేందుకు ప్రయత్నించి 2015 డిసెంబర్ 28నఅక్కడి విమానాశ్రయంలో పట్టుబడ్డారు. దీరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆపై జేకేహెచ్... జేకేబీహెచ్ మాడ్యుల్స్... 2016 నుంచి ఐసిస్ తన పంథా మార్చింది. సిరియాకు రప్పించి ‘యుధ్ధం’ చేయించడం కంటే దేశీయంగా ఉన్న యువతను రెచ్చగొట్టి ఇక్కడే విధ్వంసాలకు ప్రేరేపించాలని నిర్ణయించుకుంది. దీనికోసం జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ (జేకేహెచ్) పేరుతో మాడ్యుల్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి 2016 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 16 మందిని పట్టుకున్నారు. వీరిలో టోలిచౌకి, మాదాపూర్ ప్రాంతాలకు చెందిన నఫీజ్ ఖాన్, ఒబేదుల్లా ఖాన్, షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, అబు అన్స్ సైతం ఉన్నారు. ఆపై అదే ఏడాది జూన్లో జునూద్ అల్ ఖలీ ఫీ బిలాద్ అల్ హింద్ (జేకేబీహెచ్) మాడ్యుల్ ఏర్పాటు కావడంతో దీని సౌత్ ఇండియా ఇన్చార్జ్గా భావిస్తున్నా మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. 2017 జూలైలో సిట్ పోలీసులు అరెస్టు చేసిన కొనకళ్ళ సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్దే ఐసిస్ కోణంలో ఆఖరి ఉదంతం. ఏపీలోని కృష్ణాజిల్లాకు చెందిన ఇతగాడు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వారి ప్రోద్భలంతో మతం మారడంతో పాటు ఉగ్రవాదబాటపట్టాడు. పాస్పోర్ట్ లేనికారణంగా సిరియా వెళ్ళే చాన్స్ లేకపోవడంతో దేశీయంగానే విధ్వంసాలు సృష్టించాలని భావించాడు. ఇతడి వ్యవహారం గుర్తించిన నిఘా వర్గాలు సిట్కు సమాచారం ఇవ్వడంతో పట్టుబడ్డాడు. ఆపై ఏడాది తర్వాత తాజాగా ఆదివారం బాసిత్, ఖరీద్లు అరెస్టు అయ్యారు. ఖదీర్ నేపథ్యం ఇదీ... జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అనాథాశ్రమం ఉద్యోగి అబ్దుల్ ఖుద్దూస్ కుమారుడే అబ్దుల్ ఖదీర్. ప్రస్తుతం చంద్రాయణగుట్టలో నివసిస్తున్న ఖదీర్ బాసిత్ ప్రభావంతోనే ఐసిస్ వైపు ఆకర్షితుడయ్యాడు. 2015లో పదో తరగతి ఫెయిల్ అయిన ఇతగాడు ఓ ఇంటర్నెట్ సెంటర్లో పార్ట్టైమ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతడి మేనత్తతో పాటు కొందరు బంధువులు పాకిస్థాన్లో ఉంటారు. వాస్తవానికి ఈ నెల 10న ఓ శుభకార్యం కోసం కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్ళాల్సి ఉంది. అయితే ఏడో తేదీ నుంచే ఎన్ఐఏ విచారణకు హాజరుతుండటంతో సాధ్యం కాలేదు. ఇతడి నుంచి ఎన్ఐఏ అధికారులు కొన్ని నిషేధిత వస్తువులు సైతం స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. బాసిత్ చరిత్ర ఇలా... చంద్రాయణగుట్టలోని హఫీజ్బాబానగర్కు చెందిన బాసిత్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. 2014 ఆగస్టులో కోల్కతాలో పట్టుబడటంతో యాజమాన్యం కళాశాల నుంచి పంపించేసింది. హిమాయత్నగర్లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్లో ఐసిస్లో చేరేందుకు వెళ్ళిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి వెళ్ళిపోయాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్పూర్లో పట్టుకుని అరెస్టు చేశారు. తాజాగా ఎన్ఐఏ అధికారులు ఇతడి సెల్ఫోన్, ల్యాప్టాప్ నుంచి కీలక సమాచారం సేకరించారు. -
చేతికి స్టీరింగ్
ఆదివారం, 24. జూన్ 2018. సౌదీలో వీధులన్నీ కోలాహలంతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. న్యూ ఇయర్లా! అంతకన్నా ఎక్కువే. ఓ కొత్త శకంలా. అసలు శనివారం అర్ధరాత్రి గడియారం ముళ్లు 12 మీదకు రాగానే, వీధులన్నీ హర్షాతిరేకపు జల్లులతో నిండిపోయాయి. రియాద్, జెడ్డా, దమ్మమ్లలో మహిళలంతా దీపాలు పట్టుకుని తిరిగారు. ‘‘నేను మా వారి కారును ఈ రోజు ఉపయోగించుకున్నాను. త్వరలోనే నా కారు నేను కొనుక్కుందామనుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ అంతా వింతగా, కొత్తగా కనిపిస్తోంది. ఇది నిజంగానే సౌదీ మహిళలకు పండుగరోజు’’ అన్నారు సౌదీ మహిళ బయన్. సౌదీ మీడియా వీరిని అనుసరించి ప్రపంచానికి వీరి ఆనందాన్ని పంచింది. స్టీరింగ్ తమ చేతికి రావడాన్ని స్వాతంత్య్రానికి తొలి అడుగు పడినట్లు భావిస్తున్నారు సౌదీ మహిళలు. సుమారు 30 సంవత్సరాల తరవాత నిషేధాన్ని ఎత్తివేయడమే ఇంత ఆనందానికీ కారణం. 1990లో పోలీసులు, లైసెన్స్ ఏజెన్సీలు కలిసి మహిళల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసి, మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని నిషేధించిన రోజు నుంచి అక్కడి మహిళలు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ఇటీవలే పట్టాభిషిక్తుడైన మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీలో సంస్కరణలకు నడుం బిగించారు. సాంఘిక, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగానే మహిళలు స్వేచ్ఛగా వాహనాలు నడుపుకునేలా చట్టం తీసుకొచ్చారు. ‘‘ఇక్కడ జీవితం ఒక్కోసారి దుర్భరంగా అనిపిస్తుంది’ అంటారు బయాన్. సిరియాకి చెందిన బయాన్, డమస్కస్లో చదువుకుంటున్న రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నారు.‘‘సూపర్ మార్కెట్కి వెళ్లడానికి కూడా ఇతరుల మీద ఆధారపడటం చాలా చిరాకుగా ఉండేది. కనీసం పది నిమిషాల దూరానికి కూడా స్వేచ్ఛగా ప్రయాణించ లేకపోవడం బాధాకరం. ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడటం ఎంతో ఆనందంగా ఉంది. పురుషాధిక్యం ఉన్న సౌదీ అరేబియాలో మహిళలు ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ, సెకండ్ క్లాస్ సిటిజన్గా, నిర్ణయాలు తీసుకోలేని వారిగా ఉండటం మాకు ఎంతో బాధగా ఉంటుంది’’ అంటున్నారు బయాన్. – రోహిణి ఎక్కడికైనా వెళ్లగలను రైడ్ హెయిలింగ్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ను తీసుకున్న మొట్టమొదటి సౌదీ అమ్మాయిని నేనే. ఈ రోజు నాకు స్వేచ్ఛ లభించింది. ఏ సమయంలోనైనా ఎక్కడికైనా నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే హక్కును సాధించాను. నేను డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టాను. సౌదీలో మహిళా కాల్ సెంటర్ కూడా స్థాపించాను. ఇక్కడ ఇదే ఏకైక మహిళా కాల్ సెంటర్. త్వరలోనే 20 వేల మంది మహిళా డ్రైవర్లు వచ్చేలా చూస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. – కరీమ్, సౌదీ మహిళ నా జీవితంలో మంచిరోజు ఆర్థికంగా స్వేచ్ఛగా బతకడానికి, సంఘంలో నిలదొక్కుకోవడానికి డ్రైవింగ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను హాయిగా నాకు కావలసినవారిని కలవడానికి స్వేచ్ఛగా వెళ్లగలుగుతాను. నా జీవితంలో ఇంత మంచి అవకాశం వచ్చినరోజు మరొకటి లేదేమో. – ఈనామ్ ఘాజీ అల్ అస్వాద్, సౌదీ మహిళ -
మనవాళ్లు ఐసా నహీ!
‘సార్.. బెంజి కారు తెచ్చాం’‘ఐసా నహీ’ ‘సార్.. లీచీ, బాదాం, కాజూ, పిస్తా, ఖజూర్, కిస్మిస్ జ్యూస్ ఆయా’‘ఐసా నహీ’‘మేడమ్.. టాప్ మీద గోల్డ్ ఎంబ్రాయిడరీ. కాలర్ మీద డైమండ్ స్టడ్డింగ్, బెల్టులో రూబీ ఫిట్టింగ్’‘ఐసా నహీ’ అసలు ‘ఐసా నహీ’ అంటే ఏంటి?‘ఇలా కాదు’ అని. బాలీవుడ్లో ప్రొడ్యూసరు ఏది చేసినా..‘ఐసా నహీ.. అలా కావాలి’ అని అడుగుతుంటారు స్టార్లు.వాళ్ల నకరాలు, ఎక్స్ట్రాలు చూస్తే మనవాళ్లు ఐసా నహీ అనిపిస్తుంది. నవంబర్లో ఆమిర్ఖాన్ యాక్షన్–అడ్వెంచర్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ రిలీజ్ అవుతోంది. థగ్స్ అంటే దోపిడీదారులు. 1839లో ఫిలిప్స్ మెడోస్ టేలర్ అనే ఫ్రాన్స్ రచయిత రాసిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ థగ్’ అనే నవల ఆధారంగా విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. (ధూమ్ వన్, టు, త్రీ; రావన్ ఈయనవే). నిర్మిస్తున్నది ఆదిత్యా చోప్రా. 210 కోట్ల రూపాయల బడ్జెట్. 19వ శతాబ్దం నాటి ఈ స్టోరీలో బ్రిటిష్ పాలకులకు కంట్లో నలకలా మారిన ఒక ఇండియన్ దోపిడీ ముఠా ఉంటుంది. ఆ ముఠాకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడే ఆమిర్ ఖాన్. ‘ఆమిర్ అలీ’ అనే ఆ పాత్రలో ఆమిర్ఖాన్ జీవించేస్తున్నాడట! అయితే ఆ పాత్రలోనే కాదు, తన రెమ్యునరేషన్ దగ్గర కూడా ఆమిర్ ఒక దోపిడీ ముఠా నాయకుడికి ఏ మాత్రం తక్కువ కాని స్థాయిలో.. గొంతు మీద కత్తిపెట్టి, ‘తియ్.. ఎంతుందో’ అని డబ్బును డిమాండ్ చేశాడట! మూవీ ప్రాఫిట్లో 70 పర్సెంట్ తనకు ఇవ్వాలని ఆమిర్ అడిగినట్లు వార్తలొచ్చాయి. అంటే 147 కోట్ల రూపాయలు! ఇది తెలిసి ఇండస్ట్రీ షాక్ అయింది. నిర్మాతలకు, బయటì వాళ్లకు స్టార్లు, సెలబ్రిటీలు ఇచ్చే ఈ షాకులు కొత్తేం కాదు. వాళ్లు పెట్టే డిమాండ్లు ఎంత వింతగా, ఎంత విడ్డూరంగా, కొన్నిసార్లు ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా ఉంటాయో పాపం ఆ.. పడేవాళ్లకు మాత్రమే తెలుసు. అవి తీర్చలేని వారు ‘సారీ’ అంటారు. తీర్చక తప్పనివారు ‘సరే’ అంటారు. అలాంటి కొన్ని గొంతెమ్మ కోర్కెలు, వింత వింత షరతులు ఈవారం మన శాటర్డే స్పెషల్. ఫస్ట్ ఐశ్వర్యారాయ్తో స్టార్ట్ చేద్దాం. పెద్ద స్టార్ కదా మరి! నిర్మాతల్ని ఆమె పెద్దగా బెదరగొట్టలేదు కానీ, ఫ్లయింట్ సిబ్బందే.. ఐశ్వర్య ఎక్కిందంటే చాలు.. ‘బాబోయ్’ అని మూలమూలలకి నక్కేస్తారు. ఆమె గురించి తెలియనివాళ్లే ధైర్యంగా ముందుకొచ్చి.. ‘యస్.. మ్యామ్. మేము మీకేదైనా సహాయపడగలమా?’ అని అడుగుతారు. ‘ఓయస్.. తప్పకుండా సహాయపడగలరు’ అని ఒక స్మయిల్ ఇచ్చి, ఫ్లయిట్లో ఏమేం డిష్లు ఉన్నాయో అన్నీ మొహమాటం లేకుండా తెప్పించుకుంటారు ఐశ్వర్య! అవన్నీ ఆరగిస్తారా అంటే లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని తెస్తే వాటిల్లో చూడచక్కగా ఉన్న ఒక్కటి మాత్రమే మేడమ్ సెలక్ట్ చేసుకుంటారు. ఫ్లయిట్లో ఎక్కడికి వెళ్లినా ఐశ్వర్యకు ఇదో హ్యాబిట్. ఐశ్వర్యలా.. కరీనా కపూర్ తిండి విషయంలో ఏమంత పర్టిక్యులర్ కాదు. ఉన్నదేదో తినేస్తారు. అయితే ఉన్నవాళ్లెవరో వాళ్లతో నటించేయరు. అర్థం కాలేదా! నిర్మాతలు ఎవరైనా కరీనా దగ్గరికొచ్చి ‘కరీనాజీ మీరే మా సినిమాలో హీరోయిన్’ అని ఆనందంతో తబ్బిబ్బవుతూ చెబితే, కరీనా ఏ మాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా ‘ఇంకా ఎవరెవరుంటారు మీ సినిమాలో?’ అని అడుగుతారు. ‘ఇంకా కాస్టింగ్ పూర్తి కాలేదు’ అంటే.. ‘ఎ–లిస్ట్’ యాక్టర్లు అయితేనే నేను చేస్తాను’ అని షరతు విధిస్తారు కరీనా! కరీనాలా అందరూ ఎ–లిస్ట్ వాళ్లే అయితే నిర్మాతలు ఏ లిస్టులోకి వెళ్లిపోతారో ఊహకు అందనిదేం కాదు. కరీనాలా రేఖ ఇలాంటి షరతులేం పెట్టకున్నా.. కరీనానే నయం అనిపించేలా చేశారొకసారి. అభిషేక్ కపూర్ చిత్రం ‘ఫితూర్’లో నటిస్తూ నటిస్తూ మధ్యలో క్విట్ కొట్టేశారు రేఖ. నిర్మాతకు కాళ్లు ఒణికాయి. ‘ఏమైంది తల్లీ?! మమ్మల్ని నడి సముద్రంలో వదిలేసివెళ్లారు’ అని ఫోన్చేసి అడిగాడు. ‘నా లుక్ నేను అనుకున్నంత బాగా రాలేదు. అందుకే మీ సినిమాను వదిలేశా’ అని కూల్గా చెప్పారు రేఖ. నిర్మాత కుప్పకూలిపోయాడు. తబూ వచ్చి పైకి లేపి నీళ్లిచ్చింది. నిర్మాత తేరుకుని ‘నువ్వే మా రేఖ’ అనేశాడు. రేఖతో షూట్ చేసిందంతా తిరిగి తబూతో చేయించాడు. ఈ బుద్ధి మల్లికా శెరావత్కీ ఉంది. సీన్ బాగా రాలేదని తనకు అనిపిస్తే (భలే వచ్చిందని డైరెక్టర్కి అనిపించినా కూడా) మళ్లీ తీయించమంటుంది. టేకులు తినకుండా టేకులు తినిపించడం అంటే ఇదే. ప్రియాంకా చోప్రాది ఇంకో రకమైన ధోరణి. బయట ‘ఫ్యాషనబుల్గా చిరిగిపోయిన’ బట్టల్ని వేసుకుని చక్కగా కనిపిస్తారు కదా ఈవిడ.. సినిమాల్లో నటించడానికి మాత్రం ‘నో–న్యూడిటీ’ క్లాజ్ పెట్టేస్తారు. ‘ఒక్క సీన్ మేడమ్.. ప్లీజ్’ అని బతిమాలినా కూడా కనికరం చూపరు. ఇప్పుడామె హాలీవుడ్ నటి. అక్కడ కూడా అంతే. ‘క్వాంటికో’, ‘బేవాచ్’ సీరీస్లో ఒళ్లు కనిపిస్తే ఊరుకోనన్నారు. దాంతో ఆమె ఒళ్లు కనిపించే అవసరం లేకుండా నిర్మాతలు నిరుత్సాహంగా సన్నివేశాలను తిరగ రాసుకున్నారు. దీపిక పడుకోన్ కూడా తక్కువేం తిన్లేదు. అయితే ఒళ్లు కనిపించనివ్వని విషయంలో కాదులెండి. విక్కీ కౌషల్ అనే యాక్టర్తో నటించేది లేదు పొమ్మంది. విక్కీ ఎ–లిస్టర్ కాదు. అదీ దీపిక అబ్జెక్షన్. వెంటనే నిర్మాతలు తన్ని తరిమేశారు. ఎవర్ని తన్ని తరిమేశారో వేరే చెప్పాలా?! పాపం విక్కీ. కత్రీనాకు ఈ టైప్ ఆఫ్ అభ్యంతరాలు తక్కువే. అయితే ‘ఫితూర్’ ఫిల్మింగ్ మొత్తం అయిపోయాక ఓ సీన్ని మళ్లీ తీయాలని పట్టుపట్టింది. ‘బాగానే ఉంది కదమ్మా’ అని నిర్మాత అన్నాడు. ‘ఏం బాగుంది! నా మొఖం. కొంచెం బొద్దుగా లేనూ. మళ్లీ తియ్యండి’ అని కత్రీనా హఠం పట్టింది. విషయం ఏంటంటే.. సినిమా పూర్తయ్యాక కత్రీనా తగ్గడం మొదలుపెట్టింది. తగ్గాక అద్దంలో తనకు తనే విపరీతంగా నచ్చేసింది. ఆడియన్స్కి ఆ బొద్దు సీన్ని చూపించడం కన్నా, ఈ స్లిమ్ సీన్ని చూపించడం బెటర్ కదా అనుకుంది. చేసేది లేక నిర్మాత ‘ఓకే’ అన్నాడు. ‘అప్పుడే ఓకే కాదు, నాకు నచ్చిన స్టిల్ ఫొటోగ్రాఫర్ వచ్చి ఆ సీన్కి ఫొటో తీస్తాడు’ అంది. ‘అలాగే తల్లీ’ అని దండం పెట్టాడు నిర్మాత. ఇప్పుడొక చిన్న బ్రేక్. ముక్కు మీద వేలేసుకునే విషయం. సన్నీలియోన్ తెలుసు కదా. తెలియకుండా ఉంటుందా! ఉండదనే నిర్మాతలూ అనుకున్నారు. అయితే కాంట్రాక్ట్లో ఆమె పెట్టిన షరతు చూసి కుప్పకూలి పోయారు. ‘నో కిస్సింగ్’ క్లాజ్ అది. ఇప్పటికీ లియోన్ ఏమీ మారలేదు. రెమ్యునరేషన్ తర్వాతి సంగతి. ముద్దు సీనైతే లేదు కదా అని అడుగుతుంది. భలే అమ్మాయండీ! సోనాక్షి సిన్హా కూడా భలే అమ్మాయే. ఆమెకీ ఈ ‘ముద్దుపిచ్చి’ ఉంది. అంటే.. ముద్దిచ్చే పిచ్చి కాదు. ముద్దొద్దనే పిచ్చి. ‘నువ్విప్పుడు ఈ హీరోని ముద్దు పెట్టుకోవాలమ్మాయ్..’ అని అని చెబితే.. ‘ముందే చెప్పాను కదా.. నాకిలాంటివి ఇష్టం ఉండవని’ అంటుంది. సీన్ డిమాండ్ చేస్తోంది అమ్మాయ్’ అంటే.. నేను కమాండ్ చేస్తున్నా.. సీన్ మార్చండి అంటుంది. అలా చాలా సీన్లతో పాటు, చాలా సినిమాలూ వదులుకుంది సోనాక్షి. ‘దబాంగ్’లో సల్మాన్ పక్కన చేసింది సోనాక్షి. అతడూ అంతే ‘నో–కిస్సింగ్’ అంటాడు.. ప్రాజెక్టుకు సంతకం పెట్టే ముందే. అందుకనే సల్మాన్ చిత్రాల్లో మనకు అతడి కండలు కనిపిస్తాయి కానీ, అతడి ముద్దులు కనిపించవు. సల్మాన్తో నిర్మాతలకు ఇంకో ఇబ్బంది కూడా ఉంది. ఆకాశంలో ఔట్ డోర్ షూటింగ్ ఉన్నా.. అక్కడికి జిమ్ ఎక్విప్మెంట్ మొత్తం తెప్పించమంటాడు! షాట్ గ్యాప్లో బాడీని వామప్ చేసుకోవాలనిపిస్తే అతడికి ఈ సరంజామా అంతా ఉండాలి. నాలుగు గుంజీళ్లు తీస్తే సరిపోతుంది కదా అని సరిపెట్టుకోడు. హృతిక్ రోషన్కి కూడా ఈ బాడీ పిచ్చి ఉంది. అయితే నిర్మాతల్ని మరీ అంతగా వేధించడు. ఔట్ డోర్కి వెళ్లే ముందు.. ‘మంచి జిమ్ బుక్ చెయ్యండి’ అని మాత్రం అడుగుతాడు. మరీ అంత మంచి జిమ్ దొరక్కపోయినా అడ్జెస్ట్ అయిపోతాడు. అక్షయ్కుమార్ ఇంకో రకం ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. సండే సూర్యుడొచ్చి లేపినా లేవడు. ఇక డైరక్టరొచ్చి లేపితే లేస్తాడా! మంచి లైటింగ్ ఉంది లెమ్మంటే, రమ్మంటే.. ‘రేపు చూద్దాం’ అని నిర్మొహమాటంగా అనేస్తాడు. ఆదివారాలు ఈ మనిషి మనిషి కాదు అని వదిలేశారు దర్శకులు. ఆయన్ని వదిలేయడం కాదు. ఆయనపై ఆశల్ని వదులుకున్నారు. ఇప్పటికీ అంతే. అక్షయ్తో మరో తలనొప్పి కూడా ఉంది. షూటింగ్ ఎర్లీ మార్నింగ్ మొదలు కావాలంటాడు! ‘అదేంటీ అక్షయ్’ అని అడిగితే.. ‘లేట్ నైట్ నేను చెయ్యలేను’ అంటాడు. దీన్ని బట్టి అక్షయ్ది షూటింగ్లకు పనికొచ్చే బాడీ కాదనిపిస్తోంది. టెన్ టు ఫైవ్ ఉద్యోగానికి వెళ్లక, పొరపాటున ఇటు వచ్చినట్లున్నాడు. ఈ స్టోరీ ఆమిర్తో కదా మొదలైంది.. చుక్కలు కనిపించే ‘లెక్క’లేశాడని! ఈయనతో ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. ‘లో యాంగిల్’ షాట్ తియ్యనివ్వడు. అంటే.. కాళ్ల దగ్గర కెమెరా పెట్టి, తనను షూట్ చెయ్యనివ్వడు. íసిగ్గట.. ఖాన్ సాబ్కి.ఈ సిగ్గులు, అసలు సిగ్గే పడకపోవడాలు డిమాండ్ ఉన్న స్టార్లకు మామూలే. వాళ్లేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. వాళ్లేం అడిగినా వాళ్ల కాళ్ల దగ్గరికి వచ్చేస్తుంది. మరీ ఇబ్బంది అనిపిస్తే తప్ప ప్రొడ్యూసర్లు బయటపడరు. స్టార్లను వదిలించుకోరు. హద్దు దాటినప్పుడే.. పద్దులు చూసుకుంటారు. ‘అమ్మా నీకో దండం’, ‘అయ్యా నీకో నమస్కారం’ అని ప్యాకప్ చెప్పేసి, కొత్త వాళ్లతో మళ్లీ పికప్ అవుతారు. ముద్దంటే చేదు ముద్దు సీన్లంటే గిట్టనివాళ్లు సన్నీలియోన్, సోనాక్షీ, సల్మాన్ (అరె! ముగ్గురి పేర్లూ ‘ఎస్’ తోనే మొదలయ్యాయే) మాత్రమే కాదు. షారుక్ కూడా. (మళ్లీ ఇంకో ‘ఎస్’). అగ్రిమెంట్లో ‘నో కిస్సింగ్’ అని తప్పనిసరిగా కండిషన్ పెడతాడు షారుక్. ఒక్క యాష్ చోప్రా రిక్వెస్ట్పైన మాత్రం ‘జబ్ తక్ హై జాన్’లో తన రూల్ని తను బ్రేక్ చేసుకున్నాడు. రికార్డులు బ్రేక్ చేస్తేనే కాదు.. అప్పుడప్పుడు మన రూల్స్ని మనమే బ్రేక్ చేసుకున్నా గౌరవమే. యాష్ చోప్రా.. పై నుంచి షారుక్ని దీవిస్తూ ఉండివుంటారు.. ముద్దుకి షారుక్ ఓకే అన్నందుకు. -
నేనేమీ గాంధీ, మండేలాను కాదు.. సంపన్నుడిని!
రియాద్: సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ.. కఠిన చట్టాలు తెస్తూ దేశంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కాబోతున్నారు. తమ ఉమ్మడి శత్రువైన ఇరాన్ గురించి ఇరువురు దేశాధినేతలు ఈ భేటీలో చర్చిస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువరాజు సల్మాన్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పాలనలో విషయంలో ఇంచుమించు ఇటు సల్మాన్, అటు ట్రంప్ ఒకే రకం కావడం గమనార్హం. అమెరికాలో ట్రంప్ ఎలాగైతె కొత్త చట్టాలు తెచ్చారో సౌదీలో కూడా సల్మాన్ అలాంటి కఠిన చట్టాలే తెచ్చారు. అవినీతికి పాల్పడ్డారంటూ తన బంధుగణంలో 11మంది యువరాజులనూ, నలుగురు మంత్రులనూ బంధించారు. అంతేకాకుండా సౌదీలో నివసించే విదేశీయుల నుంచి నెలనెలా పన్ను వసూలు చేస్తున్నారు. తీవ్రవాదులకు సాయం చేస్తున్నారని ఖతర్తో ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకున్నారు. యెమన్పై యుద్ధం ప్రకటించారు. సౌదీ దేశాభివృద్ధి కోసమే ఈ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటానని సల్మాన్ తెలిపారు. ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్న పలు ఆసక్తికరమైన విషయాలివి.. మహిళకి స్వేచ్ఛ ఇచ్చాం ఒకప్పుడు సౌదీలో మహిళల పట్ల కఠిన చట్టాలు ఉండేవి. స్త్రీలు డ్రైవింగ్ చేయరాదు. ఆర్మీలో మహిళలకు అవకాశం లేదు. బయటకు వెళ్లాలంటే భయం. కానీ మా హయంలో మహిళలకి స్వేచ్ఛ ఇచ్చాం. ఆర్మీలో వారికి అవకాశం ఇచ్చాం. అన్నిరంగాల్లో మహిళలు రాణించేలా కృషి చేస్తున్నాం. ఉద్యోగం చేయాలంటే ఇకపై గార్డియన్ అనుమతి అవసరం లేకుండా చేశాం. మహిళా సాధికారతకు మేం కృషి చేస్తున్నాం. సౌదీ అంటే ఇది కాదు ఒకప్పుడు సౌదీవాసులు సాధారణ జీవితాన్ని గడిపేవారు. ఇరాన్లో ఇస్లాం విప్లవం, మక్కా మసీదును తీవ్రవాదులు బంధించడంతో దేశం నాశనం అయింది. 1979 కంటే ముందు దేశం చాలా బాగుండేది. స్త్రీలు డ్రైవింగ్ చేసేవారు. అన్ని దేశాల స్త్రీలలాగే సౌదీ మహిళలు కూడా అన్ని రంగాలలో పనిచేసేవారు. 1979 కంటే ముందు సౌదీ ఎలా ఉండేదో ఇంటర్నెట్లో చూడడండి. అప్పటి సాధారణ జనజీవితం ఎలా ఉండేదో తెలుస్తుంది. ప్రక్షాళన చేయాల్సిందే ‘దేశంలో అవినీతి లేకుండా చేయడమే నా లక్ష్యం. తప్పు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. అది ఎవరైనా’ అంటూ 11మంది యువరాజులనూ, నలుగురు మంత్రులనూ బంధించడాన్ని సమర్థించుకున్నారు సల్మాన్. బంధించిన వారి నుంచి 100 బిలియన్ల డాలర్లను స్వాధీనం చేసుకున్నాం. డబ్బు వసూలు చేయడం మా లక్ష్యం కాదు. అవినీతిని నిర్మూలించాలనేదే మా కోరిక అని ఆయన అన్నారు. నా ఆదాయంలో 51 శాతం ప్రజలకే ఇస్తా ఒకవైపు సౌదీ ప్రభుత్వం ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడుపరాదని, పొదుపు పాటించాలని ప్రబోధిస్తుండగా.. ఆ ప్రభుత్వాధినేతగా ఉన్న యువరాజు సల్మాన్ మాత్రం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నివాసంగా పేరొందిన ఫ్రెంచ్ రాజభవనం ఒకటి ఆయన పేరిట ఉందని తాజాగా న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. దీనిపై సల్మాన్ స్పందిస్తూ నేనేమీ మహాత్మాగాంధీనో, నెల్సన్ మండేలానో కాదు. నేను ధనికుడిని. నాది విలాసవంతమైన జీవనశైలి. అయినా, ఆదాయంలో 51శాతం ప్రజలు, చారిటీలకు రాసిస్తానని చెప్పుకొచ్చారు. -
వాంటెడ్ దబాంగ్
సల్మాన్ఖాన్–ప్రభుదేవా దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘వాంటెడ్’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మరోసారి వీరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. అది కూడా సల్మాన్కి మాంచి హిట్స్ ఇచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన ‘దబాంగ్’ సిరీస్ కావడం విశేషం. ‘దబాంగ్’ కి అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, ‘దబాంగ్ 2’ ని సల్మాన్ సోదరుడు అర్బాజ్ఖాన్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్లో ‘దబాంగ్ 3’ రాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై అర్బాజ్ఖాన్తో పాటు పలువురి పేర్లు వినిపించాయి. అయితే.. ఆ అవకాశం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాని వరించింది. ఈ విషయాన్ని ప్రభుదేవా స్వయంగా ప్రకటించారు. ‘‘దబాంగ్ 3’ సినిమాకు సంబంధించి గత వారం ముంబాయిలో చర్చలు జరిపాం. ఈ చిత్రానికి నన్నే దర్శకత్వం వహించమని సల్మాన్ఖాన్, అర్బాజ్ ఖాన్ కోరారు. నేనే దర్శకత్వం వహిస్తున్నా. కథానాయిక సోనాక్షీసిన్హా నటిస్తారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ పాతవారే ఉంటారు’’ అన్నారు ప్రభుదేవా. -
రిజల్ట్ కోసం వెయిటింగ్
మేఘన, సంతోషి, సల్మాన్ ప్రధాన పాత్రల్లో కృష్ణకార్తీక్ దర్శకత్వంలో హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘హ్యాక్డ్ బై డెవిల్’ (హెచ్బిడి). ఉదయ్భాస్కర్. వై నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో కృష్ణకార్తీక్ మాట్లాడుతూ– ‘‘హెచ్బిడి’ నా మొదటి సినిమా. చాలా ఉద్వేగంతో ఉన్నా. పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా. మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కృష్ణకార్తీక్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆయనకి ఇది తొలి చిత్రమైనా బాగా తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత రెగ్యులర్గా సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు నిర్మాత ఉదయ్భాస్కర్. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు టి.రామ సత్యనారాయణ, రాజ్ కందుకూరి, సాయి వెంకట్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్ యం.యం, కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ గౌడ్ వై. -
దెయ్యం హ్యాక్ చేస్తే..!
మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘హెచ్.బి.డి.’ (హ్యాక్డ్ బై డెవిల్). కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో వై.ఉదయ్ భాస్కర్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘పక్కా థ్రిల్లర్ మూవీ ఇది. చిన్న నిర్మాతలు సినిమాలు తీయడం మానేస్తే సినీ పరిశ్రమ ఎంతో చిన్నదైపోతుంది. చిన్న చిత్రాలను అందరూ ఎంకరేజ్ చేయాలి. ఈ నెల 25న మా బ్యానర్లో మరో కొత్త సినిమా ప్రారంభమవుతుంది’’ అన్నారు. ‘‘మొదటి సినిమానే ప్రయోగాత్మకమైన కథతో చేయాలని నిర్మాతలు కోరడంతో హెచ్.బి.డి. తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. నా రెండో సినిమా కూడా ఈ బ్యానర్లోనే త్వరలో ప్రారంభం అవుతుంది’’ అన్నారు కృష్ణకార్తీక్. సంగీత దర్శకుడు మహి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్కుమార్ గౌడ్ పాల్గొన్నారు. -
వెంకీ విత్ సల్మాన్ గాళ్ఫ్రెండ్
టాలీవుడ్ సీనియర్ హీరో , విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ ప్రవేశంపై మరోసారి ఊహాగానాలు చెలరేగాయి. ఎప్పుడు గాసిప్స్కు దూరంగావుండే ఈ నటుడు, సల్మాన్ గాళ్ఫ్రెండ్ లులియా వాంటర్తో కలిసి ఒకే కారులో కనిపించడం టాక్ ఆప్ టౌన్ అయ్యింది. దీంతో ఆయన బాలీవుడ్ ఎంట్రీపై పుకార్లకు తెరలేచింది. ముంబైలో డిన్నర్కు వెళ్లిన సందర్భంగా వీరిద్దరూ ఇలా కెమెరాకు చిక్కారు. దీంతో బాలీవుడ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన వెంకటేష్ పునః ప్రవేశం గురించి చర్చించడానికే వెళ్లారా? అనే పుకార్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలతో వెంకటేష్ బాలీవుడ్లో తిరిగి నటించనున్నారనే వార్తలకు ఈ మరింత బలం వచ్చింది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇటీవల ఓ పార్టీలో సల్మాన్, లులియాతో వెంకీ సమావేశమయ్యారని, దీనికి పార్టీలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. అయితే సమయం, సందర్భం ఏంటన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. అంతేకాదు మరో పుకారు కూడా షికారు చేస్తోంది. టాలీవుడ్ లోకి లూలియా వంతూర్ ప్రవేశం చేయనుందా అనేది ప్రజెంట్ టాక్ ఆఫ్ది టౌన్గా వుంది. అయితే ఇరువర్గాలనుంచి విశ్వసనీయ సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సల్మాన్ ఖాన్, వెంకటేష్ మధ్య సాన్నిహిత్యం తెలిసిన విషయమే. -
దెయ్యాలున్నాయి జాగ్రత్త!
‘‘ఈ సృష్టిలో దేవుళ్లు ఉన్నది నిజమైతే.. దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం’ అనే అంశంతో ‘హ్యాక్డ్ బై డెవిల్’ (హెచ్బిడి) తెరకెక్కించాం. హారర్ – థ్రిల్లర్లా సాగుతుందీ చిత్రం’’ అన్నారు దర్శకుడు కృష్ణకార్తీక్. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఉదయ్భాస్కర్. వై ఈ చిత్రం నిర్మించారు. మహిమదన్ యం.యం. సంగీతం అందించిన పాటల సీడీలను మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. ‘‘కృష్ణకార్తీక్ పక్కా ప్లానింగ్ వల్ల సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి’’ అని నిర్మాత తెలిపారు. మహిమదన్, నిర్మాత లయన్ సాయివెంకట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్ గౌడ్. వై. -
దెయ్యం హ్యాక్ చేస్తే?
సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను హ్యాక్ చేయడం కామన్.. కానీ, దెయ్యాలు హ్యాక్ చేస్తే? ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాక్డ్ బై డెవిల్’. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో కృష్ణకార్తీక్ దర్శకత్వంలో ఉదయ్భాస్కర్ వై. నిర్మించారు. ఈ చిత్రం టీజర్ను నిర్మాత రామసత్యనారాయణ రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. టెక్నికల్ విభాగంలో పని చేసిన నన్ను, నా కథను నమ్మి ఉదయ్భాస్కర్ నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు నిర్మిస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. జనవరి 1న పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని ఉదయ్భాస్కర్ చెప్పారు.. ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్ యం.యం, కెమేరా: కన్నాకోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్గౌడ్ .వై -
మేకింగ్ ఆఫ్ మూవీ - ప్రేమ్ రతన్ ధన్పాయో
-
నా తండ్రే పెద్ద విమర్శకుడు..!
ముంబైః బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలపై విమర్శకుల గురించి అడిగిన ప్రశ్నకు భిన్నంగా స్పందించాడు. ప్రేక్షలకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సూపర్ స్టార్.. తాజా సినిమా సుల్తాన్ కూడ సునామీ సృష్టిస్తున్న తరుణంలో తన తండ్రే తనకు పెద్ద విమర్శకుడని చెప్పుకొచ్చారు. మీ దృష్టిలో ఎవరు మంచి విమర్శకులు అని అడిగిన ప్రశ్నకు సల్మాన్ కొత్తగా స్పందించారు. ప్రతి సినిమా విషయంలోనూ తనకు తన తండ్రే పెద్ద విమర్శకుడని తెలిపాడు. ముందుగా ఆయన స్పందనే నాకు ముఖ్యమని, ప్రతి సినిమా చూసి వచ్చిన తర్వాత మా త్రండ్రి సలీం ఖాన్... తన అభిప్రాయాన్ని ఎంతో సున్నితంగా చెప్తుంటారని తెలిపాడు. ఆయనకు నచ్చితే ఆ సినిమా విషయం ఇక మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చని చెప్తుంటారని, నచ్చకపోయినప్పుడు కూడా ఆ విషయం మర్చపోయి మరో సినిమాకు ఇంకొంచెం ఎక్కువ కష్టపడమని సూచిస్తుంటారని సల్మాన్ వివరించాడు. అయితే మీకోసం ఆయన ఏదైనా స్క్రిప్ట్ రాస్తుంటారా అన్న ప్రశ్నకు మాత్రం... ఆయన ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాయకపోయినా, అద్భుతమైన వ్యాసాలు రాస్తుంటారని, ప్రస్తుతం ట్వీట్లు కూడా చేస్తున్నారని అన్నాడు. నేను ఎన్నో ఏళ్ళుగా సినిమాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నానని, ఒక చిత్రంలో చేసినట్లు మరోదాంట్లో చేయనని, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగనివ్వనని ఈ సందర్భంలో తెలిపాడు. -
వంద రోజుల ప్రేమ!
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రం ‘100 డేస్ ఆఫ్ లవ్’ అదే పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. జీనస్ మహ్మద్ దర్శకుడు. ఎస్.ఎస్.సి. మూవీస్ సమర్పణలో నిర్మాత ఎస్.వెంకటరత్నం ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గోవింద్ మీనన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఎస్.వెంకటరత్నం మాట్లాడుతూ - ‘‘చక్కని ప్రేమకథా చిత్రమిది. ‘ఓకే బంగారం’లో దుల్కర్, నిత్యాల నటన, కెమిస్ట్రీలకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతారు. నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నాం’’ అన్నారు. -
సినీ ప్రియుల ‘సుల్తాన్’
సామాన్యుడు విజేతవడం మామూలు సినిమా. విజే తగా మారి, ఆ విజయం మత్తులో జీవి తంలో పరాజితు డైతే? జీవితమనే గోదాలోకి దిగి, తనతో తాను, తనలో తాను పోటీపడితే ఏమవుతుంది? సల్మాన్ హీరోగా చేసిన ఆ మ్యాజిక్ - ‘సుల్తాన్’ కథ ఏమిటంటే... కుస్తీ, కరాటే, బాక్సింగ్ వగైరా మార్షల్ ఆర్ట్స్ అన్నిటి కలగలుపుగా గోదాలో ప్రత్యర్థుల మధ్య జరిగే పోటీ - మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్. ఈ పోటీకి దేశవాళీ టచ్ ఇస్తే అప్పుల ఊబిలో నుంచి బయటకొస్తామనీ, ఒకప్పటి ఫేమస్ భారతీయ మల్లయోధుడు ‘సుల్తాన్’ను బరిలోకి దింపితే బాగుంటుందనీ నిర్వాహకులు భావిస్తారు. హర్యానాలోని పల్లెటూళ్లో కుస్తీ పోటీలకు దూరంగా బతుకుతుంటాడు సుల్తాన్ (సల్మాన్ఖాన్). ఒకప్పుడు ఒలింపిక్ స్వర్ణపతక విజేతైన అతనెందుకు అలా అయ్యాడన్నది అసలు కథ. సల్మాన్ భుజస్కంధాలపై... ఈ సినిమాకు ప్రాణం, ప్రణవం - సల్మానే! ఊళ్లో డిష్ టీవీ యాంటెన్నాలు బిగించుకొనే భోళా మనిషిగా, హీరోయిన్ ప్రేమ కోసం... మల్లయోధురాలైన ఆమె కళ్ళల్లో గౌరవం కోసం కుస్తీపట్లు నేర్చుకొనే కార్య సాధకుడిగా, కుస్తీ పోటీలే జీవితమై - గర్వం తలకెక్కిన ఒలింపిక్ గోల్డ్ విజేతగా, జీవితంలో కావాల్సినవి కోల్పోయిన పరాజితు డిగా, తనతో తాను... తనతో తాను పోరాడే నిజమైన పహిల్వాన్గా - స్క్రిప్ట్లో ఒక్కో దశలో ఒక్కో కోణంలో ఉన్న సుల్తాన్ పాత్రను సల్మాన్ సమర్థంగా పోషించారు. ఈ సినిమా బరువునంతా, పెంచుకున్న కండలు తిరిగిన దేహం సాక్షిగా తన భుజాలపై మోశారు. మల్లయోధురాలిగా, ఆశయానికీ, ప్రేమకీ మధ్య నలిగే వ్యక్తిగా అనుష్క శర్మ బాగున్నారు. నచ్చే అంశాలు... మెచ్చాల్సిన విషయాలు...: గ్రామసీమల్ని అందంగా చూపిన ఛాయాగ్రహణం, అనుభూతినిచ్చే సినిమా రీరికార్డింగ్ లాంటి ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విభాగాలన్నీ బాగున్నాయి. కథ ఎటు వెళుతుందన్నది ముందే తెలిసిపోతున్నా, గోదాలో హీరోకూ, ప్రత్యర్థులకూ మధ్య పోటీ జరిగినప్పుడల్లా ప్రేక్షకులు కుర్చీలకి అతుక్కుపోతారు. ‘ఊపర్ అల్లా... నీచే ధర్తీ...’ అంటూ పదే పదే వచ్చే గీతఖండిక ఎమోషన్ను చాలా సార్లు పెంచింది. పురిట్లో బిడ్డ ఆడపిల్ల అయినా, మగపిల్లాడైనా సమానమే లాంటి అభ్యుదయ అంశాల్ని నైసుగా సిన్మాలో చెప్పించారు. కథ పకడ్బం దీగా రాసుకొని, ఎడిటింగ్కు పని పెడితే, ‘సుల్తాన్’ వేరే రేంజ్లో ఉండేది. - రెంటాల జయదేవ -
సల్మాన్ క్షమాపణ చెప్పలేదు..
రేప్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ పంపిన నోటీసులకు ప్రముఖ సినీనటుడు సల్మాన్ ఖాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులకు సమాధానం పంపారు. నోటీసుపై స్పందించిన మహిళా కమిషన్ చైర్మన్ లలిత కుమారమంగళం రేప్ వ్యాఖ్యలపై సల్మాన్ క్షమాపణ చెప్పలేదని తెలిపారు. మిగతా వివరాలను పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వచ్చే నెలలో విడుదల కాబోతున్న సల్మాన్ కొత్త సినిమా 'సుల్తాన్' సినిమా గురించి ఇచ్చిన ఇంటర్వూలో సినిమాకు తాను చేసిన కసరత్తుల వల్ల రేప్ కు గురైన మహిళల తన శరీరం తయారైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు సల్మాన్ ను సమర్ధించగా, మరికొందరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సల్మాన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ క్షమాపణ చెప్పాలని గతంలో కోరింది. ఈ మేరకు నోటీసులు పంపగా, సల్మాన్ తన లాయర్ ద్వారా తిరిగి మహిళాకమిషన్ నోటీసులను పంపించారు. -
'అతను ఎవరితోనైనా అంతే..'
