Sri lanka Cricket board
-
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను పూర్తి స్థాయి హెడ్కోచ్గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడిని కోచ్గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో చెత్త ప్రదర్శనతో శ్రీలంక జట్టు విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టి వరల్డ్కప్ తర్వాత క్రిస్ సిల్వర్వుడ్ తన హెడ్కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్యను లంక బోర్డు తాత్కాలిక కోచ్గా నియమించింది.ఆదిలోనే చేదు అనుభవంటీమిండియాతో సొంతగడ్డపై టీ20 సిరీస్ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన జయసూర్యకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. సూర్యకుమార్ సేన చేతిలో లంక 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. అయితే, ఈ పరాభవాన్ని మర్చిపోయేలా వన్డే సిరీస్లో శ్రీలంక చారిత్రాత్మక విజయం సాధించింది.ఆ తర్వాత వరుస విజయాలుదాదాపు ఇరవై ఏడేళ్ల విరామం తర్వాత భారత జట్టుపై వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. జయసూర్య మార్గదర్శనంలో ఈ అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో శ్రీలంక జట్టు ముందుకు దూసుకుపోతోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పదేళ్ల తర్వాత అక్కడ టెస్టు మ్యాచ్ గెలిచిన లంక.. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసింది.ఈ జైత్రయాత్రకు ప్రధాన కారణం జయసూర్య గైడెన్స్ అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే లంక బోర్డు అతడిని పూర్తి స్థాయి హెడ్కోచ్గా నియమించింది. ‘‘తాత్కాలిక హెడ్ కోచ్గా ఉన్న జయసూర్య మార్గదర్శనంలో.. ఇటీవలి కాలంలో టీమిండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై శ్రీలంక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.టీ20 వరల్డ్కప్ వరకూ అతడే!ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జయసూర్యను హెడ్కోచ్గా కొనసాగించాలని నిర్ణయించింది. అక్టోబరు 1, 2024 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మార్చి 31, 2026 వరకు అతడు ఈ పదవిలో కొనసాగుతాడు’’ అని లంక బోర్డు తన ప్రకటనలో తెలిపింది. కాగా జయసూర్య గతంలో చీఫ్ సెలక్టర్గానూ పనిచేశాడు. ఇక ఫుల్టైమ్ హెడ్కోచ్గా వెస్టిండీస్తో డంబుల్లా వేదికగా మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్తో అతడి ప్రయాణం మొదలుకానుంది.చదవండి: ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్ -
LPL 2024: శ్రీలంక స్టార్ క్రికెటర్పై వేటు..
శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. లంక ప్రీమియర్ లీగ్-2024(ఎల్పీఎల్) సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో విఫలమైనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అతడిపై వేటు వేసింది.లీగ్లో గాలె మార్వెల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న డిక్వెల్లాపై శుక్రవారం నుంచే నిషేధం అమల్లోకి వచ్చినట్లు ఎస్ఎల్సీ పేర్కొంది. డోపింగ్ పరీక్షల్లో అతడు కొకైన్ తీసుకున్నట్లు తెలినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా డిక్వాలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదేమి తొలిసారి కాదు. అంతకుముందు 2021లో ఇంగ్లండ్ పర్యటనలో బయో-బబుల్ ప్రోటోకాల్లను ఉల్లంఘించినందుకు డిక్వాలా ఏడాది నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఇక డిక్వెల్లా జాతీయ జట్టు తరఫున 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. -
IPL 2024: అనుకున్నదే అయ్యింది.. సీజన్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
సన్రైజర్స్ స్టార్ స్పిన్నర్, శ్రీలంక టీ20 జట్లు కెప్టెన్ వనిందు హసరంగ విషయంలో అనుకున్నదే అయ్యింది. గాయం (ఎడమ కాలు మడమ) కారణంగా ఈ ఆటగాడు ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరిస్తూ బీసీసీఐకి లేఖ రాసింది. గాయం తాలుకా చికిత్స నిమిత్తం హసరంగ దుబాయ్లో ఉన్నాడని లంక బోర్డు పేర్కొంది. చికిత్స అనంతరం హసరంగ స్వదేశంలో రిహాబ్లో ఉంటాడని తెలిపింది. డాక్టర్లు హసరంగను కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది. కాగా, కొద్ది రోజుల ముందు వరకు సన్రైజర్స్ యాజమాన్యం హసరంగపై ఆశలు పెట్టుకుని ఉండింది. సీజన్ ఆఖరి మ్యాచ్లకైనా అందుబాటులోకి వస్తాడని అనుకుంది. లంక బోర్డు తాజా ప్రకటన నేపథ్యంలో సన్రైజర్స్ ప్రత్యామ్నాయ ఆటగాడిని వెతికే పనిలో పడింది. గాయం లేదు ఏమీ లేదు అంతా డ్రామా.. హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం వెనక గాయం కాకుండా వేరే కారణాలు ఉన్నాయని నెట్టింట ప్రచారం జరుగుతుంది. వేలంలో అతనికి సరైన రెమ్యూనరేషన్ దక్కకపోడం వల్లే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. హసరంగను గత సీజన్లో (2023) ఆర్సీబీ 10.75 కోట్లకు దక్కించుకోగా.. ఈ సీజన్ వేలంలో అతన్ని సన్రైజర్స్ కేవలం 1.5 కోట్లకే సొంతం చేసుకుంది. వేలంలో అనుకున్న ధర లభించకపోతే చాలా మంది విదేశీ ఆటగాళ్లు రకరకాల కారణాలు చూపి పోటీ నుంచి తప్పుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే, హసరంగ ఉన్నా లేకపోయిన ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతుంది. తాజాగా కమిన్స్ సేన సొంత మైదానంలో (ఉప్పల్) ఫైవ్ టైమ్ ఛాంపియన్ సీఎస్కేను మట్టికరిపించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. సన్రైజర్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, రెండు పరాజయాలను మూటగట్టుకుంది. సన్రైజర్స్ ఏప్రిల్ 9న జరిగే తమ తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఢీకొంటుంది. -
శ్రీలంక క్రికెట్కు భారీ ఊరట
శ్రీలంక క్రికెట్కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆ జట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది. నిషేధం ఎత్తివేత తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఆదివారం (జనవరి 28) ప్రకటించింది. సభ్య దేశంగా ఉండి బాధ్యతల ఉల్లంఘణకు పాల్పడటంతో పాటు బోర్డు అంతర్గత వ్యవహారాల్లో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని సహించని ఐసీసీ నవంబర్ 10న శ్రీలంక క్రికెట్ బోర్డుపై (ఎస్ఎల్సీ) నిషేధాన్ని విధించింది. లంక క్రికెట్ బోర్డు స్వయంప్రతిపత్తిని కోల్పోయి, స్థానిక రాజకీయ నాయకుల చేతుల్లో పావుగా మారి అవినీతి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆ దేశ ఆడిటర్ జనరల్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఐసీసీ ఎస్ఎల్సీపై నిషేధం విధించింది. వన్డే వరల్డ్కప్ 2023 అనంతరం షమ్మీ సిల్వ నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ రద్దు చేసింది. ఎస్ఎల్సీపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ దేశంలో జరగాల్సిన అండర్-19 వరల్డ్కప్ 2024 సౌతాఫ్రికాకు తరలించబడింది. బోర్డు రద్దు అనంతరం రెండు నెలలపాటు పరిస్థితిని సమీక్షించిన ఐసీసీ తాజాగా సమావేశమై నిషేధాన్ని ఎత్తి వేసింది. ఎస్ఎల్సీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్యాన్ను ఎత్తి వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో ఆ దేశ ఆటగాళ్లు విదేశీ లీగ్ల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆ జట్టు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేసింది. -
షనకపై వేటు.. శ్రీలంక కొత్త కెప్టెన్లుగా వాళ్లిద్దరు! లంక బోర్డు ప్రకటన
Zimbabwe Tour of Sri Lanka 2024: Preliminary Squads: పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక కెప్టెన్గా దసున్ షనక ప్రస్థానం ముగిసింది. ఇకపై అతడు జట్టులో కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్లకు ప్రాథమిక జట్టును ప్రకటించిన సందర్భంగా లంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. దసున్ షనక స్థానంలో ఆయా ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. వన్డే పగ్గాలను కుశాల్ మెండిస్కు, టీ20 జట్టు సారథ్య బాధ్యతలను వనిందు హసరంగకు అప్పగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వన్డే వరల్డ్కప్లో చెత్త ప్రదర్శన కాగా దసున్ షనక కెప్టెన్సీలో పలు అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో సారథిగా అతడి గెలుపు శాతం యాభైకి పైగానే ఉంది. అయితే, ఆసియా కప్-2023 తర్వాత సీన్ మారింది. ఈ టోర్నీలో ఆటగాడిగా పూర్తిగా విఫలమైన షనక.. టీమిండియాతో ఫైనల్లో జట్టును ఘోర ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో అతడి నాయకత్వంలోని శ్రీలంక పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈ టోర్నీలో మధ్యలోనే గాయం కారణంగా షనక వైదొలగగా.. కుశాల్ మెండిస్ అతడి స్థానంలో కెప్టెన్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత లంక ఆట మరింత తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్గా దసున్ షనకపై వేటు తప్పదని వార్తలు రాగా.. తాజాగా లంక బోర్డు ప్రకటనతో అవి నిజమని తేలాయి. కాగా సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక ప్రాథమిక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగె, నువానిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియానగే, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుశంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషాన్, అసితా ఫెర్నాండో, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక గుణశేఖర. జింబాబ్వేతో టీ20లకు శ్రీలంక ప్రాథమిక జట్టు: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భనుక రాజపక్స, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక కరుణరత్నె, దుష్మంత మచీర, దిల్షాన్ మదుశంక, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, ప్రమోద్ మదుషాన్, మతీశ పతిరణ. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ -
సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలు
శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఆ దేశ దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఎస్ఎల్సీ జయసూర్యను ఓ సంవత్సరం పాటు పూర్తి స్థాయి క్రికెట్ కన్సల్టెంట్గా నియమించింది. జయసూర్య ఎంపిక తక్షణమే అమలుల్లోకి వస్తుందని లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 54 ఏళ్ల జయసూర్య 1991-2011 మధ్యలో లంక క్రికెట్ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు. 19956 వరల్డ్కప్ తర్వాత జయసూర్య కెరీర్ ఓ రేంజ్లో సాగింది. జయసూర్య.. సహచరుడు కలువితరణతో కలిసి ప్రపంచ క్రికెట్కు విధ్వంసకర బ్యాటింగ్ను పరిచయం చేశాడు. కాగా, వన్డే వరల్డ్కప్ 2023లో పేలవ ప్రదర్శన అనంతరం లంక క్రికెట్ వివిధ కారణాల చేత వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టుపై ఐసీసీ తాత్కాలిక నిషేధం కూడా విధించింది. తాజాగా ఆ దేశ క్రీడా వ్యవహారాల మంత్రి హరీన్ ఫెర్నాండో ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలక్షన్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి మాజీ కెప్టెన్ ఉపుల్ తరంగ చైర్మెన్గా ఎంపిక కాగా.. అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా సభ్యులుగా ఉన్నారు. -
క్రికెట్ బోర్డులో అవినీతి? నన్ను చంపేస్తారంటూ సంచలన ఆరోపణలు
శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రక్షాళన కోసం తపించి తాను ప్రాణం మీదకు తెచ్చుకున్నానంటూ ఆ దేశ ‘క్రీడా మంత్రి’ రోషన్ రణసింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. బోర్డులో అవినీతి నిర్మూలిద్దామని భావిస్తే తనను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంక జట్టు దారుణ వైఫల్యం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. వరల్డ్కప్లో పరాభవం ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టు ఎంపిక, అనుసరించిన వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోర్డు సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు లంక క్రికెట్ బోర్డును పునురద్ధరించింది. అయితే, ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠిన నిర్ణయం తీసుకుంది. లంక బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ లంక బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా రోషన్ రణసింఘే సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. క్రికెట్ బోర్డులో జోక్యం వల్లే తనను మంత్రివర్గం నుంచి తొలగించారంటూ ఆయన ఆరోపించారు. నడిరోడ్డు మీద హత్య చేసే అవకాశం! ఈ మేరకు.. ‘‘క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించాలనుకున్నందుకు నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు మీదే నన్ను హత్య చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు అధ్యక్షుడు, అతడి చీఫ్ స్టాఫ్ మాత్రమే బాధ్యులు’’ అని రోషన్ రణసింఘే వ్యాఖ్యానించారు. భారీ ఆదాయానికి గండి! కాగా మంత్రి వర్గం నుంచి రోషన్ సస్పెన్షన్పై అధ్యక్షుడి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఆయన ఆరోపణలపై మాత్రం ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. కాగా ద్వీపదేశంలో ధనిక క్రీడా సంస్థగా లంక క్రికెట్ బోర్డు కొనసాగుతోంది. క్రికెట్ ద్వారా దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. గతంలో వరల్డ్కప్ గెలిచిన ఘనతతో పాటు పటిష్ట జట్టుగానూ ఆ టీమ్కు పేరుంది. అయితే, గత కొంతకాలంగా ఘోర పరాభవాలతో ప్రతిష్టను మసకబార్చుకుంటోంది శ్రీలంక జట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ సస్పెన్షన్ మరింత దెబ్బ కొట్టగా.. అధ్యక్షుడు విక్రమసింఘే నిషేధానికి గల కారణాల అన్వేషణకై విచారణ కమిటీ వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: తమ్ముడంటే ప్రేమ! మనుషులు దూరంగా ఉన్నా.. కోహ్లి తోబుట్టువు భావనా గురించి తెలుసా? -
శ్రీలంక క్రికెట్కు మరో షాక్.. ఐసీసీ నిషేధం అమలవుతుండగానే..!
