samineni udayabhanu
-
చంద్రబాబు హయాంలో రైతులు కరవుతో ఇబ్బందులు పడ్డారు : ఉదయభాను
-
మాపై తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు
-
ప్రభుత్వ విప్ ఉదయభానును అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును తెలంగాణ సరిహద్దు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భూభాగం గుండా టీఎస్ పోలీసులు అనుమతించకపోవటంతో కృష్ణా జిల్లా ముత్యాల నుండి గుంటూరు జిల్లా మాదిపాడుకు కృష్ణా నదిలో పడవ ద్వారా పులిచింతల ప్రాజెక్టు వద్దకు సామినేని చేరుకున్నారు. అడ్డుకోవడం దారుణం... పులిచింతల వద్ద తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని.. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణమని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలవకుండా విద్యుదుత్పత్తి వల్ల నీరు వృథా అవుతోందన్నారు. విభజన హామీలను తెలంగాణ తుంగలో తొక్కుతోందని.. బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారం నీటిని వాడుకోవాలని ఉదయభాను అన్నారు. ‘‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జలయజ్ఞంలో భాగంగా పులిచింతల నిర్మించారు. తెలంగాణలోనే వైఎస్ ఎక్కువ ప్రాజెక్టులు కట్టారు. తెలంగాణ మంత్రులు నేతలు వైఎస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. వైఎస్ గురించి మాట్లాడిన మాటలు సబబు కాదు. కేసీఆర్ కూడా ఈ అంశంపై పునరాలోచించాలి. శనివారం ఒక్కరోజే ఒక టీఎంసీ వృధా చేశారు. ఒక టీఎంసీ పదివేల సాగుకు ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు 75 టీఎంసీలు వృధా చేశారు. ఇరు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉండాలని సీఎం జగన్ చెప్పారు. దేవుడు చెప్పినా వినం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని’’ సామినేని హితవు పలికారు. -
నిమ్మగడ్డ ఏకపక్ష ధోరణి సరికాదు: సామినేని
సాక్షి, కృష్ణా జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఏకపక్ష ధోరణి సరికాదని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హితవు పలికారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆయన దుయ్యబట్టారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు’ రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కరోనా ప్రారంభ దశలో ఎన్నికలు నిలిపివేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వంతో చర్చించాలని, ప్రభుత్వ ఉద్యోగుల అభ్యర్థన పరిగణనలోకి తీసుకుని ఎన్నికలపై పునరాలోచించాలని సామినేని ఉదయభాను కోరారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్) -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 30మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారందరినీ పడినవారిని చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ...క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు విశాఖ, ఒడిశాకు చెందినవారుగా గుర్తించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానిపై డ్రైవర్ దగ్గర కనీసం సమాచారం కూడా లేదన్నారు. ప్రయాణికుల పేర్లు, వివరాలు...కనీసం ఫోన్ నెంబర్లు కూడా లేవని అన్నారు. తమకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని, నియమ నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. -
సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి నాని
సాక్షి, కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడులో ఈనెల 21న సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవిలత, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేపడుతోంది. బ్రిటిష్ కాలంలో ఉన్న సర్వేలతోనే నేటి వరకు రికార్డులు ఉన్నాయి. రైతుల మధ్య సరిహద్దు గొడవలు ఉండటం, కోర్టులు చుట్టూ తిరిగి సమయం వృధా, ధనం వృధా అవుతోంది. వీటి శాశ్వత పరిష్కారం కోసం అత్యాధునిక పరికరాలతో శాటిలైట్ ద్వారా ఈ సర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నాము. వివాదాలు లేకుండా చేసి ఆస్తిపై యజమానులకు హక్కు కల్పించే దిశగా ఈ సర్వే జరుగుతుంది' అని మంత్రి నాని వెల్లడించారు. ప్రభుత్వవిప్ ఉదయభాను మాట్లాడుతూ.. ప్రతి రైతుకు భూమిపై హక్కు కల్పించే విధంగా సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు సీఎం నిర్ణయించారు. ప్రతీ ఇంటిని కూడా సర్వే నిర్వహించి శాశ్వత హక్కు కల్పించే విధంగా కార్డులు జారీ చేయడం జరుగుతుంది' అని ఉదయభాను తెలిపారు. -
'మహిళలను జీవితాలను మార్చడానికే ఆ పథకం'
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 60, 62వ డివిజన్లలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యఅతిధిగా హాజరై వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీరో వడ్డీ, ఆసరా, చేయూత వంటి పథకాలతో సీఎం జగన్ పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలిచారు. సెంట్రల్ నియోజక వర్గంలో ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో 130 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు ఇవ్వనున్నారు. మొదటి విడతలో రూ.28 కోట్లు జమచేశారు. మహిళల జీవన స్థితిగతులను మెరుగు పరచాలని సీఎం ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అభివృద్ధి పథంలో పాలన చేస్తుంటే ప్రతిపక్షాలు ఆటంకాలు సృష్టిస్తున్నాయి. వ్యవస్థలను మ్యానేజ్ చేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు' అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. (దమ్ముంటే విచారణ చేయండి అన్నారు) ►కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణం నకాశి బజార్లో 12, 13 వార్డు సచివాలయాల్లో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు. కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణంలో 740 స్వయం సహాయక సంఘాలకు 6 కోట్ల రూపాయల చెక్కును పంపిణీ ప్రభుత్వ విప్ ఉదయభాను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సామినేని వెంకట కృష్ణ ప్రసాద్, తన్నీరు నాగేశ్వరరావు, ముత్యాల వెంకటాచలం, తుమ్మల ప్రభాకర్, కటారి హరిబాబు పాల్గొన్నారు. ►పెనమలూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డ్వాక్రా మహిళలు... సీఎం వైఎస్ జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాము అని తెలిపారు. -
‘తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదు’
సాక్షి, విజయవాడ: కుల రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదన్నారు.‘‘ ప్రమాదం జరిగినప్పుడు బాధితులను పరామర్శించాల్సిన చంద్రబాబు హైదరాబాద్లో దాగున్నాడు. చంద్రబాబు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎందుకు ఉంటుంది. ఆయనకు అందరూ సమానమే. రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వలనే 10 మంది ప్రాణాలు కోల్పోయారని’’ జోగి రమేష్ ధ్వజమెత్తారు. (చదవండి: ఆయన ‘ఎల్జీమర్’తో బాధపడుతున్నారు) చంద్రబాబుది ద్వంద్వ విధానం: ఎమ్మెల్యే సామినేని ఉదయభాను స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ద్వంద్వ విధానాన్ని పాటిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో యాజమాన్యాన్ని అరెస్ట్ చేయమని డిమాండ్చేసిన చంద్రబాబు.. రమేష్ ఆసుపత్రి ప్రమాదంలో యాజమాన్యాన్ని వెనకేసుకువస్తున్నారని విమర్శించారు. ఆయన పార్టీ నాయకుడు కాబట్టే డాక్టర్ రమేష్ను చంద్రబాబు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ ముఖ్యమంత్రి చేయనంత సాయాన్ని ఎల్జీ పాలిమర్స్, స్వర్ణప్యాలెస్ ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ చేశారని ఎమ్మెల్యే సామినేని తెలిపారు. -
'నా ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు'
సాక్షి, కృష్ణా: కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రోజున ఆయన మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. తనకు జూలై 26వ తేదీన కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిపారు. తాను చాలా ధైర్యంగా ఉన్నానని, ప్రజలు ఎవరూ కూడా తన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పద్నాలుగు రోజుల హోం ఐసొలేషన్ తర్వాత కరోనా పరీక్ష చేయించడంతో నెగిటివ్గా నిర్దారణ అయిందన్నారు. త్వరలోనే మీ ముందుకు వస్తాను. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉండి, భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే దాచుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కరోనా పరీక్షలు చేసుకున్న వ్యక్తులు రిపోర్టులు వచ్చేంత వరకు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వ్యక్తులు వారి ప్లాస్మాని మరొకరికి దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. (అగ్నిప్రమాదంలో సామినేని సన్నిహితుడు మృతి) -
అందుకు ఈ రహస్య భేటీ నిదర్శనం: ఉదయభాను
సాక్షి, కృష్ణా: ముగ్గురు చౌదరీల రహస్య భేటీకి చంద్రబాబు నాయుడే సూత్రధారి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్, బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిల రహస్య భేటీ వెనక కుట్రకోణం ఉందన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటపడటంతో నిమ్మగడ్డ బండారం బట్టబయలైందన్నారు. చంద్రబాబు చేతుల్లో నిమ్మగడ్డ కీలుబొమ్మగా మారాడన్న అనుమానం నిజమని తేలిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డ రమేష్పై తక్షణమే విచారణ జరిపించాలన్నారు. (నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్) ఇక సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు నిపుణుడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మనుషులను వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం చేశారనేందుకు రహస్య భేటీ ఓ నిదర్శనమని స్పష్టం చేశారు. చంద్రబాబు మాటలు వినే నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను అనైతికంగా వాయిదా వేశారని మరోసారి ప్రస్తావించారు. (వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?) -
