Sharma
-
ఆయుష్షు పెంచే ‘ఏఐ’
సాక్షి, విశాఖపట్నం: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ).. అన్ని రంగాల్లోనూ ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమూల మార్పులు తెస్తోంది. అత్యంత వేగంగా, కచ్చితత్వంతో కూడిన ఫలితాలతో ప్రపంచాన్ని మార్చేస్తోంది. వైద్య రంగంలోనూ వేగంగా చొచ్చుకు వస్తున్న ఈ కృత్రిమ మేధ మనిషి ఆయుష్షును పెంచడానికి కూడా దోహద పడుతుందని ప్రఖ్యాత వైద్య నిపుణులు, అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ ప్రెసిడెంట్ డా. ప్రతీక్ శర్మ తెలిపారు. భవిష్యత్తులో వైద్య రంగాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు ప్రజలకు చేరువ చేసే విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయని ఆయన చెప్పారు. విశాఖలో జరిగిన డీప్టెక్ సదస్సులో పాల్గొన్న డా. ప్రతీక్ శర్మ వైద్య రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.ఇప్పుడు 6% మాత్రమే ఉపయోగిస్తున్నాంకృత్రిమ మేధ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నా.. వైద్య రంగంలో మాత్రం అట్టడుగున ఉంది. వైద్య సేవల రంగంలో ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు కీలక ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో ఏఐ వినియోగం పెంచడానికి అన్ని దేశాలూ సంస్కరణలు కూడా తెస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే హెల్త్ కేర్లో ఏఐ సేవలు 6 శాతమే. 2022కి యూఎస్లో ఏఐ అడాప్షన్ రేట్ 19 శాతమే ఉంది.2047కి 85 శాతం వరకూ పెరిగే సూచనలున్నాయి. ఇది వైద్య సేవల్ని వేగవంతం చేయడమే కాకుండా మనిషి ఆయుష్షును పెంచేందుకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నాం. ఏఐ వినియోగంతో రోగ నిర్థారణ, సలహాలు, చికిత్సల్లో కచ్చితత్వం వస్తుంది. చాలా సమయం ఆదా అవుతుంది. ఔషధ పరిశోధనల్లోనూ ఏఐ సేవలు విస్త్రృతమవుతున్నాయి.హెల్త్కేర్ ఏఐలోభారీ పెట్టుబడులు..హెల్త్ కేర్లో ఏఐ వినియోగం కోసం అన్ని దేశాలూ పెట్టుబడులు భారీగా పెంచుతున్నాయి. అమెరికా ప్రస్తుతం 28.24 బిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చిస్తోంది. 2030కి 187.85 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టాలని నిర్ణయించింది. హెల్త్ కేర్లో ఏఐ వినియోగంలో భారత్ కూడా పురోగమిస్తోంది. భారత్లో 2022కి 0.13 బిలియన్ డాలర్లు మాత్రమే పెట్టుబడులుండగా.. 2030కి 2.92 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఇది శుభపరిణామమే అయినా.. భారత్ మరింతగా దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకుంటుంది.వైద్యంలో ఏఐ అప్లికేషన్స్ వినియోగం ఇలా..హెల్త్కేర్లో ఏఐ ఆధారిత అప్లికేషన్లు చాలా వరకూ వినియోగంలో ఉన్నాయి. డయాగ్నసిస్ను మరింతగా మెరుగుపరిచేందుకు, రోగి వైద్య రికార్డుల నిర్వహణ, వ్యక్తిగత వైద్య సేవల అభివృద్ధి, వైద్యులపై పనిభారం తగ్గించడం మొదలైన అంశాలకు సంబంధించిన యాప్స్ ఉన్నాయి. ఇప్పటికే వీటిని అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాల్లో ఉపయోగిస్తున్నారు. భారత్లో పేరొందిన ఆస్పత్రుల్లో ఇప్పుడిప్పుడే ఇవి ప్రారంభమవుతున్నాయి.క్యాన్సర్ చికిత్సలో అద్భుత ఫలితాలుక్యాన్సర్ చికిత్సలో ఆంకాలజీ విభాగంలో ఏఐ అద్భుత ఫలితాలు అందిస్తోంది. ప్రాథమిక దశలో బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడం కష్టతరం. కానీ, అమెరికాలో అతి తక్కువ సమయంలోనే ఏఐ ద్వారా రొమ్ము క్యాన్సర్ని గుర్తించారు. సెర్టిస్ ఏఐ యాప్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ఏఐ–డ్రివెన్ ఆంకాలజీ డ్రగ్ డిస్కవరీతో ఫలితాలు రాబడుతున్నారు. ఊపిరితిత్తులు, మెదడు, మెడ, చర్మ సంబంధమైన క్యాన్సర్ల గుర్తింపు ఫలితాలు కూడా వీలైనంత త్వరగా అందించేలా యాప్ల అభివృద్ధి జరుగుతోంది.మారుమూల పల్లెలకూ వైద్య సేవలుఏఐ ద్వారా మారుమూల గ్రామాలకూ వైద్య సేవలు చేరువవుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఈ ఫోన్లో ఏఐ ఉంటే.. ఆ ఫోన్ కూడా ఒక డాక్టర్గా మారిపోతుంది. ఏఐ డ్రివెన్ రిమోట్ కేర్ యాప్తో మారుమూల పల్లెల్లో ఉన్న రోగితో డాక్టర్ నేరుగా మాట్లాడి.. బీపీ, పల్స్ చెక్ చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చేసింది. వైద్యుల అపాయింట్మెంట్, వైద్య సలహాలు, సూచనల్ని చాట్బాట్ ద్వారా అందించే రోజులు కూడా వచ్చేశాయి. -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఉదయ్ కిరణ్తో మొదటి సినిమా!
ప్రముఖ బుల్లితెర నటి అదితి దేవ్ శర్మ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు జన్మించిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. తన రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.కాగా.. 2014లో బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. హిందీలో టీవీ సీరియల్స్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదితి శర్మ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఓం శాంతి, బబ్లూ లాంటి చిత్రాల్లో మెరిసింది. బుల్లితెర నటిగా గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్లో పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. గంగా, కథా అంకహీ లాంటి టీవీ షోలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆదితి శర్మ హిందీ, తెలుగు చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Aditi Sharma (@aditidevsharma) -
పల్లెటూరి అల్లరి పిల్ల కేతిక.. లుక్కే మార్చేసిందిగా! (ఫొటోలు)
-
సేవ్ ది టైగర్స్ నటి కొత్త చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్!
సత్య , షాలిని , దేవియాని శర్మ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం లైఫ్ స్టోరీస్. ఈ సినిమాకు ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్జన్ ఎంటర్టైన్మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్లపై విజయ జ్యోతి నిర్మిస్తున్నారు. సామాన్యుల జీవితం కోణంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమ, రిలేషన్స్, సాధారణ సంఘటనలు మన జీవితాలపై ఎలా ప్రభావితం చేస్తాయో ఈ మూవీలో చూపించనున్నారు.(ఇది చదవండ: అమెరికా ఎన్నికల్లో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ సాంగ్)అయితే సేవ్ ది టైగర్స్, సైతాన్ లాంటి వెబ్ సిరీస్లతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దేవయాని శర్మ ఈ చిత్రంలో నటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. అన్ని రకాల సినీ అభిమానులను ఈ చిత్రం మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. ప్రతి ప్రేక్షకుడి సినిమాతో కనెక్ట్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 14న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి, ప్రదీప్ రాపర్తి, గజల్ శర్మ, శరత్ సుసర్ల, స్వర్ణ డెబోరా, రాహుల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విన్ను సంగీతం అందిస్తున్నారు. -
ఐటీ నుంచి డైరెక్షన్ దాకా..
‘ఇక్కడకు డైరెక్టర్ అవుదామనే వచ్చాను. ఎస్.. ముందు ఊహించిన దానికన్నా ప్రాక్టికాలిటీలో భిన్నంగానే ఉంది. అయినాసరే అనుకున్నది సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది’ అంటున్నారు మానసశర్మ. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన మానస.. సోనీలివ్లో గురువారం నుంచి అందుబాటులోకి రానున్న బెంచ్లైఫ్ వెబ్సిరీస్ ద్వారా దర్శకురాలిగా మారుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘మాది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం. చిన్నప్పటి నుంచి కథలు చదవడం ఇష్టం. అలాగే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ విఠలాచార్య వంటి గొప్ప నటుల, దర్శకుల చిత్రాలు బాగా చూశాను. వాటి ద్వారా ఫిల్మ్ మేకింగ్పై ఇష్టం ఏర్పడింది. వైజాగ్లో ఇంజనీరింగ్ చదివే సమయంలో మల్టీమీడియా ప్రాజెక్ట్ సబి్మట్ చేయమంటే నా క్లాస్మేట్స్కు భిన్నంగా నేను షార్ట్ ఫిల్మ్ చేశా. చదువు పూర్తయ్యాక ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ఏడాది పాటు పనిచేసినా.. సినిమాలపై ఉన్న ఇష్టం నన్ను అక్కడ ఉండనివ్వలేదు. రిజైన్ చేసి డైరెక్టర్ కావాలనే లక్ష్యంతోనే సినీరంగంలోకి ప్రవేశించాను. రైటర్ టూ డైరెక్టర్.. తొలుత రచయితగా 3 వెబ్సిరీస్లకు పనిచేశాను. మెగా డాటర్ నిహారిక బెంచ్లైఫ్ ద్వారా నాకు డైరెక్టర్గా తొలి అవకాశం ఇచ్చారు. తొలిసారి రాజేంద్రప్రసాద్, తనికెళ్లభరణి లాంటి గ్రేట్ యాక్టర్స్ని డైరెక్ట్ చేశాను. వారు కూడా నన్ను ప్రోత్సహించారు. షూటింగ్లో 40 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. క్లైమాక్స్ సీన్ చేశాక.. ‘ఆ నలుగురూ సినిమా తర్వాత గ్లిజరిన్ అవసరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీన్ మళ్లీ ఇదే’ అని రాజేంద్రప్రసాద్ అనడం.. నా ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పాలి. ఒక్క ఛాన్స్.. చాలు.. మొదటి నుంచీ డైరెక్టర్ అవుదామనే నా లక్ష్యం నెరవేరుతున్నందుకు హ్యాపీ. రాసుకున్న కథ సరైన రీతిలో అందించాలని వచి్చన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని తప్ప వేరే విషయాలు ఆలోచించడం లేదు. త్వరలో పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయనున్నా. యువన్శంకర్ రాజా మ్యూజిక్.. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి’ అంటూ ముగించారు మానసశర్మ. ఏదేమైనా విజయనిర్మల, నందినీరెడ్డిల తర్వాత భూతద్ధంలో పెట్టి వెదికినా లేడీ డైరెక్టర్ కనిపించని పరిస్థితుల్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో మన ముందుకు వస్తున్న తెలుగమ్మాయి మానస శర్మ దర్శకురాలిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ..చెప్పేద్దాం.. ఆల్ ద బెస్ట్... -
తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్!
కాన్స్ రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్యా రాయ్ లుక్స్కి వెస్ట్రన్ వరల్డ్ అంతా ఫిదా అయిపోయింది. మనకూ కొత్తగా కనిపించింది. అలా ఆమెను తీర్చిదిద్దిన స్టయిలిస్ట్ ఆస్థా శర్మ. ఆమె అంట్రప్రెన్యూర్ కూడా!ఆస్థా స్వస్థలం ఢిల్లీ. ఫ్యాషన్ ప్రపంచంతో అసలు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లది లాయర్ల కుటుంబం. ఆమె తండ్రి.. ఢిల్లీలో పేరుమోసిన అడ్వకేట్. కెరీర్ విషయంలో తన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుని ఇంటర్ అయిపోగానే ‘లా’ ఎంట్రెన్స్ రాసింది. సీట్ వచ్చింది కూడా. కానీ ఆస్థా వాళ్ల నాన్న.. తన కూతురు లాయర్ కాకుండా ఇంకేదైనా రంగంలో స్థిరపడితే బాగుండు అనుకున్నాడు. అదే విషయాన్ని బిడ్డతో చెప్పాడు.. ‘నేను లాయర్ అయ్యాను కాబట్టి.. నువ్వూ కావాలనే మైండ్సెట్తో లా చదవకు. నీకేది ఇష్టమో అదే చెయ్’ అని. అప్పుడు ఆలోచించింది ఆస్థా.. నిజంగా తనకు లా చదవాలని ఉందా? అని! ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు.దాంతో అది వదిలేసి ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్లో చేరింది. అది చదువుతున్నప్పుడే ఆస్థాకు క్రియేటివ్గా ఏదో చేయాలనే తపన మొదలైంది. ఆ శోధనలోనే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెరిగింది. బీఏ అయిపోగానే ‘పర్ల్ అకాడమీ’ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ మర్చండైజింగ్ కోర్స్లో జాయిన్ అయింది. కానీ అదేమంత ఇష్టంగా తోచలేదు. అప్పుడే ఒక ఫ్రెండ్ ద్వారా ‘స్టయిలింగ్’ గురించి తెలుసుకుంది.ఫ్యాషన్ మార్కెటింగ్ కోర్స్ పూర్తవగానే స్టయిలింగ్లోకి దిగింది. మ్యాగజైన్ స్టయిలిస్ట్ రిన్ జాజో దగ్గరికి ఇంటర్న్గా వెళ్లింది. అదే సమయంలో మరో స్టయిలిస్ట్ ఆదిత్య వాలియాకూ అసిస్టెంట్గా పని చేయడం మొదలుపెట్టింది. అప్పుడు గ్రహించింది స్టయిలింగ్ అనేది తన కైండ్ ఆఫ్ వర్క్ అని. ఆ ఇంటర్న్షిప్ అయిపోగానే ఆమెకు ఏ్చటp్ఛట’టఆ్చ్డ్చ్చట మ్యాగజైన్లో ఫ్యాషన్ ప్రొడ్యూసర్ కొలువు దొరికింది. అది ఆమెకు పనిలో అనుభవాన్నే కాదు.. ఫ్యాషన్ లోకపు కాంటాక్ట్స్నీ పెంచింది. గొప్ప ఎక్స్పోజర్నిచ్చింది.అది ఒక పంజాబీ సినిమాలోని అగ్రతారలకు స్టయిలింగ్ చేసే చాన్స్ని తెచ్చిపెట్టింది. అంతే మ్యాగజైన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆసా, ఆమె కొలీగ్ మోహిత్ ఇద్దరూ ఆ ప్రాజెక్ట్లో తలమునకలయ్యారు. సక్సెస్ సాధించారు. దానిద్వారా వచ్చిన పెద్దమొత్తాన్ని తీసుకుని ముంబై చేరారు. ‘వార్డ్రోబిస్ట్’ అనే ఫ్యాషన్ స్టార్ట్ప్ పెట్టారు. అది ఆస్థాకు బాలీవుడ్ ఎంట్రెన్స్ని కల్పించింది. ఐశ్వర్యా రాయ్ని పరిచయం చేసింది. తన పనితనాన్ని నిరూపించుకునే అవకాశాన్నిచ్చింది. ఐశ్వర్యా రాయ్ మెచ్చి ఆమెను తన పర్సనల్ స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకుంది.ఆ వాసి మరింత మంది తారలకు చేరి.. దిశా పాట్నీ, మృణాల్ ఠాకుర్, నోరి ఫతేహీ, విద్యా బాలన్, భూమి పెడ్నేకర్లకూ స్టయిలింగ్ చేసే ఆపర్చునిటీస్ని అందించింది. అంతేకాదు అంట్రప్రెన్యూర్గా ‘ద వెడ్డింగ్ స్టయిల్’ ప్రాజెక్ట్నూ లాంచ్ చేసే దశకు చేర్చింది. ఆస్థా ఇప్పుడు.. బాలీవుడ్ సెలబ్రిటీస్కి ఫేవరెట్ స్టయిలిస్ట్.. బడ్డింగ్ స్టయిలిస్ట్లకు రోల్ మోడల్!స్టయిలిస్ట్ అవడానికి ఫ్యాషన్ పట్ల ప్యాషన్ మాత్రమే సరిపోదు. ఫ్యాషన్ అండ్ డిజైనింగ్లో చదువు, ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్, అంతులేని ఈ పోటీ రంగంలో అలుపెరగని శ్రమ, ఊహకందని సృజన చాలా ఇంపార్టెంట్! అందుకే ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ మీద అవగాహన, స్టడీ, రీసెర్చ్ తప్పనిసరి! ఇవన్నీ ఉంటేనే స్టయిలింగ్లో మన మార్క్ చూపించగలం.. బెస్ట్ అనిపించుకోగలం! – ఆస్థా శర్మఇవి చదవండి: ఆ పాత్రలో.. మెప్పించడానికి చాలానే కష్టపడింది! -