శ్రీలంక క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ దేశ క్రికెట్ బోర్డుపై నిషేధం అమలవుతుండగానే ఐసీసీ మరో ఝలక్ ఇచ్చింది. లంక బోర్డుపై నిషేధాన్ని కారణంగా చూపుతూ అక్కడ జరగాల్సిన ఈవెంట్ను ఐసీసీ మరో దేశానికి మార్చింది. వచ్చే ఏడాది (2024) జనవరిలో లంకలో జరగాల్సిన అండర్–19 పురుషుల ప్రపంచకప్ టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది. అహ్మదాబాద్లో నిన్న (నవంబర్ 21) జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. గతంలో (2020) సౌతాఫ్రికా అండర్–19 వరల్డ్కప్ను విజయవంతంగా నిర్వహించినందుకు మరోసారి ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. వేదిక మార్పు అంశాన్ని టోర్నీలో పాల్గొనే జట్లకు ఇదివరకే తెలియజేసినట్లు పేర్కొన్నాడు. కాగా, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక క్రికెట్ జట్టును ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే రద్దు చేసిన విషయం తెలిసిందే. బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. -
జై షాకు క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం..
శ్రీలంక క్రికెట్ను నాశనం చేశడంటూ బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడు జై షాపై ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. రణతుంగ చేసిన వ్యాఖ్యలపై జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. శ్రీలంక పార్లమెంట్లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ జై షాకు క్షమాపణలు తెలుపుతున్నాము. మా బోర్డులోని లోపాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శి లేదా ఇతర దేశాలపై రుద్దలేము. ఇది మంచి పద్దతి కాదు అని పేర్కొన్నారు. అస్సలు ఏం జరిగిందంటే? వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనతో శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఘోర పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఎస్ఎల్సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. అనంతరం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు. అంతలోనే శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బిగ్షాకిచ్చింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీరియస్గా పరిగణించిన ఐసీసీ ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేసంది. ఈ క్రమంలో ఓ స్ధానిక వార్తపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుణతుంగా మాట్లాడుతూ.. "శ్రీలంక క్రికెట్ బోర్డులో కొంతమంది అధికారులకు జై షాతో మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక క్రికెట్ ఈ స్ధాయికి దిగజారడానికి కారణం అతడే. భారత్లో ఉంటూ శ్రీలంక బోర్డును సర్వనాశనం చేస్తున్నాడు. అతను చాలా పవర్ఫుల్. ఎందుకంటే అతని తండ్రి భారత్ హోమ్ మినిస్టర్" అని సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియా-భారత్ ఫైనల్కు అంపైర్లు ఖారారు.. లిస్ట్లో ఐరన్ లెగ్ అంపైర్ -
సర్వనాశనం చేశాడు.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
వన్డే వరల్డ్కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. వరల్డ్కప్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన అనంతరం ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు మొత్తాన్ని రద్దు చేశాడు. ఆపై బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. తమ క్రికెట్ బోర్డుకు పట్టిన దుస్థితి నేపథ్యంలో ఆ దేశ వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశ క్రికెట్కు ఈ గతి పట్టడానికి బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కారణమని సంచలన ఆరోపణలు చేశాడు. తమ బోర్డు అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగా షా మాపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపించాడు. తన తండి (అమిత్ షా) అధికారాన్ని అడ్డుపెట్టుకుని జై షా లంక క్రికెట్ను శాశిస్తున్నాడని ధ్వజమెత్తాడు. జై షా అనవసర జోక్యం కారణంగానే లంక క్రికెట్కు ఈ దుస్థితి దాపురించిందని వాపోయాడు. జై షాను ఉద్దేశిస్తూ రణతుంగ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో దుమారం రేపుతున్నాయి. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబర్చి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ కారణంగా శ్రీలంక 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ టోర్నీలో లంక క్రికెట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్పై విజయం సాధించడం. మరోవైపు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్.. న్యూజిలాండ్తో తలపడనుంది. -
ICC: శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత..
దుబాయ్: శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు... ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఈనెల 21న ఐసీసీ బోర్డు సమావేశం జరుగుతుందని, ఆ తర్వాతే శ్రీలంక బోర్డు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వస్తుందని ఐసీసీ తెలిపింది. భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో శ్రీలంక నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. దాంతో శ్రీలంక జట్టు ఆటతీరుపై ఆ దేశ ప్రభుత్వ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేశారు. మాజీ కెపె్టన్ అర్జున రణతుంగ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని నియమించారు. అయితే ఈ నిర్ణయంపై బోర్డు కోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు క్రికెట్ బోర్డును పునర్నియమించింది. జింబాబ్వే (2021) తర్వాత ఐసీసీ ద్వారా సస్పెన్షన్కు గురైన రెండో పూర్తిస్థాయి సభ్యత్వ దేశం శ్రీలంక కావడం గమనార్హం. -
WC 2023: టీమిండియా చేతిలో చావుదెబ్బ! బాధ్యులు మీరే.. బదులివ్వండి
ICC ODI WC 2023: వన్డే వరల్డ్కప్-2023 శ్రీలంకకు అస్సలు కలిసి రావడం లేదు. నేరుగా టోర్నీకి అర్హత సాధించని కారణంగా క్వాలిఫయర్స్ ఆడి ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టిన ఈ మాజీ చాంపియన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. స్టార్లు దూరం గాయాల కారణంగా కెప్టెన్ దసున్ షనక సహా స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగ, పేసర్లు లాహిరు కుమార, మతీశ పతిరణ జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి తరుణంలో జట్టు పగ్గాలు చేపట్టిన కుశాల్ మెండిస్ జట్టును విజయవంతంగా ముందుకు నడపడంలో విఫలమవుతున్నాడు. టీమిండియా చేతిలో చావుదెబ్బ దీంతో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక(అనధికారికంగా).. వాంఖడేలో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ముంబైలో గురువారం నాటి మ్యాచ్లో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెండిస్ బృందం మరీ ఘోరంగా 55 పరుగులకే కుప్పకూలింది. View this post on Instagram A post shared by ICC (@icc) టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ధాటికి టాపార్డర్ కకావికలం కాగా.. మరో ఫాస్ట్బౌలర్ మహ్మద్ షమీ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. దీంతో లంక 302 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. ‘సమిష్టి వైఫల్యం’ ఇదిలా ఉంటే.. ఆరంభంలో సౌతాఫ్రికాతో మ్యాచ్లో లంక బౌలర్లు ఏకంగా 428 పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడితే.. టీమిండియాతో మ్యాచ్లో బ్యాటర్లు విఫలమైన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో జట్టు ఆట తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఘోర వైఫల్యాలకు గల కారణాలేమిటో వెల్లడించాలంటూ సెలక్టర్లు, కోచ్, ఆటగాళ్లకు నోటీసులు ఇచ్చింది. షాకింగ్ ఓటములు ఈ మేరకు.. ‘‘ఇప్పటి వరకు ఓవరాల్ ప్రదర్శన.. ఇటీవల విస్మయకరరీతిలో భారీ పరాజయాలను చూసిన తర్వాత మెగా టోర్నీకి జట్టు సన్నద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారన్న విషయం చర్చనీయాంశమైంది. నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెషనల్ స్టాఫ్ విషయంలో బోర్డు ఏమాత్రం జోక్యం చేసుకోదు. వారి విధులు, బాధ్యతలకు ఆటంకం కలిగించదు. బాధ్యులు మీరే.. బదులివ్వండి కానీ.. మీ నుంచి మేము జవాబుదారీతనం, పారదర్శకత కోరుకుంటున్నాం. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి ఎలా బయట పడాలన్న అంశంపై దృష్టి పెట్టండి. మన జట్టు ఎంపిక, సన్నద్ధత.. తుదిజట్టు కూర్పు విషయంలో ఎలాంటి ప్రణాళికలు రచించారో వివరించండి. జట్టుతో పాటు ప్రతి ఒక్క ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనను అంచనా వేసి.. వారి బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకోండి. View this post on Instagram A post shared by ICC (@icc) దృష్టి సారించండి ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందే మా దృష్టికి తీసుకురండి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫలితాన్ని విశ్లేషించి భవిష్యత్తులో పొరపాట్లు దొర్లకుండా చూసుకోండి. కోచింగ్ టీమ్ ఈ విషయంమై లోతుగా అధ్యయనం చేయాలి’’ అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో పేర్కొంది. మాజీ చాంపియన్కు ఏమిటీ దుస్థితి? కాగా ముంబైలోని వాంఖడేలో 2011లో ఫైనల్లో టీమిండియాకు గట్టిపోటీనిచ్చిన లంక.. ఈసారి అదే వేదికపై 55 పరుగులకే ఆలౌట్ కావడం అభిమానులతో పాటు లంక మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సెమీస్ మాట పక్కన పెడితే మరీ ఇంత అధ్వాన్న రీతిలో ఓడిపోవాలా? మాజీ చాంపియన్కు ఏమిటీ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 1996 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరి సత్తా చాటింది. చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్! ఐసీసీ ప్రకటన విడుదల -
