SEPTEMBER QUARTER
-
మొబైల్ టారిఫ్ పెంపు తర్వాత భారీగా ఆదాయం
టెలికం ఆపరేటర్ల (Telecom Operators) స్థూల ఆదాయం 2024 సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో 10.5 శాతం వృద్ధి చెంది రూ.91,426 కోట్లుగా నమోదైంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్/దీనిపైనే ప్రభుత్వం పన్నులు వసూలు చేసేది) 13 శాతం పెరిగి రూ.75,310 కోట్లకు చేరింది. ఈ వివరాలను టెలికం రంగ నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసింది.గతేడాది జూలైలో ఎయిర్టెల్ (Airtel), జియో (Jio), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ మొబైల్ టెలిఫోనీ చార్జీలను 11–25 శాతం మధ్య పెంచడం తెలిసిందే. ఈ పెంపు అనంతరం సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) పెరిగింది. కానీ, అదే సమయంలో సబ్స్క్రయిబర్లను కొంత మేర కోల్పోవాల్సి వచ్చింది.టెలికం కంపెనీల నెలవారీ ఏఆర్పీయూ సెప్టెంబర్ త్రైమాసికంలో 10 శాతం పెరిగి రూ.172.57కు చేరింది. జూన్ త్రైమాసికంలో ఇది 157.45గా ఉంది. ప్రీపెయిడ్ కనెక్షన్ల ఏఆర్పీయూ రూ.171గా ఉంటే, పోస్ట్పెయిడ్ కనెక్షన్లకు రూ.190.67గా నమోదైంది. మొబైల్ చందాదారులు 1.68 కోట్ల మంది తగ్గి 115.37 కోట్లకు పరిమితమయ్యారు. జూన్ క్వార్టర్ చివరికి చందాదారుల సంఖ్య 117 కోట్లుగా ఉంది. కంపెనీల వారీగా ఏజీఆర్ భారతీ ఎయిర్టెల్ ఏజీఆర్ 24 శాతం పెరిగి రూ.24,633 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఏజీఆర్ 14 శాతం వృద్ధితో రూ.26,652 కోట్లకు.. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ 4 శాతం పెరిగి రూ.7,837 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి టెలికం కంపెనీల నుంచి ప్రభుత్వం వసూలు చేసిన లైసెన్స్ ఫీజు 13 శాతం పెరిగి రూ.6,023 కోట్లకు చేరింది. -
వృద్ధి తిరిగి ట్రాక్లోకి వస్తుంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎన్నో అనిశి్చతులు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తిరిగి గాడిన పడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో విధాన నిర్ణయాలు, వృద్ధికి సంబంధించి చర్యలు, మౌలిక వసతులపై ఖర్చు చేయడం సహజంగానే తగ్గుతాయి. ప్రస్తుత త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో పండుగల వ్యయాలకుతోడు, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి పుంజుకోవడం, మౌలిక వసతులపై వ్యయాలు సాధారణ స్థితికి చేరుకున్నట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. వచ్చే మార్చి చివరికి తిరిగి ట్రాక్లోకి వస్తాం’’అని టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన సదస్సులో భాగంగా మంత్రి గోయల్ చెప్పారు. తయారీ, మైనింగ్ రంగాల్లో బలహీన పనితీరుతో సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఇది ఆందోళన కలిగిస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు గోయల్పై విధంగా బదులిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వృద్ధి 8.1 శాతంగా ఉండడం గమనించొచ్చు. చివరిగా 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో జీడీపీ 4.3 శాతం కనిష్ట వృద్ధి రేటును నమోదు చేసింది. అయినా వేగవంతమే.. ఇప్పటికీ ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గోయల్ చెప్పారు. ఆధునిక టెక్నాలజీలు, ఆవిష్కరణలు దేశ వృద్ధి రేటును నడిపిస్తాయన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.6 శాతమే కావడం గమనార్హం. ప్రతిపక్ష పారీ్టలు చేస్తున్న తప్పుడు, ప్రతికూల ప్రచారం దేశ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోలేవన్నారు. ‘‘వక్ఫ్ బిల్లు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుల ఆమోదానికి కట్టుబడి ఉన్నాం. ఇవి నిర్మాణాత్మక మార్పులు. దేశానికి మంచి చేసే వీటి విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం’’అని చెప్పారు. -
బాటా ఇండియా మెరుగైన పనితీరు
న్యూఢిల్లీ: బాటా ఇండియా సెపె్టంబర్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. లాభం 53 శాతానికి పైగా పెరిగి రూ.52 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం 2 శాతానికి పైగా వృద్ధితో రూ.837 కోట్లుగా నమోదైంది. ఎబిట్డా లాభం స్థిరంగా ఉండడం నిర్వహణ సామర్థ్యాల బలాన్ని తెలియజేస్తున్నట్టు బాటా ఇండియా ప్రకటించింది. ఉత్పత్తుల ఆవిష్కరణ, కస్టమర్లకు మెరుగైన అనుభవం, టెక్నాలజీ అనుసంధానత, బ్రాండ్ ప్రమియమైజేషన్పై తాము చేసిన వ్యూహాత్మక పెట్టుబడులు ఫలితాన్నిచి్చనట్టు తెలిపింది. వినియోగంలో స్తబ్దత ఉన్నప్పటికీ తాము మెరుగైన పనితీరు చూపించినట్టు బాటా ఇండియా ఎండీ, సీఈవో గుంజన్ షా పేర్కొన్నారు. సెపె్టంబర్ చివరికి దేశవ్యాప్తంగా బాటా స్టోర్ల సంఖ్య 1,955కి చేరింది. పవర్ బ్రాండ్కు సంబంధించి 4, హష్ పప్పీస్కు సంబంధించి 136 బ్రాండెడ్ అవుట్లెట్లు, ఫ్లోట్జ్కు సంబంధించి 14కియోస్క్లను కొత్తగా తెరిచినట్టు బాటా ఇండియా తెలిపింది. -
అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు, సెపె్టంబర్ త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన రూ.11,746 కోట్లుగా నమోదైంది. 2023–24 ఇదే త్రైమాసిక లాభం రూ.10,261 కోట్లతో పోలిస్తే 14.5% అధికం. మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి 17% పెరిగి రూ.47,714 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.34,920 కోట్ల నుంచి రూ.40,537 కోట్లకు పెరిగింది. దేశీయ రుణాలు పెరగడంతో నికర వడ్డీ ఆదాయం 9.5% వృద్ధి చెంది రూ.20,048 కోట్లకు చేరుకుంది. అయితే నికర వడ్డీ మార్జిన్ 4.53% శాతం నుంచి 4.27 శాతానికి తగ్గింది. ఫీజు ఆదాయ వృద్ధి కారణంగా వడ్డీయేతర ఆదాయం( 11% పెరిగి రూ.5,861 కోట్ల నుంచి రూ.6,496 కోట్లకు చేరింది. బ్యాంకు కనీస మూలధన నిష్పత్తి 16.66 శాతంగా నమోదైంది. జూలై– సెప్టెంబర్లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏలు) 2.48 శాతం నుంచి 1.97 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 0.42% నుంచి 0.43 శాతానికి చేరాయి. ప్రొవిజన్లు(కేటాయింపులు) రూ.1,233 కోట్లకు చేరుకున్నాయి. గత క్వార్టర్ కేటాయింపులు రూ.583 కోట్లతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ప్రోవిజన్ కవరేజ్ రేషియో(పీసీఆర్) 78.5 శాతంగా ఉంది. రుణాల విషయానికొస్తే.., దేశీయ రుణాలు 15.7%, రిటైల్ రుణాలు 14.2%, బిజినెస్ బ్యాంకింగ్ 30%, కార్పొరేట్ రుణాలు 11.2 శాతం మేర పెరిగాయి. సమస్యాత్మక వ్యక్తిగత రుణాలు, క్రిడెట్ కార్డుల రుణాల్లో తగ్గుదల ఉంది. ద్విచక్ర వాహన రుణాలు 32.4% తగ్గుముఖం పట్టాయి. → డిపాజిట్ల వృద్ధి 15.7% పెరిగి రూ.14,28,095 కోట్లుగా నమోదయ్యాయి. కరెంట్ ఖాతా, పొదుపు ఖాతా(కాసా) నిష్పత్తి 38.9% గా ఉంది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కొత్తగా 90 శాఖలు ప్రారంభించడంతో మొత్తం బ్రాంచుల సంఖ్య 6,613కు చేరింది. ఏటీఎంలు, క్యాష్ రీసైక్లింగ్ మెషీన్ల సంఖ్య 16,120 గా ఉంది.→ బ్యాంకు అనుబంధ సంస్థల్లో జీవిత బీమా విభాగం లాభం రూ.252 కోట్లు పెరిగింది. సాధారణ బీమా విభాగ లాభం 20% పెరిగి రూ.694 కోట్లకు చేరింది. ఆస్తుల నిర్వహణ విభాగం లాభం రూ.691 కోట్లకు చేరింది. -
5.9 శాతం పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇళ్ల ధరల పెరుగుదలలో భారత్ 14వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఇళ్ల ధరలు 5.9 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇళ్ల ధరల పెరుగుదల సూచీలో భారత్ 18 స్థానాలు ముందుకు వచి్చంది. నైట్ఫ్రాంక్కు చెందిన గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ 56 దేశాల్లో స్థానిక కరెన్సీలో ఇళ్ల ధరల చలనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. వార్షికంగా అత్యధికంగా తుర్కియేలో 89.2 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయి. ఆ తర్వాత క్రొయేíÙయాలో 13.7 శాతం, గ్రీస్లో 11.9 శాతం, కొలంబియాలో 11.2 శాతం, నార్త్ మెసడోనియాలో 11 శాతం చొప్పున పెరిగాయి. ‘‘అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంక్లు అధిక వడ్డీ రేట్లతో ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సగటున ఇళ్ల ధరల పెరుగుదల అంతర్జాతీయంగా 3.5 శాతంగా ఉంది. కరోనా ముందు పదేళ్ల వార్షిక సగటు పెరుగుదల 3.7 శాతానికి సమీపానికి చేరుకుంది’’అని నైట్ఫ్రాంక్ తన తాజా నివేదికలో వివరించింది. నైట్ఫ్రాంక్ పరిశీలనలోని 56 దేశాలకు గాను 35 దేశాల్లో ఇళ్ల ధరలు గడిచిన ఏడాది కాలంలో పెరగ్గా, 21 దేశాల్లో తగ్గాయి. చెప్పుకోతగ్గ వృద్ధి ‘‘గృహ రుణాలపై అధిక రేట్లు, ద్రవ్యోల్బణం ముప్పు ఉన్నప్పటికీ భారత నివాస మార్కెట్ చెప్పుకోతగ్గ వృద్ధిని సాధించింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి అంతిమంగా వినియోగదారుల ఆర్థిక భద్రతకు దారితీసింది. సొంతిల్లు కలిగి ఉండాలనే ఆకాంక్ష నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ను నడిపిస్తోంది’’అని నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. పట్టణీకరణ పెరుగుతుండడం, మౌలిక సదుపాయాల వృద్ధికి అదనపు తోడ్పాటును అందిస్తోందని, పట్టణాల్లో ప్రముఖ నివాస ప్రాంతాలకు ఇది అనుకూలమని నైట్ఫ్రాంక్ పేర్కొంది. కరోనా తర్వాత ఇళ్లకు డిమాండ్ పెరిగినట్టు హైదరాబాద్కు చెందిన రియల్టీ సంస్థ పౌలోమీ ఎస్టేట్స్ ఎండీ ప్రశాంత్రావు పేర్కొన్నారు. ‘‘ఇళ్ల ధరల పెరుగుదలకు కొన్ని అంశాలు దారితీశాయి. గతంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, మెరుగైన వసతికి మారిపోవాలన్న ఆకాంక్ష, ఆధునిక వసతులతో కూడిన చక్కని ఇళ్లపై ఖర్చు చేసే ఆసక్తి ధరల పెరుగుదలకు అనుకూలించాయి. దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ధరల పెరుగుదలలో ఇతర మార్కెట్లతో పోలిస్తే హైదరాబాద్ ముందుంది’’అని ప్రశాంత్ రావు తెలిపారు. -