కావ్యా మారన్తో ఫొటోలకు ఫోజులు.. ఈ బ్యూటీ గురించి తెలుసా? (ఫొటోలు)
-
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
సైబర్ నేరాలకు, మోసాలకు అడ్డుఆపు లేకుండా పోతోంది. ప్రతిరోజూ కొత్త కొత్త రూపాలలో ఈ నేరాలు వెలుగుచూస్తున్నాయి. పోలీస్ డ్రెస్ వేసుకొని, పోలీస్టేషన్ ఆఫీస్ బ్యాంక్ గ్రౌండ్లో కూర్చొని పోలీసులమని చెబుతూ నేరగాళ్ళు అమాయకులతో ఆడుకుంటున్నారు. మీమీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, మీ పేరుతో మొబైల్ నెంబర్ తీసుకున్నట్లు సమాచారం వుందని, ఆ నెంబర్ నుంచి నేరమయమైన కమ్యూనికేషన్ ఉందని, మీ ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఉందని, అందులో కోట్లాదిరూపాయల లావాదేవీలు జరిగాయని, మనీ ల్యాండరింగ్ కేసు బుక్ అయిందని, విదేశాల లావాదేవీలు కూడా జరిగాయని, మీరు వెంటనే ముంబయి పోలీస్ స్టేషన్కు రావాలని, మిమ్మల్ని అరెస్టు చేయాలని, మీరు మాకు సహకరిస్తే, మిమ్మల్ని ఈ మోసం నుంచి కాపాడుతామని చెబుతూ, అమాయకుల నుంచి బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడం మొదలైన చర్యలు ఈ నేరగాళ్ళు చేస్తున్నారు.పోలీసులు వేషాలతో, పోలీసులు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లుగా వాట్సాప్లో వీడియో కాల్లో మాట్లాడుతూ అమాయకులతో ఆడుకుంటున్నారు. పోలీస్ వేషంలో ఉండడంతో, నిజమైన పోలీసులే ఆనుకొని, తమ నిజాయితీని నిరూపించుకొనే దిశగా అమాయకంగా సమాచారం ఇస్తూ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ అని, ఇలా ఎన్నో రకాలుగా సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్ ఎదుర్కొంటున్నవాళ్ళలో మేధావులు, చదువుకున్నవాళ్ళు కూడా ఉండడం గమనించదగిన అంశం. జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ ఉన్నత ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రజల్లో అవగాహన కలిపించే దిశగా పోలీసులు, సైబర్ సాంకేతిక నిపుణులు, సంబంధిత వర్గాలు, మేధావులు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులు కృషి చేస్తూనే వున్నారు.కమ్యూనికేషన్ రంగం విస్తృతంగా ప్రజలకు చేరుతోంది. దానికి తగ్గట్టుగా విజ్ఞానం, మెలుకువలు పెరగడం లేదన్నది వాస్తవం. దేశంలోనూ,ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది సైబర్ మోసాలకు బలవుతున్నారు. మోసపోతున్నవారిలో నిరక్షరాస్యులే కాదు అక్షరాస్యులు కూడా ఉంటున్నారు. ఆ మధ్య మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఈ తీరుకు అద్దం పట్టింది. న్యాయస్థానంలో సూపరింటెండెంటుగా పనిచేసి రిటైరయిన ఓ మహిళ ఏకంగా కోటి రూపాయలకు పైగా పోగొట్టుకుంది.కేవలం సోషల్ మీడియాలో పరిచయాలు, తదనంతర పరిణామాలు ఈ మోసానికి ఆసరాగా నిలిచాయి. బంగారం బహుమతులుగా అందుకోండని యూకే నుంచి వచ్చిన ఫోన్ కు ఆమె చిక్కుకున్నారు. కస్టమ్స్ పన్ను చెల్లించాలని చెప్పగానే వెంటనే 1.12 కోట్లు ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, ఫోన్ కు కూడా అందకుండా ఉన్న పరిస్థితి ఎదురైంది. మోసపోయానని గ్రహించిన తర్వాత ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బహుమతులు వచ్చాయి, పన్ను కట్టాలని ఫోన్ వచ్చినప్పుడే పోలీసులను సంప్రదించి వుంటే? ఆమె నష్టపోయేది కాదు.చేతిలో ఫోన్ ఉంది కదా! అని ముక్కుముఖం తెలియనివారితో స్నేహం చేయడమే మొదటి తప్పు. మనకు సంబంధించిన సమాచారం అందరితో పంచుకోవడం రెండో తప్పు. బహుమతులకు ఆశపడడం ఇంకో తప్పు. ఇటువంటి ఫోన్స్, మెసేజెస్ వచ్చినప్పుడు ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళక పోవడం అంతకు మించిన తప్పు.జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఎవరినన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇలా ఎన్నో మోసాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈమెయిల్స్, మెసేజెస్ రూపంలో ప్రతిరోజూ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇక లోన్ యాప్ ల దారుణాలు అన్నీ ఇన్నీ కావు. మెసేజెస్ రావడమే ఆలస్యం వెంటనే క్లిక్ చేసి కొంతమంది దొరికిపోతున్నారు.లక్ష పెట్టుబడితో కేవలం 8 నెలల్లోనే 4 కోట్లు సొంతం చేసుకోండని కనిపించిన యాప్ను చూసి వెంటనే డబ్బులు కట్టేసి ఎంతోమంది మోసపోయిన వార్త ఆ మధ్య బయటకు వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్లో ఆ భారీ మోసం జరిగింది. ఈ మోసం విలువ 100కోట్ల పైనేనని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. పూర్తిగా దర్యాప్తు జరిగితే మోసాల చిట్టా మరింత బయటపడుతుంది. ఇలాంటి సంస్థలు దేశ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.మోసపోయాక లక్షలాది మంది రోడ్డు మీదకు వస్తున్నారు. సాధారణంగా ఆన్ లైన్ ట్రేడింగ్కు సెబీ గుర్తించిన సాంకేతికతను వినియోగించాలి. ప్రజలవ్వేమీ చూసుకోవడం లేదు. మొదటిది అవగాహన లేకపోవడం, రెండోది అత్యాశ. ఫోన్స్ హ్యాక్ చేస్తూ కోట్లాది రూపాయలు కొట్టేసిన ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాం. నకిలీ యాప్స్ తో పాటు నకిలీ పేర్లతో సోషల్ మీడియా వేదికలు కూడా నిర్మించి మోసాలకు తెరతీస్తున్నారు. నకిలీ మెయిల్స్ కూడా సృష్టిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్లు చూసి కొందరు మోసపోతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆధార్ కార్డు అనేక విభాగాలతో అనుసంధానమై ఉండడం వల్ల కూడా ఇటువంటి నేరాలకు అవకాశం ఇస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంపై విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే సామాన్యుల రక్షణ ప్రశ్నార్ధకమవుతోంది. బ్యాంకుల్లో డబ్బులు ఉంచుకోవాలా? లేదా అనే సందేహాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి.ఈ సైబర్ మోసాలు ఇన్నిన్ని కాదయా! అని చెప్పవచ్చు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం, అత్యాశకు పోకుండా ఉండడం, అందరినీ నమ్మకుండా ఉండడం, ముందుగానే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించడం తప్ప వేరు మార్గాలు లేవు. కోట్లాదిగా పెరిగిపోతున్న నకిలీ సైబర్ వ్యవస్థలను పూర్తిగా నియంత్రించే శక్తి ఏ ప్రభుత్వాలకు ఉండదు. స్వయం నియంత్రణ కూడా అవసరం.-మాశర్మ -
చంద్రబాబుకు చివరి పంచ్.. బాంబు పేల్చిన శర్మాజీ!
ఎన్నో వైద్యాలు చేస్తున్నాం.. హోమియోపతి.. అల్లోపతి.. నేచురోపతి.. ఆయుర్వేదం.. కేరళ మూలికావైద్యం.. ప్రకృతివైద్యం.. అన్నీ చూశాం. ఎన్ని చేస్తున్నా రోగిలో చలనం లేదు.. కళ్ళలో కళ లేదు.. కాళ్ళూ చేతులూ కదలడం లేదు.. శ్వాస కష్టంగానే ఉంది. నాడీ అందడం లేదు.. గుండె కూడా నీరసంగా కొట్టుకుంటోంది.. నాకైతే నమ్మకంలేదు.. దగ్గరోళ్ళు.. రావాల్సినవాళ్లు ఉంటే పిలిపించుకోండి. పనిలోపనిగా అటు కట్టెలు.. కుండ.. పాడె.. చిల్లర పైసలు సిద్ధం చేసుకోండి.. అని డాక్టర్ చెప్పినమాదిరిగానే టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ కూడా చంద్రబాబుకు చెప్పేశాడట.మీకోసం ఎన్నో ప్రోగ్రాములు డిజైన్ చేశాం. బాదుడే బాదుడు.. వస్తున్నా మీకోసం.. సైకో పోవాలి-సైకిల్ రావాలి. ఇదేం ఖర్మ, యువగళం వంటి ఎన్ని ప్రోగ్రాములు చేసినా పార్టీకి మైలేజి రాకపోగా బాబు విశ్వసనీయత మీద ప్రజల్లో సందేహాలు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గడం లేదు. మరోవైపు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఆయన చెప్పిందే చేస్తారు అనే అంశాన్ని ప్రజలు బాగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధమే అనేది ఒక బ్రాండ్ ప్రజల్లో ఉండిపోయింది.దీంతో ఆయన ఎన్ని హామీలు ఇస్తున్నా నమ్మడం లేదు.. దానికితోడు కూటమి కట్టిన బీజేపీ.. జనసేన మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరినట్లు లేదు.. ఎక్కడికక్కడ విభేదాలు పొడసూపుతున్నాయి. లోకేష్ పార్టీకి బలం అని అనుకుంటున్నారు.. తప్ప అయన ఎక్సట్రా లగేజ్ అనే విషయం కూడా రాబిన్ శర్మ చెప్పేసారు. ఇటు తమ పార్టీ ప్రోగ్రాములు డ్యామేజ్ అయిపోగా అటు వైఎస్సార్ కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టేందుకు.. వాలంటీర్లు.. పెన్షన్ల వంటి అంశాలను టీడీపీ నెత్తికి ఎత్తుకుంది. అది కూడా నెత్తి బొప్పి కట్టింది తప్ప ప్రయోజనం లేకపోయింది. ఆసరా... విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలకు నిధులు విడుదల చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను సైతం కోర్టులో కేసువేసి అడ్డుకున్న చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. దీంతో ఇక ప్లెయిన్ రోడ్లో డ్రైవింగ్ కష్టం అనుకున్న చంద్రబాబు వెనుకడోర్ నుంచి యుద్ధానికి తెగబడ్డారు. కేవలం దుష్ప్రచారం ద్వారా ఓటర్లకు తికమకపెట్టి గెలవాలన్నదే వాళ్ళ ప్లాన్. అందుకే దేశంలో ఎక్కడా.. ఏ రాష్ట్రంలోనూ ఇబ్బందిలేని ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి జనాన్ని తమవైపునకు తిప్పుకోవాలన్నది అయన పార్టీ ప్లాన్గా మారింది. చంద్రబాబు ఏమి చేస్తాడు.. ఏమి చేయలేదు.. అనేది చెప్పినా ప్రజలు నమ్మేలా లేరు. అందుకే ఇక మ్యానిఫెస్టోను మడిచి పొయ్యిలో పెట్టిన టీడీపీ ఇప్పుడు ఏకంగా కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పదిరోజులుగా అన్ని పత్రికలూ.. ఛానెళ్లలో అదే అంశం మీద తప్పుడు సమాచారంతో పేజీల కొద్దీ ప్రకటనలు కుమ్ముతున్నారు. ఇక గత ఇరవయ్యేళ్ళుగా తెలుగుదేశానికి వచ్చిన సీట్లు చూస్తే ఇలా ఉన్నాయ్.. 2004 - 34 సీట్లు2009 - 54 సీట్లు2014 - 102 సీట్లు2019 - 23 సీట్లుఆంటే జనసేన.. బీజేపీలతో పొత్తుపెట్టుకున్న 2014 లో మాత్రమే మూడంకెల స్కోర్ వచ్చింది తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి 294 సీట్లు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం మూడంకెల స్కోర్ చేరలేదు.. అంటే టీడీపీ బలం ఎప్పుడూ యాభై సీట్లకు అటు ఇటుగా ఉంది తప్ప గొప్పగా ఏమి లేదు. ఇప్పుడు కూడా సేమ్ ఆలాగే సీట్లు వస్తాయి తప్ప అధికారం దక్కడం అసాధ్యం అనేది విశ్లేషకుల అంచనాగా ఉంది. -
Tanya Sharma: వియత్నాంలో హిందీ బుల్లితెర నటి సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
-
దీపాంశుకు స్వర్ణం
దుబాయ్: ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తొలి రోజు భారత్కు ఒక స్వర్ణం, మూడు రజతాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. పురుషుల జావెలిన్ త్రోలో దీపాంశు శర్మ పసిడి పతకం సాధించాడు. దీపాంశు జావెలిన్ను 70.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.భారత్కే చెందిన రోహన్ యాదవ్ 70.03 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 1500 మీటర్ల విభాగంలో ప్రియాంశు రజత పతకం నెగ్గాడు. ప్రియాంశు 3 నిమిషాల 50.85 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల డిస్కస్ త్రోలో రితిక్ (53.01 మీటర్లు) రజత పతకం గెలిచాడు. -
ముందు ఉట్టి కొడదాం!