ఎల్లో మీడియాది తప్పుడు ప్రచారం : శ్రీదేవి
సాక్షి, అమరావతి : అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గుర్తుచేశారు. వైఎస్సార్సీసీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడి సృష్టిస్తోందన్నారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రయోజనాలు కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని ఉపయోగించాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి చేరువయ్యేలా చూడాలని కోరారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగానే చూశాయని.. కానీ సీఎం వైఎస్ జగన్ మాత్రం తలెత్తుకునేలా చేశారని అన్నారు. గతంలో ఎందరో ముఖ్యమంత్రుల వచ్చారు.. వెళ్లారు.. కానీ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం చరిత్రలో నిలిచిపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, ప్రీ కరెంట్ వంటి పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే బాటలో ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తృతం చేయడమే కాకుండా.. చికిత్స తర్వాత కూడా విశ్రాంతి తీసుకుంటున్నవారికి భృతి కల్పిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాడానికి సంకల్పించారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్నా భోజనం అందుతుదని పేర్కొన్నారు. ప్రజలకు నిజమైన సంక్రాంతి వచ్చింది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడితో నిజమైన రాష్ట్ర ప్రజలకు ముందుగానే సంక్రాంతి పండగ వచ్చిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ విద్యా దీవెన, విద్యా వసతితో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేదలకు వరంగా మారాయని చెప్పారు. భావితరాలకు అమ్మ ఒడి పథకం ఎంతో మేలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: చంద్రబాబుకు ఎమ్మెల్యే రజనీ చురకలు ‘అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం’ హీనమైన చరిత్ర టీడీపీది: సీఎం జగన్ టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా -
ఆ భయంతోనే బాబు దాడులు చేయిస్తున్నారు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు పిన్నెల్లి కాన్వాయ్పై రాళ్లదాడి చేయడాన్ని సర్వత్రా నాయకులు, ప్రజలు ఖండిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తీవ్రంగా ఖండించారు. రైతుల ముసుగులో తెలుగుదేశం గూండాలే ఈ దాడులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. అమరావతి ప్రాంతంలో భూ కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయన్న భయంతోనే చంద్రబాబు తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నారని, అమరావతిలో భయానిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్హన్రెడ్డి ముందుకువెళ్తుంటే.. ప్రజలు తిరస్కరించిన చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. రామకృష్ణారెడ్డి కాన్వాయ్పై దాడులకు దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ దాడి కచ్చితంగా టీడీపీ గూండాల పనేనని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు నీచరాజకీయాలు చేస్తున్నారని, రైతులను రెచ్చగొట్టేవిధంగా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల ముసుగులో టీడీపీ గుండాలతో చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. రైతులను తమ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకొంటుందన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ తీవ్రంగా ఖండించారు. ఇది పిరికి పందల చర్య అని, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన పేర్కొన్నారు. -
వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం : మంత్రి
సాక్షి, అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఏపీ శాసనసభ మూడోరోజు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఆదిమూలపు సురేష్ సమాధానమిచ్చారు. కర్నూలు జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్తో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కాటసాని కోరగా.. కర్నులు జిల్లాలోని శకునాల గ్రామంలో సోలార్ పార్క్ కోసం భూసేకరణ పూర్తయిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని చెప్పారు. క్లీనింగ్కు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగిందని తెలిపారు. భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. త్వరలో ఈ విషయంపై చర్చించి అందరికీ న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. మంత్రుల కమిటీని నియమించాం.. ఎయిడెడ్ కాలేజీల్లోపనిచేసే అధ్యాపకుల జీతాలు పెంచాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. వారికి కనీసం రూ.20 వేల జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసే విషయమై ముఖ్యమంత్రి మంత్రుల కమిటీని నియమించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. స్టూడెంట్స్, టీచర్స్ నిష్పత్తి కారణంగా నాణ్యతా ప్రమాణాలు తగ్గుతున్నాయని అన్నారు. త్వరలోనే వీటన్నింటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగుపరుస్తామని మంత్రి చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. -
‘మహిళల జీవితాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి ’
సాక్షి, కృష్ణా: జగ్గయ్యపేట పట్టణంలో ప్రభత్వవిప్ సామినేని ఉదయభానుతో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న ఆశయంతో నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధాన్ని విధించి మహిళల జీవితాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని గుర్తు చేశారు. ఉదయభాను మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పరిపాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామినేని ప్రశాంత్ బాబు, తన్నీరు నాగేశ్వరావు, జాన్ వెస్లీ, వేల్పుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జగ్గయ్యపేట ముంపు గ్రామాల్లో సామినేని పర్యటన
సాక్షి, కృష్ణా: కృష్ణా నది వరదల నేపథ్యంలో జగ్గయ్యపేట మండలంలో ముంపుకు గురైన రావిరాల, వేదాద్రి, ముక్త్యాల గ్రామాలలో ప్రభుత్వ విప్ సామనేని ఉదయభాను శనివారం పర్యటించారు. రావిరాల గ్రామంలో వరద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ముంపుకు గురైన వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలను పరిశీలించారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేoద్రాలను, మెడికల్ క్యాంప్లను సందర్శించి అధికారులతో మాట్లాడారు. ఉదయభాను తన సొంత ఖర్చుతో వరద బాధితులకు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన కుమారులు వెంకట కృష్ణప్రసాద్, ప్రశాంత్ బాబులు సైతం ముంపు గ్రామాలను సందర్శించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ వరదల వల్ల ఇళ్ళు కోల్పోయిన వారిని ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులతో విచారణ చేయించి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తామని ఉదయ భాను అన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షించడం జరిగిందని, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అలాగే వైయస్సార్ సీపీ పార్టీ శ్రేణులు వరద ముంపుకు గురైన గ్రామాలలోని ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఉదయభాను పిలుపునిచ్చారు. రావిరాలలో వరద ముంపు బాధితులకు వైఎస్సార్సీపీ శ్రేణులు పులిహోర పొట్లాలు పంపిణీ చేశాయి. -
‘భూమిపై అన్నిరకాల హక్కులు రైతులకే’
సాక్షి, అమరావతి : భూమిపై అన్నిరకాల హక్కులు యజమానికే ఉంటాయని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. పంటమీద మాత్రమే కౌలు రైతులకు హక్కు ఉంటుందని చెప్పారు. కౌలు రైతుల రక్షణ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిల్లును ప్రవేశపట్టిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... భూ యనమానుల హక్కులకు నష్టం కలగకుండా కౌలు రైతులకు రక్షణ కల్పించేలా చట్టం రుపొందించామని తెలిపారు. భూ యజమాని, కౌలుదారులకు ఇద్దరికీ ఈ బిల్లుతో ప్రయోజనం ఉంటుందన్నారు. గతంలోని కౌలుదారి చట్టం వలన భూ యజమానులకు అభద్రతాభావం ఏర్పడిందని, అందుకే కౌలు రైతులను యజమానులు నమ్మలేదన్నారు. తాము తెచ్చిన నూతన చట్టం వలన ఇద్దరికి మేలు చేస్తుందన్నారు. భూ రికార్టుల్లో ఎక్కడా కూడా కౌలు రైతు పేరు ఉండదన్నారు. పంటరుణం తప్ప మిగిన రుణాలన్ని భూ యజమాని తీసుకోవచ్చని తెలిపారు. రైతు భరోసా, పంట రుణాలు సాగుదారులకే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమై చట్టాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కౌలు రైతులకు మంచి వెసులుబాటు కలుతుంది : ధర్మాన పంటసాగుదారుల రక్షణ చట్టం తేవడం మంచి పరిణామమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ఈ చట్టంతో కౌలు రైతులకు మంచి వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ చట్టం ద్వారా అన్ని సబ్సిడీలు కౌలు రైతుకు అందుతాయని చెప్పారు. ప్రభుత్వం అందజేసే సహాయం నిజమైన రైతులకు అందేలా చట్టం తీసుకొచ్చారని ప్రశంసించారు. సమాజంలో కలిసిపోయిన నాయకుడే ఇలాంటి చట్టాలు తీసుకురాగలరని అన్నారు. పీవోటీ యాక్ట్ పరిధిలోని భూములను సాగుచేస్తున్న రైతులు కూడా లాభపడేలా ఈ చట్టంలో సవరణ తీసుకురావాలని కోరారు. రైతులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ : సామినేని పంటసాగుదారుల రక్షణ చట్టంతో యజమాని, కౌలుదారులకు ఇద్దరికీ ప్రయోజనం కలుగుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను అన్నారు. కౌలు రైతులకు కార్డులే కాకుండా హక్కులు కూడా కల్పించడం శుభపరిణామమన్నారు. ఇన్పుట్ సబ్సిడీని కౌలు రైతులకు అందేలా చట్టబద్ధత కల్పించామన్నారు. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ సీఎం జగన్ రైతుకు అండగా నిలిచారని ప్రశంసించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. -