వేటు తప్పదా? ‘అతడే జట్టును ముందుండి నడిపిస్తాడు! సెలక్టర్ల నిర్ణయం ఇదే’
Asia Cup 2023- ICC ODI WC 2023: ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది శ్రీలంక. గతేడాది టీ20 ఫార్మాట్లో చాంపియన్గా నిలిచిన దసున్ షనక బృందం.. ఈసారి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ధాటికి 50 పరుగులకే ఆలౌటై చెత్త గణాంకాలు నమోదు చేసింది. వన్డే ఈవెంట్ ఆసాంతం.. ముఖ్యంగా ఫైనల్లో కెప్టెన్ దసున్ షనక బ్యాటింగ్ వైఫల్యం తీవ్ర ప్రభావం చూపింది. వేటు తప్పదంటూ వార్తలు ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్-2023కి ముందు అతడిపై వేటు వేయడం ఖాయమని.. షనక స్థానంలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ను శ్రీలంక సారథిగా నియమించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్కు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ... సెలక్టర్ల నిర్ణయం ఇదే ‘‘వరల్డ్కప్-2023 ముగిసేంత వరకు కెప్టెన్గా దసున్ షనకకే కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు’’ అని తెలిపినట్లు న్యూస్వైర్ పేర్కొంది. దీంతో శ్రీలంక కెప్టెన్ మార్పు ఇప్పట్లో లేదని స్పష్టమైంది. కాగా ప్రపంచకప్లో అక్టోబరు 7న శ్రీలంక తమ ఆరంభ మ్యాచ్లో సౌతాఫ్రికాతో తలపడనుంది. అంతకంటే ముందు సెప్టెంబరు 27న అఫ్గనిస్తాన్తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్కప్ జట్టును ప్రకటించేందుకు సెప్టెంబరు 28 వరకు సమయం ఉన్న నేపథ్యంలో శ్రీలంక ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. మొన్ననే సెలక్టర్లకు థాంక్స్ చెప్పిన షనక.. మెరుగ్గానే టీమిండియాతో ఫైనల్కు ముందు దసున్ షనక మాట్లాడుతూ.. బ్యాటర్గా విఫలమైనా కెప్టెన్గా తనను నమ్మినందుకు సెలక్టర్లకు ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుతం సారథ్య బాధ్యతలపైనే తన దృష్టి కేంద్రీకృతం అయి ఉందని పేర్కొన్నాడు. కాగా కెప్టెన్గా వన్డేల్లో షనక రికార్డు బాగుంది. 37 వన్డేల్లో 23 గెలిపించాడు. వన్డే సారథిగా దసున్ షనక విజయాల శాతం 60.5. ఈ నేపథ్యంలో అతడిపై ఇప్పట్లో వేటుపడే అవకాశం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
ఆసియా కప్-2023 విజేతలు గ్రౌండ్స్మెన్, పిచ్ క్యూరేటర్స్
2023 ఆసియా కప్ టైటిల్ను టీమిండియా ఎగరేసుకుపోయింది. ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా కప్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 🏏🏟️ Big Shoutout to the Unsung Heroes of Cricket! 🙌 The Asian Cricket Council (ACC) and Sri Lanka Cricket (SLC) are proud to announce a well-deserved prize money of USD 50,000 for the dedicated curators and groundsmen at Colombo and Kandy. 🏆 Their unwavering commitment and… — Jay Shah (@JayShah) September 17, 2023 తెర వెనుక హీరోలకు గుర్తింపు.. 2023 ఆసియా కప్ విజయవంతం కావడంలో కొలొంబో, క్యాండీ మైదానాల సహాయ సిబ్బంది, పిచ్ క్యూరేటర్ల పాత్ర చాలా కీలకమైంది. వీరి కమిట్మెంట్ లేనిది ఆసియా కప్ అస్సలు సాధ్యపడేది కాదు. కీలక మ్యాచ్లు జరిగిన సందర్భాల్లో వర్షాలు తీవ్ర ఆటంకాలు కలిగించగా.. క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్ ఎంతో అంకితభావంతో పని చేసి మ్యాచ్లు సాధ్యపడేలా చేశారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గ్రౌండ్స్మెన్ సేవలు వెలకట్టలేనివి. Join us in appreciating the Sri Lanka groundsmen 👏👏 pic.twitter.com/0S7jpERgxj — CricTracker (@Cricketracker) September 17, 2023 వారు ఎంతో అప్రమత్తంగా ఉండి, వర్షం పడిన ప్రతిసారి కవర్స్తో మైదానం మొత్తాన్ని కప్పేశారు. స్థానికమైన ఎన్నో టెక్నిక్స్ను ఉపయోగించి, వీరు మైదానాన్ని ఆర బెట్టిన తీరు అమోఘమని చెప్పాలి. వీరి పనితనానికి దేశాలకతీతంగా క్రికెట్ అభిమానులు ముగ్దులైపోయారు. ఆసియా కప్-2023 నిజమైన విజేతలు గ్రౌండ్స్మెన్, పిచ్ క్యూరేటర్స్ అని సోషల్మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అంతిమంగా వీరి కష్టానికి తగిన గుర్తింపు దక్కింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ).. కొలొంబో, క్యాండీ మైదానాల గ్రౌండ్స్మెన్, క్యూరేటర్లకు 50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్మనీని ప్రకటించారు. వారి కమిట్మెంట్, హార్డ్వర్క్లకు ఇది గుర్తింపు అని ఏసీసీ చైర్మన్ జై షా అన్నారు. వీరు లేనిది ఆసియా కప్-2023 సాధ్యపడేది కాదని షా ప్రశంసించారు. కాగా, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ తనకు లభించిన ప్రైజ్మనీ మొత్తాన్ని గ్రౌండ్స్మెన్కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. -
SL Vs Pak: లంకపై పాక్ విజయం! ప్రైజ్మనీ ఎంతంటే! సారీ చెప్పిన బోర్డు..
Sri Lanka vs Pakistan, 1st Test: శ్రీలంకతో తొలి టెస్టులో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్లో బాబర్ ఆజం బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గాలే వేదికగా జూలై 16న మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య లంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సౌద్ షకీల్ సంచలన ఇన్నింగ్స్ ధనంజయ డి సిల్వ సెంచరీ(122) నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులు చేయగలిగింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన పాకిస్తాన్ 461 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగించి ఆధిక్యం సాధించింది. సౌద్ షకీల్ అజేయ డబుల్ సెంచరీ(208) కారణంగా ఈ మేరకు స్కోరు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో లంక 279 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఆఖరి రోజు ఆటలో భాగంగా 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసిన పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన సౌద్ షకీల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ప్రైజ్మనీ ఎంతో! ఈ నేపథ్యంలో ప్రెజెంటేషన్ సెర్మనీలో భాగంగా మ్యాచ్ విజేత పాకిస్తాన్కు ఇచ్చిన చెక్ నెట్టింట వైరల్గా మారింది. విజయానంతరం చెక్ అందుకున్న పాక్ సారథి బాబర్ ఆజం ఫొటో చూసిన నెటిజన్లు అందులో ఉన్న తప్పును కనిపెట్టేశారు. అందులో ప్రైజ్మనీగా.. అక్షరాల్లో రెండు వేల యూఎస్ డాలర్లు అని రాసి ఉంది. అయితే, అంకెల్లో మాత్రం 5,000 యూఎస్ డాలర్లు అని ఉంది. క్షమించండి ఈ విషయంపై రచ్చ రచ్చ కాగా.. శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది. తప్పిదానికి క్షమాపణలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ‘‘తొలి టెస్టు విజేతకు అందించిన ప్రెజెంటేషన్ చెక్లో దొర్లిన తప్పిదానికి చింతిస్తున్నాం. నిజానికి గ్రౌండ్ రైట్స్ హోల్డర్ దీనిని రూపొందించింది. ఏదేమైనా ఇందుకు శ్రీలంక క్రికెట్ పూర్తి బాధ్యత వహిస్తుంది. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం’’అని బోర్డు తెలిపింది. కాగా జూలై 24 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: రోజుకు 10 కోట్లు! కోహ్లి ఆర్జన వెనుక రోహిత్ శర్మ బావమరిది! సల్మాన్ ఖాన్తోనూ.. pic.twitter.com/YZ3CJozoOK — Out Of Context Cricket (@GemsOfCricket) July 20, 2023 -
ఎల్పీఎల్ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా?
శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2023) చరిత్రలో తొలిసారి వేలం జరిగింది. జూన్ 14న(బుధవారం) ఎల్పీఎల్లో వేలం నిర్వహించారు. మొత్తం 360 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో భారత్ తరపున రిజిస్టర్ చేసుకుంది కేవలం సురేశ్ రైనా మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పడం.. ఐపీఎల్లో కూడా ఏ జట్టు తరపున ఆడకపోవడంతో రైనాకు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్లో మంచి ధర పలుకుతుందని అభిమానులు ఊహించారు. ఒక దశలో సురేశ్ రైనా పేరును లంక క్రికెట్ బోర్డు ఎల్పీఎల్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించుకుంటుందని భావించారు. కానీ వేలం సమయానికి సీన్ మొత్తం రివర్స్ అయింది. వేలం జరుగుతున్న సమయంలో సురేశ్ రైనా పేరు ఎక్కడా వినిపించలేదు. అలా అని అన్సోల్డ్ లిస్ట్లో ఉన్నాడా అంటే అది లేదు. మరి రైనా పేరు ఏమైనట్లు అని అభిమానులు కన్ఫూజ్కు గురయ్యారు. అయితే విషయమేంటంటే వేలంలో హోస్ట్గా వ్యవహరించిన చారుశర్మ సురేశ్ రైనా పేరును మరిచిపోయాడా లేక కావాలనే పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అటు రైనా కానీ ఇటు లంక క్రికెట్ బోర్డు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైనా లంక ప్రీమియర్ లీగ్లో ఆడతాడా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రైనా తన బేస్ప్రైస్ ధరతో సెట్ నెంబర్ 11లో ఉన్నాడు. ఇదే సెట్లో రాసీ వాండర్ డుసెన్(సౌతాఫ్రికా), ఇమాముల్ హక్(పాకిస్తాన్), ఎవిన్ లూయిస్(వెస్టిండీస్) వంటి స్టార్లు ఉన్నారు. వీరిందరి పేర్లను పలికిన చారు శర్మ రైనా పేరు పలకడం మాత్రం మరిచిపోయాడు. అయితే ఇదే అభిమానులను కన్ఫూజ్న్కు గురయ్యేలా చేసింది. నిజంగా చారుశర్మ రైనా పేరును పలకడం మరిచిపోయారా.. లేదంటే చివరి నిమిషంలో రైనా పేరును వేలంలో తొలగించారా అనేది క్లారిటీ లేదు. టి20 క్రికెట్లో సురేశ్ రైనాకు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్గా పేరు పొందిన రైనా 205 మ్యాచ్లాడి 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సీఎస్కే నాలుగుసార్లు ఛాంపియన్గా(మొత్తంగా ఐదుసార్లు) నిలవడంలో రైనా పాత్ర కీలకం. అంతేకాదు టీమిండియా తరపున 78 టి20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 1609 పరుగులు చేసిన రైనా ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. మరి ఇంతటి ట్రాక్ రికార్డు కలిగిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్లో చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. అయితే దీనిపై క్లారిటీ వచ్చేవరకు రైనా ఎల్పీఎల్ ఆడతాడా లేదా అనేది తెలియదు. ఇప్పటికైతే రైనా ఎల్పీఎల్లో ఆడనట్లే. ఇక ఎల్పీఎల్లో ఈసారి పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఒక్కడే ఐకాన్ ప్లేయర్గా ఉన్నాడు. కొలంబో స్ట్రైకర్స్కు బాబర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇక నిన్నటి వేలంలో దిల్షాన్ మధుషనక అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. మధుషనకను లైకా జఫ్నా కింగ్స్ 92వేల డాలర్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో చరిత్ అసలంక 80వేల డాలర్లకు(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు) జఫ్నా కింగ్స్.. మూడో స్థానంలో ధనుంజయ డిసిల్వా(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు)ను దంబుల్లా ఆరా 76వేల డాలర్లకు కొనుగోలు చేసింది. చదవండి: ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. అందరి దృష్టి ఆ క్రికెటర్పైనే -
ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. కళ్లన్నీ ఆ క్రికెటర్పైనే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంత కాకపోయినా లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) కూడా బాగానే ప్రజాధరణ పొందుతుంది. గత సీజన్ ఇందుకు ఉదాహరణ. ఇప్పటివరకు ఐపీఎల్ మినహా మిగతా లీగ్ల్లో ఆడేందుకు సముఖత చూపని టీమిండియా మాజీ క్రికెటర్లు ఇప్పుడు బయటి లీగుల్లోనూ దర్శనమిస్తున్నారు. తాజాగా 2023 సీజన్కు సంబంధించి జూన్ 14న(బుధవారం) లంక ప్రీమియర్ లీగ్లో తొలిసారి వేలం జరగనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ వేలానికి 500 మంది ఆటగాళ్లు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. వేలంలో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొననుండగా.. ఐపీఎల్లో అనుసరించిన విధానాన్నే ఇక్కడ అమలు చేయనున్నారు. మొత్తం ఆటగాళ్ల కోసం 5లక్షల అమెరికన్ డాలర్డు ఖర్చు చేయనున్నారు. ఇక తొలిసారి జరగనున్న వేలానికి చారు శర్మ హోస్ట్గా వ్యవహరించనుండడం విశేషం. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా లంక ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకోవడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు పొందిన రైనాకు మంచి ధర పలికే అవకాశం ఉంది. 50వేల యూఎస్ డాలర్ల కనీస ధరతో రైనా వేలంలోకి రానున్నాడు. సెప్టెంబర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ఆ తర్వాత 2023లో అబుదాబి టి10 టోర్నీలో పాల్గొన్నాడు. అయితే వేలానికి ముందే ఆయా ఫ్రాంచైజీలు కొందరు స్టార్ ప్లేయర్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వారిలో బాబర్ ఆజం, షకీబ్ అల్ హసన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు వీరే.. ► కొలంబో స్ట్రైకర్స్: బాబర్ ఆజం, మతీషా పతిరనా, నసీమ్ షా, చమికా కరుణరత్నే ► దంబుల్లా ఆరా: మాథ్యూ వేడ్, కుసల్ మెండిస్, లుంగి ఎన్గిడి, అవిష్క ఫెర్నాండో ► జాఫ్నా కింగ్స్: మహేశ్ తీక్షణ, డేవిడ్ మిల్లర్, తిసర పెరీరా, రహ్మానుల్లా గుర్బాజ్ ► క్యాండీ ఫాల్కన్స్: వనిందు హసరంగా, ఏంజెలో మాథ్యూస్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫఖర్ జమాన్ ► గాలే గ్లాడియేటర్స్: భానుక రాజపక్స, దసున్ షనక, షకీబ్ అల్ హసన్, తబ్రైజ్ షమ్సీ ఇప్పటివరకు మూడు సీజన్లు విజయవంతం కాగా నాలుగో సీజన్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా జూలై 30 నుంచి ఆగస్టు 20 వరకు లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ జరగనుంది. Charu Sharma thrilled to be auctioneer for LPL 2023, the league's first ever auction! 🏏🔨https://t.co/xu1EFeab3C #lpl2023 — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 12, 2023 చదవండి: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు! -
శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా?
ఆసియాకప్ 2023 నిర్వహణపై ఇంకా సందిగ్థత వీడడం లేదు. వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్ తర్వాత ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఐపీఎల్ ఫైనల్ అనంతరం నిర్వహించిన మీటింగ్లో ఆసియాకప్ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్లో ఆసియా కప్ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో పీసీబీ హైబ్రిడ్ మోడ్లో ఆసియా కప్ నిర్వహించేందుకు ప్రణాళిక పంపింది. అయితే ఈ ప్రపోజల్ను మీటింగ్లో శ్రీలంక సహా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆసియా కప్ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ఏసీసీకి తెలిపింది. దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఆసియాకప్ శ్రీలంకలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది జరిగితే మాత్రం ఆసియా కప్లో పాక్ ఆడేందుకు నిరాకరించే అవకాశం ఉంది. అంతేకాదు ఆసియా కప్ నిర్వహణకు అడ్డుపడుతూ తమవద్ద నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నందుకు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.దీంతో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం మరొకసారి సమావేశం కానుంది. ఈ మీటింగ్లో చర్చించి ఆసియా కప్పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదన హైబ్రిడ్ మోడల్ రెండు రకాలు ఉన్నాయి. మొదటి ప్రతిపాదన ఏంటంటే ఆసియా కప్ టోర్నమెంట్ పాకిస్థాన్లో నిర్వహించబడుతుంది.. అయితే భారత జట్టు తటస్థ వేదికలో వారితో ఆడవచ్చు. ఇక రెండవ ప్రతిపాదన ఆసియా కప్ టోర్నీని రెండు భాగాలుగా విభజించనున్నారు. తొలి రౌండ్ మ్యాచ్లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా... ఈ రౌండ్లో భారత్తో మ్యాచ్లు ఉండవు. నిజానికి రెండో రౌండ్లో వారితో భారత జట్టు ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్ మ్యాచ్ తటస్థ వేదికపై జరుగుతుంది. చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా! -
మే 28న తేలనున్న ఆసియాకప్ భవితవ్యం!
ఆసియా కప్ 2023 జరుగుతుందా లేదా అనే దానిపై మే 28న స్పష్టత రానుంది. అదే రోజు ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్కు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC),అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు(BCB) ఆహ్వానాలు అందాయి. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ.. ఆయా క్రికెట్ బోర్డులతో సమావేశం కానున్నట్లు ప్రధాన కార్యదర్శి.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ట్వీట్ చేశారు. ''మే 28న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్కు బీసీబీ, ACB, లంక క్రికెట్ బోర్డు అధ్యక్షులు హాజరు కానున్నారు. ఆసియా కప్ 2023 నిర్వహణకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను ఇక్కడే చర్చించనున్నాం'' అంటూ తెలిపారు. ఈ మీటింగ్లో ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా హైబ్రిడ్ మోడ్లో ఆసియా కప్ను నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను కూడా మీటింగ్లో పరిశీలించనున్నారు. అయితే ఇంతకముందు ఆసియా కప్ పాక్లో జరిగితే తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఏసీసీని కోరింది. అందుకు ఏసీసీ అంగీకరించినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తొలుత ఒప్పుకోలేదు. అయితే అలా చేయకపోతే టీమిండియా ఆసియా కప్ ఆడదని.. అందువల్ల ఆయా బోర్డులకు తీవ్ర నష్టం చేకూరుతుందని అలా అయితే ఆసియా కప్ను రద్దు చేసే అవకాశం ఉంటుందని ఏసీసీ.. పీసీబీకీ అర్థమయ్యేలా వివరించింది. దీంతో హైబ్రిడ్ మోడ్లో ఆసియా కప్ నిర్వహణకు తాము సిద్దమే అని ప్రతిపాదనలు పంపింది. పీసీబీ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించినట్లు తెలిసింది. ఇక 2022లో టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్లో శ్రీలంక విజేతగా నిలిచింది. కాగా ఈసారి వన్డే వరల్డ్కప్ దృశ్యా ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక ఆసియా కప్ను అత్యధికంగా టీమిండియా ఏడుసార్లు గెలుచుకోగా.. శ్రీలంక ఆరుసార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. చదవండి: 'కింగ్' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు -
T20 world cup 2022: గుణతిలకకు బెయిల్ తిరస్కరణ
సిడ్నీ: ఆస్ట్రేలియాలో రేప్ కేసులో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. అతనికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అత్యాచారం కేసులో నిందితుడైన 31 ఏళ్ల క్రికెటర్పై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా నిషేధం విధించింది. తీవ్రమైన క్రిమినల్ నేరానికి పాల్పడిన అతనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని శ్రీలంక క్రీడాశాఖ ఆదేశించింది. ఆస్ట్రేలియా అధికారులకు సహకరిస్తామని ఎస్ఎల్సీ వర్గాలు తెలిపాయి. డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టు మెజిస్ట్రేట్ రాబర్ట్ విలియమ్స్ ముందు వర్చువల్ (వీడియో కాల్) పద్ధతిలో గుణతిలకను ప్రవేశపెట్టారు. అతని తరఫున లాయర్ ఆనంద అమరనాథ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేట్ తిరస్కరించారు. దీనిపై స్పందించిన లాయర్ ఆనంద అతిత్వరలోనే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తామన్నారు. టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు స్వదేశానికి బయల్దేరే ముందు గుణతిలకను అరెస్టు చేయడంతో అతను మినహా మొత్తం జట్టు లంకకు పయనమైంది. -