'ఉట్టి కొట్టలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెనలు వేసింది' అన్న చందంగా, భూమిపై బతకడం చేతకాని మనిషి అంతరిక్షంలో కాలనీలు కట్టి కాపరం చేస్తానంటున్నాడు. ఆ దిశగా ఆధునిక మానవుడు పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాడు. కానీ, అది అంత తేలిక కాదు, పైగా మనిషిని మనిషే చంపుకొని తినే దారుణమైన పరిస్థితులు వస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కరోనా వంటి ఊహాతీతమైన వ్యాధులు వచ్చి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని మనిషి భయపడుతూనే ఉన్నాడు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ వుంటే శాస్త్రవేత్తలు సైతం కంగారుపడిపోతున్నారు. సామాన్య మానవులు బెంబేలెత్తి పోతున్నారు. ఇది ఇలా ఉంటుండగానే, భూమి నుంచి దూరంగా వెళ్ళి, వేరే స్పేస్ లో జీవించవచ్చు అనే విశ్వాసాన్నీ పెంచుకుంటున్నాడు. ఇది కొత్తగా పుట్టిన కోరిక కాదు. ఎప్పటి నుంచో మనిషి ఆలోచిస్తున్నాడు. కరోనా కాలానికి ముందే కొందరు శాస్త్రవేత్తలు అంతరిక్ష జీవనాన్ని ప్రచారంలోకి తెచ్చారు. సాధ్యాసాధ్యాలపై ఇంకా విస్తృతంగా అధ్యాయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడదాం, కొత్త లోకాల్లో విహరిద్దాం అని మనిషి ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. భూమిపై ఏదైనా విపత్తు వచ్చినా, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు, వనరులు సరిపోకపోయినా.. పైకెళ్లి జీవించాలనే ఆలోచనలకు శాస్త్రవేత్తలు మరింత పదునుపెడుతున్నారు. అంగారక గ్రహం లేదా చంద్రమండలంపై కాలనీలు నిర్మంచి జీవించవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు కూడా! భూమి నుంచి ఆహారాన్ని పంపించే పరిస్థితులపైనా దృష్టి సారిస్తున్నారు. ఇవ్వన్నీ సాధించడానికి సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందేనని అర్థం చేసుకోవాలి. ఆ మధ్య ఎడిన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన చార్లెస్ కొకెల్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. పాత విషయాలను కొన్నింటిని గుర్తు చేశారు. నిజంగా భూమి నివాసయోగ్యం కానప్పుడు అంతరిక్షం వైపు చూడవచ్చు. కానీ, దానిని సాధించాలంటే ఇంకా ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. 19వ శతాబ్దంలో నార్త్ వెస్ట్ పాసేజ్ను వెతకాడానికి కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ బయలుదేరారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి తప్పారు. అత్యుత్తమ సాంకేతికత అందుబాటులో ఉన్నా, వారంతా ఒకరినొకరు చంపుకుతినే దారుణమైన దుస్థితి వచ్చిందని ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ గుర్తుచేస్తున్నాడు. అంతరిక్షంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు. వనరులు, వసతులతో పాటు ఆహారకొరత ప్రధాన సమస్యగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు. డాక్టర్ కామెరన్ స్మిత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతరిక్షంలో మానవ మనుగడ వేళ్లూనుకోవాలంటే? వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. గ్రహాంతర వాసులకోసం వెతుకులాట కూడా ఇప్పటికే మొదలైంది. అంతరిక్షంలోకి వెళ్లబోయే ముందు, ఈ భూమిని పవిత్రంగా, పచ్చగా కాపాడుకోవడం ముఖ్యం. స్వార్థం శృతి మించి, కోరికలు, విలాసాలు ఆకాశాన్ని అంటిన ఆధునిక మానవుడు సహజ వనరులను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాడు. తత్ఫలితంగా అడువులు అంతరించి పోతున్నాయి, జీవనదులు ఇంకిపోతున్నాయి. భూమి క్రుంగిపోతోంది, సముద్ర మట్టాలు పెరిగి పోతున్నాయి. అగ్ని గోళాలు బద్ధలై పోతున్నాయి. ఒక్కటేమిటి? విశ్వరూపమే మారిపోతోంది. ప్రకృతిని అందినకాడికి అంతం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో రుతువుల గమనం మారిపోయింది. భూమి వేడెక్కిపోతోంది. అతివృష్టి అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ప్రబలి పోయాయి. ఆణువణువూ కాలుష్య కాసారంగా మారింది. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అంతా కలుషితమై పోయింది. ఇంటాబయటా అంతా కాలుష్యమే. దీనికి ముందుగా మనిషి మనసే అత్యంత కలుషితమై పోయింది. అందుకే, కొంగ్రొత్త వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మంచినీరే కాదు, మంచిగాలి కూడా కొనడానికి కూడా దొరకని దుస్థితి వచ్చేసింది. పల్లెల ముఖచిత్రం మారిపోయింది. చేతివృత్తులు ఎగిరిపోయాయి. వ్యవసాయ విధానమే మారిపోయింది. ఆహారరక్షణపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతరిక్షానికి ఆహార సరఫరా సంగతి తర్వాత చూద్దాం. ముందుగా, భూమిపై పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి జరగడమే ప్రమాదంలో పడింది. ఆధునిక మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమై పోతోంది. భూమిని పాడుచెయ్యడమే కాక, గ్రహాలను సైతం పాడు చెయ్యడానికి మనిషి తయారవుతున్నాడని కొందరు శాస్త్రవేత్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో, కరోనా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చూడడం శాస్త్రవేత్తల ప్రథమ కర్తవ్యం. ప్రకృతిని, భూభాగాన్ని రక్షించుకోవడం మానవాళి ప్రాథమిక అవసరం. సహజ వనరులను నిలబెట్టు కోవడం అత్యంత ముఖ్యమైన అంశం. వీటన్నిటిపై దృష్టి సారించడమే అందరి తక్షణ కర్తవ్యం. సమాంతరంగా అంతరిక్ష పరిశోధనలు కొనసాగించుకోవచ్చు. అన్నింటి కంటే ముందుగా, మంచి వైపు మనిషి మారితే? అంతా మంచే జరుగుతుందని విశ్వసిద్దాం. - మాశర్మ -
'అనందంలో'.. ఫిన్ల్యాండ్ మొదటి స్థానం! మరి ఇండియా..??
"అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.." అని ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం సముద్రాల రామానుజాచార్య ఓ పాట రాశారు. ఆ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచి, ఆలపించారు ఘంటసాల. ఇది 1973లో వచ్చిన 'బతుకుతెరువు' సినిమాలోనిది. పాట చివర్లో "జీవితమే ఒక నాటకరంగం" అంటారు. నాటకం వంటి జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒకరోజు తెరపడుతుంది. అది తప్పదు. పుట్టినప్పటి నుంచి పోయేంత వరకూ సాగే బతుకు నడుమ ఆనందాన్ని పోగుచేసుకొని అనుభవిస్తేనే ఆనందం. లేకపోతే, అంతా అయోమయం, విషాదం. ఈ జీవనసారాన్ని మన మహర్షులు, మహర్షుల వంటి మహాకవులు, మహనీయులు, మాననీయ మూర్తులు తెలుసుకున్నారు, మనసారా అనుభవించారు, ఆచరించండని మనకు అనేక రూపాల్లో, మార్గాల్లో చెప్పారు. మార్చి, 20 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం'. మనుషులంతా సంతోషంగా ఉండండి, అది అందరికీ పంచండి, అది ఎక్కుడుందో వెతికి పట్టుకోండి, పట్టుకొని వదలకండి.. అంటూ ఐక్యరాజ్య సమితి అంటోంది. సుమారు ఓ పుష్కరం క్రితం (2013) తొలిసారిగా, సమితిలోని సభ్యదేశాలన్నీ ఈ వేడుకను జరుపుకున్నాయి. అప్పటి నుంచి ప్రతి ఏడూ జరుపుకుంటున్నాయి. బుధవారం నాడు అందరం జరుపుకున్నాం. కానీ, అందరికీ ఈ ఉత్సవం గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ స్థాయిలో ప్రచారం జరుగలేదు. మనదేశంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో.. మనం ఈ ఆనంద సంబరాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోయాం. ఈ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడూ కొన్ని నివేదికలు అందుతూ వుంటాయి. ఏ ఏ దేశాలలో సంతోష, ఆనందాల స్థాయి ఎట్లా వుందని కొలుస్తారు. ఆ కొలతలకు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఈ నియమాల ప్రకారం నివేదిక ద్వారా మనకు అర్థమవుతున్నదేంటంటే? అనందంలో మనదేశం 126 వ స్థానంలో వుంది. మనకంటే ఎంతో పేద దేశాలు ముందు వరుసలో వున్నాయి. మన పొరుగు దేశాలైన చైనా, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్ మనకంటే ఆనందంగా వున్నాయి. మొత్తం దేశాలలో ఫిన్ ల్యాండ్ అందరికంటే ఆనందమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు ఏడేళ్ల నుంచి ఫిన్ ల్యాండ్ తన అగ్రతను కాపాడుకుంటూ వస్తోంది. 60 వ ర్యాంక్ తో మనకంటే చైనా చాలా ఆనందంగా ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. క్షేత్రస్థాయిలో, నిజజీవితంలో వాస్తవాలు మనకు పూర్తిగా తెలియదు కానీ, ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపిన సంస్థ చెప్పే నివేదికలో మాత్రం విషయాలు అలాగే వున్నాయి. ప్రపంచ మానవాళికి శాంతిని, ఆనందమయ జీవితాన్ని చాటి చెప్పామని చెప్పుకుంటున్న మన దేశం ఈ సూచీలో వెనుకబడి పోవడం వివిధ ఆలోచనలను రేకెత్తిస్తోంది. అంతర్ముఖంగా మళ్ళీ అలోచించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. ఏది ఆలోచిస్తే, ఏది చేస్తే, ఏది చూస్తే ఆనందం కలుగుతుందో? అవన్నీ మన మహర్షులు మనకు ఎన్నడో చెప్పేశారు. భగవద్గీత నుంచి సంగీతం వరకూ, ధ్యానం నుంచి యోగాభ్యాసం వరకూ, మౌనం నుంచి ఆధ్యాత్మిక సాధన వరకూ, శాంతి నుంచి స్థితప్రజ్ఞత వరకూ మనకు బోధించారు. వాటిని కొందరు ఆచరించారు, కొందరు ఆచరించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. కొందరు ఇవ్వేమీ తెలియకుండానే సహజంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎక్కువమంది ఆనందంగా లేరు. అసంతృప్తితో అలమటిస్తున్నారు, అయోమయంలో వున్నారు. ఐక్యరాజ్య సమితి పెట్టిన నియమాలను ఒకసారి వీక్షిద్దాం. ఆత్మతృప్తి, జీవనకాలం (లైఫ్ స్పాన్), సామాజిక మద్దతు, తలసరి ఆదాయం, దాతృత్వం, స్వేచ్ఛ, అవినీతి మొదలైన వాటిల్లో ఆయా దేశాలు, ఆయా దేశ ప్రజలు ఎలా వున్నారన్నది ప్రాతిపదికగా దేశాలకు ర్యాంకులను కేటాయించారు. అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ వంటి దేశాలలో కూడా సంతోషం సన్నగిల్లుతోందని ఈ నివేదిక చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్న దేశాలే ఎక్కువ ఆనందంగా వున్నాయి. "చిన్న కుటుంబం - చింతలులేని కుటుంబం " అన్న పాత సామెత గుర్తుకువస్తోంది. అనందాన్ని అనుభవించేవారి వయసుల్లోనూ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరు నడుస్తోంది. పెద్ద వయస్సు వారికంటే చిన్నవాళ్లే ఆనందంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నా, అన్నిచోట్లా అట్లా లేదు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి దేశాల్లో యువత కంటే పెద్దలే ఎక్కువ ఆనందంగా వున్నారు. ఐరోపా వాసుల్లో ఆనందం కాస్త పెరుగుతున్నట్లు, పశ్చిమ యూరప్ లో అందరూ సమానమైన సంతోషకర వాతావరణంలో వున్నారని తెలుస్తోంది. ఒక్క ఐరోపా దేశాల్లో తప్ప మిగిలిన అన్ని దేశాలలోనూ ఆనందంలో అసమానతలు పెరిగిపోతూ ఉండడం బాధాకరం. అందులో మనదేశం కూడా వుండడం ఇంకా బాధాకరం. అందరి కంటే అత్యంత ఆనందంగా వున్న ఫిన్ ల్యాండ్ ప్రజలను గమనిస్తే వారి లక్షణాలు, ఆలోచనలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ప్రకృతితో ఎక్కువ మమేకమై ఉండడం, వృత్తిని - జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ, సమతుల్యత పాటిస్తూ సాగడం, విజయంపై స్పష్టమైన అవగాహన కలిగివుండడం, అవినీతి తక్కువగా ఉండడం, ప్రభుత్వాల పట్ల ఎక్కువ విశ్వాసం కలిగి వుండడం, ఆరోగ్యం, విద్య, సంరక్షణలో ప్రభుత్వం సక్రమంగా పరిపాలన, సేవలు అందించడం మొదలైనవి ఫిన్ ల్యాండ్ వారి ఆనందమయ జీవితానికి కారకాలుగా, ప్రేరకాలుగా కనిపిస్తున్నాయి. 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం' లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎజెండా పెట్టుకుంటున్నాం. "అనందానికి తిరిగి దగ్గర కావడం - స్థితప్రజ్ఞత కలిగే, పెరిగే సమాజాలు నిర్మించుకోవడం" ఈ 2024 సంవత్సరానికి పెట్టుకున్నాం. ఇది సాధించడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఆనందం ఎక్కడో లేదు, మనలోనే వుంది. మన ఆలోచనలలో వుంది, మన ఆచరణలో, నడవడికలో వుంది. రమణమహర్షి నుంచి రామానుజాచార్యులు (సముద్రాల) వరకూ, మహాత్మాగాంధీ నుంచి మార్క్ ట్వైన్ వరకూ, ఆదిశంకరాచార్యుల నుంచి అబ్రహం లింకన్ వరకూ, లియో టాల్ స్టాయ్ నుంచి జాన్ కీట్స్ వరకూ చెప్పింది ఒక్కటే! "ఆనందంగా ఉండండి, తోటివారిని అనందంగా ఉంచండి ". ఈ క్రమంలో, మనకు బోలెడు సారస్వతం వుంది, కళలు వున్నాయి, భగవద్గీత, మహాభారత రామాయణాది కావ్యాలు, ఇతిహాసాలు, వేదవేదాంగాలు అందించిన జ్ఞానభాండాగారం మన దేశానికి మెండుగా అండగా వుంది. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలోకి జారుకొనేంత వరకూ ఏమేమి చెయ్యాలో, ఏమేమి చెయ్యకూడదో ఆచార్యులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతూనే వున్నారు. ఆహారం, నిద్ర, వ్యాయామ నియమాలు, శాంతి, విశ్రాంతిని ఆచరించడం మన చేతుల్లోనే వుంది. ప్రతి మనిషి కోరుకొనేది ఒక్కటే.. ప్రతి క్షణం ఆనందంగా ఉండడం. అదే జీవిత మకరందం. ఈ ఆనంద సూచీలో మనం ఫిన్ ల్యాండ్ ను దాటి మొదటి స్థాయిని అందుకోవాలి. అందరూ అనందంగా ఉండాలని అనుకుందాం. — మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
ఘనంగా బతుకమ్మ వేడుకలు!