హైదరాబాద్లో ఇళ్ల ధరలు 19 శాతం అప్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్లకు డిమాండ్ బలంగా కొనసాగుతోంది. ఇది ధరలకు మద్దతుగా నిలుస్తోంది. సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 19 శాతం పెరిగినట్టు క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంయుక్త నివేదిక వెల్లడించింది. సగటున చదరపు అడుగు ధర రూ.11,040కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం మేర పెరిగాయి. నివేదికలోని అంశాలు ► దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరల పెరుగుదల అత్యధికంగా (19 శాతం) హైదరాబాద్లోనే నమోదైంది. ఆ తర్వాత బెంగళూరులో ధరల పెరుగుదల 18 శాతంగా ఉంది. ►అహ్మదాబాద్లో చదరపు అడుగు ధర 9 శాతం పెరిగి రూ.6,613గా ఉంది. ►బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చిచూస్తే ఇళ్ల ధర చదరపు అడుగునకు 18 శాతం పెరిగి రూ.9,471గా ఉంది. ►చెన్నైలో 7 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.7,712కు చేరుకుంది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 12 శాతం పెరిగి చదరపు అడుగు రూ.8,655గా ఉంది. ►కోల్కతా మార్కెట్లో 12 శాతం పెరిగి రూ.7,406కు చేరగా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో చదరపు అడుగు ధర ఒక శాతం వృద్ధితో రూ.19,585కు చేరింది. ►పుణెలో 12 శాతం పెరిగి రూ.9,014గా ఉంది. సానుకూల సెంటిమెంట్ ‘‘2023లో ఇళ్ల కొనుగోలుదారుల్లో సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. హౌసింగ్ రిజి్రస్టేషన్లు పెరగడంతో, అది పరోక్షంగా ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది’’అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 10 శాతం పెరగడం పోటీతో కూడిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్ను ప్రతిఫలిస్తోందని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ పేర్కొన్నారు. -
ఫండ్స్ కొత్త పథకాల జోరు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో నూతన పథకాలు (ఎన్ఎఫ్వో) సెపె్టంబర్ త్రైమాసికంలో పెద్ద మొత్తంలో నిధుల సమీకరించాయి. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 48 ఎన్ఎఫ్వోలు మార్కెట్లోకి వచ్చాయి. ఇవన్నీ కలసి ఇన్వెస్టర్ల నుంచి రూ.22,049 కోట్ల నిధులను సమీకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 25 కొత్త పథకాలు రాగా, అవి వసూలు చేసిన మొత్తం రూ.5,539 కోట్లుగానే ఉంది. దీంతో పోలిస్తే సెపె్టంబర్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. సాధారణంగా మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు, బుల్లిష్ సెంటిమెంట్ను అనుకూలంగా భావించి ఎన్ఎఫ్వోలు ఎక్కువగా వస్తుంటాయి. -
టైటన్ లాభం అప్
న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ దిగ్గజం టైటన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 916 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 835 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 25 శాతం జంప్చేసి రూ. 10,708 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 8,567 కోట్ల అమ్మకాలు సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 11,402 కోట్లకు చేరాయి. ఇక మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం 37 శాతం ఎగసి రూ. 12,653 కోట్లయ్యింది. దీనిలో జ్యువెలరీ విభాగం ఆదాయం 39 శాతం జంప్చేసి రూ. 11,081 కోట్లను తాకగా.. వాచీలు తదితర బిజినెస్ 32 శాతం వృద్ధితో రూ. 1,092 కోట్లకు చేరింది. వెరసి వాచీలు, వేరబుల్స్ విభాగం తొలిసారి రూ. 1,000 కోట్ల టర్నోవర్ను అందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐకేర్ ఆదాయం 13 శాతం బలపడి రూ. 189 కోట్లయ్యింది. ఈ కాలంలో కొత్తగా 10 టైటన్ వరల్డ్ స్టోర్లతోపాటు, హీలియోస్ 5, ఫాస్ట్ట్రాక్ 5 చొప్పున స్టోర్లను ఏర్పాటు చేసింది. ఫలితాల నేపథ్యంలో టైటన్ షేరు బీఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 3,273 వద్ద ముగిసింది. -
మళ్లీ లాభాల్లో ఇండిగో.. క్యూ2లో రూ. 189 కోట్లు
న్యూఢిల్లీ: ఎయిర్లైన్స్ దిగ్గజం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో రూ. 189 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,583 కోట్ల నికర నష్టం ప్రకటించింది. సామర్థ్యం పెంపు, అధిక ట్రాఫిక్ ఇందుకు సహకరించాయి. వెరసి ఇండిగో బ్రాండు సరీ్వసుల కంపెనీ వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను ప్రకటించగలిగింది. అయితే ఈ కాలంలో విదేశీ మారక నష్టం రూ. 806 కోట్లను మినహాయించి లాభాలు ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం 21 శాతం జంప్చేసి రూ. 15,503 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 12,852 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ క్యూ2లో ప్రయాణికుల సంఖ్య 26.3 మిలియన్ల నుంచి 33.4 మిలియన్లకు ఎగసింది. సెపె్టంబర్కల్లా విమానాల సంఖ్య 334కు చేరగా.. రూ. 30,666 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు 1% బలపడి రూ. 2,509 వద్ద ముగిసింది. -
ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మెరుగైన పనితీరు
గురుగ్రామ్: సప్లయ్ చైన్, లాజిస్టిక్స్ సేవల్లోని ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. స్టాండలోన్ ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.912 కోట్లకు చేరింది. పన్ను అనంతరం లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 57 కోట్లతో పోలిస్తే 17 శాతం వరకు వృద్ధి చెంది రూ.67 కోట్లకు చేరింది. ఎబిట్డా మార్జిన్ 11.9 శాతంగా ఉంది. కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలతో కలిపి)గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెపె్టంబర్) ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 6 శాతం పెరిగి రూ.1963 కోట్లుగా నమోదైంది. లాభం 13 శాతం వరకు పెరిగి రూ.171 కోట్లుగా ఉంది. -
నిరాశపరిచిన షిప్పింగ్ కార్పొరేషన్
న్యూఢిల్లీ: షిప్పింగ్ కార్పొరేషన్ సెపె్టంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 42 శాతానికి పైగా క్షీణించి రూ.66 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.114 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,458 కోట్ల నుంచి రూ.1,662 కోట్లకు వృద్ధి చెందింది. వ్యయాలు రూ.1,331 కోట్ల నుంచి రూ.1,113 కోట్లకు క్షీణించాయి. ప్రతీ షేరుకు 40 పైసల చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. -
బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్.. ధరల తగ్గుముఖం, పండుగలతో ఊపు!
న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్ 2023 క్యాలెండర్ ఇయర్ మూడవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 10 శాతం పెరిగి 191.7 టన్నుల నుంచి 210.2 టన్నులకు ఎగసింది. పసిడి కొనుగోళ్లకు పవిత్రమైనదిగా భావించే ధన్తేరాస్ కొనుగోళ్లు భారీగా జరుగుతాయన్న విశ్వాసాన్ని పరిశ్రమ వ్యక్తం చేస్తోంది. ధరలు కొంత తగ్గడం, పండుగల డిమాండ్ దీనికి కారణం. చైనా తర్వాత పసిడి కొనుగోళ్లకు రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ సెప్టెంబర్ త్రైమాసికం డిమాండ్పై ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. వాణిజ్య వర్గాల అభిప్రాయం ప్రకారం, 10 గ్రాముల ధర రూ.60,000 వరకూ కొంత ఆమోదయోగ్యమైనదిగా వినియోగదారులు భావిస్తున్నారు. అంతకన్నా తక్కువ ధరలో పసిడి భారీ కొనుగోళ్లు జరగొచ్చని అంచనా. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 7 శాతం పెరిగి 146.2 టన్నుల నుంచి 155.7 టన్నులకు చేరింది. ఇదే కాలంలో కడ్డీలు, నాణేల డిమాండ్ 20 శాతం ఎగిసి 45.4 టన్నుల నుంచి 54.5 టన్నులకు ఎగసింది. కడ్డీలు, నాణేల విభాగంలో డిమాండ్ 2015 గరిష్ట స్థాయిని చూసింది. మూడవ త్రైమాసికంలో పసిడి దిగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 184.5 టన్నుల నుంచి 220 టన్నులకు ఎగసింది. తొమ్మిది నెలల్లో 481.2 టన్నుల డిమాండ్.. 2023 మొదటి 9 నెలల్లో బంగారం డిమాండ్ 481.2 టన్నులు. సంవత్సరం మొత్తంలో డిమాండ్ 700–750 టన్నులు ఉంటుందని అంచనా. 2022 డిమాండ్ 774 టన్నులతో పోల్చితే తగ్గడం గమనార్హం. అయితే దిగుమతులు మాత్రం పెరుగుతాయని అంచనా. 2022లో యల్లో మెటల్ దిగుమతులు 650.7 టన్నులు కాగా, 2023 సెప్టెంబర్ వరకూ జరిగిన దిగుమతుల విలువ 563 టన్నులు. అంతర్జాతీయంగా డిమాండ్ 6 శాతం డౌన్ ఇదిలాఉండగా, అంతర్జాతీయంగా మూడవ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 6 శాతం పడిపోయి 1,147.5 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల నుంచి తగ్గిన కొనుగోళ్లు, కడ్డీలు, నాణేల డిమాండ్ తగ్గడం దీనికి కారణమని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. చైనా డిమాండ్ మూడవ త్రైమాసికంలో 242.7 టన్నుల నుంచి స్వల్పంగా 247 టన్నులకు ఎగసింది. -
కోరమాండల్ లాభం రూ.755 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.20 శాతం ఎగసి రూ.757 కోట్లు నమోదు చేసింది. ఎబిటా రూ.1,059 కోట్లుగా ఉంది. టర్నోవర్ 31 శాతం క్షీణించి రూ.6,988 కోట్లకు వచ్చి చేరింది. ఫలితాల నేపథ్యంలో కోరమాండల్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 3.84 శాతం పడిపోయి రూ.1,073.85 వద్ద స్థిరపడింది. -
ఏషియన్ పెయింట్స్ మిశ్రమ పనితీరు
న్యూఢిల్లీ: ఏషియన్ పెంయింట్స్ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి మిశ్రమ పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.803 కోట్లతో పోల్చిచూసినప్పుడు 53 శాతం వృద్ధితో రూ.1,232 కోట్లకు దూసుకుపో యింది. ఆదాయం పెద్దగా మార్పు లేకుండా క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.8,430 కోట్ల నుంచి రూ.8,452 కోట్లకు వృద్ధి చెందింది. ప్రధానంగా ముడి సరుకుల ధరలు తగ్గడం, కార్యకలాపాల సామర్థ్యాలు మెరుగుపడడం లాభాలు పెరిగేందుకు దారితీసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో పోలి్చచూస్తే స్థూల మార్జిన్లు 7.7 శాతం మేర పెరిగాయి. మొత్తం వ్యయాలు 6 శాతం తగ్గి రూ.7,022 కోట్లుగా ఉన్నాయి. కోటింగ్స్, డెకరేటివ్, ఇండస్ట్రియల్ పెయింట్స్ ఆదాయంలో కేవలం ఒక శాతమే వృద్ధి నమోదైంది. నైరుతి రుతుపవనాల్లో అస్థిరతలు మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపించినట్టు ఏషియన్ పెయింట్స్ తెలిపింది. ఫలితంగా కొనుగోళ్లు వాయిదా పడినట్టు పేర్కొంది. దేశీయ డెకరేటివ్ వ్యాపారం విలువ పరంగా 6 శాతం వృద్ధిని చూపించింది. అంతర్జాతీయ కార్యకలాపాల ద్వారా దాయం 4 శాతం తగ్గి రూ.775 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 3 శాతానికి పైగా తగ్గి రూ.2,958 వద్ద స్థిరపడింది. -
ఎంబసీ రీట్స్కు రూ.889 కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ సెపె్టంబర్ క్వార్టర్కు 4 శాతం అధికంగా రూ.889 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.857 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.524 కోట్లను వాటాదారులకు పంపిణీ చేయాలని (ఒక్కో యూనిట్కు రూ.5.53 చొప్పున) ఎంబసీ రీట్ నిర్ణయించింది. రికార్డు స్థాయిలో 2 మిలియన్ చదరపు అడుగుల లీజును నమోదు చేసినట్టు ఎంబసీ రీట్ సీఈవో అరవింద్ మాయా తెలిపారు. ‘‘2023–24 మొదటి ఆరు నెలల్లో 3.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇచ్చాం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి పనితీరు పరంగా ఆశావహంగా ఉన్నాం’’అని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6 మిలియన్ చదరపు అడుగుల లీజ్ ఉంటుందన్న గత అంచనాలను, 6.5 మిలియన్ చదరపు అడుగులకు పెంచినట్టు తెలిపారు. -
టీసీఎస్లో తగ్గిపోయిన ఉద్యోగులు! కారణం ఇదే..