ఆస్ట్రేలియాలో అరెస్టైన లంక క్రికెటర్కు ఎదురుదెబ్బలు! కొత్తేం కాదు
ICC Mens T20 World Cup 2022- Danushka Gunathilaka: అత్యాచార కేసులో అరెస్టైన లంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు శ్రీలంక బోర్డు షాకిచ్చిది. ఇకపై ఏ ఫార్మాట్లో కూడా క్రికెట్ ఆడే అవకాశం లేకుండా అతడిపై నిషేధం విధించింది. లంక బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆడేందుకు గుణతిలక ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబరు 2న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు 31 ఏళ్ల గుణతిలకను ఆదివారం అరెస్టు చేశారు. లైంగిక దాడి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. బెయిల్ నిరాకరణ ఈ ఘటన నేపథ్యంలో సోమవారం అతడిని సిడ్నీ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం గుణతిలకకు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలో లంక బోర్డు సైతం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అతడిపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. అత్యాచార ఆరోపణలతో అరెస్టైన అతడు దోషిగా తేలితే మరింత కఠినచర్యలు ఉంటాయని పేర్కొంది. దర్యాప్తులో భాగంగా ఆస్ట్రేలియా పోలీసులు, న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తామని, కావాల్సిన సమాచారం అందిస్తామని వెల్లడించింది. వివాదాస్పద క్రికెటర్ బ్యాటింగ్ ఆల్రౌండర్ గుణతిలకకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. అనుచిత ప్రవర్తన, సమాచారం ఇవ్వకుండా ట్రెయినింగ్ సెషన్కు గైర్హాజరు కావడంతో 2017లో 6 వన్డేల సస్పెన్షన్ వేటు పడింది. 2018లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆరు నెలలు నిషేధం ఎదుర్కొన్నాడు. కరోనా నేపథ్యంలో.. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ నుంచి వచ్చి ఏడాది పాటు సస్పెండ్ అయ్యాడు. అయితే, తర్వాత నిషేధాన్ని ఆరు నెలలకు తగ్గించారు. చదవండి: ఆసీస్కు అవమానం! టాప్ రన్ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు! కోహ్లి తర్వాత సూర్య మాత్రం కాదు! T20 WC 2022: టీమిండియాదే వరల్డ్కప్.. రోహిత్ సాధ్యం చేస్తాడు.. అలా జరుగుతుందంతే..! -
T20 World Cup 2022: జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ పేసర్ ఎంట్రీ
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా గాయం కారణంగా ఆసియాకప్కు దూరమైన పేసర్లు దుష్మంత చమీరా, లహురు కుమార తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ తమ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే తుది జట్టులోకి చోటు దక్కే అవకాశం ఉంది. అదే విధంగా ఆసియాకప్లో అదరగొట్టిన పేసర్లు మధుశంక, ప్రమోద్ మధుషాన్ కూడా ఈ మెగా ఈవెంట్కు ఎంపికయ్యారు. ఇక ఆసియాకప్-2022లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా టైటిల్ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా షనక సారథ్యంలోని శ్రీలంక జట్టు టీ20 ప్రపంచకప్-2022లో తొలుత క్వాలిఫియింగ్ రౌండ్లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్కు శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర (ఫిట్నెస్కు లోబడి), లహిరు కుమార(ఫిట్నెస్కు లోబడి) దిల్షన్ మధుశంక, ప్రమోద్ మదుషన్ స్టాండ్బై ఆటగాళ్లు: అషెన్ బండార, ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమాల్, బినురా ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండో Here's your 🇱🇰 squad for the ICC Men's T20 World Cup! ⬇️#RoaringForGlory #T20WorldCup pic.twitter.com/GU7EIl6zOw — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 16, 2022 చదవండి: 'అతడిని టీ20 ప్రపంచకప్కు ఎంపికచేయాల్సింది.. బాబర్కు సపోర్ట్గా ఉండేవాడు' -
ఆసియా కప్ హీరోలకు ఘన స్వాగతం.. లంక వీధుల్లో విక్టరీ పెరేడ్
ఆసియా కప్-2022 విజేత శ్రీలంకకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఓ పక్క ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్నప్పటికీ ద్వీప దేశ ప్రజలు తమ హీరోలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తమను గర్వంగా తలెత్తుకనేలా చేసిన హీరోలకు బాధలన్నీ దిగమింగి సుస్వాగతం చెప్పారు. కొలొంబోలోని బండారు నాయకే ఎయిర్ పోర్టు నుంచి ఓ రేంజ్లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా.. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లంక ఆటగాళ్లు డబుల్ డెక్కర్ బస్సుల్లో విజయ దరహాసం చిందిస్తూ ప్రజలకు ఆభివాదం చేస్తున్న దృశ్యాలను లంక క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 📸 Snapshots from the #AsiaCup victory parade #RoaringForGlory pic.twitter.com/ZGIEov8OxL — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 13, 2022 కాగా, ఏమాత్రం అంచనాలు లేకుండా ఆసియా కప్ బరిలోకి దిగిన శ్రీలంక.. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడినప్పటికీ, ఆతర్వాత బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాకిస్తాన్లపై వరుస విజయాలు సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లింది. అనంతరం తుది పోరులో పాక్ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆరోసారి ఆసియా ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భానుక రాజపక్ష (71 నాటౌట్), హసరంగ (36) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఛేదనలో లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్, హసరంగ, కరుణరత్నే చెలరేగడంతో పాక్ 147 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని చవిచూసింది. -
లంకదే ఆసియాకప్.. ముందే నిర్ణయించారా!
15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. వరల్డ్ కప్ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్గా నిలిచే అవకాశం ఆసియా కప్ ద్వారా ఉపఖండంలో ఉన్న జట్లకు అవకాశం ఉంటుంది. అయితే ఎన్నో అంచనాల మధ్య ఫెవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్-4 దశలోనే వెనుదిరిగింది. ప్రభావం చూపిస్తుందనుకున్న బంగ్లాదేశ్.. పసికూన హాంకాంగ్ కంటే దారుణంగా ఆడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఇక ఫైనల్ పోరు సెప్టెంబర్ 11న(ఆదివారం) పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరగనుంది. ఇక ఆసియా కప్ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్స్ అందుకున్నాయి. మరి 15వ ఎడిషన్ ఆసియాకప్ను శ్రీలంక, పాకిస్తాన్లలో ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి ఆసియా కప్ను లంకకు అందివ్వాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ముందుగానే నిర్ణయం తీసుకుందా అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మొదట ఆసియా కప్ను నిర్వహించాల్సింది శ్రీలంకలోనే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ఆసియా కప్ను నిర్వహించలేమని చెప్పేసింది. దీంతో ఆఖరి నిమిషంలో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చారు. ఇక గత కొన్ని నెలలుగా శ్రీలంక ఎంతో ఆర్థిక సంక్షోభానికి గురయ్యింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స వ్యవహారంపై లంక ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు కొన్ని నెలలపాటు దర్నాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే లంక టూరిజం బాగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభ సమస్య మరింత ముదిరిపోయింది. ముదిరి పాకాన పడడంతో మరో దిక్కులేక దేశం విడిచి పారిపోయిన రాజపక్స తన రాజీనామాను సమర్పించారు. ఆ తర్వాత అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే లంక ఆర్థిక పరిస్థితి గాడినపడ్డట్లు కనిపిస్తోంది. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీసీ.. లంకను ఆసియాకప్ గెలిచేలా ప్రోత్సహించిందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి శ్రీలంక ఆసియాకప్ను కైవసం చేసుకుంటే లంక బోర్డుకు పెద్ద మొత్తంలో అందనున్నట్లు సమాచారం. కాగా లంక క్రికెట్ బోర్డు ఈ మొత్తాన్ని దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని భావిస్తునట్లు సమాచారం. కాగా ఆసియాకప్ను లంక గెలిచినా.. గెలవకపోయినా ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) లంక బోర్డుకు ప్రత్యేక నగదు బహుమతిని అందించాలని ముందే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆసియా కప్ను లంక గెలిచినా.. గెలవకపోయినా.. క్రికెట్ ఫ్యాన్స్ మనసులు మాత్రం గెలుచుకోవడం ఖాయం అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరొక విషయమేంటంటే.. ఎలాగు టీమిండియా సూపర్-4 దశలో వెనుదిరగడంతో.. భారత్ అభిమానుల మద్దతు కూడా శ్రీలంకకే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆట పరంగా ఆసియా కప్లో శ్రీలంక ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. లీగ్ దశలో అఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో దారుణ ఓటమి చవిచూసిన శ్రీలంక.. ఆ తర్వాత బంగ్లాదేశ్ను మట్టి కరిపించి సూపర్-4లో అడుగుపెట్టింది. ఇక సూపర్-4లో మొదట అఫ్గన్పై విజయంతో ప్రతీకారం తీర్చుకున్న లంక.. భారత్కు షాక్ ఇచ్చింది. ఇక చివరగా పాకిస్తాన్తో జరిగిన పోరులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి శ్రీలంక మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక తుదిపోరులోనూ పాకిస్తాన్ను మట్టి కరిపించి శ్రీలంక ఆరోసారి ఆసియాకప్ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా సూపర్-4 ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవడమే గాక మూడోసారి ఆసియాకప్ను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. చదవండి: Kane Williamson: గమ్మత్తుగా కేన్ మామ వ్యవహారం.. వీడియో వైరల్ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తిన చెన్నై సూపర్ కింగ్స్ -
హసరంగకు షాకిచ్చిన శ్రీలంక బోర్డు! ఆ లీగ్లో ఆడొద్దు! ఎందుకంటే..
