soudi arabia
-
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారతీయులు దుర్మరణం
రియాద్ : సౌదీ అరేబియాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు దుర్మణం పాలయ్యారు. ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రమాదంపై స్థానిక అధికారులతో మాట్లాడుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. Grieved to learn of this accident and the loss of lives. Spoke with our Consul General in Jeddah, who is in touch with the concerned families. He is extending fullest support in this tragic situation. https://t.co/MHmntScjOT— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 29, 2025ప్రమాదంపై జిజాన్లో భారత రాయభార కార్యాలయం మృతులకు సంతాపం తెలిపింది. ప్రమాద బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని, స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపింది. ప్రమాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. జెడ్డాలోని రాయబార కార్యాలయంతో తాను మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నామన్న జైశంకర్ ఈ విషాద పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. -
అరేబియా అద్భుతం
చాలామంది దుబాయికి వెళ్తారు. కానీ దాని పొరుగునే ఉండే అబూ ధాబీని ఎక్కువమంది పట్టించుకోరు. దుబాయిని న్యూయార్క్తోనూ, అబూ ధాబీని ప్యారిస్తోనూ పోల్చవచ్చు. రాజసం ఉట్టిపడే బంగళాలు, విశాలమైన రహదారులు, సజావుగా సాగిపోయే ట్రాఫిక్... ఒక్కమాటలో అబూ ధాబీకి వెళ్తే అరేబియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది!మీకు దుబాయి తెలుసుగా? బంధుమిత్రుల్లో చాలామంది వెళ్లి ఉంటారు కూడా. అయితే దుబాయి నుంచి ఓ గంటన్నర ప్రయాణం దూరంలో ఉండే ఎమిరేట్స్ రాజధాని అబూ ధాబీ గురించి మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. వెళ్లి ఉండరు కూడా. ఇవ్వాళ మీతో కొన్ని దేదీప్యమానమైన విషయాలను పంచుకుంటాను. పోయిన వారం నేను అక్కడికి వెళ్లాను. చూడముచ్చటగా ఉందని చెప్పాలి. చూసి వచ్చినందుకు మనసులో ఓ సంతృప్తి మిగిలిపోయింది. దుబాయి మాదిరి తళుకుబెళుకుల్లేవు. గ్లామర్, హడావిడి అంతకంటే లేవు!అబూ ధాబీలో ప్రపంచం పరుగులు పెట్టదు. నెమ్మదిగా ఓ నదిలా హొయలు పోతూ సాగుతూంటుంది. పోలిక కావాలంటే... దుబాయ్ని న్యూయార్క్తోనూ, అబూ ధాబీని ప్యారిస్తోనూ పోల్చవచ్చు. రాజసం ఉట్టి పడే బంగళాలు, విశాలమైన రహదారులు, సజావుగా సాగిపోయే ట్రాఫిక్... వీటన్నింటి మధ్య అక్కడక్కడా లెక్కలేనన్ని ఆడంబ రాలు, హోటళ్లు, రెస్టా రెంట్లు! ఇదీ అబూ ధాబీ వర్ణన!ఎమిరాతీ జనాలు తమ నగరాన్ని బాగా ఆస్వాదిస్తూంటారు. షాపింగ్, డైనింగ్ ఏదైనా కానీ దుబాయి కంటే బాగా ఎంజాయ్ చేస్తూంటారు. విదేశీయులు ఎక్కువగానే ఉన్నా... వారు దుబాయిలో మాదిరిగా స్థానికులను బెదరగొట్టేంత స్థాయిలో లేరనే చెప్పాలి. అబూ ధాబీలో ఉన్న సాంస్కృతిక అద్భుతాల గురించి చెప్పాలంటే ‘ది లూవ్’, ‘షేక్ జాయెద్ మ్యూజియం’లను ప్రస్తావించాలి. ఈ రెండు ఉదాహరణలు కచ్చితంగా ఇచ్చి తీరాల్సినవే. షేక్ జాయెద్ సంగ్రహాలయంలో నేనుకొన్ని గంటల సమయం గడిపాను. అందులో ఉన్న వస్తువులు మాత్రమే కాదు... ఎంతో అద్భుతమైన ఊహతో వాటిని ప్రదర్శించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. చరిత్ర గర్భంలో కలిసిపోయిన ఒక్కో కాలానికి ప్రతిరూపంగా ఈ సంగ్రహాలయ గదులను తీర్చిదిద్దారు. అలాగే చాలా తెలివిగా వేర్వేరు నాగరికతలకు సంబంధించిన వస్తువు లను ప్రదర్శించారు. ఫలితంగా వీటిని వేర్వేరు వస్తువు లుగా కాకుండా... ఒకే కాలంలో మానవ నాగరికతలు సాధించిన విజయాలను చూసినట్టుగా ఉంటుంది. చైనా నుంచి మెసపటోమియా వరకూ... అలాగే మెక్సికో నుంచి ఫ్రాన్స్ వరకూ వేర్వేరు నాగరికతలకు సంబంధించిన చారిత్రక అవశేషాలను ఇక్కడ భద్రపరిచారు. ఇంకోలా చెప్పాలంటే చోళుల కాలం నాటి విగ్రహాలు మొదలుకొని పర్షియన్ల కుండలు, బెల్జియం నేతపనుల నుంచి టర్కీ విగ్రహాలను ఒకే గదిలో చూడవచ్చు! ఏ శతాబ్దంలోనైనా మనిషి ఊహ ఎంత అద్భుతంగా ఉందో చెప్పే ప్రతీకాత్మ కత అన్నమాట!షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ను ఒక్క మాటలో వర్ణిస్తా. చాలా పెద్దది. చూడటం మొదలుపెడితే పూర్తయ్యేందుకు రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. కానీ ఇందులోని వైపరీత్యాలను మాత్రం కచ్చితంగా అధ్యయనం చేయా ల్సిందే. భూగర్భంలోని కారు పార్కింగ్ తరువాత స్టార్ బక్స్, కోస్టా కాఫీలతోపాటు చాక్లెట్లు, సుగంధ ద్రవ్యాల దుకాణాలున్న షాపింగ్ ప్రాంతానికి వెళతాం. ఆ తరువాత స్వచ్ఛమైన తెల్లటి పాలరాతి పరచుకున్న గోడలున్న భారీ హాల్లోకి ప్రవేశిస్తాం. హాల్లోని స్తంభాలపై అతి కౌశల మైన కళాకృతులు, అది కూడా విలువైన రంగురాళ్లు పొదిగి నవి ఉన్నాయి. పైకప్పు నుంచి జిలుగు వెలుగుల క్రిస్మస్ ట్రీల మాదిరిగా వేలాడే భారీ షాండ్లియర్లు... ఓహ్! అరే బియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది!అతిథులను మనసారా ఆహ్వానించే రెస్టారెంట్లు దుబాయిలో మాత్రమే ఉంటాయని అనుకునేవాడిని. అబూ ధాబీ కూడా ఈ విషయంలో ఏమీ తీసిపోదు. ఫోర్ సీజన్స్లోని బర్గర్లు, స్టీక్స్ కానివ్వండి... సెయింట్ రెజిస్ లోని భారతీయ వంటకాలైనా కానివ్వండి... ఫాక్వెట్లోని ఫ్రెంచ్ మాధుర్యాలు, సముద్ర తీరంలోని ‘తాషా’లో తీరికగా చేసే భోజనం కానివ్వండి... ఒక్కోటి పొట్టకు స్వర్గాన్ని రుచి చూపించేవే. కాకపోతే, ఇక్కడికొస్తే అప్పటి వరకూ లేని తిండిపోతుతనం మనల్ని చుట్టేయడం మాత్రం గ్యారెంటీ!నేను ఇప్పటివరకూ చాలా దేశాల్లోని హోటళ్లలో బస చేశాను కానీ... ‘ది ఎమిరేట్స్ ప్యాలెస్’ ముందు అవన్నీ దిగదుడుపే! భారత్లోని ‘లేక్ ప్యాలెస్’, ‘తాజ్మహల్’లు కూడా దీనిముందు గల్లీ హోటళ్లలా చిన్న బోతాయి. పచ్చటి పచ్చికబయళ్లున్న రూమ్ టెర్రస్లో కూర్చుని సముద్రాన్ని చూస్తూ కాఫీ తాగడం... డిసెంబరు చలిలో సూర్యకిరణాలు నులి వెచ్చగా తాకడం... కవిత్వం చెప్పుకునేంత అద్భుతమైన అను భూతి. మొబైల్ ఫోన్ లేకుండా కూడా కాలం ఎంచక్కా గడచి పోతుందనేందుకు ఈ అనుభూతి ఒక ఉదాహరణంటే ఒట్టు!ఇంకో ముఖ్యమైన సంగతి. తప్పక చెప్పాల్సింది కూడా! ఎమిరాతీ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. అందుకే ఇక్కడ అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతూంటుంది. ఒకవేళ పొరబాటున ఎవరైనా నిబంధనలు మీరారో... జరిమానాలు వీపు విమానం మోత మోగిస్తాయి. రెడ్ లైట్ దాటారంటే ఐదు వేల దిర్హమ్ల చమురు వదులుతుంది. వచ్చే ఏడాది నుంచి దీన్ని ఏకంగా యాభై వేల దిర్హమ్లకు పెంచుతున్నారు. డాలర్లలో చెప్పాలంటే 15 వేలు. రూపాయల్లోనైతే రూ. 12.73 లక్షలు! రోడ్లపై అడ్డదిడ్డంగా నడిచే మనిషిని గానీ, ఒక్క హారన్ మోతగానీ వినలేదంటే నమ్మండి!అబూ ధాబీ ఓ అద్భుత ప్రపంచం అనేంతగా దాన్ని వర్ణించానా? వాస్తవం ఏమిటంటే, దుబాయిలా కాకుండా... అబూ ధాబీ నిశ్శబ్దంగానే మీ అభిమానాన్ని చూరగొంటుంది. మీకు తెలియను కూడా తెలియదు. దుబాయిదంతా చెమ్కీల అంగీలే! కళ్లూ, చెవులు మదిపై చెడామడా దాడులు చేసే టైపు! దుబాయిని చూడంగానే ఆహా ఓహో అనిపిస్తే... పొరుగునే ఉండే అబూ ధాబీ మాత్రం నెమ్మదిగా మీ మనసుల్లోకి చేరి మత్తెక్కిస్తుంది. చిరకాలం ఒక జ్ఞాపకంలా నిలిచిపోతుంది. ఎప్పుడైనా అరబ్ దేశాల వైపు వెళ్లే పని పడిందనుకోండి... అబూ ధాబీని చూసి రావడం మరచి పోకండే! మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. అందుకే, నేనూ ఇంకోసారి అక్కడకు వెళ్లాలని ఇప్పటికే తీర్మానించుకున్నా!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
జర్మనీలో కారు బీభత్సం.. ప్రమాదంలో 68మందికి గాయాలు
బెర్లిన్ : జర్మనీలో ఓ డాక్టర్ బీభత్సం సృష్టించారు. మాగ్డేబర్గ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్లోకి తన బీఎండబ్ల్యూ కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 68 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి కారణమైన డాక్టర్ను అదుపులోకి తీసుకున్నట్లు జర్మన్ సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ (ముఖ్యమంత్రి)ప్యూర్ హాసెలాఫ్ తెలిపారు. సౌదీ అరేబియాకు చెందిన 50ఏళ్ల డాక్టర్ 2006నుంచి జర్మనీలో నివాసం ఉంటున్నారు. డాక్టర్గా సేవలందిస్తున్నట్లు చెప్పారు.ప్రమాదంపై స్థానిక ప్రభుత్వ ప్రతినిధి మథియాస్ షుప్పె మాట్లాడుతూ నిందితుడు ఉద్దేశపూర్వకంగా తన కారుతో మార్కెట్లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో నిందితుడు తన కారుతో ఎటునుంచి వచ్చాడో తెలియదు. మార్కెట్లోకి అత్యంత వేగంతో వచ్చాడు. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే కావాలనే చేసినట్లు అనిపిస్తుంది.ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 2016లో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. దీంతో తాజా ప్రమాదంపై సంఘ విద్రోహ చర్య అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.🚨 2 Dead, 60 Injured in German Christmas Market Attack 🚨A car plowed into a bustling Christmas market in Magdeburg, Germany, killing two people, including a toddler, and injuring over 60 others in what authorities are calling a deliberate act, potentially linked to terrorism.… pic.twitter.com/8o6zVv62Vu— CanAm Network (@Canam_Network) December 21, 2024 2016లో ఇదే తరహా దాడిఎనిమిదేళ్ల క్రితం జర్మన్ రాజధాని బెర్లిన్లో క్రిస్మస్ మార్కెట్పై దాడి జరిగింది. డిసెంబర్ 19, 2016న రద్దీగా క్రిస్మస్ మార్కెట్లో తన కారుతో ఓ ఇస్లామిక్ తీవ్రవాది ట్రక్కుతో దూసుకొచ్చాడు. ఈ దుర్ఘటనలో 13మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెండు రోజుల తర్వాత నిందితుణ్ని జర్మనీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. Police arresting the Attacker 50-year-old Saudi doctor in Magdeburg, Germany#Terroristattack #Germany #Magdeburg #Weihnachtsmarkt #MagdeburgAttack #MagdeburgerWeihnachtsmarkt #festundflauschig pic.twitter.com/JO1nuTLal5— Chembiyan (@ChembiyanM) December 20, 2024 -
అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారం
చమురు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న సౌదీ అరేబియాలో లిథియం నిక్షేపాలను గుర్తించారు. దీంతో లిథియం ప్రత్యక్ష మైనింగ్ను ప్రోత్సహించడానికి త్వరలోనే కమర్షియల్ పైలెట్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నట్లు సౌదీ అరేబియా మైనింగ్ వ్యవహారాల డిప్యూటీ మినిష్టర్ 'ఖలీద్ బిన్ సలేహ్ అల్ ముదైఫర్' వెల్లడించారు.ఇప్పటికే ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న సౌదీ అరేబియా.. లిథియం నిక్షేపాలు బయటపడంతో మరింత బలపడనుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ కంపెనీ 'సౌదీ అరామ్కో అకా అరమ్కో' (Saudi Aramco aka Aramco) లిథియంను వెలికి తీయనున్నట్లు.. దీనికోసం కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు సమాచారం.లిథియం నిక్షేపాలు బయటపడిన సందర్భంగా అల్ ముదైఫర్ మాట్లాడుతూ.. చమురు క్షేత్రాలు, ఉప్పునీటి ప్రవాహాల నుంచి లిథియం తీయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అయితే లిథియం ధరలు పెరిగితే కొత్త ప్రాజెక్ట్ త్వరలో వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉంటుందని అన్నారు.నిజానికి సౌదీ అరేబియా, దశాబ్దాలుగా చమురుపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు దీనికి లిథియం కూడా తోడైంది. చమురు మాత్రమే కాకుండా.. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను కనుగొనే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నాలలో భాగంగా ఈ నిక్షేపాలను గుర్తించారు.లిథియం ఉపయోగాలుఈ రోజు మనం రోజూ ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ బైకులు, కార్లు, సోలార్ పవర్ యూనిట్లు, ఎమర్జెన్సీ లైట్లు, బొమ్మలు వంటి ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లో లిథియం ఉపయోగిస్తారు. నేడు ప్రతి రంగంలోనూ లిథియం అవసరం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే దీనిని తెల్ల బంగారం అని పిలుస్తారు. -
నిజమే..! ఇది ముక్కుసూటి రహదారే..!! సుమారు..
ఎంతటి రాచమార్గానికైనా మలుపులు ఉంటాయి. అక్కడక్కడా వంకరలుంటాయి. ఎలాంటి వంకరలు లేకుండా ఏకధాటిగా ముక్కుసూటిగా సాగిపోయే రహదారి ఇది. ప్రపంచంలోని అతి పొడవాటి ముక్కుసూటి రహదారి ఇదే!.ఈ రహదారి సౌదీ అరేబియాలో ఉంది. ఏకంగా 240 కిలోమీటర్ల దూరం వరకు ఈ రహదారి ముక్కుసూటిగా సరళరేఖలా తిన్నగా ఉంటుంది. సౌదీ అరేబియా నైరుతి ప్రాంతంలోని అల్ దర్బ్ పట్టణం నుంచి తూర్పు ప్రాంతంలోని అల్ బతా పట్టణాన్ని కలుపుతూ ఉన్న ఈ 10వ నంబరు రహదారి మొత్తం పొడవు 1474 కిలోమీటర్లు. ఇది రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా సాగుతుంది.ఎడారి మీదుగా సాగే మార్గంలోనే దీనిని ఎలాంటి మలుపులు, వంకరలు లేకుండా 240 కిలోమీటర్ల పొడవున కేవలం సరళరేఖ మార్గంలో మాత్రమే కాదు, ఎలాంటి ఎగుడు దిగుడులు ఎత్తు పల్లాలు కూడా లేకుండా నిర్మించడం విశేషం.ఇవి చదవండి: పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? వింటే షాకే! -
సౌదీ జైల్లో భారతీయుడు.. విడుదలకు రూ.34 కోట్ల నిధుల సేకరణ
కోజికోడ్: ప్రపంచంలో ఏమూల ఉన్నాసరే విపత్కర సమయాల్లో కేరళ ప్రజలంతా ఒక్కటవుతుంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ఓ వ్యక్తి కోసం ఇప్పుడూ వాళ్లంతా ఏకం అయ్యారు. ఓ హత్య కేసులో మరణశిక్ష పడ్డ వ్యక్తి జైల్లో మగ్గుతున్న ఆ వ్యక్తిని కాపాడటానికి ఏకంగా రూ. 34 కోట్లు నిధుల సేకరణకు ముందుకొచ్చారు. కోజికోడ్కు చెందిన అబ్దుల్ రహీమ్.. 2006లో సౌదీలో ఓ బాలుడికి అబ్దుల్ రహీమ్ కేర్టేకర్గా చేరారు. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలుడు రహీమ్ సంరక్షణలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో అక్కడి న్యాయస్థానం రహీమ్కు మరణశిక్ష విధించింది. సుమారు 18 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో రహీమ్కు క్షమాభిక్ష ప్రసాదించడానికి బాధిత కుటుంబం తొలుత నిరాకరించింది. అయితే.. బ్లడ్మనీ (నష్ట పరిహారం రూపంలో) చెల్లిస్తే క్షమించేందుకు ఎట్టకేలకు ఒప్పుకుంది. బ్లడ్ మనీ కింద రూ.34కోట్లు చెల్లించాలని ఆ బాలుడి కుటుంబం షరతు విధించింది. అయితే రహీం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కదా!. ఈ క్రమంలో సౌదీలోని కేరళీయులు అంతా ఏకమై నిధలు సేకరించడానికి ఓ కమిటిగా ఏర్పడ్డారు. ముందుగా నిధులు సమీకణకు పెద్దగా స్పందన రాలేదు. కొన్ని రోజుల అనంతరం కేరళీయుల నుంచి భారీ విరాళాలు రావటం ప్రారంభమైందని నిధుల సేకరణ కమిటీ మీడియాకు వెల్లడించింది. రియాద్లోని సుమారు 75 సంస్థలు, కేరళకు వ్యాపారవేత్తలు, స్థానిక రాజకీయ సంస్థలు విరాళాలు అందిచినట్లు తెలుస్తోంది. విరాళాల్లో పారదర్శకత కోసం సదరు కమిటి ప్రత్యేక నిధులకు సేకరణకు యాప్ను కూడా తయారు చేసింది. ‘ఇంత పెద్ద భారీ నిధులు సేకరణ సాధ్యం అవుతుందని అస్సలు ఊహించలేదు. రూ. 34 కోట్లు సేకరిస్తామన్న నమ్మకం మొదట్లో లేదు. కానీ మెల్లగా విరాళాలు పెరగటంతో సాధ్యం అయింది’ అబ్దుల్ రహీం తల్లి సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే రహీమ్ జైలు నుంచి విడుదల కానున్నాడని అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
14న మరో అద్భుత ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ
సుమారు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యానగరిలోని భవ్యమైన ఆలయంలో రామ్లల్లా కొలువయ్యాడు. తాజాగా ఒక ముస్లిం దేశంలోని హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధం అయ్యింది. ఈ నెల ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్మితమయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 13న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ప్రవాస భారతీయులు పాల్గొనే ‘హలో మోదీ’ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14న యూఏఈ రాజధాని దుబాయ్లోని బీఏపీఎస్లో నిర్మితమైన హిందూ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రధాని మోదీ యూఏఈ పర్యటనపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ ‘హలో మోదీ’ కార్యక్రమానికి వేలాది మంది తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈలోని 150 భారతీయ కమ్యూనిటీ సొసైటీలు సంయుక్తంగా ‘హలో మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. యూఏఈలో మూడేళ్ల వ్యవధిలో ఈ ఆలయాన్ని రాజస్థాన్, గుజరాత్లకు చెందినవారు నిర్మించారు. ఫిబ్రవరి 13న షేక్ జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రవాస భారతీయుల సమావేశం నిర్వహించనున్నట్లు యూఏఈ రాయబారి తెలిపారు. 2020 నివేదిక ప్రకారం యూఏఈలో 35 లక్షలమంది ప్రవాస భారతీయులు ఉన్నారు. పురాతన, పాశ్చాత్య శిల్పకళల కలయికతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. -
రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
ఉక్రెయిన్తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకుంది. అయితే క్రమంగా యుద్ధ భయాలు తొలగిపోతుండడంతో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ ఖరీదుగా మారుతోంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్పై ఇస్తున్న డిస్కౌంట్ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్పై 3-4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని క్రూడ్ విక్రయిస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్పై బ్యారెల్కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయి. అదే ఆయిల్ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దాంతో రష్యా నుంచి వరుసగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సొకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని తెలుస్తుంది. భారత్లో టాప్ రిఫైనరీ సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్తోపాటు రష్యాలోని రోస్ నెఫ్ట్ ప్రాంతం నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. చెల్లింపు సమస్యను తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇదీ చదవండి: రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్డాడ్ పూర్డాడ్’ పుస్తక రచయిత.. చమురు దిగుమతి చేసుకున్నందుకు రష్యాకు రుబెల్స్, రూపీల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ చెల్లింపులకు చాలా విలువ ఉంటుంది. దాంతో కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు చమురుపై ఇస్తున్న డిస్కౌంట్ను తగ్గిస్తూ, రవాణా ఛార్జీలు తగ్గించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. -
సౌదీ స్మార్ట్ సిటీ ‘నియోమ్’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది?