జగ్గయ్యపేటలో పేట్రేగిపోతున్న ఇసుకమాఫియా
-
బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ కుట్రలు
-
అందుకే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ, వామపక్షాలు , ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన ఏపీ బంద్( ఏప్రిల్ 16న)కు ప్రజల నుంచి వస్తోన్న మద్ధుతును చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..రేపు జరిగే బంద్ను వైఎస్సార్సీపీ శ్రేణులు విజయవంతం చేస్తాయని తెలిపారు. బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. బంద్లో పాల్గొంటే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని వెల్లడించారు. బంద్ను అన్నివిధాలా విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతారని విమర్శించారు. -
న్యాయమే గెలిచింది: సామినేని
సాక్షి, కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో న్యాయమే గెలిచిందని వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయబాను అన్నారు. ఎన్నికలను వాయిదా వేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ చాలా కుట్రలు చేసిందని తెలిపారు. తమ పార్టీ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ కొత్త డ్రామాలకు తెరలేపిందన్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్లో మున్సిపల్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. -
సామినేని ఉదయభానుకు వైఎస్ జగన్ పరామర్శ
జగ్గయ్యపేట : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభానును పరామర్శించారు. సామినేని ఉదయభాను తండ్రి సామినేని విశ్వనాథం అస్వస్థతతో ఇవాళ ఉదయం మృతి చెందారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పంచాయతీ కి సామినేని విశ్వనాధం ఇరవై రెండు సంవత్సరాల పాటు సర్పంచ్ గా పనిచేశారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా కూడా పని చేశారు. జగ్గయ్యపేట కు ఆయన హయాంలోనే రక్షిత మంచినీటి పథకం, విద్యా, వైద్యశాలలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో విశ్వనాధంకు అత్యంత సాన్నిహిత్యం వుంది. ఆయన అకాల మరణ వార్త తెలియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ హుటాహుటిన జగ్గయ్యపేటకు చేరుకుని ఉదయభాను కుటుంబాన్ని పరామర్శించారు. విశ్వనాధం మృతదేహానికి నివాళి అర్పించారు. వైఎస్ జగన్ తో పాటు పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే రక్షణనిధి, జోగి రమేష్, సింహాద్రి రమేష్, గౌతం రెడ్డి, తోట శ్రీనివాస్, ఉప్పాల రాము తదితరులు విశ్వనాథం మృతదేహానికి నివాళి అర్పించారు. -
డీజీపీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు
విజయవాడ: వైఎస్సార్ సీపీ నేతలు జోగి రమేశ్, సామినేని ఉదయభాను, అరుణ్ కుమార్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావును కలిశారు. నందిగామ పర్యటన సందర్భంగా తమ పార్టీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరారు. అకారణంగా తమ పార్టీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించారని డీజీపీకి వివరించారు. -
‘ఆంధ్రా నయీంలుగా దందాలు సాగిస్తున్నారు’
విజయవాడ: క్విట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం పేరుతో చంద్రబాబు నాయుడును త్వరలోనే తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఆందోళనలో పాల్గొనే విద్యార్థులను జైల్లో పెడతాననడం అమానుషమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. టీడీపీ శాసనసభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సామినేని ఉదయభాను విమర్శించారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కోడెల శివప్రసాదరావు తనయుడు ఆంధ్రా నయీంలుగా దందాలు సాగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రత్యేకహోదా సమావేశాలకు విద్యార్థులు హాజరైతే జైలుకు వెళ్లక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిదండ్రులను హెచ్చరించిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యునిగా చంద్రశేఖర్
♦ ప్రధాన కార్యదర్శిగా సామినేని ♦ యువజన విభాగం అధ్యక్షునిగా జక్కంపూడి రాజా నియామకం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యునిగా గుంటూరు జిల్లాకు చెందిన గుబ్బా చంద్రశేఖర్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రశేఖర్ గతంలో ఏపీపీఎస్సీ సభ్యునిగా పనిచేశారు. కాగా కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానును రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి రాజాను రాష్ట్ర పార్టీ యువజన విభాగం అధ్యక్షునిగా, విజయవాడ వెస్ట్కు చెందిన పైలా సోమినాయుడును రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా జగన్మోహన్రెడ్డి నియమించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. విజయవాడ సిటీ అధ్యక్షునిగా రాధా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర విభాగం అధ్యక్షునిగా వంగవీటి రాధాకృష్ణను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు పార్టీ కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
అధికార పార్టీ ఆదేశాలతోనే అరెస్టులు
వైఎస్సార్ సీపీ నాయకుడు సామినేని జగ్గయ్యపేట అర్బన్ : వైఎస్సార్ సీపీకి చె ందిన సానుభూతి పరుల వ్యాపారం అనే దుగ్ధతతోనే అధికారపార్టీ వారు పోలీసులతో అక్రమంగా కేసులు నమోదు చేయిస్తూ అరెస్టులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉదయభాను విలేకరులతో మాట్లాడుతూ చైర్మన్ తన్నీరు అక్రమ అరెస్ట్ అప్రజాస్వామ్యమన్నారు. అధికార పార్టీ నేతలు రెండేళ్లుగా నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రస్తుతం సిటీ కేబుల్ తెలుగుదేశం వారికి సంబంధించింది కావడంతో తమ పార్టీవారి ప్రకటనలు తీసుకోవడంలేదని, దీంతో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులైన కొందరికి ఉపాధికోసం కోటి రూపాయల వ్యయంతో ఆరు నెలల క్రితం సిటీకేబుల్ ప్రసారాలను ప్రారంభించామన్నారు. దీనిని సహించని అధికార పక్షం వారు తమ కేబుల్ వైర్లు కత్తిరించడం, ప్రసారాలకు ఆటంకం కలిగిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. సాంకేతిక పరంగా టౌన్ వరకే పెట్టామని, హైదరాబాద్ స్టేట్ కేబుల్ వారి మౌఖిక ఆదేశాలతో వారం క్రితం దేచుపాలెం, మంగొల్లు, తొర్రగుంటపాలెం, బలుసుపాడు గ్రామాలలో కనెక్షన్లు ఇచ్చామని, ఇది సహించలేక రూరల్లో కూడా ప్రసారం చేస్తున్నారని జెమినీ వారితో ఫిర్యాదు చేయించారన్నారు. దీంతో 24 గంటలలోనే కనెక్షన్లు తొలగించామని, ఇది చెప్పకోతగ్గ ఆర్థిక, పైరసీ వంటి నేరం కానప్పటికీ, ఫిర్యాదుదారుడు ఫిర్యాదు వెనక్కు తీసుకుంటామని చెప్పినప్పటికీ 420 కింద అరెస్ట్ చేయడం దారుణమన్నారు. డీఎస్పీపై ఫిర్యాదు చేస్తాం నందిగామలో డీఎస్పీ రాధేష్మురళి వంటి అధికారిని ఇప్పటి వరకు చూడలేదన్నారు. న్యాయాన్ని,ధర్మాన్ని కాపాడవలసిన అధికారి టీడీపి నాయకుడిగా వ్యవహరిస్తూ తమ పార్టీని అణగదొక్కాలని చూడటం విచారకరమన్నారు. టీడీపీ నేతల ఇసుక మాఫియా వారిని పట్టించినప్పటికి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. డీఎస్పీ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. -
ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు
జెడ్పీ సమావేశ తీరుపై వైఎస్సార్ సీపీ నాయకుల ఆగ్రహం 15 మంది సభ్యులు ఉన్నా ప్రాధాన్యత లేని కమిటీల్లో నియామకంపై అభ్యంతరం మచిలీపట్నం : జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల నియామకంలో అధికారపక్షం తన చిత్తానుసారం వ్యవహరించిందని వైఎస్సార్ సీపీ నాయకుడు సామినేని ఉదయభాను, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్అప్పారావు తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా పరిషత్ వద్దకు వచ్చిన వారు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, ఫ్లోర్లీడర్ తాతినేని పద్మావతి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉదయభాను మాట్లాడుతూ జిల్లా పరిషత్లో పనుల స్టాండింగ్ కమిటీలో వైఎస్సార్ సీపీకి చెందిన ఒక్కరికే సభ్యులుగా అవకాశం ఇవ్వడం అన్యాయమన్నారు. తమ పార్టీ నుంచి ఇద్దరు ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలు ఉన్నా వారికి సాంఘిక సంక్షేమ స్టాండింగ్ కమిటీలో స్థానం కల్పించకపోవడం అధికార పార్టీ దురుద్దేశాన్ని చాటిచెబుతోందన్నారు. వైఎస్సార్ సీపీకి 15 మంది జెడ్పీటీసీ సభ్యులు, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కేవలం రెండు స్టాండింగ్ కమిటీల్లోనే స్థానం కల్పించారని, ప్రాధాన్యత ఉన్న ఆర్థిక, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం కమిటీల్లో స్థానం కల్పించకపోవటం దారుణమన్నారు. స్టాండింగ్ కమిటీల నియామకంలో అవకతవకలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడకుండా అధికార పక్షం కుట్ర చేస్తోందని, అదే ఆనవాయితీని జిల్లా పరిషత్ సమావేశంలోనూ, స్టాండింగ్ కమిటీల నియామకంలోనూ పాటిస్తూ ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తాతినేని పద్మావతి మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, అధికార పక్షం అవకతవకలకు పాల్పడితే కచ్చితంగా నిలదీస్తామన్నారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన జిల్లా పరిషత్ సమావేశాన్ని ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఏర్పాటు చేసి మాట్లాడకుండా చేశారని అన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