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ అనుష్క శర్మ. అందానికి అభినయం కూడా తోడవడంతో అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. అది కూడా బాలీవుడ్ ఖాన్ త్రయంతో నటించేసి మిగిలినవారికి గట్టి పోటీగా నిలిచింది. షారుఖ్ సినిమా 'రబ్ నే బనాదీ జోడీ'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుష్క.. 'జబ్ తక్ హై జాన్' చిత్రంలో మరోసారి షారుఖ్తో కలిసి స్క్రీన్ మీద మెరిసింది. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్తో కలిసి 'పీకే' చిత్రంలో నటించి అందరినీ తనవైపు తిప్పుకుంది. ఇక ఎంతోమంది హీరోయిన్ల పేర్లు పరిశీలించిన తర్వాత సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' లో నటించే అవకాశం అనుష్కను వరించింది. క్రీడాకారిణిగా మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైంది ఈ బ్యూటీ. ఈద్ కానుకగా సుల్తాన్ జూలై 6న విడుదల కానున్న క్రమంలో ఖాన్ త్రయంలో పనిచేసిన అనుభవాలను మీడియాతో పంచుకుంది అనుష్క. అతను ఎవరితోనైనా అంతే.. సల్మాన్.. నిజాయితీకి మారు పేరంటూ కితాబిచ్చింది అనుష్క. సినిమా షూటింగ్ మొదలయ్యేవరకు సల్మాన్తో అంత పరిచయం లేదని, పరిచయం అయ్యాక అతనేంటో చాలా తెలుసుకున్నానని అంటోంది. సల్మాన్ ఎవరితోనైనా ఒకేలా ఉంటారని, చాలా కచ్చితంగా మాట్లాడుతారని.. మాటలు మార్చడంలాంటివి అస్సలు చేయరని చెప్పింది. ఆయనతో కలిసి పనిచేయడం సులువని కూడా చెబుతోంది. ఆ మనిషి మాయ చేసేస్తాడు.. షారుఖ్ ఎవ్వరినైనా మాయ చేసేస్తాడట. చాలా మాట్లాడతాడు.. మాటలతోనే ఎదుటివారు సౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేస్తాడు. తెలివైన వ్యక్తి కూడా. ఎదుటివారి భావాలను చెప్పకున్నా అర్థం చేసుకోగలగడం అతనికున్న క్వాలిటీ అంటోంది అనుష్క. చాలా వ్యూహాత్మకమైన వ్యక్తి.. ఆమీర్.. చాలా వ్యూహాత్మకమైన వ్యక్తి అంటోంది అనుష్క. తనకేం కావాలో అది రాబట్టుకునే తెలివైన వ్యక్తి, మాటకారి. మంచి సినిమాలను ఎంచుకుంటాడు, సినిమాల స్థాయిని పెంచే నటుడు అంటూ చెప్పుకొచ్చింది అనుష్కా శర్మ. -
పెళ్ళికోసమే ఛస్తున్నాః సల్మాన్ ఖాన్
తన మాటలతో ఇటీవల వివాదాల్లో చిక్కుకుంటున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఈసారి తనడైలాగ్స్ తో అభిమానులను ఆకట్టుకునేట్లు చేశాడు. త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సుల్తాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ఖాన్.... 'నేను పెళ్ళికోసం పడి ఛస్తున్నానని, అయితే ఇతరుల అంగీకారం కోసం వేచి చూస్తున్నానని' చెప్పడం అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సింగింగ్ రియాలిటీ షో 'సా రే గా మా పా' లో పాల్గొన్న దబాంగ్ స్టార్ ను ఓ పోటీదారుడు తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో అడ్వైజ్ అడగడంతో ఖాన్ అలా సమాధానం ఇచ్చాడు. లులియా వంటోర్.. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ అని, అతడు ఆమెనే పెళ్ళి చేసుకుంటాడని వస్తున్న పుకార్లపై ఎదరయ్యే ప్రశ్నలను తప్పించుకునేందుకే సల్మాన్.. సింగింగ్ రియాలిటీ షో 'స రే గా మా పా' లో తాను పెళ్ళికోసం ఛస్తున్నానంటూ చమత్కరించి ఉండొచ్చని జనం గుసగుసలాడుతున్నారు. ఏభై ఏళ్ళ వయసున్న ప్రసిద్ధ సినీ స్టార్.. తానెప్పుడూ స్థిరపడాలనే అనుకుంటున్నానని, అయితే తనను ఇతరులు అంగీకరించడం కోసమే వేచి చూస్తున్నట్లు తెలిపాడు. స రే గా మా పా పోటీదారుడు జగ్ ప్రీత్ బజ్వా... జీవిత భాగస్వామిని ఎలా ఎంపిక చేసుకోవాలి అంటూ సల్మాన్ ను సలహా అడగడంతో.. ''మీరు తప్పుడు వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు జగ్ ప్రీత్... ఆ విషయంలో నేను చాలా అన్ లక్కీ పర్సన్.. నా గురించి జనం అనుకుంటున్నది కూడ తప్పే..'' అంటూ సల్మాన్ చమత్కరించినట్లు.. టీవీ షో జారీ చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. పైగా... ఇది పురుషులు చెప్పే విషయం కాదని, అన్నింటినీ డిసైడ్ చేసే మహిళలే ఈ విషయాన్ని చెప్పాలని సల్మాన్ చమత్కరించాడట. మరోవైపు నేను సల్మాన్ ఖాన్ కి అతి పెద్ద ఫ్యాన్ అని, ప్రతి విషయంలోనూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని, భాయ్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడో, అదే సంవత్సరంలో నేను కూడ పెళ్ళి చేసుకుంటానని కార్యక్రమానికి మెంటార్ గా ఉన్న మిల్కా సింగ్ చెప్పడం.. రియాలిటీ షో లో నవ్వులు పూయించింది. సుల్తాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా 'సా రే గా మా పా షోలో' సల్మాన్ హాజరైన ఈ భాగం టీవీలో జూన్ 26న ప్రసారం కానుంది. -
సలాం బాలీవుడ్
హిందీ తెరపై ముస్లిం పాత్రలు అద్భుతమైన ప్రేమికురాలిని చూడాలా? ‘మొఘల్-ఏ-ఆజమ్’లో ‘అనార్కలి’ కాలి గజ్జెల్లో చూడొచ్చు. గొప్ప స్నేహితుడు కావాలా? ‘జంజీర్’లో ‘షేర్ఖాన్’ బలమైన బాహువుల్లో చూడొచ్చు. ఆత్మాభిమానం కలిగిన కూలీని కలవాలా? ‘కూలీ’ సినిమాలో ‘ఇక్బాల్’ జబ్బకు ఉన్న 786 లెసైన్స్ బిళ్లలో చూడొచ్చు. ఈ దేశానికి పతకాలు తెచ్చి పెట్టే గొప్ప కోచ్ కావాలా? ‘చక్ దే ఇండియాలోని’ ‘కబీర్ ఖాన్’ హాకీ స్టిక్లో చూడవచ్చు. బాలీవుడ్ తెరపై చూడాలేగాని ముస్లిం పాత్రలు బోలెడన్ని. ముస్లిం సంస్కృతిని ప్రదర్శించే సన్నివేశాలు బహూత్ అన్ని. 1947లో మన దేశం ఇండియా పాకిస్తాన్గా విడిపోయింది. దేశ విభజన సమయంలో లోతైన గాయాలు ఇరువైపులా మిగిలాయి. అయినప్పటికీ భారతీయ సినిమా ఆ గాయాల జోలికి పోకుండా ముస్లిం సంస్కృతిని తన కథలో అవిభాజ్యం చేసుకుంది. దానికి తోడు మహబూబ్ఖాన్, కె.ఆసిఫ్, కె.ఎ.అబ్బాస్, కమాల్ అమ్రోహి వంటి దర్శకులు... అబ్రార్ అల్వి, నాసిర్ హుసేన్, సలీమ్-జావెద్ వంటి రచయితలు... సాహిర్ లుధియాన్వి, మజ్రూ సుల్తాన్పురి, కైఫీ ఆజ్మీ వంటి కవులు వీరంతా ముస్లిం సంస్కృతి అవసరమైనప్పుడు తెర మీద ఎంతో హుందాగా గొప్పగా ప్రతిబింబింప చేయగలిగారు. ఇక బాలీవుడ్లో స్థిరపడిన అభిప్రాయం- అందమైన హీరోలంతా పంజాబ్ నుంచి అయి ఉంటారు, చక్కటి హీరోయిన్లంతా ముస్లింలై ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. సురయ్య, నర్గిస్, మధుబాల (అసలు పేరు ముంతాజ్), మీనాకుమారి (అసలు పేరు మహెజబీన్) ... వీరంతా భారతీయ వెండితెరను ఏలిన తారలు. మొఘల్-ఏ-ఆజమ్ అంతవరకూ సహాయక పాత్రలుగా, హాస్యపాత్రలుగా కనిపించిన ముస్లిలను మొఘల్-ఏ-ఆజమ్ (1960) సినిమా చారిత్రక పరంపరకు వారసులుగా చూపించింది. సలీం, అనార్కలీల ప్రేమను మహాచక్రవర్తి అయిన అక్బర్ నిలువరించడం తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరగడం ఇవన్నీ చరిత్రలో అనాధారితమే అయినా ఈ సినిమాతో అదంతా ప్రేక్షకులు నమ్మి తీరే కథ అయ్యింది. సలీమ్గా దిలీప్ కుమార్, అనార్కలిగా మధుబాల వెండితెర మీద మరణమే లేని జంటను సృష్టించగలిగారు. ఆ తర్వాత మెల్లగా లక్నో ముస్లింల సంస్కృతి వెండి తెర మీద ఆవిష్కృతమైంది. ‘మేరే మెహబూబ్’ (1963) సినిమా ముస్లిం ప్రేమికుల కథల్లో ఉండే సౌందర్యాన్ని, కవిత్వాన్ని ప్రేక్షకులకు చూపెడితే లక్నో తవాయిఫ్ల జీవితాలను వ్యాఖ్యానిస్తూ వచ్చిన ‘పాకీజా’ (1971) ప్రేక్షకుల చేత జేజేలు అందుకుంది. ఈ టైమ్లోనే అరేబియాలో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న లైలా మజ్నూల ప్రేమ కథ ‘లైలా మజ్నూ’ (1976)గా హిందీలో విడుదలైంది. లైలాగా రంజితా, మజ్నూగా రిషికపూర్ నటించారు. ‘కోయి పత్థర్ సే నా మారే మేరే దీవానేకో’ పాట ఇందులో పెద్ద హిట్. జంజీర్... షోలే.... కూలీ... ఇటు ఈ తరహా సినిమాలు వస్తుంటే రచనారంగంలో సలీమ్ జావేద్ల రాకతో బలమైన క్యారెక్టర్స్ కనిపించడం మొదలెట్టాయి. ‘జంజీర్’ (1973)లో ఇన్స్పెక్టర్ అయిన అమితాబ్కు ప్రాణ స్నేహితుడైన పఠాన్ షేర్ ఖాన్గా ప్రాణ్ కనిపిస్తాడు. షోలే (1975)లో బందిపోటు గబ్బర్ సింగ్ క్రూరత్వానికి తన ముక్కుపచ్చలారని కుమారుణ్ణి బలి ఇచ్చిన గుడ్డి తండ్రి ఇమామ్ సాబ్గా కె.ఎ.హంగల్ చాలా గట్టిగా గుండెను తాకుతాడు. మరోవైపు దర్శకుడు మన్మోహన్ దేశాయ్ దేశంలో ఉన్న మూడు మతాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే ఫార్ములాను ప్రతిపాదించాడు. అతడి ‘అమర్ అక్బర్ ఆంథోని’ (1977) సూపర్ డూపర్ హిట్. అతడే ‘కూలీ’ (1983)లో అమితాబ్ను ‘ఇక్బాల్’ అనే ముస్లిం పాత్రగా చేసి అతడితో పాటు ఉండే గద్దకు ‘అల్లారఖా’ అని పేరు పెట్టాడు. అమితాబ్ చేతి రైల్వే కూలీ లెసైన్సు బిళ్ల నం.786 కావడం ఈ సమయంలోనే షూటింగ్లో అమితాబ్ ప్రాణాపాయం వరకూ వెళ్లి బయటపడటం పెద్ద సెంటిమెంట్ సంగతి. బాంబే... గదర్... కాలం మారింది. బాబ్రీ మసీదు ఘటన తర్వాత కథల ధోరణి మారింది. హిందూ ముస్లింల మధ్య ప్రేమ చర్చనీయాంశం అయ్యింది. 1995లో మణిరత్నం ‘బాంబే’ సినిమా పెద్ద సంచలనం. అందులో ముస్లిం యువతి ‘సాయిరా బానూ’గా మనీషా కోయిరాలా చాలా హుందాగా కనిపిస్తుంది. మతాలు వేరైనా మనుషులూ వారి మధ్య ప్రేమ ఒక్కటే అని చెప్పే ఈ సినిమా ఆనాటి సమయంలో తీయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ‘గదర్’ (2001) భారతదేశానికి చెందిన సిక్కు ట్రక్కు డ్రైవర్కు పాకిస్తాన్కు చెందిన గొప్పింటి ముస్లిం అమ్మాయికి మధ్య నడిచిన ప్రేమ కథగా భారీ హిట్ అయ్యింది. దీనికి కొనసాగింపుగా ఇంకొంచెం సున్నితంగా యశ్చోప్రా ‘వీర్జారా’ తీశాడు. ఇందులో కూడా పాకిస్తాన్ అమ్మాయి అయిన ప్రీతి జింటా కోసం ఇండియా అబ్బాయి షారూక్ పాకిస్తాన్ వెళతాడు. జోధా అక్బర్... మై హూనా... హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిల ప్రేమకథ వెలితిని తీర్చడానికి చాలా భారీ స్థాయిలో వచ్చిన సినిమా ‘జోధా అక్బర్’ (2008). రాజపుత్రులకు చెందిన జోధా (ఐశ్వర్యరాయ్), మొఘలుల చక్రవర్తి అక్బర్ (హృతిక్ రోషన్) ఈ సినిమాను క్లాసిక్ స్థాయిలో నిలబెట్టారు. దీనికి కొద్దిగా ముందు క్రికెట్లో గొప్ప బౌలర్ కావాలని కలలు కన్న మూగ- చెవిటి పిల్లవాడు ‘ఇక్బాల్’ (2005), ‘చక్ దే ఇండియా’ (2007)లో మహిళా హాకీ టీమ్ను నిలబెట్టిన కోచ్ షారూక్లను గొప్ప ముస్లిం పాత్రలుగా నిలబెట్టాయి. ఈ సమయంలోనే అమెరికా ప్రదర్శిస్తున్న ముస్లిం వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ షారూక్ ఖాన్ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ (2010) తీసి ముస్లిం ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తాడు. బజరంగీ భాయ్జాన్... హిందీ సినిమా ఆది నుంచి హిందూ ముస్లింల మధ్య ఒక సాంస్కృతిక వారధిగా నిలుస్తూనే ఉంది. తాజా సినిమా బజరంగీ భాయ్జాన్ అందుకు ఒక ఉదాహరణ. ఇందులో తప్పిపోయిన బాలికను పాకిస్తాన్కు తీసుకువెళ్లిన బజరంగీ (సల్మాన్ఖాన్)కు చాంద్ నవాబ్ అనే జర్నలిస్ట్ (నవాజుద్దీన్ సిద్దిఖీ) సాయం చేస్తాడు. మతాలు వేరైనా దేశాలు వేరైనా మానవ స్పందనలు దయ, కరుణలు ఒకటే అని నిరూపిస్తాడు. అందరి రక్తమాంసాలు ఒకటే. పాత్రలూ ఒకటే. కాకపోతే వాటికి ఒక్కోసారి రామ్ అనీ మరోసారి రహీమ్ అని పేర్లు పెట్టుకుంటుంటాం అంతే. - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి పర్దా హై... ముస్లిం సంస్కృతి హిందీ సినిమాలకు ఖవ్వాలిని బహుమతిగా ఇచ్చింది. హిందీ సినిమాలలో బోలెడన్ని ఖవాలీలు హిట్స్గా నిలిచాయి. ‘నా తో కార్వాన్కి తలాష్ హై నా తో హమ్ సఫర్ కీ తలాష్ హై’ (బర్సాత్కీ రాత్), ‘నిగాహె మిలానె కొ జీ చాహ్తా హై’ (ది హి తో హై), ‘తేరి మెహఫిల్ మే కిస్మత్ ఆజ్మా కర్ హమ్ భి దేఖేంగే’ (మొఘల్ - ఏ- ఆజమ్)... ఇవన్నీ క్లాసిక్స్. అయితే మన్ మోహన్ దేశాయ్ అమర్ అక్బర్ ఆంథోనిలో తీసిన ‘పర్దా హై పర్దాహై’... ఖవ్వాలి చాలా పెద్ద హిట్. -
మూడోసారి సల్మాన్తో..