ఆధునిక నిర్మాణాలకు సౌదీ అరేబియా పెట్టిందిపేరు. ప్రపంచంలోని ఏ పెద్ద కట్టడానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా ముందుగా సౌదీ అరేబియా పేరే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం సౌదీ అరేబియా భారీ స్మార్ట్ సిటీ నిర్మాణంలో తలమునకలై ఉంది. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. నియోమ్.. ఇది అనేది వాయువ్య సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్స్లో నిర్మాణంలో ఉన్న అద్భుత స్మార్ట్ సిటీ. ఈ ప్రదేశం ఎర్ర సముద్రానికి ఉత్తరంగా, ఈజిప్టుకు తూర్పున అకాబా గల్ఫ్ సమీపంలో, జోర్డాన్కు దక్షిణంగా ఉంది. 500 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ భవిష్యత్ నగరం సంపూర్ణంగా ‘స్వచ్ఛమైన శక్తి’తో మనుగడ సాగించనుంది. ఈ అధునాతన సిటీలో కార్లు ఉండవు. రోడ్లు కూడా ఉండవు. జీరో కార్బన్ ఉద్గారాలతో స్మార్ట్ సిటీ కాలుష్య రహితంగా ఉండనుంది. కాగా ఈ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో 20 శాతం పనులు పూర్తయ్యాయని నియోమ్ సీఈఓ నద్మీ అల్ నాస్ర్ మీడియాకు తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. నియోమ్ అనేది గ్రీకు పదం. నియో అంటే కొత్తది. ఎం అనేదానిని అరబిక్ పదం ముస్తాక్బాల్ నుంచి తీసుకున్నారు. దీని అర్థం భవిష్యత్తు. నియోమ్ అనే పదాన్ని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పేరు నుంచి కూడా తీసుకున్నారని చెబుతారు. ఎర్ర సముద్ర తీరంలో 26,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెగాసిటీ ప్రాజెక్ట్ను చేపట్టనున్నట్లు 2017 అక్టోబరులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) ప్రకటించారు. రియాద్లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్లో ఎంబీఎస్ ఈ ప్రకటన చేశారు. ఇది సౌదీ అరేబియా- 2030 విజన్లలో ఒకటి. దీనిని సౌదీ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి చేసే లక్ష్యంలో నిర్మిస్తున్నారు. నియోమ్ అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిర్మాణాలకు భిన్నంగా స్వతంత్రంగా పనిచేస్తుందని, దానికంటూ సొంత పన్ను, కార్మిక చట్టాలు, ‘స్వయంప్రతిపత్త న్యాయ వ్యవస్థ’ ఉంటుందని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్లో పోర్ట్లు, ఎంటర్ప్రైజ్ జోన్లు, పరిశోధనా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, క్రీడా కేంద్రాలు, వినోద వేదికలు ఉంటాయని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్ పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వంద శాతం శక్తిని అందుకుంటుంది. సూర్యరశ్మి, గాలి, హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే నియోమ్ వినియోగిస్తుంది. ఫలితంగా ఈ సిటీలో కర్బన ఉద్గారాల విడుదల ప్రస్తావనే ఉండదు. ఈ నగరానికున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలతో కూడిన నీటిని సముద్రంలోకి తరలించరు. దానిని తిరిగి పారిశ్రామిక ముడి పదార్థంగా వినియోగిస్తారు. వ్యవసాయం విషయంలో కూడా నియోమ్ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. గ్రీన్హౌస్ల ఏర్పాటుతో ప్రపంచంలోనే ఆహార స్వయం సమృద్ధిగల నగరాన్ని సృష్టించనున్నారు. సౌదీ అరేబియా ప్రస్తుతం 80 శాతం మేరకు ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. ఇది కూడా చదవండి: అమెరికా అంతరిక్ష ప్రయోగాలలో హిట్లర్ సన్నిహితుడు? 1969లో ఏం జరిగింది? -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు!
ప్రపంచంలో ఎలాన్ మస్క్, ఇండియాలో ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతులని అందరికి తెలుసు. అయితే వీరికంటే కూడా సంపన్న కుటుంబం ఒకటుందని నివేదికలు చెబుతున్నాయి తెలుస్తోంది. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏది, ఎక్కడుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సౌదీలోని కింగ్ 'సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్' నేతృత్వంలో ఉన్న కుటుంబం అత్యంత సంపన్న కుటుంబం అని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కుటుంబంలో 15,000 కంటే ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. వీరికి చమురు నిల్వల నుంచి భారీగా సంపద వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబంలో అత్యంత ధనవంతుడు అల్వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్.. ఆయన నికర విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లు. అయితే కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తమ ఖచ్చితమైన నికర విలువను వెల్లడించలేదు. కొన్ని నివేదికల ప్రకారం, సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం విలాసవంతమైన అల్ యమామా ప్యాలెస్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 1000 గదులు, సినిమా థియేటర్, అనేక స్విమ్మింగ్ పూల్స్ మరియు మసీదు వంటి అదనపు సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం. ఈ రాజ కుటుంబం విలాసవంతమైన పడవలు, ఖరీదైన బంగారు పూతతో కూడిన కార్లు, ఖరీదైన దుస్తులు వినియోగిస్తున్నట్లు సమాచారం. వీరి వద్ద ఉన్న అనేక లగ్జరీ క్రూయిజ్ షిప్లలో ఒక దాని విలువ సుమారు రూ. 400 మిలియన్ డాలర్లు. ఇంకా వీరు రెండు హెలిఫ్యాడ్స్, స్పోర్ట్స్ పిచ్ వంటి వాటితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ విమానం బోయింగ్ 747-400 కలిగి ఉన్నారు. టర్కీ బిన్ అబ్దుల్లా ఏకంగా 22 మిలియన్స్ ఖరీదైన కార్లు కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో అనేక అన్యదేశ్య మోడల్స్ అయిన లాంబోర్ఘిని అవెంటడోర్ సూపర్వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడెస్, జీప్, బెంట్లీ మొదలైనవి ఉన్నాయి. -
అమ్మకానికి పాక్? సౌదీ యువరాజు పర్యటనలో పక్కా డీల్?
దిగజారుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి యావత్ ప్రపంచానికీ తెలిసిందే. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ తరచూ ఇతర దేశాల ఆర్థికసాయం కోసం చేతులు జాస్తోంది. పాక్కు భారీగా ఆర్థిక సాయం అందిస్తున్న దేశాల్లో సౌదీ అరబ్ పేరు ముందుగా వినిపిస్తుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ త్వరలో పాక్లో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో పాకిస్తాన్ కొనుగోలుకు డీల్ కుదుర్చుకోనున్నారనే ఊహాగాగాలు వినిపిస్తున్నాయి. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ రెండో వారంలో పాకిస్తాన్లో పర్యటించనున్నారు. మహ్మద్ బిన్ సల్మాన్ పర్యటన ఇస్లామాబాద్లో స్వల్ప సమయం మాత్రమే ఉంటుందని, నాలుగు నుంచి ఆరు గంటలకు మించి ఉండదని ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు. సెప్టెంబరు 10న ఇస్లామాబాద్లో పర్యటన ముగించిన అనంతరం ఆయన తన భారత పర్యటనను ప్రారంభిస్తారు. ఎంబీఎస్ పేరుతో ప్రసిద్ది పొందిన క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కక్కర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అసిమ్ మునీర్లను కలుస్తారని సమాచారం. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని కలవడం వెనుక తన ఇమేజ్ను పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్.. పాక్ ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నూతన ప్రభుత్వం ఎన్నికయ్యేవరకూ తెరవెనుక బాధ్యతలన్నీ మునీర్ తన భుజాలపై వేసుకున్నారు. కాగా న్యూ ఢిల్లీకి వెళ్లేముందు ప్రిన్స్ ఇస్లామాబాద్కు వెళ్లడంలో ప్రత్యేకత ఏమిలేదని, ఇది ఇది ఆయన పాటిస్తున్న సమభావన చర్య అని సన్నిహితులు పేర్కొన్నారు. పాక్ను ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్న దశలో మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ను సందర్శించడం వెనుకపెట్టుబడులకు సంబంధించి ఏవైనా మార్గాలు తెరుచుకుంటాయేమోననే అంచనా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కాగా సౌదీ రాజు సన్నిహితులు మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ అమ్మకానికి ఉందని, సౌదీ అరేబియా రాజు కొనుగోలుదారులలో ఒకరని పేర్కొన్నారు. ప్రిన్స్ పర్యటనలో మరిన్ని వివరాలు తెలియవచ్చన్నారు. కాగా సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య ఉన్న స్నేహ పూర్వక వాతావరణం ఇందుకు సహరించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్పింగ్ గైర్హాజరు! -
12 ఏండ్ల 295 రోజులకే రికార్డుల ‘సిరీస్’
సౌదీ అరేబియా: పన్నెండేళ్లు.. వర్డ్ పజిల్స్తో ఆడుకునే వయసు. కానీ... వరుసగా మూడు నవలలను రాసిందో అమ్మాయి. తద్వారా నవలల సిరీస్ను రాసిన అతి పిన్న వయసు అమ్మాయిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. పైగా.. ఇప్పుడు నాలుగో నవలను పూర్తి చేసే పనిలో ఉంది. సౌదీ అరేబియాకు చెందిన రితాజ్ హుస్సేన్ అల్హజ్మీ పుస్తకాలంటే చాలా ఇష్టం. అయితే తన వయసు పిల్లలకోసం సరైన నవలలు లేవనిపించిందామెకు. తానే ఎందుకు రాయకూడదు అని ఆలోచించింది. ఆరేళ్ల వయసులోనే చిన్నచిన్నగా రాయడం మొదలుపెట్టి, పన్నెండేళ్లు వచ్చేనాటికి నవలలే రాసేసింది. మొదటి మూడు పుస్తకాలు పబ్లిష్ అయ్యేనాటికి అల్హజ్మీ వయసు 12 ఏండ్ల 295 రోజులు. మొదటి నవల ‘ట్రెజర్ ఆఫ్ ది లాస్ట్ సీ’ 2019లో పూర్తి చేసింది. దానికి సీక్వెల్గా ‘పోర్టల్ ఆఫ్ ది హిడెన్ వరల్డ్’ను, తరువాత మూడో పుస్తకంగా ‘బియాండ్ ద ఫ్యూచర్ వరల్డ్’ తీసుకొచ్చింది. ఇప్పుడు అల్హజ్మీకి 13 ఏళ్లు. నాలుగో పుస్తకం ‘పాసేజ్ టు అన్నోన్’ రాస్తోంది. -
సౌదీ యువరాజుపై సంచలన ఆరోపణలు.. ప్రపంచానికే ముప్పు!
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరికొద్ది రోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి షాకింగ్ ఆరోపణలు గుప్పించారు. సౌదీ యువరాజు ఓ సైకో అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. వివరాల ప్రకారం.. సౌదీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి సాద్ అల్ జాబ్రి తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కిరాయి సైనికులతో 'టైగర్ స్క్వాడ్' అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపాడు. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించాడు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని మహ్మద్ బిన్ సల్మాన్ ను అభివర్ణించారు. భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని అల్ జాబ్రి కుండబద్దలు కొట్టారు. ఇక యువరాజు బాగా ధనవంతుడు కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని సంచలన ఆరోపణలు గుప్పించాడు. అయితే, ఆ మాజీ అధికారి పేరు సాద్ అల్ జాబ్రి.. ఒకప్పుడు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగంలో నంబర్ 2 స్ధానంలో విధులు నిర్వర్తించాడు. అల్ జాబ్రి అప్పట్లో మహ్మద్ బిన్ నయేఫ్కు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. కాగా, మహ్మద్ బిన్ నయేఫ్ను 2017లో సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు. ఇదిలా ఉండగా.. అల్ జాబ్రి వ్యాఖ్యలను అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కొట్టిపడేసింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్స్ చేశాడని స్పష్టం చేసింది. BIG REVEAL: Saad Aljabri, a former top Saudi intelligence official has said that Crown Prince Mohammed bin Salman keeps a team of mercenaries to kidnap—and even kill—political dissenters. @ericgarland @Abukar_Arman @TrueFactsStated pic.twitter.com/BquD2mr1i5 — Colossus Diplomacy (@ColossusDiplo) July 12, 2022 -
సౌది అరేబియా కథ: హాస్యగాడు అబునువాస్