దేశంలో ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ (TCS) లో గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య (హెడ్కౌంట్) 6,333 పడిపోయింది. ఇది క్రితం సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 7,186 తగ్గింది. ప్రస్తుతం టీసీఎస్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985. ఫ్రెషర్లపై దృష్టి దీనిపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ కంపెనీ కొత్త టాలెంట్పై ఎక్కువగా ఖర్చు పెడుతోందని, దానికి తగిన ఫలితం లభిస్తోందని చెప్పారు. ‘కంపెనీలో అట్రిషన్ తగ్గుతున్నట్లు చూశాం. మా నియామకాల్లో కీలక మార్పులు చేస్తున్నాం. ఫలితంగా మా మొత్తం నియామకం ఈ త్రైమాసికంలో అట్రిషన్ కంటే తక్కువగా ఉంది. దీని అర్థం మానవ వనరుల కోసం ఖర్చు పెడుతున్నాం. కొంచెం ఆలస్యమైనా మా అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తూ ఫ్రెషర్ల ఆన్బోర్డ్ను కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు. కాగా జూన్ త్రైమాసికంలో ఐటీ అట్రిషన్ 17.8 శాతం నుంచి 14.9 శాతానికి తగ్గింది. (గూగుల్, యాపిల్పై సీసీఐ విచారణ.. నివేదిక రాగానే చర్యలు!) టీసీఎస్ తన వర్క్ఫోర్స్లో 70 శాతం మందికి 100 శాతం వేరియబుల్ పే అందిస్తోంది. మిగిలినవారికి మాత్రం పనితీరు ఆధారంగా చెల్లిస్తోంది. ఆఫీస్ పాలసీ గురించి.. “మేము గత మూడు సంవత్సరాలలో చాలా మందిని నియమించుకున్నాం. వారంతా చాలా కాలం పాటు హైబ్రిడ్ లేదా వర్చువల్ రిమోట్ (మోడ్)లో పని చేస్తున్నారు. కొత్త వర్క్ఫోర్స్ కంపెనీలో ఇప్పటికే ఉన్న విస్తృత వర్క్ఫోర్స్తో ఏకీకృతం కావడానికి వారంతా ఆఫీస్కు రావాలని గట్టిగా నమ్ముతున్నాం. కొత్తవారు టీసీఎస్ విలువలను అర్థం చేసుకుని నేర్చుకోవడానికి ఇది ఏకైక మార్గం” అని మిలింద్ లక్కడ్ చెప్పారు. దాదాపు 70 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికే కార్యాలయాలకు రావడం ప్రారంభించారన్నారు. -
బ్యాంకు రుణాల్లో 17% వృద్ధి
ముంబై: బ్యాంకు రుణాలు సెప్టెంబర్ త్రైమాసికంలో 17.2 శాతం వృద్ధిని చూశాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 7 శాతంతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరగడం ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడడాన్ని తెలియజేస్తోందని ఆర్బీఐ ప్రకటించింది. ‘‘రుణాల్లో వృద్ధి అన్ని విభాగాల్లోనూ ఉంది. అన్ని రకాల జనాభా వర్గాల్లో, బ్యాంకుల్లో రెండంకెల వార్షిక వృద్ధి నమోదైంది’’అని తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు సంబంధించి త్రైమాసికం వారీ డిపాజిట్లు, రుణ గణాంకాలను ఆర్బీఐ సోమవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) బ్యాంకుల రుణాల్లో వృద్ధి 14.2 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావించింది. క్రితం త్రైమాసికంతో పోల్చి చూసినా, అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినా రుణాల్లో మంచి వృద్ధి కనిపిస్తోంది. దండిగా డిపాజిట్లు.. ఇక బ్యాంకుల డిపాజిట్లు సెప్టెంబర్ త్రైమాసికంలో 9.2 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి బ్యాంకుల డిపాజిట్లు సగటున 9.5–10.2 శాతం మధ్య వృద్ధి చెందుతున్నాయి. విదేశీ బ్యాంకులు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు రంగ బ్యాంకులే అధిక డిపాజిట్లను ఆకర్షిస్తున్నాయి. టర్మ్ డిపాజిట్లలో 10.2 శాతం వృద్ధి కనిపించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో టర్మ్ డిపాజిట్లు 6.4 శాతమే పెరగడం గమనించాలి. ఇక కరెంట్ డిపాజిట్లు 8.8 శాతం, సేవింగ్స్ డిపాజిట్లు 9.4 శాతం వృద్ధి చెందాయి. ఏడాది క్రితం ఇవి 17.5 శాతం, 14.5 శాతం చొప్పున వృద్ధిని చూశాయి. మొత్తం డిపాజిట్లలో సేవింగ్స్ డిపాజిట్లు 2019 జూన్ నాటికి 32.4 శాతంగా ఉంటే, 2022 జూన్ నాటికి 35.2 శానికి పెరిగాయి. తదుపరి సెప్టెంబర్ త్రైమాసికంలో 34.7 శాతానికి పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా క్రెడిట్–డిపాజిట్ రేషియో 74.8 శాతానికి మెరుగుపడింది. రుణ వృద్ధి పటిష్టం 2022–23పై ఫిచ్ అంచనా భారత్ బ్యాంకింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 11.5 శాతం పటిష్ట రుణ వృద్ధితీరును నమోదుచేస్తుందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ అంచనావేసింది. రుణ వృద్ధికి అధిక వడ్డీరేట్లు అడ్డంకి కాబోవని కూడా స్పష్టం చేసింది. భారీ రుణ వృద్ధి వల్ల నికర ఆదాయాలు ప్రత్యేకించి నికర వడ్డీ మార్జిన్లు పటిష్టంగా ఉంటాయని వివరించింది. ‘‘2021–22లో బ్యాంక్ రుణ వృద్ధి 11.5 శాతం. 2022–23లో ఈ రేటు 13 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. కోవిడ్ తదనంతరం సానుకూల పరిస్థితులు, చక్కటి జీడీపీ వృద్ధి రేటు వంటి అంశాలు రిటైల్, వర్కింగ్ క్యాపిటల్ రుణాలకు డిమాండ్ పెంచుతుందని భావిస్తున్నాం’’ అని ఈ ఒక ప్రకటనలో వివరించింది. 2022–23లో దేశ జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందని ఫిచ్ అంచనా. కాగా, బ్యాంకింగ్ డిపాజిట్లు 2022–23లో 11 శాతం పెరుగుతాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంల్లో రుణ వృద్ధి కొంత మందగిచ్చవచ్చని ఫిచ్ అంచనా వేస్తోంది. ‘‘డిపాజిట్ రేట్లు పెరగడం బ్యాంకుల వడ్డీ మార్జిన్లపై ప్రభావితం చూపవచ్చు. అయితే నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం బ్యాంకులకు ఇక్కడ కలిసి వచ్చే అంశం. ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఉంటుంది’’ అని ఫిచ్ విశ్లేషించింది. -
మూడేళ్ల కనిష్టానికి దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్ ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 10 శాతం క్షీణించింది. అమ్మకాలు మూడేళ్ల కనిష్టం 4.3 కోట్ల స్థాయికి పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) సోమవారం ఈ అంశాలు వెల్లడించింది. 2019 తర్వాత ఒక మూడో త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి నమోదు కావడం ఇదే ప్రథమం అని తెలిపింది. బలహీనపడుతున్న డిమాండ్, పెరుగుతున్న ధరలు వెరసి పండుగ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. నిల్వలు పేరుకుపోవడం, పండుగ సీజన్ తర్వాత డిమాండ్ తగ్గుముఖం పట్టడం తదితర అంశాలతో డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు నెమ్మదించవచ్చని ఐడీసీ డివైజ్ రీసెర్చ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవ్కేందర్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో 2022 వార్షిక అమ్మకాలు 8–9 శాతం క్షీణించి 15 కోట్ల యూనిట్లకు పరిమితం కావచ్చని పేర్కొన్నారు. పెరుగుతున్న డివైజ్ల ధరలు, ఇతరత్రా ద్రవ్యోల్బణం, ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్ఫోన్కు మారడం నెమ్మదించడం తదితర అంశాలు 2023లో డిమాండ్కి ప్రధాన సవాళ్లుగా ఉండవచ్చని తెలిపారు. అయితే, 4జీ నుండి 5జీకి మారుతుండటం మిడ్–ప్రీమియం, అంతకు మించిన సెగ్మెంట్లలో వృద్ధికి కొంత దోహదపడవచ్చని సింగ్ వివరించారు. నివేదికలో మరిన్ని వివరాలు.. ► సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాల్లో ఆన్లైన్ పోర్టల్స్ వాటా అత్యధికంగా 58 శాతంగా నమోదైంది. ఈ–టెయిలర్లు పలు విడతలుగా నిర్వహించిన ’సేల్స్’ (ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్లో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ మొదలైనవి) ఇందుకు దోహదపడ్డాయి. ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ డీల్స్, ఆఫర్లు, డిస్కౌంట్లు ఇందుకు సహాయపడ్డాయి. ఆన్లైన్తో పోటీపడుతూ డిమాండ్ను అందుకోవడంలో ఆఫ్లైన్ స్టోర్స్ విఫలమయ్యాయి. దీంతో ఆఫ్లైన్ విక్రయాలు 20 శాతం క్షీణించాయి. ► మీడియాటెక్ ఆధారిత స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా 47 శాతానికి పెరిగింది. క్వాల్కామ్ వాటా 25 శాతానికి తగ్గింది. ► 21.2 శాతం వాటాతో స్మార్ట్ఫోన్ మార్కెట్కు షావోమీ సారథ్యం వహించింది. 18.5% మార్కె ట్ వాటాతో శాంసంగ్ రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. వివో (14.6%), రియల్మి (14.2%), ఒప్పో (12.5%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రీమియం కేటగిరీలో 63 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానంలో నిల్చింది. షావోమీ టాప్ ప్లేస్లోనే ఉన్నప్పటికీ అమ్మకాలు 18 శాతం క్షీణించాయి. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 5జీ ఫోన్ల వాటా 36 శాతానికి చేరింది. 1.6 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. -