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ రోజున 'గౌరమ్మను' పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పండుగను అంగరంగా వైభవంగా జరుపుతారు. ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. పార్వతి గురించి పాటలాగా పాడుతూ.. ఆనందంతో బతుకమ్మను జరుపుకుంటారు. ఆడపడచులు, యువకులు, పిల్లలు, పెద్దలు తమ ఆనందాన్ని చూపే కన్నుల పండుగగా.. తెలంగాణ ప్రజలకు ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ ఈ బతుకమ్మ. ఈ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో ఆలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు తీరొక్క పూల శోభ సంతరించుకోనుంది. ఈ క్రమంలో చెరువుల వద్ద నిమజ్జన ప్రదేశాల్లో రంగుల ఆహ్లాదం ఎంతో చూడముచ్చట. పౌష్టికాహారం, చిరుధాన్యాలు, కూరగాయలు, గాజులు, చేతివృత్తులతో తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణీయం. బతుకమ్మ పండుగ కేవలం కటుంబాలకు, ఇంటికే పరిమితం కాదు, తెలంగాణలోని అన్నీ రంగాలవారిగా.. విద్యా, వైద్యా, సాంకేతిక, వివిధ పరిశ్రమల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణ ఎంతో కన్నుల పండుగగా చెప్పవచ్చు అనడానికి నిదర్శనంగా.. 'డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంలో' శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 'డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగం' డైరెక్టర్ వి ఫణిభూషణ్శర్మ ఈ వేడుకలకు హాజరయ్యారు. 'జాయింట్ డైరెక్టర్లు' హెచ్ శైలజారాణి, పి రజిని, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి హైదరాబాద్ 'పే అండ్ అకౌంట్ ఆఫిసర్స్' మహ్మద్ ఆరిఫ్, ఆర్ వి రామగోపాల్ అండ్ స్టాఫ్, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సిబ్బంది, తదితరులు బతుకమ్మ వేడుకల సందర్భంగా హాజరయ్యారు. బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళల్ని మరింత ప్రోత్సహించే దిశలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇలాంటి మరెన్నో పండుగలు జరుపుకోవాలని డైరెక్టర్ కోరుతూ.. అందుకు అందరి ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు. -
ఇష్టమైన కళ తీరిన వేళ
పోలియో బాధితురాలైన సునిత త్రిప్పనిక్కర అయిదు సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు వేయడం ప్రారంభించింది. సునిత మొదట్లో చేతులతోనే బొమ్మలు వేసేది. అయితే డిగ్రీ చదివే రోజుల్లో చేతుల్లో పటుత్వం కోల్పోయింది. బ్రష్ పట్టుకోవడం కష్టంగా మారింది. ఆ సమయంలో తన సోదరుడిని స్ఫూర్తిగా తీసుకుని మౌత్ ఆర్టిస్ట్గా మారింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడు నోటితో కుంచె పట్టుకుని బొమ్మలు వేస్తాడు. సునిత ఇప్పటివరకు అయిదు వేలకు పైగా పెయింటింగ్స్ వేసింది. ఆమె ఆర్ట్వర్క్స్ సొంత రాష్ట్రం కేరళతోపాటు సింగపూర్లోనూ ప్రదర్శితమయ్యాయి. ప్రకృతి సంబంధిత చిత్రాలు వేయడం అంటే సునితకు ఇష్టం. విన్సెంట్ వాన్ గో ఆమెకు ఇష్టమైన చిత్రకారుడు. ‘ప్రయాణాలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. ఇక రంగులు అనేవి నన్ను ఎప్పుడూ అబ్బురపరిచే అద్భుతాలు. సంప్రదాయంతో పాటు ఆధునిక చిత్రధోరణులు అంటే కూడా ఇష్టం. మొదట్లో పళ్ల మధ్య కుంచె పట్టుకుని చిత్రాలు వేయడం చాలా కష్టంగా అనిపించింది. సాధన చేస్తూ చేస్తూ కష్టం అనిపించకుండా చేసుకున్నాను’ అంటుంది సునిత. సునిత చేసే ప్రయాణాలలో కనిపించే సుందర దృశ్యాలు కాన్వాస్పైకి రావడానికి ఎంతోకాలం పట్టదు. ‘బాధితులకు ఓదార్పును ఇచ్చే శక్తి చిత్రకళకు ఉంది’ అంటాడు వ్యాన్ గో. ఆ మాట సునిత విషయంలో అక్షరాలా నిజం అయింది. క్యాన్వాస్ దగ్గర ఉన్న ప్రతిసారీ తనకు వందమంది స్నేహితుల మధ్య సందడిగా ఉన్నట్లుగా ఉంటుంది. ధైర్యం చెప్పే గురువు దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మీయతను పంచే అమ్మ దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ‘నా జీవితంలోకి చిత్రకళ రాకుండా ఉండి ఉంటే పరిస్థితి ఊహకు అందనంత విషాదంగా ఉండేది’ అంటుంది సునిత. బెంగళూరు నుంచి సింగపూర్ వరకు సునిత ఆర్ట్ ఎగ్జిబిషన్స్ జరిగాయి. అక్కడికి వచ్చే వారు ఆర్టిస్ట్గా ఆమె ప్రతిభ గురించి మాత్రమే మాట్లాడడానికి పరిమితం కాలేదు. స్ఫూర్తిదాయకమైన ఆమె సంకల్పబలాన్ని వేనోళ్లా పొగిడారు. ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్’ సంస్థలో సభ్యురాలైన సునిత దివ్యాంగులైన ఆర్టిస్ట్లకు సహకారం అందించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వీల్చైర్కే పరిమితమైన వారిలో విల్పవర్ పెంపొందించేలా సోదరుడు గణేష్తో కలిసి ‘ఫ్లై’ అనే సంస్థను ప్రారంభించింది. ‘చిరకు’ పేరుతో ఒక పత్రికను నిర్వహిస్తోంది. కాలి వేళ్లే కుంచెలై... రెండు చేతులు లేకపోతేనేం సరస్వతీ శర్మకు సునితలాగే అంతులేని ఆత్మబలం ఉంది. సునిత నోటితో చిత్రాలు వేస్తే రాజస్థాన్కు చెందిన సరస్వతీ శర్మ కాలివేళ్లను ఉపయోగించి చిత్రాలు వేస్తుంది. ఇంగ్లీష్ సాహిత్యంలో మాస్టర్స్ చేసింది. ఫైన్ ఆర్ట్స్లో డిప్లొమా చేసింది. ఎడమ కాలితో నోట్స్ రాసుకునేది. ‘మొదట్లో ఆర్ట్ అనేది ఒక హాబీగానే నాకు పరిచయం అయింది. అయితే అది హాబీ కాదని, అంతులేని శక్తి అని ఆ తరువాత అర్థమైంది’ అంటుంది సరస్వతీ శర్మ. కోచిలోని ‘మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్’ ఆర్ట్ గ్యాలరీలో సునిత చిత్రాలతో పాటు సరస్వతి చిత్రాలను ప్రదర్శించారు. ఒకవైపు నోటితో చిత్రాలు వేస్తున్న సునిత మరో వైపు కాలివేళ్లతో చిత్రాలు వేస్తున్న సరస్వతిలను చూస్తుంటే ప్రేక్షకులకు ఆత్మబలానికి నిలువెత్తు రూపాలను చూసినట్లుగా అనిపించింది. ‘అయ్యో’ అనుకుంటే ఎదురుగుండా కనిపించే దారిలో అన్నీ అవరోధాలే కనిపిస్తాయి. ‘అయినా సరే’ అనుకుంటే మనసు ఎన్నో మార్గాలు చూపుతుంది. కేరళలోని కన్నూర్కు చెందిన సునితకు బొమ్మలు వేయడం అంటే ప్రాణం. అయితే చేతులు పటుత్వం కోల్పోవడంతో కుంచెకు దూరం అయింది. ‘ఇష్టమైన కళ ఇక కలగానే మిగలనుందా?’ అనుకునే నిరాశామయ సమయంలో మనసు మార్గం చూపించింది. మౌత్ ఆర్టిస్ట్గా గొప్ప పేరు తెచ్చుకుంది... -
నేటి నుంచి జాతీయ చెస్ పోటీలు
విశాఖ స్పోర్ట్స్: జాతీయ అండర్–11 చెస్ చాంపియన్షిప్ ఆదివారం విశాఖ పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆంధ్ర చెస్ సంఘం, ఆల్ విశాఖ చెస్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీల్లో 27 రాష్ట్రాలకు చెందిన ఫిడే రేటింగ్ చిన్నారులు పోటీపడనున్నారు. పదకొండు రౌండ్ల పాటు సాగే ఈ పోటీలు 7వ తేదీతో ముగుస్తాయని ఆంధ్ర చెస్ సంఘం అధ్యక్షుడు కె.వి.వి.శర్మ తెలిపారు. విజేతకు రూ.70 వేల ప్రోత్సాహకం అందించనుండగా ఏడు నుంచి ఇరవై స్థానాల్లో నిలిచిన బాల బాలికలకు సైతం రూ.పదేసి వేల ప్రోత్సాహకం అందించనున్నామన్నారు. 386 మంది అండర్ 11 బాలబాలికలు పోటీ పడుతున్నారు. టోర్నీ టాప్ రేటింగ్తో కర్ణాటకకు చెందిన అపార్ పోటీ పడుతుండగా ఏపీ తరఫున అందాలమాల 17వ ర్యాంక్తో ఎత్తులు ప్రారంభించనున్నారు. -
ఎర్ర చీర చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్
శ్రీరామ్, అయ్యప్ప పి. శర్మ, అజయ్ కీలక పాత్రల్లో బేబీ డమరి సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఎర్ర చీర’. సుమన్ బాబు, ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్ కానుంది. సుమన్ బాబు దర్శకత్వం వహించారు. ‘‘అమ్మ సెంటిమెంట్, హారర్, యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ చిత్రాన్ని రూ΄పొందించాం. 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో తీసిన క్లైమాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు ఎన్వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు. -
శవ రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్: సుందరరామశర్మ
సాక్షి, అమరావతి: ఏపీలో శవ రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘శవ రాజకీయాలు చేయడమే చంద్రబాబుకి తెలుసు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం. వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదు. ఏ రోజైనా చంద్రబాబు బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారా?’’ అని ప్రశ్నించారు. ‘‘కోర్టులను కూడా మేనేజ్ చేయొచ్చంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. న్యాయ వ్యవస్థ గురించి ఇంత చులకనగా మాట్లాడతారా?. న్యాయ వ్యవస్థకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో మీ గురించి చెప్పిన మాటలకు సమాధానం చెప్పే దమ్ముందా ’’ అంటూ చంద్రబాబుపై సుందరరామ శర్మ మండిపడ్డారు. లోకేష్ చేసేది పాదయాత్ర కాదు అదొక బూతుయాత్ర. లోకేష్ బూతులు నేర్చుకున్నాడు కానీ... తెలుగు నేర్చుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. చదవండి: చంద్రబాబు ఓ పిరికిపంద: పేర్ని నాని -
రాబిన్ శర్మ నిర్ణయాలు టీడీపీ నేతలకు నచ్చడం లేదా..?
తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ నిర్ణయాలు టీడీపీ నేతలకు నచ్చడం లేదా.. ? చంద్రబాబు, లోకేష్ కార్యక్రమాలకు రాబిన్ శర్మ సూచించే పేర్లు టీడీపీ నేతలకు ఇబ్బందిగా మారాయా? రాబిన్ శర్మ సూచించిన యువగళం, ఇదేం కర్మ పేర్లు మార్చాలని పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఒత్తిడి తెస్తున్నారా..? ఇటీవల కాలంలో టీడీపీలో మొదలైన పేర్ల పంచాయితీ గొడవ ఏమిటి...? తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీ నాయకులకు రుచించడం లేదు. రాబిన్ శర్మ పార్టీకి ఇచ్చే సలహాలు సూచనలు, తీసుకునే నిర్ణయాలపై టీడీపీ సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారు. వ్యూహకర్తగా ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరించి రాబిన్ శర్మని వ్యూహకర్తగా నియమించడం వల్ల టీడీపీకి ఎటువంటి లాభం కలగడం లేదంటున్నారు. పైగా రాబిన్ శర్మ తీసుకునే నిర్ణయాలు పార్టీకి నష్టం చేకూరేలా ఉంటున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాబిన్ శర్మ నిర్ణయాలు పార్టీకి.. ప్రజలకి మధ్య అనుబంధం పెంచేలా.. అంతరాలు తగ్గించేలా లేవంటున్నారు. ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించి రాబిన్ శర్మ తీసుకున్న రెండు నిర్ణయాలపై టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం అట్టర్ ప్లాప్ కావడంతో దాని స్థానంలో కొత్త కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టారు. కొత్త కార్యక్రమానికి ఇదేం ఖర్మ అంటూ రాబిన్ శర్మ పేరు ఖరారు చేశారు. ఈ పేరుపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పేరు అస్సలు బాగోలేదంటూ టీడీపీ నేతలు వ్యతిరేకించారు. ఇదేం ఖర్మ పేరు స్థానంలో మరొక పేరు పెట్టాలని సూచించారు. ఇదేం ఖర్మ పేరుతో ప్రజల్లోకి చంద్రబాబు వెళ్ళక ముందే సోషల్ మీడియా, అధికార వైఎస్ఆర్సీపీ టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నాయని వివరించారు. ఈ పేరు చాలా ఇబ్బందిగా ఉందని ఇదేం ఖర్మ టైటిల్ మార్చాలన్నారు. ఇదేమి ఖర్మ పేరు అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు మెడకే చుట్టుకుంటుందని రాబిన్ శర్మకు వివరించారు. త్వరలో నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి యువగళం పేరును రాబిన్ శర్మ ఖరారు చేశారు. ఈ పేరు పైన కూడా టీడీపీ సీనియర్ నేతలు అభ్యంతరం తెలిపారు. యువ గళం అనేది కేవలం యువతను మాత్రమే టార్గెట్ చేసుకొని చేసే పాదయాత్రలా ఉందని, అన్ని వర్గాలను కలుపుకొని నిర్వహించే పాదయాత్రలా పేరు పెట్టాలని సూచించారు. పాదయాత్రకు ప్రజా గళం లేదా జనగళం పేరు పెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా సరే వారి అభ్యర్థనను రాబిన్ శర్మ ఏ మాత్రం లెక్క చేయలేదు. టీడీపీ నేతలు చివరికి చేసేది ఏమీ లేక ఈ రెండు పేర్లు మార్చాలని చంద్రబాబు, లోకేష్ వద్ద కూడా ప్రస్తావించారు. ఈ రెండు పేర్లుకు, చేసే కార్యక్రమాలకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు. చంద్రబాబు, లోకేష్ కూడా పార్టీ సీనియర్ నేతలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. రాబిన్ శర్మ ఏవైతే పేర్లను సూచించారో.. ఆ పేర్లకే తండ్రి కొడుకులు జై కొట్టారు. తండ్రి కొడుకుల తీరుతో విసిగి పోయిన పార్టీ సీనియర్ నేతలు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నది సగం రాబిన్ శర్మ అయితే, మిగతా సగం చంద్రబాబు.. లోకేష్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు ఎటువంటి వ్యూహకర్తలు లేకుండానే యువగర్జన, వస్తున్నా మీకోసం వంటి పేర్లు పెట్టిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి మరింత పతనం కాక తప్పదని పచ్చ పార్టీ నాయకులే వాపోతున్నారు. చదవండి: లోకేష్ పాదయాత్రకు ఎందుకింత హైప్.. ‘ఈనాడు’ భయం అదేనా? -
‘వర్చువల్ స్కూల్’పై కేంద్రం, కేజ్రీవాల్ వాదులాట
న్యూఢిల్లీ: ‘వర్చువల్ స్కూల్’పై కేంద్రం, కేజ్రీవాల్ సర్కారు వాదనలకు దిగాయి. దేశంలో మొట్ట మొదటి వర్చువల్ స్కూల్ను బుధవారం ప్రారంభించినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు అనుబంధంగా దీన్ని ప్రారంభించామని ఆయన చెప్పుకొచ్చారు. 9వ తరగతికి ప్రవేశ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు లైవ్ క్లాసులకు హాజరుకావొచ్చని.. రికార్డు చేసిన పాఠాలు, స్టడీ మెటీరియల్ కూడా వారికి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకూ సాయం అందిస్తామని చెప్పారు. గతేడాదే ప్రారంభించాం కేజ్రీవాల్ ప్రకటనపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) స్పందించింది. దేశంలో మొట్ట మొదటి వర్చువల్ స్కూల్ను గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఎన్ఐఓఎస్ తెలిపింది. ‘మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా 2021, ఆగస్ట్ 14న వర్చువల్ స్కూల్ని ఎన్ఐఓఎస్ ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా దీన్ని ప్రారంభించిందని చదివి నేను ఆశ్చర్యపోయాను. దేశంలోనే తొలిసారిగా జాతీయ స్థాయిలో దీన్ని మేము ప్రారంభించాం. ప్రస్తుతం 3వ సెషన్ జరుగుతోంద’ని ఎన్ఐఓఎస్ చైర్పర్సన్ సరోజ్ శర్మ తెలిపారు. వర్చువల్ స్కూల్ నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వానికి తమ సహాయం కావాలంటే తప్పకుండా చేస్తామన్నారు. అకడమిక్ సపోర్టు అందిస్తున్నాం తమకు అనుబంధంగా ఉన్న 7000 అధ్యయన కేంద్రాలు ప్రస్తుతం విద్యార్థులకు అకడమిక్ సపోర్టును అందిస్తున్నాయని ఎన్ఐఓఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. 1500 అధ్యయన కేంద్రాల ద్వారా నైపుణ్య ఆధారిత వృత్తి విద్యా కోర్సుల్లోనూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ అధ్యయన కేంద్రాల ద్వారా లైవ్ ఇంటరాక్టివ్ తరగతులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 2.18 లక్షల అసైన్మెంట్లను అభ్యాసకులు అప్లోడ్ చేశారని తెలిపింది. ఇటీవల పూర్తయిన అకడమిక్ సెషన్లో 4.46 లక్షల అసైన్మెంట్లు, ట్యూటర్ మార్క్ అసైన్మెంట్(టీఎంఏ) అప్లోడ్ అయ్యాయి. సబ్జెక్ట్ నిపుణులచే మూల్యాంకనం చేసిన టీఎంఏ మార్కులు అభ్యాసకులకు వారి డాష్బోర్డ్లో కనిపిస్తాయని ఎన్ఐఓఎస్ వివరించింది. (క్లిక్: సిసోడియా అరెస్ట్ అయితే మరీ మంచిదన్న కేజ్రీవాల్) -
మాడుగుల నాగఫణి శర్మ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
-
Andhra Pradesh: శుభకరమైన పాలన
జాన్ రాల్స్టన్ సౌల్ అన్న సామాజిక శాస్త్ర నిపుణుడు తన ‘ద కొలాప్స్ ఆఫ్ గ్లోబలిజం’ పుస్తకంలో ఉదాత్త నాయకులు భగవత్ సంకల్పంగా, ప్రకృతి నియమాను సారంగా ఆవిర్భవిస్తారని పేర్కొంటాడు. నాడు ఆరోగ్యం, ఆహారం, ఆవాసం, ఆచారం, అభ్యాసం, ఆర్జనం, ఆదర్శ దాంపత్యం, ఆదాయం అనే అష్టలక్ష్మిలకు తోడు ఆనంద మనే నవరత్నములను తొడిగిన గృహస్థాశ్రమ ధర్మాన్ని శ్రీరాముడు మానవ జాతికి అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా నాగరికత వికాస క్రమానికి ఇది దోహదపడిందని పాశ్చాత్య శాస్త్రవేత్తలు సైతం దీన్ని ఆమోదిస్తున్నారు. వివేకానందుడు, గాంధీ మహాత్ముడి నుండి నేటి పాలకుల వరకు రామరాజ్యం ఒక సుందర స్వప్నం. ఆ దారిలోనే కుటుంబ సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆకలికి మత విలువలు తెలియవంటాడు వివేకానందుడు. నాడు కలకత్తా ప్లేగు సమయంలో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాదిమందిని కాపాడాడు. ఆ ధీరుని స్ఫూర్తితో గాంధీ మహాత్ముడు వాలంటరీ వ్యవస్థతో సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వ హించాడు. నేడు అదే స్ఫూర్తితో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ వాలంటరీ వ్యవస్థ లక్షలాది మంది కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఆరోగ్య పరిరక్షణ రామరాజ్యంలో మౌలిక ధర్మం. అయోధ్యా రాజ్యంలో పెద్దలెవరూ తమ పిల్లలకు అంత్యక్రియలు జరిపిన దాఖలాలు లేవు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ లక్ష్య మిది. దానిని మరింత ముందుకు తీసుకొనిపోయి, ప్రపంచంలోని ఆరోగ్య రంగా నికి ఒక దిక్శూచిగా ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం పనిచేయడం వాస్తవం. వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా సంరక్షణ, ఆక్సిజన్ సరఫరాల లాంటి అత్యున్నత వైద్య ప్రమాణాలను పాటించిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ వైద్యా లయాలను దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వమిది. ఖరీదైన వైద్యసేవలు కూడా ఈ మహమ్మారి సమయంలో ప్రజలకు ఉచితంగా అందుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఇంగ్లండ్, యూరప్ సమాజాలు, అమెరికా లాంటి ధనిక దేశాలు ఆరోగ్య సంస్కరణలు లేకుండా కకావిక లమయ్యాయి. బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లేయర్ లాంటి గొప్ప నాయకుడు కూడా ఆరోగ్య సంస్కరణలో అనుకున్నంత సాధించలేకపోయానని తన జీవితచరిత్రలో అంతర్మథనం పొందాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య రాజ్యంలాగా తండ్రి చేపట్టిన ఆరోగ్య సంస్కరణలకు నిజరూపాన్ని ఇవ్వడం నేడు సత్య ప్రామాణికం. సగటు మనిషి జీవన ప్రమాణాలకు కారణమైన ఆరోగ్యం, ఆహారం, ఆవాసాలను సుస్థిరం చేస్తూనే, అభ్యాసంలో భాగంగా విద్యను సంతృప్తిగా భోదించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం రామరాజ్యంలో భాగమే. సాంకేతిక విప్లవంతో కుగ్రామమైన ఈ ధరణిలో నాడు–నేడు పేరుతో పదిహేను వేల పాఠశాలలను సంస్కరించడం చరిత్ర మరువదగని అంశం. నాటి గురుకులాల వలె జగనన్న గోరుముద్దలతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ముందుచూపు రాజ్య ధర్మంలోని విశిష్టత. అధికార యంత్రాంగాన్ని సమాయత్తపరచి అల్పమైన విషయాలను కూడా వదలకుండా అత్యంత లాభం చేకూర్చేవాడే నిజమైన పాలకుడని శ్రీరాముడు ఉపదేశించాడు. అధర్మ వేషంలో ధర్మ పన్నాగాలు పన్నేవారి పట్ల అప్రమత్తతతో వుండాలనీ, జనులకు నిజం తెలియాలనీ భరతునికి రాముడు ఉపదేశిస్తాడు. ప్రజలకు సత్యాన్ని విడమరచి చెప్పేందుకు ధార్మిక సంస్థలను ప్రభు త్వానికి చేరువ చెయ్యాలి. నాడు రాజకీయాలకు అతీతంగా సమాజ సేవను మత సారంగా తెలియ జెప్పిన వివేకానందుడు మనకు ఆదర్శం కావాలి. ప్రభుత్వాన్ని బూచిగా చూపించి ప్రజలలో గందరగోళం సృష్టించడం అనైతికం. అతలాకుతలమవుతున్న మానవ జాతిలో ఆంధ్రజాతి సమున్నతంగా జీవించాలంటే జనే జనే, గృహే గృహే, గ్రామే గ్రామే, పురే పురే అంటూ ఆబాలగోపాల హృదయం సామాజిక చైతన్యంతో తొణికిసలాడాలి. మన రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి ప్రతి ఇంట గుడి గంటలు మ్రోగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంఘీభావం తెలపాలి. - ఎస్. వెంకట శర్మ వ్యాసకర్త ముఖ్య సమన్వయ అధికారి, ధార్మిక సంస్థలు, తిరుమల తిరుపతి దేవస్థానములు -
మొదట శర్మ, తర్వాత పూజ, ఇప్పుడు రేఖ..