పూర్వపు వాళ్లలోను, ఇప్పటి వాళ్లలోను మనం జ్ఞాపకం ఉంచుకో తగిన ఉపాయశాలులందరిలో గొప్పవాడెవడో చెప్పగలరా? కొందరు ఒకడు గొప్పవాడు అంటే మరికొందరు ఇంకొకడు మరీ గొప్పవాడంటారు. కానీ నిజం తెలిసినవాళ్లంతా అబునువాస్ పేరే చెబుతారు. అబునువాస్ జీవితమంతా హాస్యకథలుగా, తమాషాపనులతో, మంచి మంచి ఉపాయాలతో నవ్వుల మాటలతో గడచిపోయింది. అంతేకాదు ఎన్నోసార్లు తన యుక్తితో హాస్యంతో ఎన్నో చిక్కుల్లోంచి బయటపడ్డాడు. ఆయన ఎవ్వరినైనా సరే నవ్వించాలనుకున్నాడా.. తమాషా మాటల్తో కడుపుబ్బేట్టు నవ్వించేవాడు. ఎంత తెలివిగలవాడినైనా చాదస్తుడనిపించాలంటే ఏదో యుక్తిపన్ని బోల్తా కొట్టించేసేవాడు. మామూలు మనుషుల్నే కాదు మహారాజుల్నీ లెక్కలేకుండా హాస్యమాడేవాడు. ఈ అబునువాస్కు ఒక గాడిద ఉండేది. ఆ గాడిదకి నీళ్లు పెట్టటానికి ఒక పెద్దపళ్లెం కావలసివచ్చింది. పొరుగింటి వాళ్లను అడిగాడు. వాళ్లు అబునువాస్కు రాగిపళ్లెం ఇచ్చారు. దాన్ని మూడురోజులు తన వద్దే ఉంచుకున్నాడు. నాలుగోరోజున ఆ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం పెట్టి ఆ రెండిటినీ తీసుకెళ్లి పొరుగింటివాళ్లకు ఇచ్చాడు. పక్కింటి పెద్ద మనిషి తమ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం కూడా ఉడడం చూసి ‘అయ్యో ఈ చిన్నపళ్లెం మాది కాదే!’ అన్నాడు. దానికి అబునువాస్ ‘మీరిచ్చిందేదో మీకు తిరిగి ఇచ్చేశాను. మీ రాగిపళ్లెం నా దగ్గర ఉన్నప్పుడు దానికి ఈ చిన్నపళ్లెం పుట్టింది. ఇది రాగిపళ్లెం బిడ్డ కాబట్టి ఈ రెండూ మీవే’ అని చెప్పాడు. అబునువాస్ తెలివి తక్కువతనానికి నవ్వుకుని ఇంకో పళ్లెం కూడా వస్తూంటే పోనివ్వటమెందుకని ‘మీరు చెప్పింది నిజమే! మా పళ్లానికి పుట్టిన బిడ్డ కాబట్టి ఇదీ మాదే. పళ్లాలకు కూడా బిడ్డలు పుట్టే చల్లని ఇల్లు మీది’అన్నాడు పొరుగింటాయన. మూడురోజులు పోయాక అబునువాస్ మళ్లీ వాళ్లింటికి వెళ్లి ఆ పళ్లమే ఇంకోసారి అరువడిగాడు. ఈసారి ఇంకో మంచి బిడ్డను తీసుకొస్తుందనే సంతోషంతో వెంటనే ఆ ఇంటి యజమాని ఆ పళ్లాన్ని తెచ్చిచ్చాడు. అబునువాస్ నవ్వుకుంటూ ఆయనకు నమస్కారం పెట్టి రాగిపళ్లెం చంకనబెట్టుకొని ఇంటికి పోయాడు. ఈసారి పళ్లెం తీసుకుపోయి ఎన్నాళ్లయినా తిరిగి ఇవ్వలేదు. పొరిగింటాయన వచ్చి పళ్లెం కావాలని అడిగాడు. అబునువాస్ ఎంతో విచారంగా‘ఏం చేయమంటారు బాబూ.. మీకు పుట్టెడు దుఃఖవార్త చెప్పాల్సి వచ్చింది. మీ పళ్లెం చచ్చిపోయింది బాబూ’ అని చెప్పాడు. ‘ పళ్లెం చచ్చిపోవడమేమిటి?’ విస్తుపోయాడు పొరుగింటి మనిషి. ‘ఈ విషయం మీకు చాలా దుఃఖం కలుగజేస్తుందనే నేను మీకు ఇన్నాళ్లూ చెప్పలేదు. ఏం చెయ్యను? చివరికి చెప్పక తప్పలేదు’ అన్నాడు అబునువాస్. ఆ మాటకు పొరుగింటి పెద్దమనిషికి తగని కోపం వచ్చింది. ‘తమాషాగా ఉందా? రాగిపళ్లెం చావటమేమిటి?నన్ను పిచ్చివాణ్ణనుకుంటున్నావా?’ అంటూ మండిపడ్డాడు. ‘ఆ రాగిపళ్లమే కదండీ ఇంతకుముంద బిడ్డను కనిందీ..’ గుర్తుచేశాడు అబునువాస్.‘అవును’ చెప్పాడు పొరుగింటాయన. ‘ఈ సృష్టిలో బిడ్డల్ని కనేవన్నీ ఏనాడో ఒకనాడు చచ్చిపోకమానవు బాబూ? ఎటొచ్చీ మీ రాగిపళ్లెం పాపం పరాయింట్లో చచ్చిపోవటమే చాలా విచారకరం. ఏం చేస్తాం.. దానికి అలా రాసిపెట్టి ఉంది’ అని ఓదార్చాడు అబునువాస్. అలా ఆ రాగిపళ్లాన్ని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. ఇంకోసారి ఒకడు అబునువాస్ దగ్గరకు వచ్చి అతని గాడిదను అరువు అడిగాడు. పని మీద తన గాడిద ఊరికి వెళ్లిందని అబునువాస్ చెప్తూండగానే పెరట్లోంచి గాడిద ఓండ్రపెట్టింది. ‘దొడ్లో గాడిద అరుస్తూంటే ఊరెళ్లిందని చెప్తున్నావ్.. నువ్వేం పెద్దమనిషవయ్యా?’ అంటూ నిలదీశాడతను. ‘నీకు కావలసింది మా గాడిదా? దాని అరుపా? గాడిదైతే ఇక్కడలేదు. దాని అరుపు కావాలంటే తీసుకుపో’ అంటూ గాడిదలాగా ‘ఈ.. ఓర్.. ఈ ..ఓర్’ అంటూ ఓండ్రపెట్టి ‘ఇదిగోనయ్యా.. గాడిద అరుపు. దానిమీద ఎక్కి నీ దారిన నువ్వు పో త్వరగా’ అని చెప్పాడు. తెల్లబోయాడు ఆ పెద్దమనిషి. ఇంకోసారి ఇంకా మంచి తమాషా జరిగింది. అబునువాస్ రెండంతస్తుల మేడ కట్టాడు. అంతా కట్టిన తరువాత ఆ మేడ అమ్మాలని బేరం పెట్టాడు. అంత పెద్దమేడ ఎవరికీ అవసరం లేకపోయింది. అడిగినవాళ్లే లేకపోయారు. చివరికెట్లాగో అబునువాస్ తన మేడ మీది అంతస్తు మాత్రం ఒక వ్యాపారస్తుడికి అమ్మగలిగాడు. వర్తకుడు మేడ మీద ప్రవేశించాక కిందిభాగం కూడా కొనమని అతణ్ణి అడగసాగాడు అబునువాస్. వ్యాపారస్తుడు మాత్రం తనకు అక్కర్లేదని చెప్పేశాడు. ఒకనాటి ఉదయం అబునువాస్ చాలామంది కూలీలను పిలిపించి తన ఇంటి గోడలు పగలగొట్టమన్నాడు. ఈ గడబిడ ఏమిటా అని పైనున్న వర్తకుడు కిటికీలోంచి కిందికి తొంగి చూశాడు. అంతమంది కూలీలు అబునువాస్ చెప్పినట్టే మేడ గోడలను కూలగొట్టసాగారు. కంగారుపడుతూ ఆ వర్తకుడు ‘ఏం చేస్తున్నారు?’ అంటూ అరిచాడు. ‘కింది అంతస్తు అమ్ముతానంటే ఎవరూ కొనలేదు. అందుచేత పగలగొట్టించేస్తున్నాను. నీ పై అంతస్తును జాగ్రత్తగా చూసుకో. నీ మేడ విరిగి నా కూలీల మీద పడి వాళ్లకు దెబ్బలు తగిలితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు అబునువాస్. ‘పగలగొట్టించకండి.. కింది అంతస్తు కూడా నేనే కొంటాను’ అంటూ ఆ వర్తకుడు కింది అంతస్తు కూడా కొన్నాడు విధిలేక. ఆఖరికి ఆ ఊరి రాజుకూడా అబునువాస్ హాస్యపుదెబ్బ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఒకనాటి రాత్రి రాజుకి ఒక కల వచ్చింది. అబునువాస్ ఇంటి కింద.. భూమిలో వెండినాణాలతో నిండిన బిందెలు ఉన్నట్టు రాజుకి కలలో కనబడింది. తెల్లవారే ఆ బిందెలను తవ్వుకురమ్మని పదిమంది పనివాళ్లను అబునువాస్ ఇంటికి పంపాడు రాజు. అప్పుడు అబునువాస్ ఇంట్లోలేడు. పనివాళ్లు ఇంటి కింది నేలను తవ్వేస్తూంటే ఏమీ చేయలేక ఏడుస్తూ దూరంగా నిలబడింది అబునువాస్ భార్య. ఎంత పెళ్లగించినా వెండిబిందెలు కనబడలేదు. రాజుగారి కూలీలు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అబునువాస్ ఇంటికి రాగానే అతని భార్య ఏడుస్తూ సంగతంతా చెప్పింది. ‘మరేమీ పరవాలేదులే. రాజుగారికి తగిన శాస్తి నే చేస్తాగా! నువ్వు దిగులు పడకు’ అంటూ భార్యను ఓదార్చాడు అబునువాస్. వండిన అన్నాన్ని కొంత తీసి ఒక పళ్లెంలో వేసుకుని దాని మీద ఒక తువాలు కప్పాడు. తువాలు మీద చాలా ఈగలు వాలాయి. అందులో కొన్ని లోపలికి దూరి అన్నం తినటానికి ప్రయత్నించాయి. మరునాడు తెల్లవారగానే తువాలు కప్పిన అన్నపు పళ్లాన్ని రాజుగారి కోటకు తీసుకెళ్లాడు. ‘ప్రభూ.. నాదొక ఫిర్యాదు. కొందరు నా ఇంటికి పిలవకుండానే వచ్చి నా ఆహారాన్ని తినేస్తున్నారు. వాళ్లను దండించ కుండా ఎట్లా ఊరుకోమంటారో మీరే చెప్పండి’ అని రాజుగారిని అడిగాడు. అబున్వాస్ ఏదో కట్టుకథలాంటిది చెబుతున్నాడేమో అనుకున్నాడు రాజు. తన పనివాళ్లు అతని ఇంట్లో నేలను పెళ్లగించిన విషయం చెబుతున్నాడేమోనని కూడా రాజుకి అనుమానం కలిగింది. ‘ఇంతకీ నువ్వు ఫిర్యాదు చేస్తున్నది ఎవరి మీద?’ అని అడిగాడు రాజు. తను తెచ్చిన అన్నపు పళ్లెం మీద కప్పిన తువాలు తీశాడు అబునువాస్. వెంటనే మూడు ఈగలు ఎగిరిపోయాయి. ‘వీటి మీదే నా ఫిర్యాదు’ అన్నాడు అబునువాస్ ఆ ఈగలను చూపిస్తూ. రాజుకి నవ్వు వచ్చింది. ‘ఈగల మీదా నీ ఫిర్యాదు? సరే. నన్ను ఏం చేయమంటావో చెప్పు’ అన్నాడు. ‘చట్టంప్రకారం నాకు న్యాయం చెయ్యమంటున్నాను. ఈగల్ని దండించడానికి మీరు నాకు అనుమతి ఇవ్వాలి. అంతే ప్రభూ’ అన్నాడు అబునువాస్. ‘భేష్.. ఈగలను దండించటానికి నీకు అనుమతి ఇచ్చాను. ఈగలు ఎక్కడ కనిపించినా నీ ఇష్టం వచ్చినట్టు దండించు’ అన్నాడు రాజు నవ్వుతూ. రాజుగారు ఈ తీర్పుని ఒక కాగితం మీద కూడా రాసి సంతకం చేసి అబునువాస్కి ఇచ్చాడు. అబునువాస్ ఈగలను దండించటానికి పెద్ద దుడ్డుకర్ర చేయించాడు. ఆ కర్ర చివర గట్టి ఇనుప పొన్ను వేయించాడు. ఎక్కడ ఈగ కంటబడితే అక్కడ కర్రతో కొట్టేసేవాడు. బజారుకు వెళ్లినప్పుడు ఖర్జూరపు పళ్ల బుట్టల మీద ఈగలు వాలటం చూసి దుడ్డుకర్ర విసిరేవాడు. పళ్లన్నీ చితికిపోయేటట్టు కర్రతో బాదేవాడు. అంగడివాళ్లు ‘ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు?’ అని గదమాయించి అడిగితే ‘నేనేమీ మీ పళ్లను కొట్టటం లేదయ్యా! వాటి మీద వాలిన ఈగల్నే దండిస్తున్నాను’ అని జవాబు చెప్పి రాజుగారు ముద్రవేసి ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపించేవాడు. వాళ్లు ‘ఇదేం మేళంరా!’ అనుకుంటూ ఊరుకునేవాళ్లు. ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. అబునువాస్ వెర్రి చేష్టలకు విసుక్కునేవాళ్లు విసుక్కుంటున్నారు. నవ్వుకునేవాళ్లు నవ్వుకుంటున్నారు. రాజుగారు కూడా ఈ వింత చేష్టలన్నీ విని విరగబడి నవ్వాడు. చివరకు ఒకనాడు రాజుగారు రాజసభలో తీర్పులు చెబుతున్నాడు. అబునువాస్ కూడా వెళ్లి రాజుగారికి దగ్గరగా కూర్చున్నాడు. రాజుగారు ఏదో నేరాన్ని విచారణచేశాడు. గంభీరంగా తీర్పు చెబుతుండగా రాజుగారి వీపు మీద ఈగ వాలింది. చటుక్కున తన దుడ్డుకర్రతో రాజుగారి వీపు మీద గట్టిగా బాదాడు అబునువాస్. అతని ఆ చర్యకు సభంతా ఘొల్లుమంది. అబునువాస్ను చుట్టుముట్టి గట్టిగా పట్టుకున్నారు. రాజుగారిని కొట్టినందుకు అతనిని శిక్షించాలని పట్టుబట్టారు. ‘అబునువాస్.. ఏమిటీ పిచ్చి? రాజుగారిని కొడతావా?’ అని అధికార్లు అబునువాస్ మీద మండిపడ్డారు. జంకుగొంకు లేకుండా అబునువాస్ ‘నేను తప్పేం చేయలేదే? నన్ను శిక్షించడం న్యాయంకాదు. నేను రాజుగారి వీపు మీద వాలిన ఈగను కొట్టానుగాని, రాజుగారిని కొట్టలేదు. రాజుగానే ఈగల్ని చంపటానికి నాకు అనుమతి ఇచ్చారు’ అని చెప్పాడు. రాజుగారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన అనుమతి పత్రం జేబులోంచి తీసి అందరికీ చూపించాడు. ఇంకేం మాట్లాడతారు? అతను చెప్పిందంతా నిజమే. అతనిని నిర్దోషిగా వదలక తప్పిందికాదు. ‘వెధవ ఈగలకి తగిన శాస్తి జరిగింది. అవి నా ఇంట్లో ప్రవేశించి దౌర్జన్యంగా నా సొమ్మును తీసుకోటానికి ఎందుకు ప్రయత్నించాలి?’ అన్నాడు అబునువాస్. మరోసారి ఇంకో విచిత్రమైన సంగతి జరిగింది. పట్నంలో ఒక భాగ్యవంతుడైన వర్తకుడు మేకమాంసం వండించి మంచి విందు తయారు చేస్తున్నాడు. విందు భోజనం వండేటప్పుడు ఒక బిచ్చగాడు అక్కడ ఏమి జరుగుతూందో చూద్దామని వచ్చాడు. పాపం.. వాడు కాస్త దూరంగా వంటలు తయారుచేసే చోటు నుంచి వచ్చే ఘుమఘుమలాడే ఆ గాలిని పీల్చుకుంటూ కూచున్నాడు. వాసనే ఇంత కమ్మగా ఉంటే ఆ భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందోనని విందు గురించి ఊహించుకోసాగాడు. అయితే ఆ ధనవంతుడు, ఆ బిచ్చగాడికి పిడికెడు అన్నం కూడా పెట్టించలేదు. మరునాడు ఆ వర్తకుడు కనిపించినప్పుడు ‘అయ్యా.. మీరెంత మంచివారో.. మీ వంట పందిరి దగ్గరైనా నన్ను కూచోనిచ్చారు! మీ విందులోని పసందైన మేకమాంసం కూరల కమ్మని వాసన పీల్చేటప్పటికే నాకు సంతృప్తిగా భోజనం చేసినట్టయింది’ అన్నాడు. ‘సరి..సరి.. అందుకేనేమో నిన్న మా మేకమాంసం రుచీపచీ లేకుండా పోయింది. ఆ కమ్మని వాసనంతా నువ్వే పీల్చేసి ఉండాలి సందేహం లేదు’ అన్నాడు వర్తకుడు. అంతటితో ఊరుకోక రాజు వద్దకు వెళ్లి తన మేకమాంసం కూరల కమ్మని వాసనంతా అపహరించుకుపోయాడని బిచ్చగాడి మీద అన్యాయంగా ఫిర్యాదు చేశాడు. రాజు.. వర్తకుల పక్షపాతి కాబట్టి అతడు చెప్పిన ఫిర్యాదు నమ్మి ఆ నేరం చేసినందుకు బిచ్చగాడు పన్నెండు వెండి నాణాలు ఆ వర్తకుడికి ఇచ్చి తీరాలని తీర్పు చెప్పాడు. బిచ్చగాడి చేతిలో పైసా లేదు. పాపం ఏడుస్తూ వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు వాడికి అబునువాస్ ఎదురుపడ్డాడు. రాజుగారి అన్యాయపు తీర్పు సంగతి చెప్పాడు. అబునువాస్ జాలిపడి ‘నేను నీకు సాయం చేస్తాను దిగులుపడకు. నీ అప్పు తీర్చిపారెయ్యటానికి రేపు ఉదయం కలుసుకుందాంలే’ అని ధైర్యం చెప్పాడు. మరుసటి దినం అబునువాస్ బిచ్చగాడితో సహా రాజసభకు వెళ్లాడు. వర్తకుడు కూడా తన పైకాన్ని తీసుకోటానికి వచ్చాడు. అబునువాస్ వర్తకుణ్ణి చూసి ‘నీ డబ్బు చెల్లిస్తే పుచ్చుకోటానికి సిద్ధంగా ఉన్నావయ్యా?’ అని అడిగాడు. ‘ఆ సిద్ధంగానే ఉన్నాను. ఇవ్వండి’ అన్నాడు వర్తకుడు. అబునువాస్ పన్నెండు వెండి నాణాలు తీసి బిచ్చగాడి చేతికిచ్చాడు. ‘ఇదిగో.. వీటిని భూమి మీద పడెయ్యి’ అన్నాడు అబునువాస్. అట్లాగే బిచ్చగాడు ఆ నాణాల్ని నేల మీద పడేశాడు. అవి రాతి నేల మీద పడగానే గణగణమని మోగాయి. ‘విన్నావా? ఆ నాణాల టింగు టింగు మోత!’ అన్నాడు అబునువాస్. ‘ఆ విన్నాను..’ చెప్పాడు వర్తకుడు. ‘ఆ వెండినాణాల్లో నీకు రావలసిన భాగం ఆ టింగ్ టింగే. తీసుకో’ అన్నాడు అబునువాస్. ‘నీ భోజనం కమ్మదనం వాసన చూసినంత మాత్రాన నువ్వు నష్టపోతే ఆ బిచ్చగాడి డబ్బు గణగణ ధ్వని నువ్వు విన్నావు గనుక అది నీకు ముట్టినట్టే. ఇక వెళ్లు’ అన్నాడు అబునువాస్. అతను చెప్పిన న్యాయం ప్రకారం బిచ్చగాడు వర్తకుడికి పన్నెండు కాసులూ చెల్లించినట్టే అని రాజుగారు కూడా ఒప్పుకున్నారు. తగాదా తీరిపోయింది. (‘వేటగాడి కొడుకు ఇతర విదేశ కథలు’ సంకలనం నుంచి) చదవండి: బాలల దినోత్సవం 2021: బొమ్మలతో ఆటలాడుకునే వయసులో.. ఎన్నెన్ని ఘనతలో..! -
భారత్కు సౌదీ నుంచి 80 టన్నుల ఆక్సిజన్
దుబాయ్: తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న భారత్కు సౌదీ అరేబియా 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను పంపుతోంది. అదానీ గ్రూపు, ఆక్సిజన్ ఉత్పత్తిదారు లిండే కంపెనీ సహకారంతో 80 టన్నుల ఆక్సిజన్ను పంపుతున్నట్లు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘రియాద్లో భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు. ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్ను భారత్కు తరలించే మిషన్లో నిమగ్నమయ్యాం. 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్తో 4 క్రయోజనిక్ ట్యాంకులు నౌకలో దమ్మామ్ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయి’ అని అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. Thank you @IndianEmbRiyadh. Indeed, actions speak louder than words. We are on an urgent mission to secure oxygen supplies from across the world. This first shipment of 4 ISO cryogenic tanks with 80 tons of liquid oxygen is now on its way from Dammam to Mundra. (1/3) https://t.co/BLZ0SbQ499 pic.twitter.com/lFKnx0hIhX — Gautam Adani (@gautam_adani) April 24, 2021 -
శత్రువుల మధ్య చిగురించిన స్నేహం!