The Hundred 2022: ది హండ్రెడ్ లీగ్ సీజన్-2022లో ఆడాలనుకున్న శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగకు చుక్కెదురైంది. ఈ లీగ్లో ఆడేందుకు.. శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) అతడికి అనుమతినివ్వలేదు. హసరంగకు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది. దీంతో ఈ బౌలింగ్ ఆల్రౌండర్ టోర్నీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా కప్-2022, టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్ సమీపిస్తున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శ్రీలంక బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆష్లే డి సిల్వ వెల్లడించాడు. కాగా ఐపీఎల్కు పోటీ అన్నట్లుగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. హండ్రెడ్ లీగ్(ఇన్నింగ్స్కు వంద బాల్స్) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లక్ష పౌండ్లు! మొత్తం 8 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో దేశీ, విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. ఇందులో భాగంగా వనిందు హసరంగను మాంచెస్టర్ ఒరిజినల్స్ ఫ్రాంచైజీ లక్ష పౌండ్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ సారథిగా వ్యవహరిస్తున్న మాంచెస్టర్ ఒరిజినల్స్ ఆగష్టు 5న నార్తర్న్ సూపర్చార్జర్స్తో మ్యాచ్తో తమ ప్రయాణం ఆరంభించనుంది. ఈ క్రమంలో హసరంగ వంటి కీలక ప్లేయర్ దూరం కావడం ఈ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ లాంటిదే. కాగా శ్రీలంక ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో హసరంగ జట్టుకు దూరమవుతాడని మాంచెస్టర్ ముందే ఫిక్సయిపోయినా.. ఆ టోర్నీ వాయిదా పడటంతో ఊపిరి పీల్చుకుంది. ఆడటానికి వీల్లేదు.. కారణమిదే! ఈ నేపథ్యంలో హండ్రెడ్ లీగ్లో ఆడాలని వనిందు హసరంగ భావించగా.. శ్రీలంక బోర్డు అడ్డుచెప్పింది. ఈ విషయం గురించి ఎస్ఎల్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆష్లే డి సిల్వ ఈఎస్పీన్క్రిక్ఇన్పోతో మాట్లాడుతూ.. ఇందుకు గల కారణాన్ని వెల్లడించాడు. వరుసగా మెగా ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో హసరంగకు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదని తెలిపాడు. కాగా ఆగష్టు 27 నుంచి ఆసియా కప్, అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీలు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. ది హండ్రెడ్ లీగ్ తాజా సీజన్ ఆగష్టు 3న ఆరంభమైంది. సెప్టెంబరు 3న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే... హసరంగ స్థానాన్ని మాంచెస్టర్ దక్షిణాఫ్రికా యువ సంచలనం ట్రిస్టన్ స్టబ్స్తో భర్తీ చేసుకుంది. ఇక స్పిన్ మాస్ట్రో హసరంగ ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: WC 2022: వరల్డ్ నెం.1 బౌలర్గా ఎదుగుతాడు! ప్లీజ్ చేతన్ అతడిని సెలక్ట్ చేయవా! -
'క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రేమను పంచారు.. థాంక్యూ'
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. లంక అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స దిగిపోవాలంటూ ఆ దేశ ప్రజలు ప్రెసిడెన్షియల్ భవనాన్ని ముట్టడించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన రాజపక్స అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా రెండు రోజులపాటు లంకలోనే ఉన్న రాజపక్స దుబాయ్కు పారిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఇక జూలై 13న(బుధవారం) రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ లంకతో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్ విజయవంతంగా సిరీస్ను ముగించుకుంది. తమ దేశంలో పర్యటించినందుకు లంక అభిమానులు సైతం మ్యాచ్ వేదికగా లవ్ యూ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేయడం హైలైట్గా నిలిచింది. ఈ సందర్భంగా ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తమ దేశానికి బయలుదేరేముందు ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. ‘ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మాకు ఆతిథ్యమిచ్చినందుకు థాంక్యూ శ్రీలంక. ఈ పర్యటనకు వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞులం. ఇక్కడున్నన్ని రోజులు మాపై మీరు చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. మాకు ఎల్లవేళలా మద్దతునిచ్చారు. ఈ పర్యటనను మేము ఎప్పటికీ మరిచిపోలేం. మీ దేశంలో నాకు బాగా నచ్చిన విషయమేమిటంటే.. దేశంలో ఎంతటి దుర్భర పరిస్థితులు తలెత్తినా మీ ముఖం నుంచి చిరునవ్వు చెదరలేదు. మేం ఎక్కడికి వెళ్లినా మాకు ఘన స్వాగతం పలికారు. థాంక్యూ. నేను నా కుటుంబంతో కలిసి ఇక్కడకు హాలీడేకు రావడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని రాసుకొచ్చాడు. కాగా వార్నర్ లంక జాతీయ జెండాను షేర్ చేయడం ఆసక్తి కలిగించింది. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు నేరుగా లంక పర్యటనకు వెళ్లారు. లంకలో జూన్ 7 న మొదలైన ఆసీస్ పర్యటన సోమవారం గాలేలో ముగిసిన రెండో టెస్టుతో పూర్తైంది. ఈ టూర్ లో ఆసీస్.. టీ20 సిరీస్ ను గెలుచుకుని వన్డే సిరీస్ను కోల్పోయింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్ను మాత్రం ఆస్ట్రేలియా సమం చేసుకుంది. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) చదవండి: ఆసీస్ అగ్రపీఠాన్ని కదిలించి మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక -
'ఆసియా కప్ నిర్వహించలేం.. వేదికను మార్చండి'
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాల ధరలు మండిపోతుండగా.. పెట్రోల్ ధర ఆకాశాన్ని అంటింది. తీవ్ర సంక్షోభంతో అక్కడి జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో లంక క్రికెట్ బోర్డు ఆసియా కప్ నిర్వహించలేమంటూ చేతులెత్తేసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృశ్యా ఆసియా కప్ను నిర్వహించలేమని.. వేదికను మార్చాలంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏసీసీ అధ్యక్షుడు జై షాకు లంక క్రికెట్ బోర్డు వినతిపత్రం సమర్పించింది. కాగా జై షా సహా బీసీసీఐ అధికారులతో పాటు లంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా ప్రస్తుతం అహ్మదాబాద్లో ఉన్నారు. ఇవాళ(మే 29) ఐపీఎల్ ఫైనల్ జరగనుండడంతో మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్లో జై షా నేతృత్వంలో ఆసియా కప్ నిర్వహణకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేశారు. లంకలో ఆసియా కప్ నిర్వహణ కష్టమని ఆ దేశ బోర్డు వివరించగా.. అందుకు మెజారిటీ ఏసీసీ సభ్యులు పాజిటివ్గా స్పందించారు. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాతే ఆసియా కప్ ఎక్కడ నిర్వహించాలనే దానిపై స్పష్టత రానుంది. ముందుగా అనుకున్న ప్రకారం శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహణ కష్టమైతే యూఏఈకి తరలించడమో లేక బంగ్లాదేశ్ వేదికగా టోర్నీని నిర్వహించాలని ఏసీసీ భావించింది. ఇదే నిజమైతే ఆసియా కప్ యూఏఈ లేదా బంగ్లాదేశ్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, యూఏఈలు తలపడనున్నాయి. టి20 ఫార్మాట్లో టోర్నీని నిర్వహించనున్నారు. ఆసియా కప్ చివరిసారి 2018లో యూఏఈలో జరగ్గా.. ఫైనల్లో బంగ్లాదేశ్ను మట్టికరిపించిన టీమిండియా ఏడోసారి కప్ను కైవసం చేసుకుంది. చదవండి: కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్ -
IND VS SL: అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన లంకేయులు
అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. భారత పర్యటన కోసం ఎంపిక చేసిన లంక జట్టులో తమ ఫేవరెట్ క్రికెటర్ భానుక రాజపక్సకు చోటు కల్పించకపోవడంపై అతని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకొని రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. శ్రీలంక క్రికెట్ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం లంక క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తూ, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభంకానున్న భారత పర్యటనలో లంక జట్టు మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఇందు కోసం లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) 19 మంది సభ్యుల జట్టును కొద్ది రోజుల కిందట ప్రకటించింది. ఫిట్నెస్ కారణాలను సాకుగా చూపి భానుక రాజపక్సేకు జట్టులో చోటు కల్పించకపోవడం అతని అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కాగా, గతేడాది టీ20 ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన తర్వాత భానుక రాజపక్సే వెలుగులోకి వచ్చాడు. ఆ మెగా టోర్నీలో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అతను.. రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. భానుక శ్రీలంక తరఫున 5 వన్డేలు, 18 టీ20లు మాత్రమే ఆడినప్పటికీ లంకేయుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే, అనూహ్యంగా ఈ ఏడాది జనవరిలో రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. తిరిగి కొన్ని రోజుల్లోనే వెనక్కు తగ్గి మరోసారి వార్తల్లో నిలిచాడు. చదవండి: Sachin Tendulkar: కోహ్లి నా సాయం కోరాడు.. సమయం వెచ్చించమని రిక్వెస్ట్ చేశాడు -
భారత్తో టి20 సిరీస్కు లంక జట్టు ఇదే..
కొలంబో: భారత్లో పర్యటించేందుకు వస్తున్న శ్రీలంక టి20 జట్టును సోమవారం ప్రకటించారు. 18 మంది సభ్యుల జట్టులో ఆఫ్స్పిన్నర్ అషియాన్ డానియెల్ కొత్తగా ఎంపికవగా... మిగతావారంతా ఆస్ట్రేలియాతో తాజా సిరీస్ ఆడినవారే. డానియెల్ లిస్ట్ ‘ఎ’ మ్యాచ్ల్లో ప్రతిభ కనబర్చడం ద్వారా భారత సిరీస్కు ఎంపిక చేశారు. కెప్టెన్గా ఆల్రౌండర్ దసున్ షనకనే కొనసాగిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తెలిపింది. ఫిట్నెస్ సమస్యలెదుర్కొంటున్న మిడిలార్డర్ బ్యాటర్ భానుక రాజపక్స ఈ సిరీస్కూ దూరమయ్యాడు. లంక ఆటగాళ్లు ఆస్ట్రేలియా నుంచి నేరుగా భారత పర్యటనకు వస్తున్నారు. అలా బబుల్ నుంచి బబుల్కు మారనుండటంతో క్వారంటైన్ ఇబ్బందుల్లేవు. మూడు పొట్టి మ్యాచ్ల సిరీస్లో మొదటి టి20 ఈ నెల 24న లక్నోలో జరుగుతుంది. మిగతా రెండు మ్యాచ్లు 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరుగనున్నాయి. శ్రీలంక టి20 జట్టు: దసున్ షనక (కెప్టెన్), నిసాంక, కుశాల్ మెండిస్, అసలంక, చండిమాల్, దనుష్క గుణతిలక, కమిల్ మిశార, జనిత్ లియనగె, హసరంగ, చమిక కరుణరత్నే, చమీరా, లాహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరన్ ఫెర్నాండో, మహీశ్ తీక్షణ, జెఫ్రె వండెర్సే, ప్రవీణ్ జయవిక్రమ, అషియాన్ డానియెల్. -
షెడ్యూల్ మార్చండి.. ముందుగా టీ20లు నిర్వహించండి..!
కొలొంబో: వచ్చే నెలలో టీమిండియాతో జరగబోయే సిరీస్ విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డు బీసీసీఐకి లేఖ రాసింది. రెండు టెస్ట్లు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు లంక జట్టు ఫిబ్రవరి 25న భారత్కు రావాల్సి ఉండగా.. ఈ సిరీస్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేయాలని ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐని అభ్యర్ధించింది. షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్లో తొలుత టెస్ట్లు, ఆతర్వాత టీ20లు జరగాల్సి ఉంది. అయితే, ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం లంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ పర్యటనకు కంటిన్యూయేషన్గా భారత్తో తొలుత టీ20లు, ఆ తర్వాత టెస్ట్ సిరీస్ నిర్వహిస్తే తమకు సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్ఎల్సీ పేర్కొంది. దీని వల్ల ఆటగాళ్లను వెనక్కి పిలిపించే సమస్య ఉండదని విన్నవించుకుంది. ఆస్ట్రేలియాలో పర్యటించే జట్టునే భారత్కు పంపించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. దీని వల్ల ప్రయాణ భారంతో పాటు బయో బబుల్ సమస్య కూడా తలెత్తదని వివరించింది. కాగా, ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం భారత్-శ్రీలంక జట్ల మధ్య ఫిబ్రవరి 25న తొలి టెస్ట్, మార్చి 5న రెండో టెస్ట్, అనంతరం మార్చి 13,15,18 తేదీల్లో మూడు టీ20లు జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే, దేశంలో కరోనా స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో లంకతో సిరీస్ను ముందుగా ప్రకటించిన విధంగా నాలుగు వేదికల్లో(బెంగళూరు, మొహాలి, ధర్మశాల, లక్నో) కాకుండా రెండు వేదికల్లోనే కుదించేందుకు బీసీసీఐ యోచిస్తోంది. బెంగళూరు, లక్నో నగరాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో మొహాలి, ధర్మశాలల్లో మ్యాచ్లను నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తుంది. చదవండి: వికెట్ పడగొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు -
పది రోజుల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు.. ఇంతలోనే..!