రాజధానిపై బాబు నాటకం
‘రియల్’కు దన్ను చార్జీలు పెంచకుండా పాలన సాగించాలి రుణమాఫీ సంగతేంటి? స్పీకర్ తీరు గర్హనీయం వైఎస్సార్ సీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను జగ్గయ్యపేట : తన స్వార్థం కోసం... అనుచరుల రియల్ఎస్టేట్ వ్యాపారాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై స్పష్టత ఇవ్వడం లేదని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను విమర్శించారు. గురువారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ మూడు నెలల పాలనలోనే రాజధానిపై మంత్రులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. దీంతో 13 జిల్లాల ప్రజలు అయోమయంలో పడుతున్నారని చెప్పారు. అధికారంలో ఉండి కూడా రాజధానిపై నిర్ణయం తీసుకోలేని ముఖ్యమంత్రి మౌనంగా ఉండటానికి కారణమేంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను వివరిస్తుంటే వారికి మైక్లు ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంకెల గారడీ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతూ ప్రజలను వంచన చేస్తున్నరని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీలను నేటికీ నెరవేర్చకుండా మౌనంగా ఉండిపోయారన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా మాఫీకి సంబంధించిన స్పష్టమైన హామీ ఇవ్వకుండా రైతులను మరింత గందరగోళంలోకి నెడుతున్నారని విమర్శించారు. మంచి పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి పేరు వింటేనే చంద్రబాబు మండిపడుతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్చేస్తుండటం అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ జరుగలేదన్నారు. మున్సిపల్ చైర్మన్ తన్నీరునాగేశ్వరరావు, మైనార్టీ నాయకులు పటాన్ ఫిరోజ్ఖాన్, న్యాయవాదులు పసుపులేటి శ్రీనివాసరావు, సామినేని రాము, ఆరోవార్డు కౌన్సెలర్ ఇంటూరి చిన్న తదితరులు పాల్గొన్నారు. -
ఉమా..నీ తీరు మార్చుకో
జిల్లాలో టీడీపీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి వైఎస్సార్ సీపీ నాయకుడి హత్య వెనుక ఉమా హస్తం ఉంది... సీబీసీఐడీ ద్వారా విచారణ చేయించాలి వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ నందిగామ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మాజీ మంత్రి, బందరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండదండలతో టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి ఉమా తీరు మార్చుకోవాలని, లేకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం సారథి, ఉదయభాను, ఎమ్మెల్యే రక్షణనిధి గొట్టుముక్కల వెళ్లి హత్యకు గురైన వైఎస్సార్ సీపీ నాయకుడు ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నందిగామలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న నాయకుడిని రోడ్డుపైకి తీసుకొచ్చి హత్య చేయడంతో హేయమైన చర్య అని అన్నారు. టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. మంత్రి ఉమ హత్యారాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. ఈ హత్య వెనుక ఉమా పాత్ర ఉందని, ఈ ఘటనపై సీబీసీఐడీ ద్వారా విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే కృష్ణారావు మరణించారని పేర్కొన్నారు. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ముకాయడంతో వైఎస్సార్ సీపీ ఓ మంచి నాయకుడిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. జగ్గయ్యపేట మండలం పెద్ద మోదుగుపల్లి గ్రామ మాజీ సర్పంచి మధుసుదనరావును కూడా ఇటీవల టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారని, ఇప్పటి వరకు నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. కృష్ణారావు హత్య కేసులో దోషులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశామని చెప్పారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి చెందినప్పటి నుంచి ఆ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న మంత్రి ఉమా ఈ ప్రాంతాన్ని వివాదాలకు కేంద్రంగా మార్చారని విమర్శించారు. కృష్ణారావు హత్యపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే రక్షణ నిధి చెప్పారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు తమ తీరు మార్చుకోకపోతే ఉద్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పినట్లుగా పనిచేయాలని ఆదేశించడంతో అధికారులు కార్యకర్తలకు కూడా భయపడే పరిస్థితి నెలకొందన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు బొగ్గవరపు శ్రీశైలవాసు, వైఎస్సార్ సీపీ నందిగామ కార్యాలయ ఇన్చార్జి మొండితోక అరుణ్కుమార్ పాల్గొన్నారు. -
‘దేశం’ దాడిలో వైఎస్సార్ సీపీ నేత మృతి
పెద్దమోదుగపల్లిగ్రామంలో టీడీపీ నేతల అరాచకం మృతుడు మధుసూదనరావు మాజీ సర్పంచి వివాదం వద్దని సర్ది చెబుతుండగా దాడి వత్సవాయి : టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్ సీపీ నాయకుడు ఆదివారం మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దమోదుగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామ మాజీ సర్పంచి కల్యాణం మధుసూదనరావు(61)కు గ్రామ శివారున మామిడితోట ఉంది. అక్కడ ఆయన కుమారుడు విద్యాసాగర్ జేసీబీతో కాలువ తీయిస్తున్నాడు. తోట పక్కన నివాసం ఉంటున్న వారు కట్టెలను తీసి గట్టుపై ఉంచారు. జేసీబీకి అడ్డు వస్తున్నాయి.. వాటిని తీయాలని విద్యాసాగర్ చెప్పారు. ఇది పోరంబోకు స్థలం తియ్యమని చెప్పడానికి నీవెవరు అంటూ అతడిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న మధుసూదనరావు తోట దగ్గరకు వెళ్లగా, అప్పటికే వివాదం ముదిరింది. ఘర్షణ వద్దని మధుసూదనరావు సర్ది చెబుతుండగా, టీడీపీ నేతలై న గ్రామ ఉప సర్పంచి నందమూరి శ్రీను, రాము, కనగాల గణపతిలు దాడికి దిగారు. ఈ ఘటనలోమధుసూదనరావు అక్కడిక్కడే కుప్పకూలారు. గ్రామస్తులు ఆటోలో జగ్గయ్యపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గ్రామస్తుల ఆందోళన మధుసూదనరావు మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో గ్రామస్తులు ఆందోళన చేశారు. నిందితుల్ని అరెస్టు చేస్తామని సీఐ వీరయ్యగౌడ్ హామీతో శాంతించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పేట ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదనరావు మృతితో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ముందస్తుగా పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయభాను పరామర్శ తెలుగుదేశం నాయకుల దౌర్జన్యానికి బలైన గ్రామ మాజీ సర్పంచి మధుసూదనరావు మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, నియోజవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు కనపర్తి శేషగిరిరావు, మారెళ్ల పుల్లారెడ్డి, ఇంటూరి చిన్నా, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవీ చలం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నంబూరి రవి, చౌడవరపు జగదీష్ తదితరులు వసందర్శించి నివాళులర్పించారు. మధుసూదనరావు మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
'టీడీపీ అక్రమంగా అధికారంలోకి వచ్చింది'
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఆపార్టీ నేత సామినేని ఉదయభాను తెలిపారు. తెలుగుదేశం పార్టీ అన్యాయంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. రైతు, డ్వాక్రా రుణాలను చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేయాలని సామినేని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా వైభవంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇప్పటికీ రుణమాఫీపై స్పషంగా చెప్పలేకపోతున్నారని ఆయన విమర్శించారు. వారి మోసాలకు ఇదే నిదర్శనమని సామినేని వ్యాఖ్యానించారు. బాబు ఎన్నికల ముందు ఒక మాట...ఆ తర్వాత ఇంకోమాట మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలు కూడా రద్దు చేశారని సామినేని ఉదయభాను ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
'కృష్ణా' నేతలకు కలిసిరాని విప్ పదవి