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, స్టార్ దర్శకుడు కబీర్ ఖాన్ కాంబినేషన్లో మూడో సినిమా రానుంది. వీరిరువురి కాంబినేషన్లో గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, బజరంగీ భాయ్ జాన్ ఘన విజయం సాధించాయి. ఈ సారి కుటుంబ కథాచిత్రంతో వీరు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా షూటింగ్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే వీరి చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్లుగా దీపికా పదుకోన్, కత్రినా కైఫ్ ల పేర్లు వినబడుతున్నాయి. రాజ్ కుమార్ సంతోషి, సూరజ్ భాటియాతో సినిమాలు చేయడానికి సల్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
అమ్మమ్మ, మనవడు..ఓ ఫోటో
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన నిజజీవితంలో వచ్చిన సరికొత్త ప్రమోషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన ముద్దుల మేనల్లుడు ఆహిల్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటున్నాడు. చిన్నారి ఆహిల్ రాకను ఘనంగా ఆహ్వానించిన బాలీవుడ్ కండల వీరుడు తాజాగా క్యూట్ ఫోటో నొకదాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'అమ్మమ్మ సల్మా, మనవడు ఆహిల్ ' అంటూ ఒక ముచ్చటైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అమ్మ సల్మా ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్న మేనల్లుడు ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు సల్మాన్. కాగా సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ, అయూష్ శర్మ దంపతులకు ఈ మార్చి 30న ఆహిల్ పుట్టాడు. ఈ నేపథ్యంలో మేనల్లుడి రాకతో మురిసిపోతున్న సల్మాన్ తన బుజ్జి మేనల్లుడు అహిల్కు ఇటీవల ఒక ఖరీదైన కారును కూడా బహుమతిగా ఇచ్చాడు. -
సల్మాన్ ఖాన్ కు ఐష్ మద్దతు
ముంబై: రియో ఒలంపిక్ క్రీడలకు భారత అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్ ను నియమించడంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కండల వీరుడికి ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభించింది. మాజీ విశ్వ సుందరి, ఐశ్వర్యారాయ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ కు మద్దతు పలికారు. క్రీడల అభివృద్ధి కోసం ఎవరైనా మాట్లాడొచ్చు, నిలబడవచ్చు.తమ మద్దతు తెలుపవచ్చని ఆమె స్పష్టం చేశారు. ఇందులో తప్పేమందని ఒక ప్రశ్నకు అమె సమాధానంగా చెప్పారు. -
సల్మాన్ ఫ్యాన్స్కు నిరాశ!
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అభిమానులకు కొంత నిరాశ కలగనుంది. ఆయన రణదీప్ హుడా కోసం పాట పాడటం లేదని తెలిసింది. సుల్తాన్ సినిమా షూటింగ్ తో బిజిబిజీగా ఉన్న సల్మాన్... గతంలో మేహూ హీరో తేరా, హ్యాంగోవర్ వంటి పాటలు పాడి అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రణదీప్ హూడా కోసం ఓ పాటను పాడిద్దామనుకున్నారు. అదే విషయాన్ని గతంలో రణదీప్ వెల్లడించాడు కూడ. సయ్యద్ అహ్మద్ అఫ్జల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లాల్ రంగ్' సినిమా కోసమే సల్మాన్ తో పాట పాడించాలని అనుకున్నారు. కానీ, ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు రావడం, మరోపక్క, సుల్తాన్ చిత్రంతో సల్మాన్ ఖాన్ బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి సల్మాన్ పాట పాడలేకపోవచ్చని, తదుపరి చిత్రం కోసం పాడించే ప్రయత్నం చేస్తామని రణ్ దీప్ స్వయంగా చెప్పారు. అక్షయ్ ఓబ్రాయ్, పియా బాజ్ పేయ్ ప్రముఖ తారాగణంగా రూపొందుతున్న లాల్ రంగ్ చిత్రం ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధమౌతోంది. -
కృతీకి బంపర్ ఆఫర్!
‘ఆవ్ తుజే మోకార్తా’ అంటూ ‘1 నేనొక్కడినే’ సినిమాలో మహేశ్బాబును టీజ్ చేసిన కృతీసనన్ ఆ చిత్రంతోనే కుర్రకారు హృదయాలను దోచేశారు. ఆ తర్వాత ‘దోచెయ్’ సినిమాలో నాగచైతన్య మనసుని కూడా దోచేసుకున్నారు. ఈ పొడుగు కాళ్ల సుందరి టాలీవుడ్లో ఫుల్ బిజీ అవుతుందని చాలామంది ఊహించారు. అయితే హిందీ రంగంలో అవకాశాలు రావడంతో కృతి అక్కడ బిజీ అయిపోయారు. బాలీవుడ్లో ‘హీరో పంతి’, ‘దిల్వాలే’ చిత్రాల్లో నటించిన కృతీని ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వరించినట్లు సమాచారం. అక్కినేని నాగార్జున కెరీర్లో హిట్ పిక్చర్గా నిలిచిపోయిన వాటిలో ఒకటైన ‘హలో బ్రదర్’ చిత్రాన్ని అంత సులువుగా మర్చిపోలేం. ఆ చిత్రానికి హిందీ రీమేక్గా సల్మాన్ఖాన్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘జుద్వా’. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ రీమేక్ హిందీలో కూడా మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని తన కుమారుడు వరుణ్ ధావన్ హీరోగా మళ్లీ రీమేక్ చే యడానికి దేవిడ్ ధావన్ సన్నాహాలు చేస్తున్నారు. సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్న ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు స్థానం ఉంది. ఒక కథానాయికగా కృతీసనన్ను ఎంచుకున్నట్లు సమాచారం. మరో కథానాయికగా శ్రద్ధాకపూర్ పేరును పరిశీలిస్తున్నారట. పాత ‘జుడ్వా’లో కరిష్మా కపూర్, శిల్పాశెట్టి అద్భుతంగా నటించారు. రెండు పాత్రలూ నటనకు అవకాశం ఉన్నవే. సో.. కృతీకి కనుక ఈ రీమేక్లో అవకాశం దక్కితే నటిగా ఇంకా నిరూపించుకోవడానికి స్కోప్ దొరికినట్లే! -
సల్మాన్తో లాంగ్ డ్రైవ్?
గాసిప్ రణ్బీర్కపూర్తో ప్రేమలో ఉన్నప్పుడు సల్మాన్తో అంతంతమాత్రంగానే ఉన్న కత్రినా కైఫ్ బ్రేకప్ అయ్యాక మాజీ ప్రియుడు సల్మాన్ఖాన్తో మళ్లీ కనెక్ట్ అయ్యారనే వార్తలు బాలీవుడ్లో బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సల్మాన్ఖాన్ -కత్రినాకైఫ్లు తరచుగా అక్కడ క్కడ జంటగా కనిపిస్తుండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతున్నాయి. కత్రినా కైఫ్ తాను నటించిన తాజా సినిమా ప్రచారంలో భాగంగా సహనటుడు ఆదిత్యారాయ్ కపూర్తో కలిసి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన షోలో పాల్గొన్నారు. సడన్గా అక్కడికి సల్మాన్ఖాన్ రావడంతో అక్కడంద రూ ఆశ్చర్యపోయారట. ఈ షో అయిపోయేంతవరకూ కత్రినా కైఫ్ కోసం వెయిట్ చేశారు సల్మాన్. ఆ తర్వాత తన డ్రైవర్ను పంపించేసిన కత్రిన వెంటనే సల్మాన్ఖాన్ కారుతో లాంగ్డ్రైవ్కు వెళిపోయారట. మరి వీరిద్దరి మధ్య బంధం ఎంతకాలమో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. -
కత్రినాపై సల్మాన్ ప్రశంసల వర్షం
-
సల్మాన్కు ఊరట
-
'అసహనం ఎక్కడుంది..?' : వర్మ
-
'అసహనం ఎక్కడుంది..?' : వర్మ
ఇటీవల కాలంలో సినిమాల కంటే ఎక్కువగా రాజకీయ, సామాజిక అంశాల మీదే స్పందిస్తున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్వీట్లకు పని చెప్పాడు. ఎక్కువగా సినీ తారాలను మాత్రమే టార్గెట్ చేసే వర్మ, ఈ సారి మాత్రం అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న రచయితలు, మేధావులు, సామాజిక వేత్తలను తన ట్వీట్లతో ప్రశ్నించాడు. దేశంలో అసహనం ఎక్కడుందో నాకు అర్థం కావటం లేదంటూ తనదైన స్టైల్లో స్పందించాడు. 'హిందూ దేశంగా పేరున్న భారత్లో షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి ముగ్గురు ముస్లిం నటులు సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. మరి అసహనం ఎక్కడుందో నాకు అర్ధం కావటం లేదు..? ఒక హిందూ దేశంలో ముగ్గురు ముస్లిం నటులు సూపర్ స్టార్లు అయ్యారంటేనే మెజారిటీ ప్రజలు అసహనంతో లేరని ప్రూవ్ అవుతోంది. సెలబ్రిటీలుగా పరిగణించబడుతున్న, ఎవరైతే అసహనం గురించి మాట్లాడుతున్నారో.. వారు విమర్శిస్తున్న దేశంలోనే సెలబ్రిటీలుగా ఉన్నారు. కొన్ని ఘటనల మూలంగా అసహనం ఉన్నట్టుగా ప్రకటించకూడదు' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. If Aamir,Sharuk and Salman the three biggest stars of the Hindu country "India" are Muslims, I don't understand where intolerance is ? — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 In a predominantly Hindu country,if 3 Muslims can become the biggest iconic super stars that itself proves the majority aren't intolerant — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 Some celebs complaining about Intolerance should be the last ones to complain becos they became celebs in a so called intolerant country — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 Isolated incidents cant be taken as sign of intolerance and the super stardom of 3 Muslims is proof enough of the vast majority's tolerance — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 -
ముంబాయిలో సందడి చేసిన సల్మాన్,సోనమ్
-
నోయిడాలో సల్మాన్ఖాన్,సోనమ్ కపూర్ సందడి
-
ఖాదీ ఫ్యాషన్షోలో ’సల్మాన్’
-
ఈ వారం you tube హిట్స్
ప్రేమ్ రతన్ ధన్ పాయో : ట్రైలర్ నిడివి : 2 ని. 08 సె. హిట్స్ : 59,83,741 బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఏడాది రెండు దీపావళులు! నవంబర్ 10న వచ్చే దీపావళి ఒకటి. నవంబర్ 12న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ (పి.ఆర్.డి.పి) విడుదల తెచ్చే దీపావళి ఒకటి. ఈ ఫ్యామిలీ డ్రామాను సూరజ్ బర్జాత్యా డెరైక్ట్ చేస్తున్నారు. సల్మాన్ డబుల్ రోల్. సోనమ్ కపూర్ హీరోయిన్. పదహారేళ్ల విరామం తర్వాత సల్లూ, సూరజ్ కాంబినేషన్లో వస్తున్న పి.ఆర్.డి.పి.పై విపరీతమైన అంచనాలున్నట్లు... ఈ ట్రైలర్కు వస్తున్న హిట్స్ని చూస్తుంటే అర్థమౌతోంది. మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై... ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చినవే. జెల్లీ టెన్నిస్ - ది స్లో మో గైస్ నిడివి : 5 ని. 15 సె. హిట్స్ : 51,13,567 పిల్లలకు తప్పనిసరిగా చూపించవలసిన వీడియో ఇది. జెల్లీ ముద్దను టెన్నిస్ బాల్లా చేసుకుని ర్యాకెట్తో షాట్ కొడితే ఎలా ఉంటుంది? జెల్లీ చిందర వందర అవుతుంది. చిత్ర విచిత్ర రూపాల్లో చింది పడుతుంది. దీన్నే స్లో మోషన్లో చూస్తే? బిటన్ కుర్రాళ్లు గవ్, డాన్లకు వచ్చిన ఈ ఐడియా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పిల్లల్ని కేరింతలు కొట్టిస్తోంది. గవ్ పూర్తి పేరు గవిన్ డేవిడ్ ఫ్రీ. ఈ జెల్లీ ఐడియా అతడిదే. తన ఫ్రెండ్ డేనియల్ గ్రుకీ (డాన్)తో కలిసి అతడు చాలాకాలంగా ‘ది స్లో మో గైస్’ పేరుతో యూట్యూబ్ సీరీస్ నడుపుతున్నాడు. ఆ సీరీస్లోని లేటెస్ట్ వీడియో ఈ జెల్లీ టెన్నిస్. మిలా ఫైండ్స్ అవుట్ ఆడమ్ లెవిన్ గాట్ మ్యారీడ్ నిడివి : 0 ని. 21 సె. హిట్స్ : 27,69,815 యూత్లో ఎమోషన్స్ బలంగా ఉంటాయి. ఫ్యావరెట్ హీరోకో, హీరోయిన్కో పెళ్లయిపోతే ఇక్కడ వీళ్ల గుండె ముక్కలైపోతుంది. అయితే చిన్నారుల్లో కూడా ఇదే ఫీలింగ్ ఉంటుందా? ఉండదని చెప్పకూడదేమో. ఎందుకంటే మిలా అనే అమెరికన్ చిన్నారి తన ఫ్యావరెట్ సింగర్ ఆడమ్ లెవిన్కు పెళ్లయిపోయిందని తెలియగానే పట్టలేని దుఖంతో ఒక్కసారిగా ఏడ్చేసింది. ‘నో.. నో.. హి డిడిన్ట్ మమ్మీ’ అని బాధపడిపోయింది. లాస్ ఏంజెల్స్ పాప్ బ్యాండ్ ‘మెరూన్ 5’ సింగర్ లెవిన్కు గత జులైలోనే పెళ్లయిపోయింది. మిలాకు ఆ సంగతి కాస్త ఆలస్యంగా తెలిసింది. 100 ఇయర్స్ ఆఫ్ వెడ్డింగ్ గౌన్స్ నిడివి : 3 ని. 08 సె. హిట్స్ : 24,35,837 వెస్టర్న్ స్టెయిల్స్ని ఇష్టపడేవారు, వెస్టర్న్లోనే మళ్లీ ఓల్డ్ ఫ్యాషన్ని ముచ్చట పడే అమ్మాయిలు వెడ్డింగ్కి రెడీ అవుతుంటే గనుక ఈ వీడియోను చూడొచ్చు. తమకు నచ్చిన వెడ్డింగ్ గౌన్ డిజైన్లను ఎంపిక చేసుకోవచ్చు. మోడల్ లోలీ హోవీతో మూడే మూడు నిమిషాల్లో వందేళ్ల వార్డ్రోబ్ ని సర్దిపెట్టింది ప్రసిద్ధ ఫ్యాషన్ దుస్తుల తయారీ సంస్థ ‘మోడ్స్’. 1910ల నాటి హై కాలర్స్ నుంచి ఇప్పటి స్లీక్ స్టెయిల్స్ వరకు గౌన్ల డిజైన్లు ఎలా రూపాంతరం చెందిందీ ఇందులో చూపించారు. ఫ్యాబ్రిక్, లెంగ్త్, టెక్చర్, డిజైన్లలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ గౌన్ల తెలుపు రంగు మారకపోవడమే అసలైన విశేషం. స్పెక్టర్ : ఫైనల్ ట్రైలర్ నిడివి : 1 ని. 16 సె. హిట్స్ : 17,23,334 ఇరవై నాల్గవ జేమ్స్బాండ్ మూవీ ‘స్పెక్టర్’. డేనియల్ క్రైగ్ నాలుగోసారి బాండ్గా నటిస్తున్నాడు. ఈ చిత్రం చిట్టచివరి ట్రైలర్ ఇది. అంటే రిలీజ్ డేట్ దగ్గర పడిందని. స్పెక్టర్ ఇండియాలో నవంబర్ 6న విడుదలౌతోంది. ఇందులోని స్పెక్టర్ అనే గ్లోబల్ క్రిమినల్ ఏజెన్సీతో బాండ్ తొలిసారి తలపడతాడు. 1971 నాటి ఏడవ బాండ్ మూవీ ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’లో తొలిసారి ‘స్పెక్టర్’ ఏజెన్సీ కనిపిస్తుంది. స్పెక్టర్ని శ్యామ్ మెండెస్ డెరైక్ట్ చేస్తున్నారు. విలన్గా క్రిస్టోఫ్ వాల్ట్జ్, బాండ్ గర్ల్గా పారిస్ అమ్మాయి లీ సెడ్యూక్స్ నటిస్తున్నారు. గ్లోయింగ్ సీ టర్టిల్ నిడివి : 3 ని. హిట్స్ : 7,49,621 నేషనల్ జియోగ్రఫిక్ తాజాగా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో ఇది. ఆ సంస్థ తరఫున పనిచేస్తున్న సముద్రగర్భ అన్వేషకుడు డేవిడ్ గ్రూబర్ వెతుకులాటలో బయటపడిన ‘గ్లోయింగ్’ సీ టర్టిల్ ఇందులో కనిపిస్తుంది. దీనికి ముద్దుగా ఆయన అండర్ వాటర్ యు.ఎఫ్.ఓ. అని పేరు పెట్టుకున్నారు. అరుదైన జాతికి చెందిన ఈ మెరిసే తాబేలు దక్షిణ పసిఫిక్ సముద్రంలోని సొలొమన్ ద్వీపంలో సాక్షాత్కరించింది. డేవిడ్ గ్రూబర్, ఆయన సహచరులు బయో ఫ్లోరోసెంట్ జీవుల కోసం రాత్రి పూట గాలిస్తుండగా నీళ్ల మాటున పగడాల దిబ్బల్లో ఈ తాబేలు కనిపించిందట. -
అన్నదమ్ముల మధ్య వివాదం: ఒకరి మృతి
చాగలమర్రు (కర్నూలు): భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తమ్ముడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రు మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కల్లగోంట్ల గ్రామానికి చెందిన సాల్మాన్, ఏసోబులు అన్నదమ్ములు. వీరి మధ్య భూమి విషయంలో గొడవ జరిగింది. దీంతో ఇరువురు ఘర్షణ పడ్డారు. ఏసోబు దాడి చేయడంతో సాల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంతకీ ఆ సినిమాలో ఏముంది?