కొలొంబో: 30 ఏళ్ల వయసులోనే క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలకు కారణమైన భానుక రాజపక్స మాట మార్చాడు. పది రోజుల క్రితం చేసిన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కు తీసుకున్నాడు. మున్ముందు జట్టుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు ట్విటర్ ద్వారా వెల్లడించింది. శ్రీలంక యువజన క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స జోక్యంతో భానుక.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, లంక క్రికెట్ బోర్డు ప్రవేశపెట్టిన కొత్త ఫిట్నెస్ రూల్స్ను నిరసిస్తూ భానుక రాజపక్సతో పాటు మరో క్రికెటర్(దనుష్క రాజపక్స) కూడా ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం లంక క్రికెట్లో పెద్ద దుమారం రేపింది. ఈ ఇద్దరి నిర్ణయం పట్ల రాజకీయ నాయకులు, మాజీ ఆటగాళ్లు, సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించాలని మాజీ పేసర్ లసిత్ మలింగ ట్విట్టర్ వేదికగా ఈ ఇద్దరిని అభ్యర్ధించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంక నూతన ఫిట్నెస్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వారి వేతనాల్లో కోత విధించబడుతుంది. చదవండి: ఇకపై ప్రతి ఏడాది భారత్, పాక్ క్రికెట్ సిరీస్లు..! -
శ్రీలంక జట్టుకు మరో షాక్.. గుడ్ బై చెప్పిన క్రికెటర్
శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఆటగాడు ధనుష్క గుణతిలక టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. సంప్రదాయ ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ లేఖను శ్రీలంక క్రికెట్ బోర్డుకు సమర్పించినట్లు న్యూస్వైర్ వెల్లడించింది. పరిమిత ఓవర్ల క్రికెట్పై ఎక్కువగా దృష్టి సారించేందుకే తాను నిర్ణయం తీసుకున్నట్లు 30 ఏళ్ల ధనుష్క తన లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. కాగా గుణతిలక రెండేళ్ల క్రితం శ్రీలంక తరఫున చివరిసారిగా టెస్టు క్రికెట్ ఆడాడు. మొత్తంగా 8 టెస్టుల్లో భాగమయ్యాడు. ఇక గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా బయో బబుల్(కోవిడ్) నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ.. గుణతిలక నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉండగా శ్రీలంక బోర్డు ఇటీవల ఫిట్నెస్కు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం.. ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వేతనాల్లో కోత పెట్టేందుకు నిర్ణయించారు. ఈ నిబంధనల నేపథ్యంలో స్టార్ ప్లేయర్ భనుక రాజపక్స అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు గుణతిలక సైతం టెస్టులకు మాత్రమే గుడ్ బై చెప్పినప్పటికీ.. నిషేధం తొలగిన తర్వాత ఫిట్నెస్ పరీక్షలో నెగ్గితేనే జట్టులో చోటు దక్కించుకోగలడు. ఏదేమైనా వారాల వ్యవధిలో లంక క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. చదవండి: Ind Vs Sa 2nd Test: నువ్వు తోపు అనుకోకు.. అలా చేశావో నిన్ను మించినోడు లేడని చెప్పాను.. అంతే.. ఇక ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే! This never ends! No matter what. ❤️🏏 pic.twitter.com/hsHZ3btLCN — Danushka Gunathilaka (@danushka_70) September 28, 2021 -
లంక జట్టుకు ఊహించని షాక్.. యువ క్రికెటర్ సంచలన నిర్ణయం
Bhanuka Rajapaksa Retirement: శ్రీలంక క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ యువ ఆటగాడు, స్టార్ క్రికెటర్ భానుక రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు లంక క్రికెట్ బోర్డుకు లేఖ పంపాడు. లంక బోర్డు ప్రవేశపెట్టిన నూతన ఫిట్నెస్ మార్గదర్శకాల (ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వేతనాల్లో కోత పెట్టనున్నారు) కారణంగానే అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది(2021) జరిగిన టీ20 ప్రపంచకప్లో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3లో ఉన్న రాజపక్స.. అనూహ్య నిర్ణయం తీసుకోవడం శ్రీలంక క్రికెట్లో సంచలనంగా మారింది. కేవలం 5 వన్డేలు, 18 టీ20లు మాత్రమే ఆడిన రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంపై ఆ దేశ మాజీలు స్పందించారు. రాజపక్స.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, 30 ఏళ్ల రాజపక్స.. శ్రీలంక అండర్-19 జట్టులో అద్భుతాలు సృష్టించి, సీనియర్ జట్టులోకి వచ్చాడు. గతేడాది స్వదేశంలో ధవన్ సేనతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా వన్డే అరంగ్రేటం చేసిన అతను.. వన్డేల్లో ఒకటి, టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. చదవండి: ఎగబాకిన రాహుల్.. దిగజారిన కోహ్లి..! -
IND Vs SL: సవరించిన షెడ్యూల్ను ప్రకటించిన లంక బోర్డు
కొలొంబో: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్కు సంబంధించి సవరించిన షెడ్యూల్ను శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ నెల 18 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుందని, అయితే స్వల్ప సమయ మార్పులు జరిగాయని వెల్లడించింది. జులై 18, 20, 23న జరిగే వన్డే మ్యాచ్లు అరగంట ఆలస్యంగా(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు), 25, 27, 29న జరిగే టీ20లు గంట ఆలస్యంగా(భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. #SLvIND pic.twitter.com/LQSJT5tDmM — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 12, 2021 ఇదిలా ఉంటే, ఇటీవల ఇంగ్లండ్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న లంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన మ్యాచ్లు జులై 18కి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే లంక బోర్డు ఆయా మ్యాచ్ల ప్రారంభ సమయాల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం 2:30 గంటలకు.. టీ20లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండింది. -
అది టీమిండియా- బీ జట్టు కాదు.. మాజీ కెప్టెన్కు బోర్డు కౌంటర్!
కొలంబో: మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వ్యాఖ్యలపై శ్రీలంక క్రికెట్ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న భారత జట్టు సెకండ్ టీం కాదని, అన్ని విభాగాల్లో ఎంతో పటిష్టంగా ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కొంతమంది మీడియాలో తమ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. వారందరికీ ఇదే సమాధానం. శ్రీలంక టూర్కు వచ్చిన టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు ఎంతో పటిష్టమైనది. భారత బృందంలోని ప్రస్తుత 20 మందిలో 14 మంది సభ్యులు ఇప్పటికే టీమిండియా తరఫున ఏదో ఒక ఫార్మాట్లో, మరికొందరు అన్ని ఫార్మాట్ల(టెస్టు, వన్డే, టీ20)లోనూ ప్రాతినిథ్యం వహించి ఉన్నారు. ఇది ద్వితీయ శ్రేణి జట్టుకాదు’’ అని పరోక్షంగా అర్జున రణతుంగకు కౌంటర్ ఇచ్చింది. అదే విధంగా... ఒకేసారి కోహ్లి, ధావన్ సారథ్యంలోని భారత జట్టు రెండు వేర్వేరు దేశాల్లో పర్యటించడంపై స్పందిస్తూ... ‘‘క్రికెట్ ప్రపంచంలో ఇదొక సరికొత్త విధానం. ముఖ్యంగా ఐసీసీ సభ్య దేశాలు... తమ అవసరాలకు అనుగుణంగా ఒక్కో ఫార్మాట్కు ప్రత్యేక స్వ్యాడ్తో ఆడించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల పోటీతత్వం పెరగడంతో పాటుగా, ఐసీసీకి ఇచ్చిన కమిట్మెంట్ల ప్రకారం... వివిధ బోర్డులు తమ మాటను నెరవేర్చుకునే వీలు కలుగుతుంది’’ అని శ్రీలంక క్రికెట్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా శ్రీలంక పర్యటనకు టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టును పంపించడం తమ దేశ క్రికెట్కు ఘోర అవమానమని అర్జున రణతుంగ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రతిపాదనకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు మతి లేదని విరుచుకుపడ్డారు. ఇక విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ టూర్కు వెళ్లగా.. శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న యువఆటగాళ్లతో కూడిన జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. జూలై 13 నుంచి భారత్- శ్రీలంక మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లు జరగనున్నాయి. -
లంక క్రికెట్లో కుదుపు.. కాంట్రాక్ట్కు నో చెప్పిన ఐదుగురు క్రికెటర్లు
కొలొంబో: భారత్తో కీలకమైన వన్డే, టీ20 సిరీస్ ముంగిట శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఆ జట్టు ఆటగాళ్లు ఊహించని షాకిచ్చారు. షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ధవన్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్ను కూడా కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకి చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్తో సిరీస్కి సంబంధించిన కాంట్రాక్ట్పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ ఆటగాళ్ల మధ్య కాంట్రాక్ట్కి సంబంధించి గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. కాంట్రాక్ట్పై సంతకం చేసేందుకు శ్రీలంక క్రికెటర్లు విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషేన్ బండార, కసున్ రజిత, లసిత్ ఎంబుల్దెనియా నిరాకరించారు. లంక బోర్డు నేషనల్ కాంట్రాక్ట్ నిమిత్తం మొత్తం 24 మంది క్రికెటర్లకి ఆఫర్ చేయగా.. ఈ ఐదుగురు మాత్రం తాము సంతకం చేసేది లేదని బోర్డుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్లో బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించిన కుశాల్ మెండిస్, గుణతిలక, డిక్లెల్వా సస్పెండ్ అయిన నేపథ్యంలో భారత్తో సిరీస్పై అనుమానాలు నెలకొన్నాయి. -
ఇండియా బి టీమ్ రావడం శ్రీలంక క్రికెట్కు ఘోర అవమానం..
కొలంబో: శ్రీలంక పర్యటనకు భారత్.. బి జట్టును పంపిచడం తమ దేశ క్రికెట్కు ఘోర అవమానమని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రతిపాదనకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు అస్సలు బుద్ది లేదని ఆయన మండిపడ్డాడు. టెలివిజన్ మార్కెటింగ్లో భాగంగానే ఈ సిరీస్కు లంక క్రికెట్ బోర్డు ఒప్పుకుందని ఆరోపించాడు. తాజాగా పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. లంక బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్.. తమ బలమైన జట్టును ఇంగ్లండ్కు పంపించి బలహీనమైన రెండో జట్టును శ్రీలంకకు పంపించిందని విమర్శించాడు. బీసీసీఐ ఇలా వ్యవహరించడానకి తమ దేశ క్రికెట్ బోర్డు అసమర్థతతనే కారణమని ధ్వజమెత్తాడు. లంక క్రికెట్ బోర్డు అడ్మినిస్ట్రేషన్లో లోపాల కారణంగా తమ దేశ ఆటగాళ్లకు క్రమశిక్షణ లేకుండా పోయిందని, ఆటతీరు కూడా దారుణంగా ఉందని ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న లంక జట్టును ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, అర్జున రణతుంగ సారథ్యంలో శ్రీలంక జట్టు 1996 వన్డే ప్రపంచ కప్ సాధించింది. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధవన్ సారథ్యంలో యువ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం లంక పర్యటనకు వెళ్లింది. జూలై 13 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లు జరగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్(కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుత్రాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతం, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా -
శ్రీలంకలో టీ20 ప్రపంచకప్..?
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ.. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్తో మంతనాలు జరుపుతున్న నేపథ్యంలో తాజాగా మరో దేశం పేరు తెరపైకి వచ్చింది. టోర్నీ నిర్వహించేందుకు తాము కూడా రేసులో ఉన్నామని శ్రీలంక క్రికెట్ బోర్డ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ మీడియా సంస్థ ద్వారా వెల్లడైంది. కాగా, ఇప్పటికే యూఏఈలో ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో అదే వేదికపై వెంటనే ప్రపంచ కప్ నిర్వహించడం సాధ్యమా అన్న కోణంలో బీసీసీఐ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. యూఏఈలో షార్జా, దుబాయ్, అబుదాబి నగరాల్లో మాత్రమే స్టేడియాలు ఉన్నాయని, కానీ శ్రీలంకలో తక్కువ పరిధిలో చాలా అంతర్జాతీయ స్థాయి వేదికలున్నాయని లంక క్రికెట్ బోర్డ్ బీసీసీఐకి నివేదించినట్లు సమాచారం. అలాగే సెప్టెంబర్ నెలలో మెగా టోర్నీ నిర్వహించేందుకు శ్రీలంకలో అనువైన వాతావరణం ఉంటుందని ఆ దేశ క్రికెట్ బోర్డ్ వివరించింది. కాగా, ఐపీఎల్ నిర్వహణకు కూడా తాము సిద్ధమేనంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు ఇటీవల ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ను భారత్లో కాకుండా బయట నిర్వహించాల్సివస్తే, పన్ను మినహాయింపు కోసం ఆయా దేశాలు ఐసీసీని సంప్రదించాల్సి ఉంటుందని, ఇందుకోసం జూన్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, అలాగే టోర్నీ నిర్వహణపై తుది నివేదికను జూన్ 28వ తేదీలోగా చెప్పాల్సి ఉంటుందని ఐసీసీ ప్రతినిధి తెలిపారు. మరోవైపు ప్రపంచకప్ ఎక్కడ జరిగినా, హోస్టింగ్ రైట్స్ మాత్రం బీసీసీఐ వద్దే ఉంటాయని ఐసీసీ మరోసారి స్పష్టం చేసింది. చదవండి: సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం -
రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్
కొలంబో : శ్రీలంక క్రికెటర్ తరంగ పరణవితన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ శుక్రవారం తెలిపింది. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు బోర్డుకు పరణవితన స్వయంగా వెల్లడించాడు.38 ఏండ్ల పరణవితన జాతీయ జట్టు తరపుణ 32 టెస్టు మ్యాచ్లు ఆడాడు. రెండు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలతో మొత్తం 1792 పరుగులు చేశాడు. 2009లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన తరంగ తన రెండు సెంచరీలను 2010లో భారత్పైనే నమోదు చేశాడు. 2012లో తన చివరి మ్యాచ్ను ఆడాడు. చదవండి : (ఊహించని ట్విస్ట్.. పాపం కెవిన్ ఒబ్రెయిన్) -
లంక ప్రీమియర్ లీగ్ నవంబర్లో...
