Samsung Galaxy
-
శాంసంగ్ ప్రీమియమ్ ఫోన్పై భారీ తగ్గింపు
మంచి కెమెరా, డిస్ప్లే, పనితీరు, క్లీన్ యూజర్ ఎక్స్పీరియన్స్తో గతేడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. అప్పట్లో అధిక ధర కారణంగా ఈ ప్రీమియమ్ ఫోన్ను కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్ ఇప్పుడు తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్ల తరువాత రూ .93,000 కంటే తక్కువకు లభిస్తుంది. మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా వచ్చినప్పటికీ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాకు క్రేజ్ అలాగే ఉంది. కాబట్టి మంచి కెమెరా, ఏఐ ఫీచర్లతో సరైన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్ల కోసం చూస్తున్నట్లయితే అమెజాన్కి వెళ్లి ఈ డీల్ చూడవచ్చు.తగ్గింపు అలర్ట్శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్లో రూ.98,499గా ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.1,29,999. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే రూ.2,955 తగ్గింపు లభిస్తుంది. అలాగే కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ ఆదా కోసం), రూ .4,775 నుండి ప్రారంభమయ్యే స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ కొనుగోలు కోసం మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయవచ్చు. దీనికి ఆ ఫోన్ మోడల్, వర్కింగ్ కండీషన్, బ్రాండ్ను బట్టి రూ.22,800 వరకు పొందవచ్చు. యాడ్-ఆన్లుగా వినియోగదారులు రూ .6,999 టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్ను కూడా ఎంచుకోవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్పెసిఫికేషన్లు120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల క్యూహెచ్ డీ+ అమోఎల్ఈడీ ప్యానెల్ ను ఇందులో అందించారు. ఈ డివైజ్ 2,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్పై నడుస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ 45వాట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఇప్పటికే లైవ్ ట్రాన్స్లేట్, సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లను అందిస్తోంది. రాబోయే ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అప్డేట్తో ఇది మరిన్ని ఏఐ ఫీచర్లను పొందుతుంది.కెమెరా విషయానికొస్తే.. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో పాటు అదనంగా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. -
2024లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే (ఫొటోలు)
-
రూ.31వేల ఈ లేటెస్ట్ 5జీ ఫోన్ ఇప్పుడు రూ.23వేలే..!
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లతో కస్టమర్లలో మంచి ఆదరణ పొందిన శాంసంగ్ కంపెనీకి చెందిన ప్రముఖ 5జీ మోడల్ ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఇప్పుడు భారీ డిస్కౌంట్తో రూ.22,999 లకే అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్ రూ.30,999 ప్రారంభ ధరతో గతేడాది లాంచ్ అయింది. రూ. 3,000 తగ్గింపు తాజగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్పై రూ. 3,000 తగ్గింపు లభించింది. దీంతో 6GB+128GB మోడల్ వేరియంట్ రూ.22,999లకే అందుబాటులోకి వచ్చింది. 8GB +128GB వేరియంట్ దాని అసలు ధర రూ. 27,499లకు బదులుగా రూ. 24,499లకే లభిస్తోంది. మరోవైపు 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ. 26,499లకే అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ ఇండియా వెబ్సైట్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5G ఫీచర్లు FHD+ రిజల్యూషన్తో 6.6-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 1080 SoC 8GB వరకూ ర్యామ్, 256GB ఆన్బోర్డ్ స్టోరేజ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 mAh బ్యాటరీ OISతో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ 5MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 13MP సెల్ఫీ కెమెరా స్టీరియో స్పీకర్లు 5G, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, GPS కనెక్టివిటీ కోసం USB టైప్-సి పోర్ట్ -
త్వరలో విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్24.. ధర ఎంతంటే?
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ను విడుదల చేయనుంది. గెలాక్సీ ఎస్ 23 ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ను ఇప్పటికే మార్కెట్కి పరిచయం చేసిన ఫోన్లను విడుదల చేసిన తర్వాతనే ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్లను విడుదల చేయాలని శాంసంగ్ భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నివేదికల ప్రకారం.. ఈ కొత్త సిరీస్లో బేస్ గెలాక్సీ ఎస్24,గెలాక్సీ ఎస్ 234 ప్లస్, గెలాక్సీ ఎస్ 24 ఆల్ట్రాలు ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్ 24 సిరీస్ను కొత్త ఏడాది జనవరి 17న అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే కార్యక్రమంలో విడుదల చేసే అవకాశం ఉందని ఎస్బీఎస్ బిజ్ రిపోర్ట్ తెలిపింది. శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ మోడల్ను సౌత్ కొరియాలో సుమారు రూ.70 వేల లోపు ధరతో విక్రయించనుంది. ఇంచు మించు శాంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఫోన్ ధరలు సైతం అదే స్థాయిలో ఉండనున్నాయి. వీటి ఖచ్చిత ధర ఎంతనేది తెలియాలంటే ఈ ఫోన్ సీరీస్ విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సి ఉంది. యాపిల్ ఐఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ ఆర్థిక మాంద్యం కారణంగా గెలాక్సీ ఎస్ 23 సిరీస్, ఎస్ 24 సిరీస్ ఫోన్ల అమ్మకాల తగ్గకుండా ఉండేలా వ్యూహాత్మకంగా మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేయనుంది శాంసంగ్ . తద్వారా వాటి సేల్స్ పెంచుకోవాలని భావిస్తుంది. -
హైదరాబాద్ : కొత్త స్మార్ట్ఫోన్ లాంచింగ్లో మెరిసిన నటి శ్రీలేఖ - ఫోటోలు
-
శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్: అదిరిపోయే ఫోల్డబుల్ స్మార్ట్పోన్స్, వాచ్ 6, ప్యాడ్ 9 సిరీస్ (ఫోటోలు)
-
స్మార్ట్ఫోన్స్ కొనేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Big Saving Days) పేరుతో తాజా సేల్ ఈవెంట్ను ప్రకటించింది. ఈ సేల్ జూన్ 10న ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగనుంది. ఈ పరిమిత కాల సేల్లో ఐఫోన్ 13, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23, పోకో ఎక్స్5తో సహా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్కార్ట్ బెస్ట్ డీల్స్, ఆకర్షణీయ తగ్గింపులను అందిస్తోంది. వీటితోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్స్.. ఫ్లాట్ డిస్కౌంట్స్ ⮞ ఐఫోన్13 (iPhone 13) 128జీబీ స్టోరేజ్ వేరియంట్ను ఫ్లిప్కార్ట్ రూ.58,749 నుంచి ఆఫర్ చేస్తోంది. ఇది యాపిల్ ఆన్లైన్ స్టోర్లో రూ.69,900 ఉంది. అంటే రూ. 11,151 ఫ్లాట్ తగ్గింపు . అదనంగా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు అదనంగా 10 శాతం తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.57,999లకే ఐఫోన్13ను కొనుగోలు చేయవచ్చు . ⮞ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 (Samsung Galaxy F23) 5Gని రూ.13,499లకే అందిస్తోంది. మార్చిలో లాంచ్ అయినప్పుడు దాని అసలు ధర రూ.17,499. రూ.6,500 తగ్గింపు అంటే ఎవరు వదులుకుంటారు? ఇంకా తక్కువ ధరకు ఫోన్ కావాలనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) రూ. 10,999 లకే అందుబాటులో ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం14 (Samsung Galaxy M14)ని అయితే ఫ్లిప్కార్ట్లో రూ. 14,327 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ⮞ ఇక రూ.15,499 ఉన్న మోటో జీ62 (Moto G62) రూ. 14,499లకు, 15,499 ఉన్న పోకో ఎక్స్5 (Poco X5 5G)ని రూ.14,999లకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.4,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్ -
ఆధునిక ఫీచర్లతో విడుదలవుతున్న కొత్త స్మార్ట్ ఫోన్ ఇదే
-
బంపరాఫర్ : రూ.23వేల ఫోన్ రూ.10వేలకే సొంతం చేసుకోండిలా!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో సరికొత్త సేల్తో ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు జరిగే ఈ సేల్లో వైడ్ రేజ్ స్మార్ట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫోన్లపై 40 శాతం భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్లో ఇటీవలే విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ23పై బంపరాఫర్ ప్రకటించింది. రూ.10వేల కంటే ధరకే కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. (క్రెడిట్కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) తగ్గిన 5జీ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ 6జీబీ ర్యామ్ అండ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ అసలు ధర రూ.23,990కే ఉండగా సేల్లో 27 శాతం డిస్కౌంట్తో రూ.17499కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్పై రూ.5వేల వరకు ట్రాన్సాక్షన్ చేస్తే రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్పై 5శాతం డిస్కౌంట్ తో పాటు ఇతర ఆఫర్లు కలుపుకుంటే రూ.16499కే సొంతం చేసుకోవచ్చు. చదవండి👉 అమెజాన్లో ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్! శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఎక్ఛేంజ్ ఆఫర్ పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్ను పొందవచ్చు. ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద రూ.16300 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం మీరు వినియోగిస్తున్న ఫోన్ పనితీరు బాగుంటే శాంసంగ్ గెలాక్సీ ఏ23ని ఎక్ఛేంజ్ ఆఫర్, ఇతర బ్యాంక్ ఆఫర్లతో రూ.10వేలకే కొనుగోలు చేసే వెసలు బాటు కల్పించింది అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ ఏ23లో 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో 6.6 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్- వీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 16జీబీ ర్యామ్, ఫోటోగ్రఫీ కోసం అల్ట్రా వైడ్, డెప్త్, మ్యాక్రోలెన్సెస్లతో 50 ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇదీ చదవండి: పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్వీడియో -
అదంతా ఫేకేనా.. శాంసంగ్ చీటింగ్ చేస్తోందా?
అత్యంత కెమెరా జూమింగ్ సామర్థ్యంతో శాంసంగ్ అల్ట్రా సిరీస్ స్మార్ట్ఫోన్లను గత నెలలో విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ స్పేస్ జూమ్ ఫీచర్తో వచ్చింది. అయితే ఈ ఫోన్ తీసే స్పేస్ జూమ్ ఫోటోలు నకిలీవని తాను చేసిన పరిశోధనలో తేలిందని ఓ రెడిట్ యూజర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Oscar Award: థియేటర్ నుంచి ఆస్కార్కు.. ఈ పాప్కార్న్ గయ్ మామూలోడు కాదు.. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ ఎస్23 జూమ్ లెన్స్లతో తీసిన చంద్రుని ఫోటోలను అందరూ ఆసక్తిగా చూశారు కానీ వాటి ప్రామాణికతపై తనకు మొదటి నుంచే సందేహాలు ఉన్నాయని, అవి పూర్తిగా అసలైనవి కావని అని రెడిట్లో ibreakphotos అనే పేరుతో ఉన్న ఓ యూజర్ పోస్ట్ చేశారు. దానికి సంబంధంచి పూర్తి వివరణ కూడా అందులో ఇచ్చారు. ఇదీ చదవండి: Oscar Awards: ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ.. తాను ఇంటర్నెట్ నుంచి చంద్రుని హై రెజల్యూషన్ ఫొటోను డౌన్లోడ్ చేసి దాని సైజ్ తగ్గించి గాస్సియన్ బ్లర్ను అప్లయి చేశానని, దీంతో అస్పష్టంగా మారిందని రెడిట్ యూజర్ పేర్కొన్నారు. ఆ తర్వాత దాన్ని శాంసంగ్ స్పేస్ జూమ్ కెమెరాతో ఫొటో తీస్తే ఆ ఫొటో చాలా స్పష్టంగా వచ్చిందని తెలిపారు. కానీ అది అసలైన ఫొటో కాదని, ఇలా అస్పష్టంగా ఉన్న ఫొటో స్పష్టంగా చేసేందుకు శాంసంగ్ ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మోడల్ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఇదీ చదవండి: ట్విటర్ తరహాలో మెటా.. జుకర్బర్గ్పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు! -
ఐఫోన్ యూజర్లు జాగ్రత్త... ప్రభుత్వ హెచ్చరిక!
యాపిల్ ఐఫోన్లు ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన స్మార్ట్ఫోన్లు. చాలా మందికి ఇవంటే మోజు. డిజైన్, ఇతరత్రా ఫీచర్ల కోసం వీటిని ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తున్న తమ ఫోన్ల భద్రత విషయంలో ఆపిల్ సంస్థ ఎప్పటికప్పడు నూతన ఐఓఎస్ వర్షన్లను విడుదల చేస్తూనే ఉంటుంది. వాటిని వెంటనే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది కొత్త వర్షన్లను అప్డేట్ చేయకుండా పాత వర్షన్లనే వినియోగిస్తుంటారు. అలాంటి వారిని భారత ప్రభుత్వం హెచ్చరించింది. పాత వర్షన్లు సురక్షితం కాదని, హ్యాకర్లు సులువుగా వాటిని హ్యాక్ చేస్తున్నారని గుర్తించిన మీదట ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అందించిన నివేదిక ప్రకారం.. ఐఓఎస్లో హ్యాకింగ్కు అనేక ఆస్కారాలు ఉన్నాయి. యూజర్ల సున్నితమైన సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. 16.3.1, అంతకు ముందుటి వర్షన్లతో ఉన్న ఐఫోన్8 లేదా ఆ తర్వాత వచ్చినవి, ఐపాడ్ ప్రో అన్ని మోడళ్లు, ఐపాడ్ ఎయిర్ థర్డ్ జనరేషన్, ఆ తర్వాతవి, ఐపాడ్ ఎయిర్ ఫిఫ్త్ జనరేషన్, ఆ తర్వాతివి, ఐపాడ్ మినీ ఫిఫ్త్ జనరేషన్, ఆతర్వాతి వాటిపై హ్యాకర్ల ప్రభావం ఉంటుందోని పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ యూజర్లు కూడా.. అలాగే శాంసంగ్ గెలాక్సీ వినియోగదారులకు కూడా భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. శాంసంగ్ కూడా తమ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త వర్షన్లను సూచిస్తూనే ఉంటుంది. అయితే పాత వర్షన్లకు అలవాటు పడిన వినియోగదారులు వాటిని అలాగే కొనసాగిస్తుంటారు. అలాంటి జాగ్రత్త పడాలి. ఈ స్మార్ట్ఫోన్లలో వచ్చే శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్లో హ్యాకింగ్ ప్రమాద ఆస్కారాన్ని గుర్తించినట్లు CERT-In పేర్కొంది. 4.5.49.8కి ముందుటి శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్ వెర్షన్తో ఫోన్లను ఇది ప్రభావితం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలోనూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హ్యాకింగ్ ప్రమాదాన్ని గుర్తించింది. 109.0.1518.78కి ముందున్న ఎడ్జ్ బ్రౌజర్ వెర్షన్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఇది టార్గెటెడ్ సిస్టమ్లో డినైల్ ఆఫ్ సర్వీస్ (DoS) ఆప్షన్లను సైతం మార్చగలిగే అవకాశాన్ని హ్యాకర్రకు ఇస్తుంది. -
శాంసంగ్ బీఎండబ్ల్యూ స్పెషల్ ఎడిషన్.. 1000 ఫోన్లే..
శాంసంగ్ ఇటీవలే తమ ప్రతిష్టాత్మక గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఇందులో మరో స్పెషల్ ఎడిషన్ను తీసుకొచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ తమ ఖరీదైన గెలాక్సీ ఎస్23 అల్ట్రా సిరీస్లో బీఎండబ్ల్యూ ఎడిషన్ను ఆవిష్కరించింది. ఈ స్పెషల్ ఎడిషన్కు బీఎండబ్ల్యూ ఎం ఈ30 కారుకు గుర్తుగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం పేరు పెట్టారు. 1986లో ఈ కారు లాంచ్ అయింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ అని, కేవలం 1000 ఫోన్లు మాత్రమే విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. అది కూడా దక్షిణ కొరియాలో మాత్రమే ఎస్కే టెలికాం సంస్థ ద్వారా ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్లు లభిస్తాయి. కొత్తగా విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఫోన్కు వర్టికల్ కిడ్నీ గ్రిల్, బీఎండబ్ల్యూ ఎం కారు బోనెట్ వంటి దృఢమైన కేస్ ఉంటుంది. ఆకర్షణీయమైన బీఎండబ్ల్యూ ఎం కారు రంగులతో ఇందులో యానిమేషన్ ఫీచర్ ఇచ్చారు. రిమూవబుల్ కీరింగ్, ఇంటర్చేంజబుల్ బీఎండబ్ల్యూ లోగోలు అదనపు ఆకర్షణ. దీంతో పాటు చిన్నపాటి ఎయిర్ కంప్రెషర్, మెటల్ లోగో ఇచ్చారు. ఈ ఫోన్ ధర 17.27 లక్షల సౌత్ కొరియన్ వాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1,12,790. (ఇదీ చదవండి: రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్లు) -
సరికొత్త రికార్డ్స్.. 24 గంటల్లో 1.4 లక్షల ఫోన్ల బుకింగ్స్!
దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో శాంసంగ్ సత్తా చాటుతోంది. ఆ సంస్థకు చెందిన గెలాక్సీ ఎస్ 23 ఫోన్లు ప్రీ బుకింగ్లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కరోజులోనే రూ.1400 కోట్ల విలువైన 1.4 లక్షల యూనిట్ల ప్రీమియం ఫోన్లను కొనుగోలు దారులు బుక్ చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. శాంసంగ్ ఫిబ్రవరి 1న గెలాక్సీ ఎస్ 23 సిరీస్లోని ‘గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా’ అనే మూడు వేరియంట్లు మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 23 వరకు కొనసాగనున్న ప్రీ బుకింగ్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. రెండు రెట్లు పెరిగి ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లాన్ మాట్లాడుతూ.. గతంలో తాము విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 కంటే రెండు రెట్లు పెరిగి సగటున ఫోన్ ధర సుమారు లక్ష రూపాయలు ఉన్న ఈ ఫోన్లు 24 గంటల్లో 1.4 లక్షల యూనిట్లు ప్రీ బుకింగ్స్ జరిగినట్లు చెప్పారు. ఫిబ్రవరి 23 ప్రీబుకింగ్ కొనసాగింపు ఇక ఈ ఫోన్ల ప్రీ బుకింగ్స్ ఫిబ్రవరి 23వరకు కొనసాగుతాయని చెప్పిన పుల్లాన్ .. శాంసంగ్ ఎస్ 23 సిరీస్ ధరలు రూ.75 వేల నుంచి రూ.1.55లక్షల వరకు ఉన్నాయని అన్నారు. భారత్లో తయారీ.. ఎక్కడంటే దేశీయ మార్కెట్లో విడుదలైన శాంసంగ్ ఎస్ 23 ప్రీమియం ఫోన్లు నోయిడా ప్లాంట్లో తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఇక గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లను మాత్రం వియాత్నం మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారు చేసి.. దిగుమతి అనంతరం భారత్లో అమ్మకాలు జరిపినట్లు వెల్లడించారు. -
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 వస్తోంది.. ఆ స్మార్ట్ఫోన్ ధర భారీగా తగ్గింది!
కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభావార్త. ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న శాంసంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీ ఎస్23 వేరియంట్లను గ్రాండ్గా లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడళ్లను ఆవిష్కరించింది. అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 రాకతో గెలాక్సీ ఎస్22 ధర భారీగా తగ్గింది. ఒక ఫోన్ లాంచ్.. మరొక ఫోన్ భారీగా తగ్గింపు ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్లో స్టాండర్డ్ మోడల్. గతేడాది గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మోడళ్లతోపాటు ఇది లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 లాంచ్ చేసినప్పుడు దీని ధర రూ.72,999. ఇప్పుడు 'గెలాక్సీ ఎస్23 సిరీస్ను విడుదల చేసిన నేపథ్యంలో గెలాక్సీ ఎస్22 స్టాండర్డ్ మోడల్ ఫోన్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.57,999. అలాగే ఇందులో 256జీబీ వేరియంట్ ధర రూ.61,999. శాంసంగ్ ఎస్22 ఫోన్ స్క్రీన్ సైజ్ 6.1 ఇంచులు. 120హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేటుతో ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ల్పేని కలిగి ఉంది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్సెట్ను కలిగిన ఈ ఫోన్లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపీ మెయిన్ సెన్సర్, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10ఎంపీ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 10ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కూడా దాదాపు ఇవే ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. అయితే గెలాక్సీ ఎస్23లో కొత్త కలర్ ఆప్షన్లు, అధిక బ్యాటరీ సామర్థ్యం, క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్సెట్ ఉన్నాయి. చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్, రూ. 5 లక్షలు దాటితే! -
శాంసంగ్ నుంచి కొత్త 5జీ ఫోన్లు.. ఫీచర్లు అదిరిపోయాయ్, లాంచ్ డేట్ అప్పుడే!
ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ శాంసంగ్ నూతన సంవత్సరంలో కొత్త మొబైల్ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఓ బడ్జెట్ ఫోన్ను లాంచ్ చేసిన ఈ కంపెనీ.. తాజాగా శాంసంగ్ ఏ సిరీస్ 5జీ (Samsung Galaxy A Series) ఫోన్లను జనవరి 18న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏ మోడల్ అన్నదానిపై ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఇటీవల యూఎస్, యూరప్లో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ (Samsung Galaxy A14), విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ మోడల్ స్మార్ట్ఫోన్ లాంచ్ అవుతుందనే తెలుస్తోంది. శాంసంగ్ మాత్రం దీనిపై పూర్తి సమాచారం తెలపకుండానే ఏ సిరీస్లో 5జీ ఫోన్లను విడుదల చేస్తామని, ఆ ఫోన్కు సంబంధించిన ప్రత్యేకతలను టీజ్ చేసింది. ప్రత్యేకతలు ఈ స్మార్ట్ఫోన్.. 120Hz రిఫ్రెష్ రేట్తో 6.6-అంగుళాల పూర్తి-HD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ముందు భాగంలో వాటర్డ్రాప్-స్టైల్ నాచ్తో వస్తోంది. బ్యాటరీ 2 రోజుల వరకు బ్యాకప్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిని చూస్తే ఇటీవల ప్రారంభించిన Galaxy A14 5G రూపకల్పనను పోలి ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్యూఐ 5.0 అందుబాటులోకి వచ్చింది. ఈనెల 18న సామ్సంగ్ ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీతో పాటు గెలాక్సీ ఏ23 5జీ మొబైళ్లను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. వీటితో పాటు గెలాక్సీ ఏ34 5జీ, గెలాక్సీ ఏ54 5జీ మోడళ్లకు కూడా విడుదలై అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
మీ ఫోన్ రిపేర్ అయ్యిందా? శాంసంగ్ యూజర్లకు శుభవార్త!
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరుగుతోంది. అందులోని ఫీచర్లు అంతలా ఆకట్టుకుంటోంది. అయితే ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ యూజర్ల పర్సనల్ డేటా (ఫోటోలు, చాట్, వీడియో) ఏదో ఓ రూపంలో అప్పుడప్పుడు బయటపడుతున్నాయి. వీటిలో ప్రధానంగా మన ఫోన్ రిపేర్ అయిన సందర్భాల్లో డేటా తస్కరించడం లాంటి జరుగుతుంటాయి. ఎలా అంటారా ఆ సమయంలో కొన్ని రోజుల పాటు రిపేర్ షాపులో మన ఫోన్ని ఉంచకతప్పదు. అప్పటి నుంచి ఫోన్లోని డేటాకు సంబంధించి ఆందోళనపడడమో, లేదా డేటాను ముందుగానే డిలీట్ చేసి బ్యాకప్ చేసుకోవడం లాంటి పనులు మనకు షరా మామూలే. ఇకపై అలాంటివి ఇబ్బందులు ఎదురుకాకుండా శాంసంగ్ కంపెనీ తమ కస్టమర్ల కోసం కొత్త ఫీచర్ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా మన డేటా సేఫ్గా ఉంటుంది. దక్షిణ కొరియా శాంసంగ్ తెలిపిన వివరాల ప్రకారం తమ కంపెనీ ఫోన్లలో రిపేర్ మోడ్ పేరుతో అదిరిపోయే ఫీచర్ను ప్రవేశపెడుతోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 (Samsung Galaxy S21) సిరీస్కు ఈ ఫీచర్తో విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే ఇతర మోడళ్లకు కూడా ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఎలా పని చేస్తోంది ఈ ఫీచర్ మొబైల్లోని సెట్టింగ్ యాప్లో “బ్యాటరీ అండ్ డివైస్ కేర్” ఆఫ్షన్కి వెళ్లి రిపేర్ మోడ్ని ఆన్ చేయాలి. దీంతో మీ స్మార్ట్ఫోన్ రీబూట్ అవుతుంది. ఆ తర్వాత, ఫోటోలు, మెసేజ్లు, ఖాతాలు మొదలైన వాటితో సహా మీ వ్యక్తిగత డేటాను ఎవరూ యాక్సెస్ చేయలేరు. వెంటనే ఫోన్లో రిపేర్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. దీని ద్వారా మీ ఫోన్ రిపేర్ చేసే వ్యక్తికి మన డేటా కనిపించకుండా చేస్తుంది. ఆ సమయంలో కేవలం ఫోన్లో డిఫాల్ట్ ఇన్స్టాల్ చేసిన యాప్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫోన్ రిపేర్ పూర్తి కాగానే మనం మళ్లీ మొబైల్ని రీబూట్ చేసి వేలిముద్ర లేదా లాక్ ఆన్ చేయడం ద్వారా రీపేర్ మోడ్ డీయాక్టివేట్ చేయవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను శాంసంగ్ తెలపాల్సి ఉంది. చదవండి: సూపర్ వ్యాన్.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
శాంసంగ్కు భారీ షాక్.. 30రోజుల గడువిచ్చిన కోర్టు.. మాట వినకపోతే..
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శామ్సంగ్కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఝలకిచ్చింది. స్మార్ట్ ఫోన్లుకు సంబంధించి తప్పుదోవ ప్రకటనలు ఇచ్చినందుకు కోర్టు శామ్సంగ్కు 14 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం రూ.78 కోట్లు) ఫైన్ విధించింది. ఈ మొత్తాన్ని కూడా 30 రోజుల్లోగా చెల్లించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జస్టిస్ బ్రెండన్ ముర్ఫీ తీర్పునిచ్చారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై విచారణ జరిపినందుకుగాను ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్కి కూడా అదనంగా మరో 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం రూ.1.10 కోట్లు) చెల్లించాలని ఆదేశించారు. 2016 నుంచి 2018 మధ్య S7, S7 ఎడ్జ్.A5 (2017), A7 (2017), S8, S8 ప్లస్, నోట్ 8 గెలెక్సీ ఫోన్లను శామ్సంగ్ ఆస్ట్రేలియాలో విక్రయించింది. ప్రత్యేకంగా వీటిని తయారు చేశామని నీళ్లలో తడిచినా పాడవవంటూ భారీగా ప్రకటనలు కూడా ఇచ్చింది. నీళ్లలో ఈ ఫోన్లు ఉంచినప్పుడు ఛార్జింగ్ పోర్టులు పాడయ్యాయి. దీంతో తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఆస్ట్రేలియన్ కాంపీటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి 2019లో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై శాంసంగ్ స్పందిస్తూ.. 2016 నుంచి 2017 మధ్యలో అమ్మకాలు జరిపిన ఏడు మోడళ్లపై మాత్రమే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. ప్రస్తుత శాంసంగ్ ఫోన్లలో ఈ తరహా సమస్యలు లేవని తెలిపింది. చదవండి: Gmail Storage: మీ ఇ-మెయిల్ బాక్స్ నిండిపోయిందా, సింగిల్ క్లిక్తో ఇలా చేయండి! -
శాంసంగ్ షాకింగ్ నిర్ణయం..ఆ సిరీస్ ఫోన్ తయారీ నిలిపివేత! ఎందుకంటే!
శాంసంగ్ సంస్థకు చెందిన గెలాక్సీ ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్లు కనుమరుగు కాన్నాయి. ఇప్పటికే గెలాక్సీ ఎస్ ఎఫ్ఈ (ఫ్యాన్ ఎడిషన్) పేరుతో పలు ఫోన్లను విడుదల చేసింది. కానీ ఈ ఏడాది మాత్రం ఈ తరహా సిరీస్ ఫోన్లను శాంసంగ్ తయారు చేయబోదని, వాటిని ప్రొడక్షన్ను నిలిపివేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే గెలాక్సీ ఎస్22 ఎఫ్ఈ మోడల్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం..శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎస్ఎఫ్ పేరుతో 12 రకాలైన ఫోన్లను మార్కెట్కి పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో గెలాక్సీ ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. టోన్ డౌన్ ఫ్లాగ్ షిప్ మోడల్ ఫోన్లపై రూ.60వేల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తోంది. వాటి స్థానంలో మంచి ఫీచర్లతో బడ్జెట్ ఫోన్లను కొనుగోలు దారులకు అందించాలని చూస్తుంది. చిప్ దెబ్బ శాంసంగ్ ఎఫ్ఈ మోడళ్లు నిలిపివేడయానికి ప్రధాన కారణం చిప్ కొరత, పెరిగిపోతున్న ప్రొడక్షన్ ఖర్చేనని తెలుస్తోంది. అందుకే తయారీ తగ్గించి వినియోగదారులకు నచ్చే బడ్జెట్ స్మార్ట్ఫోన్ల తయారీపై శాంసంగ్ దృష్టిపెట్టనుంది. బాబోయ్ ఖర్చుల భారం పెరిగిపోతున్న ప్రొడక్షన్ ఖర్చుతో పాటు ఇతర కారణాలు శాంసంగ్ స్మార్ట్ ఫోన్పై మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే శాంసంగ్ భారత్లో ఫీచర్ ఫోన్లు అమ్మకాల్ని నిలిపివేసింది. ఇప్పుడు గెలాక్సీ ఎఫ్ఇ సిరీస్ను నిలిపి వేయనుందని వార్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చక్కెర్లు కొడుతుండగా.. ఫోన్ నిలిపివేతపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆగస్ట్లో మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ , జెడ్ ఫ్లిప్ 4 స్మార్ట్ ఫోన్లను త్వరలో నిర్వహించే ఈవెంట్లో పరిచయం చేయనుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్లో జరగనున్న శాంసంగ్ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చదవండి👉 భారత్కు శాంసంగ్ భారీ షాక్! ఇకపై ఆ ప్రొడక్ట్లు ఉండవట! -
శాంసంగ్కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్ఫోన్ యూజర్లు.!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్కు హ్యాకర్లు గట్టిషాక్ను ఇచ్చారు. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్స్కు చెందిన సోర్స్ కోడ్ను, కంపెనీ అంతర్గత విషయాలను హ్యకర్లు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. సోర్స్ కోడ్ను హ్యకర్లు దొంగిలించినట్లుగా శాంసంగ్ సోమవారం(మార్చి 8)న ధృవీకరించింది. అత్యంత సున్నితమైన సమాచారం..! ప్రముఖ టెక్ బ్లాగ్ బ్లీపింగ్ కంప్యూటర్(Bleeping Computer) ప్రకారం..గెలాక్సీ స్మార్ట్ఫోన్స్కు సంబంధించిన సోర్స్ కోడ్ను 'Lapsus$' అనే హ్యకర్ల బృందం దొంగిలించినట్లు తెలుస్తోంది. సుమారు 190GB సీక్రెట్ డేటాను హ్యకర్లు సేకరించారు. సోర్స్ కోడ్తో పాటుగా, కంపెనీకి సంబంధించిన అంతర్గత డేటాను హ్యకర్లు బహిర్గతం చేశారు. ఇక ఈ సోర్స్ కోడ్లో సున్నితమైన కార్యకలాపాల కోసం ఉపయోగించే విశ్వసనీయ ఆప్లెట్ (TA) సోర్స్ కోడ్ , బూట్లోడర్ సోర్స్ కోడ్, శాంసంగ్ అకౌంట్కు చెందిన ప్రామాణీకరణ కోడ్ వంటివి ఉన్నాయి. కాగా ఈ హ్యకర్ల బృందం గత నెల ఫిబ్రవరిలో NVIDIA నుంచి కూడా డేటాను దొంగిలించింది. ఎలాంటి భయం లేదు..! ఈ సైబర్ దాడిపై శాంసంగ్ వివరణను ఇచ్చింది. ఈ సోర్స్ కోడ్లో గెలాక్సీ స్మార్ట్ఫోన్స్ ఆపరేషన్కు సంబంధించిన కొంత సోర్స్ కోడ్ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఆయా శాంసంగ్ యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. దీనిలో గెలాక్సీ యూజర్లకు, కంపెనీ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం లేదని శాంసంగ్ వెల్లడించింది. ఇది కంపెనీ వ్యాపారం లేదా కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ అభిప్రాయపడింది. ఇటువంటి సంఘటనలను నిరోధించడానికి మరిన్ని పటిష్టమైన చర్యలను అమలు చేస్తామని శాంసంగ్ తెలిపింది. కాగా హ్యాక్ చేసిన డేటాను అత్యంత సున్నితమైనది పరిగణించబడుతుందని శాంసంగ్ పేర్కొంది. చదవండి: క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..! -
అదిరిపోయే ఫీచర్లతో, దేశీయ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ రూ.15వేల లోపు బడ్జెట్ ధరతో అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. గతేడాది శాంసంగ్ మనదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఏ03, గెలాక్సీ ఏ03ఎస్ సిరీస్లో 3వ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీని ఏ 03ని తాజాగా దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ ధర శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ ని రెండు స్టోరేజ్ ఆప్షన్లతో లాంచ్ చేసింది. 3జీబీ ప్లస్ 32జీబీ స్టోరేష్ ఆప్షన్ ధర రూ.10499 ఉండగా 4జీబీ ప్లస్ 4జీబీ ప్లస్ 64జీబీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది. ఇక ఈ ఫోన్ నలుపు, నీలం, ఎరుపు వేరింయంట్ కలర్స్లో లభ్యం అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ స్పెసిఫికేషన్లు • శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ టీఎఫ్టీ డిస్ప్లే • 60హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ • యూఎన్ఐ ఎస్ఓసీ టీ606 ఎస్ఓఎస్తో వస్తుంది. • గరిష్టంగా 4జీబీ ర్యామ్,64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ • 1టెరాబైట్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు • మైక్రో ఎస్డీ కార్డ్ని ఉపయోగించవచ్చు. • వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. • 48ఎంపీ మెయిన్ కెమెరా సెన్సార్తో వస్తుంది. • ఇందులో 2MP డెప్త్ సెన్సార్ తో పాటు సెల్ఫీల కోసం, ఫోన్లో 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. • ఆండ్రాయిడ్ 11కి సపోర్ట్ చేస్తుంది. -
ప్రీ బుకింగ్స్ బీభత్సం!! 12గంటల్లో 70వేల ఫోన్ల బుకింగ్స్!
సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త రికార్డ్లు క్రియేట్ చేస్తుంది. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ 2022 ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మూడు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సిరీస్ ఫోన్ ప్రీ బుకింగ్స్ శాంసంగ్ ఇండియా ప్రతినిధుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫిబ్రవరి 23నుంచి శాంసంగ్ ప్రీ బుకింగ్స్ ను ప్రారంభించింది. కేవలం 12గంటల్లో 70వేల ఫోన్లు ప్రీ బుకింగ్ అయ్యాయి. ధర ఎంతంటే..? దేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 8జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజ్ ఫోన్ ప్రారంభ ధర రూ.72,999, 8జీబీ ప్లస్ 256 జీబీ మోడల్ ధర రూ.76,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ 8జీబీ ప్లస్ 128జీబీ ధర రూ. 84,999 నుండి ప్రారంభం కానుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.88,999గా ఉంది. మరోవైపు, శాంసంగ్ గెలాక్సీ ఆల్ట్రా ఎస్22 12జీబీ ప్లస్ 256జీబీ ధర రూ.1,09,999 ఉండగా 12జీబీ ప్లస్ 512జీబీ మోడల్ ధర రూ.1,18,999గా ఉంది. ఫోన్ బుక్ చేసుకుంటే ఆఫర్ ఎంతంటే? కంపెనీ ప్రకారం..శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా ఫోన్ని బుక్ చేసిన కస్టమర్లు రూ.26,999 విలువైన గెలాక్సీ వాచ్4ని రూ.2999కే సొంతం చేసుకోనున్నారు. అలాగే గెలాక్సీ ఎస్ 22ప్లస్, గెలాక్సీ ఎస్ 22ని ప్రీ బుకింగ్ చేసే కస్టమర్లు రూ.11,999 విలువైన గెలాక్సీ బడ్స్2 ని రూ.999కే పొందనున్నారు. అదనంగా, గెలాక్సీ ఎస్, గెలాక్సీ నోట్ సిరీస్ కస్టమర్లు రూ.8000 అప్గ్రేడ్ బోనస్, డివైజ్ హోల్డర్లు రూ. 5000 అప్గ్రేడ్ బోనస్, ప్రత్యామ్నాయంగా శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్ ద్వారా ఫోన్ను బుక్ చేసుకున్న కస్టమర్లు అదనంగా రూ.5000 క్యాష్బ్యాక్ను పొందవచ్చు. . ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ఆధిత్య బబ్బర్ మాట్లాడుతూ.. దేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఫోన్ ప్రీ బుక్కింగ్స్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారం. వీలైనంత త్వరగా ఆ ఫోన్లను కస్టమర్లకు అందిస్తున్నట్లు చెప్పారు. -
'జియో ఫోన్ నెక్ట్స్' కంటే ధర తక్కువగా ఉన్న ఫోన్ ఇదే..!
బడ్జెట్ ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్'పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే దివాళీ సందర్భంగా విడుదల కానున్న జియో ఫోన్ ధర, ఫీచర్ల గురించి జియో సంస్థ స్పష్టత ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. అందుకు కారణం..దేశంలోనే అతితక్కువ ధరకే ఫోన్ అందిస్తామన్న జియో.. ఆ ఫోన్ ధరను రూ.6,499గా నిర్ణయించింది. ఈ ఫోన్ కంటే గతంలో విడుదలైన బడ్జెట్ ఫోన్లలో ఫీచర్లు ఎక్కువగా ఉండటమే కాదు ధర సైతం రూ.1500 తక్కువగా ఉందని చర్చించుకుంటున్నారు. చిప్సెట్ ఎఫెక్ట్ పెరుగుతున్న తయారీ, కాంపోనెంట్ ఖర్చుల కారణంగా జియో ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ ధర రూ.6,4999 ఉండగా.. ఈ ఫోన్ కంటే ధర తక్కువగా మనదేశంలో మరో ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం 01 ఉందని గుర్తు చేస్తున్నారు. జియో ఫోన్ నెక్ట్స్ కంటే తక్కువ ధర ఉన్న ఫోన్ ఇదే రిలయన్స్ డిజిటల్, ఫ్లిప్కార్ట్ లలో జియో ఫోన్ నెక్ట్స్ కంటే శాంసంగ్ గెలాక్సీ ఎం 01 కంటే తక్కువకే అమ్ముతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ, జియో ఫోన్ నెక్ట్స్ లో ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే శాంసంగ్ ఫోన్ ధర తక్కువ ప్రారంభ ధర రూ.4,999కే విక్రయిస్తుంది. జియో ఫోన్ కంటే రూ.1,500 తక్కువకే వస్తుంది. జియో ఫోన్ నెక్ట్స్ వర్సెస్ శాంసంగ్ గెలాక్సీ గెలాక్సీ ఎం 01 రెండు వేరియంట్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎం 01 బేసిక్ వెర్షన్ 1జీబీ ర్యామ్ ప్లస్ 16జీబీ స్టోరేజ్తో వస్తుంది. ఇక దీని ధర ఫ్లిప్ కార్ట్లో రూ. 4,999, రిలయన్స్ డిజిటల్లో రూ.5,199కి అందుబాటులో ఉంది. 2జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఫోన్ ధర రిలయన్స్ డిజిటల్లో రూ. 6,199 గా ఉంది. ఈ రెండు వేరియంట్లు జియో ఫోన్ కంటే తక్కువగా ఉండటం గమనార్హం. చదవండి: ఆనందంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉక్కిరి బిక్కిరి..ఎందుకంటే -
మరో 5జీ ఫోన్ సూపర్ ఫీచర్లు లీక్, ధర ఎంతంటే?
ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదల కానున్న మరో అఫార్డ్బుల్ 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం లీకైన ఈ ఫోన్ ఫీచర్స్, ధరలు ఇలా ఉన్నాయి. లీకైన ఫీచర్లు ప్రస్తుతం లీకైన శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ఫోన్ 6.48 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీతో విడుదల కానుంది. ట్రిపుల్ కెమెరా సెటప్, 50ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్, 5ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, వాటర్-డ్రాప్ నాచ్ ను కలిగి ఉంది. ఆన్లీక్స్ ప్రకారం.. లీకైన ఫోన్ 83.4 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నట్లు తెలుస్తోంది. ధర ఎంతంటే? వీటితో పాటు ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. గెలాక్సీ ఏ13 5జీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫోన్ బాక్స్ లోపల 15W ఛార్జింగ్ ఫ్యాక్తో రానుంది. 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సి పోర్ట్, ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇక ఈ ఫోన్ ధర యూఎస్, కెనడాలలో 18,800ఉండగా ఇండియాలో రూ .16,000కే అందుబాటులోకి రానుండగా..బ్లాక్, రెడ్, వైట్,బ్లూ కలర్ ఆప్షన్ వేరియంట్లలో విడుదల కానుంది. -
Samsung M 52 Review: బడ్జెట్ 5 జీ ఫోన్ రిలీజ్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
చైనా కంపెనీలకు దీటుగా మార్కెట్లోకి బడ్జెట్ ధరలో శామ్సంగ్ కొత్త ఫోన్లను తీసుకువస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ ఎం 52, 5జీ ఫోన్. అమెజాన్లో ప్రస్తుతం ఈ ఫోన్ బుకింగ్స్ మొదలయ్యాయి. అక్టోబరు 10 నుంచి ఈ ఫోన్ డెలివరీ కానుంది. ఈ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ రివ్యూ. బిగ్ బ్యాటరీ శామ్సంగ్లో ఎం సిరీస్ ఫోన్ల బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ. అందుకు తగ్గట్టుగానే ఈ ఫోన్లో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఎం సిరీస్లో ఇప్పటి వరకు వచ్చిన ఫోన్లలనీ మీడియం రేంజ్ బడ్జెట్ ఫోన్లే. కానీ ఎం 52 పాత ఫోన్లకి భిన్నంగా హై ఎండ్ ఫీచర్లను కలిగింది ఉంది. హై ఎండ్ ఫీచర్లు గెలాక్సీ ఎం 52 ఫోన్ 5జీ నెట్వర్క్ని సపోర్ట్ చేస్తుంది. ఇందు కోసం ఇందులో స్నాప్డ్రాగన్ 778 జీ ప్రాసెసర్ని ఉపయోగించారు. ఈ చిప్సెట్ 5 జీ నెట్వర్క్గి బాగా సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు ప్రస్తుతం హై ఎండ్ ఫోన్లకే పరిమితమైన 120 హెర్జ్ స్క్రీన్ రీఫ్రెస్ రేట్ ఇందులో లభిస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్గా గొరిల్లా గ్లాస్ 5ని అమర్చారు. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండగా ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్గా ఉంది. దీంతో పాటు కెమెరా అపాచర్ 1.8 ఎఫ్గా ఉంది. దీని వల్ల తక్కువ వెలుతురులో కూడా ఫోటోలు బాగా తీసుకునే సౌలభ్యం ఉంది. వర్చువల్ రామ్ ఇటీవల మార్కెట్లో బాగా పాపులర్ అయిన వర్చువల్ ర్యామ్ ఫీచర్ని శామ్సంగ్ అందించింది. శామ్సంగ్ సంస్థ ర్యామ్ ప్లస్ పేరుతో వరవ్చుల్ ర్యామ్ని అందిస్తుంది. ర్యామ్మెమెరీ నిండిపోయినప్పుడు వర్చువల్ రామ్ అప్పటికప్పుడు అదనంగా ర్యామ్ని అందిస్తుంది. ఎం 52 మోడల్కి సంబంధించి 8 జీబీ ర్యామ్ ఫోన్లో వర్చువల్ ర్యామ్గా 4 జీబీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఫలితంగా ఫోన్ వేగంగా పని చేయడంతో పాటు పాత యాప్స్ని, ఫోటోలు, వీడియో, మెసేజ్ ఇతర కంటెంట్ని డిలీట్ చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది. బ్లోట్వేర్ మార్కెట్లో గూగుల్ పిక్సెల్, మోటరోలా ఫోన్లు మాత్రమే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తున్నాయి, మిగిలిన ఫోన్లలో మనకు అక్కర్లేనివి, ఎక్కువగా ఉపయోగించిన యాప్లను ప్రీ ఇన్స్టాల్గా వస్తున్నాయి. చాలా ఫోన్లలో ఇలాంటి ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ యాప్స్ని తొలగించే అవకాశం ఉండదు. కానీ శామ్సంగ్ ఎం 52లో బ్లోట్వేర్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకునే వీలుంది. సింప్లీ స్లిమ్ పవర్ ఫుల్ బ్యాటరీతో వచ్చే ఎం సిరీస్ ఫోన్లు సాధారణంగా ఎక్కువ బరువు ఉంటాయి. కానీ గెలాక్సీ ఎం 52 ఇందుకు విరుద్ధం. హై ఎండ్ ఫోన్ల తరహాలో ఇది తక్కువ బరువు ఉండటంతో పాటు స్లిమ్గా కూడా కనిపిస్తుంది. ఇక ఇందులో స్నాప్డ్రాగన్ 778 జీ ప్రాసెసర్ ఉపయోగించడం వల్ల బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. అమోల్డ్ స్క్రీన్, 120 హెర్జ్ సెట్టింగ్స్తో ఫోన్ ఉపయోగించినా త్వరగా బ్యాటరీ డ్రెయిన్ కాదు. సైడ్కి స్క్రీన్పై లేదా ఫోన్ వెనుక భాగంలో కాకుండా సైడ్కి ఫింగర్ ప్రింట్ స్కానర్ని అందించారు. పవర్ బటనే ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిసే ఉన్నాయి. ఈ ఫీచర్పై మిశ్రమ స్పందన వస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో ఈ ఫోన్ తగ్గింపు ధరలో లభిస్తోంది. స్పెసిఫికేషన్లు - స్నాప్డ్రాగన్ 778 జీ ప్రాసెసర్, 5జీ 11 బ్యాండ్ సపోర్ట్ - 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ - బ్లూటూత్, వైఫై, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ - ఫుల్ హెచ్డీ, సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ - ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ - 64 ఎంపీ, 12 ఎంపీ, 5 ఎపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా - హైపర్లాప్స్, బూమరాంగ్ వీడియో ఫీచర్లు, - మానస్టర్ నాక్స్ సెక్యూరిటీ ప్లస్ ఆల్ట్ - బ్లేజింగ్ బ్లాక్, ఐసీ బ్లూ కలర్లు - టైప్ సీ ఆడియో జాక్ - 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమోరి ధర రూ. 25,999 - 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమోరి రూ. 27,999 చదవండి :రూ.60వేల భారీ డిస్కౌంట్తో బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్ -
ఫీచర్లు లీక్ : ఐఫోన్13 కంటే చిన్నది, అరచేతిలో ఇమిడిపోతుంది
స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ విడుదల చేయనున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. అయితే ఈ ఫీచర్లు అచ్చం ఐఫోన్ 13తరహాలో ఉండడంతో యూజర్లు ఈ ఫోన్ గురించి తెలుసుకునేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. యూజర్లను ఆకట్టుకున్న శాంసంగ్ కు చెందిన 'టిప్స్టర్, ఐసీఆ యూనివర్స్' ఫోన్ తరహాలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఆకట్టుకోనుందని ప్రముఖ టెక్ రివ్యూవర్ (టిప్స్టార్) యోగేష్ బ్రార్ తెలిపారు. ఈ ఫోన్ ఫీచర్లు..ఐఫోన్ 13 ఫీచర్ల మాదిరిగా లెగ్త్, విడ్త్,థిక్ నెస్లు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు 3,700ఎంఏహెచ్ బ్యాటరీ, టిన్నీ స్టాండర్డ్లో ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్, పవర్ కన్జ్యూమింగ్ కు ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 సైజ్ ఐఫోన్ 13 కంటే చాలా చిన్నగా ఉంటుందని.. అరచేతిలో ఇమిడిపోతుందని తెలిపారు. ఐఫోన్ 13 కంటే గెలాక్సీ ఎస్ 22 పొడవు, వెడల్పు చిన్నగా ఉంటుందని చెప్పిన యోగేష్.. ఫోన్ సైజ్ 146.7 x 71.5 x 7.7 మిల్లీ మీటర్లుగా ఉందని కాబట్టే ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్22.. ఐఫోన్ 13కంటే చిన్నగా ఉందన్నారు. 6.06-అంగుళాల డిస్ప్లేతో గెలాక్సీ ఎస్ 22 ఆండ్రాయిడ్ మార్కెట్లో అత్యంత కాంపాక్ట్ ఫ్లాగ్షిప్లలో ఒకటిగా నిలవగా.. చివరిసారిగా శాంసంగ్ 5.8-అంగుళాల స్క్రీన్ సైజు గెలాక్సీ ఎస్10 ఈ'ని విడుదల చేసింది. కాంపాక్ట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది, ఇది 5.8-అంగుళాల స్క్రీన్ సైజు కలిగిన గెలాక్సీ ఎస్ 10 ఇ. అయితే గెలాక్సీ ఎస్ 22 6.06-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. గెలాక్సీ ఎస్ 22+,గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా అందించే ఛార్జింగ్ స్పీడ్లతో పోలిస్తే 25వాల్డ్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో గెలాక్సీ ఎస్ 22 నెమ్మదిగా ఉంది. ఫోన్ వీడియో క్వాలిటీకోసం శామ్సంగ్ జీఎన్1,జీఎన్2 కెమెరా సెన్సార్లపై స్కిప్పింగ్ ను తో పాటు ఐఎస్ఓసెల్ జీఎన్5 కెమెరా సెన్సార్ని వినియోగించుకోవచ్చని టెక్ రివ్యూవర్ యోగేష్ బ్రార్ తెలిపారు చదవండి : ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్ -
ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్
సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ 'గెలాక్సీ వైడ్5' ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ సౌత్ కొరియాలో అందుబాటులో ఉండగా త్వరలో మిగిలిన దేశాల్లో విడుదల కానున్నట్లు శాంసంగ్ ప్రతినిధులు వెల్లడించారు. ఫోన్ స్పెసిఫికేషన్స్.. 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్ ప్లే,ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్,ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. వీటితో పాటు వాటర్ డ్రాప్ తరహా డిస్ ప్లే స్పెషల్ అట్రాక్షన్గా నిలువ నుంది. శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 ధర ప్రస్తుతానికి శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో విడుదలైన ఈ ఫోన్ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.28,200గా ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. చదవండి: ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరికలు ! అందులో నిజమెంత? -
అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్, ఫీచర్లు లీకయ్యాయి
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ శుభవార్త చెప్పింది. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ స్మార్ట్ఫోన్లను వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉండగా..దాని ఫీచర్లు లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ ఫీచర్లు ఇక నెట్టింట్లో సందడి చేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు చూస్తుంటే.. 720* 1,560పిక్సెల్స్, 5.8 అంగుళాల డిస్ ప్లే, రెడ్, గ్రీన్, బ్లూలలో టీఎఫ్టీ డిస్ప్లే(Thin Film Transistor), ఆక్టా కోసం ఎక్సినోస్ 7884 బి, ఎస్ఓసీ 3జీబీ ర్యామ్, 1 టెరాబైట్ మెమరీతో మైక్రో ఎస్డీ కార్డ్ 64 ఇంటర్నల్ స్టోరేజ్, 3,600ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఇక ఈ ఫోన్ వెనక భాగంలో 13ఎంపీ సెన్సార్,5ఎంపీ సెల్ఫీ షూటర్,ఇంటర్ నెట్ కనెక్టివిటీ కోసం 4జీ లైట్, వైఫ్, బ్లూటూత్ వీ5, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ- పోర్ట్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఫీచర్లను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ ధర ఇండియా కరెన్సీ ప్రకారం రూ.14,700 ఉండనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : పాపులర్ స్మార్ట్ ఫోన్, ధర ఐదోసారి పెరిగింది -
ఈ మొబైల్పై భారీ తగ్గింపును ప్రకటించిన శాంసంగ్..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ మొబైల్ కొనుగోలుదారులకు గుడ్న్యూస్ను అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్ఫోన్ ధరను సుమారు రూ. 6000 వరకు తగ్గించింది. కాగా ఈ ఆఫర్ వ్యాలిడిటీ కొన్ని రోజులపాటు మాత్రమే ఉండనుంది. శాంసంగ్ గెలక్సీ ఎఫ్62ను ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లలోకి కంపెనీ రిలీజ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 రెండు రకాల వేరియంట్లలో లభించనుంది. 6జీబీ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 అసలు ధర రూ. 23, 999 కాగా ప్రస్తుతం తగ్గింపు ధరతో రూ. 17, 999 కు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. 8జీబీ వేరియంట్ అసలు ధర రూ. 25, 999 కాగా ప్రస్తుతం తగ్గింపు ధరతో రూ. 19, 999 కు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్ను శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే సుమారు రూ. 2500 క్యాష్ బ్యాక్ను అందింనుంది. ఫ్లిప్కార్టులో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1000 తగ్గింపు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫీచర్లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ 3.1 6.7-అంగుళాల ఫుల్-హెచ్డి + (1080x2400) సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ- O డిస్ప్లే Exynos 9825 ప్రాసెసర్ 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా 7000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూఎస్బీ టైప్ సీ 25w ఫాస్ట్ఛార్జింగ్ డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ -
S7 FE , A7 Lite ట్యాబ్ ఫీచర్స్ లీక్, ధర ఎంతంటే
వెబ్డెస్క్:మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 FE ఫీచర్లు లీక్ అయ్యాయి. సౌత్ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ ఇండియాలో గెలాక్సీ ట్యాబ్ S7 FE , A7 Lite ట్యాబ్లను విడుదల చేస్తున్నట్లు మే నెలలో ప్రకటించింది. ఈ ట్యాబ్స్ రేపు ఇండియాకు చేరుకోబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ట్యాబ్లకు సంబంధించిన ఫీచర్లు పబ్లిక్ డొమైన్ లో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వివరాల ప్రకారం..గెలాక్సీ Tab S7 FE ,గెలాక్సీ Tab A7 Lite ఫీచర్లు ఇలా ఉన్నాయి. మిస్టిక్ స్పెషల్ మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ సిల్వర్, మిస్టిక్ గ్రీన్ మరియు మిస్టిక్ పింక్ కలర్స్ విడుదల కానున్న గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 ఎఫ్ఇ 12.4-అంగుళాల టీఎఫ్టీ (Thin Film Transistor) డిస్ప్లేతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్, 750 జి ప్రాసెసర్, టాబ్లెట్ వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.దీనిని పెన్ (Ultra S-Pen) ఆపరేట్ చేసుకోవచ్చు. గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ విషయానికొస్తే భారత్ లో ఈ ట్యాబ్ ఖరీదు రూ. 14,999 కే అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. స్పెసిఫేకషన్ పరంగా చూస్తే గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ 15: 9 యాస్పెక్ట్ రేషియో, 8.7-అంగుళాల WXGA + డిస్ప్లే తో వస్తుంది. మీడియాటెక్ హెలియో పి 22 టి ప్రాసెసర్ తో నడుస్తుంది. 3 జీబీ+ 32 జీబీతో పాటు 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్లను కలిగి ఉంది. గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్లో 8 మెగాపిక్సెల్ తో విడుదల కానుండగా 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. టాబ్లెట్ 5W100mAh బ్యాటరీని, 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కాగా, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ గ్రే,సిల్వర్ కలర్ లో అందుబాటులోకి రానుంది. చదవండి : Samsung Galaxy M32: ధర రూ.20వేల లోపే, ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి?! -
Samsung Galaxy M32: ధర రూ.20వేల లోపే, ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి?!