-
ఇంతకీ ఆ సినిమాలో ఏముంది?
'తనీఒరువన్' ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దక్షిణాదినే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత దర్శకుడు ఎం రాజా తెరకెక్కించిన ఈ క్రైం థ్రిల్లర్ స్టార్ హీరోలను కూడా ఆకర్షిస్తుంది. అందుకే దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా రీమేక్ కు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అసలు అంతగా టాప్ స్టార్స్ను ఆకర్షించడానికి ఈ సినిమాలో ఏముంది. 'తనీఒరువన్' ఓ థ్రిల్లర్ కథాంశం. ఐపీఎస్ పాసైన హీరో మిత్రన్ ( జయం రవి ) ప్రొబేషన్లో ఉండగా తన మిత్రులతో కలిసి నగరంలో జరుతున్న నేరాల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో తమతో కలిసిన మహిమ ( నయనతార ) తో ప్రేమలో పడతాడు. నగరంలో జరుగుతున్న చిన్న చిన్న నేరాల వివరాలను సేకరించిన మిత్రన్ ఈ నేరాలన్నింటి వెనకాల ఉన్న వ్యక్తి ఒకడే అని గ్రహిస్తాడు. పద్మశ్రీ అవార్డ్ గ్రహిత అయిన ఫేమస్ సైంటిస్ట్ సిద్దార్ధ్ అభిమన్యు ( అరవింద్ స్వామి ) తన వ్యక్తిగత అవసరాల కోసం సైన్స్ను, పాలిటిక్స్ను తప్పుదారిలో ఉపయోగిస్తున్నాడని తెలుసుకొని అతని ఆటకట్టిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఇన్విస్టిగేషన్ డ్రామాలా సాగే తనీఒరువన్.., సెకండ్ హాఫ్ అంతా మైండ్ గేమ్లా నడుస్తుంది. కేవలం స్క్రిప్ట్ మీద 9 నెలల పాటు వర్క్ చేసిన దర్శకుడు రాజా ప్రతీ సీన్లోనూ క్లారిటీ చూపించాడు. థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో ఒక్క ఫ్రేమ్ కూడా ఆడియన్ బోర్ ఫీలవ్వకుండా తెరకెక్కించాడు. జయం రవి, అరవింద్ స్వామి, నయనతారల నటన, ఎం రాజా డైరెక్షన్ ఇలా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అవ్వటంతో 'తనీఒరువన్' టాక్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా మారింది. ప్రస్తుతం టాలీవుడ్తో పాటు మరో నాలుగు పరిశ్రమలు 'తనీఒరువన్' రీమేక్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఒరిజినల్ వర్షన్ దర్శకుడు ఎం రాజా తెలుగులో మహేష్ బాబు హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే మహేష్ ఇంత వరకు రీమేక్ సినిమా చేయలేదు. దీంతో మహేష్ కాకపోతే రామ్ చరణ్ తో అయినా రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అలాగే హిందీలో సల్మాన్ హీరోగా తనీ ఒరువన్ను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. హిందీ వర్షన్ ను తానే డైరెక్ట్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు రాజా. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ చూసిన సల్మాన్ టీం రీమేక్కు సుముఖంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇక కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. సౌత్ లో మంచి పరిచయాలు ఉన్న జెనీలియా కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మరాఠీలో ఈ సినిమాను నిర్మించాలని ట్రై చేస్తుంది హాసిని. బెంగాలీ భాషలోనూ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం గట్టిపోటి నెలకొంది. దృశ్యం సినిమా తరువాత అదే స్ధాయిలో అన్ని భాషల్లో ఈ 'తనీఒరువన్' రీమేక్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
చిరంజీవి బర్త్డేకు రానున్న అతిరథులు
హాజరుకానున్న రజనీకాంత్, అమితాబ్, సల్మాన్ కుటుంబీకులు ముంబై: మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదినోత్సవ కార్యక్రమానికి సినీరంగ అతిరథులు తరలిరానున్నారు. సూపర్స్టార్ రజనీకాంత్తోపాటు బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్, ఆయన కుటుంబీకులు, సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబీకులు, టబు, బోనీ కపూర్ తదితరులకు ఆహ్వానం అందింది. చిరంజీవి పుట్టినరోజు వేడుకలను శనివారం హైదరాబాద్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిరంజీవికి ఇష్టమైన వంటలను అతిథులకు రుచి చూపించబోతున్నారు. -
సల్మాన్ డబుల్ కిక్!
‘కిక్’... సల్మాన్ అభిమానులకు కిక్ ఎక్కించిన సినిమా. ఇప్పుడు డబుల్ కిక్ ఇవ్వడానికి ఆయన రెడీ అవుతున్నారు. అవును మరి.. సల్మాన్ రెండు పాత్రల్లో కనిపిస్తే రెట్టింపు కిక్ లభించడం ఖాయం కదా. ‘కిక్ 2’లో ఈ కండల వీరుడు హీరోగా, విలన్గా కనిపించనున్నారని సమాచారం. ఒకే ఫ్రేమ్లో పాజిటివ్, నెగటివ్.. ఇలా సల్మాన్లో రెండు కోణాలు చూడటం అభిమానులకు పండగలా ఉంటుంది. ప్రస్తుతం సల్మాన్ ఈ సినిమా కథా చర్చలతో చాలా బిజీగా ఉన్నారు. మొదటి భాగానికి మించిన వినోదం ఉండేలా, అంతకు మించిన హీరోయిజమ్ ఉండేలా కేర్ తీసుకుంటున్నారట. -
సెల్ఫీ భాయ్జాన్
సెల్ఫ్, అంటే చాలామంది అనుకునేది ఇగో అని! అయాన్రాండ్ తన నవల ఫౌంటెయిన్హెడ్లో అంటుంది - ‘బాగా సెల్ఫిష్ అయిపో. ముందు నిన్ను నువ్వు ప్రేమించు. తరువాత ఇంకా సెల్ఫిష్ అయిపో.. నీ కుటుంబాన్ని ప్రేమించు. ఆ తర్వాత ఇంకా సెల్ఫిష్ అయిపో... నీ ఊరిని ప్రేమించు. అలా, అలా సెల్ఫిష్ అయిపోతూ ఈ విశ్వాన్ని ప్రేమించు.’ సల్మాన్ఖాన్ బజ్రంగీ భాయ్జాన్ సినిమాలో తన సెల్ఫిష్నెస్ని చూపించుకున్నాడు. తన సెల్ఫ్నే చూపించుకున్నాడు. హ్యూమన్ బీయింగ్ నుంచి ‘బీయింగ్ హ్యూమన్’ వరకు తన ప్రయాణంలో వచ్చిన పరిణామాన్ని చాటిచెప్పుకున్నాడు. ఈ కథ, దాని కథనం మీరే చదవండి. సెల్ఫీ భాయ్జాన్లా... మీరూ బాగా సెల్ఫిష్ అయిపోండి. ఎంజాయ్! రామ్ ఎడిటర్, ఫీచర్స్ ఇటీవల కోర్టులో న్యాయమూర్తి సల్మాన్ను ఒక ప్రశ్న అడిగారు. నీ మతం ఏమిటి? సల్మాన్ జవాబు: నేను ఇండియన్ని. అది జవాబు కాదు. నువ్వు పాటించే మతం ఏమిటి? సల్మాన్ జవాబు: నేను ముస్లింని. నేను హిందువుని. నేను రెండూ. రెండు మూడు నెలలు గడిచిపోయాక ఇప్పుడు తాజాగా సల్మాన్ సినిమా రాబోతోంది. బజ్రంగీ భాయ్జాన్. బజ్రంగీ ఒక ధర్మం. భాయ్జాన్ మరో ధర్మం. రెంటినీ కలిపి ఉంచగలిగే ఒక హీరో- సల్మాన్. గ్లిజరిన్ లేకుండా నేను ఏడ్వగలగాలి. అలాంటి స్క్రిప్ట్ ఏమీ లేదా? అడిగాడు సల్మాన్ దర్శకుడు కబీర్ఖాన్ని. ఇద్దరూ ‘ఏక్ థా టైగర్’ సినిమా చేశారు. క్షణాల్లో ద కోట్ల కలెక్షన్లు సాధించారు. సినిమా అంత బాగలేదన్నారు. కాని డబ్బు దండిగా వచ్చింది. ఈసారి అలా కాదు. డబ్బూ రావాలి సినిమా బాగుండాలి. అలాంటి కథ ఇక్కడ దొరకడం లేదు అన్నాడు కబీర్ఖాన్. మరేం చేద్దాం? సౌత్లో ట్రై చేద్దాం. ఎవరున్నారు? మనకు తెలిసినవాళ్లే. డెరైక్టర్ రాజమౌళి ఫాదర్. విజయేంద్ర ప్రసాద్. హైదరాబాద్ అంటే హృదయం ఉన్న నగరం. హిందూ అనీ ముస్లిం అనీ యోచించకుండా అందరూ హాయిగా బతికే నగరం. ఈ నగరంలో ఉన్నప్పుడు హృదయమున్న కథలు తట్టడంలో ఆశ్చర్యం లేదు. విజయేంద్ర ప్రసాద్కు తట్టింది. ఒక చిన్న పిల్ల. తప్పిపోయింది. అక్కణ్ణుంచి ఇక్కణ్ణుంచి కాదు. పాకిస్తాన్ నుంచి తప్పి పోయింది. అక్కడా ఇక్కడా కాదు. ఇండియాలో. వివరం చెప్దామంటే నోరు లేదు. సాయం అడగాలంటే తోడు లేదు. ఇలాంటి వారికి ఎవరు దిక్కు. దేవుడే దిక్కు. అదిగో అతడే దేవుడు. సాటి మనిషికి సాయం చేయడమే నిజమైన దైవత్వం అనుకునే నిర్మలమైనవాడు. బజ్రంగీ. అతను ఆ అమ్మాయిని కలుస్తాడు. అక్కున జేర్చుకుంటాడు. పాకిస్తాన్కు తీసుకువెళతాడు. ఇందులో హిందూ ఏముంది స్లిం ఏముంది... పరోపకారమే ఏ మనిషైనా పాటించాల్సిన నిజమైన మతం. అదీ కథ. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ఈ కథకు సల్మాన్కు గ్లిజరిన్ అవసరం ఏర్పడలేదు. కళ్లు తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు. మనం ఈ సినిమా చేస్తున్నాం. ఇక అక్కణ్ణుంచి ఆ సినిమాకు విస్తృత రూపం ఇవ్వడం మొదలయ్యింది. సరిహద్దుల్లోని ఓ ప్రాంతం. ఒక సాదాసీదా కుర్రాడు పవన్ కుమార్ చతుర్వేది. పహిల్వాన్ల వంశం. కనుక ఆంజనేయ స్వామికి వీరభక్తుడు. అందుకే అందరూ అతణ్ణి బజ్రంగీ అని పిలుస్తారు. వాళ్ల కాలనీలో ఏ వేడుక అయినా అతని చేతుల మీద జరగాల్సిందే. ఎవరు తప్పు చేసినా అతని దెబ్బకు వీపు చిట్లాల్సిందే. అలాంటి వీరుడు ఒకమ్మాయి ఓర చూపుకు ఫ్లాటై పోయాడు. ఆమె నవ్వుకు నేల కరుచుకుపోయాడు. ఇంట్లో ఊరుకుంటారా? ఏవో అబ్జెక్షన్సు. ఇదో పులి అయితే మరి కాసేపటికి ఈ పుట్ర తోడైంది. అమ్మెవరో తెలియదు. అయ్య ఎవరో తెలియదు. ఏ ఊరో తెలియదు. అడుగుదామంటే నోరు లేదు. నీకు మాటలు రావా? నేను ఒక్కో ఊరి పేరు చెప్తూ పోతాను. ఏ ఊరు మీదైనా ఆ ఊరి దగ్గర చెయ్యెత్తు. జబల్పూర్, ఉదయ్పూర్, ఇటావా, నాగ్పూర్.... ఎన్ని ఊర్లు చెప్పినా ఆ అమ్మాయి చేయెత్తడం లేదు. చివరకు విసిగిపోయి- పాకిస్తానా అన్నాడు. ఆ పాప సంబరంగా అవును.. అవును... అని ఎగరడం మొదలెట్టింది. పవన పుత్రుడికి సరిహద్దు వేడిగాలి తగలడం మొదలయ్యింది. హతవిధీ.... ఇప్పుడు ఆ అమ్మాయిని పాకిస్తాన్ తీసుకెళ్లాలి. పాస్పోర్ట్ లేదు. వీసా అడిగితే ఏజెంట్ కూచోబెట్టి అమెరికా కావాలంటే పంపుతాను జర్మనీకి కావాలంటే పంపుతాను టునీషియా కావాలంటే పంపుతాను... కాని పాకిస్తాన్కు మాత్రం పంపలేను అంటాడు. మామూలు మనిషైతే ఇక్కడకు కథ అయిపోవాలి. ఆ అమ్మాయిని పోలీస్స్టేషన్లో వదిలిపెట్టడం అధమం. తనే పెంచుకుకోవడం సాధారణం. అయిన వాళ్ల కోసం కొద్దో గొప్పో ప్రయత్నించడం ఉత్తమం. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఎదిరించి విజయం సాధించడం... ధీరోదాత్తం అవుతుంది అనుకుంటున్నారా.... కాదు, అతి మామూలు మానవత్వం. అతడిలో మానవత్వం ఉంది. దానికి నిస్వార్థమైన సంకల్పం ఉంది. అది నిస్వార్థమైనప్పుడు ప్రకృతికి అది తెలుస్తుంది. సరే బయలుదేరు అన్నారు అందరూ. పని మంచిదైనప్పుడు అడ్డదారే సరైన దారి అవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించడం ధర్మాన్ని నిలబెట్టడం అవుతుంది. అతడు ఎడారి మార్గం గుండా పాకిస్తాన్ చేరుకుంటాడు. పాప తల్లిదండ్రులను కనిపెట్టడానికి పెను ప్రయత్నాలు చేస్తాడు. అక్కడ పని చేస్తున్న ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ ఇతడికి సాయం చేస్తూ- ఫలానా దర్గాకు పో... దాని పేరు తప్పిపోయిన వాళ్ల దర్గా... అక్కడకు వెళ్లితే తప్పిపోయినవాళ్లకు వాళ్ల వాళ్లు దొరుకుతారని చెప్తే... అంత పెద్ద ఆంజనేయ భక్తుడు... ఆ పాప ముఖాన నవ్వు కోసం ఆ దర్గాకు వెళ్లి మొక్కుకుంటాడు. కన్నీళ్లతో దువా చేస్తాడు. శక్తి పుంజుకుంటాడు. మళ్లీ అన్వేషణ కొనసాగుతుంది. ఇరు ప్రాంతాల ప్రజల ఆశీస్సు దొరుకుతుంది. బజ్రంగీ భాయ్జాన్కు అంతిమంగా విజయం సిద్ధిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఎవరో ఒక పెద్దమనిషి- ఇలాంటి టైటిల్ పెట్టడం ఏంటి... మేం ఊరుకోం.. అని రుసరుసలాడారు. ప్రేమను ద్వేషించేవాళ్లే ఇలాంటి మాట మాట్లాడగలరు అని సల్మాన్ జవాబు. ప్రపంచంలో ఇంత నెగిటివిటీ ఉంది. ఈ మతం అనీ ఆ మతం అనీ.... నీ మతం నువ్వు ఆచరించు... ఎవరూ అభ్యంతరం చెప్పరు... కాని ఎదుటి మతం మీద ద్వేషం ప్రచారం చేయకు... చాలా తప్పు అని సమాధానం ఇచ్చాడతడు. బజ్రంగీ భాయ్జాన్ ప్రేమను పంచే సినిమా. ఇరు దేశాల్లో ప్రజల మధ్య స్నేహాన్ని పెంచే సినిమా. ఇది చూశాక మీరు మారతారు అని సల్మాన్ ప్రకటించాడు. ఈ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. పాకిస్తాన్లో ఒక సిటీ బస్లో పాప తల్లిదండ్రుల కోసం వెతుకుతూ ఉన్న బజ్రంగీని చూసి- మీలాంటి వాళ్లు ఈ దేశంలో ఆ దేశంలో మరింతమంది ఉంటే ఎంత బాగుండేదో కదా అని పాకిస్తాన్ కండక్టర్ అంటాడు. అది తనకు ఎంతో ఇష్టమైన డైలాగ్ అంటాడు సల్మాన్. ఈ సినిమా సారం అంతా ఆ డైలాగ్లోనే ఉందని అతడి అభిప్రాయం. బజ్రంగీ భాయ్జాన్ కోసం యూనిట్ చాలా కష్టపడింది. కథానుసారం చాలా కఠినమైన లొకేషన్లలో షూట్ చేసింది. రాజస్తాన్ ఎడారిలో పాకిస్తాన్ సరిహద్దు వద్ద దొంగతనంగా అటువైపుకు వెళ్లే సన్నివేశాలను విపరీతమైన ఎండల్లో తీయాల్సి వచ్చింది. క్లయిమాక్స్ను కాశ్మీర్ ప్రాంతంలోని ‘థజ్వా’ మంచు పలక మీద తీశారు. అది సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తున ఉంటుంది. అక్కడకు కాలి నడకన వెళ్లాలి. ఎక్కడం కంటే దిగడం కష్టం. సల్మాన్ రెండు సార్లు జారి పడాల్సి వచ్చింది. పాపను భుజాన ఎత్తుకుని నది దాటే సన్నివేశాలు... మంచు కంటే చల్లగా ఉన్న ప్రవాహాన్ని దాటడం... ఇవన్నీ ఈ సినిమాలో ప్రేక్షకులను కదిలించనున్నాయి. పాపగా బాలనటి హర్షాలీ నటించింది. ఆమె ఈ సినిమాతో స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఈద్- సల్మాన్కు సెంటిమెంట్. ప్రతి రంజాన్కు అతడు రిలీజ్ చేసే ఏ సినిమా అయినా వంద కోట్లకు తగ్గకుండా కలెక్ట్ చేసింది. బజ్రంగీ భాయ్జాన్ 300 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. రాక్లైన్ వెంకటేశ్తో కలిసి సల్మాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. వేరే పెద్ద సినిమాలు ఏమీ లేవు. అది దీనికి లాభించింది. సాటి మనిషి గుండెల నిండా హత్తుకోవడమే నిజమైన ఈద్ అని చెప్పే సినిమాలు కూడా లేవు. అదీ దీనికి లాభించింది. సల్మాన్- నిజంగానే మాస్కు బజ్రంగీ. అభిమానులకు భాయ్జాన్. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి భర్ దే జోలీ మేరీ యా ముహమ్మద్... ఈ ఖవ్వాలి తెలియని ఉపఖండ వాసులు ఉండరు. ‘సాబ్రి బ్రదర్స్’గా విఖ్యాతం అయిన పాకిస్తానీ సోదరులు పాడిన ఈ ఖవ్వాలీని చాలామంది చాలాచోట్ల నేటికీ పాడుతూనే ఉంటారు. బజ్రంగీ భాయ్జాన్లో సల్మాన్ పాకిస్తాన్లోని ఒక దర్గాకు వెళ్లినప్పుడు సందర్భానుసారంగా ఈ ఖవ్వాలిని పెట్టారు. ఇందులో మరో ప్రఖ్యాత గాయకుడు అద్నాన్ సమీ ఆ ఖవ్వాలి పాడే గాయకుడిగా కనిపిస్తాడు. సల్మాన్ ప్రత్యేకంగా కోరడంతో కాదనలేకపోయానని అద్నాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అది మాత్రమే కాక ఈ సినిమా కోసం ప్రీతమ్ చేసిన పాటలన్నీ మ్యూజిక్ చార్ట్స్లో హల్చల్ చేస్తున్నాయి. -
ఈద్సీజన్ను టార్గెట్ చేస్తున్న సల్మాన్
-
బాహుబలి సెకండ్పార్ట్లో సల్మాన్..?
-
మరో వివాదంలో సల్మాన్ ఖాన్
-
సల్మాన్ పిటిషన్పై వాదనలు వాయిదా
ముంబై : హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అప్పీలుపై వాదనలు జూలై 1వ తేదీకి వాయిదా పడ్డాయి. ముంబై హైకోర్టు సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 2002లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మద్యం సేవించి, నిర్లక్ష్యంగా కారు నడిపి ముంబైలో ఇద్దరు వ్యక్తుల మరణానికి దారి తీసిన హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. అయిదేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ మే 6 వ తేదీన జస్టీస్ డీడబ్ల్యూ దేశ్ పాండే తుది తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు 2002 నాటి సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ప్రభుత్వం నుంచి నియమితులైన న్యాయ సలహాదారులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర వివరాలను తెలుసుకునేందుకు దర్వేష్ అనే ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసుకున్న పిటిషన్ సందర్భంగా సల్మాన్ కేసుకు సంబంధించిన పేపర్లు కాలిపోయాయనే వార్తలు వివాదాన్ని రేపాయి. జూన్ 21, 2012న సచివాలయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో సల్మాన్ కేసు పేపర్లు బూడిద అయిపోయాయని ఆర్టీఐ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ కేసు నిష్పక్షిక విచారణపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. -
ఆడుకుంటూ అదృశ్యం అయిన చిన్నారులు
-
ఆడుకుంటూ అదృశ్యం అయిన చిన్నారులు
చిలకలగూడ (హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని వారాసిగూడ ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోయారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సల్మాన్(4), అమీర్(2), తమ ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యం కావడంతో వారి కోసం కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో చిన్నారుల తల్లి రేష్మాబేగం ఆదివారం సాయంత్రం చిలకలగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ట్రైలర్ అండ్ ఎర్రర్
జైలు గండం నుంచి బయట పడ్డాక కండల వీరుడు జై భజరంగ భళి అంటున్నారు. ఆయన కొత్త సినిమా ‘భజరంగీ భాయ్జాన్’ ట్రైలర్, పోస్టర్ రెండూ అభిమానులకు తెగ నచ్చేశాయి. మెడలో ఆంజనేయస్వామి గదతో పోలిన లాకెట్తో దర్శనమిచ్చారు. తన కుటుంబం నుంచి తప్పిపోయిన ఓ పాపను ఎలా మళ్లీ కలిపే పాత్రలో సల్మాన్ నటిస్తున్నారని ఈ ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. కానీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖ్ మాత్రం ఈ ట్రైలర్ విషయంలో పెదవి విరుస్తున్నారు. సినిమాలో తనది చాలా ముఖ్యమైన పాత్ర అయినా ట్రైలర్లో తక్కువ సేపు చూపించారని ఈ చిత్ర బృందం దగ్గర నవాజ్ తన అసంతృప్తిని వెల్లిబుచ్చారట. -
దుబాయ్కి సల్మాన్.. కోర్టు ఓకే
-
దుబాయ్కి సల్మాన్.. కోర్టు ఓకే
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ పరిస్థితి అన్నీ మంచి శకునములే అన్నట్టుగా ఉంది. ఈ కండల వీరుడికి దుబాయ్ వెళ్లేందుకు అనుమతి మంజూరుచేస్తూ ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్ సంబరాల్లో మునిగితేలుతున్నాడు. విదేశీ ప్రయాణానికి అనుమతిని కోరుతూ మే 21న సల్మాన్ ఖాన్ పెట్టుకున్న అర్జీకి ముంబై హైకోర్టు సానుకూలంగా స్పందించి, అనుమతిని మంజూరు చేసింది. కాగా హిట్ అండ్ రన్ కేసులో దోషిగా నిర్ధారణ అయ్యి శిక్షపడిన అనంతరం అతడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదనే నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో మే 29న జరగనున్న షో కోసం దుబాయ్ వెళ్లడానికి అనుమతిని కోరుతూ హైకోర్టులో సల్మాన్ పిటిషన్ దాఖలు చేశాడు. అనూహ్యంగా బెయిల్ లభించడంతో ఈ దబాంగ్ హీరో తన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పనిలో తలమునకలై ఉన్నాడు. -
సల్మాన్కి దీపూ నో చెప్పిందా?!
గాసిప్ సల్మాన్తో సినిమా అంటే దాని రేంజే వేరుగా ఉంటుంది. బడ్జెట్ కోట్లలో ఉంటుంది. బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలు కొట్టే అవకాశమూ మెండుగా ఉంటుంది. అందుకే హీరోయిన్లు సల్లూ పక్కన చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటిది దీపికా పదుకొనె సల్మాన్ పక్కన చేయడానికి నో చెప్పిందంటే ఆశ్చర్యం వేయదూ? అలాగే ఆశ్చర్యపోయారంతా. సుల్తాన్, శుద్ధి చిత్రాల్లో సల్మాన్ సరసన దీపిక నటిస్తోందన్న వార్తలు మొదట గుప్పుమన్నాయి. తర్వాత ఆమె నో చెప్పిందన్న వార్తలూ భగ్గుమన్నాయి. నిజానికి ఆ రెండు వార్తలూ తప్పేనట. అసలు దీపిక ఆ చిత్రాల్లో నటించడానికి ఒప్పుకున్నదీ లేదట. నో చెప్పిందీ లేదట. ప్రపోజల్స్ అయితే వచ్చాయి కానీ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉండటంతో కుదరలేదు, అంతమాత్రాన దీన్ని ఇష్యూ చేయాల్సిన పని లేదు అంటూ కుండ బద్దలు కొట్టేసింది దీపూ. మరి ఈ రూమర్లు ఎలా పుట్టాయనేగా? ఫిల్మ్ఫేర్ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి స్టేజ్మీద డ్యాన్స్ చేశారు. అది చూసిన కొందరు ఈ పుకార్లు పుట్టించారన్నమాట! -
సల్మాన్ ఖాన్ కు చుక్కెదురు
-
సల్మాన్ ఖాన్ కు చుక్కెదురు
జోధ్పూర్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు జోథ్ పూర్ కోర్టులో చుక్కెదురు అయ్యింది. హిట్ అండ్ రన్ కేసులో బెయిల్ తో సంబరాల్లో మునిగి తేలుతున్న సల్లూ భయ్యాకు కోర్టు షాక్ ఇచ్చింది. పదహారేళ్ల కిందట సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ పెట్టుకున్న పిటిషన్ ను తిరస్కరించింది. సాక్షులను మళ్లీ విచారించేందుకు అనుమతించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. కాగా అక్టోబర్, 1998లో జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో అక్కడి అడవిలో మూడు చింకారాలు, ఒక కృష్ణజింకను సల్మాన్ ఖాన్ వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్లూపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
షారుఖ్ ఏం చేశాడు క్యాట్?!