మచిలీపట్నం: నేతలకు సెంటిమెంట్లు ఉన్నా.. లేకున్నా.. కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్లు వెంటాడుతూనే ఉంటాయి. అలా జరగడం యాథృచ్చికమే అయినా వరుసగా ఒకేవిధంగా జరిగితే అదే సెంట్మెంట్గా మారుతోంది. ఇదే తరహాలో జిల్లాకు చెందిన కీలక నేతలకు విప్ పదవి అచ్చి వచ్చినట్టు లేదు. ముగ్గురు నాయకులు విప్ పదవి చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈ సెంటిమెంట్ బలపడింది. తాజాగా ప్రభుత్వ విప్ పదవి నిర్వహించిన బందరు తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ఓటమితో జిల్లాలో దీనిపై చర్చసాగుతోంది. గతంలో టీడీపీ నుంచి కాగిత వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి సామినేని ఉదయభాను విప్లుగా పనిచేసి ఓటమిపాలైన వారే. మొదట ‘కాగిత’... మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కాగిత వెంకట్రావు చంద్రబాబు హయాంలో విప్గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూడా కాగిత పనిచేశారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి కాగిత ఓటమిపాలయ్యారు. అదే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 2004లో రాష్ట్రంలో అధికారం చేపట్టింది. 2009 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో మల్లేశ్వరం రద్దయి పెడన నియోజకవర్గం ఏర్పడింది. పెడన నుంచి 2009 ఎన్నికల్లో పోటీచేసిన కాగిత రెండోసారి కూడా ఓటమిని చవిచూశారు. ప్రస్తుత ఎన్నికల్లో కాగిత పెడన ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి విప్ పదవి నిర్వహించిన కాగితకు పదేళ్ల తర్వాత మళ్లీ ఎమ్మెల్యే పదవి దక్కింది. ఉదయభాను పరిస్థితి అంతే.. జగ్గయ్యపేట నుంచి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సామినేని ఉదయభాను వైఎస్ ప్రభుత్వంలో విప్గా పనిచేశారు. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయభాను ఓటమిని చవిచూశారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే ఉదయభాను మంత్రి అవుతారని ఆయన అభిమానులు, జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. వైఎస్ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడినా ఉదయభాను మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేదు. అనంతరం మారిన రాజకీయ సమీకరణాల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ఉదయభాను బలపరిచారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన జిల్లాలో మంచి పట్టు సాధించారు. ఈసారి ఎన్నికల్లో ఆయన జగ్గయ్యపేట నుంచి కచ్చితంగా గెలుస్తారని రాజకీయ పరిశీలకులు ధీమాగా చెప్పారు. టీడీపీకి దీటైన పోటీ ఇచ్చిన ఆయన అనూహ్యంగా ఓటమిని చవిచూశారు. మూడో నాయకుడు ‘పేర్ని’ మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పేర్ని వెంకట్రామయ్య(నాని) 1999 ఎన్నికల్లో మాజీ మంత్రి నడకుదుటి నర్సింహారావు చేతిలో ఓటమిని చవిచూశారు. అనంతరం 2004 ఎన్నికల్లో నడకుదుటిపై, 2009 ఎన్నికల్లో నడకుదుటి అల్లుడు కొల్లు రవీంద్రపై నాని విజయం సాధించారు. దీంతో నానికి ప్రభుత్వ విప్ పదవి లభించింది. వైఎస్ మరణంతో జగన్మోహన్రెడ్డిపై జరుగుతున్న కుమ్మక్కు కుట్రలు సహించలేక, పాలకులు ప్రజా సంక్షేమం, అభివృద్ధిని విస్మరించడాన్ని తట్టుకోలేక నాని తన విప్ పదవికి రాజీనామా ప్రకటించి వైఎస్సార్ సీపీలో చేరారు. పదవే పరమావధిగా భావించే నేతలు ఉన్న ఈ రోజుల్లో నాని కీలకమైన విప్ పదవితోపాటు ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. పదవుల కంటే విలువలు, విశ్వసనీయత ముఖ్యమని భావించే నాని నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. అటువంటి నాయకుడు ఓటమిని చవిచూడటం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా జిల్లాలో ప్రభుత్వ విప్లుగా పనిచేసి విశేష ప్రజాదరణ పొందిన నేతలు సైతం ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలు కావడం గమనార్హం. -
వైఎస్సార్సీపీ జిల్లా, సిటీ అధ్యక్షులుగాభాను, జలీల్ఖాన్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సామినేని ఉదయభాను, విజయవాడ నగర అధ్యక్షుడిగా జలీల్ఖాన్ ఎంపికయ్యారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఆ పార్టీ రెండో ప్లీనరీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు వారు ఆ స్థానాల్లో కన్వీనర్లుగా వ్యవహరించారు. ఇకపై వీరు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఉదయభాను, జలీల్ఖాన్లు కన్వీనర్లుగా నియమితులైనప్పటి నుంచి ఇప్పటివరకు విజయవాడ సహా జిల్లాలో పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఇచ్చిన పిలుపులన్నింటినీ జయప్రదం చేశారు. సమైక్యాంధ్ర కోసం జరిగిన పోరాటాల్లో విరివిగా పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాలను జయప్రదం చేయడంలో కృషిచేశారు. అధ్యక్షులుగా ఎంపికైన సందర్భంగా వారు జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల కైవసానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. -
సభా సంప్రదాయాలను కాలరాస్తారా?
= ప్రతిపక్ష పాత్ర ఏమైంది = ముఖ్యమంత్రి కిరణ్ ఎక్కడ? = వైఎస్సార్ సీపీ నేత సామినేని ఉదయభాను విజయవాడ సిటీ, న్యూస్లైన్ : శాసన సభా సంప్రదాయాలను అధికార కాంగ్రెస్ పార్టీ కాలరాస్తుంటే దానికి టీడీపీ నాయకులు సహకరిస్తున్నారని ఇది అసెంబ్లీ చరిత్రలోనే దుర్దినమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణా ముసాయిదా బిల్లుపై బీఏసీ (శాసనసభ వ్యవహారాల కమిటీ)లో చర్చించకుండానే, సభలో చర్చకు అనుమతించడం ప్రజాప్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఏదైనా ఒక అంశం పై చర్చించేముందు ఆ అంశంపై బీఏసీ లో ఎంత సేపు చర్చించాలి, ఎవ రెవరికి మాట్లాడే అవకాశమివ్వాలి, వంటి అంశాలపై నిర్ణయం తీసకుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ, తెలంగాణా ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు అలాంటివేమీ లేకుండా ఎంతో పవిత్రమైన సభా సంప్రదాయాలను కాలరాశారన్నారు. దానికి తెలుగుదేశం పూర్తిగా తెరవెనుక సహకారం అందించిందన్నారు. నిన్నమొన్నటి వరకు విభజన తీర్మానాన్ని అడ్డుకుంటామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి ఎక్కడకు పోయారని ఆయన ప్రశ్నించారు. బిల్లు చర్చ సందర్భంగా ఉప సభాపతి ప్రతిపక్ష నేత చంద్రబాబు అభిప్రాయాన్ని చెప్పాలంటూ పదేపదే కోరినా చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదన్నారు. ముందు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ తీర్మానం చేద్దామని పదేపదే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలుగు జాతిని మోసం చేయకూడదనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా తీర్మానం చేసేందుకు సహకరించేవారన్నారు. సభలో సభాపతి మనోహర్ కాకుండా తెలంగాణాకు చెందిన ఉప సభాపతి స్థానంలో ఉన్న బట్టి విక్రమార్క చేతనే బిల్లుపై చర్చకు అనుమతించేలా చేయడం వంటి అంశాలు రాజకీయ ఎత్తుగడేనని తెలిపారు. బీఏసీలో చర్చలేకుండా తీర్మానంపై చర్చకు అనుమతించడం చూస్తే హైకమాండ్ డెరైక్షన్లోనే ఇది జరిగిందన్నారు. దీని కి ద్విగ్విజయ్ సింగ్, కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులతో రిహార్సల్స్ చేయించారన్నారు. జాతి ద్రోహులను తరిమికొట్టండి.... తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న వారిని తరిమికొట్టాలని ఉదయ భాను పిలుపు నిచ్చారు. అధికారం కోసం పదవుల కోసం నీచ రాజకీయాలకు పాల్పడేవారిని రాష్ట్రంలో తిరగనీయొద్దంటూ రాష్ట్ర ప్రజలకు విజ్ణప్తి చేశారు. రాష్ట్ర సమైక్యతకోసం నిరంతర కృషి చేస్తున్నది ఒక్క జగన్మోహనర్ రెడ్డి మాత్రమే అన్న సంగతి అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఆర్టికల్-3పై సవరణ తీసకుకురావాలని జగన్మోహనరెడ్డి జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి దడపుడుతుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఒక శక్తి అన్న విషయం త్వరలోనే నిరూపితమవుతుందన్నారు. -
రాష్ర్టంలో వైఎస్సార్ సీపీదే హవా : సామినేని
విజయవాడ, న్యూస్లైన్ : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను అన్నారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం పెనమలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉదయభాను మాట్లాడుతూ కాంగ్రెస్. టీడీపీ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అధికారపార్టీగా కాంగ్రెస్, ప్రతిపక్షంగా టీడీపీ ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో పటిష్టమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అది కేవలం వైఎస్. జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యపడుతుందని విశ్వసిస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్సీపీలోకి వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు విధానాలతో ఆ పార్టీ నాయకులు విసుగుచెందారని చెప్పారు. సోనియాగాంధీ పుట్టిన రోజున నియోజకవర్గంలో మంచి పట్టు కలిగి ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు తమ పార్టీలో చేరడాన్ని శుభపరిణామంగా భావిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీడీపీలు రెండూ ఖాళీ అయ్యే విధంగా వలసలుంటాయని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి గ్రామంలో కాంగ్రెస్పార్టీకి చెందిన మాజీ సర్పంచి ఐనంపూడి చంద్రశేఖర్, పెనమలూరు మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు చిరుమామిళ్ల వెంకట రాజామౌళీశ్వరప్రసాద్, జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఐ.వెంకటేశ్వరరావు, పంచాయతీ మాజీ ఉప సర్పంచి వీర్ల వెంకటేశ్వరరావు, వణుకూరుకు చెందిన కాకాని రంగారావు, తెలుగుదేశం పార్టీకి చెందిన తోటకూర ప్రతాప్, కుప్పాల ప్రతాప్, కర్లపూడి దేవేంద్రబాబు, కొంకల శ్రీనివాసరెడ్డి తదితరులు సోమవారం పార్టీలో చేరారు. వీరందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు విఫలమయ్యారన్నారు. ఆయా పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో పోరాటం చేస్తుందని చెప్పారు. వైఎస్సార్ సీపీని బలోపేతం చేయటానికి తామంతా కృషి చేస్తామన్నారు. ఆఫీస్ కో-ఆర్డినేటర్ టి.ఆర్.అశోక్కుమార్, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు సూరపనేని వెంకట రామారావు, ప్రభల శ్రీనివాస్, ఎం.ఎస్.నారాయణ, నారుమంచి నారాయణ, మాంతి రమణ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి సమైక్య పోరు సమైక్యాంధ్రప్రదేశ్ను కాంక్షిస్తూ ఎన్నో ఉద్యమాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మళ్లీ ఉద్యమ బాటకు సిద్ధమయ్యిందని సామినేని అన్నారు. అక్టోబరు నెలలో గాంధీజయంతి నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి విదితమేనన్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా మంగళవారం నుంచి వరుసగా మూడు రోజులు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. 10వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో ర్యాలీ. 11న ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ, 12న రహదారుల దిగ్బంధనం, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. అదే విధంగా 14వ తేదీనుంచి ఒక్కో నియోజకవర్గంలో ఒక రోజున భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. -