సాక్షి,వెబ్డెస్క్ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ దిగ్గజం శాంసంగ్ త్వరలో లాంచ్ చేసే కొత్త ఫోన్ గెలాక్సీ ఎం32 స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. దక్షిణ కొరియాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెలలో భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు లీకైన గెలాక్సీ ఎం 32కి ఫోన్ స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గెలాక్సీ ఎం 32 ధర ప్రముఖ మీడియా ఐఏఎన్ ఎస్ నివేదిక ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎం 32 జూన్ నాలుగో వారంలో ఇండియాలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీని ప్రారంభం ధర రూ.15వేల నుంచి రూ.20వేల మధ్యలో ఉండనుంది. గెలాక్సీ ఎం 32 ఏఏ కలర్స్ లో ఉండబోతుంది గెలాక్సీ ఎం 32 ఫోన్ ఇమేజెస్ ఇప్పటికే శాంసంగ్ అధికారిక వెబ్సైట్ లో బ్యాక్ ప్యానెల్,స్వైర్ షేప్ కెమోరా మాడ్యుల్, ఇన్ఫినిటీ-యు కటౌట్తో డిజైన్లను పోస్ట్ చేసి ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ కలర్స్ తో మార్కెట్ లో విడుదల కానుంది. గెలాక్సీ ఎం 32 ఫీచర్స్ గెలాక్సీ ఎం 32 లో ఇన్ఫినిటీ-యు డిజైన్ తో 6.4-అంగుళాల ఎఫ్హెచ్డి + సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్లో మీడియాటెక్ హెలియో జి 85 ప్రాసెసర్ పనిచేస్తుంది. 4GB RAM + 64GB మరియు 6GB RAM + 128GB ఇంట్రర్నల్ స్టోరేజ్తో లభిస్తుంది. గెలాక్సీ ఎం 32 కెమెరా గెలాక్సీ ఎం 32 క్వాడ్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ తో వస్తుంది. చదవండి: Amazon Mobile Saving Days : ఈ స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్స్ గెలాక్సీ ఎం 32 బ్యాటరీ గెలాక్సీ ఎం 32 కూడా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వన్ యుఐ లేయర్తో ఆండ్రాయిడ్ 11 పైన రన్ చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 1 టీబీ వరకు స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది. -
Samsung Galaxy S21+: రూ.10వేల క్యాష్ బ్యాక్, ఇంకా మరెన్నో ఆఫర్స్
టెక్ మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు సందడి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ పై ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తున్నట్లు తెలిపింది. ఇక 128 జీబీ మోడల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ రూ. 71,999 ఉండగా.. 256 జీబీ మోడల్ ఖరీదు రూ.75,999 ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ ఫోన్ కొనుగులు చేసిన స్మార్ట్ వినియోగదారులకి రూ. 15,990 విలువ గల గెలాక్సీ బడ్స్ ప్రో, రూ. 990 వోచర్ ను సొంతం చేసుకోవచ్చు.గెలాక్సీ 21 ప్లస్ ఆల్ట్రా, గెలాక్సీ ఎస్ 21ప్లస్, గెలాక్సీ 21 ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.10వేల శాంసంగ్ షాప్ వోచర్ ను పొందవచ్చు. గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా లేదా గెలాక్సీ ఎస్ 21 ను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారుల కోసం శాంసంగ్ రూ.10వేలు, రూ.5,000 వరకు అప్గ్రేడ్ బోనస్ను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే వరుసగా రూ. 10,000, రూ. 5,000 బ్యాంక్ క్యాష్బ్యాక్ ఆఫర్తో అందుబాటులో ఉన్నాయని, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఈఎంఐ సౌకర్యం ఉందని శాంసంగ్ తన అధికారిక నోట్ లో పేర్కొంది. అన్ని ఆఫర్లు తక్షణమే లభిస్తాయని జూన్ 30, 2021 వరకు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ ఫీచర్స్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ 6.7-అంగుళాల ఫ్లాట్, ఫుల్ హెచ్డి + డిస్ప్లేతో అమోలేడ్ ప్యానెల్ మరియు 120 హెర్ట్జ్ రిఫ్రెష్తో వస్తుంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీతో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 12MP + 12MP + 64MP కెమెరా సెటప్ను కలిగి ఉంది. ముందు భాగంలో 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4,800 ఎంఏహెచ్ బ్యాటరీపై నడుస్తుంది. చదవండి : 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లతో అదరగొడుతున్నాయ్ -
5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లతో అదరగొడుతున్నాయ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ మోడల్ గెలాక్సీ ఎ - 22 5జీ యురేపియన్ మార్కెట్లో విడుదలైంది. త్వరలోనే ఈ ఫోన్లు ఇండియన్ మార్కెట్ లో విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం యురేపియన్ మార్కెట్ లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జీ ఫీచర్స్ ఇలా ఉన్నాయి శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జీ లో 6.6-అంగుళాల పొడవు. హెచ్డి + డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది.పేరులేని డ్రాగన్ ఆక్టా కోర్ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 అని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్ తో పాటు 128జీబీ ఇంటర్నల్ స్టోరేజే తో 1టెరాబైట్ మైక్రో ఎస్డీ కార్డ్ ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్, ఎఫ్ / 2.2 లెన్స్, 5 మెగాపిక్సెల్ సెన్సార్, ఎ F / 2.4 లెన్స్ 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ముందు భాగంలో ఫోన్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్తో పాటు ఎఫ్ / 2.0 ఎపర్చర్తో వస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎ 22 5జీ ధర ఎంతంటే గ్రే, మింట్, వైలెట్, వైట్ కలర్ లలో అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఏ225జీ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ కోసం శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5 జీ యూరో 229 (సుమారు రూ. 20,300) వద్ద ప్రారంభమవుతుంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర యూరో 249 (సుమారు రూ .22,100). ఈ ఫోన్ను 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మరియు 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి ధర ఎంత అనేది శాంసంగ్ నిర్ధారించలేదు. చదవండి : Realme C21y : రియల్ మీ సిరీస్ ఫీచర్స్ ఇలా.. -
జూన్కల్లా శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3 ఫోన్
ముంబై, సాక్షి: వచ్చే జూన్కల్లా గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 పేరుతో ప్రీమియం స్మార్ట్ఫోన్ను శామ్సంగ్ విడుదల చేయనున్నట్లు దక్షిణ కొరియన్ అజు న్యూస్ పేర్కొంది. ఈ ఫోల్డబుల్ ఫోన్.. ఎస్ పెన్ సపోర్ట్తో లభించనున్నట్లు తెలియజేసింది. తద్వారా ప్రీమియం విభాగంలోని గలాక్సీ నోట్ సీరిస్ ప్రొడక్టులను ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్.. నిలిపివేసే అవకాశముట్లు అభిప్రాయపడింది. ఆధునిక టెక్నాలజీలతో కూడిన అంటే.. ఎస్ పెన్(ఎలక్ట్రానిక్ పెన్) సపోర్ట్తోపాటు.. అండర్ డిస్ప్లే కెమెరా(యూడీసీ) ఫీచర్ను సైతం జెడ్ ఫోల్డ్3లో ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఆధునిక సాంకేతికలో భాగంగా కెమెరాను ఓలెడ్ స్ర్కీన్ అడుగుభాగాన అమర్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో కెమెరాకు డిస్ప్లేలో హోల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదని వివరించింది. యూడీసీ ఫీచర్తో జెడ్ ఫోల్డ్3 స్క్రీన్ ట్యాబ్లెట్ పీసీని పోలి ఉంటుందని అభిప్రాయపడింది. పెద్ద డిస్ప్లేలు.. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ వచ్చే జనవరిలో విడుదల చేయ తలపెట్టిన గలాక్సీ ఎస్21 అల్ట్రా(అంచనా)లోనూ ఎస్ పెన్ ఫీచర్ను అందించనున్నట్లు అజు న్యూస్ పేర్కొంది. ఈ ఫోన్ 6.8 అంగుళాల డిస్ప్లేలో లభించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గలాక్సీ ఎస్ 21 సిరీస్లో 3 ఫోన్లను 2021 జనవరి నుంచీ విడుదల చేసే వీలుట్లు తెలియజేసింది. ఎస్21 6.2 అంగుళాలు, ఎస్21 ప్లస్ 6.7 అంగుళాల స్క్రీన్లతో విడుదలకానున్నట్లు వెల్లడించింది. -
గెలాక్సీ ఎస్ సిరీస్ స్పెసిఫికేషన్స్ లీక్
శామ్సంగ్ తర్వాత తీసుకురాబోయే గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్ల గురించి గత రెండు వారాలుగా ఇంటర్నెట్లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, గెలాక్సీ ఎస్ సిరీస్ మోడల్లో మూడు స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని శామ్సంగ్ యోచిస్తోంది. గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ మరియు గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా అనే పేరుతో వీటిని తీసుకు రానున్నట్లు సమాచారం. వీటిని వరుసగా O1, T2 మరియు P3 అనే కోడ్ పేరుతో పిలుస్తున్నారు. గెలాక్సీ ఎస్ 21 ప్లాస్టిక్ రియర్ కవర్ను అందిస్తుందని, ఎస్21 అల్ట్రా గ్లాస్ను ఉపయోగించాలని భావిస్తున్నారు. రాబోయే గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్ల గురించి మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఫ్రంట్ కెమెరాను ఫోన్ యొక్క ఎడమ భాగంలో ఫ్రేమ్ లోనే తీసుకువస్తున్నారు. దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 875 SoC లేదా శామ్సంగ్ సొంత చిప్సెట్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ను మూడు మోడళ్లలో ఉపయోగించనున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే వన్ UI 3.1పై గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్స్ నడుస్తాయని సమాచారం. (చదవండి: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్) గెలాక్సీ ఎస్21 గెలాక్సీ ఎస్21 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.2 అంగుళాల ఎఫ్హెచ్డి + ఎల్టిపిఎస్ డిస్ప్లేను తీసుకు రానున్నట్లు ఆన్లైన్ లో పుకార్లు వస్తున్నాయి. అలాగే గెలాక్సీ ఎస్ 21 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్లో 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ మెయిన్ సెన్సార్ కెమెరా, 64 ఎంపీ టెలిఫోటో సెన్సార్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఫాంటమ్ వైలెట్, ఫాంటమ్ పింక్, ఫాంటమ్ గ్రే మరియు ఫాంటమ్ వైట్ రంగుల్లో రానున్నట్లు సమాచారం. గెలాక్సీ ఎస్ 21 ప్లస్ గెలాక్సీ ఎస్ 21 + 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.7 అంగుళాల ఎఫ్హెచ్డీ+ ఎల్టీపీఎస్ డిస్ప్లేను వాడనున్నట్లు ఆన్లైన్ లో పుకార్లు వస్తున్నాయి. అలాగే గెలాక్సీ ఎస్ 21 + 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్లో 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ మెయిన్ సెన్సార్ కెమెరా, 64 ఎంపీ టెలిఫోటో సెన్సార్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఫాంటమ్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్ మరియు ఫాంటమ్ వైలెట్ రంగుల్లో రానున్నట్లు సమాచారం. గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా ఈ మోడల్ టాప్-ఎండ్ స్మార్ట్ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.8-అంగుళాల WQHD + ఎల్టిపిఓ డిస్ప్లేను పొందుపరచనున్నారు. ఈ మొబైల్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మరియు వెనుక వైపున, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 108 ఎంపీ ప్రధాన సెన్సార్, రెండు ఆప్టికల్ టెలిఫోటో సెన్సార్లను కలిగి ఉన్న క్వాడ్-కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఫాంటమ్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్ రంగుల్లో రానున్నట్లు సమాచారం. -
అలాంటి ఆందోళన ఇక అవసరం లేదు (స్పాన్సర్డ్)
గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71పై శాంసంగ్ ఊహించని అద్భుత స్మార్ట్ఫోన్ ప్రైవసీ పాలసీని అందిస్తోంది. మీ ఫోన్ను ఎవరైనా చూస్తామని అడిగినప్పుడు మీరు కంగారు పడుతుంటారా? ఇక నుంచి అలాంటి ఆందోళన అవసరం లేదు. క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ మీ ప్రైవసీని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫీచర్ భాగస్వామి : హెచ్టీ బ్రాండ్ స్టూడియో మిలీనియల్స్, జనరేషన్ జడ్ వినియోగించే ఒకే ఒక బహుళ ప్రయోజనకర పరికరం ఏదంటే అది స్మార్ట్ఫోన్ మాత్రమే. ఫ్రెండ్స్తో మెసేజింగ్ నుంచి టీమ్ వర్క్ను చక్కబెట్టడం, ఆన్లైన్ క్లాస్లకు హాజరవడం వరకూ ప్రతిఒక్కటీ స్మార్ట్ఫోన్ మీకు తోడుగా నిలుస్తుంది. అయితే మన స్మార్ట్ఫోన్లలో ప్రైవసీని కాపాడే విషయంలో మాత్రం మనం తరచూ నష్టపోతుంటాం. భారతీయ సంస్కృతికి అనుగుణంగా ప్రజలు సన్నిహితంగా మెలుగుతుంటారు. కుటుంబ సభ్యులు మన సంభాషణలను వినడం, మన స్మార్ట్ఫోన్ను వారి చేతుల్లోకి తీసుకోవడం అసాధారణ విషయాలేమీ కాదు. మనలో చాలా మందికి ప్రైవసీ అనేది ఆలోచనకు అందేది కాదు. మరి మీ స్మార్ట్ ఫోన్ను మీరు ఎలా కాపాడుకుంటారు? రెండంచెల వినూత్న ప్రైవసీ ఫీచర్లను ప్రవేశపెట్టడం ద్వారా శాంసంగ్ దీనికి ఓ మార్గం చూపింది. క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్ పేరిట ఈ రెండు ఫీచర్లు మీ గోప్యతపై ఆందోళనలను పూర్తిగా తొలగించేందుకు సహాయపడతాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై ఈ ప్రైవసీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. క్విక్ స్విచ్ పేరుకు తగినట్టే చాలా సరళతరంగా ఉంటుంది. పవర్ బటన్ను రెండు సార్లు ప్రెస్ చేయడం ద్వారా ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది గ్యాలరీ, బ్రౌజర్, వాట్సాప్ వంటి ఇతర యాప్లను ఇది క్షణాల్లోనే ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్లకు మార్చేస్తుంది. ఈ ఫీచర్ వివిధ సందర్భాల్లో మిమ్మల్ని ఎలా కాపాడుతుందో చూడవచ్చు. గ్యాలరీ : మీరు విహార యాత్రకు వెళ్లి తిరిగి రాగానే నేరుగా కార్యాలయానికి వెళ్లారు. మీరు వెళ్లిన ప్రదేశంలో మెరుగ్గా ఉన్న ఫోటోలను మీ కొలీగ్స్కు చూపిస్తున్నారు. మీకు, మీ ఫ్రెండ్స్కు మాత్రమే ఉద్దేశించిన ఫోటోలను మీరు చూస్తుండగా అనూహ్యంగా మీ బాస్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో పవర్ బటన్ను రెండుసార్లు ప్రెస్ చేసి మీ పని మీరు చేసుకోవచ్చు. రాధికా మదన్ను ఆమె బాస్ నుంచి క్విక్ స్విచ్ ఎలా కాపాడిందో చూడండి చాట్ : వాలెంటైన్స్ డే సందర్భంగా మీరు మీ బాయ్ఫ్రెండ్తో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. దీనిపై సలహాలు కోరుతూ మీ ఫ్రెండ్కు వాట్సాప్ మెసేజ్ చేశారు. ఆమె కొన్ని సజెషన్స్ చేశారు, వాటిలో ఒక దాన్ని మీరు ఇష్టపడ్డారు. ఈ ఉద్వేగంలో మీ బాయ్ఫ్రెండ్ మీ పక్కనే ఉన్న విషయం గమనించలేదు. ఏ క్షణంలోనైనా తను మీ ఫోన్ వైపు చూసి మీ ఉద్దేశాలను పసిగట్టవచ్చు. అయితే దీనిపై భయపడాల్సిన అవసరం లేదు. పవర్ బటన్ను రెండు సార్లు ప్రెస్ చేయడం ద్వారా వాట్పాప్ను ప్రైవేట్ వెర్షన్ నుంచి పబ్లిక్ వెర్షన్కు మార్చేయవచ్చు. రాధికా మదన్ను క్విక్ స్విచ్ ఫీచర్ ఎలా కాపాడిందో చూడండి. బ్రౌజర్ : మీరు మీ సోదరికి బర్త్డే గిఫ్ట్ కోసం బ్రౌజింగ్ చేస్తున్నారు. గిఫ్ట్ మీ ఇంటికి వచ్చే వరకూ అదేంటో మీ సోదరి చూడకూడదని మీరు భావిస్తున్నారు. మీ సోదరి మీ స్మార్ట్ఫోన్ స్క్రీన్ వద్దకు చేరుకోకముందే మీరు బ్రౌజర్ను ప్రైవేట్ వెర్షన్ నుంచి పబ్లిక్ వెర్షన్ను మార్చవచ్చు. బర్త్డే గిఫ్ట్పై మీ సోదరికి ఎలాంటి క్లూ లేకుండా చేయడంతో పాటు ఆమెను సర్ప్రైజ్ చేయడం కొనసాగించేలా చూడొచ్చు. క్విక్ స్విచ్ ఫీచర్ రాధికా మదన్ను ఆమె సోదరిని సర్ప్రైజ్ చేసేలా ఎలా ఉపకరించిందో చూడండి. ఇక ఇంటెలిజెంట్ కంటెంట్ సొల్యూషన్స్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై డివైజ్ లోపల ఏఐ ఫీచర్గా స్మార్ట్ఫోన్పై మీకు పూర్తి గోప్యతను అందించేందుకు ఉపకరిస్తుంది. ఏఐ ఆధారిత ఇంజన్ పబ్లిక్ గ్యాలరీ నుంచి ప్రైవేట్ గ్యాలరీకి తరలించే ఫోటోలను ఆటోమేటిక్గా సూచిస్తుంది. ప్రైవేట్గా ఉంచదల్చిన ఫోటోలు, ముఖాలను యూజర్ ఎంపిక చేసుకుంటే చాలు మిగిలిన పని ఇంటెలిజెంట్ కంటెంట్ సొల్యూషన్స్ చక్కబెడుతుంది. ఒకసారి మీరు ఆయా ఫోటోలు, ముఖాలను గుర్తిస్తే ఏఐ ఇంజన్ ఆయా ఇమేజ్లను గుర్తించి వాటిని ప్రైవేట్ గ్యాలరీకి తరలిస్తుంది. ఈ అద్భుత ప్రైవసీ పాలసీని శాంసంగ్ గెలాక్సీ ఏ51, ఏ71 స్మార్ట్ఫోన్లపై ఎలా యాక్టివేట్ చేయాలో చూడండి. అల్ట్ జడ్ లైఫ్ గురించి విన్నారా ? క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్ అల్ట్ జడ్ లైప్ను పూర్తిగా ఆస్వాదించేలా మీకు సహకరిస్తాయి. మీ ప్రైవేట్ కంటెంట్ మీకు మాత్రమే అందుబాటులో ఉంటూ ఒత్తిడి రహిత, వినోదభరిత జీవితాన్ని మీరు ఆస్వాదించేలా ఇవి ఉపకరిస్తాయి. మీరు ఇంట్లో ఉన్నా, మెట్రోలో ఉన్నా ప్రైవసీ గురించి ఆందోళన లేని జీవితమే అల్ట్ జడ్ జీవితం మీకు అందిస్తుంది. ఫోటోలను తీసుకోవడంలో స్వేచ్ఛ, వాట్సప్పై నాన్స్టాప్ చాట్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ను స్క్రోల్ చేయడం ఇవన్నీ పూర్తి ప్రైవసీతో చేసుకోవచ్చు. వీటన్నింటిని మించి మెరుగైన అనుభూతిని మీకు అందించేందుకు గెలాక్సీ ఏ51, ఏ71 భరోసా ఇస్తున్నాయి. ఇప్పుడే వెళ్లి శాంసంగ్ గెలాక్సీ ఏ51 లేదా గెలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్లను సొంతం చేసుకోండి ఇక మీరు ఎన్నడూ వెనక్కితిరిగి చూసుకోరు! (Advertorial) -
రహస్య సమాచారాన్ని చూసేస్తారా? (స్పాన్సర్డ్)
శాంసంగ్ మీ గోప్యతకు సంబంధించి కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు, గేమ్ ఆడడానికో, లేదంటే పిక్ తీసుకోవడానికో ‘మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి’ అని ఎవరైనా అడిగితే, మనం ఒక్క నిమిషం ఆలోచనలో పడిపోతాం.. మన సెల్ఫోన్ ఇతరులకిస్తే.. ‘వారు ఏం చూస్తారు? రహస్యంగా ఉంచిన సమాచారాన్ని చూసేస్తారా? అనే సందేహం కలుగుతుంది.. కదా... మీరు మీ ఫోన్లో మీ భాగస్వామి సెల్ఫీని ఆరాధిస్తున్న సమయంలో, మీ ఇంట్లో వారు పక్కనుంచి వెళుతూ దాన్ని చూస్తే ఎలా? ఈ పరిస్థితులలో కనీసం ఒకదాన్ని మనం ఎదుర్కొన్నా.. విషయం అర్థమవుతుంది. మన వ్యక్తిగత విషయాలు బహిర్గతమైతే చాలా ఆందోళన చెందుతాం. అదే మీ స్మార్ట్ఫోన్లోని మొత్తం డేటా, సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి సులభమైన మార్గం ఉంటే? ప్రైవసీ ఎలా అనే సమస్య లేకపోతే? అపుడు మీరు కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు స్మార్ట్ ఫోన్ హ్యాపీగా ఇవ్వవచ్చు. ఇప్పుడు శాంసంగ్ మీ గోప్యతా రక్షణ కోసం అద్భుతమైన ఫీచర్స్ ను పరిచయం చేస్తోంది. ఆల్ట్ జెడ్ లైఫ్ ఫీచర్ స్మార్ట్ఫోన్ వాడకంలో శాంసంగ్ కొత్త విప్లవానికి నాంది పలికింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫోటోలు, వీడియోల ప్రైవసీని కాపాడేలా ఆల్ట్ జెడ్ లైఫ్ ఫీచర్ను విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ 71 స్మార్ట్ఫోన్లలో ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్ "ఆల్ట్ జెడ్ లైఫ్''ను తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా క్విక్ స్విచ్, ఇంటిలిజెంట్ కంటెంట్ సజెషన్ అనే వినూత్న వ్యూహాలను గెలాక్సీ ఎ 51 , గెలాక్సీ ఎ 71 స్మార్ట్ఫోన్లలో ప్రవేశపెట్టింది. ఈ అద్భుతమైన ఆల్ట్ జెడ్ లైఫ్ ఫీచర్ ఉండగా ఇక గోప్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆల్ట్ జెడ్ లైఫ్ మీ ప్రైవసీని రక్షిస్తుంది. మునుపెన్నడూ ఎరగని ప్రైవసీ (గోప్యతలో మరింత భద్రత) ఈ ఫీచర్ గురించి మరింత తెలుసుకుందాం. మీరు మెట్రోలో ఉండి, మీ స్మార్ట్ఫోన్ గ్యాలరీని బ్రౌజ్ చేస్తుంటే, పక్కనున్న వ్యక్తి మీ ఫోటోలు చూడటం ఇష్టం ఉండదు కదా. అలాంటపుడు క్విక్ స్విచ్ ఉపయోగపడుతుంది. పవర్ బటన్ రెండు సార్లు (డబుల్ క్లిక్) చేస్తే గ్యాలరీ, బ్రౌజర్, వాట్సాప్ ప్రైవేట్ వెర్షన్ల నుండి వారి జనరల్ (నాన్ ప్రైవేట్ ) వెర్షన్లకు మారుతుంది. దీన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా? క్విక్ స్విచ్కు ధన్యవాదాలు, రాధిక మదన్ కూడా తన సోదరి నిఘా నుంచి తప్పించుకుంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి. ఇంటిలిజెంట్ కంటెంట్ సజెషన్. ఇదొక ఇన్ బిల్ట్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్ . గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 సెక్యూర్ ఫోల్డర్స్ లో ఇది ఉంటుంది. ఇది ప్రైవేట్, నాన్ ప్రైవేట్ కంటెట్ ను దానికదే క్రమబద్ధీకరిస్తుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని పారామీటర్స్ ను సెట్ చేసుకోవడమే. అంటే ముఖ్యంగా ప్రత్యేకమైన ఆయ వ్యక్తుల ముఖాలు, ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలి. దీనికనుగుణంగా ఫోన్ లోని ఏఐ ఫీచర్ ఎంపిక చేసుకుంటుంది. ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా? మీలోని ఫోటోగ్రాఫర్ ఫుల్ పవర్ తో బయటకు రావడం ఖాయం మీ కెంతో ఇష్టమైన ప్రైవసీ ఫీచర్లే కాకుండా మీలోని ఫోటోగ్రఫీ నైపుణ్యాన్ని కూడా వెలికి తీస్తుంది గెలాక్సీ ఏ51 , ఏ71 ఫోన్లలోని మరో ఫీచర్. ఇందులో క్వాడ్-కెమెరా (నాలుగు వెనుక కెమెరాలు)ల నుంచి తీసిన ఫోటోలు మిమ్మల్ని ఆశ్యర్యంలో ముంచెత్తుతాయి. ఓ పార్క్ కు వెళ్లినా, మీరు వెళ్లిన ఆహ్లాదకరమైన రెస్టారెంట్ లో వెలుగు తక్కువ ఉన్నా, గ్రాఫిటీతో నిండిన వీధులకు వెళ్లినా వీటిన్నింటినీ ఈ కెమెరా సమర్ధవంతంగా నిర్వహించుకుంటుంది. అద్భుతమైన షార్ప్ నెస్, ఫోకస్, డీటైయిల్స్ తో మీరు తీసిన ఫోటోలకు మీ ఇన్స్టాలో ప్రశంసల వెల్లువ కురుస్తుంది. సింగిల్ టేక్తో, ఖచ్చితమైన ఫ్రేమ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ స్నేహితులు అల్లరి చేస్తున్నా..లేదా వేగంగా కదిలే టెన్నిస్ ఆడుతున్నా.. కెమెరాలోని సింగిల్ టేక్ ఆప్షన్ ఎంచుకుంటే సరి. 7 ఫోటోలు, 3 వీడియోలను ఒకేసారి వస్తాయి. వీటిలో షార్ట్ మూవీ, ఒక జిఫ్ ఫైల్, శైలీకృత ఫోటోలు వస్తాయి. దీంతో పాటు నైట్ హైపర్లాప్స్, స్మార్ట్ సెల్ఫీ యాంగిల్, క్విక్ వీడియో, కస్టమ్ ఫిల్టర్, రికార్డింగ్ చేసేటప్పుడు కెమెరాను మార్చుకోవడం. ఏఐ గ్యాలరీ జూమ్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. గెలాక్సీ ఏ51 , ఏ71 స్మార్ట్ ఫోన్ తో తీసిన ఫోటోలు మిగిలిన వాటితో పోలిస్తే అద్భుతంగా ఉంటాయి. స్విచ్ కెమెరా వైల్ రికార్డింగ్ అనే ఫీచర్ గెలాక్సీ ఏ51 లో మాత్రమే లభిస్తుంది. మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ విభాగంలో శాంసంగ్ హవా శాంసంగ్ గెలాక్సీ ఏ51 , ఏ71 స్మార్ట్ఫోన్లు 2020 లో మిడ్-రేంజ్ విభాగంలోకి దూసుకు వచ్చాయి. ఇందులోని కెమెరా ఫీచర్స్ యూజర్ల ఫోటోగ్రఫర్ ను వెలికి తీస్తుంది. నాక్స్ సెక్యూరిటీ తో మీ డేటా గురించి చింతించాల్సిన అవసరం లేదు. అంతేనా.. మీ వాలెట్ ఇంట్లో మర్చిపోయినా... శాంసంగ్ పే ఆ లోటును కనిపించనివ్వదు. రోజంతా ఎంజాయ్ చేసేలా చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ51, ఏ71 స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో టాప్లో ఉన్నాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. పరిశోధనా సంస్థ స్ట్రాటజీ అనలిటిక్స్ ప్రకారం 2020లోని త్రైమాసికంలో గెలాక్సీ ఏ 51 ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ ఫోన్ గా నిలిచింది. ప్రస్తుత పోటీ మార్కెట్లో ఇది అద్భుతమైన విజయం. “అద్భుతమైన స్క్రీన్, అద్భుతమైన కెమెరా, దీర్ఘకాలిక బ్యాటరీ జీవితం” తో, ఈ స్మార్ట్ఫోన్లు మన జీవితాలను మార్చేస్తాయి. గెలాక్సీ ఏ 51 రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 22,999 8 జీబీ ర్యామ్ ,128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 24,999 గెలాక్సీ ఏ 71 సింగిల్ కాన్ఫిగరేషన్లో లభ్యం. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 29,499 స్విచ్ , ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్ ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని మరింత సులభతం చేస్తాయి. రాధిక మదన్ ఇప్పటికే గెలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్ను ఉపయోగిస్తున్నారు. (Advertorial) -
రెండు స్మార్ట్ఫోన్లు.. అద్భుత కెమెరా (స్పాన్పర్డ్)
వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై శాంసంగ్ పలు అప్డేట్స్ అందిస్తోంది. వీటిలో మీ గ్యాలరీ, వెబ్బ్రౌజర్, వాట్సాప్ వంటి యాప్స్ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్స్ మధ్య మార్చేందుకు వెసులుబాటు కల్పించే క్విక్ స్విచ్ కీలకమైనది. ఫీచర్ భాగస్వామి, హెచ్టీ బ్రాండ్ స్టూడియో మనం తీపిజ్ఞాపకాలను నిక్షిప్తం చేయడం, ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడటం, ఓటీటీ కంటెంట్ వీక్షించడం, స్కూల్/వర్క్ కోసం వీడియో కాల్స్ మాట్లాడటం, నోట్స్ రాసుకోవడం వంటి పలు పనులను చక్కబెట్టేందుకు మనం స్మార్ట్ఫోన్లను వాడుతుంటాం. నిత్య జీవితంలో ప్రతి విషయంలోనూ స్మార్ట్ఫోన్లు మనకు ఉపకరిస్తున్నాయి గేమింగ్, ఫోటోలను క్లిక్ చేయడం, ప్రొఫెషనల్ వర్క్ పూర్తి చేయడం వంటి అన్ని అవసరాలను నెరవేర్చేలా శాంసంగ్ గెలాక్సీ ఏ51, దీని బిగ్ బ్రదర్ గెలాక్సీ ఏ71అందుబాటులోకి వచ్చాయి. రెండు స్మార్ట్ఫోన్లు అద్భుతమైన స్క్రీన్, అత్యద్భుత కెమేరా, దీర్ఘకాలం మన్నే బ్యాటరీ లైఫ్ అనుభవాన్ని మనకు అందస్తాయని శాంసంగ్ భరోసా ఇస్తోంది. ►గెలాక్సీ ఏ51 ఈఏడాది తొలి క్వార్టర్లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్గా నిలిచిందని పరిశోధన సంస్థ స్ట్రేటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది ►మరి వీటిలో ఇంకా మెరుగైన విషయం ఏంటంటే ఈ స్మార్ట్ఫోన్లతో మీరు మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్గా ఉంచే అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. అల్ట్ జడ్ జీవితం : ప్రైవసీకి ప్రాధాన్యం నేటి ఆధునిక జీవితంలో జనరేషన్ జడ్, మిలీనియల్స్ వారి స్మార్ట్ఫోన్లకు సంబంధించి పలు ప్రైవసీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ అల్ట్ జడ్ జీవితానికి మార్గం సుగమం చేసింది. మీ ప్రైవసీపై ఎలాంటి ఆందోళనకు గురవకుండా గెలాకీ ఏ51, గెలాక్సీ ఏ71తో మీరు అన్ని ఫీచర్లను మీరు ఆస్వాదించవచ్చు. ►మీ స్మార్ట్ఫోన్ను చూస్తామని మీ స్నేహితులు, సోదరులు అడిగిన ప్రతిసారీ ఎంతో అసౌకర్యంగా ఫీలవుతుంటా. వారు మీరు తీసిన ఓ ఫోటో కోసమో, మీరు సూచించిన గేమ్ను ఆడేందుకో వారు మీ స్మార్ట్ఫోన్ను అడిగినా మీరు కొంత అసౌకర్యానికి లోనవుతుంటారు. ►ఈ సమయాల్లో మీరు ఎలాంటి ఆందోళన, విచారం లేకుండా మీ స్మార్ట్ఫోన్ను వారికి అందించే రెండు ఫీచర్లను శాంసంగ్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై ప్రవేశపెట్టింది. ►క్విక్ స్విచ్ పేరుకు తగ్గట్టే మీ స్మార్ట్ఫోన్లో మీరు గ్యాలరీ, వాట్సాప్, ఇతర యాప్స్ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్లోకి