ముంబై లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్లో రోజూ రాకపోకలు సాగించే వారికి నత్య పరిచయస్తురాలైన ట్రాన్స్ఉమన్ పూజాశర్మ రేఖ దగ్గర ‘శుభములనివ్వుమమ్మ’ అంటూ దేశ విదేశాల్లోని వారు కూడా నేరుగానో, వీడియో కాల్లోనో దీవెనలు అందుకుంటూ ఉంటారు. నటి రేఖ పోలికలు, కవళికలు ఉంటాయని అంతా అంటుండే పూజ ఎక్కడివారు? మొదట శర్మ, తర్వాత పూజ, ఇప్పుడు రేఖ.. ఎలా అయ్యారు? మొదట మీరు చీరకట్టులో సినీనటి రేఖ ఎలా ఉంటారో ఊహకు తెచ్చుకోండి. ఒక్క కట్టే కాదు.. రేఖ బొట్టు, రేఖ ధరించే ఆభరణాలు, రేఖ నవ్వు, ఆ మాట తీరు, ఆ హుందాతనం అన్నీ కలిపి సృష్టికి పరిపూర్ణతలా ఎలాగైతే ఉంటాయో సరిగ్గా అలాగే ఉంటారు పూజాశర్మ. రేఖను తీసి రేఖను పెట్టినట్లుగా!! ఇంతకీ ఈ పూజ ఎవరంటే.. ముంబైలో ఉదయం పూట పట్టాల మీదకు వచ్చే లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్ సెలబ్రిటీ. సోషల్ మీడియాలో లక్షా యాభై వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న ‘ఇన్ఫ్లుయెన్సర్’. ఇంత నిండైన మనిషిలోని మిగతా ప్రత్యేకతలన్నీ తెలుసుకున్నాక మాత్రమే ఆమె ట్రాన్స్ ఉమన్ అని చెప్పుకుండే చెప్పుకోవచ్చు పూజ ట్రైన్ డాన్స్ లోకల్ ట్రైన్లో పూజ డాన్స్ చేస్తారు. చక్కటి మాటల్తో మోటివేట్ చేస్తారు. అసలు ఆమెను చూడగానే నమస్కరించేవారు, నమస్కరించాలని అనిపిస్తుంది అనేవారు కూడా ఉన్నారు. ఆఫీసు వేళల కోసం నడిచే ఉమెన్ స్పెషల్ ట్రైన్ వెళ్లిపోయాక.. ప్లాట్ఫామ్ మీద పూజ ఒక్కరే నిలబడిపోతారు. ఆ తర్వాత ఆమె పండ్లే అమ్ముతారో, స్త్రీల లోదుస్తులు విక్రయించే దుకాణాలకు కాపలాదారుగా ఉంటారో, బంగారు ఆభరణాల షాపులో సహాయకారిలా ఉంటారో లేక వస్త్ర ఉత్పత్తుల కర్మాగారం ఆఫీస్ ప్యూన్గా వెళతారో, అపార్ట్మెంట్లకు ఇస్త్రీ బట్టలనే బట్వాడా చేస్తారో.. అది ఆమెకు దొరికిన పనిని బట్టి ఉంటుంది. ఆమె అనుదిన జీవనయానం ప్రారంభం అయ్యేది మాత్రం మహిళల లోకల్ ట్రెయిన్ ఫస్ట్ ట్రిప్లోనే. అది ఆమెకు మనోల్లాసాన్ని మాత్రమే కాదు, గుర్తింపునూ ఇస్తుంది. యాచన ఉండదు. ఇస్తే వద్దనీ అనరు. ఇచ్చేవారు గౌరవం కొద్దీ ఇస్తే, వారి గౌరవం కొద్దీ వద్దనకుండా తీసుకుంటారు పూజ. ‘రేఖలా ఉన్నావు’ అని అందరూ అంటుంటే తనూ రేఖలా రూపాంతరం చెందుతూ వచ్చిన పూజ ముంబై అమ్మాయి కాదు. కలకత్తా నుంచి ముంబై వచ్చిన అమ్మాయి. అమ్మాయి కూడా కాదు. అబ్బాయి. ఆ అబ్బాయి పేరే శర్మ. ఇప్పుడు ముంబైలో చేస్తున్న పనులనే ఆమె కలకత్తా లోనూ చేసేవారు. పురుషుడి దేహాన్ని కలిగి ఉన్న తన స్త్రీ మనసును గేలి చేయడం తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి ముంబై వచ్చారు. ముంబై ఆమెను ఆదరించింది. పూజ అందమైన స్వభావం వల్ల, ముంబైకి గ్లామర్ సెన్స్ ఎక్కువ కనుకా బహుశా ఆమెకు ఆదరణ లభించి ఉండాలి. అసలైతే ఆమె డాన్సర్ కాదు. ముంబై లో అంతా తన రూపలావణ్యాలను చూసి రేఖ అనడంతో, రేఖ అవడం కోసం ఆమె డాన్స్ ప్రాక్టీస్ చేశారు. వచ్చే కాస్త డబ్బుతోనే మోడర్న్ డ్రెస్లు వేసుకున్నారు. మంచి చీరలను కొనుక్కున్నారు. ముంబైలోని ఒక జాతీయ దినపత్రిక జర్నలిస్టు.. ఇంటర్వ్యూ కు ఆమెను ఒప్పించేందుకు ఆమెతో మాటలు కలుపుతూ ఉన్నప్పుడు అతడితోపాటు వచ్చిన ఫొటోగ్రాఫర్ ఆమెకు తెలియకుండా ఫొటో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె గురించిన వివరాలను ఇవ్వడంతో ఒక్కరోజులో పూజ సెలబ్రిటీ అయ్యారు. చాలాకాలం కిందటి సంగతి అది. మార్చి 8 న మహిళా దినోత్సవం రోజు ‘రేఖ’ అనే పేరున ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు వేల ప్రశంసలు వచ్చాయి. ముంబై ఆమెను పూర్తి మహిళగా స్వీకరించింది. రేఖలా పూజా! తర్వాతి నుంచీ పూజే తన వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. బిడ్డల్ని ఎత్తుకుని వచ్చి ఆమె ఆశీస్సులను కోరుతున్న తల్లులు, ప్రారంభోత్సవాలకు ఆమెను ఆహ్వానిస్తున్న వ్యాపారాల యజమానులు, పరీక్షలకు వెళ్లే ముందు బ్లెస్ చేయమని వచ్చి అడిగే విద్యార్థులు, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు.. వీళ్లంతా ఉన్న వీడియోలను చూసి విదేశాల నుంచి కూడా ఆమె దీవెనల కోసం అభ్యర్థనలు రావడం మొదలైంది! ఆ సమయంలో కనుక పూజ ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటే.. తన సెల్ఫోన్లోనే వారిని, వారిని పిల్లల్ని దీవించినట్లుగా వారి తలపై చెయ్యి ఉంచుతారు. మరి ఆమెను దేవుడు గానీ, మరెవరు గానీ దీవించలేకపోయారా! ‘‘మనుషులంతా మంచివాళ్లు. దేవుడు శక్తిమంతుడు. ఆ మంచితనం, ఆ శక్తి నన్ను నడిపిస్తున్నాయి. దేనికీ లోటు లేకుండా జీవిస్తున్నాను’’ అంటారు. పేరుకు మాత్రమే ఆమె పూజ కాదు. నిత్యం దైవారాధన చేస్తారు. ఆ తర్వాత ఆమె పొందే శక్తితో ఆమె ప్రయాణించే రైలు నడుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది! మనసు లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఒత్తిళ్లతో ప్రయాణిస్తుండే మహిళల్ని ఆ కొద్దిసేపూ పూజ పలకరింపు, పూజ అభినయం సేద తీరుస్తాయి. ‘అసలు ఆమెను చూడగానే మనసుకు ఎక్కడ లేని సత్తువ వచ్చేస్తుంది’ అనేవారూ ఉన్నారు. పూజ పోస్ట్ చేసిన ఒక వీడియోను చూసి.. ‘‘పూజా.. నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. బాహ్యంగా, అంతర్లీనంగా కూడా’’ అని ప్రముఖ టీవీ నటి అంకితా లొఖాండే ఇటీవల కామెంట్ పెట్టడం పూజను ఎంతగానో సంతోషపరచిందట. ‘నువ్వు బాగున్నావు’. ‘నువ్వు చేసిన పని బాగుంది’ అనే మాటలు బతుకులోని చేదును తగ్గిస్తాయని పూజ అంటారు. ఆమె బాల్యం ఒక చేదు జ్ఞాపకం. ఆమె వర్తమానం ఆ చేదును మరిపిస్తున్న తియ్యదనం. ఇక్కడ చదవండి: పాలు పోయడానికి వచ్చా.. ఓట్లివ్వండి తన కల కోసం కూలీగా మారింది! -
40 ఏళ్లుగా రంగస్థలంపై ఆయనే రారాజు
వేషం వేస్తే అదుర్స్...నాయక, ప్రతినాయక పాత్రలకు ఆయనకు ఆయనే సాటి. ఆ నటనలో నవరస ప్రవాహాలు పరవళ్లు తొక్కుతాయి. సుస్పష్ట వాచకం, అనర్గళ సంభాషణా చాతుర్యం కలబోసిన శబ్దాలయం ఆయన సుస్వరం. చిన్నప్పటి నుంచి సాంఘిక, పౌరాణిక, నాటక రంగం అంటే ఎంతో ఆసక్తిని పెంచుకున్న ఆయన...50 రకాల వేషధారణలతో ఆ పాత్రలకు జీవం పోశారు. ధీర గంభీర రూపం, సవినయ భావ భంగిమలు, ఇత్యాది నట లక్షణాలతో ప్రేక్షకులను ఆనందరస తరంగ డోలికలలో ఓలలాడిస్తారు. ఆయనే ప్రముఖ రంగస్థల కళాకారుడు డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంత్శర్మ. వృత్తిరీత్యా నాచారంలోని భారత ఎలక్ట్రానిక్స్లో ఉద్యోగిగా పని చేస్తూనే మరోవైపు నటనను ప్రవృత్తిగా మలచుకుని ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. గత 40 ఏళ్లుగా రంగస్థలంపై ప్రదర్శనలు ఇస్తూ నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాణిస్తూ ఎందరో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సనత్నగర్: డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంతశర్మ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని వల్లభాపురం. రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయుక్త, రచయిత అయిన పొలమరశెట్టి ఫ్రాన్సిస్ స్ఫూర్తితో ఆయన రంగస్థలం వేదిక వైపు అడుగులు వేశారు. ఆయన శిష్యునిగా ఓనమాలు దిద్ది ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. నాటకరంగంపై ఆనాడు ఏర్పడ్డ అభిలాష ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి ఎందరో మహామహుల ప్రశంసలను అందుకున్నారు. కృషి, పట్టుదల, విషయ పరిజ్ఞానం, తన శారీర సౌష్టవానికి ఏ పాత్ర సరిపోతుందో ఆ పాత్రను ఎన్నుకోవడం, సంగీత దర్శకుని సలహా తూ.చ తప్పకుండా పాటిస్తూ క్రమశిక్షణతో నటిస్తున్నారు డాక్టర్ పిల్లుట్ల. నాటక రంగంలో తాను నేర్చుకున్న అనుభవాన్ని జోడిస్తూ నిరంతరం సాధన సంపత్తులతో పలు పద్య, సాంఘిక, పౌరాణిక, జానపద, టీవీ సీరియల్స్, సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ నాటక రంగంలో ఆయన సేవలను గుర్తించి బెంగుళూరులో డాక్టరేట్ ప్రదానం చేసింది. 500 ప్రదర్శనలు... 50 పాత్రలు డాక్టర్ పిల్లుట్ల ఏ వేషం వేస్తే ఆ పాత్రకు జీవం పోసినట్లేనని ప్రేక్షకులు చెప్పేమాట. తన నటనా కౌశలంతో ప్రేక్షకులను రంజింపజేయడమే కాదు..ఆ పాత్ర హుందాతనానికి తగ్గట్టుగా హావభావాలు పలికించడంలో మేటిగా ఎదిగారు. ఇప్పటివరకు సుమారు 500 ప్రదర్శనల్లో 50 రకాల వేషాలు వేసి రంగస్థల ప్రేమికుల మదిని దోచుకున్నారు. రంగస్థలం మీదనే కాకుండా సినిమా, సీరియల్స్లోను తనకు అందివచ్చిన పాత్రలకు న్యాయం చేసి డైరెక్టర్, నిర్మాతల ప్రశంసలనూ అందుకున్నారు. ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ రచనలో కోకా విజయలక్ష్మి దర్శకత్వంలో ‘తెలుగు ప్రశస్తి’ విశిష్ట సంగీత నృత్యరూపకంలో శ్రీకృష్ణదేవరాయులు, గౌతమిపుత్ర శాతకర్ణిగా ద్విపాత్రాభినయం చేసి రక్తి కట్టించారు. ‘పాండవోద్యోగ విజయం’ నాటకంలో ధుర్యోధనుడు, బలరాముడు, కర్ణుడు, దుశ్శాసనుడి పాత్రలు, శ్రీవెంకటేశ్వర మహత్త్యంలో భృగమహర్షి, ఆకాశరాజుల పాత్రలు, సత్య హరిశ్చంద్ర నాటకం (కాటిసీన్)లో హరిశ్చంద్రుడి పాత్రల్లో ఒదిగిపోయారు. అదేవిధంగా బోయి భీమన్న రచనలో వచ్చిన ధర్మవ్యాధుడు నాటకంలో మహర్షిగా,ప్రసన్నయాదవంలో నరకాసురుడిగా, రుక్మిణీ కళ్యాణంలో శిశుపాలుడుగా, కాళహస్తీశ్వర సాయుజ్యంలో కిరాతుడు, శివుడి పాత్రలను, పార్వతీదేవి ఇల్లు కట్టిందిలో రావణాసురుడుగా, హిమవన్నగ దర్శనంలో చిత్రభానుడుగా, ఆంధ్ర కళా వైభవంలో తానీషాగా పాత్రధారణ చేసి ఔరా అన్పించారు. ఇవే కాకుండా వివిధ నాటకాలు, సినిమాల్లో భీముడు, విశ్వామిత్రుడు, శార్ధూరుడు, యమధర్మరాజు, బడే సాహెబ్ పాత్రలు వేశారు. ♦ నాటకాలు, సినిమాల పాత్రలే కాకుండా జానపద కళగా పేరొందిన బుర్రకథలో సైతం తన ప్రతిభను చాటుతున్నారు పిల్లుట్ల. పల్నాటి యుద్ధం, కొము రంభీం వంటి చారిత్రాక గాథలను బుర్రకథ కళా రూపంలో తీసుకువచ్చి నేటి తరానికి సందేశం అందించారు. ♦ నేటి తరానికి పద్యం అంటే తెలియని పరిస్థితి. ఆ పద్యం విలువను డాక్టర్ పిల్లుట్ల తెలియజేస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఎంతటి పెద్ద పద్యమైనా అనర్గళంగా తనదైన శైలిలో ప్రదర్శించి శ్రోతల మదిని దోచుకుంటున్నారు. కొత్త తరానికి వారధి వేస్తున్నా... పూర్వకాలంలో ఒక నాటకం వేస్తే ఎంతో అంకితభావంతో ప్రదర్శించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోయింది. పాతతరానికి, కొత్త తరానికి మధ్య వారధిగా నిలుస్తూ ఇప్పటి తరానికి నాటక రంగం గురించి తెలియజేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ప్రభుత్వం కూడా నాటక రంగానికి ప్రాధాన్యతనిచ్చి కళాకారులను ప్రోత్సహిస్తే బాగుంటుంది.– డాక్టర్ పిల్లుట్లలక్ష్మీకాంతశర్మ -
కామెడీ గ్యాంగ్స్టర్