నేడు వైఎస్ జగన్ రాక
విజయవాడ సిటీ, న్యూస్లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యులు, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు (కేఎన్నార్) అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారని వారు పేర్కొన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి ఆయన నర్సపూర్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు గుడివాడ చేరుకుంటారని తెలిపారు. అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారని, అనంతరం 8.30 గంటలకు బయలుదేరి కేఎన్నార్ స్వగ్రామమైన మొవ్వ మండలం కోసూరు వెళ్తారని వివరించారు. కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని విమానంలో హైదరాబాదు వెళతారని తెలిపారు. జిల్లాలోని పార్టీ శ్రేణులు కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు ఘన నివాళి సమర్పించాలని వారు కోరారు. -
ప్రజాసమస్యలు చెప్పడానికి వస్తుంటే.. అరెస్టులా... : భాను ఆగ్రహం
జగ్గయ్యపేట/ పెనుగంచిప్రోలు/ వత్సవాయి, న్యూస్లైన్ : ప్రజాసమస్యలను రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి దృష్టికి తెలియజేసేందుకు శాంతియుతంగా వస్తున్న తమను అరెస్టు చేయడం అన్యాయం, అక్రమమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మండిపడ్డారు. శనివారం జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రికి ప్రజా సమస్యలను విన్నవించేందుకు వస్తున్న ఉదయభానును పోలీసులు గ్రామ సమీపంలో బలవంతంగా అరెస్టు చేసి వత్సవాయి పోలీస్స్టేషన్కు తరలించారు. తమ నాయకుడిని బలవంతంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చిల్లకల్లు వద్ద పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీసు జీపునకు అడ్డుపడి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి భానును వత్సవాయి స్టేషన్కు తీసుకు వెళ్లారు. మార్గమధ్యంలో మక్కపేట వద్ద భానును తరలిస్తున్న వాహనాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకొని దాదాపు గంటపాటు జీపును కదలనీయకుండా నిర్బంధించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భాను జోక్యం చేసుకని కార్యకర్తలను సముదాయించటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వైఎస్ ఫొటో లేకపోవడం దారుణం... రచ్చబండ కార్యక్రమానికి రూపకల్పన చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో లేకుండా సభ నిర్వహించటం దారుణమని భాను విమర్శించారు. వైఎస్ ఆశయాలకు కిరణ్ సర్కారు తూట్లు పొడుస్తోందన్నారు. గత రచ్చబండలో చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా మరలా ప్రజలను మోసగించేందుకు రచ్చబండ నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజాకంటక ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు పారదోలుతారన్నారు. సమైక్యవాదం ముసుగులో కిరణ్ విభజన వాదాన్ని బలపరుస్తున్నాడని విమర్శించారు. వత్సవాయి పోలీస్స్టేషన్లో ఉన్న ఉదయభానును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి, పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ కె.గురవయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీసభ్యులు మండలి హనుమంతరావు, సూరపనేని రామారావు, మందా వెంకన్న, భూక్యా రాజానాయక్, చిరుమామిళ్ల ప్రభాకరరావు, మారెళ్ల పుల్లారెడ్డి బ్రదర్స్, దారకపల్లి వీరమ్మ, విజయవాడ నాయకులు లంకా రాము, ఎంఎస్ నారాయణ, జగ్గయ్యపేట మార్కెట్యార్డు మాజీ చైర్మన్ తుమ్మేపల్లి నరేంద్ర, పెనుగంచిప్రోలు మండల వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ గుజ్జర్లపూడి వడ్డీకాసులు తదితరులు ఉన్నారు. -
అన్నదాతను ఆదుకోవాలి : సామినేని
షేర్మహ్మద్పేట (జగ్గయ్యపేట), న్యూస్లైన్ : డతెరపి లేకుండా కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. మండలంలోని షేర్మహ్మద్పేట అడ్డరోడ్డు సమీపంలోని ఆటోనగర్లో కల్లాల్లో తడిచిన మొక్కజొన్న పంటను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. రైతులనడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తూ... చేతికి వచ్చే పంటను నీటిపాలు చేసిందన్నారు. అప్పు, సొప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయల పంట లకు అపార నష్టం జరిగిందని తెలిపారు. కొన్ని గ్రామాల్లో తడిచిన మొక్కజొన్నను రైతులు కల్లాల్లోనే వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిచిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. తక్షణమే వ్యవసాధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంటలపై సర్వే చేసి నివేదికలు తయారు చేయాలని కోరారు. రైతులను ఆదుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కళ్ల ముందే పంట నీటిపాలై నష్టపోవడంతో కంటనీరు పెడుతున్న రైతులు కోటి వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్ను ఉదయభాను ఓదార్చి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మండల, పట్టణ పార్టీ కన్వీనర్లు మాతంగి వెంకటేశ్వర్లు, షేక్ మదార్సాహెబ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల వెంకటాచలం, పట్టణ కార్యదర్శి వట్టెం మనోహర్, పట్టణ మైనార్టీ సెల్ కన్వీనర్ ఎస్డి.ఆరీఫ్, నాయకులు మోరే వినోద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. పంటలను పరిశీలించిన రైతు సంఘం నాయకులు .. వర్షానికి తడిచిన మొక్కజొన్న పంటలను జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వై.కేశవరావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందజేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం సభ్యురాలు యార్లగడ్డ జోయ, సీపీఎం నాయకులు నాగమణి, కోట కృష్ణ, కాకనబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉదయభాను నిరాహార దీక్ష భగ్నం
-
ఉదయభాను నిరాహార దీక్ష భగ్నం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నిరాహార దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేశారు. ఉదయభాను ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో సమైక్యవాదులు పోలీసుల్ని అడ్డుకోవడంతో జగ్గయ్యపేటలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన జగ్గయ్యపేటలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఉదయభాను ఆరోగ్యం క్షీణించటంతో... ఆయనను దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు చేపట్టిన సమైక్య సత్యాగ్రహాలకు మద్దతు వెల్లువెత్తుతోంది. గాంధీజయంతి రోజున ప్రారంభమైన ఈ దీక్షలు శనివారం కూడా కొనసాగుతున్నాయి. -
క్షీణించిన ఉదయభాను ఆరోగ్యం
జగ్గయ్యపేట : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆరోగ్యం క్షీణించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన జగ్గయ్యపేటలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఉదయభాను ఆరోగ్యం క్షీణించటంతో... ఆయనను దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు చేపట్టిన సమైక్య సత్యాగ్రహాలకు మద్దతు వెల్లువెత్తుతోంది. గాంధీజయంతి రోజున ప్రారంభమైన ఈ దీక్షలు శనివారం కూడా కొనసాగుతున్నాయి. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య దీక్షకు మద్దతుగా విజయవాడలో వంగవీటి రాధా దీక్ష చేపట్టారు. ఇక విజయవాడ సెంట్రల్లో పి.గౌతమ్రెడ్డి, గన్నవరంలో దుట్టా రవిశంకర్, పెడనలో వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్లు దీక్షలను కొనసాగిస్తున్నారు. గొల్లపూడిలో కాజా రాజ్కుమార్ రిలే దీక్షలో పాల్గొన్నారు. బందరులో తాజా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని), కేంద్ర పాలకమండలి సభ్యుడు కుక్కల నాగేశ్వరరావు, పలువురు మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. గుడివాడలో తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. -
72 గంటల బంద్
సాక్షి, విజయవాడ : తెలంగాణ నోట్ ఆమోదానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నుంచి 72 గంటల జిల్లా బంద్కు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నగర కన్వీనర్ జలీల్ఖాన్ సమైక్యవాదులకు పిలుపునిచ్చారు. 65 రోజులుగా ఉవ్వెత్తున ఆందోళనలు ఎగసిపడుతున్నా కాంగ్రెస్ పార్టీ తోసిరాజని రాష్ట్ర విభజనకు మొగ్గుచూపడాన్ని వారు ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నమ్మకద్రోహానికి పాల్పడిందని విమర్శించారు. ఏపీ ఎన్జీవోలు కూడా 48 గంటల బంద్కు పిలుపునిచ్చారు. మరోవైపు శుక్రవారం బంద్కు కాంగ్రెస్ పార్టీ జిల్లా, సిటీ కమిటీలు కూడా పిలుపునిచ్చాయి. భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు సాయంత్రం నాలుగు గంటలకు కార్యకర్తల అత్యవసర సమావేశం ఏర్పాటుచేస్తున్నారు. -
గాంధీ స్ఫూర్తితో..సత్యాగ్రహ దీక్షలు
మహాత్ముడే సాక్షిగా.. ఆయనే పోరాటాలే స్ఫూర్తిగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నిరవధిక, రిలే నిరాహారదీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా దీక్షలు కొనసాగిస్తామని నేతలు వివరించారు. వివిధ జేఏసీలు, సంఘాల నేతలు సంఘీభావం ప్రకటించారు. సాక్షి, విజయవాడ : బ్రిటీష్ వారి నుంచి బానిస సంకెళ్లను తెంపుకుని దేశానికి స్వేచ్ఛావాయువులు అందించిన అంహిసా మూర్తి మహాత్మాగాంధీ స్ఫూర్తిగా, రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకునే కేంద్రం కుట్రలు భగ్నం చేసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు మొదలుపెట్టారు. ప్రతి నియోజకవర్గంలోనూ నిరవధిక నిరాహార దీక్షలు, రిలేదీక్షలు మొదలయ్యాయి. జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నిరవధిక నిరాహార దీక్షకు దిగగా, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు ఈ దీక్షలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 17 మంది నిరవధిక దీక్షలు చేస్తుండగా, 1,156 మంది రిలేదీక్షల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ కన్వీనర్లు పి.గౌతంరెడ్డి, సింహాద్రి రమేష్, మొండితోక జగన్మోహనరావు, వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్ నిరవధిక దీక్షలు చేపట్టినవారిలో ఉన్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కుక్కల నాగేశ్వరరావు, రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రచార విభాగం కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి తదితరులు దీక్షా శిబిరాలకు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్సీపీ వైఖరి సుస్పష్టం.. సభల్లో నేతలు మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై వైఎస్సార్సీపీ చాలా స్పష్టంగా తన వైఖరి చెప్పిందన్నారు. ఇరు ప్రాంతాలకు తండ్రిలా సమన్యాయం చేయాలని, అలా చేయకుంటే యథాస్థితిని కొనసాగించాలని కోరిందని వివరించారు. సమన్యాయం చేసే పరిస్థితులు లేకపోవడం వల్లే వైఎస్సార్ సీపీ విభజనను వ్యతిరేకించి సమైక్య నినాదాన్ని వినిపించిందన్నారు. చంద్రబాబునాయుడు ఆత్మగౌరవయాత్ర పేరుతో ఆత్మవంచన యాత్ర చేస్తున్నారన్నారు. ఎక్కడా సమైక్య పదాన్ని వాడకుండా నాటకాలాడుతున్నారని విమర్శించారు. వేర్పాటువాదాన్ని గాంధీ కుటుంబాలు వ్యతిరేకిస్తే ఇటలీవాసి అయిన సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీక్షలు ఇలా.. జగ్గయ్యపేటలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. దీక్షలను గట్టు రామచంద్రరావు ప్రారంభించగా, ఎంవీఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర పౌర జనరేషన్ సంఘం 15-35 యూనియన్ కార్యదర్శి నన్నే శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవినేని చంద్రశేఖర్, సూరపునేని రామారావు, కోవెలమూడి వెంకటనారాయణ, తాటి రామకృష్ణ, గడ్డం ముత్తారెడ్డి సంఘీభావం తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు స్థానిక పార్టీ కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపట్టారు. జేఏసీ నాయకులు బీ రాజేంద్రకుమార్, అబ్దుల్ అజీజ్ రమేష్బాబుకు వీరతిలకం దిద్ది పూలమాలలువేసి దీక్షను ప్రారంభించారు. సింహాద్రితో పాటు మద్ది వెంకటనారాయణ (చిన్నా), కొండవీటి బాపూజీ నిరవధిక దీక్షలను చేపట్టారు. అవనిగడ్డ టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యాసం చిట్టిబాబు, గుడివాక శివరావ్ బుధవారం నిరవధిక నిరాహారదీక్షలు చేపట్టారు. వీరితోపాటు మండల యూత్ కన్వీనర్ సింహాద్రి పవన్, రాజనాల బాలాజీ, యాసం మురళి నిరవధిక నిరాహారదీక్షలో పాల్గొన్నారు. హనుమాన్జంక్షన్లో వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు దుట్టా రవిశంకర్ నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షను నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ దుట్టా రామచంద్రరావు ప్రారంభించారు. రాజకీయేతర జేఏసీ, ఉపాధ్యాయ జేఏసీ, ఇతర సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. పెడనలో పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్, పార్టీ రాష్ట్ర బీసీ విభాగం అడ్హాక్ కమిటీ సభ్యుడు గూడవల్లి కేదారేశ్వరరావు నిరవధిక నిరహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను పార్టీ సీజీసీ సభ్యుడు కె.నాగేశ్వరరావు ప్రారంభించారు. నందిగామలో నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు గాంధీ సెంటర్లో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. పార్టీ ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి ఈ దీక్షలను ప్రారంభించారు. తిరువూరులో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎంవీఎస్ నాగిరెడ్డి పార్టీ నేత దేవినేని చంద్రశేఖర్, ఉద్యోగ జేఏసీ నందిగామ తాలూకా చైర్మన్ ఎం.శ్యాంబాబు సంఘీభావం ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడి లెనిన్ సెంటర్లో నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ శిబిరాన్ని పార్టీ సీజీసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రారంభించగా రైతువిభాగం కన్వీనర్ నాగిరెడ్డి సంఘీబావం తెలిపారు. మైలవరంలో నియోజకవర్గ కన్వీనర్ జోగి రమేష్ రిలే దీక్ష ప్రారంభించారు. నూజివీడులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో దాదాపు 800 మంది దీక్షలో పాల్గొన్నారు. నూజివీడులోని జంక్షన్ రోడ్డులో నిర్వహించిన దీక్షలో నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు సర్పంచులు పాల్గొన్నారు. పామర్రులో వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో సమైక్య దీక్షలను నిర్వహించారు. ఈ దీక్షలను పార్టీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి ప్రారంభించగా, ప్రచార విభాగం కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. విజయవాడ పశ్చిమంలో పార్టీ నగర కన్వీనర్ జలీల్ఖాన్ ఒక రోజు దీక్ష చేపట్టారు. ఆయనతోపాటు 120 మంది ఈ దీక్షలో కూర్చున్నారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని రాఘవయ్య పార్కు వద్ద చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని సీజీసీ సభ్యుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సందర్శించి సంఘీభావం తెలిపారు. కైకలూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. 48 గంటల నిరాహార దీక్షలలో పార్టీ మండవల్లి మండల అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బొబ్బిలి రత్తయ్యనాయుడు, శొంఠి వీరముసలయ్య, నాయకులు పెరుమాళ్ల వీరవెంకట సత్యనారాయణరెడ్డి, మోరు విజయతాతారావు పాల్గొన్నారు. పెనమలూరులో నియోజకవర్గ సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్బాబు నేతృత్వంలో నిరసన దీక్ష చేపట్టగా, నాగిరెడ్డి ప్రారంభించారు. తిరువూరు బోస్ సెంటర్లో సమన్వయకర్త బి.వల్లభాయ్, ఎన్ఆర్ఐ విభాగ రాష్ట్ర కమిటీ సభ్యుడు శీలం రాజా రిలేదీక్షల్లో పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సమావేశం వాయిదా
విజయవాడ, న్యూస్లైన్ : విజయవాడలో ఆదివారం జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి అత్యవసర సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నిర్వహించాలని భావించి పార్టీ జిల్లా క్యాడర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేశామని, ఈ మార్పును పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించి సహకరించాలని కోరారు. విజయవాడ సీతారామపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ఈ అత్యవసర సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, అన్ని మండలాల కన్వీనర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు విధిగా హాజరుకావాలని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వచ్చే నెలాఖరు వరకు పార్టీ తరఫున చేపట్టాల్సిన కొన్ని కార్యక్రమాలపై విధివిధానాలు రూపొందించినట్లు తెలిపారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి నియోజకవర్గ సమన్వయకర్తలు అందరూ వారివారి నియోజకవర్గాల్లో నిరవధిక నిరాహార దీక్షలు చేయాల్సి ఉందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి కోర్టు అనుమతి ఇస్తే అక్టోబర్ నాలుగున గుంటూరులో జరపతలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
బాబూ...యాత్రెందుకు : ఉదయభాను
విజయవాడ, న్యూస్లైన్ : తెలుగుదేశం అధినేత జిల్లాలో చేసిన ఆత్మగౌరవ యాత్ర ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కాలేదని... ఆయన ఎందుకు యాత్ర చేశారో స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. సీతారాంపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు యాత్రలోదివంగత మహానేత వైఎస్.రాజశేఖర్రెడ్డి కుటుంబాన్ని, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను, అధినేత జగన్మోహన్రెడ్డిని విమర్శించటం తప్ప చేసిందేమి లేదన్నారు. జస్టిస్చౌదరిలాగా ఉండాలని సూచిస్తున్న చంద్రబాబు ఆయన ఎలా ఉన్నారో చెప్పాలన్నారు. 1998లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేశారని, దానికి ఆకర్షితుడైన బాబు 1999లో బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే 2008లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్ర విభజనకు అనుకూలమో లేదో స్పష్టం చేయాలన్నారు. లేనిపక్షంలో ధైర్యం లేదని ఒప్పుకోవాలని కోరారు. మీ ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామాలు చేయించకుండా ఎందుకు యాత్రను ముగిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి నిరసనల సెగ తగలటంతో అర్ధాంతరంగా యాత్రను ముగిస్తున్నారని తెలిపారు. జగన్ సీఎం, రాహుల్ పీఎం అవుతారని చంద్రబాబే డిక్లరేషన్ ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే ఎలా ఉంటుందో అనేక సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇరుప్రాంతాల్లో టీడీపీ అంతరించిపోతుందని సర్వేలు తేల్చాయని చెప్పారు. పామర్రు నియోజకవర్గం సమన్వకర్త ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ బుధవారంతో ముగియనున్న చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలో ఎక్కడా సమైక్యాంధ్ర పేరు కూడా ప్రస్తావించలేదన్నారు. ఆయన యాత్రను ఆత్మస్తుతి యాత్రగా పేరు మార్చుకోవాలని విమర్శించారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నానని ప్రగల్భాలు పలకడం, మసిబూసి మారేడుకాయ రాజకీయాలు చేయడం మినహా.. నలభైరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల గురించి ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. సమైక్యవాదులు అడ్డగిస్తుంటే వారిని వైఎస్సార్ సీపీ కార్యకర్తలుగా వర్ల రామయ్య, ఇతర నాయకులు చిత్రీకరిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమ పార్టీ కార్యకర్తలకు లేదన్నారు. మిట్టగూడెంలో టీడీపీలోని మరో గ్రూపుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకున్న విషయాన్ని గమనించాలన్నారు. విభజన ప్రక్రియ ఆపడానికి టీడీపీ ఏ చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యుడు లంకా బాబు, కార్యాలయ కో-ఆర్డినేటర్ టి.ఆర్. అశోక్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూరపనేని రామారావు, పార్టీ నాయకులు ప్రభల శ్రీనివాస్, ఇంజినీరింగ్విద్యార్థి జేఏసీ నాయకుడు దొడ్డా అంజిరెడ్డి పాల్గొన్నారు. -
రైతులు ఉద్యమించాలి : భాను
విజయవాడ, న్యూస్లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని అడ్డుకునేందుకు అన్ని వర్గాలూ ఆందోళనలోకి రావాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను శనివారం ఒక ప్రకటనలో కోరారు. ముఖ్యంగా సాగు, తాగు నీరు విషయంలో సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని, సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్లో సభను విజయవంతం చేసినందుకు ఆయన వారికి అభినందనలు తెలిపారు. ఇదే తరహాలో అన్ని రంగాల వారు రోడ్డెక్కి సభల ద్వారా ఆయా రంగాలకు జరగబోయే నష్టాలను ప్రజలకు వివరించి చైతన్యపర్చాలని కోరారు. కృష్ణా డెల్టాకు ప్రథమ వినియోగ హక్కుగా జూన్లో కాల్వలకు నీటిని విడుదల చేసే సంప్రదాయం ఉందన్నారు. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్ సీఎంలుగా ఉండగా నాగార్జునసాగర్లో ఏ నీటిమట్టం ఉన్నా జూలై ఒకటి నాటికి ముందుగా డెల్టాకు మాత్రమే నీటిని విడుదల చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణకు చెందిన కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో డెల్టాకు సెప్టెంబర్ 15 వరకు నీటిని విడుదల చేయకుండా జూరాల ప్రాజెక్టు కింద ముందుగా సాగుకు నీటిని విడుదల చేశారని చెప్పారు. ఇది డెల్టా చరిత్రలో ప్రథమ వినియోగపు హక్కును కాలరాసిన మొట్టమొదటి చర్య అని తెలిపారు. ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన మండవ వెంకటేశ్వరరావు, సుదర్శన్రెడ్డి వంటివారు కూడా ఇదే పనిచేశారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే డెల్టా శాశ్వతంగా బీడుబారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాగుకు కూడా నీరు లేక ప్రజలు మొత్తం వలసపోవల్సి వస్తుందన్నారు. ఫలితంగా జల యుద్ధాలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అందుకే అన్నివర్గాల వారూ ఆందోళనలు ఉధృతం చేయాలన్నారు. -
వాడవాడలా‘మహా’ నివాళి
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతి జిల్లాలో సోమవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన మేలును జిల్లా వాసులు స్మరించుకున్నారు. జిల్లావ్యాప్తంగా సంస్మరణ సభలు, విగ్రహాలకు క్షీరాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలు విరివిగా నిర్వహించారు. జిల్లాకు మేలు చేసిన రాజన్నా.. నిన్ను మరువం అంటూ అనేక చోట్ల స్థానికులు, గ్రామ ప్రజలు పార్టీలకతీతంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సాక్షి, విజయవాడ : జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పట్టణంలో, గౌరవరంలో జరిగిన సభల్లో ఉదయభాను పాల్గొన్నారు. జగయ్యపేటలో స్థానిక నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నంలో పార్టీ పట్టణ నేతలు కిలారి రాధ, షేక్ సలార్ దాదా, గొర్రా విఠల్ పలువురు నేతలు జిల్లా కోర్టు, బైపాస్ రోడ్డు సెంటర్లో ఉన్న దివంగత వైఎస్సార్ విగ్రహాలకు నివాళి అర్పించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. వలందపాలెంలోని పాఠశాలలో పార్టీ నాయకులు శీలం మారుతీరావు నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు నేతృత్వంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. మొత్తం 209 మంది రక్తదానం చేశారు. నాగాయలంకలో పార్టీ నాయకులు గుడివాక శివరావు వెయ్యిమందికి అన్నదానం చేశారు. హనుమాన్జంక్షన్లో జరిగిన భారీ అన్నదాన, రక్తదాన శిబిరంలో పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు పాల్గొన్నారు. గుడివాడలో స్థానిక నేత పొలుసు సురేంద్ర నేతృత్వంలో లయన్స్ కంటి వైద్యశాల సహకారంతో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పామర్రు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన నేతృత్వంలో వెయ్యి మందికి అన్నదాన శిబిరం నిర్వహించారు. మైలవరంలో పార్టీ సమన్వయకర్తలు జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్లు వర్ధంతి కార్యక్రమాలు చేపట్టారు. జోగి రమేష్ నేతృత్వంలో రెండు వేల మందికి అన్నదానం, జ్యేష్ఠ రమేష్ నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నూజివీడులో పార్టీ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందిగామలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పలు కార్యక్రమాలు నిర్వహించారు. కోనాయపాలెం, కొడకటికల్లులో పార్టీ నేతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పెడన నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్ల నేతృత్వంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తిరువూరు నియోజకవర్గంలో పార్టీ నాయకుడు తిరుపతి నారాయణరెడ్డి రక్తదాన శిబిరం నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త తాతినేని పద్మావతి నేతృత్వంలో పెనమలూరు, గంగూరులో కార్యక్రమాలు జరిగాయి. గంగూరు సర్పంచ్ నందేటి దేవమణి, పార్టీ నేత రహీమ్లు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కంకిపాడు మండలంలో జరిగిన వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ సమన్వయకర్త పడమట సురేష్బాబు పాల్గొన్నారు. కైకలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో 23 అడుగుల దివంగత వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మూడు వేల మందికి అన్నదాన శిబిరం నిర్వహించారు. -
విడిపోతే విపరీతాలే : భాను
జగ్గయ్యపేట అర్బన్, న్యూస్లైన్ : అసమర్ధ పాలకుల చేతకాని తనం వల్ల అసలే అంతంమాత్రంగా బతుకీడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రం విడిపోతే మరిన్ని విపరీత అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సాగునీరందక, అరకొర విద్యుత్తో సీమాంధ్ర అన్ని విధాలుగా నష్టపోయి అంధకారమయమవుతుందని తెలిపారు. 58 రోజులుగా అమరణ నిరాహార దీక్షచేపట్టి ఆత్మబలిదానం ద్వారా సమైక్యాంధ్రను సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పోడవటం సీమాంధ్రవాసుల దౌర్భాగ్యమన్నారు. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా తెలుగు వారంతా కలసి ఉంటేనే సుఖంగా ఉంటారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉన్నత, సాంకేతిక విద్య నభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల విషయంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయని, ప్రత్యేక ప్యాకేజీల ద్వారా వాటిని అభివృద్ధి చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. ఎగువ ప్రాంతంలో ప్రవహించే గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణా వారి ఆధిపత్యం కొనసాగి డెల్టా ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. కావేరి జలాల విషయమై కర్నాటక, తమిళనాడు వివాదాల వలే నిత్యం జలపోరాటాలు తప్పవని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రవహించే మునేరుపై ఖమ్మం జిల్లా మధిర వద్ద డెప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క డ్యాం నిర్మిస్నున్నారని, దీనివల్ల పేట నియోజకవర్గంలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు ప్రాంతంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందక ఎండిపోయే ప్రమాదముందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఒకే నినాదంతో సీమాంధ్ర ప్రజలంతా ఏకం కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, అఖిలపక్ష, ఎన్జీవో, ఉద్యోగ సంఘాల జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఉద్యమాన్ని విరమించేదిలేదు.. జగ్గయ్యపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విరమించేది లేదని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వద్ద నిర్వహిస్తున్న రెండో రోజు రిలే నిరాహార దీక్షలను బుధవారం ఆయన సందర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు. దీక్షలో కూర్చున్నవారిలో టూవీలర్ మెకానిక్స్ అసోసియేషన్ సభ్యులు జి.ముక్తేశ్వరరావు, ఉపేంద్ర, బి.రంగా, ఎండి. కలీల్ , ఎస్కె.హఫీజ్, సైదా,నాగులు, షమ్మీముల్లా, మున్నా తదితరులు ఉన్నారు. అఖిల పక్ష , జేఏసీ ప్రతినిధులు జే.ఉదయభాస్కర్, ఎస్ఎం.రఫీ, మనోహర్,రాంబాబు, న్యాయవాది రాము, జగదీష్, అబ్బాస్ ఆలీ, కన్నా నరసింహారావు, కొప్పాల శ్రీను, వెంకట్రావు, ఉషారాణి, రఘుబాబు, నారాయణరావు, శేషంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తుల ర్యాలీ... సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పట్టణంలోని రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సమైక్యవాదులు కాగడాలు, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాలు, ఎన్జీవో, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.