అల్ఉలా: సంవత్సరాల తరబడి సాగుతున్న కయ్యానికి తెరదించుతూ ఖతార్, సౌదీ అరేబియా స్నేహం దిశగా అడుగులు వేశాయి. మంగళవారం ఖతార్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని సౌదీ అరేబియా పర్యటనకు వచ్చారు. ఆయనకు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. యూఎస్కు నమ్మకమైన మిత్రులుగా ఉన్న ఈ రెండు దేశాలకు మధ్య చాలా సంవత్సరాలుగా పొసగడం లేదు. ఈ వివాదానికి తెరదించుతూ రెండు దేశాలు తమ సరిహద్దులు తెరుస్తున్నట్లు ప్రకటించాయి. గల్ఫ్ అరబ్ నేతల వార్షిక సమావేశం అల్ఉలాలో జరగనుంది. ఇరాన్తో సంబంధాలు, ఇస్లామిస్టు గ్రూపులకు ఖతార్ సాయాన్ని నిరసిస్తూ నాలుగు అరబ్ దేశాలు (ఈజిప్టు, యూఏఈ, సౌదీ, బహ్రైన్) 2017 నుంచి ఖతార్తో సంబంధాలు తెంచుకున్నాయి. వీటిని గాడిన పెట్టేందుకు షేక్ తమిమ్ యత్నించనున్నారు. అమెరికా, కువైట్లు ఖతార్కు ఇతర అరబ్ దేశాలకు మధ్య సత్సంబంధాల కోసం మధ్యవర్తిత్వం నెరిపాయి. రాజీకి ఖతార్ ఎలాంటి ప్రతిపాదనలు ఒప్పుకున్నది ఇంకా తెలియరాలేదు. గల్ఫ్ ఐక్యత తిరిగి సాధించేందుకు తాము కృషి చేస్తామని ఖతార్ మంత్రి అన్వర్ గారాఘ్ష్ చెప్పారు. తాజా సమావేశాల్లో సౌదీతో ఖతార్ రాజు ఒప్పందాలపై సంతకాలు చేయవచ్చని ఓ అంచనా. ఖతార్తో సత్సంబంధాలు సాధించడం ద్వారా బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వంతో బంధం బలోపేతం చేసుకోవాలని సౌదీ యోచిస్తోంది. యెమెన్తో యుద్ధం, ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం నేపథ్యంలో సౌదీకి యూఎస్ సాయం ఎంతో అవసరం ఉంది. అయితే ఇప్పటికీ టర్కీ, ఇరాన్తో ఖతార్కు మంచి సంబంధాలుండడం, టర్కీ మరియు ఖతార్లు ముస్లిం బ్రదర్హుడ్కు మద్దతు ఇవ్వడం వంటివి అరబ్ దేశాలను ఆందోళనపరుస్తూనే ఉన్నాయి. అరబ్దేశాల బహిష్కరణతో ఖతార్ ఎకానమీ బాగా దెబ్బతిన్నది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇకపై ఖతార్ అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ట్రంప్ దూకుడు.. 3 వేల బాంబుల అమ్మకానికి ఓకే
వాషింగ్టన్: అధ్యక్ష పీఠం నుంచి వైదొలగడానికి మరి కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు 290 మిలియన్ డాలర్ల(21,25,29,40,000 రూపాయలు) విలువ చేసే 3 వేల స్మార్ట్ బాంబుల అమ్మకానికి ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ మంగళవారం ఓ నోటీసును విడుదల చేసింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ నోటీసు ప్రకారం సౌదీ అరేబియాకు 3 వేల బోయింగ్ నిర్మిత జీబీయూ -39 స్మాల్ డయామీటర్ బాంబ్ ఐ (ఎస్డీబీ ఐ) ఆయుధాలు, సంబంధిత పరికరాలను విక్రయించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయం ట్రంప్ పదవీకాలం చివరి రోజుల్లో వస్తుంది. అయితే ప్రపంచంలోని అత్యంత భయంకరమైన మానవతా సంక్షోభానికి కారణమైన యెమెన్లో యుద్ధాన్ని ముగించాలని రియాద్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా సౌదీ అరేబియాకు ఆయుధాల అమ్మకాలను నిలిపివేస్తామని నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల్లో హామీ ఇవ్వడం గమనార్హం. ఇక మిడిల్ ఈస్ట్లో అమెరికన్ ఆయుధాలను భారీగా కొనుగోలు చేసేది సౌదీ అరేబియానే. (చదవండి: కరోనా ప్యాకేజీపై ట్రంప్ సంతకం) "డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ రోజు అమ్మకం గురించి కాంగ్రెస్కు తెలియజేస్తూ అవసరమైన ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది" అని అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటైనర్లు, సహాయక పరికరాలు, సేవలు, విడి, మరమ్మతు భాగాలతో కూడిన జీబీయూ -39 ఎస్డీబీ ఐ మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేయాలని సౌదీ అరేబియా కోరినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రతిపాదిత అమ్మకం "మధ్యప్రాచ్యంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన శక్తిగా కొనసాగుతున్న స్నేహపూర్వక దేశం భద్రతను" మెరుగుపరచడానికి సహాయపడుతుందని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. -
జియో ఫైబర్ : రిలయన్స్ తాజా ప్రణాళికలు
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లో ప్రపంచ దిగ్గజాల ద్వారా వరుస పెట్టుబడులతో హోరెత్తించిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అననుబంధ సంస్థలో పెట్టుబడుల సమీరణపై దృష్టి కేంద్రీకరించింది. జియో ఫైబర్ పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకునేందుకు సన్నద్ధమవుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (రిలయన్స్ : "నెట్మెడ్స్" డీల్) జియో ఫైబర్ లో మేజర్ వాటాను సౌదీ అరేబియా ఆధారిత పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్)కు విక్రయించనుంది. తద్వారా వందకోట్ల డాలర్ల (సుమారు 7495 కోట్ల రూపాయలు) విలువైన పెట్టుబడిని రిలయన్స్ దక్కించుకోనుంది. అలాగే పీఐఎఫ్తో పాటు, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఎడిఐఎ) కూడా ఆర్ఐఎల్ తో మరో డీల్ చేసుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. 300 బిలియన్ డాలర్ల విలువైన పోర్ట్ఫోలియోను సాధించే లక్ష్యంలో భాగంగా ఈ చర్చలు సాగుతున్నట్టు తెలిపింది. అయితే ఈ ఒప్పందంపై ఆర్ఐఎల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ రెండు ఒప్పందాలు నిర్ధారణ అయితే ఆర్ఐఎల్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా పీఐఎఫ్ ఇప్పటికే జియోలో భారీ పెట్టుబడులు పెట్టింది. మరోవైపు మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ సౌదీ అరామ్కో కూడా రిలయన్స్ పెట్రో కెమికల్ రిఫైనింగ్ వ్యాపారంలో మేజర్ వాటాను కొనుగోలు చేయడానికి ఆర్ఐఎల్తో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. -
‘ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు’
రియాధ్: కరోనా వైరస్ మన జీవితాలను తారుమారు చేసింది. ఓ పండగ లేదు.. వేడుక లేదు. కనీసం ఎవరైనా మరణిస్తే.. చూడ్డానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితులను తీసుకువచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు తమ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, టూరిజం ప్లేస్లలో లాక్డౌన్ విధించాయి. సౌదీ అరేబియా కూడా ఈ ఏడాది మక్కాను దర్శించడానికి విదేశీయులను అనుమతించడం లేదు. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైనా మక్కా వెళ్లాలనుకుంటాడు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా హజ్ యాత్రకు అటంకం ఏర్పడింది. ఈ ఏడాది మక్కా దర్శనానికి కేవలం సౌదీ అరేబియాలో ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఏటా దాదాపు 2.5 మిలయన్ల మంది మక్కాను దర్శించుకుంటుండగా ఈ ఏడాది వీరి సంఖ్య కేవలం 10 వేలకు మాత్రమే పరిమితమయినట్లు అల్ జజీరా తెలిపింది. వీరిని కూడా 50 మంది చొప్పున మాత్రమే కాబా దర్శనానికి అనుమతిస్తోన్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాక మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ.. కాబా చుట్టు తిరగాలని ఆదేశించింది. (హజ్ యాత్రపై కోవిడ్ ప్రభావం) ఈ క్రమంలో ప్రస్తుతం మక్కాలోని పరిస్థితులకు సంబంధించిన ఫోటోలను మహ్మద్ అలీ హరిస్సి అనే వ్యక్తి తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ‘ఈ రోజు మక్కాలో కనిపించిన నమ్మశక్యం కానీ దృశ్యాలు.. కరోనా హజ్ యత్రపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇవి చూస్తే అర్థమవుతోంది’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీటల్లో యాత్రికులంతా రంగురంగుల గొడుగులు పట్టుకుని.. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కాబా చుట్టూ తిరుగుతున్నారు. వీరందరిని ఓ వైద్యుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాక ప్రతి రోజు ఈ మసీదును శుభ్రం చేయడానికి దాదాపు 35 వేల మంది పని చేస్తున్నారని తెలిపింది. మసీదును శానిటైజ్ చేయడం కోసం 54 వేల లీటర్ల క్రిమి సంహారక మందును, 1050 లీటర్ల ఎయిర్ ఫ్రెషనర్ని వినియోగిస్తున్నట్లు తెలిపింది. (కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్) Unbelievable scenes from Mecca today! Historic Hajj amid the threat of coronavirus. @AFP has amazing colorful photos on a very, very sunny day! pic.twitter.com/0RvTVwGWtd — Mohamad Ali Harissi (@aleeharissi) July 29, 2020 గతంలో రోజుకు రెండు, మూడు సార్లు మసీదును శుభ్రం చేస్తుండగా.. ప్రస్తుతం పది సార్లు క్లీన్ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సాధారణంగా 40 రోజులపాటు సాగే ఈ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒకసారైనా హజ్ యాత్ర చేయాలన్నది నిర్దేశం. కరోనా నేపథ్యంలో ఈసారి యాత్ర జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు. -
10 వేల జనాభాకు 8 మందే డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : మన దేశంలో ప్రతీ 10 వేల జనాభాకు ఎనిమిది మంది కంటే కొంచెం తక్కువగానే డాక్టర్లు ఉన్నారని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ తెలిపింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల పరిస్థితిని విశ్లేషిస్తూ, భారత్లో పరిస్థితిపైనా తాజాగా విడుదల చేసిన నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. భారతదేశంలో మూడు నెలల లాక్డౌన్ సడలింపుల తరువాత కేసులు మరింతగా పెరుగుతున్నాయని తేల్చిచెప్పింది. ఆ నివేదిక ప్రకారం... మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు అత్యధికంగా కరోనాతో దెబ్బతిన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభా విత ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లోనూ గణనీయమైన సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. (ఆన్లైన్ ఈ ‘లైన్’లో) కాబట్టి మున్ముందు వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశాలున్నాయని తేల్చిచెప్పింది. ‘దీనికి ప్రధాన కారణం లాక్డౌన్ సమయంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వైఫల్యం జరిగింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించలేద’ని ల్యాన్సెట్ ఘాటైన విమర్శలు చేసింది. వైద్య ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన, పునర్నిర్మాణం జరగలేదు. వైద్య, ఆరోగ్య సిబ్బంది నియామకం జరగలేదు. దీనిపై ఇప్పటికైనా దృష్టిసారించాలని, రాబోయే నెలల్లో కరోనా వైరస్ను అంతం చేయడానికి ఇది కీలకమని ల్యాన్సెట్ వ్యాఖ్యానించింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికా, బ్రెజిల్తోపాటు భారతదేశంలోనూ జూన్ 26 నుండి జూలై 3 వరకు లక్షకన్నా ఎక్కువ కొత్త కేసులు నమోదు కావడాన్ని ల్యాన్సెట్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. పేదలపై పంజా... కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అందులో ఎక్కువగా పేదలను కాటేస్తోంది. ప్రపంచ జనాభాలో 66 శాతం మంది పేదలున్నారు. ఆ వర్గాలను మరింత పేదలుగా మార్చే దుస్థితి కరోనా కారణంగా ఏర్పడిందని ల్యాన్సెట్ పేర్కొంది. కరోనా రష్యాలో కూడా ఉధృతంగా కొనసాగుతోంది. ఇది మధ్య ఆసియా గుండా మధ్యప్రాచ్యం, భారత ఉపఖండంలోకి ప్రవేశించేలా ఒక బలమైన గొలుసుకట్టును ఏర్పరుచుకుంది. ఆదర్శంగా సౌదీ అరేబియా... సౌదీ అరేబియా కరోనా నేపథ్యంలో ఆరోగ్యరంగానికి మరింత బడ్జెట్ను కేటాయించింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పడకల సామర్థ్యాన్ని విస్తరించింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులకు ఉచిత ప్రవేశం కల్పించడానికి వందలాది జ్వరం క్లినిక్లను ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బందికి అవసరమైన ప్రత్యేక శిక్షణ కల్పించిందని ల్యాన్సెట్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఐదు నెలల తరువాత కూడా వైరస్ సంక్లిష్టత కొనసాగుతూనే ఉందని తెలిపింది. -
గల్ఫ్ కార్మికులకు శుభవార్త..
మోర్తాడ్ (బాల్కొండ): కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోవాలనుకుంటున్న వలస కార్మికులకు కువైట్ మినహా అన్ని గల్ఫ్ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు శుభవార్తను అందించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతర్ తదితర దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఉద్యోగాలు కోల్పోయిన వేలాదిమంది భారత కార్మికులు తమను స్వదేశానికి రప్పించేలా చూడాలని కోరడంతో గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాయి. ఇంటికి చేరుకోవాలనుకునే భారతీయ కార్మికులు మన విదేశాంగ శాఖ వెబ్పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాయబార కార్యాలయాలు తెలిపాయి. -
సౌదీ రాజ కుటుంబంలో కరోనా కలకలం
రియాద్ : ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి సౌదీ రాజ కుంటుంబంలో కలకలం రేపింది. సౌదీ రాజ కుటుంబంతో కొన్ని వారాల క్రితం సన్నిహితంగా మెలిగిన ఆ దేశ ప్రతినిధుల్లో 150 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమయ్యారు.రియాద్ గవర్నర్ ఫైసల్ బిన్కు కరోనా సోకడంతో ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. ఫైసల్ బిన్(72) వయసులో పెద్దవాడు కావడంతో అతన్ని ఐసీయుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటికే సౌదీ రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్లతో పాటు మిగతావారు ఐసోలేషన్కు వెళ్లిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే సౌదీలో ప్రఖ్యాత మక్కా, మదీనాలను ప్రజలెవరు సందర్శించకుండా మార్చి మొదటివారంలోనే మూసివేశారు.(దేశంలో 5,734కు చేరిన కరోనా కేసులు) సౌదీ రాజులు వేల సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారు క్రమం తప్పకుండా యూరోప్ దేశాలకు వెళ్లివస్తుంటారు. కాగా విదేశాల్లో వైరస్ బారిన పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే వారందరిని సౌదీకి తీసుకువచ్చి క్వారంటైన్లో ఉంచారు. కరోనా విజృంభిస్తోన్నసమయం కావడంతో దేశం వెలుపల, అలాగే సౌదీ ప్రావిన్సుల మధ్య ప్రయాణాలు చాలావరకు పరిమితం చేశారు. అలాగే సౌదీలోని నాలుగు గవర్నెన్పెలతో పాటు ఐదు ప్రధాన నగరాలు 24 గంటల లాక్డౌన్లో ఉంచబడినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. కాగా ఇప్పటివరకు సౌదీలో 2932 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 41కి చేరింది. -
మునివేళ్ల సృష్టి
అందమైన చిత్రాలను సున్నితమైన బ్రష్తో తీర్చిదిద్దుతారు. కానీ, కేరళలోని త్రిస్సూర్కు చెందిన వినీ వేణుగోపాల్ తన మునివేళ్లతో అద్భుత చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు 200 కు పైగా చిత్రాలను బ్రష్ లేకుండా వేళ్లతోనే ‘గీసిన’ వినీని పరిచయస్తులందరూ ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ప్యాలెస్ చేరిన చిత్రం రంగులను అద్దుకున్న వేళ్లు తెల్లని కాన్వాస్ పైన కదులుతూ ఒక మంచి చిత్రంగా ప్రాణం పోసుకునే కళలో మూడేళ్లుగా రాణిస్తున్నారు వినీ. ప్రస్తుతం ఆమె సౌదీ అరేబియాలో ఉంటున్నారు. భర్త అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. ఏడాదిన్నర కొడుకు. పేరు గెహాన్. వాడిని ఆడించడం కోసం రకరకాల ప్రయోగాలు చేసేవారు వినీ. ‘ఆ ప్రయోగాల ఫలితమే ఇది’ అంటూ ఇటీవల రియాద్లోని నైలా ఆర్ట్ గ్యాలరీలో తన వేలి చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు. ఆ ప్రదర్శనలో ఉంచిన సౌదీ రాజు అమిర్ మహమ్మద్ బిన్ సల్మాన్ చిత్రం ఇప్పుడు అక్కడి ప్యాలెస్లో చేరింది! కొడుకు ఆటకు రంగులు వినీ చిన్నప్పటి నుంచే పెయింటింగ్లో తన ప్రతిభ కనబరిచేది. అయితే, ఫింగర్ పెయింటింగ్ మాత్రం మూడేళ్ల నుంచే వేస్తున్నారు ఆమె. ఆసక్తి కొద్ది తనకు తానే సాధన చేసిన వినీ ఇప్పుడు ఈ వర్క్లో బిజీగా మారిపోయారు. తన కొడుకు ఆట కోసం మైదా, అందులో కొన్ని ఫుడ్ కలర్స్ను ఉపయోగించే క్రమంలో కొడుకుతోపాటూ తనూ కొత్త కొత్త నమూనాలు తయారు చేశారు. అక్కణ్ణుంచే వేళ్లతో పెయింటింగ్ వేస్తే బాగుంటుందనే ఆలోచన చేసి, ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. వాటర్ కలర్స్, ఆక్రిలిక్, పేస్టల్ కలర్స్తో అందమైన కొలను, సముద్రం ఒడ్డున పిల్లలు కట్టే ఇసుక గూళ్లు.. ఇలా ఏదో ఒకదాన్ని ఆ పెయింటింగ్లో ప్రధాన అంశంగా తీసుకుంటారు వినీ. కర్ణాటకలో జరిగే కంబాల బఫెలో రేస్, భయంకరమైన వన్యమృగాల వేట, ఆటలకు సంబంధించిన అంశాలకు కూడా ఆమె తన వేళ్లతో ప్రాణం పోశారు. సౌదీలో ఉండటం వల్ల కావచ్చు.. వినీ చిత్రాల్లో ఎక్కువగా అరేబియన్ జీవన శైలి కనిపిస్తుంది. లాంతరు చేతిలో పట్టుకున్న అరబిక్ మహిళ, ఒంటెల సవారీ, ఎడారి, ఖర్జూర చెట్లు, కాక్టస్ మొక్కలు.. ఇలా ఎన్నో ప్రకృతి నేపథ్యాలు ఈ చిత్రాల్లో కనిపిస్తాయి. 2017లో బహ్రెయిన్లో జరిగిన త్రీడీ పెయింటింగ్లో గిన్నిస్ రికార్డ్ను, 2018లో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డులను పొందారు వినీ. ఎంచుకున్న కళతో ఓ కొత్త దారి వేసుకుంటూ వినీ తనప్రత్యేకతను చాటుకుంటూ వెళుతున్నారు. – ఆరెన్నార్ -
'జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ చేయలేదు'
వాషింగ్టన్ : వాట్సప్ మెసేజ్ ద్వారా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ వాషింగ్టన్లోని సౌదీ ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ ట్విటర్ ద్వారా అధికారులు స్పందిస్తూ.. బెజోస్ ఫోన్ హ్యాక్కు గురైందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహ్మద్ బిన్ సల్మాన్కు బెజోస్ ఫోన్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఏముంటదని తెలిపారు. కాగా 2018లో సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ నుంచి ఓ వాట్సాప్ మెసేజ్ రిసీవ్ చేసుకున్న అనంతరం జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని వాషింగ్టన్ పత్రిక పేర్కొన్న విషయం తెలిసిందే. మహ్మద్ బిన్ సల్మాన్ వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్ నుంచి వైరస్తో కూడిన వీడియో ఫైల్ను పంపడం ద్వారా 2018 నుంచి అమెజాన్ చీఫ్ ఫోన్కు సంబంధించిన డేటా చోరీకి గురైందని తమ కథనంలో పేర్కొంది. దీంతో పాటు 2018లో కాలమిస్ట్ జమల్ ఖషోగ్గి మరణానికి సౌదీ రాజుకు ప్రమేయముందని సెంట్రల్ కూడా తమ కథనంలో రాసుకొచ్చింది. (జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ చేసిన సౌదీ రాజు) -
ఓఐసీ తీరు గమనించాలి
అంతర్జాతీయ రాజకీయ యవనికపై చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రత్యేకించి మన దేశాన్ని ప్రభావితం చేయగలవాటిని సహజంగానే కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియా నేతృత్వంలోని ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ(ఓఐసీ) కశ్మీర్పై పాకిస్తాన్లో వచ్చే ఏప్రిల్లో నిర్వహించతలపెట్టిన సదస్సును ఆ కోణంలోనే చూస్తోంది. సౌదీ అరేబియా మన మిత్ర దేశం. అంతర్జాతీయ వేదికల్లో చాన్నాళ్లుగా మన దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తుందన్నది వాస్తవం. ఈమధ్యకాలంలో ఓఐసీతో అడపా దడపా భారత్ వ్యతిరేక ప్రకటనలు ఇప్పించడంలో విజయం సాధించిన పాకిస్తాన్కు తాజా నిర్ణయం సంతోషం కలిగించింది. వాస్తవానికి కశ్మీర్పై ఓఐసీ విదేశాంగ మంత్రుల సదస్సు జరిపించాలని పాకిస్తాన్ ప్రయత్నించింది. కానీ దాన్ని సంస్థ సభ్య దేశాల పార్లమెంటేరియన్ల సదస్సుగా కుదించడా నికి సౌదీ తెరవెనక ప్రయత్నాలు గట్టిగానే చేసింది. అది చివరకు ఫలించింది. సమావేశ స్థలి ముందనుకున్నట్టు సౌదీ అరేబియా కాదని, పాకిస్తానేనని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాత్రం జరగడమైనా పాకిస్తాన్ విజయమని చెప్పుకోవాలి. యాభైయ్యేళ్లక్రితం... అంటే 1969లో ఓఐసీ శిఖరాగ్ర సమావేశానికి మన దేశం ప్రతినిధి వర్గం హాజరైనప్పుడు అప్పటి పాకిస్తాన్ సైనిక నియంత జనరల్ యాహ్యాఖాన్ పట్టుబట్టి ఆ ప్రతినిధి వర్గాన్ని బయటకు పంపించగలిగాడు. అయితే 2019 ఫిబ్రవరిలో జరిగిన ఒక పరిణామంతో పాకిస్తాన్ ఖంగుతింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మార్చిలో జరగబోయే ఓఐసీ సమావేశాలకు భారత్ను ‘గౌరవS అతిథి’గా ఆహ్వానించబోతున్నామని అప్పట్లో సౌదీ అరేబియా ప్రకటించింది. అనంతరం అప్పటి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఆ సమావేశానికి హాజరై భారత్ గళాన్ని వినిపించారు. అది మొదలు పాక్ ఓఐసీలో భారత వ్యతిరేక ప్రచారం చేస్తూనే వుంది. దాని ఫలితమే ప్రస్తుత పార్లమెంటేరియన్ల సమావేశం. వాస్తవానికి కశ్మీర్ ప్రతిపత్తిని మార్చినప్పుడు ఓఐసీ స్పందించింది. బాబ్రీ మసీదు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం తదితర అంశాల్లో కూడా ఓఐసీ ప్రకటనలిచ్చింది. మైనారిటీలుగా వున్న ముస్లింల భద్రతను పట్టించుకోవాలని, పవిత్ర ఇస్లామిక్ స్థలాలను పరిరక్షించాలని మన దేశాన్ని కోరింది. వివక్షకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి గతంలో చేసిన తీర్మానాన్ని కూడా ప్రస్తా వించింది. వీటన్నిటి వెనకా పాకిస్తాన్ ఒత్తిళ్లున్నాయని సులభంగానే అర్ధమవుతుంది. భారత్ను శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించిన పది నెలల్లోనే ఓఐసీ వైఖరి మారడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికి ఓఐసీని తన దారికి తెచ్చుకోవడానికి పాకిస్తాన్ చాన్నాళ్లుగా చేస్తున్న ప్రయ త్నాలు ఈ నిర్ణయంతో కొత్త మలుపు తిరిగాయి. సంస్థపై పట్టున్న సౌదీ అరేబియాకూ, దాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని ఆశిస్తున్న మలేసియాకూ వున్న విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాల పర్యవసానంగానే ఓఐసీ పార్లమెంటేరియన్ల సదస్సు జరగబోతోంది. స్వదేశంలో సమస్యలున్నప్పుడు, వాటిని తీర్చలేనప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాల కులు రకరకాల ప్రయత్నాలు చేయడం ఏ దేశంలోనైనా వున్నదే. ఇప్పుడు ఓఐసీ పాకిస్తాన్కు ఆవిధం గానే వుపయోగపడుతోంది. కశ్మీర్ పౌరుల కోసం తాను అంతర్జాతీయంగా కృషి చేస్తున్నానని చెప్పుకోవడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఓఐసీ పార్లమెంటేరియన్ల సదస్సు తోడ్పడుతుంది. ఇలాంటి అవసరమే మలేసియా ప్రధాని మహతీర్ మహమ్మద్కు కూడా వుంది. అందుకే ఆయన కూడా ఈమధ్య తరచు కశ్మీర్పై ప్రకటనలు చేస్తున్నారు. ఓఐసీపై పట్టుకోసం చేస్తున్న ప్రయత్నాల వుద్దేశమూ అదే. కనుకనే ఆయన డిసెంబర్ నెలాఖరున టర్కీ సహకారంతో ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వెళ్లబోతున్నట్టు ప్రకటించి పాకిస్తాన్ సౌదీని కంగారుపెట్టింది. కానీ దాని ఒత్తిళ్లకు తలొగ్గి చివరి నిమిషంలో వెనక్కుతగ్గింది. ఈమధ్యే సౌదీ పర్యటనకెళ్లిన ఇమ్రాన్ ఖాన్ తన వైఖరి మార్చుకున్నారు. పాకిస్తాన్ను సంతృప్తిపరచడం కోసం కశ్మీర్పై ఓఐసీ దేశాల పార్ల మెంటేరియన్ల సదస్సు జరపడానికి సౌదీ అరేబియా అంగీకరించింది. మన దేశంలో ముస్లింలు మైనారిటీలే కావొచ్చుగానీ, చాలా ముస్లిం దేశాలతో పోలిస్తే మన దేశంలోని ముస్లిం జనాభా అధికం. నిజానికి ఈ కారణంతోనే 1969లో మన దేశాన్ని ఓఐసీ సమా వేశానికి ఆహ్వానించారు. ముస్లింల అభ్యున్నతి కోసం తీసుకునే ఓఐసీ తీసుకునే చర్యలు భారతీయ ముస్లింలకు కూడా చేరాలంటే ఇది సరైన మార్గమని దాని నిర్వాహకులు భావించారు. కానీ భారత్పై శత్రుత్వం వున్న పాకిస్తాన్ దీన్ని పడనివ్వలేదు. ముస్లిం దేశాల్లో అతి పెద్ద జనాభావున్న ఇండో నేసియాతోపాటు సిరియా, అల్జీరియా వంటివి కూడా మన దేశంపట్ల సానుకూలంగానే వున్నాయి. కశ్మీర్పై కఠిన పదజాలంతో ప్రకటన చేయడాన్ని అవి వ్యతిరేకించాయి. భారత్ని గౌరవ అతిథిగా ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని ఈ ఏడాది మొదట్లో బంగ్లాదేశ్తోపాటు టర్కీ కూడా గట్టిగా సమర్థిం చింది. ఇప్పుడు మాత్రం భారత వ్యతిరేక ప్రకటనలు చేస్తోంది. కాగా, కొందరిని విదేశీయులుగా ముద్రవేసి తమ దేశం పంపాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలపై బంగ్లాదేశ్ గుర్రుగా ఉంది. ఈ అంశాలపై మన దేశం ఆచితూచి వ్యవహరించాలి. తన చర్యల వెనకున్న ఉద్దేశాలపై ప్రపంచ దేశాలన్నిటికీ వివరించాలి. అదే సమయంలో ఓఐసీ అంతర్గత రాజకీయాల మాటెలావున్నా ఇక్కడి ప్రభుత్వ చర్య లపై అసమ్మతివుంటే దాన్ని వ్యక్తం చేయడానికి, ఒత్తిళ్లు తీసుకురావడానికి, పోరాడటానికి ఈ దేశ పౌరులకు సత్తావుంది. బలూచిస్తాన్ వంటిచోట స్థానికుల ఆకాంక్షలను అణచడానికి అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ కశ్మీర్ విషయంలో సద్దులు చెప్పడానికి, ఓఐసీలాంటి సంస్థను స్వప్రయోజనాలకు వాడుకోవాలని చూసే ప్రయత్నాల వల్ల ఒరిగేదేమీ వుండదు. -
సౌదీలో 88వేల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్
వాషింగ్టన్: సౌదీ అరేబియాలో ఆ దేశ అధికారులకు అనుకూలంగా సందేశాలు పోస్ట్ చేస్తున్నందుకు గానూ దాదాపు 88 వేల అకౌంట్లను శుక్రవారం బ్లాక్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఇక ట్రంప్నకు అనుకూలంగా, ప్రత్యర్థులను కించపరిచే రీతిలో పోస్టులు చేసినందుకు గానూ వియత్నాం, అమెరికా, జార్జియాలలో 600 అకౌంట్లను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సంస్థలు బ్లాక్ చేశాయి. అలాగే వియత్నాంలోని ఓ నెట్వర్క్ను బ్లాక్ చేసినట్లు ఫేస్బుక్ తెలిపింది. సౌదీలో బ్లాక్ చేసిన 88 వేల అకౌంట్లలో 5,927 అకౌంట్ల సమాచారాన్ని ట్విట్టర్ విడుదల చేసింది. సౌదీకి చెందిన సోషల్ మీడియామార్కెటింగ్ సంస్థ స్మాట్ సమాచార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ట్విట్టర్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. -
ముఖేష్ అంబానీకి షాక్!