హైదరాబాద్ రియల్టీలో 6% పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. చదరపు అడుగు ధర సగటున 6 శాతం పెరిగి రూ.4,977కు చేరినట్టు తెలిపింది. ఇక కార్యాయల అద్దెలను చూస్తే హైదరాబాద్ మార్కెట్లో సగటు నెలవారీ అద్దె 7 శాతం పెరిగి చదరపు అడుగుకు 65కు చేరింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో 3–10 శాతం మధ్య పెరిగాయి. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ’ఇండియా రియల్ ఎస్టేట్ – ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్’ నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి ఇందులో గణాంకాలను పొందుపరిచింది. పట్టణాల వారీగా.. ►బెంగళూరు మార్కెట్లో ఇళ్ల ధరలతోపాటు, కార్యాలయ అద్దెల పరంగా మంచి వృద్ధి నమోదైంది. ఇళ్ల ధర చదరపు అడుగుకు 10 శాతం పెరిగి రూ.5,428కి చేరింది. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగి చదరపు అడుగునకు రూ.81కి చేరింది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 8 శాతం పెరిగింది. చదరపు అడుగు ధర రూ.4,489గా ఉంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడునకు (నెలకు) 81.90గా ఉంది. ►ముంబై మార్కెట్లో ఇళ్ల ధర చదరపు అడుగుకు 6 శాతం పెరిగి రూ.7,170గా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు 4 శాతం పెరిగి రూ.110కి చేరుకుంది. ►పుణె మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,250గా ఉంది. ఇదే పట్టణంలో కార్యాలయ అద్దె నెలకు చదరపు అడుగునకు 9 శాతం పెరిగి రూ.71గా నమోదైంది. ►చెన్నై మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,300కు చేరింది. చెన్నైలో కార్యాలయ అద్దె 5 శాతం పెరిగి 61కి చేరింది. ►కోల్కతా పట్టణంలో ఇళ్ల ధర సగటున 4 శాతం పెరిగి.. చదరపు అడుగునకు రూ.3,350కు చేరుకుంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడుగుకు 34.7వద్దే ఉంది. ►అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల ధర 3 శాతం పెరిగి రూ.2,885గా ఉంటే, కార్యాలయ అద్దె చదరపు అడుగుకు ఏ మాత్రం మార్పు లేకుండా రూ.40.1 వద్ద ఉంది. ►ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో కార్యాలయ స్థలాలకు డిమాండ్ నెలకొంది. ►కార్యాలయ స్థలం సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 29 శాతం పెరిగి 16.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
పేటీఎమ్: 2023 సెప్టెంబర్కల్లా లాభాల్లోకి
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ 2023 సెప్టెంబర్ త్రైమాసికానికల్లా లాభాల్లోకి ప్రవేశించగలదని కంపెనీ ఎండీ, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. గతంలో ప్రకటించినట్లే వచ్చే సెప్టెంబర్కల్లా కంపెనీ నిర్వహణా లాభాలు ఆర్జించగలదని 22వ వార్షిక సమావేశం సందర్భంగా వాటాదారులకు తెలియజేశారు. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ చెల్లింపులను నిర్వహిస్తున్న కంపెనీ షేరు ధరను ప్రభావితం చేయబోమని, అయితే కంపెనీ లాభదాయకంగా మారేందుకు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. 2018–19 వరకూ కంపెనీ విస్తరణలో ఉన్నదని, 2019–20లో మానిటైజేషన్ బాట పట్టిందని తెలియజేశారు. షేరు ధరను తాము ప్రభావితం చేయబోమని, పలు అంశాలు ఇందుకు కారణమవుతుంటాయని వివరించారు. రూ. 2,150 ధరలో ఐపీవో చేపట్టగా వారాంతాన షేరు రూ. 771 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా.. ఎండీ, సీఈవోగా మరో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించేందుకు విజయ్ శేఖర్ శర్మను వాటాదారులు ఎంపిక చేసినట్లు కంపెనీ దాఖలు చేసిన స్క్రూటినైజర్ నివేదిక వెల్లడించింది. శర్మకు అనుకూలంగా 99.67 శాతం మంది వాటాదారులు ఓటు చేసినట్లు నివేదిక పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల సలహాదారు సంస్థ(ఐఐఏఎస్) శర్మ పునర్నియామకానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. -
తొమ్మిది కీలక రంగాల్లో ఉద్యోగులు 3.10 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ తొమ్మిది కీలక రంగాల్లో 2021–22 సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.10 కోట్లకు చేరిందని కార్మిక శాఖ త్రైమాసిక సర్వే గణాంకాలు వెల్లడించాయి. త్రైమాసికంగా చూస్తే, (ఏప్రిల్–జూన్) ఈ సంఖ్య రెండు లక్షలు పెరిగిందని పేర్కొంది. ఏప్రిల్–జూన్ మధ్య ఈ ఉద్యోగుల సంఖ్య 3.08 కోట్లు. 2013–14లో తొమ్మిది రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 2.37 కోట్లు. ఆర్థిక రికవరీకి తాజా గణాంకాలు సంకేతమని వివరించింది. గణాంకాల్లోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2021 ఏప్రిల్లో మొదలైన కోవిడ్–19 సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రాలు విధించిన పరిమితులను ఎత్తివేసిన తర్వాత అధిక ఉపాధి సంఖ్య నమోదయ్యింది. ఇది ఆర్థిక కార్యకలాపాలలో మెరుగుదలను ప్రతిబింబిస్తోంది. ► 10 మంది లేదా అంతకుమించి ఉద్యోగులు ఉన్న సంస్థలను మాత్రమే సర్వేలో పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సర్వేకు మొత్తం 12,038 సంస్థలను ఎంపికచేయగా, వాటిలో 11,503 సంస్థలను స్వయంగా ఫీల్డ్ ఆఫీసర్లు సందర్శించారు. ► ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 32.1 శాతంకాగా, ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇది 29.3 శాతంగా ఉంది. ► సర్వే రంగాల్లో ఉద్యోగుల శాతాన్ని పరిశీలిస్తే తయారీ రంగం వాటా 30 శాతంగా ఉంది. విద్య రంగానికి 20 శాతంకాగా, ఆరోగ్యం, అలాగే ఐటీ–బీపీఓ రంగాల వాటా 10 శాతం చొప్పున ఉన్నాయి. వాణిజ్య, రవాణా రంగాల వాటా వరుసగా 5.3 శాతం, 4.6 శాతంగా ఉన్నాయి. ► మొత్తం సర్వేలోని సంస్థల్లో 90 శాతం 100 మంది కన్నా తక్కువ పనిచేస్తున్నారు. ఐటీ–బీపీఓ సంస్థల్లో 30 శాతం కనీసం 100 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, 12 శాతం సంస్థల్లో 500 ఆపైన ఉద్యోగులు ఉన్నారు. ఆరోగ్య రంగంలో 19 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రవాణా రంగం విషయంలో 14 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ► మొత్తం ఉద్యోగుల్లో రెగ్యులర్ వర్కర్లు దాదాపు 87 శాతం మంది ఉన్నారు. క్యాజువల్ వర్కర్ల శాతం 2 శాతంగా ఉంది. నిర్మాణ రంగంలో 20 శాతం మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఉండగా, 6.4 శాతం మంది క్యాజువల్ వర్కర్లు ఉన్నారు. ► సంస్థల్లో 53.9% గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్, 2017 కింద కార్యకాలాపాలు నిర్వహిస్తున్నాయి. 27.8 శాతం షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1958 పనిచేస్తున్నాయి. ► విద్య, ఆరోగ్య రంగాలను మినహాయిస్తే, మిగిలిన ఏడు రంగాల్లో ఉద్యోగుల విద్యార్హతలను సర్వే పరిశీలిసింది. వీటిల్లో 28.4 శాతం మంది ఇంటర్మీడియట్, 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదివారు. 37 శాతం మంది గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేశారు. ఐటీ–బీపీఓ రంగాల్లో గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేసిన వారి సంఖ్య అత్యధికంగా 91.6 శాతం ఉంటే, ఫైనాన్షియల్ సేవల విభాగంలో ఇది 59.8 శాతంగా ఉంది. ఆరోగ్య రంగంలో ఇంటర్మీడియట్, 10వ తరగతి ఆలోపు చదివినవారి సంఖ్య 18 శాతం. విద్యా రంగంలో ఈ తరహా విద్యార్హత నాన్ టిచింగ్ స్టాఫ్లో 26.4 శాతం మంది ఉన్నారు. ఈ రెండు రంగాల్లో (ఆరోగ్యం, విద్య) కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారి సంఖ్య 40 శాతంగా ఉంది. ► 16.8 శాతం సంస్థలు తమ స్వంత ఉద్యోగుల కోసం అధికారిక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ను అందిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన అ ం శా ల్లో ఇది ఒకటని కార్మికశాఖ ప్రకటన తెలిపింది. తొమ్మిది రంగాలు ఇవి... సర్వే జరిపిన తొమ్మిది కీలక రంగాల్లో తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం, ఐటీ–బీపీఓ, ఫైనాన్షియల్ సేవలు ఉన్నాయి. వ్యవసాయేతర సంస్థలకు సంబంధించి మెజారిటీ ఉపాధి కల్పనా అవకాశాలను ఈ రంగాలు అందిస్తున్నాయి. -
ఈక్విటీ ఫండ్స్లోకి భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో నికరంగా రూ.39,927 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతక్రితం జూన్ త్రైమాసికంలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.19,508 కోట్లుగానే ఉన్నాయి. నూతన పథకాల ఆవిష్కరణ (ఎన్ఎఫ్వోలు), సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు స్థిరంగా ఉండడం ఇందుకు మేలు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే.. సెప్టెంబర్ ఆఖరుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.12.8 లక్షల కోట్లుగా ఉంది. జూన్ చివరికి ఈ మొత్తం రూ.11.1 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లగా.. ఈ ఏడాది మార్చి నుంచి నికరంగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈక్విటీ పథకాల్లోకి వచ్చే నికర పెట్టుబడుల్లో 50 శాతం ఎన్ఎఫ్వోల నుంచే ఉంటున్నట్టు పరిశ్రమకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీల్లో ఫ్లెక్సీక్యాప్ విభాగం అత్యధికంగా రూ.18,258 కోట్లను ఆకర్షించగా.. సెక్టోరల్ ఫండ్స్ రూ.10,232 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.4,197 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.3,716 కోట్లు, మిడ్క్యాప్ ఫండ్స్ రూ.3,000 కోట్ల చొప్పున సెప్టెంబర్ క్వార్టర్లో నికరంగా పెట్టుబడులు ఆకర్షించాయని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ డేటా పేర్కొంది. -
57 శాతం తగ్గిన ఇండియా సిమెంట్స్ లాభం
న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్ నికర లాభం సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 57 శాతం క్షీణించి రూ.32.53 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.69 కోట్లుగా ఉంది. రుతుపవనాలు ఎక్కువ కాలం పాటు కొనసాగడం, కొన్ని ప్రాంతాల్లో వరదలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు లాభాలపై ప్రభావం చూపించాయి. ఆదాయం 13 శాతం పెరిగి రూ.1,235 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,090 కోట్లుగా ఉండడం గమనార్హం. సెప్టెంబర్ క్వార్టర్లో ఉత్పత్తి 8 శాతం పెరిగినట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే కీలక మార్కెట్లలో ఎక్కువ కాలం పాటు వర్షాలు ఉండడం, వరదలు రావడం, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా రెండో విడత ప్రభావం కొనసాగడం వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో సంతృప్తికరమైన పనితీరునే చూపించాం’’ అని ఇండియా సిమెంట్స్ పేర్కొంది. ఇంధనాలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ఒత్తిళ్లు కూడా ఎదుర్కొన్నట్టు తెలిపింది. అయినప్పటికీ విక్రయాలు పెంచుకోవడం ద్వారా మంచి పనితీరునే చూపించినట్టు పేర్కొంది. వ్యయాలు 22 శాతానికి పైగా పెరిగి రూ.1,201 కోట్లుగా ఉన్నాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు 6 శాతం వరకు నష్టపోయి రూ.210 వద్ద ముగిసింది. -