కొలంబో : శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) టి20 టోర్నీ నవంబర్ నెలకు వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 20 వరకు లంక ప్రీమియర్ లీగ్ జరగాల్సింది. కొలంబో, క్యాండీ, గాలె, దంబుల్లా, జాఫ్నా నగరాల్లో మొత్తం 23 మ్యాచ్లు నిర్వహించాలనుకున్నారు. అయితే ఈ టోర్నీలో ఆడేందుకు శ్రీలంకలో అడుగుపెట్టే ఆటగాళ్లందరూ... కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలి. దాంతో ఈ నెలలో ఇలా జరగడం కష్టసాధ్యమేనని భావించి నవంబర్ నెలకు లంక ప్రీమియర్ లీగ్ను వాయిదా వేశామని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా తెలిపారు. ఐపీఎల్ ముగిశాక నవంబర్ రెండో వారంలో లంక ప్రీమియర్ లీగ్ను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
లంకలో పర్యటించండి
కొలంబో: షెడ్యూల్ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్ కోసం తమ దేశంలో పర్యటించాల్సిందిగా బీసీసీఐని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) కోరింది. కరోనా నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన క్రికెట్ సిరీస్లు, టోర్నీల నిర్వహణపై అనిశ్చితి నెలకొనడంతో లంకకు వచ్చే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐకి ఈ–మెయిల్ ద్వారా తెలిపింది. జూన్–జూలై మధ్య శ్రీలంక పర్యటనలో భారత్ 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్ల సిరీస్ ఆడాల్సి ఉంది. కఠిన క్వారంటైన్ నిబంధనలు పాటించడంతో పాటు ప్రేక్షకులు లేకుండానే టోర్నీని నిర్వహిస్తామని లంక అధికారులు పేర్కొనట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ పరిస్థితుల్లో దీనిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ పేర్కొంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే, ప్రయాణ ఆంక్షలు సడలించాకే టోర్నీల గురించి ఆలోచిస్తామని తెలిపింది. -
ఇప్పుడే ఏమీ చెప్పలేం
న్యూఢిల్లీ: భారత్లో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా వేయడంతో లీగ్కు ఆతిథ్యమిచ్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది. అయితే తాజా పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ వర్గాలు అనుకుంటున్నట్లు సమాచారం. ప్రపంచమంతా లాక్డౌన్ అయిన ఈ తరుణంలో శ్రీలంక ప్రతిపాదన గురించి ఆలోచించలేమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఐపీఎల్కు ఆతిథ్యమివ్వాలనే తమ ఆకాంక్షను గురువారం బయటపెట్టాడు. కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న తమ దేశంలో లీగ్ నిర్వహిస్తే లంక బోర్డుకు ఆర్థికంగా దన్నుగా ఉంటుందన్నారు. అయితే శ్రీలంక బోర్డు నుంచి తమకు అధికారికంగా ఎలాంటి ప్రతిపాదన రాలేదని దీనిపై ఇప్పుడు చర్చ అనవసరమని బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించారు. దీనిపై మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ ‘భారత్కు శ్రీలంక మిత్ర దేశం. వారి ప్రతిపాదనలో అర్థముంది. కానీ మే నెలలో ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ విరమణ చేస్తే ఇప్పుడున్న పరిస్థితులన్నీ తారుమారవుతాయి. భారత్ అధికారికంగా లీగ్ నిర్వహించలేమని పేర్కొంటే మరిన్ని విదేశీ బోర్డులు ఆతిథ్యం కోసం ముందుకొస్తాయి’ అని పేర్కొన్నారు. -
50 లక్షల డాలర్లు చెల్లించండి: కోచ్ లేఖ
కొలంబో: తనను అర్ధాంతరంగా శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా 50 లక్షల డాలర్లు (రూ. 35 కోట్ల 89 లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ జట్టు మాజీ కోచ్ చండిక హతురసింఘ శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం తాను మరో 18 నెలలు కోచ్ పదవిలో కొనసాగాల్సి ఉన్నా... శ్రీలంక క్రికెట్ బోర్డు తనను ముందుగానే తొలగించిందని... వారి చర్య తన కోచింగ్ కెరీర్పై ప్రభావం చూపుతుందని గతంలో శ్రీలంక తరఫున 26 టెస్టుల్లో, 35 వన్డేల్లో ఆడిన 51 ఏళ్ల హతురసింఘ తన లేఖలో పేర్కొన్నారు. అయితే శ్రీలంక క్రికెట్ మాత్రం ఆరు నెలల వేతనాన్ని పరిహారం రూపంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒకానొక సందర్భంలో హతురసింఘకు చెల్లిస్తున్న జీతంపై ఆ దేశ క్రీడా శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో విస్మయం వ్యక్తం చేశారు. ‘నెలకు 60 వేల డాలర్లు జీతంగా తీసుకుంటున్న హతురసింఘ... జట్టును విజయపథంలో మాత్రం నడిపించలేకపోతున్నారు’ అంటూ చండికను ఫెర్నాండో విమర్శించాడు. 2019 ప్రపంచ కప్లో శ్రీలంక క్రికెట్ జట్టు దారుణ వైఫల్యం అనంతరం ఆ దేశ క్రికెట్ బోర్డు కోచ్ హతురసింఘను, ఆయన శిక్షణ సహాయక సిబ్బందిని తొలగించింది. -
దేశం కోసం మలింగ ఆడాలి
కొలొంబో: ప్రపంచకప్నకు ముందు వన్డే జట్టు సారథ్యాన్ని దిముత్ కరుణరత్నెకు కోల్పోయిన పేసర్ లసిత్ మలింగ... నిరాశను పక్కనపెట్టి దేశం కోసం ఆడాలని శ్రీలంక క్రికెట్ చీఫ్ షమ్మీ సిల్వా కోరారు. గురువారం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులోకి మలింగను పేసర్గా ఎంపిక చేసిన సెలెక్టర్లు వ్యక్తిగతంగా రాణిస్తున్న మలింగ... కెప్టెన్సీలో అంచనాలను అందుకోలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా లంక సెలక్షన్ కమిటీ చైర్మన్ అషంత డి మెల్ మాట్లాడుతూ అసలే అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న లంక క్రికెట్ను రక్షించుకోవాలంటే ఆటగాళ్లంతా ఏకమై దేశం కోసం ఆడాలని ఆకాంక్షించారు. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్లో చివరిసారిగా వన్డే ఆడిన జీవన్ మెండిస్తో పాటు గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న మిలింద సిరివర్దెన, జెఫ్రీ వండెర్సీ ప్రపంచకప్తో పునరాగమనం చేయనున్నారు. శ్రీలంక ప్రపంచ కప్ జట్టు: దిముత్ కరుణరత్నె (కెప్టెన్), లసిత్ మలింగ, ఏంజెలో మాథ్యూస్, తిసారా పెరీరా, కుషాల్ జనిత్ పెరీరా, ధనంజయ డి సిల్వా, కుషాల్ మెండిస్, ఇసురు ఉదాన, మిలింద సిరివర్దెన, అవిష్క ఫెర్నాండో, జీవన్ మెండిస్, లహిరు తిరిమన్నె, జెఫ్రీ వండెర్సీ, నువాన్ ప్రదీప్, సురంగ లక్మల్. -
బంగ్లా ఆటగాళ్లపై లంక క్రికెట్ బాస్ ఫైర్
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం జరిగిన ఉత్కంఠకర మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల తీరుపై శ్రీలంక క్రికెట్ ఛీఫ్ తిలింగా సుమతిపాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతుండగా అంపైర్ల నిర్ణయం పట్ల బంగ్లా ఆటగాళ్లు వ్యవహరించిన తీరు ఆహ్వానించదగినది కాదని, విచారకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఇక ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చివరి ఓవర్లో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. అంపైర్లు నోబాల్ ఇవ్వడం లేదని బంగ్లా ఆటగాళ్లు అసహనానికి లోనయ్యారు. అంతేగాకుండా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాట్స్మన్ను మైదానం వీడమని సూచించడం మైదానంలో ఉత్కంఠకు తెరలేపింది. ఇక రిజర్వ్ ఆటగాడు నురుల్ లంక కెప్టెన్ పెరీరాతో వాగ్వాదానికి దిగడం గొడవకు మరింత ఆజ్యం పోసినట్లైంది. దీంతో మైదానంలో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. చివరికి బంగ్లా ఓ బంతి మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది. అనంతరం బంగ్లా ఆటగాళ్లు నాగినీ డ్యాన్స్లతో చిందేశారు. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లతో మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక మ్యాచ్ ప్రజెంటేషన్ అనంతరం బంగ్లా డ్రెస్సింగ్ అద్దాలు ధ్వంసమవ్వడంతో దుమారం రేగింది. అయితే ఈ అద్దాలు బంగ్లా ఆటగాళ్లు విజయ సంబరాలు జరుపుకుంటుండగా ధ్వంసమైనట్లు తెలిసింది. ఈ ఘటనపై స్పందించిన ఐసీసీ బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హాసన్, రిజర్వు ఆటగాడు నురుల్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించారు. -
శ్రీలంక క్రికెట్ బోర్డుపై రణతుంగ ఫైర్
కొలంబో : శ్రీలంక క్రికెట్ బోర్డుపై మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీసీఐని మెప్పించడం కోసం శ్రీలంక క్రికెట్ జట్టును నిరాశ నిస్పృహల్లో మునిగేలా చేశారని వ్యాఖ్యానించారు. భారత్లో 4వ వన్డేలో శ్రీలంక పరాజంయ అనంతరం రణతుంగ నిప్పులు చెరిగాడు. సెలక్షన్ ఛైర్మన్ జయసూర్య, జాతీయ కోచ్ ఆటపట్టు, కెప్టెన్ ఏంజిలో మ్యాథ్యూస్లు ఓటమికి బాధ్యత వహించాలని అతడు డిమాండ్ చేశాడు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంక జట్టు ఒక్క మ్యాచ్లోనూ గెలుపొందలేదు. దాంతో భారత్ కు 4-0 ఆధిక్యం దక్కింది. కాగా వెస్టిండీస్ బోర్డుకు, క్రికెటర్లకు మధ్య జీత భత్యాల చెల్లింపుపై విభేదాలు నెలకొనడంతో భారత పర్యటన నుంచి వెస్టిండీస్ జట్టు వైదొలగిన విషయం తెలిసిందే. దాంతో వెస్టిండీస్ పర్యటనకు ప్రత్యామ్నాయంగా శ్రీలంక జట్టు పర్యటనను బీసీసీఐ ఖరారు చేసింది.