ప్రపంచ చమురు రంగంలో పాగా వేయాలనుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానికి షాక్ తగలనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్ వ్యాపారంలో 25 శాతం వాటా కొనుగోలు చేయాలని భావించిన ప్రపంచంలోనే అతి పెద్ద చమురు సంస్థ, సౌదీ ఆరామ్కోకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రిలయన్స్ వ్యాపారంలోని 25 శాతం వాటాను ఆరామ్కో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని భారత ప్రభుత్వం అడ్డుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వార్తను ప్రచురించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ గ్యాస్పై కొనసాగుతున్న కోర్టు కేసులో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. తమ కంపెనీ ఆస్తులను వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రిలయన్స్ డైరెక్టర్లను ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 6న విచారణ చేపట్టనున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. గతంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్స్ వ్యాపారంలో మైనారిటీ (25 శాతం)వాటా కోసం సౌదీ ఆరామ్కో కంపెనీ 1,000–1,500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాకరించింది. మార్కెట్ ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం అస్సలు కుదరదు!
రియాద్ : సాంప్రదాయ ఆయిల్ ఆర్థిక వ్యవస్థ కలిగిన సౌదీ అరేబియా, దుబాయ్ తరహా ఆయిలేతర ఆర్ధిక వ్యవస్థను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఇటీవల దాదాపు 49 దేశాలకు ఆన్లైన్ వీసా సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. వీటిలో అమెరికా, ఆస్ట్రేలియా వంటి పాశ్చాత్య దేశాలు కూడా ఉన్నాయి. అయితే సాంప్రదాయిక పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఆ దేశంలోని ప్రజలకు, ముఖ్యంగా మహిళలపై ఎన్నో ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు పర్యాటకుల ద్వారా వాటికి భంగం కలగకుండా చూసేందుకు ఆదేశం కొన్ని నిర్దిష్ట చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా విదేశీ పర్యాటకులు సౌదీలో పర్యటించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలంటూ కొన్ని మార్గదర్శకాలను శనివారం విడుదల చేసింది. వాటిల్లో డ్రెస్కోడ్ అతి ముఖ్యమైంది. మహిళలు భుజాలు, మోకాళ్లు కప్పి ఉంచేలా వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం లాంటివి అస్సలు కుదరదు. అశ్లీలత, అసభ్యత లాంటి వాటికి పర్యాటకులు దూరంగా ఉండాలి. ఇలా దాదాపు 19 నిబంధనలను ఆదేశ పర్యాటక శాఖ తన వెబ్సైట్లో ఇంగ్లీష్ భాషలో విదేశీ పర్యాటకుల కోసం అందుబాటులోకి ఉంచింది. అయితే నిబంధనలను అతిక్రమిస్తే ఎంత జరిమానా విధిస్తారనేది స్పష్టం చేయలేదు. -
అమెరికా అబద్ధాలు గరిష్టానికి చేరాయి
టెహ్రాన్ : సౌదీ అరేబియాలోని ఆరామ్కోకు చెందిన అతిపెద్ద చమురు క్షేత్రంలో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేయడం తెలిసిందే. దాడులకు ఇరాన్ కారణమని అమెరికా ఆరోపించడంతో ఈ ఘటన అంతర్జాతీయ మలుపు తీసుకుంది. దాడికి మేమే కారణమని యెమెన్లోని హౌతీ ఉగ్రవాదులు ప్రకటించారు. కానీ ఉగ్రదాడిలో ప్రధాన దోషి ఇరాన్ అని అమెరికా తేల్చేసింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్పాంపియో మాట్లాడుతూ ‘సౌదీ అరేబియాపై జరిగిన దాదాపు 100 దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉంది. ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ, విదేశాంగ మంత్రి జరీఫ్లు ఈ దాడులతో తమకు ఏం సంబంధం లేదన్నట్లు నటిస్తున్నారు. ఈ దాడులు యెమెన్ నుంచి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఇరాన్ ఇప్పుడు ప్రపంచ ఇంధన సరఫరాపై దాడిని ప్రారంభించింది.’ అని ప్రకటించారు. దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ‘ఇలాంటి దాడులను ఎదుర్కొనేంత సామర్థ్యం తమ దేశానికి ఉందని, ఎలాంటి చర్యలకైనా మేం సిద్ధంగా ఉన్నామని’ తెలిపారు. సౌదీ తీసుకునే నిర్ణయాలకు అమెరికా సహాయం ఉంటుందని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘ఈ దాడులతో ప్రపంచ వాణిజ్యం ఒడిదుడుకులకు లోనవుతందని’ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అమెరికా ఆరోపణలపై ఇరాన్ భగ్గుమంది. అమెరికా అబద్ధాలు గరిష్టానికి చేరాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ సైనిక అధికారి ఒకరు మాట్లాడుతూ ‘దీని అర్థం ఏంటి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారా? మేం యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధమే’ అని అమెరికాను హెచ్చరించారు. ‘సౌదీపై దాడుల వెనక ఇరాన్ హస్తం ఉందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఇరాన్కు వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయడానికి అమెరికా చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ఇవన్నీ’ అని మండిపడ్డారు. ఇరాన్పై నిరంతరం ఒత్తిడి చేయడం ఒక హక్కుగా అమెరికా భావిస్తోంది. తీవ్ర ఒత్తిడి చేయాలని ప్రయత్నిస్తూ మరింత తీవ్రంగా అబద్ధాలు చెబుతోంది’ అని ఎద్దేవా చేశారు. ఇరాన్ నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని అమెరికన్ స్థావరాలు, వాటి ఓడలు మా క్షిపణుల పరిధిలో ఉన్నాయనే విషయం అక్కడి నాయకులు మర్చిపోయారేమో అని ఆ అధికారి హెచ్చరికలు జారీచేశారు. కాగా, సౌదీ అరేబియా తమపై జరుపుతున్న గగనతల దాడులకు వ్యతిరేకంగా 10 సాయుధ డ్రోన్లను సౌదీ చమురు క్షేత్రాలపై దాడులకు పంపించినట్లు యెమెన్కు చెందిన హౌతీ ఉగ్రవాదులు మరోసారి స్పష్టం చేశారు. చదవండి : సౌదీ చమురు క్షేత్రాలపై ఉగ్రదాడి -
సౌదీ ప్రభుత్వ ఆయిల్ కంపెనీపై డ్రోన్దాడి కలకలం
సౌదీ అరేబియాలోని ప్రభుత్వ చమురు ఉత్పత్తిదారు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తూర్పు సౌదీ అరేబియాలో సౌదీ ఆరాంకో ప్రాసెసింగ్ యూనిట్లపై ఉగ్రదాడి కలకలం రేపింది. కంపెనీకి చెందిన రెండు ఆయిల్ యూనిట్ల లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడులు జరిగాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. బుక్యాక్లోని ప్రాసెసింగ్ ప్లాంట్, ఖురైస్ చమురు క్షేత్రంపై జరిగిన ఈ దాడి నేపథ్యంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టంలేదని తెలిపింది. ఆరాంకో భద్రతా బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని వెల్లడించింది. ఇక్కడ రోజుకు 7 మిలియన్ బారెల్స్ ముడి చమురును ప్రాసెస్ అవుతుందని అంచనాలు సూచిస్తున్నాయి. కాగా ఈ దాడిపై ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత వహించలేదు. ఈ ప్లాంట్ను గతంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. 2006లో అల్-ఖైదా ఆత్మాహుతి దళాలు ఈ చమురుసముదాయంపై దాడికి విఫలయత్నం చేశాయి. -
అడ్డదారిలో యూఏఈకి..
సాక్షి, నిజామాబాద్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కు విజిట్ వీసాపై వెళ్లి ఉపాధి పొందాలనుకునేవారికి అక్కడి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఆ దేశంలో ఉపాధి పొందాలనుకుంటే ఇక నుంచి కచ్చితంగా వర్క్ వీసా ఉండాల్సిందే. ఈ నిబంధన గతంలోనే ఉన్నా ఇటీవల యూఏఈ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. విజిట్ వీసాలపై వచ్చి కల్లివెల్లి(అక్రమ నివాసులు)గా మారి పనిచేస్తున్న వారి సంఖ్య ఏటా పెరిగిపోతుండటంతో దీనిని నియంత్రించడానికి యూఏఈ చర్యలు చేపట్టింది. విజిట్ వీసాపై వచ్చిన వారిని పనిలో పెట్టుకోవద్దని కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. ఆ దేశంలో మన విదేశాంగ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రం సానుకూలంగా స్పందించింది. విజిట్ వీసాలపై వచ్చి ఉపాధి పొందాలనుకునేవారికి కలిగే నష్టాల గురించి వివరిస్తోంది. సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏం జరుగుతుందంటే.. యూఏఈకి ఇప్పటి వరకు విజిట్ వీసాపై వచ్చి వర్క్ వీసా పొందేందుకు అవకాశం ఉంది. కానీ, వర్క్ వీసా పొందిన కార్మికులు ఆ వెంటనే ఆ దేశం విడిచి వచ్చి.. ఆ తర్వాత వర్క్ వీసాపై మళ్లీ కొత్తగా యూఏఈకి వెళ్లి ఉపాధి పొందవచ్చు. అయితే, దీనిని ఆసరా చేసుకుని లైసెన్స్డ్ ఏజెంట్లు అక్రమార్జనకు దారులు తెరిచారు. యూఏఈ వర్క్ వీసా లభించకపోతే విజిట్ వీసాపై వెళ్లి ఏదైనా కంపెనీలో పని దక్కించుకునే అవకాశం ఉండటంతో ఏజెంట్లు కార్మికులను ఇదే తరహాలో ఆ దేశానికి తరలిస్తున్నారు. వర్క్ వీసా దొరికిన కార్మికులు ఢిల్లీ లేదా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న యూఏఈ రాయబార కార్యాలయాల్లో వీసా స్టాంపింగ్ చేయించుకుని వెళ్లడానికి అవకాశం ఉంది. లైసెన్స్డ్ ఏజెంట్ల మోసాలు ఇలా.. అక్రమ వలసలను అరికట్టి, చట్టబద్ధమైన సురక్షిత వలసల కోసం ప్రభుత్వం లైసెన్స్లు మంజూరు చేస్తోంది. అయితే, ఈ లైసెన్స్లు పొందిన రిజిస్ట్రర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్లే అక్రమ దందాకు తెరలేపారు. మన దేశంలో వీసా స్టాంపింగ్ చేయించుకుంటే రూ.6 వేలు మెడికల్ టెస్ట్ల కోసం, రూ.11వేలు యూఏఈ ఎంబసీకి ఫీజు చెల్లించాలి. ఎంబసీలో సకాలంలో పనికాకపోతే ఒకటి రెండు రోజులు అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఇందుకు మరికొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. లైసెన్స్డ్ ఏజెంట్లు కార్మికుల నుంచి వీసా కోసం రూ.60 వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో ఎంబసీలో స్టాంపింగ్ కోసం రూ.17వేలు, ఇతర ఖర్చులు పోను మిగిలిన దానిలో విమాన చార్జీలు, మధ్యవర్తులకు కమీషన్ చెల్లించడం వల్ల తమకు లాభం తగ్గిపోతుందని లైసెన్స్డ్ ఏజెంట్లు భావిస్తున్నారు. ఇక్కడ స్టాంపింగ్ చేయించడం కంటే విజిట్ వీసాపై యూఏఈ పంపిస్తే రూ.20వేల ఖర్చులో కార్మికుడు అక్కడకు చేరుకుంటున్నాడు. ఎలాగూ కంపెనీతో ఏజెంట్లు ముందుగా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వర్క్ వీసా సులభంగానే లభిస్తుంది. అందువల్ల విజిట్ వీసాలపైనే కార్మికులను యూఏఈకి తరలించడానికి ఏజెంట్లు మొగ్గుచూపుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా విజిట్ వీసాలపై కార్మికులను యూఏఈకి తరస్తున్నారు. ప్రయోజనాలుపొందలేకపోతున్న కార్మికులు విజిట్ వీసాపై యూఏఈ వెళ్లి వర్క్ వీసా పొందుతున్న కార్మికులు మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. విజిట్ వీసాపై వెళ్లిన వారి సమాచారం మన ప్రభుత్వం వద్ద ఉండే అవకాశం లేదు. ఇక్కడి నుంచి వర్క్ వీసాపై యూఏఈ వెళ్లిన వారికి రూ.10లక్షల ప్రవాసీ భారతీయ బీమా యోజన, ఇతర సదుపాయాలు అందుతాయి. కానీ, లైసెన్స్డ్ ఏజెంట్లు తమ లాభం పెంచుకోవడానికి అడ్డదారిలో కార్మికులను తరలిస్తుండటంతో వలస జీవులు ఎంతో నష్టపోతున్నారు. పోలీసులు, విదేశాంగ శాఖ దృష్టిసారిస్తేనే.. యూఏఈకి అడ్డదారిలో కార్మికుల తరలింపుపై మన పోలీసులు, విదేశాంగ శాఖ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. విజిట్ వీసాలపై కార్మికులను తరలిస్తుండటాన్ని అడ్డుకుని ఇక్కడే వర్క్ వీసా జారీ చేయించి వలస వెళ్లేలా విదేశాంగ శాఖ చొరవ తీసుకోవాల్సి ఉంది. కార్మికుల ప్రయోజనాలను కాపాడాలన్నా, మన ప్రభుత్వం వద్ద వలస కార్మికుల వివరాలు ఉండాలన్నా.. చట్ట బద్దంగా ఇక్కడి నుంచి వర్క్ వీసాలపై యూఏఈ వెళ్లడానికి విదేశాంగ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. యూఏఈలో ఉపాధి కోసం రెండు రకాల వీసాలు.. యూఏఈలో పని కల్పించడానికి రెండు రకాల వీసాలను జారీచేస్తున్నారు. మన దేశం నుంచి యూఏఈ వెళ్లాలనుకునేవారికి సౌదీ అరేబియా తరహాలో పాస్పోర్టుపై మన దేశంలోనే యూఏఈ రాయబార కార్యాలయంలో వీసా స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, అబుదాబి, షార్జా, దుబాయిలలోనే కొన్ని ఎంపిక చేసిన కంపెనీల్లో ఉపాధి కోసం పాస్పోర్టులో వీసా స్టాంపింగ్ చేయిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ లేదా కేరళలోని తిరువనంతపురం యూఏఈ రాయబార కార్యాలయాల్లో వీసా స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంది. వీసా పొందిన వారికి మన దేశంలోనే మెడికల్ టెస్టులను చేస్తారు. రెండో రకం వర్క్ వీసాలను పేపర్ ప్రింటింగ్ ద్వారానే జారీచేస్తున్నారు. ఈ వీసాలు పొందిన వారు యూఏఈ వెళ్లిన తరువాత ‘గమ్కా’ మెడికల్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. విజిట్ వీసాపై వెళ్లి నెల రోజులు ఉండివచ్చా.. వర్క్ వీసాను దుబాయిలో తీసుకోవచ్చనే ఉద్దేశంతో విజిట్ వీసాపై గత నెలలో వెళ్లాను. కానీ, అక్కడ సరైన పని దొరకలేదు. దీంతో నెల రోజుల పాటు ఉండి వర్క్ వీసాల కోసం ఎంతో ప్రయత్నించాం. ఆశించిన పని, వేతనం లేక పోవడంతో తిరిగి ఇంటికి వచ్చా. ఇక్కడే చిన్న కిరాణ దుకాణం నడుపు కుంటున్నా. – పెండెం మోహన్, వడ్యాట్(నిజామాబాద్ జిల్లా) ఇక్కడే వర్క్ వీసా పొందాలి.. మా గ్రామానికి చెందిన వ్యక్తి దుబాయిలో ఉన్నాడు. వర్క్ వీసా ఇప్పిస్తానంటే.. నాతో పాటు మరో వ్యక్తి కలిసి నెల రోజుల కిందట విజిట్ వీసాపై వెళ్లాం. కానీ, పని దొరకకపోవడంతో అక్కడి నుంచి తిరిగి వచ్చాం. విజిట్ వీసాలపై వెళ్లి వర్క్ వీసా తీసుకోవాలనుకోవడం పొరపాటే. ఆర్థికంగా నష్టపోయాం. – విప్పులాయి నవీన్, వడ్యాట్(నిజామాబాద్ జిల్లా) -
’నాన్న చనిపోయారు.. ఇండియాకు రావాలనుంది’
సాక్షి, హైదరాబాద్ : ‘మా నాన్న చనిపోయారు. ఇండియా రావాలనుంది. నాకు మీ సహకారం కావాలి’అంటూ రంగారెడ్డి జిల్లా కర్మన్ఘాట్లోని భూపే ష్గుప్తా నగర్కు చెందిన రాములు కుమార్తె జి.సునీత సౌదీ అరేబియా నుంచి మాజీ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసింది. ‘గత డిసెంబర్లో మా చెల్లి చనిపో యింది. అప్పుడు కూడా వీళ్లు నన్ను పంపించలేదు. ఈ నెల 26న మా నాన్న చనిపోయాడు. ఇండియాకు రావాలని ఉంది. నాన్నను చూడాలని ఉంది. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. అయినా వీళ్లు పంపడం లేదు. పాస్పోర్ట్ తీసుకుని ఇవ్వడం లేదు. దయచేసి నాకు సహాయం చేయండి సార్’అని కేటీఆర్ను వేడుకుంది. దీనికి ఆయన వెంటనే స్పందించారు. సౌదీ అరేబియా ఎంబసీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పూర్తి వివరాలు పంపాల్సిందిగా సూచించారు. ఇండియాకు తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు. -
నిర్లవణీకరణకు కొత్త మార్గం!