జొమాటోకు రెట్టింపు నష్టం
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోకు సెప్టెంబర్ క్వార్టర్లో నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. రూ.435 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.230 కోట్లుగానే ఉన్నాయి. ఆదాయం రూ.426 కోట్ల నుంచి రూ.1,024 కోట్లకు పెరిగింది. తన నిర్వహణలోని ఫిస్టో కంపెనీని క్యూర్ఫిట్కు 50 మిలియన్ డాలర్లకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. అలాగే మరో 50 మిలియన్ డాలర్లను క్యూర్ఫిట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా (మొత్తం 100 మిలియన్ డాలర్లు) 6.4 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. బిగ్ఫూట్ రిటైల్ సొ ల్యూషన్స్ (షిప్రాకెట్)లో 75 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్కు ఒప్పందం చేసుకుంది. మ్యాజిక్పిన్ రూ. 446 కోట్ల సమీకరణ రిటైల్ సంస్థల ఆఫర్ల వివరాలను వినియోగదారులకు అందించే డిజిటల్ సంస్థ మ్యాజిక్పిన్ కొత్తగా 60 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 446 కోట్లు) సమీకరించింది. ఫుడ్ సర్వీసుల సంస్థ జొమాటోతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లు లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ కూడా ఈ విడత ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ తెలిపింది. -
యూనియన్ బ్యాంకు.. భేష్
ముంబై: ప్రభుత్వరంగంలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా సెప్టెంబర్ క్వార్టర్కు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ లాభం 183 శాతం పెరిగి రూ.1,510 కోట్లుగా నమోదైంది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాకు సంబంధించి గతంలో మాఫీ చేసిన రుణం రికవరీ కావడం మెరుగైన ఫలితాలకు దోహదపడింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.534 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ.6,829 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 2.78 శాతం నుంచి 2.95 శాతానికి పుంజుకుంది. రుణాల్లో 3 శాతం వృద్ధిని సాధించింది. వడ్డీయేతర ఆదాయం 65 శాతం పెరిగి రూ.3,978 కోట్లుగా నమోదైంది. ఇందులో మాఫీ చేసిన రుణం తాలూ కు వసూలైన రూ.1,764 కోట్లు కూడా ఉంది. 8 శాతం రుణ వృద్ధి లక్ష్యం మొత్తం మీద సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.5,341 కోట్ల మేర రుణాల రికవరీని సాధించినట్టు యూనియన్ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్కిరణ్ రాయ్ ఫలితాల సందర్భంగా ప్రకటించారు. రిటైల్, వ్యవసాయ రుణాల్లో మంచి వృద్ధి కనిపిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రుణాల్లో 8 శాతం వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. స్థూల ఎన్పీఏలు (వసూలు కాని రుణాలు) ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 14.71 శాతం నుంచి 12.64 శాతానికి తగ్గాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.6,745 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ఇందులో రూ. 2,600 కోట్లు శ్రేయీ గ్రూపు కంపెనీలవే ఉన్నాయి. ఈ ఖాతాలకు ఇప్పటికే 65 శాతం కేటాయింపులు చేసినట్టు రాజ్కిరణ్ రాయ్ తెలిపారు. ఎన్పీఏలకు కేటాయింపులు రూ.3,273 కోట్లకు తగ్గాయి. -
వచ్చే త్రైమాసికాల్లో పటిష్ట వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ రానున్న త్రైమాసికాల్లో పటిష్ట వృద్ధి రేటును నమోదుచేసుకుంటుదన్న విశ్వాసాన్ని ఇండస్ట్రీ చాంబర్– పీహెచ్డీసీసీఐ ప్రెసిడెంట్ ప్రదీప్ ముల్తానీ వ్యక్తం చేశారు. పీహెచ్డీసీసీఐ ట్రాక్ చేసే 12 ప్రధాన ఆర్థిక, వాణిజ్య ఇంటికేటర్లలో తొమ్మిది 2021 సెప్టెంబర్లో (2020 సెప్టెంబర్తో పోల్చితే) మంచి పురోగతిలో ఉన్నాయని, 2021 ఆగస్టులో పోల్చితే 2021 సెప్టెంబర్లో ఆరు రంగాలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని ముల్తానీ పేర్కొన్నారు. జీఎస్టీ వసూళ్లు, స్టాక్ మార్కెట్, యూపీఐ లావాదేవీలు, ఎగుమతులు, మారకపు విలువ, విదేశీ మారకద్రవ్య నిల్వలు, రిటైల్– టోకు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, వంటి అంశాలు 2021 ఆగస్టులో పోల్చితే 2021 సెప్టెంబర్లో ఎంతో పురోగతి సాధించినట్లు తెలిపారు. ప్రత్యేకించి నిరుద్యోగ సమస్య ఆగస్టులో 8.3 శాతం ఉంటే, సెప్టెంబర్లో 6.9 శాతానికి తగ్గినట్లు తెలిపారు. సవాళ్లు ఉన్నాయ్.. కాగా, సానుకూల అంశాలతోపాటు ప్రస్తుతం ఉన్న సమస్యల్లో కమోడిటీ ధరల తీవ్రత ఒకటికాగా, మరొకటి ముడి పదార్థాల కొరతని తెలిపారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా దేశంలో వినియోగం, ప్రైవేటు పెట్టుబడులకు మద్దతు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గృహ వినియోగం మరింత పటిష్టం కావాల్సి ఉందని అన్నారు. దీనివల్ల డిమాండ్, పారిశ్రామిక ఉత్పత్తి మెరుగుపడతాయని తెలిపారు. ఆగస్టు 31వ తేదీన విడుదలైన గణాంకాల ప్రకారం, 2021–22 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. -
బీపీసీఎల్ మెరుగైన పనితీరు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నికర లాభం సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 24 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,589 కోట్ల నుంచి రూ.3,201 కోట్లకు చేరుకుంది. ఆదాయం సైతం 54 శాతం వృద్ధి చెంది రూ.1.02 లక్షల కోట్లుగా నమోదైంది. గత కొంత కాలంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మెరుగైన పనితీరుకు తోడ్పడింది. చమురు కంపెనీలు ముడి చమురును కొనుగోలు చేసి, శుద్ధి చేసిన అనంతరం వివిధ ఉత్పత్తులుగా విక్రయిస్తుంటాయి. కొనుగోలు చేసి, విక్రయించే నాటికి ధరలు పెరగడం కలిసొస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతీ బ్యారెల్ ముడిచమురు శుద్ధిపై 5.11 డాలర్లను ఆర్జించినట్టు బీపీసీఎల్ తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఒక్కో బ్యారెల్ శుద్ధిపై మార్జిన్ 3.19 డాలర్లుగానే ఉండడం గమనార్హం. సెప్టెంబర్ త్రైమాసికంలో 9.91 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను సంస్థ విక్రయించింది. వ్యాపారాలు కుదురుకోవడం, చమురు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో మంచి వృద్ధిని చూసినట్టు కంపెనీ సీఎఫ్వో వీఆర్కే గుప్తా తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం రిఫైనరీ మార్జిన్ల విస్తరణకు సాయపడినట్టు చెప్పారు. ఈక్విటీ మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో షేరు ఒక శాతం నష్టంతో రూ.418 వద్ద ముగిసింది. -
ఫ్రెషర్లకు గుడ్న్యూస్ ! ఈ కార్పోరేట్ కంపెనీలో 45,000 ఉద్యోగాలు.. ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ, అమెరికా కేంద్రంగా పనిచేసే కాగ్నిజంట్ సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో మెరుగైన పనితీరు చూపించింది. సంస్థ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 56 శాతం పెరిగి 544 మిలియన్ డాలర్లు (రూ.4,080 కోట్లు)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2020 సెప్టెంబర్ త్రైమాసికం) నికర లాభం 348 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం 4.2 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. రూ.4.69–4.74 బిలియన్ డాలర్ల మధ్య ఆదాయం ఉండొచ్చన్న గత అంచనాలకు అనుగుణంగానే సంస్థ పనితీరు ఉంది. ఫ్రెషర్లకు గుడ్న్యూస్: అక్టోబర్–డిసెంబర్ కాలంలో భారత్లో కొత్తగా 45,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు కాగ్నిజంట్ ప్రకటించింది. నిపుణులకు డిమాండ్– సరఫరా మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. వార్షికంగా చూస్తే స్వచ్చంద అట్రిషన్ (ఉద్యోగి స్వయంగా సంస్థను వీడడం) రేటు 33 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ఈ సంస్థ జనవరి–డిసెంబర్ను వార్షిక సంవత్సరంగా పరిగణిస్తుంటుంది. భారత్లో కాగ్నిజంట్కు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో డిజిటల్ విభాగం ఆదాయం 18 శాతం వృద్ధిని చూపించినట్టు సీఈవో హంఫైర్స్ తెలిపారు. క్యూ4లో 4.75 డాలర్ల స్థాయిలో.. నాలుగో త్రైమాసికంలో (2021 అక్టోబర్–డిసెంబర్) ఆదాయం 4.75–4.79 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చన్న అంచనాను కాగ్నిజంట్ ఫలితాల సందర్భంగా వ్యక్తం చేసింది. ఇది వార్షికంగా చూస్తే 13.5–14.5 శాతం వృద్ధికి సమానమని వివరించింది. 2021 పూర్తి సంవత్సరానికి ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెంది 18.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ప్రకటించింది. సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,01,300 నుంచి 3,18,400కు పెరిగింది. -
బంగారం డిమాండ్ పదిలం!
ముంబై: బంగారం డిమాండ్ మళ్లీ పుంజుకుంటోంది. 2021 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే పసిడి డిమాండ్ 47 శాతం పెరిగింది. పరిమాణంలో 139.1 టన్నులుగా నమోదయ్యింది. మహమ్మారి సవాళ్ల తగ్గి, ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారానికి తిరిగి వినియోగ డిమాండ్ ఏర్పడుతున్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. డబ్ల్యూజీసీ ఆవిష్కరించిన క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2021 నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2020 సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం డిమాండ్ 94.6 టన్నులు. అప్పటితో పోల్చితే 47 శాతం పెరిగి 139.1 టన్నులకు చేరింది. విలువ పరంగా, భారతదేశం మూడవ త్రైమాసిక బంగారం డిమాండ్ 37 శాతం పెరిగి రూ. 59,330 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం రూ.43,160 కోట్లు. ► ఇది తక్కువ బేస్ ఎఫెక్ట్ అలాగే సానుకూల వాణిజ్యం, వినియోగదారుల మనోభావాల మేళవింపును ఇది ప్రతిబింబిస్తుంది. వ్యాక్సినేషన్ విస్తృతి, ఆర్థిక కార్యకలాపాల్లో బలమైన పురోగతి బంగారం కొనుగోళ్లు భారీగా పెరగడానికి కారణం. ► దేశవ్యాప్తంగా ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్నందున, రిటైల్ డిమాండ్ కోవిడ్–పూర్వ స్థాయికి పుంజుకుంది. రాబోయే పండుగలు, వివాహాల సీజన్తో బంగారం డిమాండ్ మరింత పెరిగే వీలుంది. బంగారానికి ఇంతటి డిమాండ్ నెలకొనడం కోవిడ్ మహమ్మారి సవాళ్లు విసరడం ప్రారంభించిన తర్వాత ఇదే మొదటిసారి. ► డిజిటల్ బంగారానికి డిమాండ్ పలు రెట్లు పెరిగింది. వినూత్న సాంకేతిక చొరవలు, ప్రముఖ ఆభరణాల యూపీఐ ప్లాట్ఫారమ్ల వంటి అంశాలు ఆన్లైన్ కొనుగోళ్లను ఇష్టపడే కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల సంఖ్యను పెంచడానికి గణనీయంగా దోహదపడుతుండడం గమనార్హం. ► రాబోయే నెలల్లో కమోడిటీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రావాణా వ్యయాలు భారం పెరుగుతుంది. ఆయా అంశాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయవచ్చు. ఇది దీర్ఘకాలంలో బంగారం డిమాండ్ మరింత పటిష్టం కావడానికి కలిసివచ్చే అంశం. ► సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం ఆభరణాల డిమాండ్ 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరుకుంది. 2020 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ పరిమాణం 60.8 టన్నులు. విలువలో ఆభరణాల డిమాండ్ 48 శాతం పెరిగి రూ.41,030 కోట్లకు చేరింది, ఇది ఏడాది క్రితం రూ.27,750 కోట్లు. ► మూడవ త్రైమాసికంలో మొత్తం పెట్టుబడి డిమాండ్ 27 శాతం పెరిగి 42.9 టన్నులకు చేరుకుంది. 2020 అదే త్రైమాసికంలో ఈ డిమాండ్ 33.8 టన్నులు. విలువ పరంగా, జూలై–సెప్టెంబర్లో బంగారం ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 19 శాతం పెరిగి రూ.18,300 కోట్లకు చేరుకుంది.ఇది ఏడాది క్రితం రూ.15,410 కోట్లు. ► సమీక్షా కాలంలో భారతదేశంలో రీసైకిల్ చేసిన మొత్తం బంగారం 50 శాతం క్షీణించి 20.7 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 41.5 టన్నులు. బంగారం రీసైక్లింగ్లో 50 శాతం తగ్గుదలను పరిశీలిస్తే, బంగారాన్ని విక్రయించడం కంటే బంగారాన్ని కలిగి ఉండాలనే బలమైన వినియోగదారు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ► బలమైన సంస్థాగత మార్కెట్ల దన్నుతో బంగారంపై రుణాల మార్కెట్ కూడా భారీగా పెరుగుతుండడం గమనార్హం. ► పన్నులు లేకుండా మొత్తం నికర బులియన్ దిగుమతులు మూడవ త్రైమాసికంలో 187 శాతం పెరిగి 255.6 టన్నులకు చేరింది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ పరిమాణం 89 టన్నులు. ► మూడో త్రైమాసికంలో బంగారం ధర సగటున 10 గ్రాములకు రూ.42,635గా ఉంది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ ధర రూ.45,640. 2021 ఏప్రిల్–జూన్లో సగటు ధర రూ.43,076. ► వివిధ కొనుగోలుదారు–విక్రేతల సమావేశాల సందర్భంలో వచ్చిన అభిప్రాయాలను, పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలనూ పరిశీలిస్తే నాల్గవ త్రైమాసికం పండుగ సీజన్లో పసిడి డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. దిగుమతులూ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా డౌన్ మరోవైపు అంతర్జాతీయంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 7 శాతం తగ్గింది. డిమాండ్ 831 టన్నులకు తగ్గినట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది. గోల్డ్ ఎక్ఛ్సేంజ్ ట్రేడెట్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్) నుంచి భారీగా డబ్బు వెనక్కు వెళ్లినట్లు గణాంకాలు వెల్లడించాయి. మూడవ త్రైమాసికంలో సగటున ఔన్స్ (31.1గ్రాములు) ధర 6 శాతం తగ్గి, 1,790 డాలర్లకు చేరింది. 2020 ఇదే కాలంలో ఈ ధర 1,900 డాలర్లు. ఆభరణాలకు డిమాండ్ 33 శాతం పెరిగి 443 టన్నులకు చేరింది. టెక్నాలజీలో పసిడి వినియోగం 9 శాతం పెరిగి 83.8 టన్నులకు ఎగసింది. సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి నిల్వలను మొత్తంగా 69 టన్నులు పెంచుకున్నాయి. 2020 ఇదే కాలంలో 10 టన్నుల విక్రయాలు జరిపాయి. కాగా సరఫరాలు మాత్రం మూడు శాతం తగ్గి 1,279 డాలర్ల నుంచి 1,239 డాలర్లకు పడింది. -
ఇండిగో నష్టాలు తీవ్రతరం
న్యూఢిల్లీ: విమానయాన సేవల సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) నష్టాలు సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో మరింత పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.1,194 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా.. అవి మరింత అధికమై రూ.1,435 కోట్లకు చేరాయి. ఈ సంస్థ నిర్వహణలో 219 విమానాలు ఉన్నాయి. మొత్తం ఆదాయం 91 శాతం వృద్ధితో రూ.5,798 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. వ్యయాలు 71 శాతం అధికమై రూ.7,234 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఆదాయంలో వృద్ధి ప్రోత్సాహకరంగా ఉంది. బ్యాలన్స్షీటును బలోపేతం చేసుకోవడంలో భాగంగా తిరిగి లాభాల్లోకి వచ్చేందుకు కృషి చేస్తాం’’ అని కంపెనీ సీఈవో రోనోజోయ్దత్తా తెలిపారు. ఏవియేషన్ ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. వీటి కారణంగా వ్యయాలు మరింత అధికమవుతాయన్నారు. -
ఇండస్ఇండ్.. రయ్ లాభం 73 శాతం జూమ్
ముంబై: ప్రైవేటు రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంకు సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్గా నికర లాభం 73 శాతం పెరిగింది. రూ.663 కోట్ల లాభాన్ని బ్యాంకు ప్రకటించింది. రుణాల్లో వృద్ధికితోడు, ఎన్పీఏలకు (వసూలు కాని మొండి రుణాలు) కేటాయింపులు తగ్గడం లాభం పెరిగేందుకు దోహదపడింది. సూక్ష్మ, వాహన రుణ విభాగం లో ఒత్తిళ్లు ఉన్నట్టు బ్యాంకు ప్రకటించింది. ► నికర వడ్డీ ఆదాయం 12 శాతం పెరిగి రూ.3,658 కోట్లకు చేరింది. ► నికర వడ్డీ మార్జిన్ 4.07 శాతంగా ఉంది. ► ఫీజుల రూపంలో ఆదాయం రూ.1,554 కోట్ల నుంచి రూ.1,838 కోట్లకు పెరిగింది. ► సెప్టెంబర్ త్రైమాసింకలో రూ.2,658 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ► స్థూల ఎన్పీఏలు 2.77 శాతానికి చేరాయి. ఇవి అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి 2.21శాతంగా ఉంటే, ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరికి 2.88 శాతంగా ఉన్నాయి. ► కేటాయింపులు రూ.1,703 కోట్లకు తగ్గాయి. -
నిరాశపరిచిన ఎల్అండ్టీ
న్యూఢిల్లీ: నిర్మాణం, ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో (ఎల్అండ్టీ) కన్సాలిడేటెడ్ (అనుబంధ కంపెనీలు కలిసిన) నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్లో ఏకంగా 67 శాతం పడిపోయి రూ.1,819 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.5,520 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.31,594 కోట్ల నుంచి రూ.35,305 కోట్లకు వృద్ధి చెందింది. ‘‘క్రితం ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఎలక్ట్రిక్ వ్యాపారాన్ని ష్నీడర్కు విక్రయించడంతో పెద్ద ఎత్తున లాభం సమకూరింది. అలాగే, విదేశీ ఆస్తులకు సంబంధించి ఇంపెయిర్మెంట్ (పెట్టుబడుల విలువ క్షీణత) కూడా చేయాల్సి వచ్చింది’’ అని ఎల్అండ్టీ హోల్టైమ్ డైరెక్టర్, సీఎఫ్వో ఆర్ శంకర్రామన్ తెలిపారు. అటువంటివి సమీక్షా త్రైమాసికంలో లేవని చెప్పారు. నిర్వహణ లాభం 56 శాతం వృద్ధి చెందినట్టు చెప్పారు. నికర లాభంలో ఉత్తరాఖండ్లోని హైడల్ ప్లాంట్లో వాటాల విక్రయం రూపంలో వచ్చిన రూ.144 కోట్లు కూడా ఉన్నట్టు ఎల్అండ్టీ తెలిపింది. ఇక ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,994 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 49 శాతం తగ్గింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.42,140 కోట్ల కొత్త ఆర్డర్లను కంపెనీ సంపాదించుకుంది. కంపెనీ చేతిలో మొత్తం రూ.3,30,541 కోట్ల ఆర్డర్లున్నాయి. -
ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో ఆన్లైన్ జోరు!
న్యూఢిల్లీ: దేశీయ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు రూటు మార్చేశాయి. కొనుగోలుదారులు ఈ–కామర్స్ బాటపట్టడంతో ఎఫ్ఎంసీజీలు కూడా అదే బాటపట్టాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్తో మొదలైన ఎఫ్ఎంసీజీల ఈ–కామర్స్ సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఆయా కంపెనీల మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ వాటా 2–8 శాతం వరకున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆన్లైన్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. 2020లో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ ఈ–గ్రాసరీ మార్కెట్ 2024 నాటికి 18.2 బిలియన్ డాలర్లకు చేరుతుందని రెడ్సీర్, బిగ్బాస్కెట్ నివేదిక అంచనా వేసింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలైన నెస్లే, హిందుస్తాన్ యూనిలివర్, పార్లే ప్రొడక్ట్స్, అమూల్, మారికో వంటి సంస్థల ఆన్లైన్ అమ్మకాలు క్యూ2లో అధిక స్థాయిలో జరిగాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా సరే కొనుగోలుదారులు ఈ–కామర్స్ కొనుగోళ్ల మీదే మక్కువ చూపించడమే ఈ వృద్ధికి కారణం. గతేడాది హెచ్యూఎల్ మొత్తం అమ్మకాల్లో 3 శాతంగా ఉన్న ఆన్లైన్ అమ్మకాలు ఈ ఏడాది క్యూ2 నాటికి 6 శాతానికి పెరిగింది. నెస్లే కంపెనీ ఈ–కామర్స్ సేల్స్ కూడా సెప్టెంబర్ నాటికి రెట్టింపయింది. ‘గతేడాదితో పోలిస్తే నెస్లే ఆన్లైన్ సేల్స్లో 97 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో ఈ–కామర్స్ వాటా 4 శాతంగా ఉందని’’ నెస్లే చైర్మన్ సురేష్ నారాయనన్ తెలిపారు. ప్యాకేజ్ ఫుడ్స్కు డిమాండ్.. కొనుగోలుదారులు ఇంట్లో ఉంటూ ప్యాకేజ్డ్ ఫుడ్స్ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. అందుకే మ్యాగీ నూడుల్స్, మంచ్, కిట్క్యాట్ చాక్లెట్స్ అమ్మకాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. లాక్డౌన్ సమయంలో ఈ–గ్రాసరీ షాపింగ్ జోరుగా సాగింది. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా సరే ఈ–కామర్స్దే హవా నడుస్తుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఈ–కామర్స్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తొలిసారి ఆన్లైన్ కొనుగోలుదారులు ఎక్కువగా గ్రాసరీలను కొంటున్నారని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. గతేడాది 2.3 శాతంగా ఉన్న ఐటీసీ కంపెనీ ఆన్లైన్ అమ్మకాలు గత 12 నెలల్లో 4.2 శాతానికి పెరిగింది. ఐటీసీ ఉత్పత్తులైన సన్ఫీస్ట్ బిస్కెట్లు, ఆశీర్వాద్ పిండి ఆన్లైన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఏడాదిక్రితం డాబర్ అమ్మకాల్లో 1.5 శాతంగా ఉన్న ఆన్ౖ లెన్ సేల్స్ వాటా ప్రస్తుతం 6 శాతానికి పెరిగింది. 2–8 శాతం ఆన్లైన్ వాటా.. దేశంలోని అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా కనీసం 2–8 శాతం మధ్య ఉన్నాయి. ఈ–కామర్స్ వృద్ధిలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. లక్షలాది స్థానిక కిరాణా స్టోర్లు కూడా ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. గ్రాసరీ మార్కెట్లో ఆన్లైన్ వాటా 0.5 శాతంగా మాత్రమే ఉంది. ఆరు నెలల వ్యవధిలో అమూల్ డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలు 3 శాతం నుంచి 7–8 శాతానికి పెరిగిందని కంపెనీ ఎండీ ఆర్ఎస్ సోధి తెలిపారు. రాబోయే కాలంలో మరింత వృద్ధి కనబరుస్తుందని పేర్కొన్నారు. ఈ–కామర్స్ అమ్మకాలు దీర్ఘకాలిక వృద్ధిని నమోదు చేస్తాయని మారికో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజయ్ మిశ్రా తెలిపారు. మారికో ఉత్పత్తులైన పారాచ్యూట్ హెయిర్ ఆయిల్, సఫోలా ఓట్స్ ఉత్పత్తులు సెప్టెంబర్ త్రైమాసికంలో 39 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ మొత్తం టర్నోవర్లో ఆన్లైన్ వాటా 8 శాతంగా ఉంది. -
పుంజుకున్న స్మార్ట్ఫోన్ విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 కారణంగా సెంటిమెంట్ పడిపోవడం, లాక్డౌన్తో తిరోగమనం చవిచూసిన స్మార్ట్ఫోన్ విక్రయాలు తిరిగి గాడినపడ్డాయి. గతేడాదితో పోలిస్తే సెప్టెంబరులో ఆఫ్లైన్లో 10 శాతం వృద్ధి నమోదైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధర వ్యత్యాసం లేకపోవడంతో ఆన్లైన్ కస్టమర్లు కొంత ఆఫ్లైన్కు మళ్లడం.. మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్లు గంటల వ్యవధిలోనే ఫోన్లను డెలివరీ చేస్తుండడమే ఈ వృద్ధికి కారణమని అవి అంటున్నాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–జూన్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా 51 శాతం తగ్గి 1.8 కోట్ల యూనిట్లకు పరిమితమైంది. జూలై నుంచి సేల్స్ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పాఠశాలలు ఆన్లైన్ తరగతులకు మళ్లడం కూడా స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో కదలికకు కారణమైంది. పెరిగిన సగటు ధర.. ఈ ఏడాది మార్చి దాకా స్మార్ట్ఫోన్ సగటు విక్రయ ధర రూ.13–14 వేల మధ్య నమోదైంది. కోవిడ్ ప్రభావంతో ఏప్రిల్–ఆగస్టులో ఇది రూ.10–11 వేలకు దిగొచ్చింది. సెప్టెంబరులో పుంజుకుని రూ.13 వేలకు చేరిందని బిగ్–సి మొబైల్స్ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ‘గతంతో పోలిస్తే స్మార్ట్ఫోన్ల టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఎక్స్పీరియెన్స్ విషయంలో వినూత్న ఫీచర్లతో కొత్త మోడళ్లు వచ్చి చేరుతున్నాయి. అయితే ధరల్లోనూ వ్యత్యాసం ఉంటోంది. కస్టమర్లకు డబ్బుకు తగ్గ విలువ చేకూరుతోంది. కంపెనీల మధ్య పోటీ కారణంగా వినియోగదార్లకే ప్రయోజనం’ అని అన్నారు. కోవిడ్ దెబ్బకు జీరో డౌన్పేమెంట్ పథకాలను నిలిపివేసిన కంపెనీలు ఈ విధానాన్ని ఇటీవల తిరిగి మొదలుపెట్టాయి. అలాగే రూ.10 వేలలోపు ధరగల మోడళ్లకు డిమాండ్ అధికం కావడంతో అమ్మకాలు పెరిగాయని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. మార్జిన్లు తగ్గించిన కంపెనీలు.. భారత్లో 2011–12 కాలంలో 165 బ్రాండ్లు స్మార్ట్ఫోన్ల రంగంలో పోటీపడ్డాయి. ప్రస్తుతం శామ్సంగ్, వివో, ఓపో, షావొమీ, రియల్మీ మధ్యే తీవ్ర పోటీ ఉంది. ఈ బ్రాండ్ల సగటు విక్రయ ధర రూ.13–15 వేల మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీమియం సెగ్మెంట్ను యాపిల్, వన్ ప్లస్ కైవసం చేసుకున్నాయి. ఇక స్మార్ట్ఫోన్ల విక్రయాలపై విక్రేతలకు ఇచ్చే లాభాలను (మార్జిన్) ఇటీవల కంపెనీలు 5 శాతం దాకా తగ్గించాయి. మరోవైపు డిస్ప్లే, టచ్ ప్యానెళ్లపై కేంద్రం 10 శాతం దిగుమతి సుంకం విధించింది. సుంకాల ప్రభావంతో స్మార్ట్ఫోన్ల ధరలు 3 శాతం దాకా అధికమయ్యే ఛాన్స్ ఉందని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు వెల్లడించారు. మొబైల్స్పై జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి చేర్చడం వల్ల గ్రే మార్కెట్ పెరుగుతోందన్నారు. హాట్కేక్లా ఫోల్డ్–2.. ఆసక్తికర విషయం ఏమంటే శామ్సంగ్ రూ.1,49,999 ధరలో ఇటీవల ప్రవేశపెట్టిన సూపర్ ప్రీమియం మోడల్ ఫోల్డ్–2 హాట్కేక్లా అమ్ముడైంది. విడుదలైన 10 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 10,000 యూనిట్లకుపైగా కస్టమర్ల చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారం. ఇందులో 500 యూనిట్ల దాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అమ్ముడయ్యాయి. కాగా, 2జీ నుంచి 4జీకి కస్టమర్లు ఇటీవల వేగంగా మారారని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. యాక్సెసరీస్కు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదని చెప్పారు. -
మరో విడత రేట్ల తగ్గింపునకు అవకాశం
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో మరింతగా క్షీణించి 4.5%కి పరిమితం అయిన నేపథ్యంలో.. ఆర్బీఐ ఎంపీసీ మరో విడత పావు శాతం వరకు కీలక రేట్ల తగ్గింపును చేపట్టొచ్చనేది నిపుణుల అంచనా. శక్తికాంతదాస్ ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్బీఐ ఇప్పటిదాకా ప్రతీ భేటీలోనూ రేట్లను తగ్గిస్తూనే వచ్చింది. ఇప్పటి వరకు గత ఏడాది కాలంలో 135 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దేశ వృద్ధి రేటును ప్రగతి బాట పట్టించేందుకు తాము మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు కూడా. అయితే, ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం ఆర్బీఐ రేట్ల కోతకు సాయపడింది. మరి తాజాగా ద్రవ్యోల్బణం ఎగువవైపు పరుగును ఆరంభించింది. అక్టోబర్లో ఆర్బీఐ లకి‡్ష్యత స్థాయి (4.5%)ని దాటుకుని 4.6%కి చేరింది. దీంతో మరో విడత రేట్లపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, అక్టోబర్లో రేట్ల కోత సమయంలో సర్దుబాటు ధోరణిని ఆర్బీఐ కొనసాగించినందున, ఆర్థిక పరిస్థితులు ఇలానే బలహీనంగా ఉంటే మరో విడత రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఐహెచ్ఎస్ మార్కిట్ ముఖ్య ఆర్థికవేత్త రాజీవ్ బిశ్వాస్ తెలిపారు. ఆర్బీఐ ఎంపీసీ భేటీ ఈ నెల 3న ప్రారంభం కానుంది. 5న విధాన ప్రకటనపై నిర్ణయం వెలువడుతుంది. -
‘మౌలిక’రంగం తిరోగమనంలోనే...
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ సెప్టెంబర్ ఫలితాలు ప్రతిబింబించాయి. సమీక్షా నెల్లో ఈ గ్రూప్లో అసలు వృద్ధిలేకపోగా – 5.2 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 సెప్టెంబర్ ఉత్పత్తితో పోల్చితే 2019 సెప్టెంబర్లో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యిందన్నమాట. గురువారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం... ఎరువుల ఉత్పత్తి తప్ప అన్నీ మైనస్లోనే... ► బొగ్గు (–20.5 శాతం), క్రూడ్ ఆయిల్ (–5.4 శాతం), సహజ వాయువు (–4.9 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–6.7 శాతం), సిమెంట్ (–2.1 శాతం), స్టీల్ (–0.3 శాతం) విద్యుత్ (–3.7 శాతం) క్షీణతను నమోదుచేసుకున్నాయి. అయితే ఒక్క ఎరువుల రంగం మాత్రం 5.4 శాతం ఉత్పత్తి వృద్ధిని నమోదుచేసుకుంది. ► 2018 సెప్టెంబర్లో ఈ 8 పరిశ్రమల వృద్ధిరేటు 4.3%. ► కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే– ఈ కాలంలో వృద్ధి కూడా కేవలం 1.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5.5 శాతంగా ఉంది. ► పారిశ్రామిక రంగంలో తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. ► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వాటా దాదాపు 40 శాతం. -
పొదుపు మొత్తాలపై తగ్గిన వడ్డీ
జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి 0.1 శాతం కోత న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రాలు, సుకన్య సమృద్ధి తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి గాను వడ్డీ రేట్లను కేంద్రం 0.1 శాతం మేర తగ్గించింది. అయితే, సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును యథాతథంగా వార్షికంగా 4 శాతం స్థాయిలోనే ఉంచింది. తాజా పరిణామంతో బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం మూడు నెలలకోసారి సవరిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం... ఇకపై పీపీఎఫ్ పథకంలో ఇన్వెస్ట్ చేసే మొత్తాలపై వార్షిక ప్రాతిపదికన 7.8 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ♦ కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతం వడ్డీ రేటు, మెచ్యూరిటీ గడువు 115 నెలలుగా ఉంటుంది. ♦ బాలికల భవిష్యత్కు ఉపయోగపడే సుకన్య సమృద్ధి అకౌంట్ స్కీముపై ఇప్పటిదాకా 8.4 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా ఇకపై 8.3 శాతం మాత్రమే లభించనుంది. ♦ 5 ఏళ్ల సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీముపైనా 8.3 శాతం మాత్రమే దక్కుతుంది. -
కీలకమైన జీడీపీ గణాంకాలు వచ్చేశాయ్!
పెద్ద నోట్ల రద్దు వల్ల వృద్ధి రేటుపై పోటు పడుతుందని పలు రేటింగ్ సంస్థలు అంచనావేస్తున్న నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జీడీపీ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. మార్కెట్ వర్గాలకు శుభసూచికగా జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో జీడీపీ రేటు 7.3 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. గత క్వార్టర్లో ఈ రేటు 7.1 శాతంగా ఉంది. గత త్రైమాసికం కంటే ఈ త్రైమాసికంలో దేశీయ ఎకానమీ శరవేగంగా వృద్ధి చెందినట్టు ఈ గణాంకాల్లో తెలిసింది. అదేవిధంగా ఈ రేటు పెంపుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీలో భారత్ ఒకటిగా మరోసారి రుజువు చేసుకుంది. కానీ నవంబర్ 9 నుంచి హఠాత్తుగా రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్ల వల్ల దేశమంతటా నగదు సమస్య ఏర్పడిందని, ఇది వచ్చే నెలల్లో వృద్ధిరేటు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులంటున్నారు. ఈ ఆర్థికసంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటును అత్యధికంగా 8 శాతం నమోదుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ హఠాత్తుగా పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడంతో సమీప కాలంలో వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుందని పలు రేటింగ్ సంస్థలు సైతం అంచనావేస్తున్నాయి. 2017-18 ఆర్థికసంవత్సర వృద్ధి రేటు అంచనాలను కుదిస్తూ వస్తున్నాయి. కరెన్సీరద్దు స్వల్పకాలంలో ప్రభావం చూపినా.. దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని అవి పేర్కొంటున్నాయి. -
యాక్సిస్ బ్యాంకుకు కార్పొరేట్ రుణాల సెగ
ముంబై: దేశంలో మూడవ అతిపెద్ద ప్రయివేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకును మొండి బకాయిల సెగ బాగానే తాకింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసిక ఫలితాల్లో బ్యాంక్ భారీ నికర లాభాలను నమోదు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 83 శాత పడిపోయింది. బ్యాంక్ నికర లాభం 83 శాతం క్షీణించి రూ. 319 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.1,915.60 కోట్ల నికర లాభాలు సాధించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం 11 శాతం పెరిగి రూ. 4,514 కోట్లను అధిగమించింది. నికర ఎన్పీఏలు కూడా 0.48 శాతం నుంచి 2.02 శాతానికి ఎగశాయి.క్యూ2(జూలై-సెప్టెంబర్)లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.54 శాతం నుంచి 4.17 శాతానికి ఎగబాకాయని బ్యాంక్ ప్రకటించింది. గతంలో ప్రకటించిన రూ.7,287 కోట్ల సమస్యాత్మక రుణాలు సెకండ్ క్వార్టర్ ను ప్రభావితం చేసినట్టు చెప్పారు. ఇంకా రూ.13,789 కోట్లరుణాలను వాచ్ లిస్ట్ లో ఉన్నట్టు వెల్లడించారు. ప్రధానంగా కార్పొరేట్ రుణాల ఎగవేత బ్యాంకు రికార్డును దెబ్బతీసిందని బ్యాంక్ ఫైనాన్స్ ఛీఫ్ జైరాం శ్రీధరన్ చెప్పారు. వార్షిక ప్రాతిపదికన మొదటి సగం లో దాదాపు 305 బేసిస్ పాయింట్లను రికార్డ్ చేయనుంది. మునుపటి మార్గదర్శకత్వం 125-150 బేసిస్ పాయింట్లుకంటే రెట్టింపు కంటే ఎక్కువ. ప్రొవిజన్లు ఐదు రెట్లు ఎగసి లాభాలను దెబ్బతీశాయి. ప్రొవిజన్లకు రూ. 3623 కోట్లను కేటాయించింది.నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 20 బేసిస్ పాయింట్లు నీరసించి 3.64 శాతానికి చేరాయి. ఈ నిరాశాజనక ఫలితాలతో మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. దాదాపు 7.56 శాతం పతనమైంది. -
స్మార్ట్ఫోన్ రారాజులకు చైనీస్ బ్రాండ్ల దెబ్బ
భారత్లో స్మార్ట్ఫోన్ రారాజులు శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ల మార్కెట్ షేరుకు దెబ్బకొడుతూ చైనీస్ కంపెనీలు దూసుకెళ్లాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనీస్ స్మార్ట్ఫోన్ ప్లేయర్లు లెనోవో, షియోమి, వివో, ఓపోలు మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టి, టాప్-10 స్థానాల్లో నిలిచాయని హాంగ్కాంగ్ ఆధారిత మార్కెట్ రీసెర్చర్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గత క్వార్టర్లో 27శాతమున్న చైనీస్ బ్రాండ్ల మార్కెట్ షేరు ఈ క్వార్టర్లో 32శాతానికి ఎగిసిందని పేర్కొంది. అదేవిధంగా సెప్టెంబర్లో లాంచ్ చేసిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సర్వీసులతో ఆ ఇండస్ట్రీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఎల్వైఎఫ్ మార్కెట్లో నెంబర్ 4 స్థానానికి ఎగబాకినట్టు కౌంటర్ పాయింట్ వెల్లడించింది. మరోవైపు పండుగల సీజన్ నేపథ్యంలో భారత్లో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లూ భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్ఫోన్ షిప్మెంట్స్ 35 మిలియన్ యూనిట్లు రికార్డు మార్కును తాకినట్టు వెల్లడైంది. అంటే ఈ షిప్మెంట్లు దాదాపు 21శాతం పెరిగాయి. ఇదంతా పండుగ సీజన్ కాలంలో రీటైలర్ల నుంచి వస్తున్న డిమాండేనని కౌంటర్ పాయింట్ వివరించింది. మొట్టమొదటిసారి భారత్లో 30 మిలియన్ స్మార్ట్ఫోన్లు విక్రయాలు జరిగాయని కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ నీల్ షా తెలిపారు. ఈ ఏడాది ప్రథమార్థంలో మందకొండిగా సాగిన స్మార్ట్ఫోన్ అమ్మకాలు, ద్వితీయార్థంలో పండుగ సీజన్లో భారీగా పుంజుకుంటున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. దీపావళి ఈ అమ్మకాలను మరింత పెంచుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఉచితమైన వాయిస్, డేటా వంటి సంచలనమైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చిన జియో సర్వీసులతో, ఎల్వైఫ్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ మార్కెట్ షేరు 6.7శాతానికి ఎగిసినట్టు కౌంటర్పాయింట్ తెలిపింది. మార్కెట్ రారాజులు శాంసంగ్, మైక్రోమ్యాక్స్లు తీవ్ర ఇరకాటంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఆ సంస్థలు మార్కెట్ షేరు సెప్టెంబర్ క్వార్టర్లో 21.6శాతం, 9.8 శాతం కోల్పోయినట్టు వెల్లడించింది. అయినప్పటికీ ఈ రెండు టాప్ స్థానాల్లోనే ఉన్నాయి. రెడ్మి నోట్3 మోడల్ అద్భుతమైన ప్రదర్శనతో షియోమి నంబర్ 6 స్థానంలోకి వచ్చింది. వివో, ఓపోలు 7, 8 స్థానాలను దక్కించుకున్నాయి. -
లాభాల్లో ఎగిసిన టెక్ దిగ్గజం టీసీఎస్
దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ గురువారం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన రెండో క్వార్టర్లో నికరలాభాలు 4 శాతం ఎగిసి రూ.6,528కోట్లగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. గత క్వార్టర్లో ఈ లాభాలు కేవలం రూ.6317కోట్లు మాత్రమే. అయితే డాలర్ రెవెన్యూలు మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయినట్టు కంపెనీ తన ఫలితాల్లో పేర్కొంది. క్వార్టర్లీ బేసిస్తో ఈ రెవెన్యూలు కేవలం 0.3 శాతం మాత్రమే పెరిగి 4374 మిలియన్ డాలర్లుగా రికార్డు అయినట్టు వెల్లడించింది. ఈ రెండో త్రైమాసికాన్ని అసాధారణమైన క్వార్టర్గా కంపెనీ సీఈవో, ఎండీ ఎన్.చంద్రశేఖర్ అభివర్ణించారు. ప్రపంచ వాతావరణంలో పెరుగుతున్న అనిశ్చితుల దృష్ట్యా వినియోగదారులు జాగ్రత్త వహించినట్టు, లాటిన్ అమెరికా, భారత్ వంటి మార్కెట్లలో రెవెన్యూ వృద్ధి స్తబ్దుగా ఉన్నట్టు చెప్పారు. లాభాల పరంగా తీసుకుంటే ఇది మంచి త్రైమాసికమేనని ఆయన పేర్కొన్నారు. అమెరికా వంటి కీలక వ్యాపార ప్రాంతంలో అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే జులై-సెప్టెంబరులో నష్టాలు నమోదుకావొచ్చని కంపెనీతో పాటు మార్కెట్ విశ్లేషకులు పెట్టుబడిదారులకు ముందస్తు హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో కంపెనీ నికరలాభాలు కూడా కేవలం రూ.6,298 కోట్లకు పరిమితమవుతాయని విశ్లేషకులు అంచనావేశారు. వారి అంచనాలను అధిగమించి కంపెనీ లాభాలను ప్రకటించింది. లాభాల ప్రకటన నేపథ్యంలో కంపెనీ ఒక్కో షేరుకు 6.50 పైసల మధ్యంతర డివిడెంట్ను ప్రకటించింది. కాగ ఈ ఫలితాలు మార్కెట్ ముగిసిన అనంతరం విడుదల అయ్యాయి. ఫలితాల నేపథ్యంలో నేటి మార్కెట్లో కంపెనీ షేరు 2.17 శాతం పడిపోయింది. -
ఎల్అండ్టీ లాభం 14% డౌన్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మౌలికరంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 978 కోట్లకు తగ్గింది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 1,137 కోట్లు. అప్పట్లో అసాధారణంగా సుమారు రూ. 267 కోట్లు రావడం వల్ల లాభం ఎక్కువగా కనిపించిందని, తాజాగా అలాంటి అంశాలేమీ లేవని కంపెనీ తెలిపింది. మరోవైపు ఆదాయం సుమారు 10 శాతం వృద్ధితో రూ. 14,510 కోట్లకు పెరిగినట్లు వివరించింది. విద్యుత్, హైడ్రోకార్బన్, మెటలర్జికల్ తదితర విభాగాలు కాస్త మందగించినప్పటికీ.. ఇన్ఫ్రా వంటి కొన్ని వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనపర్చడంతో ఆదాయం పెరిగిందని ఎల్అండ్టీ తెలిపింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం ద్వారా ఆదాయం సుమారు 31 శాతం పెరిగి రూ. 7,198 కోట్లుగా నమోదైంది. సమీకృత ఇంజనీరింగ్ సేవలు, నౌకల నిర్మాణం, ప్రాపర్టీ డెవలప్మెంట్ వంటి వ్యాపార విభాగం 53 శాతం పెరిగి రూ. 527 కోట్లుగా నమోదైంది. మరోవైపు, ఆర్డర్లు 27%(సుమారు రూ. 26,533 కోట్లు) పెరిగాయని ఎల్అండ్టీ వివరించింది. మధ్యప్రాచ్య దేశాల్లో భారీ ప్రాజెక్టుల వల్ల విదేశీ ఆర్డర్లు రెట్టింపయ్యాయని, మొత్తం ఆర్డర్లలో 43% వాటా వీటిదేనని పేర్కొంది. సెప్టెంబర్ చివరికి మొత్తం ఆర్డర్ల విలువ రూ. 1,76,036 కోట్లని ఎల్అండ్టీ తెలిపింది. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడాలని, ఇటీవలి ప్రభుత్వ చర్యలు ఇందుకు దోహదపడగలవని ఎల్అండ్టీ వివరించింది.