గాసిప్ బాలీవుడ్ ప్రపంచంలోకి సునామీలా దూసుకొచ్చి, కన్నుమూసి తెరిచేలోగా టాప్ హీరోయిన్ అయిపోయిన కత్రినా... అంతే వేగంగా వివాదాలలోనూ చిక్కుకుంది. సల్మాన్తో చెట్టాపట్టాలు, రణబీర్తో రహస్య ప్రేమతో వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు తాజాగా ఓ స్టార్ హీరోతో చేయడానికి నో చెప్పి మరోసారి న్యూస్లో నిలిచింది. నిన్నటివరకూ షారుఖ్ నటిస్తోన్న ఓ చిత్రంలో కత్రినా ఐటెమ్ సాంగ్ చేయబోతోందన్న వార్త హల్చల్ చేసింది. అయితే అలాంటిదేమీ లేదని, అది వట్టి పుకారని, కత్రినా చాలా బిజీగా ఉన్నందున ఐటెమ్ సాంగులు చేయబోదని మేనేజర్ ఇవాళ కుండ బద్దలు కొట్టేశాడు. అయితే బిజీగా ఉండటం వల్ల కాదని, నిజానికి కత్రినా షారుఖ్తో చేయడానికి ఇష్టపడలేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతగా వారిద్దరి మధ్య శత్రుత్వం ఏముందా అని కొందరు కూపీలు లాగే పనిలో కూడా పడ్డారు. -
'డబ్బున్నోళ్లు తాగి డ్రైవింగ్ చేసుకోవచ్చు'
-
మే 6న తేలిపోనున్న సల్మాన్ భవితవ్యం
-
మే 6న తేలిపోనున్న సల్మాన్ భవితవ్యం
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ భవితవ్యం మే 6వ తేదీన తేలిపోనుంది. సుమారు పదమూడేళ్లుగా సాగుతున్న హిట్ అండ్ రన్ కేసు విచారణకు ముంబై సెషన్స్ కోర్టు ఎట్టకేలకు ముగింపు పలకనుంది. 27 మంది సాక్షులను విచారించిన అనంతరం న్యాయస్థానం తుది తీర్పును మే 6న వెల్లడించనుంది. 2002 సెప్టెంబర్ 28న బాంద్రాలో జరిగిన యాక్సిడెంట్లో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఫుట్పాత్పై పడుకున్న ఐదుగురిపై నుంచి సల్మాన్ కారు టోయోటా ల్యాండ్ క్రూయిజర్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందగా, నలుగురికి గాయపడ్డారు. ఈ కేసు 13 ఏళ్ల నుంచి కోర్టులో విచారణ జరుగుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మద్యం సేవించి కారును నడిపారని పోలీసులు సల్మాన్పై అభియోగం మోపారు. దీనికి సంబంధించిన రక్త పరీక్షల రిపోర్టును కోర్టు ముందుంచారు. అయితే గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా ప్రమాదం జరిగిన సమయంలో కారును తాను నడపలేదని సల్మాన్ వాంగ్మూలమిస్తే , తానే నడిపానని సల్మాన్ డ్రైవర్ తెలిపాడు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. మరోవైపు కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలు తీర్పు ఎలా ఉంటుందోననే ఆందోళనలో ఉన్నారు. -
సల్మాన్ కేసులో ఈ నెల 20న తుది తీర్పు
-
వాహ్.. తాజ్ ఫలక్నుమా
షహర్కీ షాన్ ఫలక్నుమా ప్యాలెస్.. ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ స్పాట్. సల్మాన్ సోదరి అర్పితాఖాన్ వివాహం ఇక్కడ ఈనెల 18న జరగనున్న నేపథ్యంలో ప్యాలెస్ మరోసారి వార్తల్లోకెక్కింది. నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చరిత్రాత్మక కట్టడాలలో ఫలక్నుమా ప్యాలెస్ది ప్రత్యేక స్థానం. ఫలక్నుమా అంటే ఆకాశదర్పణం అని అర్థం. చార్మినార్ కట్టడానికి ఐదు కిలోమీటర్ల దూరంలో రెండు వేల అడుగుల ఎత్తయిన కొండపై దీన్ని నిర్మించారు. ఇటలీ వాస్తు నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్ను పై నుంచి చూస్తే తేలు ఆకారంలో కనిపిస్తుంది. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో ఆరో నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో హైదరాబాద్ ప్రధానమంత్రి, పైగా వంశస్తుడు సర్ వికార్ ఉల్ ఉమ్రా దీనిని నిర్మించారు. 1884 మార్చి 3న శంకుస్థాపన జరగగా 1893లో నిర్మాణం పూర్తయింది. అప్పట్లోనే దీని నిర్మాణానికి రూ.40 లక్షలు ఖర్చయ్యాయి. ఎంతో అందంగా తయారైన ఈ రాజ భవనాన్ని ఉమ్రా.. మీర్ మహబూబ్ అలీఖాన్కు 1895లో బహుమానంగా ఇచ్చారు. దీంతో 1898లో నిజాం నవాబు ఫలక్నుమా ప్యాలెస్ను తన గెస్ట్హౌస్గా మలచుకున్నారు. జీవిత చరమాంకాన్ని ఇదే ప్యాలెస్లో గడిపిన ఆయన, 1911లో ఇక్కడే తుదిశ్వాస విడిచారు. ప్యాలెస్కు స్వాగత తోరణంగా ఉన్న కమాన్ను ప్రస్తుతం ఫలక్నుమా ఆర్టీసీ బస్ డిపోకు ప్రవేశద్వారంగా మార్చారు. ప్రస్తుతం తాజ్ ఫలక్నుమా.. ఫలక్నుమా ప్యాలెస్.. నాలుగేళ్ల క్రితం తాజ్ ఫలక్నుమా ప్యాలెస్గా మారింది. ఏడో నిజాం మనుమడు ప్రిన్స్ ముఖరం జా అధీనంలో ఉన్న ఈ ప్యాలెస్ను నాలుగేళ్ల కిందట తాజ్ గ్రూప్నకు లీజుకిచ్చారు. దీంతో శుభకార్యాలు, బోర్డు సమావేశాలు, విందులు, వినోదాలకు ఈ ప్యాలెస్ వేదికైంది. నగరంలోని అత్యంత ఖరీదైన హోటళ్లలో ఈ ప్యాలెస్ ఒకటి. నిజాం ఉపయోగించిన వస్తువులను, క్రీడాపరికరాలను, వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన వస్తువులను, పుస్తకాలను ప్యాలెస్లో ఏర్పాటు చేశారు. ఈ హోటల్లో ప్రధాన సూట్లతో పాటు 60 రూమ్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. అద్దె రూ.20 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంది. నిజాం కాలం నాటి రాచమర్యాదలను ఈ హోటల్లో అందుకోవచ్చు. స్పెషల్ బాత్, స్పా, జావా, హెల్త్క్లబ్, స్విమ్మింగ్పూల్, స్మోకింగ్ ఏరియా, ఇటాలియన్ రెస్టారెంట్, హైదరాబాద్ స్పెషల్ (అదా) రెస్టారెంట్లు ఉన్నాయి. నిజాం నవాబుతో పాటు బేగం ఉపయోగించిన పరికరాలనూ ప్రదర్శనకు ఉంచారు. నిజాం ఉపయోగించిన టేబుళ్లు, కుర్చీలను అతిథులూ వాడుకోవచ్చు. గేమ్స్ రూమ్ ప్యాలెస్లో ఇండోర్ గేమ్స్ రూమ్ ఓ అద్భుతం. నిజాం లండన్ నుంచి తెప్పించిన స్నూకర్, ఇటలీ నుంచి తెప్పించిన చెస్ బోర్డ్ ఇందులో ఏర్పాటు చేశారు. బంగారు, వెండి తీగలతో రూపొందించిన హుక్కా ఏర్పాటు చేసి అతిథులకు అందిస్తున్నారు. ఇందులో ఏనుగు దంతం, పాలరాతితో చెక్కిన చెస్ కాయిన్స్ ఉన్నాయి. అదా రెస్టారెంట్ ప్యాలెస్లో అదా రెస్టారెంట్కు తాజ్ గ్రూపు ప్రత్యేక స్థానం ఇచ్చింది. ఇందులో హైదరాబాద్ రుచులైన బిర్యానీ, పత్తర్కీ మటన్, ధమ్కీ చికెన్ తదితర వంటకాలతో పాటు ఆంధ్రాభోజనాన్నీ అందిస్తున్నారు. దీని పక్కనే చెలాస్రే రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. స్మోకింగ్ ఏరియా ప్యాలెస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అందమైన గార్డెన్ను స్మోకింగ్ జోన్గా వ్యవహరిస్తున్నారు. సంధ్య వేళలో దమ్ములాగుతూ.. నగర అందాలను వీక్షించవచ్చు. నిజాం సూట్ ప్యాలెస్లో నిజాం సూట్ అన్ని సూట్లలో (నంబర్ 204)లలో ఖరీదైనది. దీని అద్దె రోజుకు రూ.5 లక్షలు. ఈ సూట్లో నిజాం ఉపయోగించిన వస్తువులతో పాటు వివిధ దేశాల నుంచి సేకరించిన వస్తువులను అలంకరించారు. సూట్ పక్కనే అక్బర్ సూట్, షాజాదీ సూట్ ఇతర సూట్లు ఉన్నాయి. వీటితో పాటు 60 సూట్లు ఉన్నాయి. ప్యాలెస్లో స్పా.. ప్యాలెస్లో పూర్తి ఇండియన్ స్టైల్లో నిర్వహించే స్పా, యోగా సెంటర్ ఉన్నాయి. రెండున్నర గంటల పాటు నిర్వహించే స్పా కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాలి. -కర్నాటి శ్రీనివాసగౌడ్ అతిపెద్ద డైనింగ్ హాల్ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో నిజాం ఉపయోగించిన అతిపెద్ద డైనింగ్ హాల్ను అద్దెపై వినియోగించుకునే వీలు కల్పించారు. ఒకేసారి నూటొక్క (101) మంది అతిథులు ఈ హాల్లో విందారగించవచ్చు. పూర్తి ఇటాలియన్ ఫర్నిచర్, తొమ్మిది దేశాల నుంచి తీసుకొచ్చిన వస్తు సామగ్రి ప్రత్యేక ఆకర్షణ. 33 మీటర్ల పొడవైన ఈ డైనింగ్ హాల్లోనే నిజాం తన బంధువులు, విదేశీ అతిథులకు ఆతిథ్యమిచ్చేవారు. మార్బుల్ మెట్లు.. ప్యాలెస్లో కేవలం నాలుగు ఫిల్లర్లపై ఉన్న స్టేర్ కేస్ ప్యాలెస్ అందాన్ని ఇనుమడింప చేస్తోంది. ఇటలీ మార్బుల్తో ఏర్పాటు చేసిన ఈ స్టేర్ కేస్ పైనున్న దర్బార్ హాల్ టీ సెక్షన్కు వెళ్తుంది. మహల్లో లైబ్రరీ.. నిజాం వివిధ దేశాల నుంచి సేకరించిన 900 గ్రంథాలతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో పార్సీ, అరబిక్, ఉర్దూలలో లిఖించిన పుస్తకాలున్నాయి. ఇందులో 1911 నుండి 1951 వరకు ప్యాలెస్ను సందర్శించిన వారి వివరాలతో కూడిన విజిటర్ బుక్ సైతం ఉంది. -
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ అరెస్ట్
-
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ అరెస్ట్
హైదరాబాద్ : ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కోసం జిహాదీ గ్రూప్లతో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఓ యువకుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్కు చెందిన గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సల్మాన్ యత్నిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గత కొన్నిరోజులుగా సల్మాన్ కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో అతడు జరుపుతున్న సంభాషణలపై కూడా ఆరా తీశారు. చివరికి అసలు విషయం నిర్ధారణ కావటంతో సల్మాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కోసం జిహాదీ శిక్షణ తీసుకోవడానికి ఇద్దరు యువకులు మహారాష్ట్ర నుంచి ముందుగా హైదరాబాద్ వచ్చి, పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. -
మేనమామ కిరాతకం
డబ్బు కోసం అక్క కుమార్తె కిడ్నాప్ రక్త సంబంధాన్ని మరచి ఉసురు తీసిన దుర్మార్గుడు సహకరించిన భార్య నిందితుల అరెస్ట్ బెంగళూరు : ప్రేమాను రాగాలు, రక్త సంబంధాలు మరచిన సొంత మేనమామ డబ్బు కోసం ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చిన సంఘటన నగరంలో సం చలనం సృష్టించింది. భారతీనగర తిమ్మయ్య రోడ్డులో నివాసం ఉంటున్న సల్మాన్ (28) అతని భార్య షబ్రీన్ (25)ను అరెస్టు చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుడు సల్మాన్ తన అక్క చివరి కుమార్తె రితిభ నిస్సార్ (7)ను గొంతు నులిమి హత్య చేశాడు. వివరాలు... సల్మాన్ అక్క భర్త నిషార్ సివిల్ ఇంజినీరు. పదేళ్లుగా దుబాయ్లో ఉంటూ భారీగానే ఆస్తులు కూడా బెట్టాడు. నిస్సార్ దంపతులకు నలుగురు పిల్లలు. చివరి అమ్మాయి రితిభ ఇక్కడి అశోక్నగరలోని ధనరాజ్ పూల్చంద్ హిందీ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. ఇదిలా ఉంటే సల్మాన్ అక్వేరియం చేపలు విక్రయించే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. బావ దగ్గర ఉన్న డబ్బుపై వ్యామోహం పెంచుకున్న సల్మాన్ ఎలాగైనా అతని వద్ద నుంచి డబ్బు రాబట్టలాని భావిం చాడు. దీని కి భార్య సైతం సహకరిస్తానని చెప్పడంతో చిన్నారి రితిభను కిడ్నాప్ చేసి నగదు డిమాండ్ చేయాలని సల్మాన్ ప్లాన్ వేశాడు. వారం రోజులుగా నిస్సార్ కుటుం బంపై నిఘా పెట్టారు. బుధవారం మధ్యాహ్నం రితిభ చదువుతున్న పాఠశాలకు వెళ్లిన సల్మాన్ భార్య షబ్రీన్, తాను రితిభ పిన్నమ్మగా పరిచయం చేసుకుని రితిభ అవ్వ ఛాతీనొప్పితో ఆస్పత్రిలో చేరిందని బాలికను పం పించాలని కోరింది. అదే పాఠశాలలో చదువుతున్న రితి భ అక్క రంజాన్ దీక్షలో ఉండటంతో ఆమెకు విషయం చెప్పలేదని టీచర్ను నమ్మించింది. అనంతరం బాలికను తీసుకుని అక్కడి నుంచి మాయమైంది. అప్పటి నుంచి సల్మాన్ తనఅక్క సెల్కు రూ. 10 లక్షలు ఇస్తే బాలికను వదిలి పెడతానని ఎస్ఎంఎస్ వేయడం మొదలు పెట్టా డు. అయితే ఇదేమి పట్టించుకోని ఆమె మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లగా కుమార్తెను ఓ యువతి తీసుకెళ్లిందని చెప్పడంతో కంగుతింది. బుర్కా ధరించిన మహిళ వచ్చి తీసుకెళ్లిందని పాఠశాల సిబ్బంది చెప్పడంతో వారు అశోక్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సల్మాన్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఏమీ తెలియని అమాయకుడిలా నటించాడు. అతని వ్యవహార శైలిని అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపెట్టాడు. అప్పటికే కిరాతకుడు బాలికను గొంతునులిమి చంపి భారతినగరలోని ఇంటిలో దాచాడు. తమను గుర్తు పడుతుందని రితిభను హత్య చేశామని సల్మా న్, షబ్రీన్ పోలీసుల ఎదుట అంగీకరించారు. పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొబైళ్లు ఫోన్లు, సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఔరాద్కర్ చెప్పారు. పిల్లలు లేని వీరు రితిభను ఎంతో అప్యాయంగా చూసుకునేవారని, దత్తతు ఇవ్వాలని కోరేవాడని తమ విచారణలో తేలిందని కమిషనర్ తెలిపారు. డీసీపీ రవికాంత్గౌడ నేతృత్వంలో ఏసీపీలు సిద్ధరామయ్య, శోభారాణి ఆధ్వర్యంలోని బృందం నిందితులను అరెస్ట్ చేశారు. -
కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న మమ్ముట్టీ వారసుడు
-
సిబల్ ఆల్బమ్ విడుదల కార్యక్రమంలో సల్మాన్, రెహ్మాన్
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్-సల్మాన్ ఖాన్
-
కుప్పకూలిన భవనం ఇద్దరి మృతి
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో 50 ఏళ్ల క్రితం నిర్మించిన మూడంతస్తుల భవనం బుధవారం కుప్పకూలడంతో ఇద్దరు చనిపోయారు. సెంట్రల్ ఢిల్లీలోని సదర్ బజార్లో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. భవనం కూలినప్పుడు ఏదో ప్రకంపనం వచ్చినట్టుగా అనిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. శిథిలావస్థకు ఈ భవనం చేరుకుందని, స్థానికులను తరలించాలని కార్పొరేషన్ సిబ్బందికి తెలిపినా పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. ‘ఈ భవనం తర్వాత ఓ ఇంటిని నిర్మిస్తున్నారు. ఆ ఇంటి పునాది కోసం భూమిని కాంట్రాక్టర్లు తవ్వారు. దీనివల్ల ఈ భవన పునాదిలో కదలిక వచ్చి కూలి ఉండొచ్చ’ని చెప్పారు. ఈ ప్రమాద సమయంలో నక్కి (60), ఆయన కుమారులు బంటీ (35), సల్మాన్ (28)లు భవనంలోనే ఉన్నారని తెలిపారు. బంటీ, సల్మాన్ భార్యలు ఏదో పనిమీద బయటకు వెళ్లడంతో వారికి ప్రాణాపాయం తప్పిందన్నారు. అయితే భవన శిథిలాల నుంచి బంటీ, సల్మాన్లను బయటకు తీసుకొచ్చిన సిబ్బంది సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించారు. అయితే నక్కి అప్పటికే శిథిలాల కింద మరణించాడు. ఆస్పత్రికి తీసుకొచ్చిన తర్వాత బంటీ చికిత్స పొందుతూ మరణించాడు. సల్మాన్కు స్వల్ప గాయాలయ్యాయని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ వీకే సింగ్ తెలిపారు. సర్దార్ బజార్ మార్కెట్లో నక్కీ జ్యువెల్లరీ దుకాణం నడిపిస్తున్నాడు. ఈ శిథిలాల సహాయక చర్యల్లో ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ ప్రకృతి విపత్తు నిర్వహణ విభాగ అధికారులు పాల్గొన్నారు.