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు హీరో సుమంత్. ఒక్కో సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్న ఈయన తాజాగా ఓ సినిమాకి పచ్చజెండా ఊపారు. 2018లో మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన ‘పాదయోట్టం’ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఇందులో సుమంత్ హీరోగా నటించనుండగా విను యజ్ఞ దర్శకత్వం వహించనున్నారు. ఈస్ట్ ఇండియా టాకీస్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై తమ్మినేని జనార్థన రావు, శర్మ చుక్క ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతో ఐమా అనే కొత్త హీరోయిన్ పరిచయం కానున్నారు. ‘‘గ్యాంగ్స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షి. రాజ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: బాలాజీ శ్రీను. -
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ను దివాలా తియ్యనివ్వం
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ను కుప్పకూలనివ్వబోమని, సంస్థను నిలబెట్టేందుకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) చైర్మన్ వీకే శర్మ చెప్పారు. అవసరమైతే సంస్థలో వాటాలు మరింత పెంచుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్లో ఎల్ఐసీకి నాలుగో వంతు వాటా ఉంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్లో భాగమైన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ... వాణిజ్య పత్రాల రుణాల చెల్లింపు డిఫాల్ట్ కావడంతో ఎన్బీఎఫ్సీల ఆర్థిక పరిస్థితులపై ఇన్వెస్టర్లలో ఆందోళన తలెత్తడం, ఆ ప్రభావంతో స్టాక్ మార్కెట్ భారీగా పతనం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శర్మ తాజా వ్యాఖ్యలు చేశారు. ‘ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ దివాలా తియ్యకుండా అన్ని చర్యలూ తీసుకుంటాం. ఈ సంక్షోభం మరింతగా విస్తరించకుండా చూస్తాం. సంస్థలో వాటాలు పెంచుకోవడం సహా అన్ని అవకాశాలూ పరిశీలనలో ఉన్నాయి‘ అని ఆయన చెప్పారు. దేశంలోనే అత్యంత పొడవైన టనెల్ (జమ్మూ కాశ్మీర్లో చెనాని–నాష్రి) నిర్మించిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ప్రస్తుతం రూ. 91,000 కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతోంది. ఐఈఐఎస్ఎల్ డౌన్గ్రేడ్.. తీవ్ర సంక్షోభంలో ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలను రేటింగ్ ఏజెన్సీలు డౌన్గ్రేడ్ చేయడం కొనసాగుతోంది. తాజాగా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ (ఐఈఐఎస్ఎల్) దీర్ఘకాలిక ఇష్యూయర్ రేటింగ్ను ఇండియా రేటింగ్స్ సంస్థ డౌన్గ్రేడ్ చేసింది. అలాగే సంస్థ జారీ చేసే వివిధ డెట్ సాధనాలను కూడా ’బీబీ’ గ్రేడ్కు తగ్గించింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు.. ఐఈఐఎస్ఎల్ కొత్తగా ఈక్విటీ.. డెట్ సమీకరించుకునే అంశానికి సంబంధించి ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ రుణాల్లో కొంత భాగాన్ని చెల్లించేందుకు ఐఈఐఎస్ఎల్ ప్రస్తుతం రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 238 కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్న తరుణంలో ఈ డౌన్గ్రేడ్ ప్రాధాన్యం సంతరించుకుంది. రుణాల డిఫాల్ట్ నేపథ్యంలో మరో రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్లోని పలు కంపెనీల రేటింగ్స్ను డౌన్గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. షేర్లు రయ్.. సంస్థను నిలబెట్టేందుకు అన్ని విధాలుగా తోడ్పాటునిస్తామంటూ ఎల్ఐసీ హామీ ఇచ్చిన దరిమిలా మంగళవారం ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ 12 శాతం, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్ 5.74 శాతం పెరిగాయి. అయితే, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ మాత్రం స్వల్పంగా 0.13 శాతం క్షీణించింది. -
నాని సినిమాలు చూసి తెలుగు నేర్చుకున్నా
‘‘పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన తర్వాత మోడలింగ్ చేశా. కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా చేశా. ఇన్స్టాగ్రామ్లో నా ఫొటోలు చూసిన నిర్మాతలు ‘చి.ల.సౌ’లో హీరోయిన్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. నేను అప్పటి వరకూ చేసిన యాడ్స్ చూపించాను. ఆడిషన్స్ చేసి, నన్ను ఎంపిక చేశారు’’ అని కథానాయిక రుహానీ శర్మ అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి, తెరకెక్కించిన చిత్రం ‘చి.ల.సౌ’. సిరునీ సినీ కార్పొరేషన్ పతాకంపై జశ్వంత్ నడిపల్లి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రుహానీ శర్మ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటరై్టనర్గా తెరకెక్కిన చిత్రమిది. చాలా సంప్రదాయబద్ధంగా, స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా నా పాత్ర ఉంటుంది. యాక్టింగ్కి చాలా స్కోప్ ఉంది. నాకు తెలుగు రాకపోవడంతో మొదట్లో కష్టంగా అనిపించింది. తెలుగు నేర్చుకోవటానికి హార్డ్ వర్క్ చేశా. తెలుగు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవటానికి హీరో నాని సినిమాలు చూశా. ప్రస్తుతం నా తెలుగు చాలా బెటర్ అయిందనుకుంటున్నా. సుశాంత్తో నటించడం సౌకర్యంగా ఉండేది. షూటింగ్ సమయంలో తను ఇచ్చిన సపోర్ట్ మరవలేనిది. మా నుంచి సరైన నటన రాబట్టుకోవడానికి రాహుల్ రవీంద్రన్ హార్డ్ వర్క్ చేశారు. పైగా రాహుల్ నటుడు కావడం వల్ల ఆయన సలహాలు మాకు ఉపయోగపడ్డాయి’’ అన్నారు. -
ఆదివాసీ బాంధవుడు బి.డి. శర్మ
ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం తపనపడ్డ బ్రహ్మదేవ్ శర్మ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో 1930 సంవత్సరంలో జన్మించారు. గణితశాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీ (పిహెచ్ డి) పొందారు. 1952–53 సంవత్సరంలోనె సివిల్ సర్వీసులో చేరారు. అయన ఉన్నత కుటుం బంలో జన్మించి కూడా హజ్రత్ నిజమోద్దిన్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక మురికివాడలో నివసించారు. ఆయన ఉంటున్న చిన్న గది గది నిండా పుస్తకాలు తప్ప ఇక ఏ సౌకర్యాలూ లేవంటే నమ్మశాక్యం కాదు. తలుపులు తాళాలు లేని ఇల్లు ఎవరిదంటే ఆయనదే అని చెప్పవచ్చు. ఒక జాతీయ ఎలక్రానిక్ చానెల్ మహిళా రిపోర్టర్ ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సందర్బంలో, బి.డి శర్మ జీవించే పద్ధతి చూసి చలించిపోయి ఏడవడం మొదలుపెట్టింది. ఈరోజుల్లో ఒక చిన్న పదవి ఉందంటే చాలు.. విలాసవంతమైన జీవితాలు గడిపే రోజులివి. మరి ఈయన అంత సంపన్నుడైనప్పటికీ కూడా ఇంతటి సాదాసీదా జీవితం గడుపుతున్నాడంటే ఎంతటి నిరాడంబరుడో, మాన్య మహనీయుడో అర్థమవుతున్నది. భారత రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949 రాజ్యాంగ సభ ఆమోదించడంతో భారత ప్రజలకు స్వాతంత్రం, రాజ్యాంగ పరమైన హక్కులు లభించాయని అందరూ భావించారు. కానీ ఆ రోజే ఈ దేశంలోని సమస్త ఆదివాసులు తమ స్వేచ్చను, తమ సహజమైన హక్కులను కోల్పోయారని కరాఖండిగా అన్ని వేదికల మీద గొంతెత్తిన పోరాటాయోదుడు బి.డి.శర్మ. దేశ వ్యాప్తంగా 5వ, 6వ షెడ్యుల్డ్ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసులకు ‘‘మా ఉళ్లో మా రాజ్యం’’ నినాదం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన అమూల్యమైన, విలువైన కానుక. శక్తిమంతమైన రక్షక కవచాల లాంటి 1917, 1919, 1935 భారత ఆదివాసీ చట్టాలను అవగాహన పరిచి 170 చట్టం ,పిసా1996, ఎల్టిఆర్ 1959, ఎస్సి, ఎస్టి నిరోధకచట్టం 1998 ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్, ఐటీడీఏల ఏర్పాటు ప్రక్రియలో ఒక రూపకర్తగా, ఒక ప్రముఖుడిగా శర్మ నిలిచిపోయారు. దీన్ని బట్టే ఆదివాసీలకు ఆయనకు ఉన్న సంబంధం ఏపాటిదో అర్థమౌతుంది. చివరికి ఆదివాసీలఫై ప్రభుత్వం వైఖరికి నిరసనగా తన ఐఏఎస్ ఉద్యోగానికే రాజీనామా చేసిన గొప్ప త్యాగధనుడు. చివరి క్షణం వరకూ ఆదివాసీల ప్రయోజనాల కోసమే జీవించారు. ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని ఒక ఉన్నత అధికారిగా ఉంటూ వ్యతిరేకించిన ధైర్యశాలి. అలాంటి మహా నుభావుడిని ఆదివాసులు ఏ విధంగా మరచిపోగలరు? ‘‘జీవితం ఒక తరం పాటే ఉంటుంది /మంచి పేరు చిరకాలం ఉంటుంది’’ అన్నట్లుగా ఆదివాసీలు బి.డి. శర్మను చిరకాలం గుర్తుంచుకోగలుగుతారు. ఆదివాసీ హక్కులు, చట్టాలు ఏ రోజైతే పరిపూర్ణంగా అమలవుతాయో అదే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి! (నేడు డా. బి.డి. శర్మ 2వ వర్ధంతి సందర్భంగా) - పెనుక ప్రభాకర్, ఆదివాసీ రచయితల సంఘం, తెలంగాణ ‘ మొబైల్ 94942 83038 -
సచిన్తో కలిసి ‘సచిన్’ను...
అతని స్ఫూర్తిగా క్రికెట్లోకి అడుగు పెట్టినవారు... అతనితో కలిసి ఆడినవారు... ఆత్మీయులు, సన్నిహితులు... ఇలా సచిన్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రముఖులతో బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్ కళకళలాడింది. భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీకి బయల్దేరే ముందు సచిన్ తన బయోపిక్ ‘సచిన్–ఎ బిలియన్ డ్రీమ్స్’ను ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. తమకు పెద్దన్నలాంటి క్రికెట్ దేవుడి సినిమాను జట్టు మొత్తం ఉత్సాహంగా తిలకించింది. -
దొంగతనం నాటకంతో అడ్డంగా దొరికిపోయాడు..
హైదరాబాద్: ఓ వ్యక్తి తన వద్దు ఉన్న నగదును ఎవరో దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేసి...అడ్డంగా బుక్కైయ్యాడు. నాచారంలోని ఆకాశ్స్టీల్స్లో శర్మ అనే వ్యక్తి సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతడు సోమవారం నేరేడ్మెట్లోని కొనుగోలు దారుల నుంచి సుమారు రూ.3.50 లక్షల నగదును వసూలు చేసుకున్నాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు డబ్బును ఎత్తుకుపోయారని, శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో శర్మను విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది. తానే ఆ సొమ్మును దాచినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.3.50 లక్షల డబ్బును రాబట్టి, నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
'నయీం బాధితులు పోలీసులను ఆశ్రయించొచ్చు'
గ్యాంగ్స్టర్ నయీం బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఏ రాజకీయ పార్టీ నేతల పేర్లు వెల్లడి కాలేదని.. అవసరాన్ని బట్టి సిట్ బృందంలో మరికొంత మంది అధికారులను చేర్చుకోవచ్చని ఆయన తెలిపారు. నయీం బాధితులు సిట్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చన్నారు. బాధితులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 94406 27218 -
ఆర్టీఐ పత్రాలను ఫోర్జరీ చేశాడు!