సముద్రపు నీటిని పూర్తిస్థాయిలో మంచినీటిగా మార్చగలిగితే భూమ్మీద నీటి కొరతన్నది అస్సలు ఉండదు. అయితే వేర్వేరు కారణాల వల్ల పూర్తిస్థాయి నిర్లవణీకరణ అన్నది సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వినూత్న పరికరం అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని వాడుకుంటూ ఈ పరికరం సముద్రపు నీటిలోని లవణాలను తొలగించడం.. తద్వారా మంచినీటిని తయారు చేయడం విశేషం. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు ఎంత ఉత్పత్తి అవుతుందో అందుకు ఎన్నో రెట్లు ఎక్కువ వేడి కూడా పుడుతూంటుంది. ఈ వేడి కారణంగా కాలక్రమంలో సోలార్ ప్యానెల్స్ విద్యుదుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతూంటుంది కూడా. సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు సోలార్ ప్యానెల్స్ అడుగుభాగంలో పలు పొరలు ఏర్పాటు చేసి ఉపయోగించారు. గొట్టాలతో కూడిన ఈ పొరల గుండా ఉప్పునీరు ప్రయాణించినప్పుడు సోలార్ ప్యానెల్స్ తాలూకూ వేడి కారణంగా వేడిగా మారతాయి. ఇలా పుట్టిన ఆవిరి పలుచటి త్వచం ద్వారా ఇంకో పొరలోకి చేరుతుంది. అక్కడ ఘనీభవించి మంచినీరుగా మారుతుంది. ఈ ఏర్పాటు కారణంగా సోలార్ ప్యానెల్స్ చల్లగా ఉంటూ విద్యుదుత్పత్తిలో నష్టం జరగదని.. అదే సమయంలో ప్యానెల్స్ను శుభ్రం చేసుకునేందుకు లేదా పంటలు పండించుకునేందుకు అవసరమైన మంచినీరు అందుబాటులోకి వస్తుందని సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
కాన్సులేట్లతో కష్టాలకు చెక్!
ఎన్.చంద్రశేఖర్–మోర్తాడ్, నాగమళ్ల శ్రీకర్–రాయికల్ హైదరాబాద్లో తమ కాన్సులేట్ కార్యాలయాలను ప్రారంభించడానికి సౌదీ అరేబియా, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. తమ దేశాలకు వలస వచ్చే కార్మికులకు అవసరమైన వీసా స్టాంపింగ్, ఇతరత్రా సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో సౌదీ, యూఏఈ దేశాల రాయబార కార్యాల యాలు ఉండగా, ముంబైలో సౌదీ అరేబియా కాన్సులేట్ ఉంది. అలాగే యూఏఈ కాన్సులేట్ కార్యాలయాలు ముంబైలో, కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు పెరగడం, ప్రస్తుతం ఉన్న కాన్సులేట్ కార్యాలయాల్లో పని భారం అధికం కావడంతో కొత్త కాన్సులేట్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సౌదీ, యూఏఈ దేశాల విదేశాంగ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దక్షిణ భారత దేశంలో తమ దేశాల కాన్సులేట్ కార్యాలయాలను విస్తరించనున్నాయి. హైదరాబాద్లో వివిధ దేశాల కాన్సులేట్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు గతంలో ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించారు. భారత్ విన్నపం మేరకు సౌదీ, యూఏఈ ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడంతో కాన్సులేట్ కార్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే యూఏఈ విదేశాంగ శాఖ, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయీద్ అల్ నహాన్ హైదరాబాద్ నగరంలో పర్యటించారు. గత సంవత్సరం జనవరిలో పర్యటించిన ఆయన హైదరాబాద్లో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అందుబాటులోకి రానున్న సేవలు హైదరాబాద్లో సౌదీ, యూఏఈ దేశాల కాన్సులేట్ కార్యాలయాలు ప్రారంభించడం వల్ల వీసా స్టాంపింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా వివిధ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లే వారికి వీసా జిరాక్సు కాపీ చేతిలో ఉంటే సరిపోతుంది. కానీ, సౌదీ అరేబియాకు, యూఏఈలోని పలు పట్టణాలకు వలస వెళ్లే వారికి మాత్రం పాస్పోర్టులోనే వీసా స్టాంపింగ్ చేయాల్సి ఉంది. అందువల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు సౌదీ అరేబియాకు వెళ్లడానికి వీసా స్టాంపింగ్ కోసం ఢిల్లీలోని రాయబార కార్యాలయం లేదా ముంబైలోని కాన్సులేట్ కార్యాలయానికి వెళ్తుంటారు. కాన్సులేట్ కార్యాలయాలకు వెళ్లే వీలులేని వారు ట్రావెలింగ్ ఏజెన్సీల ద్వారా తమ పాస్పోర్టులను స్టాంపింగ్ కోసం పంపిస్తున్నారు. హైదరాబాద్లో కాన్సులేట్ కార్యాలయం ప్రారంభమైతే తెలుగు రాష్ట్రాల వారు వీసా స్టాంపింగ్ కోసం ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం ఉండదు. అలాగే హజ్ యాత్ర, ఏడాది పొడవునా సాగే ఉమ్రా యాత్రలకు వెళ్లాలనుకునేవారు సౌదీ కాన్సులేట్లో సంప్రదించి వీసాను సులభంగా పొందడానికి అవకాశం ఉంది. యూఏఈ పరిధిలోని వివిధ పట్టణాల్లో ఉపాధి కోసం వీసా పొందిన వారు స్టాంపింగ్ కోసం తిరువనంతపురం వెళ్లాల్సివస్తోంది. యూఏఈ వీసా స్టాంపింగ్ కోసం కచ్చితంగా అభ్యర్థులే వెళ్లాల్సి ఉంది. అభ్యర్థుల వేలి ముద్రలు, ఐరిష్ను కాన్సులేట్ కార్యాలయంలో యూఏఈ విదేశాంగ శాఖ అధికారులు సేకరిస్తారు. అమెరికా ప్రభుత్వం వీసా జారీకి అనుసరిస్తున్న విధానాలనే యూఏఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది. అందువల్ల హైదరాబాద్లో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటైతే ఇక తిరువనంతపురం వెళ్లాల్సిన అవసరం తప్పనుంది. తిరువనంతపురం వెళ్లి రావడానికి ఒక్కో అభ్యర్థి రవాణా చార్జీలను రూ.2వేల వరకు భరిస్తున్నాడు. అంతేకాక అక్కడ ఒక రోజు ఉండటం, ఇతర అవసరాల కోసం ఎక్కువ మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తోంది. హైదరాబాద్లో యూఏఈ కాన్సులేట్ ఏర్పాటైతే తెలుగు రాష్ట్రాల వారితోతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. వ్యాపార సంబంధాలు మెరుగుపడే అవకాశం సౌదీ అరేబియా, యూఏఈ కాన్సులేట్ కార్యాలయాలు హైదరాబాద్లో ఏర్పాటు కావడం వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంత మంది గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా యూఏఈ, సౌదీ అరేబియాల్లో సొంతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. కాన్సులేట్ కార్యాలయం మనకు అందుబాటులో ఉండటం వల్ల వ్యాపారాల విస్తరణకు అవసరమైన విదేశాంగ సేవలు సులభం కానున్నాయి. షార్ట్ టర్మ్ వీసాల జారీకి అనువైన వాతావరణం ఏర్పడనుంది. తెలంగాణవాసులకు ఎంతో ఉపయోగం హైదరాబాద్లో కాన్సులేట్ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ దేశాలకు వెళ్లాలనుకునే గ్రామీణ ప్రజలకు ఎమిగ్రేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా డాక్యుమెంట్ కోసం ఢిల్లీకి పోనవసరం లేదు. అంతేకాకుండా అటెస్టేషన్ కష్టాలు కూడా తప్పుతాయి. హైదరాబాద్లో కాన్సులేట్ ఏర్పాటైతే నిరక్ష్యరాస్యులకు భాష సమస్య కూడా తప్పుతుంది. అంతేకాకుండా ఆ దేశాల్లో ఉన్న వారి సమాచారం కాన్సులేట్ ద్వారా పొందవచ్చు. – కటకం రవి, తెలంగాణ గల్ఫ్ కల్చరల్ అసోసియేషన్, దుబాయి సౌదీ కాన్సులేట్ ఏర్పడితే మేలు హైదరాబాద్లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు కావడం వల్ల ఎంతో మేలు జరుగనుంది. వీసా స్టాంపింగ్ కోసం ముంబై వెళ్లాలంటే ఆర్థికంగా భారం మోయాల్సి వస్తోంది. హైదరాబాద్లో కాన్సులేట్ కా ర్యాలయం ఏర్పాటు కావడం వల్ల తెలుగు రాష్ట్రాల వారికి ఆ ఇబ్బందులు తప్పు తాయి. సౌది అరేబియాలో ఉన్న వలస కార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ జిల్లాలకు చెందినవారే ఉన్నారు. సౌదీ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు ఆహ్వానించదగ్గపరిణామం. – మహ్మద్ యూసుఫ్ అలీ, అధ్యక్షుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్దా -
సౌదీ రోడ్డు ప్రమాదంలో తెలంగాణవాసి మృతి
దోహా : కుటుంబ పోషణ కోసం సౌదీకి వెళ్లిన ఓ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలు.. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ జహంగీర్(40) పదేళ్లుగా గల్ఫ్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న భారత దేశ కాలమాన ప్రకారం ఉదయం 8 గంటల సమయంలో జహంగీర్ స్కూటీపై బయటకు వెళ్లాడు. స్కూటీపై వెళ్తున్న అతడిని వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సాబేరాబేగం, ఐదుగురు పిల్లలు ఉన్నారు. జహంగీర్ మృతితో అతడి కుటుంబం రోడ్డున పడింది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి భారీ ఖర్చు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. తండ్రి మృతదేహాన్ని కడసారి చూసే భాగ్యం దక్కుతుందో? లేదో? అని మృతుడి పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. -
సౌదీ మహిళకు చిరు స్వేచ్ఛ
మహిళలను రకరకాల నిషేధాల మాటున అణచి ఉంచుతున్న సౌదీ అరేబియా ప్రభుత్వం తన వైఖరిని కాస్త సడలించుకుంది. వారు వాహనాలు నడపటంపై దశాబ్దాలుగా అమల్లో ఉన్న నిషేధాన్ని తొలగించింది. ఆదివారం వేకువజామున లాంఛనంగా నిషేధం రద్దయిన వెంటనే అనేకమంది మహిళలు కార్లు నడుపుతూ సంబరాలు చేసుకున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఆకాశాన్నంటే సౌధాలు, వెడల్పాటి రహదార్లు, భారీ షాపింగ్ మాల్స్ చూస్తే అది అష్టయిశ్వర్యాలతో తులతూగే దేశమనిపిస్తుంది. అందులో అసత్యమేమీ లేదు. ప్రపంచ చమురు నిల్వల్లో 18 శాతం అక్కడే కేంద్రీకరించి ఉన్నాయి. ఆ విషయంలో ప్రపంచంలోనే సౌదీ అరేబియా ద్వితీయ స్థానంలో ఉంది. సహజవాయు నిల్వల్లో దానిది ఆరో స్థానం. ఆ పెట్రో డాలర్లు తీసుకొచ్చిన వైభోగం అడుగడుగునా అక్కడ కనబడుతుంది. సౌదీని అధికాదాయ దేశంగా ప్రపంచబ్యాంకు పరిగణిస్తోంది. మానవాభివృద్ధి సూచికలోనూ అదెప్పుడూ ముందుంటుంది. కానీ స్త్రీ, పురుష సమానత్వం విష యంలో ఆ దేశానిది అథమ స్థానం. లింగవివక్ష అధికంగా ఉన్న దేశాల్లో సౌదీ అరేబియాది ఏడో స్థానం. 1932లో ఒక దేశంగా ఆవిర్భవించినప్పటినుంచి రాచరిక వ్యవస్థ, ఒకే కుటుంబపాలన అక్కడ సాగుతోంది. పేరుకు సలహాసంప్రదింపుల అసెంబ్లీ ఒకటున్నా, పాలన కోసం మంత్రివర్గం ఉన్నా రాజుగారు తలచిందే చట్టం. దాయాది కుటుంబసభ్యులు పరస్పర సమన్వయం చేసుకుని, మత నాయకులను కూడా కలుపుకొని వారసత్వ అధికారాన్ని అనుభవిస్తున్నారు. 2015లో రాజుగా వచ్చిన సల్మాన్ అబ్దుల్ అజీజ్ నిరుడు యువరాజు బిన్ సల్మాన్ను వారసుడిగా ప్రకటించారు. అప్పటినుంచీ ఆయన ఏలుబడే నడుస్తోంది. దాదాపు మూడున్నర కోట్లమంది దేశ జనాభాలో కోటిమంది విదేశీ పౌరులు. మహిళలెప్పుడూ ద్వితీయశ్రేణి పౌరులే. తండ్రి, సోదరుడు, భర్త తోడు లేకుండా ఒంటరిగా వారు ఏ అధికారిక పనులూ చక్కబెట్టడానికి వీల్లేదు. ఉద్యోగం చేయాలన్నా, ఊరు విడిచి ఎక్కడికైనా వెళ్లాలన్నా, విదేశాలకు వెళ్లాలన్నా ఇంట్లోని మగవాళ్ల అనుమతి ఉండాల్సిందే. మహిళల హక్కుల కోసం మాట్లాడినా, ఉద్యమించినా అలాంటివారిని ‘రాజ్యానికి శత్రువులు’గా పరిగణించడం, ఖైదు చేయటం రివాజు. మహిళా ఉద్యమకారులు అరెస్టయినప్పుడల్లా వారిని పొరుగునున్న కతార్ దేశ ఏజెంట్లుగా, రాజరిక శత్రువులతో చేతులు కలిపినవారిగా చిత్రీకరిస్తూ పత్రికల పతాకశీర్షికల్లో కథ నాలు వెలువడతాయి. 1990లో కొందరు మహిళలు తామూ డ్రైవింగ్ చేయడానికి అర్హులమేనంటూ రోడ్లపైకి కార్లు తీసుకొచ్చినప్పుడు వెనువెంటనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. 2011లో ‘అరబ్ విప్లవం’ ప్రభావంతో మళ్లీ సౌదీలో మహిళలు ఉద్యమించారు. అలాంటిచోట నిరుడు యువరాజు బిన్ సల్మాన్ సౌదీ విజన్–2030 పేరిట డాక్యుమెంట్ విడు దల చేసి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని భావిస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి అంతకు రెండేళ్లముందు మహిళల వస్త్రధారణ విషయంలో ఉన్న కఠిన నిబంధనలను స్వల్పంగా తొలగించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయడానికి, అభ్యర్థులుగా నిలిచేందుకు అవకాశమిచ్చారు. 2030కల్లా 30 శాతంమంది మహిళలకు ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని విజన్ డాక్యుమెంటు నిర్దేశిస్తోంది. మహిళల డ్రైవింగ్పై ఉన్న నిషేధాన్ని తొలగిస్తామని నిరుడు సెప్టెంబర్లో తొలిసారి ప్రకటించినప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కానీ తగిన నిబంధనలు రూపొం దించాక మాత్రమే అది అమల్లోకొస్తుందని చెప్పినప్పుడు మహిళా ఉద్యమకారులు అంగీకరించలేదు. తక్షణమే నిషేధం తొలగించాలని డిమాండ్ చేశారు. కొన్ని వారాల కిందట మహిళలు మరోసారి ఉద్య మించి కార్లు నడిపితే వారిని అరెస్టుచేశారు. అందువల్లే మహిళల డ్రైవింగ్పై ఉన్న నిషేధాన్ని నిజంగా తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అన్న సందేహాలు అందరిలోనూ తలెత్తాయి. ఎలా గైతేనేం ఎట్టకేలకు నిషేధం తొలగింది. అందుకు యువరాజు ‘విశాల దృక్పథమే’ కారణమని అక్కడి మీడియా కొనియాడుతోంది. కానీ ఈ హక్కు కోసం ఉద్యమించిన 17మందిలో ఇంకా ముగ్గురు జైళ్లలో మగ్గుతున్నారు. వారిపై ఉన్న దేశద్రోహం ఆరోపణలు రుజువైతే ఇరవైయ్యేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. యువరాజు ప్రవేశపెట్టిన ఈ చిన్న సంస్కరణ సౌదీ ఛాందసవాద సమాజంలో ఏమేరకు మార్పు తీసుకొస్తుందన్నది చెప్పలేం. మహిళల డ్రైవింగ్పై ఉన్న నిషేధం తొలగింపును వ్యతిరేకిస్తూ పక్షం రోజులక్రితం మతాధిపతుల ప్రోత్సాహంతో కొందరు రోడ్లపైకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉంటే బహుశా ఈ సంస్కరణ ఆలోచనే యువరాజుకు వచ్చేది కాదేమో! ఉచిత ఇంటి సదుపాయం, తగిన అర్హతలుంటే ఉన్నతోద్యోగం, రాజకుటుంబీకులు సిఫార్సుతో సులభంగా ఉద్యోగం, సుదీర్ఘ మైన సెలవు దినాలు, దాదాపు అన్నిటికీ సబ్సిడీ సదుపాయాలు ఉండే సౌదీలో నాలుగేళ్లక్రితం చమురు ధరలు పతనం కావడం మొదలయ్యాక కష్టకాలం మొదలైంది. సంక్షేమ పథకాలకు పరిమితులు విధించడం ప్రారంభించారు. 2015 మార్చిలో యెమెన్పై కత్తిగట్టి మొదలెట్టిన యుద్ధం అంతూ దరీ లేకుండా కొనసాగుతూ సౌదీ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం దిశగా తీసుకెళ్తోంది. దేశంలోని చమురు బావులన్నీ నిండుకుంటే పరిస్థితేమిటన్న ఆలోచన అక్కడ మొదలైంది. ఇప్పుడున్న కోటి 20 లక్షల ఉద్యోగాల్లో సౌదీ పౌరుల వాటా సగం కన్నా తక్కువ. 70 లక్షల ఉద్యోగాలు వలసదారుల చేతుల్లో ఉన్నాయి. ఉద్యోగాలు చేసే సౌదీ మహిళల సంఖ్య మరింత తక్కువ. దీన్నంతటినీ మార్చ కపోతే పర్యవసానాలు భయంకరంగా ఉంటాయని, దేశం పెను సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని సర్కారుకు జ్ఞానోదయమైంది. కారణమేదైనా మహిళలు వాహనాలు నడపటంపై ఉన్న నిషేధాన్ని తొలగించడం మెచ్చదగిందే. దీనికి కొనసాగింపుగా ఇతర సంస్కరణలు కూడా సత్వరం అమల్లోకి రావాలని, అవి దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడానికి దోహదపడాలని ఆశించాలి. -
కన్నీళ్లతో ఇంటర్ పరీక్షకు ..