వేగంగా మార్చేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. పవర్ బటన్ను రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా ఈ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు. ఆఫీస్లో మీరు ప్రెజెంటేషన్ ఇవ్వడం, మీ ఆఫీస్లో పార్టీకి సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులకు చూపే సందర్భాల్లో క్విక్ స్విచ్ మీకు మీ జీవితాన్ని కాపాడే కీలక ఫీచర్గా ముందుకొస్తుంది. ►ఇక స్మార్ట్ఫోన్లో పొందుపరిచిన ఏఐ ఆధారిత సొల్యూషన్గా ఇంటెలిజెంట్ సజెషన్స్ గ్యాలరీలో ప్రైవేట్ వెర్షన్లో భద్రంగా కాపాడే ఫోటోలను గుర్తించి సూచనలు చేస్తుంది. వారాంతం వెకేషన్ నుంచి నేరుగా ఆఫీస్కు వెళ్లడం వంటి పలు సందర్భాల్లో ఈ ఫీచర్ మీకు ఉపకరిస్తుంది. ప్రైవేట్గా ఉంచదలిచిన ఫోటోలు,ఇమేజ్లను మీరు ఎంపిక చేస్తే వాటిని ఎవరి కంటా పడకుండా ఏఐ మిగిలిన పని చక్కబెడుతుంది. ప్రముఖ వినూత్న ప్రైవసీ ఫీచర్లు ►నటి రాధికా మదన్ క్విక్ స్విచ్ పవర్ను ఉపయోగించి తన సోదరి (శిఖా తల్సానియ) ఆమె ఊహించిన దాని కంటే భిన్నమైనవి చూసేలా చేశారో గమనించవచ్చు ►ఫీచర్లను మరింత మెరుగ్గా అర్దం చేసుకోవడానికి వీడియోను వీక్షించండి ►ఈ తరహా ప్రైవసీని ఆస్వాదించేందుకు ఎవరు మాత్రం ఇష్టపడరు? గెలాక్సీ ఏ51, ఏ71 స్మార్ట్ఫోన్ల హార్డ్వేర్, సాఫ్ట్వేర్లో బహుళ భద్రత లేయర్లతో కూడిన శాంసంగ్ నాక్స్ భద్రతతో క్విక్ స్విచ్ రూపొందింది. విశిష్ట కెమెరా ఫీచర్లు ఈ రెండు ఫోన్ల విశిష్ట కెమెరా ఫీచర్లను పరిశీలిద్దాం ►మీ ఫ్రెండ్ రన్నింగ్ రేస్ ఫోటోను సమగ్రంగా కెమెరాలో క్లిక్ చేయాలనుకుంటున్నారా? ఇండియా గేట్ వైడ్ యాంగిల్ షాట్ తీయాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్ పోర్ట్రయిట్ను కెమెరాలో బంధించాలనుకుంటున్నారా? ఆకుపై వాలిన కీటకాన్ని ఫోటో తీయాలనుకుంటున్నారా? గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71తో ఇవన్నీ సాధ్యమే. ఈ రెండు స్మార్ట్ఫోన్లు తమ సొంతవైన క్వాడ్-కెమెరా సెటప్స్తో ముందుకొచ్చాయి. ►గెలాక్సీ ఏ51 స్మార్ట్ఫోన్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 12-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో ముందుకొచ్చింది. ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ►ఇక గెలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్పై 64-మెగాపిక్సెల్ లెన్స్, 12-మెగాపిక్సెల్ అల్ర్టా-వైడ్ లెన్స్లు, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, రియర్పై 5-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ►గెలాక్సీ ఎస్20 నుంచి అద్భుత కెమెరా ఫీచర్లను గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లకు శాంసంగ్ అందిస్తోంది. మిమ్మల్ని ఉద్వేగానికి గురిచేసే ఫీచర్లను ఓసారి ప్రయత్నించండి సింగిల్ టేక్ : ఇది గెలాక్సీ ఎస్20ల్లో ఉత్తమ ఫీచర్, ఇది ఇప్పుడు గెలాక్సీ ఏ51పై అందుబాటులో ఉండటం వినియోగదారులకు సంతోషకరమైన అంశం. సింగిల్ టేక్ ఫీచర్ 10 ఫోటోలు, వీడియోల వరకూ క్యాప్చర్ చేస్తుంది. సరైన ఫోటోను ఎలా ఫ్రేమ్ చేయాలని మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. కెమెరాను ఓపెన్ చేసి సింగిల్ టేక్ను సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ►ఫోటోలను చూసేందుకు గ్యాలరీకి వెళ్లడం మామూలే. శాంసంగ్ సింగిల్ టేక్ ఫీచర్ మీ ఫోటోల్లో బెస్ట్ షాట్స్, మొమెంట్స్ను ఎంపిక చేసి వాటన్నింటినీ ఒక ఆల్బమ్లో అమర్చుతుంది. ఏఐని వాడుతూ మీరు షార్ట్ మూవీని, జీఐఎఫ్ యానిమేషన్స్ను, పలు స్టైలైజ్డ్ ఇమేజ్లను పొందవచ్చు. నైట్ హైపర్లాప్స్ : పర్యాటకుడిగా నగరాన్ని చుట్టిరావడం గొప్ప అనుభూతి. ఆ క్షణాలను ఫోటోలుగా మలచి ఆ తర్వాత వాటిని చూసి మురిసిపోవడం మనందరం ఇష్టంతో చేసే పనే. ప్రజలు తమ సమయాన్ని ఆస్వాదించే వీడియోలను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించే హైపర్లాప్స్ ఫీచర్కు ఆదరణ పెరుగుతోంది ►శాంసంగ్ నైట్ హైపర్లాప్స్ ఫీచర్ ద్వారా గెలాక్సీ ఏ51పై హైపర్లాప్స్ వీడియోలు అర్ధరాత్రిలో క్యాప్చర్ చేసినా అత్యంత స్పష్టంగా, బ్రైట్గా ఉంటాయి. లాంగ్-ఎక్స్పోజర్ షాట్లను కాంతి, చలన మార్గాలతో వీడియో ఆర్ట్ పనిగా మార్చబడతాయి. కస్టమ్ ఫిల్టర్ : మీ ఫోటోలపై మీరు సొంతంగా వినూత్నంగా తీర్చిదిద్దుకునే నూతన పద్ధతిని ఇది అందుబాటులోకి తీసుకువస్తుంది. కలర్స్ను ఎంపిక చేసుకోవడం నుంచి భిన్నమైన షేడ్స్తో కూడిన బ్యాక్గ్రౌండ్ను మార్చడం వరకూ మీకు వెసులుబాటు కల్పిస్తుంది. న్యూ కస్టమ్ ఫిల్టర్ మోడ్ మీకు విస్తృత ఊహాశక్తికి ఊతమిస్తుంది. స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ : ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటే కెమెరా తెలివిగా వైడ్ యాంగిల్ మోడ్లోకి వెళుతుంది. ప్రతిసారి అద్భుత సెల్ఫీలు తీసుకోవచ్చు. క్విక్ వీడియో : కెమెరా బటన్ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా క్విక్ వీడియోను తీసుకోవచ్చు. వీడియో మోడ్ను పొందేందుకు సెట్టింగ్స్లో కుస్తీ పడుతూ వీడియో తీసే సమయాన్ని మిస్ అవడం వంటి రోజులకు కాలం చెల్లింది. మీ స్మార్ట్ఫోన్ తీసుకుని కెమెరా బటన్ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ప్రత్యేక క్షణాలను వెంటనే రికార్డ్ చేయవచ్చు. మీ ఫ్రెండ్ రన్నింగ్ రేసు లేదా మీ బర్త్డే పార్టీలో మీ బంధువు పాట పాడటం వంటివి ఏవైనా వెంటనే వీడియో రికార్డు చేయవచ్చు. రికార్డింగ్లో స్విచ్ కెమెరా : ఫ్రంట్ నుంచి రియర్ కెమెరాకు మారేందుకు రికార్డింగ్ను నిలిపివేయడం, మళ్లీ ఫ్రంట్ కెమెరాకు మారడం వంటివి ఏమంత సౌకర్యంగా ఉండవు. గెలాక్సీ ఏ51లో లభించే ఫీచర్తో మీ మధురమైన క్షణాలను ఎలాంటి అవాంతరం లేకుండా రికార్డింగ్ చేస్తూనే ఫ్రంట్, రియర్ కెమెరాలకు మారే వెసులుబాటు ఉంటుంది ఏఐ గ్యాలరీ జూమ్: ఏఐ గ్యాలరీ జూమ్తో మీ శాంసంగ్ స్మార్ట్ఫోన్ తక్కువ రిజల్యూషన్ కలిగిన ఇమేజ్ల నాణ్యతను మెరుగుపరిచేందుకు అనుమతిస్తుంది. బ్లర్, పిక్సలేటెడ్ ఇమేజ్లను ఆర్ట్ వర్క్స్గా మెరుగుపరుస్తుంది గెలాక్సీ ఏ51 గురించి మరిన్ని వివరాలు ►ఇది రెండు వెర్షన్లలో లభిస్తుంది ►6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ - రూ . 22,999 ►8జీబీ ర్యామ్ మరియు 128జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ - రూ . 24,499 ►ఈ రెండు వెర్షన్లు ప్రిస్మ్ క్రష్ వైట్, ప్రిస్మ్ క్రష్ బ్లాక్, ప్రిస్మ్ క్రష్ బ్లూ, హేజ్ క్రష్ సిల్వర్ వంటి నాలుగు రంగుల్లో లభిస్తాయి. గెలాక్సీ ఏ51 కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ►గెలాక్సీ ఏ51 6.5 ఇంచ్ల సూపర్ అమోల్డ్ ఫుల్- హెచ్డీ+ (1080x2400 పిక్సెల్స్) డిస్ప్లేతో ముందుకొస్తోంది. ఆక్టా-కోర్ ఎక్సినాక్స్9611 ఎస్ఓసీ ఆధారిత పంచీ డిస్ప్లేతో అందుబాటులో ఉంది. మీరు మీ స్నేహితులు ఎలాంటి అసౌకర్యానికి లోనవకుండా ఫోటోలను, యూట్యూబ్ వీడియోలను వీక్షించదగిన గొప్ప వీక్షణా యాంగిల్స్తో కూడిన డిస్ప్లే ఆకట్టుకుంటుంది. ►ఈ స్మార్ట్ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అందుబాటులో ఉంది. దీర్ఘకాలం గేమింగ్, అపరిమిత వాచింగ్ సెషన్స్కు సరిపడా చార్జింగ్ సామర్ధ్యం కలిగిఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఒన్ యూఐ 20 సాఫ్ట్వేర్పై ఈ స్మార్ట్ఫోన్ రన్ అవుతుంది. గెలాక్సీ ఏ 71పై ఇతర మెరుగైన ఫీచర్లు ►గెలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్ 6.7 ఇంచ్ల (1080x2400 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-0 సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730 ఓక్టా-కోర్ చిప్సెట్తో ముందుకొచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్తో దైనందిన జీవితంలో భిన్నమైన టాస్క్లను నిర్వర్తించే వెసులుబాటు కల్పిస్తుంది. ►4500 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్తో పాటు 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కల్పిస్తుంది. గెలాక్సీ ఏ71 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ . 29,499 ►ఆకర్షణీయ ప్యాకేజ్, దీర్ఘకాల వీక్షణ, కాల్ ఆఫ్ డ్యూటీ : రెండు స్మార్ట్ఫోన్లపై మొబైల్ సెషన్లు, ఫోటో షూట్లు ఆహ్లాదభరిత అనుభూతిని అందిస్తాయి. వాటిపై ఏ టాస్క్ను మీరు ప్రయత్నించినా విశ్వాసంతో వాటిని నిర్వర్తిస్తాయి. అంతేనా..మీ స్మార్ట్ఫోన్ గోప్యతను చెక్కుచెదరకుండా ఉంచడం గురించి మీరు ఇక బాధపడరు! -
ఇది చాలా సరళమైన ప్రక్రియ! (స్పాన్పర్డ్)
మీ స్మార్ట్ఫోన్ ప్రైవసీ కష్టాలన్నింటికీ శాంసంగ్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ సరైన సమాధానం. జనరేషన్ జడ్, మిలీనియల్స్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫీచర్లు యూజర్కు పూర్తి ప్రైవసీని అందించడమే కాకుండా మనశ్శాంతిని అందిస్తాయి. పూర్తి వివరాలను పరిశీలిద్దాం.. ఫీచర్ భాగస్వామి : హెచ్టీ బ్రాండ్ స్టూడియో ఇలా ఊహించుకోండి : మీరు ఆఫీసులో ఉండగా మీ బాస్పై చేసిన మీమ్స్ను చూసేందుకు మీ కొలీగ్స్ మీ ఫోన్ చుట్టూ గుమికూడారు. మీతో సహా వారంతా ఆ మీమ్స్ చూసి నవ్వు ఆపుకోలేని పరిస్ధితి. హఠాత్తుగా మీ బాస్ అక్కడ ప్రత్యక్షం కావడంతో మీరు అచేతనంగా చూస్తుండిపోయారు. బాస్ నా ఫోన్ అడిగితే అప్పుడు ఏం చేయాలి? తర్వాత ఏమవుతుంది? అని మీ మనసులో అలజడి రేపుతుంది. ఇలాంటి క్షణాల్లో మీమ్ కనిపించని వెర్షన్లోకి మారిపోయే ఫీచర్ మీ ఫోన్లో ఉండటం మీరు ఇష్టపడతారు కదా? దీన్ని మీకు మేం అందిస్తాం! క్విక్ స్విచ్ : కేవలం డబుల్ క్లిక్తో మీ ప్రైవసీ పటిష్టం క్విక్ స్విచ్ పేరిట శాంసంగ్ వినూత్నమైన ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్లో క్షణాల వ్యవధిలో ఫోటోలను ప్రైవేట్ నుంచి మెయిన్ గ్యాలరీకి తరలించవచ్చు. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడంతోనే ఈ వెసులుబాటు లభిస్తుంది. ఇది చాలా సరళమైన ప్రక్రియ! ఈ ఫీచర్ నటి రాధికా మోహన్కు ఎలా ఉపయోగపడిందో చూద్దాం. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై అందుబాటులో ఉన్న క్విక్ స్విచ్ వాట్సాప్, బ్రౌజర్, ఇతర యాప్ప్పైనా పనిచేస్తుంది. దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. జనరేషన్ జడ్, మిలీనియల్స్ కోరుకునే వెసులుబాటు, అవాంతరాలు లేని అనుభూతిని క్విక్ స్విచ్ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇది మీ వ్యక్తిగత జీవితానికి రహస్య లాకర్గా మీరు భావించవచ్చు ఫ్రెండ్ లేదా కొలీగ్కు స్మార్ట్ఫోన్లు ఇవ్వాలంటే తటపటాయించే రోజులు పోయాయి. వారికి ఫోన్ ఇస్తే వారు నా కంటెంట్, చాట్లను చూస్తారు కదా ? అనే భయాలు యూజర్ మనసులో మెదిలేవి. వీటన్నింటికీ క్విక్ స్విచ్ సరైన సమాధానంగా ముందుకొచ్చింది. మరోవైపు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై ఉండే సెక్యూర్ ఫోల్డర్లో ఉండే ఆయా యాప్స్ ప్రైవేట్ వెర్షన్లను శాంసంగ్ నాక్స్ భద్రత కాపాడుతుంది. క్విక్ స్విచ్తో కూడిన మీ స్మార్ట్ఫోన్ను నిరభ్యంతరంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఎవరికైనా ఇవ్వవచ్చు. మీ ఫోన్ లాక్ చేయడం మరిచిపోయినా భయపడాల్సిన పనిలేదు! మీ ప్రైవేట్ సమాచారాన్ని మీరు మినహా మరెవరూ చూడకుండా క్విక్ స్విచ్ కాపాడుతుంది. ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ - మీకు అవసరమని మీరు ఊహించని వినూత్న ఆవిష్కరణ శాంసంగ్ ప్రైవసీ వినూత్న ఫీచర్లకు జోడింపుగా ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. స్మార్ట్ఫోన్లో నిర్మితమైన ఏఐ ఫీచర్గా ఇది గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లకు పూర్తి ప్రైవసీని కల్పిస్తుంది. ముందుగా గుర్తించిన ఫోటోల ఆధారంగా ఆయా ఫోటోలను సెక్యూర్ ఫోల్డర్కు ఇది తరలిస్తుంది. మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ వీడియో వీక్షించండి మీరు మీ సోదరికి చెప్పకుండా హాజరైన పార్టీకి సంబంధించిన ఫోటోలను ఆమె కంటపడటం నుంచి ఈ ఫీచర్ మిమ్మల్ని కచ్చితంగా కాపాడుతుంది. మధ్యశ్రేణి సెగ్మెంట్ను బలోపేతం చేసిన శాంసంగ్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లతో ఒత్తిడి రహిత అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్తో మీ స్పేస్ ఎప్పటికీ మీకు సురక్షితమైన స్పేస్గానే ఉంటుంది. జనరేషన్ జడ్, మిలీనియల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ ఫీచర్లు యూజర్కు పూర్తి ప్రైవసీని, మనశ్శాంతిని అందిస్తాయి. స్మార్ట్ఫోన్లలో నిక్షిప్తమైన వ్యక్తిగత, వృత్తిగత డేటా అంతటినీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్గా ఉంచడాన్ని దృష్టిలో ఉంచుకుని నిల్వ చేయడం సవాళ్లతో కూడినదే. ఈ వినూత్న ఫీచర్లతో ఈ సమస్యను శాంసంగ్ దీటుగా పరిష్కరించింది. నేటి ప్రపంచంలో గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 నిజమైన ఆల్రౌండర్లుగా ముందుకొస్తున్నాయి. ఈ ఫోన్లతో జీవితాన్ని వినోదభరితంగా స్వేచ్ఛాయుతంగా మార్చుకోవచ్చు. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లను సొంతం చేసుకుంటే ఇక మీరు ఎన్నడూ వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. (Advertorial) -
ఇకపై నిశ్చింతగా ఉండవచ్చు.. (స్పాన్సర్డ్)
శాంసంగ్ గలాక్సీ ఏ 51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్లలో ప్రవేశపెట్టిన ప్రైవసీ ఫీచర్ను జెడ్ జనరేషన్, మిలీనియల్స్ అత్యధికంగా ఇష్టపడుతున్నారు. క్విక్ స్విచ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫీచర్ ద్వారా గ్యాలరీ, వెబ్ బ్రౌజర్, వాట్సాప్ తదితర యాప్స్ వినియోగంలో ప్రైవేట్ నుంచి వేగంగా పబ్లిక్ వెర్షన్కు మారేందుకు వీలుంటుంది. ఇందుకు పవర్ కీని రెండుసార్లు క్లిక్ చేస్తే సరిపోతుంది! ఫీచర్ భాగస్వామి, హెచ్టీ బ్రాండ్ స్టూడియో జెడ్ జనరేషన్, మిలీనియల్స్ తమ స్మార్ట్ఫోన్లపై అత్యధిక సమయాన్ని గడుపుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లేదా స్నాప్చాట్లో ఫొటోలను అప్లోడ్ చేయడం, లేకుంటే.. ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్లలో చాట్ చేయడం కోసం అధిక సమయాన్ని వినియోగిస్తున్నారు. రోజువారీ జీవనంలో మరే ఇతర గాడ్జెట్కంటే స్మార్ట్ఫోన్పైనే అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఆధునిక శాంసంగ్ గలాక్సీ ఏ 51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్ల ద్వారా జెడ్ జనరేషన్, మిలీనియల్స్కు సరికొత్త ప్రపంచం పరిచయమవుతుంది. ఈ స్మార్ట్ఫోన్లు అమోలెడ్ డిస్ప్లేలతోపాటు.. క్యాడ్ కెమెరా సెటప్, అధిక సమయం నిలిచే బ్యాటరీ శక్తితో లభిస్తాయి. ఎలాంటి టాస్క్నైనా సులభంగా నిర్వహించుకోవచ్చు. ఆల్ట్ జెడ్ జీవితంలో శాంసంగ్ స్మార్ట్ఫోన్లతో ఒత్తిడిని దూరం(స్ట్రెస్ ఫ్రీ) చేసుకోవచ్చు. మీ జీవితంలో ప్రైవేట్ మొమెంట్స్ను ప్రైవేట్గానే ఉంచుకోవచ్చు. మీరు మినహా ఎవరూ వీటిని పొందలేరు. క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ పేరుతో పరిశ్రమలోనే తొలిసారి రెండు ఆధునిక ప్రైవసీ ఫీచర్స్ను ప్రవేశపెట్టింది. వీటితో వెనుదిరిగి చూడవలసిన అవసరం ఉండదు. ప్రైవసీ ఫస్ట్ స్మార్ట్ఫోన్లను రోజువారీ వినియోగించేందుకు ఇష్టపడేవారైతే.. అన్ని వేళలా మీ ప్రైవసీ రక్షణను కోరుకుంటారు. ఇతరులు ఫోటోలు తీసుకునేందుకు మీ స్మార్ట్ఫోన్ను వినియోగించుకోవడాన్ని చాలా సందర్భాలలో ఎదుర్కొనే ఉంటారు. తద్వారా మీకు సంబంధించిన ఫొటోలు తదితరాలను చూడటం జరుగుతూ ఉంటుంది. అయితే మీ కొత్త స్మార్ట్ఫోన్ను పరిశీలించడం ద్వారా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎవరైనా మీకు వచ్చిన మెసేజ్ను చదివే అవకాశముండవచ్చు. ఇలాంటి సందర్భంలో మనకు సంబంధించిన వ్యక్తిగత, ప్రైవేట్ డేటాను ఇతరులు చూస్తారన్న ఆందోళన కలుగుతుంది. ఇలాంటప్పుడు పవర్ బటన్ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఆందోళనకు చెక్ పెట్టవచ్చు. క్విక్ స్విచ్గా పిలిచే ఈ విశిష్ట ఫీచర్.. శాంసంగ్ గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ 71 స్మార్ట్ఫోన్లకు ప్రత్యేకం. నటి రాధికా మదన్ జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. ఈ ఫీచర్ను సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఈ వీడియోలో తన బాయ్ఫ్రెండ్(సన్నీ సింగ్ నటించారు)కు పుట్టిన రోజు పార్టీతో సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. అయితే ఊహించని విధంగా సన్నీ వచ్చాడు. అయితే రాధిక ఎలాంటి పరిస్థితుల్లోనూ సర్ప్రైజ్ పార్టీ ఆలోచనకు విఘాతం కలగకూడదనుకుంది. ఇందువల్ల ఆమె క్విక్ స్విచ్ను వినియోగించడం ద్వారా సీక్రెట్ను సేఫ్గా ఉంచగలిగింది. క్విక్ స్విచ్ ఫీచర్ కారణంగా ఎవరైనా తమ స్మార్ట్ఫోన్ను ఫొటో తీసేందుకు మరొకరికి సంకోచం లేకుండా ఇవ్వవచ్చు. లేదంటే యూట్యూబ్లో వైరల్ అవుతున్న వీడియోను వీక్షించేందుకు ఇవ్వవచ్చు. ఫోన్ పవర్ బటన్ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఫోన్లోని యాప్స్- గ్యాలరీ, బ్రౌజర్, వాట్సాప్ వంటివన్నీ ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్కు మారిపోతాయి. అంతేకాకుండా మీరు ప్రైవసీ కోరుకునే ఇమేజ్లను ప్రైవేట్ చేయమంటూ ఏఐ ఆధారిత కంటెంట్ సజెషన్స్ సూచిస్తుంది. ఈ ఫీచర్ సులభంగా సెట్ చేసుకోవచ్చు. కొన్ని ముఖాలు లేదా ఇమేజిలను ఎంపిక చేసుకోవాలి. వీటిని ప్రైవేట్ ఫోల్టర్లోకి బదిలీ చేయాలి. శాంసంగ్ నాక్స్(Knox)ద్వారా కంటెంట్ సజెషన్స్కు డిఫెన్స్ ప్రమాణాల స్థాయిలో భద్రత ఉంటుంది. దీంతో మీ ప్రైవసీకి గతంలో ఎన్నడూలేని విధంగా రక్షణ లభిస్తుంది. ఇక కెమెరా విశిష్టతలను పరిశీలిస్తే.. సింగిల్ టేక్ కెమెరా ఫీచర్లలో మొదటిగా చెప్పుకోవలసింది సింగిల్ టేక్. ఫొటోలు తీసుకోవడంలో పెర్ఫెక్ట్ ఫ్రేమ్ను ఎంచుకునేందుకు వీలుగా మీ స్మార్ట్ఫోన్లో సింగిల్ టేక్ ఫీచర్ను ఎంపిక చేసుకుంటే చాలు. మిగతా పని ఫోన్ చూసుకుంటుంది. ఈ ఫీచర్ ద్వారా 10 రకాల ఫొటోలు, వీడియోలను ఫోన్ క్యాప్చర్ చేస్తుంది. వీటిలో 7 ఫొటోలు, 3 వీడియోలు నమోదవుతాయి. ఇవి గ్యాలరీలో వెనువెంటనే లభ్యమవుతాయి. ఉత్తమ షాట్స్ను తీయడం ద్వారా సింగిల్ టేక్ ఒకే ఆల్బమ్కింద రూపొందిస్తుంది. ఏఐ సహకారంతో కెమెరా సాఫ్ట్వేర్.. షార్ట్ మూవీ, జిఫ్ యానిమేషన్స్, స్టైలిష్ ఇమేజెస్ తదితరాలను ఆటోమాటిక్గా తీయగలుగుతుంది. సింగిల్ టేక్ ఫీచర్తో అత్యుత్తమ ఫొటోను పొందగలుగుతారు. తద్వారా వీటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. సింగిల్ క్లిక్తో షేర్ చేయగలగడంతో సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. నైట్ హైపర్ల్యాప్స్ సింగిల్ క్లిక్ తదుపరి నైట్ హైపర్ల్యాప్స్ను ప్రస్తావించాలి. సోషల్ మీడియా ఫీడ్స్ను గమనిస్తే జెడ్ జనరేషన్, మిలీనియల్స్ ప్రతి రోజూ మరిన్ని ఫొటోలను తీసుకుంటూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. భోజనానికి ఏదైనా రెస్టారెంట్కు వెళ్లినా లేదా పార్క్లో కూర్చున్నా ఆ సమయాన్ని హైపర్ల్యాప్స్గా పిలవవచ్చు. మూవింగ్ టైమ్ ల్యాప్స్గా పేర్కొనే ఈ సమయంలో శాంసంగ్ నైట్ హైపర్లాప్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీంతో తక్కువ లైటింగ్ పరిస్థితుల్లోనూ అందమైన ఫొటోలను తీసుకునేందుకు వీలుంటుంది. కెమెరాలో గల ఇతర ఫీచర్ల విషయానికివస్తే.. కస్టమ్ ఫిల్టర్, క్విక్ వీడియో రికార్డింగ్, స్విచ్ కెమెరా వైల్ రికార్డింగ్(ప్రస్తుతం ఏ51లో లభ్యం), ఏఐ గ్యాలరీ జూమ్, స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ను ప్రస్తావించవచ్చు. ఆల్ట్ జెడ్ లైఫ్లో రిలీఫ్ శాంసంగ్ స్మార్ట్ఫోన్ల ద్వారా ఇతరులకు ఫోన్ ఇచ్చే సమయంలో ఆందోళనలకు చెక్ పెట్టవచ్చు. ఈ విషయంలో ఇకపై నిశ్చింతగా ఉండవచ్చు. గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్లను సరికొత్త ఆవిష్కరణలుగా చెప్పవచ్చు. క్వాడ్ కెమెరా సెటప్తో సులభంగా ఫొటోలను తీయవచ్చు. దీనికితోడు అత్యుత్తమ డిస్ప్లే, అధిక సమయం నిలిచే బ్యాటరీ అండగా ఉంటాయి. ఇంతకంటే ఆశించడానికి ఇంకేముంటుంది? ఈ ఫీచర్లతో గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్ల ద్వారా ఆల్ట్ జెడ్ జీవితాన్ని ఆనందించండి. మరింకెందుకు ఆలస్యం? (Advertorial) -
రూ.70 వేల శాంసంగ్ ఫోన్ రూ. 25 వేలకే
సాక్షి, ముంబై: ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ‘బిగ్ షాపింగ్ డేస్’ పేరుతో లాంచ్ చేసిన స్పెషల్ సేల్ ద్వారా ఒప్పో, శాంసంగ్ రియల్మి తదితర బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 19 నుంచి 22 వరకు ఈ సేల్ నిర్వహించనుంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 ప్లస్పై భారీ తగ్గింపు ఆఫర్ చేస్తోంది ఫ్లిప్కార్ట్. 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను దాదాపు 50 వేల తగ్గింపుతో అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు కొనుగోలుపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభ్యం. మూడు రంగుల్లో ఇది లభిస్తోంది. అలాగే 12100 దాకా ఎక్స్జేంజ్ ఆఫర్ కూడా వుంది. అసలు ధర రూ. 70 వేలు ఆఫర్ ధర రూ.24,999 గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫీచర్లు 6.2 డిస్ప్లే 1440x2960 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8 ఓరియో 6జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 12+12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
యాపీ ఫిజ్ బంపర్ ఆఫర్..
పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రొడక్ట్ యాపీ ఫిజ్ తన వినియోగదారులకు స్మార్ట్ఫోన్లను బహుమతిగా ఇస్తోంది. ప్రమోషన్లో బాగంగా నాలుగు శాంసంగ్ గెలాక్సీ 10 ప్లస్ స్మార్ట్ఫోన్లను గ్రాండ్ప్రైజ్గా అందివ్వనుంది. నవంబరు 7 నుంచి 22 వరకు ఈ పోటీ అందుబాటులో ఉంటుంది. పోటీలో పాల్గొనాలంటే.. దేశ వ్యాప్తంగా ఆ పోటీ అందుబాటులో ఉంది. ఫీల్ ద ఫిజ్ అధికారిక ఇన్స్టగ్రామ్ను పేజీని ఫాలో కావాలి. యాపీ ఫిజ్తో కలిపి మీకు నచ్చిన ఏ ఆహారాన్ని జతగా తీసుకుంటే బాగుంటుంది? అనే విషయాన్ని ఫోటోలు, వీడియోలతో సహా జతచేయాలి. పోటీలో పాల్గొనాల్సిందిగా మీ స్నేహితులను ఆహ్వానించాలి. తద్వారా మీరు, మీ స్నేహితులు బహుమతులు గెలుచుకోవచ్చు. ప్రతి వారం లక్కీ విజేతలు ఆర్టోఫ్ ఫిజ్ మర్చండైజ్ గెలుచుకోవడానికి అర్హులు. అలాగే 4 మంది అదృష్ట విజేతలను ప్రకటిస్తుంది. వీరు శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫోన్ను గెలుచుకోవచ్చు. కాగా దక్షిణ భారతంలో యాపీ ఫిజ్ ప్రచారకర్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్విటర్ ఖాతాలో ఈ కాంటెస్ట్ గురించి పోస్ట్ చేశారు. తన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చి, బహుమతులు గెలుచుకోవచ్చని సూచించారు. దీంతో అటు యాపీ ఫిజ్ ఫ్యాన్స్, ఇటు యంగ్టైగర్ ఫ్యాన్స్ ట్విటర్లో ఇమేజ్లు, వీడియోలతో సందడి చేస్తున్నారు. పోటీకి సంబంధించి మరిన్ని వివరాలకు '@iamappyfizz', '#ArtofFizz' హ్యాష్ ట్యాగ్ లను పరిశీలించాలి. What is your favourite food that you'd like to pair with @iamappyfizz ? Let your friends on Twitter know and win cool stuff. Follow @iamappyfizz for more details #ArtofFizz pic.twitter.com/5zMxzS1Uae — Jr NTR (@tarak9999) November 12, 2019 My Caption : #FEELTHEFIZZ #ARTOFFIZZ To have good health we need to take proper meal @iamappyfizz To have good health and Energetic we need to take Proper meal and Fizz drinks.Satisfied meal cannot be satisfied without Appy Fizz.Keep cool and always chill with Appy fizz drink pic.twitter.com/X5vaeL1s4H — Anusuresh (@Anusure40893798) November 11, 2019 -
మార్కెట్లోకి ‘శాంసంగ్ గెలాక్సీ ఏ10ఎస్’
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ గెలాక్సీ సిరీస్లో తాజాగా ‘ఏ10ఎస్’ స్మార్ట్ఫోన్ను విడుదలచేసింది. గెలాక్సీ ఏ లైన్ స్మార్ట్ఫోన్కు అధునాతన ఎడిషన్గా వచ్చిన ఈ ఫోన్ ధరల శ్రేణి రూ. 9,499 నుంచి రూ. 10,499గా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. రెండు వేరియంట్లలో ఈ మోడల్ లభ్యంకానుంది. 2జీబీ, 3జీబీ ర్యామ్తో.. ఆగస్టు 28 నుంచి రిటైల్ స్టోర్స్, శాంసంగ్ ఒపెరా హౌస్, ఆన్లైన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుందని సంస్థ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ ప్రకటించారు. 6.2–అంగుళాల స్క్రీన్, వెనుకవైపు డ్యుయల్ కెమెరా (13 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 ఎంపీ సెకండరీ), 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకలు ఉంటాయని వివరించారు. -
బంజారాహిల్స్లో హెబ్బా పటేల్ సందడి
-
వీడియో చూస్తూ చాటింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ సిరీస్లో తాజాగా ఏ6, ఏ6 ప్లస్, జే6, జే8 మోడళ్లను సోమవారం ఆవిష్కరించింది. ధరల శ్రేణి రూ.13,990 నుంచి రూ.25,990 మధ్య ఉంది. దుకాణాల్లో పేటీఎం మాల్ ద్వారా చెల్లిస్తే రూ.3,000 వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ ఉంది. భారత్లో తొలిసారిగా చాట్ ఓవర్ వీడియో ఫీచర్ను వీటిలో పొందుపరిచారు. ఒకవైపు వీడియో చూస్తూనే మరోవైపు చాటింగ్ చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత. ఇన్ఫినిటీ డిజైన్తో స్క్రీన్ సైజు 15 శాతం పెరిగింది. ఆన్డ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్పై ఇవి పనిచేస్తాయి. 256 జీబీ వరకు సపోర్ట్ చేసే మైక్రో ఎస్డీ స్లాట్ ఉంది. ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. కొత్త మోడళ్ల రాకతో ఈ ఏడాది కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుత 42 శాతం నుంచి 47 శాతానికి చేరుతుందని శాంసంగ్ డైరెక్టర్ సుమిత్ వాలియా తెలిపారు. గెలాక్సీ ఏ6 : 5.6 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్, 16 ఎంపీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ మెమరీ. ధర రూ.21,990/22,990. గెలాక్సీ ఏ6+ : 6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 16 ఎంపీ+5 ఎంపీ కెమెరాలు, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ. ధర రూ.25,990. గెలాక్సీ జే6 : 5.6 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్, 13 ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, పాలీకార్బొనేట్ యూనిబాడీ. ధర రూ.13,990/16,490. గెలాక్సీ జే8 : 6 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్, 16 ఎంపీ+5 ఎంపీ కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ. ధర రూ.18,990. -
శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ధరెంతో తెలుసా?
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధర రూ.57,900. కాగా కంపెనీ తొలిసారిగా ఈ ప్రీమియం ప్రొడక్టులను ఇటీవల స్పెయిల్లోని బార్సిలోనాలో ఆవిష్కరించింది. డ్యూయెల్ ఎపర్చర్ అండ్ స్లో మోషన్ వీడియో ఆప్షన్స్, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, డాల్బే సౌండ్ వంటి ఫీచర్లున్న ఈ స్మార్ట్ఫోన్లు యాపిల్ ఐఫోన్–ఎక్స్, గూగుల్ పిక్సెల్–2 ఫోన్లకు గట్టిపోటీనిస్తాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక ఈ స్మార్ట్ఫోన్లు మార్చి 16 నుంచి కస్టమర్లను అందుబాటులోకి రానున్నవి. ఎస్9 స్మార్ట్ఫోన్లో 5.8 అంగుళాల డిస్ప్లే, 4 జీబీ ర్యామ్, 12 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇక ఎస్9 ప్లస్లో 6.2 అంగుళాల డిస్ప్లే, 6 జీబీ ర్యామ్, 12 ఎంపీ రియర్/ ఫ్రంట్ కెమెరాలు, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. -
శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎ.. త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ త్వరలోనే తన పాపులర్ గెలాక్సీ ఏ సిరీస్లో కొత్త ఎడిషన్లను లాంచ్ చేయనుంది. జనవరిలో రెండవ వారంలో 2018 ఎడిషన్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం ఆన్లైన్ లోనే మాత్రమే ఇవి లభ్యంకానున్నాయి. ఆన్లైన్ ప్లాట్ ఫామ్లో అందుబాటులో ఉన్న 'ఎ' సిరీస్ ఈ డివైస్ మొదటిది. గెలాక్సీ ఎ8,గెలాక్సీ ఎ8 + గెలాక్సీ ఎస్8, ఎస్8 + నోట్ 8 2018ఎడిషన్లను గత నెలలో గ్లోబల్గా ప్రారంభించింది. జనవరి 10వ తేదీన వీటిని లాంచ్ చేయనుంది. అయితే ఇండియాలో అమెజాన్లో ప్రత్యేకంగా ఒక వేరియంట్ను మాత్రమే అందించనుందట. ఇన్ఫినిటీ డిస్ప్లే, ఫస్ట్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా ,లైవ్ ఫోకస్ లాంటి ఆకర్షణీయ ఫీచర్లతో తీసుకొస్తున్నట్టు శాంసంగ్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్, మొబైల్ కమ్యునికేషన్స్ బిజినెస్ జున్హో పార్కు ఒక ప్రకటనలో తెలిపారు. డస్ట్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్, మొబైల్ పేమెంట్ డిజిటల్ వాలెట్, యూఎస్బీ టైప్ సీ( ఫాస్ట్ చార్జింగ్)ను కూడా వీటిల్లో జోడించినట్టు వెల్లడించారు. -
గెలాక్సీ ఎస్ 8యాక్టివ్: పగలదు, నానదు..ధర?
కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 సిరీస్లో మరో నూతన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎస్8 యాక్టివ్ను సోమవారం లాంచ్ చేసింది. ఎన్నో లీకులు, అంచనాల తరువాత ఎట్టకేలకు గెలాక్స్ ఎస్ 8 యాక్టివ్ మన ముందుకు వచ్చింది. ప్రీ ఆర్డర్ ద్వారా ప్రస్తుతం ఎటీ అండ్ టీ లో ప్రత్యేకంగా లభించనుంది. ఆగస్టు 11 నుంచి స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. దీని ధర సుమారు రూ.54వేలుగా ఉండనుంది. అంతేకాదు ఎటీఅండ్టీ క్యారియర్ ప్రొవైడర్ కస్టమర్లను ఆకర్షించడానికి కొన్ని రోజులపాటు ఆఫర్లను కూడా అందించనుంది. ఉదాహరణకు, కొనుగోలుదారు గెలాక్సీ S8 యాక్టివ్ తో పాటు శాంసంగ్ టీవీని కూడా ఆన్లైన్లో కొంటే రూ.32వేల తగ్గింపుతోపాటు డైరెక్ట్ టీవీ కనెక్ట్న్. ఎక్సేంజ్ ద్వారా దాదాపు రూ .12,700 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ మెటోర్ గ్రే, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్స్లోఅందుబాటులో ఉంటుంది. షట్టర్ ప్రూఫ్ స్క్రీన్ (5 అడుగుల ఎత్తునుంచి కింద పడినా పగలదు) మిలిటరీ గ్రేడ్ షీల్డింగ్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ( 5అడుగుల లోతు నీళ్లలో అరగంట నానినా పాడుకాదు) బిగ్గెస్ట్ హైలైట్గా నిలవనుంది. అంతేకాదు తీవ్రమైన ఉష్ణోగ్రత, దుమ్ము, షాక్ / కంపనం మరియు అల్ప పీడన / అధిక ఎత్తు సహా 21 ప్రత్యేకమైన పర్యావరణ పరిస్థితులల్లో MIL-STD-810G పరీక్షలు పాస్అయిందట. గెలాక్స్ ఎస్ 8 యాక్టివ్ 5.80 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే 2.35గిగాహెడ్జ్ ఎనిమిదో కోర్ ప్రాసెసర్ 1440x2560 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8మెగాపిక్సెల్ ముందు కెమెరా ఆండ్రాయిడ్ 7.0 4 జీబీ ర్యామ్ 64జీబీ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
గెలాక్సీ ఎస్ 8ప్లస్ ఇండియాలో..ధర ఎంత?
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్ను ఇండియ న్ మార్కెట్ లో శుక్రవారం లాంచ్ చేసింది. గ్లోబల్గా గెలాక్సీ ఎస్8 ,ఎస్8ప్లస్లకు మంచి స్పందన లభించిన తర్వాత 6జీబీ వేరియంట్ గెలాక్సీ ఎస్ 8ప్లస్ కొత్త వెర్షన్ను భారత్ లో లాంచ్ చేసింది. దీని ధరను రూ. 74,990గా నిర్ణయించింది. ఈ రోజునుంచి (జూన్ 2) ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్కు ప్రీ బుక్ చేసుకోవచ్చనీ, జూన్ 9 నుంచి డెలివరీ మొదలవుతుందని కంపెనీ తెలిపింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అందుబాటులోకి తీసుకొచ్చిన స్మార్ట్ఫోన్ మల్టీ టాస్కింగ్ కస్టమర్లకు ఇది అల్టిమేట్ డివైస్ అని శాంసంగ్ ఇండియా మొబైల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సీ ఒక ప్రకటనలో తెలిపారు. పరిచయ ఆఫర్గా వినియోగదారులు ఉచిత వైర్లెస్ ఛార్జర్ను అందిస్తోంది. గెలాక్సీ ఎస్ 8ప్లస్ 6.2ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2960×1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 6 జీబీర్యామ్ 128 ఇంటర్నల్ స్టోరేజ్ 12ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్పీ కెమెరా విత్ మల్టీ-ఫ్రేమ్ ప్రాసెసింగ్ , ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం -
శాంసంగ్ గెలాక్సీ జె 5, జె 7లాంచింగ్ నేడే
న్యూఢిల్లీ: ఇండియన్ మొబైల్ మార్కెట్ లో దూసుకుపోతున్న శాంసంగ్ జె సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్లను సోమవారం భారత మార్కెట్ లో రిలీజ్ చేయనుంది. స్మార్ట్ పోన్ సెగ్మెంట్ లో శాంసంగ్ 'గెలాక్సీ జె7' ., గెలాక్జీ జె 5' లను ఈ రోజు విడుదల చేయనుంది. మొబైల్ అమ్మకాల్లో యాపిల్ సంస్థకు ఇప్పటికే చెక్ పెట్టిన శాంసంగ్, గెట్ రెడీ టూ విట్నెస్ ద నెక్ట్స్ అంటూ ప్రత్యర్థి కంపెనీలకు సవాలు విసురుతోంది. తన తాజా గెలాక్సీ J5ను సుమారు Rs. 17,000, గెలాక్సీ J7ను సుమారు 21,000 రూపాయలకు వినియోగదారులకు లభ్యం కానుంది. మెటల్ ఫ్రేమ్స్ తో వస్తున్న ఈ రెండు ఫోన్ల ఫీచర్స్ఇలా వున్నాయి. శాంసంగ్ గెలాక్సీ జె7 (2016) ఫీచర్లు... 5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.6 జీహెచ్జెడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.1 3300 ఎంఏహెచ్ బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ జె7 (2016) ఫీచర్లు... 5.20 డిస్ ప్లే 1.2 జీహెచ్జెడ్ ప్రాసెసర్, 5 మోగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 720x1280 పిక్సెల్ రిజల్యూషన్, 2జీబీ ర్యామ్, 6.0.1 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3100 ఎంఏహెచ్ బ్యాటరీ రేడియంట్ గోల్డ్, మిడ్ నైట్ బ్లాక్, పెర్ల్ వైట్, వేరియంట్లలో మంగళవారం నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటాయి. గత ఏడాది మార్చిలో చైనాలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్లు, కొరియాలో గతవారం మార్కెట్లను పలకరించాయి. -
శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకు బిగ్ సి ఆడ్వాన్స్ బుకింగ్ ఆఫర్
హైదరాబాద్: శాంసంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ మొబైల్స్కు బిగ్ సి అడ్వాన్స్ బుకింగ్ను ఆఫర్ చేస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్లకు అడ్వాన్స్ బుకింగ్లను ఈ నెల 8 నుంచి ప్రారంభించామని బిగ్ సి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 17 వరకూ ఈ అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్ ఉంటుందని బిగ్ సి సీఎండి బాలు చౌదరి పేర్కొన్నారు. రూ.2,000 చెల్లించి ఈ ఫోన్లను అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చని, రూ.7,999 విలువ గల శాంసంగ్ ‘గేర్ వీ ఆర్’ను ఉచితంగా అందిస్తామని వివరించారు. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని బిగ్ సి షోరూమ్ల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. -
శామ్సంగ్ కొత్త గెలాక్సీ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ మోడల్లో మధ్య తరహా ఫోన్, గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్ఫేస్, యాప్ల యాక్సెస్, కంటెంట్ 10 భారతీయ భాషల్లో యాక్సెస్ చేసుకునే వీలున్న ఈ ఫోన్ ధరను రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది. తెలుగు, హిందీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ, మరాఠీ, గుజరాతీ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫేస్బుక్తో పాటు చాట్-ఆన్, జీమెయిల్, న్యూస్హంట్ తదితర యాప్లను ఈ 10 భారతీయ భాషల్లో యాక్సెస్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ డ్యూయల్ సిమ్ ఫోన్లో 4 అంగుళాల స్క్రీన్, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1.2 గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమరీ, 64 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ, 3జీ సపోర్ట్. 8 గంటల టాక్టైమ్ తదితర ప్రత్యేకతలున్నాయి. గెలాక్సీ సిరీస్లో రూ.4,900 నుంచి రూ.47,900 రేంజ్లో స్మార్ట్ఫోన్లను శామ్సంగ్ కంపెనీ అందిస్తోంది. -
శామ్సంగ్ డ్యూయల్ స్క్రీన్ ‘గెలాక్సీ గోల్డెన్’
న్యూఢిల్లీ: శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్లో మరో కొత్త ఫోన్, గెలాక్సీ గోల్డెన్ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 3.7 అంగుళాల రెండు స్క్రీన్లు (డ్యూయల్ స్క్రీన్)ఉన్న ఈ బం గారం కలర్ ఫ్లిప్ ఫోన్ ధర రూ.51,900. పైన ఉన్న స్క్రీన్తో యూజర్లు కాల్స్ చేయవచ్చు. అంతేకాకుండా కాల్స్ను రిసీవ్ చేసుకోవచ్చు. ఇక లోపల ఉన్న ఇన్నర్ స్క్రీన్లో 3గీ4 కీ ప్యాడ్ ఉం టుంది. దీనిలో పెద్ద సైజ్ కీలు ఉండడం విశేషం. ఫోన్ను ఉపయోగించడం సులభతరం చేయడానికే ఇలాంటి డిజైన్ ఉన్న ఫోన్ను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ సింగిల్ సిమ్ ఫోన్లో ఉన్న హిడెన్ రిసీవర్ కారణంగా ఫోల్డర్ను తెరవకుండానే కాల్స్ రిసీవ్ చేసుకోచ్చని వివరించింది. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ ఫోన్లో 1.7 గిగాహెర్ట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.9 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయి. టచ్, టైప్ అనుభవాన్నిచ్చే అత్యుత్తమ స్మార్ట్ఫోన్ ఇదని శామ్సంగ్ మొబైల్స్ అండ్ ఐటీ కంట్రీ హెడ్ వినీత్ తనేజా చెప్పారు. -
శామ్సంగ్ గెలాక్సీ చౌక ఫోన్లు
న్యూఢిల్లీ: గెలాక్సీ సిరీస్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లు గెలాక్సీ స్టార్ ప్రో, గెలాక్సీ ట్రెండ్లను శామ్సంగ్ కంపెనీ గురువారం మార్కెట్లోకి తెచ్చింది. వీటి ధరలను రూ.6,750, రూ.8,290గా నిర్ణయించామని శామ్సంగ్ మొబైల్స్ అండ్ ఐటీ కంట్రీ హెడ్ వినీత్ తనేజా చెప్పారు. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళం.. ఈ 9 భాషలు ప్రి లోడెడ్గా ఈ ఫోన్లను అందిస్తున్నామని వివరించారు. వినియోగదారులు ఈ భాషల్లో ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చని, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చని, ఫోన్ ఇంటర్ఫేస్ను కూడా నచ్చిన భాషలో వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. వివిధ యాప్లను ఈ భాషల్లో యాక్సెస్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లో స్మార్ట్ఫోన్ సౌకర్యాలను పొందవచ్చని వివరించారు. ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఓఎస్పై పనిచేసే ఈ రెండు ఫోన్లలో డ్యుయల్ సిమ్, 1 గిగా హెర్ట్స్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ, 4 అంగుళాల డిస్ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి. గెలాక్సీ స్టార్ ప్రోలో 2 మెగా పిక్సెల్ కెమెరా, గెలాక్సీ ట్రెండ్లో 3 మెగా పిక్సెల్ కెమెరా ఫీచర్లున్నాయి. గెలాక్సీ సిరీస్లో రూ.10,000 లోపు ధరలో శామ్సంగ్ 4 స్మార్ట్ఫోన్లను అందిస్తోంది.