న్యూఢిల్లీ: ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించినట్లు చెప్తూ.. ఆయుష్ మంత్రిత్వశాఖ ముస్లింలకు ఉద్యోగాలను ఇవ్వలేదని చెప్పిన జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. తాను ఆ విషయాన్ని ఆర్టీఐ నుంచి మాత్రమే తీసుకున్నట్లు శర్మ వివరించారు. గత ఏడాది మార్చినెలలో16 నుంచి 31 తేదిల మధ్య సమయంలో మిల్లీ గెజిట్ లో ఈ విషయాన్ని ప్రచురించారు. ఈ విషయంపై శర్మను విచారించిన కోట్లా ముబారక్పూర్ పోలీసుల దేశాన్ని, ఢిల్లీని వదలి వెళ్లకూడదనే కండీషన్ తో శర్మను విడిచిపెట్టారు. పోలీసులు మిల్లీ గెజిట్ మ్యాగజైన్ ఎడిటర్ డా.జర్ఫారుల్ ఇస్లాం ఖాన్ ను ఈ కేసులో సాక్షిగా పేర్కొన్నారు. -
పుష్కరాల్లో ఇదేమి వీఐపీ సంస్కృతి
కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మండిపాటు విశాఖపట్నం: గోదావరి పుష్కరాల్లో వీఐపీ సంస్కృతిపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మండిపడ్డారు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు స్వయంగా నిర్వహిస్తున్న ఈ పుష్కరాల తతంగంపై తాను ఎంతో ఆవేదన చెందుతున్నానన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. పుష్కర భక్తుల కష్టాలపై సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు కాస్తయినా శ్రద్ధ చూపి ఉంటే 29 మంది ప్రాణాలు పోయేవి కావన్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినా కూడా తమ కుటుంబ సభ్యులు, వందిమాగదులతో వీఐపీలు రాజమండ్రికి వస్తూనే ఉన్నారని విమర్శించారు. వారి వల్ల భక్తులకు ఇబ్బందితో పాటు ప్రభుత్వ ఖజానాపై కూడా పెనుభారం పడుతుందని వివరించారు. -
కాలిపోయిన విద్యానవనం
అంత కర్కశంగా.. మరింత రక్కసంగా మూర్ఖుల్లా.. ముష్కరుల్లా అతి కిరాతకంగా ప్రవర్తించారే.. వారికి మనసు లేదా చిన్నారులన్న కనికరం లేదా.. ఎందుకింతగా బరితెగించారు ఎందరు తల్లుల ఉసురు పోసుకున్నారు.. పాషాణం సైతం కరుగుతుందంటారే బండబారిన గుండెలేమో వారివి! విచక్షణ మరిచి.. సిగ్గు విడిచి పిల్లల్ని పిట్టల్లా కాల్చిపడేశారే ఎంత ఘోరం.. ఎంత దారుణం! విద్యానవనంలో నిండుగా విరబూసి గుబాళించాల్సిన పసిమొగ్గలు నిర్దాక్షిణ్యంగా కాలిపోయాయి.. హే భగవాన్.. ఎటుపోతోందీ విశ్వం! - శర్మ సీహెచ్ విజయవాడ (పెషావర్లో తాలిబన్ దమనకాండ చూశాక) -
క్షీణిస్తున్న డెరైక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత నాలుగేళ్లుగా దేశీయ డెరైక్ట్ సెల్లింగ్ మార్కెట్ వ్యాపార వృద్ధి క్రమేపీ క్షీణిస్తోంది. 2010-11లో 27 శాతం వృద్ధి ఉంటే అది 2013-14కి 4.3 శాతానికి పడిపోయింది. 2012-13లో రూ. 7,164 కోట్లుగా ఉన్న వ్యాపార పరిమాణం గతేడాది స్వల్ప వృద్ధితో రూ. 7,472 కోట్లకు పరిమితమయ్యింది. డెరైక్ట్ సెల్లింగ్కు సంబంధించి నియంత్రణ వ్యవస్థపై సరైన స్పష్టత లేకపోవడమే వృద్ధిరేటు తగ్గడానికి ప్రధాన కారణంగా ఇండియన్ డెరైక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్ఏ) పేర్కొంది. దేశీయ డెరైక్ట్ సెల్లింగ్ మార్కెట్పై పీహెచ్డీ చాంబర్ నిర్వహించిన సర్వే వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐడీఎస్ఏ సెక్రటరీ జనరల్ చావి హేమంత్ మాట్లాడుతూ ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో 13 శాతం క్షీణత నమోదయ్యిందన్నారు. ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్ల్లో పోలీస్ వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, దీంతో ఈ రాష్ట్రాల ప్రజలు వ్యాపారంపై అంతగా ఆసక్తి చూపించడం లేదన్నారు. దీంతో 2013తో ఆరో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఎనిమిదో స్థానానికి పడిపోయిందన్నారు.ఈ ఏడాది వ్యాపార పరిమాణం రూ. 10,000 కోట్లకు చేరుతుందని తొలుత అంచనా వేసినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీహెచ్డీ చాంబర్ చీఫ్ ఎకనామిస్ట్ ఎస్.పి శర్మ మాట్లాడుతూ 2020 నాటికీ ఈ వ్యాపారం రూ. 23, 742 కోట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. మారిన పరిస్థితుల్లో గత అంచనా లక్ష్యం రూ. 34,000 కోట్లను తగ్గించినట్లు తెలిపారు. -
ఏజెన్సీలో గిరిజన పార్టీయే ఉండాలి
విశాఖపట్నం : గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ పార్టీయే ఉండాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. గిరిజనులు పార్టీల వారీగా చీలిపోయూరని, ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలే దారికొస్తాయని గిరిజనులకు సూచించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోరుతూ జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూ రు, గూడెం కొత్తవీధి, పాడేరు, అనంతగిరి ప్రాంతాల నుంచి గిరిజనులు గురువారం విశాఖకు తరలివచ్చారు. రైల్వే స్టేషన్ నుంచి సౌత్ జైల్రోడ్డు మీదుగా జీవీఎంసీ గాంధీ పార్కు వరకు ప్రదర్శనగా వచ్చి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షనుద్దేశించి శర్మ మాట్లాడుతూ శాంతియుతంగా చేసే ఏ ఉద్యమానికైనా బలం చేకూరుతుందని, ప్రతి వారు గాంధీ మార్గంలో నడవాలని గిరిజనులకు సూచించారు. అడవుల విషయంలో ఆదివాసీలకు చారిత్రక అన్యాయం జరుగుతుందని సాక్షాత్తు భారత పార్లమెంట్ అంగీకరించిందన్నారు. అన్యాయూన్ని సరిచేసేందుకు అటవీ హక్కుల చట్టాన్ని 2006లో తెచ్చారని,చట్టం అమలు విశాఖ ఏజెన్సీలో ఘెరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ కార్యదర్శి జి.బాలు, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ పి.ఎస్.అజయ్కుమార్ మాట్లాడుతూ సాంప్రదాయ కుంచాలతో సరుకులు కొనుగోలు చేయడాన్ని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నేరంగా ప్రకటించాలని కోరారు. తూనికలు, కొలతల చట్టాన్ని అమలు పరిచే అధికారాలు గ్రామ సభలకు ఇవ్వాలని, వడ్డీ వ్యాపారం చేసేవారు నగదు రూపంలో తప్ప ఆదివాసీలు పండించిన పంటలు తీసుకోవడాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు ఇచ్చిన సాధారణ రేషన్కార్డులను అంత్యోదయ అన్న యోజన కార్డులుగా మార్చాలని కోరారు. -
అమ్మకానికి ఆడబిడ్డలు
పిల్లలను విక్రయించే ముఠా గుట్టు రట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం మహిళను ప్రశ్నిస్తున్న ఐసీడీఎస్ అధికారులు దూలపల్లి: సూరారం కాలనీలో చంటి పిల్లలను విక్రయించే ముఠా గుట్టు రట్టయింది. ఓ బిడ్డను విక్రయించేందుకు యత్నిస్తుండగా ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు వలపన్ని ముఠాను పట్టుకున్నారు. చంటిబిడ్డను శిశువిహార్కు తరలించారు. వివరాలివీ... తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రత్నకుమారి, శర్మ దంపతులు రెండు నెలల క్రితం నగరానికి వ చ్చారు. సూరారం కాలనీలోని రాజిరెడ్డి నగర్లోగల అంగన్వాడీ-05 సెంటర్ వద్ద అద్దె ఇంట్లో ఉంటున్నారు. స్థానిక అంగన్వాడీ కార్యకర్తను రత్నకుమారి పరిచయం చేసుకుని తాను 8 నెలల గర్భిణినని, తన పేరు జాబితాలో రాసుకోవాలని పదే పదే కోరింది. డాక్టర్ పరీక్ష చేసిన తరువాతనే నమోదు చేస్తామని అంగన్వాడీ కార్యకర్త ఆమెకు తేల్చి చెప్పింది. మరో వారం తరువాత రత్నకుమారి 45 రోజుల చంటిబిడ్డతో కనిపించింది. అంగన్వాడీ కార్యకర్త ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పింది. ఈ విషయాన్ని ఐసీడీఎస్ అధికారి జ్యోతి పద్మ దృష్టికి ఆమె తీసుకెళ్లింది. దీంతో ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు రత్నకుమారిని రెండు రోజుల క్రితం నిలదీయగా..సరైన సమాధానం రాలేదు. దీంతో వారు పాపను స్వాధీనం చేసుకొని, శిశు విహార్కు తరలించారు. మరో సంఘటన ఇలా.. ఆనంద్నగర్కు చెందిన అమీనాబేగం కూతురు ఆషాబేగంకు ఐడీపీఎల్కు చెందిన సలీంతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లుగా సలీం వేరే మహిళతో ఉంటున్నాడు. ఆషాబేగం ఒక్కతే ఉంటోంది. ఈనెల 8న ఆషాబేగంకు పాప పుట్టింది. గర్భవతులు, చిన్నారుల వివరాలు సేకరించే క్రమంలో ఓ అంగన్వాడీ కార్యకర్త.. ఆషాబేగం వద్ద చిన్నారి లేకపోవడం చూసి ప్రశ్నించింది. ఇక్కడా పొంతన లేని సమాధానం వచ్చింది. అనుమానం వచ్చిన కార్యకర్త తమ అధికారి అధికారి జ్యోతి పద్మ దృష్టికి తీసుకువెళ్లింది. ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు విచారించగా... జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్పకు చెందిన తపస్వి, విష్ణు సర్కార్లకు పాపను రూ.25 వేలకు విక్రయించినట్టు ఆషా చెప్పింది. దీంతో పాపను కొనుగోలు చేసిన వారిని రప్పించారు. వారు జీడిమెట్ల పీఎస్కు వచ్చి, పాపను తిరిగి ఇచ్చేది లేదని మొండికేశారు. ఈ ఘటనపై దుండిగల్ పీఎస్లో కేసు నమోదైంది. అక్కడే సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి పోలీసులు వారిని పంపించారు. అధికారుల దర్యాప్తులో సూరారం కాలనీలో ఉంటున్న రత్నకుమారి కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో ఆనంద్నగర్లోని ఆషా బేగం ఇంటికి వస్తున్నట్టు తేలింది. రెండు నెలలకోసారి ఇల్లు మార్చడం.. ఇప్పటికే ఓ చంటిబిడ్డతో పట్టుబడినే నేపథ్యంలో ఐసీడీఎస్ అధికారులు ఆమెపై అనుమానంతో కూపీ లాగుతున్నారు. -
పచ్మఢి పరవశింపజేసే ప్రకృతి ఒడి
పాఠక పర్యటన మన దేశంలో మధ్యప్రదేశ్లోని ఏకైక హిల్స్టేషన్ పచ్మఢి. అత్యంత మహిమాన్వితమైన గుప్త్మహాదేవ్, జటాశంకర్ వంటి శివాలయాలు, సాత్పూర జాతీయ పార్కు, టైగర్ రిజర్వ్ ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ఇన్ని ఆకర్షణలుగల ఈ ప్రాంతాన్ని ఇటీవల సందర్శించాం. మా కుటుంబ సభ్యులు, లేక్వ్యూ గెస్ట్హౌస్ అదనపు డెరైక్టర్ పెనుమూడి బీవీ శర్మ కుటుంబసభ్యులు కలసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాత్రి 10.45 నిమిషాలకు దక్షిణ్ ఎక్స్ప్రెస్ ఎక్కాం. మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 లకు మధ్యప్రదేశ్లోని ఇటార్సీ జంక్షన్కు చేరుకున్నాం. బస్సులో పచ్మఢి చేరుకునేందుకు తగిన వెసులుబాటు లేకపోవడంతో కారు అద్దెకు మాట్లాడుకుని వెళ్లి, ఆ రాత్రి ఉడ్లాండ్ రిసార్ట్స్లో విశ్రమించాం. పాండవ గుహలు మరుసటి రోజు ఇరు కుటుంబాలవారం పాండవ గుహల సందర్శనకు వెళ్లాం. చారిత్రక కథనం ప్రకారం... పాండవు లు అజ్ఞాతవాసంలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు చెబుతారు. అయితే, ఇది ఒక బౌద్ధ ఆరామమని భారతీయ పురావస్తు శాఖ పేర్కొంటోంది. ఈ కొండపై శిథిలావస్థ కు చేరుకున్న అత్యంత ప్రాచీన ఇటుకరాయి నిర్మాణం, కొండపై భాగం నుంచి కిందకు చూస్తే అక్కడ ఉన్న ఉద్యానవనం ఎంతో సుందరంగా గోచరిస్తాయి. జలపాతాల జడివాన ఆ తర్వాత వెండి జలపాతం వద్దకు వెళ్లాం. దీన్ని దూరం నుంచే చూడాలి. అక్కడి నుంచి బయలుదేరి అప్సర విహార్ అనే మరో జలపాతాన్ని సందర్శించాం. ఇది పచ్మఢి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఈత కొట్టేందుకు, డైవింగ్ చేసేందుకు ఎంతో అనువుగా ఉంది. దీనిని గతంలో ‘ఫెయిరీ పూల్’ అని పిలిచేవారు. ఇక్కడకు సమీపంలోనే పాంచాలి, బీ ఫాల్స్ జలపాతాలున్నాయి. 150 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారే బీ ఫాల్స్ జలపాతం పాల ధారలా కనువిందు చేస్తుంది. ఈ జలపాతం నుంచే పచ్మఢి పట్టణానికి తాగునీరు సరఫరా అవుతుంది. గుహలో శివలింగం రెండో రోజు ఉదయం పిపరియా పట్టణానికి వెళ్లే మార్గంలో జటా శంకర్ ఆలయాన్ని సందర్శించాం. ఈ ఆలయానికి వెళ్లే దారిలో ఒక కొండ మీద నంది, మరో కొండమీద మర్కటం, ఏనుగు తొండం, సింహం ముఖం ఆకృతులు.. కనిపించాయి. ఇవన్నీ సహజసిద్ధంగా ఏర్పడినవే. కొంతదూరం వెళ్లిన తర్వాత మెట్ల దారిలో ఒక గుహ ఉంది. లోపల సహజసిద్ధంగా ఆవిర్భవించిన శివలింగం మాకు దర్శనమిచ్చింది. అనంతరం నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న హ్యాండిఖో ప్రాంతానికి చేరుకున్నాం. ఇది దాదాపు 350 అడుగుల లోతు కలిగిన లోయ. ఈ పర్వత శ్రేణులనే సాత్పూర అని పిలుస్తారు. మేనును తాకే మేఘాలు ఆ తర్వాత రోజు మహాదేవ్ ఆల య సందర్శనకు వెళ్లాం. ఇక్కడి కొండరాళ్లు వర్షాకాలంలో నీటిని పీల్చుకుని ఎండాకాలం విడిచిపెడతాయట. అనంతరం కాలినడకన గుప్త్మహాదేవ్ ఆలయానికి చేరుకున్నాం. ఇక్కడ ఉన్న సన్నని గుహ ద్వారా ఒకరి తరువాత ఒకరం వెళ్లాం. ఆ తరువాత సైట్ సీయింగ్లో భాగంగా రాజేంద్రగిరి పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నాం. ఆ సమయంలో అటుగా వచ్చిన నీలి మేఘాలు మమ్మల్ని తాకుతూ ముందుకు సాగాయి. మేఘాలు మేనును తాకడం తొలిసారి కావడంతో మా ఆనందానికి హద్దుల్లేవు. ఇక చివరి రోజు పర్యటనలో భాగంగా రీచ్గఢ్ చేరుకున్నాం. ఇక్కడి గుహలకు మూడువైపుల నుంచి ప్రవేశద్వారాలు ఉన్నాయి. ఆ తరువాత ఆసన్ దశ్య ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడి ప్రకృతి అందాలు పరవశింప చేశాయి. ఇక్కడి నుంచి చూస్తే ఎత్తయిన పర్వత శిఖరాలు, అత్యంత లోతైన లోయలు దర్శనమిస్తాయి. దీనికి సమీపంలో గల అంబామాయి ఆలయంలో మాతను సర్వశక్తి స్వరూపిణిగా కొలుస్తారు. ఇది అత్యంత ప్రాచీన దేవాలయం. దీని పక్కనే ముస్లింలు నిర్మించిన బేగం ప్యాలెస్ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. దూరం నుంచి చూడాల్సిందే తప్ప దగ్గరికి వెళ్లేందుకు అవకాశం లేదు. ఈ ప్యాలెస్ దర్శనంతో మా పర్యటన ముగిసింది. చివరిరోజు రాత్రి ఇటార్సీకి చేరుకుని యశ్వంత్పూర్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో మరుసటిరోజు సికింద్రాబాద్ చేరుకున్నాం. ఈ యాత్ర మొత్తానికి మా ఇరు కుటుంబాలకు కలిపి దాదాపు 30 వేల రూపాయల ఖర్చు అయ్యింది. - కొల్లూరి సత్యనారాయణ, ఇంకొల్లు, ప్రకాశం జిల్లా -
ఇంజినీరు - ఇంగ్లిషు పంచాంగం
తిథి వార నక్షత్రాలు... రాశి ఫలాలు... ముహూర్తాలు... రాహు కాలాలు... వర్జ్యాలు... యమగండాలు... తెలుగు, సంస్కృత భాషల అక్షరాలకు అంకెలు జత చేరడం... ఇదీ స్థూలంగా పంచాంగం... మరి ఇందులో తెలుగు, సంస్కృతాల స్థానంలో ఆంగ్ల అక్షరాలు ప్రవేశిస్తే ఎలా ఉంటుంది..? ఈ ఆలోచనే ఆంగ్ల పంచాంగ రూపకల్పనకు నాంది పలికింది. దీనిని రూపొందించినది ఇంజనీరింగ్ చదివిన యువకుడు కావడం విశేషం... భారతీయ సంప్రదాయ, శాస్త్రీయ విద్యా విషయ విజ్ఞానం పట్ల విదేశీయులకు అవగాహన కలిగించాలనే లక్ష్యంతో 25వ ఏటనే ఆంగ్ల పంచాంగాన్ని రూపొందించడం ప్రారం భించారు శర్మ. సంస్కారానికి పర్యాయ పదాలైన మంచిచెడులను నిర్థారించే పంచాంగాన్ని విశ్వమంతటికీ అర్థ మయ్యేలా తయారుచేసి ‘ఔరా’ అనిపించుకున్నారు రాజమండ్రికి చెందిన ఈ 28 ఏళ్ల యువ ఇంజనీర్ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. ఈ ఆలోచన వెనుక... భద్రాచలంలో బీటెక్ పూర్తిచేసిన శర్మ, ఎంటెక్ చేసేందుకు 2007లో డెహ్రాడూన్ పెట్రోలియం యూని వర్శిటీలో ఆయిల్ అండ్ గ్యాస్, పైప్లైనింగ్ కోర్సు పూర్తి చేశారు. చదువుకుంటూనే, వీలు చిక్కినప్పుడల్లా, దేశ సంస్కృతిని అధ్యయనం చేసేందుకు యాత్రలు చేశారు. అలా బదరీనాథ్, కేదారనాథ్లను సందర్శించినప్పుడు ఏదో మధురానుభూతిని పొందారు. సరిగా ఆ సమయం లోనే పలువురు విదేశీయులతో పరిచయం ఏర్పడింది. ‘‘నేను కలిసిన ఎందరో విదేశీయులు... మన పంచాగం, ముహూర్తాలు, వాస్తు ఇవన్నీ మూఢ నమ్మకాలంటూ చులకనగా మాట్లాడారు. వారి మాటలకు నా మనసు బాధపడింది. మన దేశ గొప్పదనం గురించి వాళ్లకు ఏదో ఒక విధంగా తెలియచెప్పాలనుకున్నాను. అందుకు నేను ఎంచుకున్న మార్గం పంచాంగం. అందరికీ చేరువ కావాలంటే పంచాంగం ఆంగ్లంలో ఉండాలని భావించి, ఆ భాషలో రచనకు పూనుకున్నాను’’ అంటూ తన ఆలోచన వెనుక ఉన్న విషయాన్ని వివరించారు శర్మ. ప్రారంభంలో... 2008లో ఆంగ్లంలో పంచాంగ రచనకు పూనుకొన్న ప్పుడు శర్మ ఎందరో పెద్దల నుంచి విమర్శలు ఎదుర్కొ న్నారు. పంచాంగం అనేది చాలా మంది రాస్తున్నారు కదా! ‘అందులో నుంచి కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయడమే కదా!’ అని చులకనగానూ మాట్లాడారు. అయినప్పటికీ పట్టువదలని దీక్షతో తన రచన కొనసాగించి, 2011 నాటికి పంచాంగాన్ని పూర్తి చేశారు. ‘‘నన్ను ఎందరో విమర్శిస్తున్న తరుణంలో నా తల్లి భానుమతి, (ర్యాలి ప్రభుత్వ పాఠశాలలో సంస్కృతం టీచర్), భార్య పూర్ణిమ (బీటెక్ కంప్యూటర్స్) మా అత్తగారు కృష్ణప్రియ ముగ్గురూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారి వల్లే నేను పంచాంగం నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాను. మా అమ్మగారి ఆశీస్సులతో... నేను ఆరాధించే శ్రీరాముని సన్నిధి భద్రాచలంలో ఈ పంచాంగాన్ని ఆవిష్కరించాను. నాటి నుంచి ఏటేటా ఆంగ్ల పంచాంగాన్ని విడుదల చేస్తూ వస్తున్నాను. ప్రతి సంవత్సరం కొత్త అంశాలు జోడిస్తున్నాను. తాజా పంచాంగంలో సామాన్యులు సైతం వారికి వారు ముహూర్తాలు ఎలా పెట్టుకోవచ్చో తెలుసు కునేలా విపులీకరించాను. ఇంకా గోచారరీత్యా ఎవరు ఏ దేవుని ప్రార్థించాలో సూచించడమే కాకుండా, చేయాల్సిన ప్రార్థన వివరాలు కూడా పొందుపరిచాను’’ అని తన పంచాంగం గురించి వివరించారు శర్మ. యువత కోసం... నేటి యువత మన సంస్కృతి సంప్రదాయాలను మరచి పోతోంది. వారికి వాటి గురించి చెప్పాలను కున్నాను. ఆంగ్లం అయితే యువత తొందరగా చదువు తారు కనుక, వారికోసం సరళమైన భాషలో పంచాంగాన్ని రాయాలనుకున్నాను. ‘‘కొన్ని సంస్కృత పదాలకు ఆంగ్ల పదాలు ఉండవు. అలా లేని పదాలను, కొన్ని సంస్కృత శ్లోకాలను యథాతథంగా ఉంచేశాను. అవసరమైన చోట సైంటిఫిక్గా కూడా చెప్పాను’’ అని చెబుతున్న శర్మ, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా వాస్తు విషయాంశాలపై ఆంగ్లంలో ఒక పుస్తకాన్ని అచ్చు వేసేందుకు సిద్ధమవుతున్నారు. భద్రాచలం తిరుమల పీఠం ద్వారా ‘జ్యోతిష మార్తాండ’ పురస్కారాన్ని అందు కున్నారు ఈ యువ ఇంజినీరు. శర్మ రూపొందించిన ఆంగ్ల పంచాంగం తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం విశేషం. - డి.సూర్యనారాయణమూర్తి, సాక్షి, రాజమండ్రి ఫొటో: టి.కె.ధనంజయ, సాక్షి, బెంగళూరు సంస్కృత నేపథ్యం... భద్రాచలంలో బీటెక్ చదువుతున్న రోజుల్లో అక్కడే సంస్కృతం చదువుకున్నాను. సిద్ధాంత భాగంలో విద్యాభూషణ్ చేశాను. ప్రస్తుతం ‘వాస్తు ఫర్ కామన్ మ్యాన్’ అని పుస్తకం రాస్తున్నాను. మా గురువులు శ్రీమన్నారాయణాచార్యుల దగ్గర వాస్తు, పంచాంగం తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేశాను. పంచాంగ రచనకు అవసరమైన సలహాలు తీసుకున్నాను. అలాగే వచ్చే సంవత్సరం ప్రచురించనున్న ఆంగ్ల పంచాంగంలో మరిన్ని కొత్త అంశాలను చేర్చే ఆలోచనలో ఉన్నాను. ఆన్లైన్లో ఆంగ్ల పంచాంగం కోసం http:// chilakamarthi.com/(చిలకమర్తి.కామ్) వెబ్సైట్ను సందర్శించవచ్చు. - చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -
‘ముంపు’లో ఆంధ్ర పాలనకు రెడీ..!
భద్రాచలం: ముంపు మండలాలను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో లాంఛనాన్ని పూర్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్కు బదలాయించిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో సెప్టెంబర్ 1 నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే పాలన సాగేలా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. దీనిలో భాగంగానే ‘తూర్పుగోదావరి జిల్లా రాజపత్రం’ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో రంపచోడవరం ఆర్డీవో కార్యాలయం నుంచి ప్రత్యేక దూత గురువారం చింతూరు, కూనవరం, వీఆర్ పురం, భద్రాచ లం ఎంపీడీవో, తహశీల్దారులకు నేరుగా ఇచ్చారు. ‘విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకునే విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రజలు నేరుగా లేదా లేఖల ద్వారా తెలియజేయవచ్చు’ అని కూడా అందులో ఉంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా రాజపత్రాన్ని అక్కడి కలెక్టర్ నుంచి కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలకు అందాయి.ఉత్తర్వులు వెలువడిన 30 రోజుల్లోగా ప్రజలు తమ సలహాలను, అభ్యంతరాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని రాజపత్రంలో ఉంది. మండల కార్యాలయాలు నెల్లిపాకకు తరలింపు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా అధికారుల నుంచి భద్రాచలం డివిజన్లోని ముంపు మండలాలకు పలుమార్లు వివిధ అంశాలపై లేఖలు పంపిచారు. అవి చింతూరు, వీఆర్పురం, కూనవరం మండల అధికారులకు మాత్రమే అందాయి. తూర్పుగోదారి జిల్లా రాజపత్రం పేరిట ఉన్న ఉత్తర్వులు భద్రాచలం మండల అధికారులకు కూడా అందజేశారు. భద్రాచలం రెవెన్యూ గ్రామం మాత్రమే తెలంగాణకు మినహాయించి, మిగతా మండలంతా ఆంధ్రప్రదేశ్కు బదలాయించి, నెల్లిపాక మండల కేంద్రంగా ప్రకటించారు. భద్రాచలం రెవెన్యూ గ్రామంలోని కార్యాలయ భవనాలు ఇక్కడనే ఉంటాయని, వీటిలో పనిచేస్తున్న ఉద్యోగులంతా నెల్లిపాక కేంద్రంగా విధులు నిర్వహించాల్సుంటుందని తూర్పు గోదావరి జిల్లా అధికారులు చెబుతున్నారు. దీనినిబట్టి ఎంపీడీవో, తహశీల్దార్, ఇతర సిబ్బంది నెల్లిపాకకు వెళ్లాల్సిందేనా..? అనే చర్చ సాగుతోంది. దీనిలో భాగంగానే భద్రాచలం మండల అధికారులకు కూడా ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం. గ్రామసభలకు ముందుకెళ్లేదెలా..? తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి తరచూ ముంపు మండల అధికారులకు ఉత్తర్వులు అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భాగంగా, ఖమ్మం కలెక్టర్ అజమాయిషీలో పనిచేస్తున్న తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవాలని ఇక్కడి అధికారులు బహిరంగానే ప్రశ్నిస్తున్నారు. ముంపు మండలాల ఎంపీపీ ఎన్నికల విషయంలో ఇలానే వ్యవహరించగా, ఎన్నికల కమిషన్ నుంచి అక్షింతలు వేయించుకోవాల్సి వచ్చింది. తాజాగా, ముంపు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలంటూ అక్కడి తూ.గో. జిల్లా పరిషత్ సీఈవో ఆదేశించారు. ఈ నెల 19న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక సర్వేకు ఇక్కడి అధికారులు సిద్ధమవుతుఆన్నరు. ఇలా, రెండు ప్రభుత్వాల నుంచి వస్తున్న ఆదేశాలతో ముంపు మండలాల్లోని అధికారులు ,ఉద్యోగులు ఇరకాటంలో పడుతున్నారు. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణపై గ్రామసభలకు ఎలా వెళ్లేదని వారు అయోమయంలో ఉన్నారు. -
ప్రొ కబడ్డీ లీగ్కు క్రీడా శాఖ ఆమోదం!
బెంగళూరు: ఐపీఎల్ తరహాలో ప్రారంభంకానున్న ప్రొ కబడ్డీ లీగ్కు కేంద్ర క్రీడాశాఖ లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఈనెల 26 నుంచి ముంబైలో జరగనున్న ఈ లీగ్లో ఎనిమిది ఫ్రాంచైజీల జట్లు బరిలోకి దిగనున్నాయి. ‘వారసత్వ క్రీడగా వస్తున్న కబడ్డీపై దృష్టిపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రీడకు మార్గదర్శకత్వం చేయనున్న మషాల్ స్పోర్ట్స్ కృషి ప్రశంసనీయం. క్రీడాకారుల్లో సామర్థ్యం, బలం, నైపుణ్యం, వ్యూహం, సమష్టి కృషిని పెంపొందించేందుకు ఈ ఆట దోహదం చేస్తుంది. కాబట్టి భారత యువతను ఈ క్రీడ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం’ అని క్రీడా శాఖ సెక్రటరీ అజిత్ ఎమ్. శరణ్... ప్రొ కబడ్డీ లీగ్ను రూపొందించిన మషాల్ స్పోర్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ చారు శర్మకు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
ఆప్ నిధులపై వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అక్రమంగా విదేశాల నుంచి నిధులు సేకరించిందని వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లోపు జవాబు చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్నేతృత్వంలోని బెంచ్ కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ప్రవాస భారతీయుల నుంచి ఇప్పటికీ నిధులు పొందుతున్న ఆప్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలంటూ ఈ పిల్ దాఖలు చేసిన ఎంఎల్ శర్మ చేసిన విజ్ఞప్తిని బెంచ్ తోసిపుచ్చింది. వేరే బెంచ్లు ఇది వరకే పలుసార్లు ఈ కేసుపై విచారణ నిర్వహించినందున, దీనిని కొత్త బెంచ్కు అప్పగించడం సరికాదని పిటిషనర్ వాదించారు. దీనిపై అహ్మద్ స్పందిస్తూ రోస్టర్ పద్ధతిలో ఈ కేసు తమకు వచ్చిందని, న్యాయవాదులకు కేసు విచారణపై నియంత్రణ ఉండబోదని స్పష్టం చేశారు.ఈ కేసులో ఆప్ అగ్రనేత కేజ్రీవాల్, ఈ పార్టీ నాయకుడు శాంతిభూషణ్, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్కు నోటీసులు జారీ కాలేదు కాబట్టి వాళ్ల నుంచి వివరణ కోరలేమన్నారు. కేసు విచారణ మే ఏడుకు వాయిదా పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఆర్ఐల నుంచి విరాళాలు సేకరించలేదని, పూర్తి పారదర్శకంగా వ్యవహరించామని ఇది వరకే ఆప్ కోర్టుకు వివరణ ఇచ్చింది. -
హౌరా-మైసూర్ ప్రత్యేక రైలు నుంచి పొగలు
తుని, న్యూస్లైన్: హౌరా నుంచి మైసూర్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలులో శనివారం ఉదయం పొగలు వచ్చాయి. విశాఖ జిల్లా గుల్లిపాడు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత బీ-1 ఏసీ బోగీ అడుగుభాగం నుంచి పొగలు రావడాన్ని పాయకరావుపేట 451 రైల్వే గేట్మన్ రమణ గమనించి తుని స్టేషన్ సూపరింటెండెంట్ శర్మకు సమాచారమిచ్చారు. దాంతో రైలును తుని స్టేషన్లో నిలిపివేసి అగ్నిమాపక పరికరాలతో బోగీ అడుగున స్ప్రే చేశారు. ఏసీ మెషీన్లకు విద్యుత్ సరఫరా చేసే డైనమో బెల్టు పట్టివేయడం వల్ల పొగలు వచ్చాయి. దీనివల్ల విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలురైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఫలక్నుమాలో కూడా.. నందిగాం/పలాస: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలులో కూడా శనివారం మంటలు రేగాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం సాయంత్రం 6.55 గంటలకు రైలు బయలుదేరింది. పూండి సమీపంలోకి వచ్చేసరికి ఎస్-5, 6 బోగీల కింది భాగంలో మంటలు వచ్చాయి. విషయం తెలుసుకున్న డ్రైవర్ రైలును రౌతుపురంలో నిలిపివేశారు. బ్రేకులు పట్టేయడంవల్ల మంటలు రేగినట్లు తేలింది. మరమ్మతుల అనంతరం రైలు బయల్దేరింది.