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డిచ్పల్లి తండాకు చెందిన రాథోడ్ శ్రీనివాస్ (38) మృతదేహం గల్ఫ్లోని సౌదీ అరేబియా నుంచి శనివారం ఉదయం ఇంటికి చేరుకుంది. శ్రీనివాస్ కూతురు మమత ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాస్తోంది. శనివారం ఇంటికి చేరుకున్న తండ్రి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయింది. కుటుంబ సభ్యులు, బంధువులు నచ్చజెప్పగా ఉదయం 9 గంటలకు జరిగిన ఇంటర్ పరీక్షకు హాజరైంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసి వెంటనే ఇంటికి చేరుకుంది. అనంతరం ఇంటికి చేరుకుని తండ్రి అంత్యక్రియలకు హాజరైంది. -
భార్యను ఉగ్రవాదులకు బేరం.. 80 రోజులు బందీ
సాక్షి, కొచ్చి : కేరళకు చెందిన 24 ఏళ్ల మహిళ నరకంలో నుంచి బయటపడింది. కట్టుకున్న భర్తే తనను తీవ్రంగా హింసించడంతోపాటు ఏకంగా ఉగ్రవాదులకు అమ్మేయాలని చేసిన కుట్రలో నుంచి తప్పించుకొని ప్రాణాలు రక్షించుకుంది. సౌదీఅరేబియాలోని జెడ్డాలో దాదాపు 80 రోజులపాటు ఓ గదిలో బందీగా ఉండి చివరకు తప్పించుకోగలిగింది. పోలీసుల వివరాల ప్రకారం మహ్మద్ రియాస్ అనే వ్యక్తి బాధితురాలు 2017లో బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకొని సౌదీకి వెళ్లారు. అక్కడి వెళ్లాక రియాజ్ తన అసలు వ్యక్తిత్వం బయటపెట్టాడు. ప్రతి రోజు ఆమెను కొట్టడంతోపాటు లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు. అశ్లీల వీడియోలు తీయడంతోపాటు ఆమెను ఓ గదిలో బందించి సిరియాలోని ఉగ్రవాదులకు అమ్మేసే కుట్ర చేశాడు. జెడ్డాలోని ఓ ఇంట్లో బంధించి దాదాపు 80 రోజులు బయటకు వెళ్లకుండా చేశాడు. వారి కదలికలను పసిగట్టిన ఆమె ఏదోలా ఇంటికి ఫోన్ చేసి తాను బంధీగా ఉన్న ప్రాంతాన్ని ఫొటోలు తీసి పంపించింది. వాటి ద్వారా ఆమె లొకేషన్ను గుర్తించిన బంధువులు నేరుగా విమానం టికెట్లు బుక్ చేసి ఆన్లైన్లో పంపించారు. పొరుగువారు ఆమె ఈ విషయంలో జెడ్డాలో సహాయం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్లో ఎదురుచూడగా ఓ ట్యాక్సీ సాయంతో ఆమె ఎయిర్పోర్ట్కు వెళ్లి ఆ ఊబిలో నుంచి బయటపడింది. మొత్తం 12మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం
రియాద్ : సౌదీ అరేబియాలో మహిళలకు భారీ ఊరట లభించింది. ఇక నుంచి వారు కూడా డ్రైవింగ్ చేసేందుకు అనుమతి లభించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొద్దికొద్దిగా మార్పులను ఆహ్వానిస్తున్న సౌదీ తాజాగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బైక్ల నుంచి ట్రక్కుల వరకు మహిళలు డ్రైవింగ్ చేసేందుకు వీలుకల్పించాలని నిర్ణయించాం. ఇది జూన్ నుంచి అమలులోకి రానుంది' అని సౌదీ ప్రభుత్వం పేర్కొంది. గతంలోనే సౌదీ రాజు సల్మాన్ ఈ విషయం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఇక నుంచి మహిళలు కూడా పురుషులతో సమానంగా ఎలాంటి భేదాలు లేకుండా బైక్లపై దూసుకెళ్లనున్నారు. కాగా, మహిళలకు ప్రత్యేక లైసెన్స్ ప్లేటులు ఉండవని, అయితే, వారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు, రోడ్డు ప్రమాదాలకు పాల్పడినా వారి కేసులు విచారించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలో ఒక్క సౌదీ అరేబియా మాత్రమే మహిళల డ్రైవింగ్పై ఇప్పటి వరకు నిషేధం కొనసాగించిన విషయం తెలిసిందే. -
సౌదీ వాసులకు మళ్లీ సినిమా పండుగ
దుబాయ్ : సౌదీ అరేబియా వాసులకు 2018లో తొలిసారి థియేటర్లలో సినిమాను వీక్షించే అవకాశం దక్కనుంది. 2018 నుంచి పబ్లిక్ థియేటర్లను అనుమతించనున్నారు. ఈ మేరకు సౌదీ అరేబియా సాంస్కృతిక సమాచారా శాఖ మంత్రి అవాద్ బిన్ సాలే అలావద్ ఒక ప్రకటనలో తెలిపారు. 'తొలి సినిమాను మేం మార్చి 2018లో వస్తుందని అంచనా వేస్తున్నాం' అని ఆయన అన్నారు. సాధరణంగా సౌదీ అరేబియాలో సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది. కొన్ని మాత్రమే ఫీచర్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ ప్రతి ఏడాది వస్తుంటాయి. ఒక్క కోబార్లోని ఐమాక్స్ తప్ప మిగితా ఏ ప్రాంతాల్లో కూడా సినిమా హాళ్లు అనేవి లేవు. ఎప్పటి నుంచో వాటిని ప్రారంభించాలని చర్చలు జరుగుతున్నప్పటికీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే సౌదీలో ఆ నిర్ణయం ముందుకు వెళ్లలేదు. తాజాగా జరిపిన చర్చల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు సౌదీలో శాటిలైట్ ద్వారా, డీవీడీలు, వీడియోల ద్వారా మాత్రమే సినిమాలు వీక్షించేవాళ్లు. గత కొన్నేళ్లుగా సౌదీలో సినిమాలను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. -
‘‘మతం మార్చారు.. సెక్స్ బానిసగా అమ్మాలనుకున్నారు’’
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఐఎస్ఐఎస్ బీజాలు ప్రమాదకరంగా తయారయ్యాయని చెప్పడానికి ఇదొక సజీవ నిదర్శనం. లవ్ జీహాద్ పేరుతో కేరళ అమ్మాయిని పెళ్లి చేసుకుని.. సౌదీ అరేబియా తీసుకెళ్లి.. అక్కడ నుంచి ఐఎస్ ఉగ్రవాదులకు సెక్స్ బానిసగా అమ్మే ప్రయత్నం చేసిన ఒక నరరూపరాక్షసుడి నిజ స్వరూపం ఇది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. నన్ను మోసపూరిత వివాహం చేసుకుని, ఆపై మత మార్పిడి చేసి.. సెక్స్ స్లేవ్గా నన్ను విక్రయించే ప్రయత్నం చేశాడు.. నాకు న్యాయం చేయండంటూ 25 ఏళ్ల యువతి కేరళ హైకోర్టును ఆశ్రయించింది. నన్ను బలవంత పెట్టి ఇస్లాకు మార్చారని ఆమె కోర్టుకు తెలిపింది. కేరళకు చెందిన యువతి.. గుజరాత్లోని జామ్ నగర్లో పెరిగింది. అదే సమయంలో అక్కడ పరిచయమైన ఒక వ్యక్తి దొంగ ఆధార్ కార్డు, మోసపూరిత వివరాలతో పెళ్లి చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. పెళ్లయిన తరువాత అతను ముస్లిం అని, అతని పేరు ముహమ్మద్ రియాజ్ అని తెలిసిందని యువతి తెలిపింది. వివాహం తరువాత తన నగ్న ఫొటోలు, వీడియోలు తీసి.. సౌదీ అరేబియా రావాలని, లేకుంటే వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు ఆమె తెలిపింది. సౌదీ అరేబియా చేరుకున్నానక బలవంతంగా మతమార్పిడి చేయడంతో పాటు.. వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్నాయక్ ప్రసంగాలు, వీడియోలు చూడాలంటూ ఒత్తిడి తెచ్చేవాడని ఆమె కోర్టుకు తెలిపారు. నన్ను సౌదీ అరేబియా నుంచి సిరియా తీసుకెళ్లి అక్కడ ఐఎస్ ఉగ్రవాదులకు సెక్స్ బానిసగా అమ్మే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుసుకుని భయంతో వణికిపోయినట్లు యువతి చెప్పారు. సౌదీ అరేబియాలో అనుకోకుండా తనకు ఇంటర్నెట్ లభించడంతో తల్లిదండ్రులతో మాట్లాడడం.. వారి సాయంతో అక్కడనుంచి సురక్షితంగా అహ్మదాబాద్ చేరుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం నాకున్న భయానికి కేరళలో అడుగుపెట్టాలంటే వణుకుపుడుతోందని ఆమె కోర్టుకు తెలిపారు. -
పాపం..జాఫర్..!
కోరుట్ల: ఎడారి దేశాల్లో ఎంతో కొంత సంపాదించుకొచ్చి తమను సంతోషంగా ఉంచుతాడని ఆశించిన ఆ కుటుంబానికి వలసజీవి మృతివార్త అశనిపాతంగా మారింది. ఏడాది కాలంగా ఒకే ఒక్కసారి భర్తతో మాట్లాడిన భార్య, పిల్లలు చివరకు ఆయన ఇక లేరనే సమాచారం అందడంతో హతాశులయ్యారు. ఫోన్ రాకున్నా.. డబ్బులు పంపకున్నా ఎక్కడో ఓ చోట పని చేసుకుని బాగానే ఉంటాడని అనుకున్న ఆ కుటుంబం మరణవార్తతో విషాదంలో మునిగిపోయింది. ఏడాది క్రితం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్ఫత్పురాకు చెందిన మహ్మద్ జాఫర్(43) ఏడాది క్రితం లేబర్ పనిమీద సౌదీకి వెళ్లాడు. ఆ తర్వాత నెలరోజులకు కుటుంబ సభ్యులతో ఓ సారి మాట్లాడి తాను బాగానే ఉన్నానని చెప్పాడు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత జాఫర్ నుంచి ఫోన్రాలేదు. జాఫర్ సౌదీలో మారుమూల ప్రాంతంలో ఉద్యోగం కావడంతో ఫోన్ చేయలేకపోతున్నాడని కుటుంబసభ్యులు భావించారు. చివరకు శుక్రవారం సౌదీలో ఉన్న నిజామాబాద్ జిల్లా పెర్కిట్వాసి కోరుట్లకు సమాచారం ఇవ్వడంతో జాఫర్ వార్త సమాచారం తెలిసింది. అనుమానాస్పదంగా.. ఆలస్యంగా సౌదీలోని ఖర్జూ పట్టణానికి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉండే హాయల్ అనే ప్రాంతంలో మహ్మద్ జాఫర్ మృతదేహాన్ని అక్కడి పోలీసులు కనుగొన్నట్లుగా కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఈ నెల 2వ తేదీన జాఫర్ మృతి చెందాడని, అతడి మృతదేహాన్ని అల్జోఫ్ పట్టణంలోని సతారా ఆసుపత్రి మార్చురీలో ఉంచారని తెలిసింది. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో సహజ మరణంగా భావించి ఆసుపత్రిలో ఉంచినట్లు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. జాఫర్ అటవీ ప్రాంతంలో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 25రోజుల వరకు తమకు ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాఫర్ సౌదీలో ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో తెలియని కారణంగానే అతడిని గుర్తించడంలో ఆలస్యం జరిగిందని సౌదీలో ఉంటున్న పెర్కిట్ వాసి చెబుతున్నా.. అతడి మృతిపై అనుమానాలు వీడటం లేదు. మృతదేహం తెప్పించుకోలేని దీనస్థితి.. సౌదీలో మృతిచెందిన మహ్మద్ జాఫర్కు భార్య రిజ్వానా, ముగ్గురు మగ పిల్లలు జుబేర్(17), జమీర్(15), సమీర్(10) ఉన్నారు. భార్య రిజ్వానా బీడీలు చుడుతూ పిల్లలను చదివిస్తోంది. భర్త గల్ఫ్లో కాస్తోకూస్తో సంపాదిస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన రిజ్వానా, పిల్లలు కుటంబ పెద్ద మృతితో దయనీయ స్థితిలో పడ్డారు. సౌదీ నుంచి జాఫర్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించడం ఖర్చులతో కూడిన పని కావడం డబ్బులు లేక అక్కడే అంత్యక్రియలు పూర్తి చేయడానికి అంగీకరించే పరిస్థితిలో ఉన్నారు. జాఫర్ మృతదేహాన్ని తెప్పించడంతోపాటు కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు సాయం చేయాలని అర్థిస్తున్నారు. -
గల్ఫ్ జిందగీ : సౌదీలో ఒక్కొక్కరిది ఒక్కో బాధ
సాక్షి, హైదరాబాద్: 31 లక్షల మంది భారతీయులు సౌదీ అరేబియాలో నివసిస్తున్నారని భారత ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రకటించింది. వీరిలో తెలంగాణ వారు 4 లక్షల మంది, ఆంద్రప్రదేశ్ వారు 4 లక్షల మంది ఉంటారని ఒక అంచనా. సౌదీ నుండి భారత్ కు ప్రతియేటా 11 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం వస్తున్నది. యూఏఈ (13.2), అమెరికా (11.5) తర్వాత సౌదీ మూడవ స్థానంలో ఉన్నది. క్షమాభిక్షకు ఎవరు అర్హులు హజ్, ఉమ్రా, విజిట్ వీసాల 'ఓవర్ స్టేయర్స్' (గడువుమీరిన వారు), సౌదీలో జన్మించిన పిల్లలు, 'హురూబ్' (పారిపోయిన ప్రవాసి ఉద్యోగి), 'అఖామా' (సౌదీ ప్రభుత్వం జారీచేసే గుర్తింపు కార్డు) ఎక్సపెయిర్ అయినవారు, ఆఖామా జారీకాని వారు, ఎగ్జిట్ వీసా ఎక్సపెయిర్ అయినవారు, యజమాని రెడ్ క్యాటగిరీలో ఉన్నవారు, యజమాని చనిపోయినవారు, అక్రమమార్గాల ద్వారా సౌదీలోకి ప్రవేశించినవారు, సరిఅయిన పత్రాలు లేనివారు అమ్నెస్టీ పథకానికి అర్హులు. జీతాల బకాయిలు రానివారు, సివిల్ కోర్టు కేసుల్లో ఉన్నవారు కూడా ఈ అకాశాన్ని వినియోగించుకోవచ్చు. వీలుకానివి 'తనాజుల్' (స్పాన్సర్ ను మార్చుకోవడం) వీలుకాదు. 'మత్లూబ్' (పోలీస్ కేసు) ఉన్నవారు సంబంధిత పోలీస్ స్టేషన్ ల నుండి చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలి. అమలులులో ఉన్న 'అఖామా' (సౌదీ ప్రభుత్వం జారీచేసే గుర్తింపు కార్డు) ఉన్నవారు అర్హులు కాదు. (చదవండి: జరిమానా, జైలుశిక్ష లేకుండా స్వదేశానికి..) 'హురూబ్'.. అంటే సౌదీ అరేబియాలో 'కఫీల్' (స్పాన్సర్ / యజమాని) కి తెలుపకుండా ప్రవాసి ఉద్యోగి పనికి గైరుహాజరు కావడం, పారిపోవడాన్ని అరబ్బీలో 'హురూబ్' (పారిపోయిన ప్రవాసి ఉద్యోగి) అంటారు. సౌదీ చట్టాల ప్రకారం ఉద్యోగి పారిపోయిన సందర్భాలలో యజమాని 'జవజత్' (పాస్ పోర్ట్, ఇమ్మిగ్రేషన్ శాఖ) అధికారులకు ఫిర్యాదు చేస్తే ప్రవాసి ఉద్యోగిని 'హురూబ్' గా ప్రకటిస్తారు. దురుద్దేశం కలిగిన 'కఫీల్ల' కు 'హురూబ్' వ్యవస్థ ఉద్యోగులను పీడించడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతున్నది. ప్రవాసి ఉద్యోగులు ఎందుకు పారిపోతారు ? పనికి తగిన వేతనం లేకపోవడం, నెలలతరబడి వేతనాలు ఇవ్వకపోవడం, సరిఅయిన ఉద్యోగ హోదా లేకపోవడం, భోజన వసతి సౌకర్యాలు సరిగా లేకపోవడం, అధిక పనిగంటలు, యజమాని సెలవు మంజూరు చేయకపోవడం, యజమాని వేధింపులు, హింసలను తట్టుకోలేక తదితర కారణాలతో ప్రవాసి ఉద్యోగులు పారిపోతుంటారు. అధిక వేతనం ఆశతో మరోచోట పనిచేయడానికి కూడా వెళ్లిపోతుంటారు. 'హురూబ్' గా ప్రకటించబడ్డ వ్యక్తికి జరిగే నష్టాలు 'అఖామా' (గుర్తింపు కార్డు) రద్దు అయిపోతుంది. అక్రమ నివాసిగా పరిగణించబడతారు. డ్రైవింగ్ లైసెన్సు, హజ్ పర్మిట్ ఇతర చట్టబద్దమైన కార్డులు రద్దు అవుతాయి. 'డిపోర్టేషన్ సెంటర్' (బహిష్కరణ కేంద్రం) ద్వారా మాతృదేశానికి వెళ్లగొట్టబడతారు. సౌదీలోకి రాకుండా ఐదేళ్ల పాటు 'ట్రావెల్ బ్యాన్' (ప్రయాణ నిషేధం) విధిస్తారు. ఉద్యోగులు చట్టబద్దంగా పొందాల్సిన ప్రయోజనాలు, హక్కులు కోల్పోతారు. ప్రవాసి ఉద్యోగి పారిపోయిన విషయాన్ని సౌదీ ప్రభుత్వానికి తెలియపర్చని యజమానికి 5 నుండి 15 వేల రియాళ్ల జరిమానాతో పాటు ఒకనెల జైలు శిక్ష కూడా విధిస్తారు. 'హురూబ్' నుండి బయటపడటం ఎలా ? 'హురూబ్' గా ప్రకటించబడినదీ లేనిదీ సౌదీ ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్ సైటు https://www.mol.gov.sa/services/inquiry/nonsaudiempinquiry.aspx లో తెలుసుకోవచ్చు. సౌదీ అరేబియాలోని రియాద్ లో గల ఇండియన్ ఎంబసీలో గాని, జిద్దా లోని ఇండియన్ కాన్సులేట్ లో (భారత రాయబార కార్యాలయాలు) గాని దరఖాస్తు చేసుకోవడం వలన లొంగిపోయినట్లు భావిస్తారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత మన భారత రాయబార కార్యాలయం వారు సౌదీ ప్రభుత్వానికి ఒక హామీపత్రం సమర్పిస్తారు. 72 గంటలలోగా (మూడు రోజుల్లో) తమ పౌరుడు మాతృదేశమైన భారత్ కు వెళ్ళిపోతాడని ఆ హామీలో ఉంటుంది. సౌదీ ప్రభుత్వం ఉద్యోగి హిస్టరీ షీట్ (చరిత్ర), క్రిమినల్ రికార్డు (నేర చరిత్ర) లను పరిశీలించిన అనంతరం తగిన అనుమతిని మంజూరు చేస్తారు. స్పాన్సర్ (యజమాని) వద్ద ఉన్న పాస్ పోర్ట్ ఇస్తే స్వదేశానికి వెల్లిపోవడం సులువు అవుతుంది, లేనిపక్షంలో ఎంబసీ నుండి 'ఎమర్జెన్సీ సర్టిఫికెట్' (అవుట్ పాస్ / వైట్ పాస్ పోర్ట్) పొందాల్సి ఉంటుంది. సౌదీ ఇమ్మిగ్రేషన్ విభాగంలో వేలి ముద్రలు ఇవ్వాలి, పత్రాల పరిశీలన చేయించుకోవాలి. అన్నిరకాల బకాయిలు, ట్రాఫిక్ తదితర జరిమానాలు చెల్లించాలి. ఫైనల్ ఎగ్జిట్ (సౌదీ వదిలి వెళ్ళడానికి అనుమతి) పొందాలి. యజమానులు పెట్టిన 'మత్లూబ్' కేసులతో దారులు మృగ్యం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఛిల్వాకోడూర్ గ్రామానికి చెందిన సైన్స్ పట్టభద్రుడు దాసరి మధుసూదన్ గల్ఫ్ లో తన విద్యార్హతకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమై, ఎదో ఒక ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుని ఒక ఏజెంటు సహాయంతో చివరికి 7 జనవరి 2016 లో సౌదీలోని హాయిల్ పట్టణంలో ఒక మహిళా యజమాని వద్ద ఇంటి డ్రైవర్ గా చేరాడు. ఇతని వాహనాన్ని వేరే వాహనం ఢీకొట్టినందున జరిగిన చిన్న ప్రమాదం పట్ల ఆగ్రహించిన యజమాని భర్త మధుసూధన్పై ఆగ్రహం వ్యక్తంచేసి దాడిచేశాడు. అయినా సర్దుకొని డ్యూటీ చేశాడు. డ్రైవర్ పని మాత్రమే చేస్తానని, ఇంటిపనులు చేయలేనని మొండికేయడంతో మొదటినెల జీతం మాత్రమే ఇచ్చి, తర్వాతి రెండునెలల జీతం ఇవ్వలేదు. ఒత్తిడి భరించలేని మధుసూదన్ భయంతో ఏప్రిల్ 2016 లో పారిపోయి వేరేచోట పనిచేసుకుంటున్నాడు. ఆమ్నెస్టీ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వదేశానికి వాపస్ వెళ్ళిపోదామని మధుసూదన్ ఇండియన్ ఎంబసీ నుండి అవుట్ పాస్, సౌదీ అధికారుల నుండి ఫైనల్ ఎగ్జిట్ తీసుకొన్నాడు. ఏప్రిల్ 15 న సాయంత్రం సౌదీలోని రియాద్ ఏర్ పోర్ట్ కు వెళ్లి హైదరాబాద్ కు ప్రయాణించడానికి గల్ఫ్ ఏర్ విమాన సిబ్బంది నుండి బోర్డింగ్ పాస్ తీసుకొని ముందుకుసాగాడు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లో పాస్ పోర్ట్ (అవుట్ పాస్) పై స్టాంప్ వేసే సమయంలో ఇతనిపై 'మత్లూబ్' (పోలీసు కేసు) ఉన్న విషయాన్ని ఆన్ లైన్ లో గమనించిన అధికారి మధుసూదన్ ప్రయాణాన్ని అడ్డుకొని విమానం ఎక్కకుండా ఆపేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసును పరిష్కరించుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. యజమాని కక్ష సాధింపు మధుసూదన్ కు ఫైనల్ ఎగ్జిట్ (సౌదీ వదిలి వెళ్ళడానికి అనుమతి) మంజూరి అయిన 10 ఏప్రిల్ న యజమానికి మొబైల్ కు మెసేజ్ వెళ్ళింది, అది చూసిన యజమాని కారు దొగతనం జరిగినట్లు 11 ఏప్రిల్ న 'మత్లూబ్' (పోలీస్ కేసు) దాఖలు చేయడంతో అతను సౌదీ వదిలివెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మధుసూదన్ ముందున్నవి రెండు మార్గాలు.. యజమాని కేసు వాపస్ తీసుకోవడం లేదా పోలీసుల ముందు లొంగిపోయి న్యాయ పోరాటం చేయడం. ఆయనది చెప్పుకోలేని బాధ మధుసూదన్ తనకు జరిగిన అన్యాయాన్ని ట్విట్టర్, ఈ మెయిళ్ల ద్వారా భారత విదేశాంగ శాఖ అధికారులకు, ఇండియన్ ఎంబసీ అధికారులకు, తెలంగాణ ఎన్నారై మంత్రి కేటీఆర్ కు తెలియజేశాడు. ఇతనికి సహాయం చేయాలని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, తెలంగాణ ఎన్నారై విభాగం వారు సంబంధిత అధికారులకు లేఖలు రాశారు. ఇంగ్లీషు, తెలుగు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే మధుసూదన్ తన బాధను ప్రపంచ బాధ చేశాడు. కేరళకు చెందిన ఇండియన్ ఎంబసీ వలంటీర్ సరఫొద్దీన్ తయ్యిల్, రియాద్ లో నివాసముండే నల్గొండ జిల్లాకు చెందిన ఇంజనీర్, సామాజిక కార్యకర్త మహ్మద్ ముబీన్ లు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా మధుసూదన్ మాట్లాడుతూ తన కఫీల్, ఆమె భర్త ఆసుపత్రి ఉద్యోగులని, కేసును వాపస్ తీసుకోవడానికి 10 వేల రియాళ్ళు అడుగుతున్నారని, ఇంత పెద్దమొత్తం ఎలా చెల్లించాలని వాపోయాడు. తనను ఎలాగైనా రక్షించి మాతృదేశానికి పంపాలని వేడుకుంటున్నాడు. జీవితంలో మళ్లీ గల్ఫ్ కు వెళ్ళనాని అన్నాడు. ఆ 35 మందిది ఒక్కొక్కరిది ఒక్కో బాధ తెలంగాణ జిల్లాలకు చెందిన 35 మంది వలస కార్మికులు సౌదీలో చిక్కుకుపోయారు. సౌదీ యజమానులు పెట్టిన 'మత్లూబ్' కేసులతో ఇంటికి రాలేక, అక్కడ ఉండలేక సతమతమవుతున్నారు. వీరిలాగా వేలాదిమంది సతమతమవుతున్నారు. సౌదీలో చిక్కుకుపోయిన 35 మంది వివరాలు: మహ్మద్ జావీద్ (కోహెడ), రమేష్ రావ్ (వజ్జేపల్లి), రాజేశ్వర్ రావు (ఉత్నూర్), లావుడ్య రూప్ సింగ్ (వెంగళపాడ్), ఇటికెల పాండు (కామారెడ్డి), కడావత్ బాల్ రెడ్డి (గోవిందపల్లి), దుబ్బాక అశోక్ (నాగేపూర్), జిన్న హనుమాండ్లు (పల్లిమక్త), చల్ల సుదర్శన్ (కొడిమ్యాల), జంగిటి రాజేశం (మలకపేట్), దండెన చిన్న బొర్రన్న (నిజామాబాద్), దాసరి మధుసూదన్ (ఛిల్వాకోడూర్), సూర నర్సయ్య (బండపల్లి), సారంగి సాయన్న (ఏర్గట్ల), గోడూరి స్వామి (నార్లాపూర్), జిన్న రాములు (రామయ్యపల్లి), సుంచు రాజు (మద్దికుంట), మల్లెనైన నగేష్ (మామిడిపల్లి), తలారి రాందాస్ గంగారాం (ఏర్గట్ల), లావుడ్య బలరాం (వెంగళపాడ్), తాటిపల్లి నర్సయ్య (దుమ్మాడ్), జక్కని తిరుపతి (ఏర్గట్ల), నడుపుల బక్కన్న (రాంపూర్), తెజావత్ శ్రీను (కేసంపల్లి), తోగుటి అంతగిరి (చెల్లాపూర్), మసపత్రి రాజు (గుమ్మిర్యాల్), రేకులపెల్లి శ్రీనివాస్ (పూడూర్), అల్లెపు సాయిలు (పెర్కిట్), గొడుగు వెంకటి (ధర్పల్లి), నరిగె గంగామురళి (తూముపల్లి), షేక్ మొగులాన్ (వర్ని), చాకలి సాయిలు (జనగామ), నానం అంజన్న (వేంపల్లి), భోగ మారుతి (బుస్సాపూర్), పల్లపు ఎల్లయ్య (ఖానాపూర్) ఆరుగురిది ఒక కథ దండెన చిన్న బొర్రన్న (నిజామాబాద్), సారంగి సాయన్న (ఏర్గట్ల), తలారి రాందాస్ గంగారాం (ఏర్గట్ల), జక్కని తిరుపతి (ఏర్గట్ల), మసపత్రి రాజు (గుమ్మిర్యాల్), ఇటికెల పాండు (కామారెడ్డి) అనే ఆరుగురు సేఫ్ అరేబియా ఇంజనీరింగ్ అనే కంపెనీలో సంవత్సరంన్నర పనిచేసిన అనంతరం పారిపోయారు. గత రెండు సంవత్సరాలుగా వేరేచోట పనిచేస్తున్నారు. వీరిపై జుబైల్ పోలీస్ స్టేషన్ లో ఆర్ధిక వ్యవహారాల వివాదం గురించి 'మత్లూబ్' కేసు నమోదు అయింది. వీరి సమస్యపై ఎంబసీలో స్పందించింది. ఒంటెలు, గొర్రెల కాపరులు ఎడారిలో ఒంటెలు, గొర్రెల కాపరులుగా పనిచేస్తున్న వీరికి సరిఅయిన భోజనం, వసతి లేకపోవడం, వేతనాలు చెల్లించకపోవడం, యజమానుల అమానవీయ ప్రవర్తన తట్టుకోలేక పారిపోయారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్ల లో 'మత్లూబ్' కేసులు నమోదు అయ్యాయి. రమేష్ రావ్ (వజ్జేపల్లి), రాజేశ్వర్ రావు (ఉత్నూర్), గోడూరి స్వామి (నార్లాపూర్), జిన్న రాములు (రామయ్యపల్లి), తెజావత్ శ్రీను (కేసంపల్లి), తోగుటి అంతగిరి (చెల్లాపూర్), నానం అంజన్న (వేంపల్లి), పల్లపు ఎల్లయ్య (ఖానాపూర్). -
సౌదీలో భారీ అగ్ని ప్రమాదం
రియాద్: సౌదీ అరేబియా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నజ్రాన్ ప్రావిన్స్లో జరిగిన అగ్నిప్రమాదంలో 11మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా భారత్, బంగ్లాదేశ్లకు చెందిన వారేనని సమాచారం. వలస కార్మికులంతా ఒక పాత బడిన ఇంట్లో తలదాచుకుంటు జీవనం వెల్లదీస్తున్నారు. వారంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. దీంతో కిటికీలు కూడా లేని ఆ ఇంట్లో కార్మికులు ఎటు వెళ్లాలో తెలియక, పొగతో ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ఊపిరాడక స్పృహకోల్పోయి గాయాలతో పడి ఉన్న మరో ఆరుగురు కార్మికులను సమీపంలో ఆస్పత్రులకు తరలించారు. -
మక్కాలో ఆత్మాహుతి దాడి
మక్కా: సౌదీ అరేబియాలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం మక్కా మసీదులో దాడులకు పాల్పడేందుకు సిద్ధమైన ఉగ్రవాదులపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో ఐదుగురు పోలీసులతో సహా 11 మందికి గాయాలయ్యాయి. దాడికి యత్నించిన మహిళతో సహా ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం వెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి కుట్ర చేశారని పోలీసులు వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
మీ టైమ్ వస్తుంది: ఐఎస్ హెచ్చరిక
టెహ్రాన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సౌదీ అరేబియాకు హెచ్చరికలు జారీ చేశారు. సౌదీపై దాడులకు పాల్పడుతామంటూ వీడియో సందేశంలో తెలిపారు. ఇరాన్ పార్లమెంట్పై బుధవారం జరిగిన దాడి తమపనే అని వెల్లడించిన ఇస్లామిక్ స్టేట్.. 'మీపై దాడికి సమయం వస్తుంది' అంటూ సౌదీని హెచ్చిరించింది. టెహ్రాన్లోని ఇరాన్ పార్లమెంట్పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇరాన్ తరువాత టార్గెట్ సౌదీనే అని, అల్లా ఆదేశం మేరకు ఇస్లాం కోసం తాము పోరాడుతున్నామని మాస్క్లు ధరించిన ఐదుగురు వ్యక్తులు ఉన్న వీడియోలో పేర్కొన్నట్లు సైట్ ఇంటలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్ హెచ్చరికల నేపథ్యంలో విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సౌదీలోని యూఎస్ ఎంబసీ తమ పౌరులకు సూచించింది. ఉగ్రవాదానికి సహకరిస్తోందనే కారణంతో ఖతార్పై పలు దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. -
ఫుట్బాల్ మ్యాచ్లో ‘మౌనం’ వివాదం!
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో ఉన్న ఓ ఫుట్బాల్ స్టేడియం అది. మరికాసేపట్లో ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా జట్ల మధ్య వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇంతలో స్టేడియంలోని అనౌన్సర్.. ఇటీవల లండన్ ఉగ్రదాడుల్లో మృతి చెందినవారికి సంతాపంగా ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటిస్తారని అనౌన్స్ చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా ఒక దగ్గర చేరి భుజాలపై చేతులేసుకొని మౌనం పాటించారు. అదే సమయంలో సౌదీ ఆటగాళ్లు మాత్రం తలో దిక్కు వెళ్లి పోయారు. కొందరైతే సీరియస్గా వామప్ చేస్తూ కనిపించారు. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనలో సౌదీ ఆరేబియా ఆటగాళ్ల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. సోషల్ మీడియా సౌదీ టీంపై భగ్గుమంది. ఈ వ్యవహరంపై స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని టర్న్బుల్.. ఉగ్రవాదుల చర్యలను ఖండించడంలో, బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలపడంలో అందరూ ఒకటిగా ఉండాలన్నారు. దీంతో మొదట 'మౌనం పాటించడం మా సంస్కృతిలో భాగం కాదు' అన్నట్లు వ్యవహరించిన సౌదీ అరేబియా ఫుడ్బాల్ ఫెడరేషన్ తమ ఆటగాళ్ల ప్రవర్తనపై క్షమాపణలు కోరింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 3-2 తేడాతో విజయం సాధించింది. -
సౌదీ డెడ్లైన్.. 12000 మంది వెనక్కి!
ఢాకా: దేశంలోని అక్రమ వలసదారులపై సౌదీ అరేబియా ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. జూన్ 30 వరకు అక్రమ వలసదారులు తమ దేశాలకు తిరిగివెళ్లాలని డెడ్లైన్ విధించింది. దీంతో సుమారు 12,000 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు స్వదేశానికి పయనమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రియాద్, జెడ్డాలలో ఇప్పటికే 11 వేల మంది బంగ్లాదేశీయులు ఔట్పాస్ను తీసుకున్నారని బంగ్లాదేశ్ ఎంబసీ వెల్లడించింది. డెడ్లైన్ లోగా దేశాన్ని విడిచిపెట్టని వారికి జైలు శిక్షతో పాటు ఫైన్ విధించనున్నట్లు సౌదీ ప్రకటించింది. దీనికోసం కొన్ని కొత్త జైళ్లను సైతం సిద్ధం చేస్తోంది. గడువులోగా 'జనరల్ పార్డన్' కింద వెళ్లే అక్రమ వలసదారులు కావాలంటే చట్టబద్ధంగా తిరిగి దేశంలోకి అడుగుపెట్టడానికి సౌదీ అవకాశం కల్పించింది. వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో ఉంటున్న వారిని టార్గెట్గా చేసుకొని చేపడుతున్న డ్రైవ్లో.. సుమారు 10 లక్షల మందిని దేశంనుంచి పంపించాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
సౌదీ అరేబియాలో జిల్లా యువకుడి మృతి
పండితవిల్లూరు(పోడూరు) : బతుకుదెరువు కోం విదేశానికి వెళ్లిన యువకుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. చేతికి అందివచ్చిన కొడుకు చిన్న వయసులోనే మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు దుఃఖంతో రోదిస్తున్నారు. మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పండితవిల్లూరులో లక్ష్మీదేవి చెరువుగట్టుకు చెందిన లింగోలు మోషేబాబు(23) ఉపాధి నిమిత్తం మూడున్నరేళ్ల కిందట సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఎలక్రీ్టషియన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున అక్కడున్న కొందరు తెలుగువారితో కలసి కారులో వెళ్తుండగా కారు అదుపుతప్పి విద్యుత్స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మోషేబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. అతడితోపాటు కారులో వెళ్తున్నవారు ప్రమాదంలో మోషేబాబు మృతిచెందిన విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కొడుకు ఇక లేడన్న వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, నాగమణి గుండెలవిసేలా రోదిస్తున్నారు. మోషేబాబు పదో తరగతి వరకు చదివాడు. అతని అన్న రాజు కూడా గతంలో సౌదీఅరేబియాలో ఉండేవాడు. దీంతో మోషేబాబు కూడా ఉపాధినిమిత్తం అక్కడికి వెళ్లి మూడున్నరేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. అతని అన్న రాజు ఈ ఏడాది స్వదేశానికి వచ్చాడు. -
సౌదీ అరేబియాలో జిల్లా యువకుడి మృతి
పండితవిల్లూరు(పోడూరు) : బతుకుదెరువు కోం విదేశానికి వెళ్లిన యువకుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. చేతికి అందివచ్చిన కొడుకు చిన్న వయసులోనే మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు దుఃఖంతో రోదిస్తున్నారు. మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పండితవిల్లూరులో లక్ష్మీదేవి చెరువుగట్టుకు చెందిన లింగోలు మోషేబాబు(23) ఉపాధి నిమిత్తం మూడున్నరేళ్ల కిందట సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఎలక్రీ్టషియన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున అక్కడున్న కొందరు తెలుగువారితో కలసి కారులో వెళ్తుండగా కారు అదుపుతప్పి విద్యుత్స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మోషేబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. అతడితోపాటు కారులో వెళ్తున్నవారు ప్రమాదంలో మోషేబాబు మృతిచెందిన విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కొడుకు ఇక లేడన్న వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, నాగమణి గుండెలవిసేలా రోదిస్తున్నారు. మోషేబాబు పదో తరగతి వరకు చదివాడు. అతని అన్న రాజు కూడా గతంలో సౌదీఅరేబియాలో ఉండేవాడు. దీంతో మోషేబాబు కూడా ఉపాధినిమిత్తం అక్కడికి వెళ్లి మూడున్నరేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. అతని అన్న రాజు ఈ ఏడాది స్వదేశానికి వచ్చాడు. -
అమెరికాపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికా నమ్మదగిన దేశంకాదని ఇరాన్ ప్రముఖ నేత అయతుల్లా అలీ ఖామ్నేయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే, సౌదీ అరేబియా ఎన్నో తీవ్రమైన నేరాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అణుఒప్పందానికి సంబంధించి గతంలో చేసుకున్న ఒప్పందాలను పూర్తి చేయడంలో అమెరికా విఫలమైందని అన్నారు. మాటల్లో చెప్పినన్ని చేతల్లో చూపించలేకపోయిందని విమర్శించారు. అందువల్లే ఇక అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. ఇరాన్ తో ఇతర దేశాలకు ఉన్న సంబంధాలను బద్ధలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందని, అమెరికా ఇరాన్ కు వ్యతిరేకంగా తయారైందని ఆరోపించారు. అలాగే, యెమెన్ లోని అమాయక ప్రజలపై బాంబులు వేస్తూ సౌదీ అరేబియా తీవ్ర నేరానికి పాల్పడుతోందని అక్కడి పాఠశాలలు, వైద్యాలయాలు ధ్వంసం చేస్తూ వారికి తీరని నష్టం తీసుకొస్తుందని విమర్శించారు. ఇదంతా కూడా అమెరికా కనుసన్నల్లోనే అని చెప్పారు. -
సౌదీలో ఉద్యోగం పేరుతో మోసం
చాంద్రాయణగుట్ట: సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ బంధువుల డబ్బులు తీసుకొని మోసగించడంతో మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బండ్లగూడ ఆషమాబాద్కు చెందిన మహ్మద్ ఇజాజ్ (25) డ్రై వర్. కాగా ఇతనికి బంధువులు అయిన ఫర్జానా బేగం, మహ్మద్ మసూద్, ఫెరోజ్ అలీ ఖాన్లు సౌదీలో ఉంటున్నారు. సౌదీ అరేబియాలోని అల్ అబుదీ ట్రావెల్స్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇజాజ్ వద్ద రూ.50 వేలు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగం చూపించకపోవడంతో పాటు తిరిగి డబ్బులు ఇవ్వకపోడంతో మోసపోయానని గ్రహించి... సొంత బంధువులే మోసానికి పాల్పడ్డారని మనస్థాపానికి గురై మంగళవారం రాత్రి దూలానికి నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
సౌదీలో 47 మందికి ఉరిశిక్ష అమలు
రియాద్: ప్రముఖ మత గురువు షేక్ నిమిర్ ఆల్ నిమిర్ సహా 47 మందికి శనివారం మరణదండన అమలు చేసినట్లు సౌదీ అరేబియా హోంమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందనే వారికి శిక్ష విధించినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కొనసాగిస్తూ 2003-2006 మధ్యకాలంలో ఉగ్రదాడులకు పాల్పడిన నిందితులకు ఈ శిక్ష అమలు చేశామని ప్రభుత్వం పేర్కొంది. 2015 ఏడాదిలో 158 మందికి పైగా మరణశిక్ష అమలు చేశామని ఓ అధికారి స్థానిక మీడియాతో చెప్పారు. అందులో కేవలం నవంబర్ లోనే 45 మంది విదేశీయులు సహా 63 మందికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరాకు సంబంధించి మరణశిక్ష పడింది. గతంలో 1995లో అత్యధికంగా 192 మందికి ఉరిశిక్ష అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. -
సౌదీ అరేబియా రాజు కన్నుమూత
రియాద్: సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా(90) కన్నుమూశారు. అబ్దుల్లా శుక్రవారం ఒంటి గంటకు (స్థానిక కాలమాన ప్రకారం) మరణించారని సౌదీ అరేబియా రక్షణ మంత్రి సల్మాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి రాజుగా దివంగత అబ్దుల్లా తమ్ముడు మోక్రేన్ కు బాధ్యతలు అప్పచెబుతున్నట్లు ఆయన తెలిపారు. తొలుత అబ్దుల్లా సంస్మరణార్ధం రాయల్ ప్యాలెస్ లో నిర్వహించే ప్రార్థనలకు దేశ ప్రజలందరినీ ఆహ్వానించారు. అనంతరం అబ్దుల్లా అంత్యక్రియలు జరగనున్నాయి. గత డిసెంబర్ లో అబ్దుల్లా న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు గొట్టాల ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. ఆయన 2005లో సౌదీ అరేబియా రాజుగా దేశ పగ్గాలు చేపట్టారు. ఆయన ఈ మధ్యే సిరియాలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన మారణకాండకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణంలో చేరారు. ఆయన మరణానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు.