Tata Consultancy Services
-
మార్కెట్ ‘కింగ్’ రిలయన్స్
ముంబై: దేశీయంగా అత్యధిక మార్కెట్ వేల్యుయేషన్తో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానంలో కొనసాగింది. రూ. 17.5 లక్షల కోట్ల విలువతో బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 500 కంపెనీల లిస్టులో నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. అటు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్) రూ. 16.1 లక్షల కోట్ల మార్కెట్ వేల్యుయేషన్తో రెండో స్థానంలో, రూ. 14.22 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో నిల్చాయి.మరోవైపు, ఐపీవోకి సన్నాహాలు చేసుకుంటున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్ఎస్ఈ సంస్థ రూ. 4.7 లక్షల కోట్ల వేల్యుయేషన్తో.. అన్లిస్టెడ్ కంపెనీల విభాగంలో అగ్రస్థానంలో ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయాలు 28 శాతం పెరిగి రూ. 16,352 కోట్లకు, లాభాలు 51 శాతం ఎగిసి రూ. 8,306 కోట్లకు చేరాయి. ఈ విభాగంలో రూ. 77,860 కోట్ల వేల్యుయేషన్తో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా అయిదో స్థానంలో ఉంది. బైటి నుంచి నిధులు సమీకరించకుండా సొంతంగా ఎదిగిన బూట్స్ట్రాప్డ్ సంస్థల లిస్టులో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. గ్రూప్లవారీగా చూస్తే టాటా సన్స్ వేల్యుయేషన్ 2024లో 37 శాతం ఎగిసి రూ. 32.27 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో రిలయన్స్ గ్రూప్ మొత్తం వేల్యుయేషన్ రూ. 19.71 లక్షల కోట్లుగా, అదానీ గ్రూప్ విలువ రూ. 13.40 లక్షల కోట్లుగా ఉంది. తొలిసారిగా లిస్టులోని కంపెనీలన్నీ 1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్నవేనని హురున్ చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. దేశవ్యాప్తంగా పరిశ్రమ నిపుణులు, జర్నలిస్టులు, బ్యాంకర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలు, బహిరంగంగా అందుబాటలో ఉన్న గణాంకాల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు వివరించారు. దీనికి డిసెంబర్ 13 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు. మరిన్ని వివరాలు .. ⇒ టాప్ 500లోకి చోటు దక్కించుకునేందుకు ఈసారి కనిష్ట వేల్యుయేషన్ పరిమితిని 43% అధికంగా రూ. 9,580 కోట్లకు పెంచారు. 2023లో ఇది రూ. 6,700 కోట్లుగా ఉంది. ⇒ లిస్టులోని మొత్తం కంపెనీల విలువ 40 శాతం ఎగిసి 3.8 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ. 324 లక్షల కోట్లు) చేరింది. ఇది దాదాపు 3.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న దేశ జీడీపీ కన్నా అధికం కావడం గమనార్హం. మోతీలాల్ ఓస్వాల్, ఐనాక్స్ విండ్, జెప్టో, డిక్సన్ వంటి సంస్థల వేల్యుయేషన్ అత్యధికంగా పెరిగింది. ⇒ మొత్తం సుమారు రూ. 86 లక్షల కోట్ల పైగా ఆదాయం ఉన్న ఈ 500 కంపెనీలు దాదాపు రూ. 8 లక్షల కోట్ల లాభాలు ఆర్జించగా, రూ. 2.2 లక్షల కోట్ల మొత్తాన్ని పన్నుల కింద చెల్లించాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలపై రూ. 11,000 కోట్లు వెచ్చించాయి. సుమారు 85 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ⇒టాప్ కంపెనీల సంఖ్యాపరంగా చూస్తే రూ. 10.11 లక్షల కోట్ల విలువ చేసే 35 సంస్థలతో హైదరాబాద్ అయిదో స్థానంలో నిలి్చంది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణ ఏడో ర్యాంకులో ఉంది. -
జేఈఈ అడ్వాన్స్డ్ తర్వాతే ఈఏపీ సెట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్)ను ఈసారి ముందుకు జరిపి ఏప్రిల్లోనే నిర్వహించాలన్న ఉన్నత విద్యా మండలి ఆలోచన కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. ఈఏపీ సెట్ను ముందుకు జరపటం అసాధ్యమని పరీక్ష నిర్వహణ కన్సల్టెన్సీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్పష్టం చేసినట్టు తెలిసింది. జాతీయ, రాష్ట్ర పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈఏపీ సెట్ తేదీని గత ఏడాదికన్నా ముందుకు జరపడం సాధ్యంకాదని తెలిపినట్లు సమాచారం. ప్రధాన పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే ఈఏపీ సెట్ తేదీని ఖరారు చేయాలని ఇటీవల తమతో భేటీ అయిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి టీసీఎస్ ప్రతినిధులు సూచించినట్లు తెలిసింది. ఈసారి సెట్ను ముందే నిర్వహిస్తామని బాలకిష్టారెడ్డి మండలి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజుల్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ పరీక్ష తేదీలను పరిశీలించి టీసీఎస్ సెట్ తేదీని మండలికి సూచించడం ఆనవాయితీ. మే 18 తర్వాత అయితే ఓకే.. మార్చి ఆఖరి వారంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. ఈ ఫలితాలు ఏప్రిల్ రెండో వారం వెల్లడించే వీలుంది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాస్తారు. ఇంటర్ పరీక్షల తర్వాత ఈఏపీ సెట్కు సన్నద్ధమవ్వడానికి విద్యార్థులకు సమయం అవసరం. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8 వరకు నిర్వహిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మే 18న నిర్వహిస్తామని ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. దీని తర్వాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. ఏటా ఈ కౌన్సెలింగ్ పూర్తయ్యే సమయంలో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చేపడుతుంటారు. జాతీయ కాలేజీల్లో సీట్లు రాని వారికి ఇది ఉపయోగపడుతుంది.ఇవన్నీ పట్టించుకోకుండానే ఈఏపీ సెట్ను ఏప్రిల్లో నిర్వహించాలని మండలి భావించింది. ఇలా చేయడం వల్ల మెయిన్స్, అడ్వాన్స్డ్ రాసే విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉందని టీసీఎస్ భావిస్తోంది. అడ్వాన్స్డ్ తర్వాతే ఎప్పటిలాగే సెట్ నిర్వహించాలని సూచించినట్లు టీసీఎస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మండలిలోనూ భిన్నాభిప్రాయాలు ఈఏపీ సెట్ను ముందుకు జరపాలన్న ప్రతిపాదనపై మండలిలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలిసింది. వివిధ సెట్స్ ఏ వర్సిటీకి ఇవ్వాలి? కన్వీనర్ను ఎవరిని పెట్టాలనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈఏపీసెట్ నిర్వహించే జేఎన్టీయూహెచ్కు వీసీని కూడా నియమించలేదు. ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేస్తామని చెబుతున్నా... ప్రభుత్వం నుంచి అందుకు సమ్మతి రాలేదు. ఇన్ని సమస్యల మధ్య సెట్ నిర్వహణ ముందే ఎలా చేపడతామని మండలి వైస్ చైర్మన్ ఒకరు సందేహం వ్యక్తంచేశారు. -
విలువలో టీసీఎస్ నంబర్ 1
న్యూఢిల్లీ: అత్యంత విలువైన భారత బ్రాండ్గా టీసీఎస్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. కాంటార్ బ్రాండ్జ్ రిపోర్ట్లో వరుసగా మూడో ఏడాది ఈ గుర్తింపు పొందింది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ ఉన్నాయి. టీసీఎస్ బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లుగా ఈ నివేదిక తెలిపింది. గతేడాది నుంచి చూస్తే టీసీఎస్ బ్రాండ్ విలువ 16 శాతం పెరిగింది. ఏఐ, డిజిటల్ విభాగాల్లో టీసీఎస్ చేసిన పెట్టుబడులు బ్రాండ్ విలువ పెరిగేందుకు దోహదపడినట్టు తెలిపింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 38.3 బిలియన్ డాలర్ల విలువను సొంతం చేసుకుంది. 18 బిలియన్ డాలర్ల విలువతో ఎస్బీఐ ఐదో స్థానంలో నిలవగా, 15.6 బిలియన్ డాలర్లతో ఐసీఐసీఐ బ్యాంక్ ఆరో స్థానంలో, 11.5 బిలియన్ డాలర్ల విలువతో ఎల్ఐసీ పదో స్థానంలో నిలిచాయి. గతే డాది నుంచి చూస్తే 54 బ్రాండ్లు తమ విలువను పెంచుకున్నాయి. భారత్లోని టాప్–75 బ్రాండ్ల విలువ అద్భుతమైన రీతిలో ఏడాదిలోనే 19 శాతం పెరిగి 450.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు కాంటార్ బ్రాండ్జ్ నివేదిక వెల్లడించింది. ఆర్థిక సేవల బ్రాండ్లు ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచాయి. మొత్తం బ్రాండ్ల విలువలో 17 ఆర్థిక సేవల బ్రాండ్ల రూపంలోనే 28 శాతం ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. జొమాటో స్పీడ్.. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో చాలా వేగంగా తన విలువను రెట్టింపు చేసుకున్నట్టు కాంటార్ బ్రాండ్జ్ నివేదిక తెలిపింది. 3.5 బిలియన్ డాలర్ల విలువతో జాబితాలో 31వ స్థానాన్ని సొంతం చేసుకుంది. బజాజ్ ఆటో 20వ స్థానంలో ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా బ్రాండ్ విలువ ఏడాదిలో 78 శాతం పెరిగింది. 30వ స్థానం సొంతం చేసుకుంది. మొత్తం 1535 బ్రాండ్లకు సంబంధించి 1.41 లక్షల మంది అభిప్రాయాలను కాంటార్ సంస్థ పరిగణనలోకి తీసుకుంది. -
టీసీఎస్కు షాక్!.. రూ.1600 కోట్ల జరిమానా
తమ వ్యాపార రహస్యాలను 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) బయట పెట్టించిందని 'కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్' డల్లాస్లోని నార్త్ డిస్ట్రిక్ టెక్సాస్లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ కోర్ట్లో కేసు వేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన తరువాత వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేసినందుకు టీసీఎస్ పూర్తి బాధ్యత వహిస్తుందని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. ఈ కారణంగా కంపెనీకి 194 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1600 కోట్లు) జరిమానా విధించింది.ఈ విషయాన్ని టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్లో తెలిపింది. ఈ మేరకు జూన్ 14న కోర్టు ఉత్తర్వులను అందుకున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో టీసీఎస్ కూడా తన వాదనలను బలంగా వినిపించింది. జిల్లా కోర్టులు మళ్ళీ ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయనున్నట్లు సమాచారం. కంపెనీకి అమెరికా కోర్టు భారీ జరిమానా విధించినప్పటికీ.. తమ ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని టీసీఎస్ పేర్కొంది.ఆన్బోర్డింగ్ ఆలస్యంఇదిలా ఉండగా గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. -
టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!
కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసలుబాటుని కల్పించాయి. గత కొన్ని నెలలుగా వైరస్ తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా దాదాపు పూర్తయింది. ఈ తరుణంలో కోవిడ్ తగ్గుముఖం పట్టి యధావిధిగా కార్యకాలపాలు కొనసాగుతుండడంతో కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్కు సిస్టమ్కు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాయి. తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులను వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో పని చేయాలని కోరింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపింది. టీసీఎస్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో.. ఇప్పటికే సీనియర్ ఉద్యోగులు ఆఫీస్ నుంచి పని చేస్తున్నారని పేర్కొంది. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులైనా ఆఫీసు నుంచి పని చేయాలని, అందుకు తగ్గట్టు సన్నద్ధం కావాలని సూచించింది. రిటర్న్ టూ ఆఫీస్ మోడల్ ప్రకారం.. 25/25 ప్లాన్ను మరింత నియంత్రిత పద్ధతిలో అమలు చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతానికి, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు గుడువు తేదిని మాత్రం తెలపలేదు. అయితే కొత్త వర్కింగ్ ప్లాన్ ప్రకారం.. వారి ప్రాజెక్ట్ల కోసం చేసిన ఏర్పాట్ల గురించి సంబంధిత మేనేజర్లను సంప్రదించాలని సూచించింది. అలాగే ఉద్యోగుల రోస్టరింగ్ పద్థతి ప్రాజెక్ట్ అవసరాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. చదవండి: పండుగ సీజన్.. కొత్త బైక్ కొనేవారికి షాక్! -
టీసీఎస్ సంచలనం.. ప్రపంచంలోనే 2వ స్థానంలో..!
TCS, Infosys among world’s most valuable brands: దేశీయ ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో రికార్డు సాధించింది. బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల్లో రెండవ అత్యంత విలువైన బ్రాండ్గా నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న యాక్సెంచర్ అత్యంత విలువైన బలమైన ఐటీ సేవల అందిస్తున్న బ్రాండ్గా కొనసాగుతుంది. ఇక మూడవ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ గత సంవత్సరం నుంచి 52 శాతం వృద్ధి చెందింది. $12.8 బిలియన్లతో ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి సేవల బ్రాండ్గా అవతరించింది. 16.8 బిలియన్ డాలర్ల విలువైన టీసీఎస్ వ్యాపార పనితీరు, మెరుగైన భాగస్వామ్యాల ఒప్పందాల ద్వారా రెండు ర్యాంకింగ్ స్థాయికి చేరుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం.. టీసీఎస్ బ్రాండ్ విలువ గత 12 నెలల్లో $1.844 బిలియన్(12.5 శాతం) పెరిగి $16.786 బిలియన్లకు చేరుకుంది. ఈ వృద్ధికి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడుదారులు, ఉద్యోగులు, కస్టమర్ ఈక్విటీ & బలమైన ఆర్థిక పనితీరు కారణమని పేర్కొంది. బ్రాండ్ విలువ వృద్ధి పరంగా భారతీయ ఐటీ సేవల కంపెనీలు, యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తున్న పోటీని అధిగమించాయి. కోవిడ్-19 మహమ్మారి ద్వారా డిజిటల్ సేవలు అందించే కంపెనీలు భారీగా వృద్ది చెందాయని ఈ కొత్త నివేదిక తెలిపింది. 2020 నుంచి భారతీయ బ్రాండ్ల సగటు వృద్ధి 51 శాతం పెరిగితే, యుఎస్ బ్రాండ్ల వృద్ది సగటున 7 శాతం తగ్గింది. కరోనా మహమ్మారి వల అనేక రంగాలు ప్రభావితం అయినప్పటికీ ఐటి సేవలు & సాంకేతిక రంగానికి చెందిన దూసుకెళ్తున్నాయి. మార్కెట్ కి అనుగుణంగా ద్వారా క్లౌడ్ సేవలు, టెక్నాలజీ కన్సల్టింగ్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు వంటి సేవలు అందిస్తుండటం ద్వారా కంపెనీలు దేశీయ కంపెనీలు తమ బ్రాండ్ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. (చదవండి: సామాన్యులకు దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..!) -
ఫ్రెషర్స్కు గుడ్న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు.. ..
మీరు చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నారా ! అయితే మీకో గుడ్న్యూస్. పలు దిగ్గజ ఎంఎన్సీ కంపెనీలు ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్,పీడబ్ల్యూసీ,టాటా కన్సల్టెన్సీ సర్వీస్,బైజూస్,టాటా స్టీల్,ఇన్ఫోసిస్ కంపెనీలు ఆఫ్ క్యాంపస్లో భారీ ఎత్తున ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది సుమారు 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కాగ్నిజెంట్ 2022( వచ్చే ఏడాదికి ) గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న విద్యార్ధులకు 45 వేలు ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇన్ఫోసిస్ సైతం గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలో ఇంకా 24,000 మంది ఫ్రెషర్స్ను నియమించనుంది. 2021-22 ఆర్థిక ఆర్ధిక సంవత్సరంలో ఇండియాకు చెందిన టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్,విప్రోలు సుమారు లక్షా 20 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించనున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంతను మాట్లాడుతూ.. ఫుల్ స్టాక్ ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్,ఏల్/ఎంఎల్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ కోసం అధునాతన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను పెద్ద సంఖ్యలో నియమించుకోవడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ సైతం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి),నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) నుండి ఇంజనీరింగ్ విద్యార్ధుల్ని ఎంపిక చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా 'ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్' పేరిట క్యాంపస్ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల నియమాకం కోసం ఇండియాలో మొత్తం 600 ఇంజనీరింగ్ క్యాంపస్లలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హ్యూమన్ కేపిటల్ మేనేజ్మెంట్ అధికారిణి దీపికా బెనర్జీ చెప్పారు. ఈ నియామకాల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజనీర్ ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా ఉన్నాయి.కాగా, స్టార్టప్లు,ఐటీ/ టెక్నాలజీ ఔట్సోర్సింగ్స్ సంస్థలు,స్టార్టప్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, బ్యాంకులు, కన్సల్టెన్సీలలో డిమాండ్ పెరగడంతో తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్ధులను నియమించుకునేందుకు ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో! -
గ్లోబల్ ర్యాంకింగ్స్లో దేశీ దిగ్గజాలు డీలా..రిలయన్స్తో పాటు
ముంబై: ప్రయివేట్ రంగంలోని టాప్–500 గ్లోబల్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజాలు వెనకడుగు వేశాయి. అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ర్యాంకులు నీరసించాయి. జూలై 15 కటాఫ్గా పరిగణిస్తూ హురున్ గ్లోబల్ రూపొందించిన టాప్–500 తాజా జాబితాలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్సహా.. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్, ఫైనాన్షియల్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ద్వయం, టెలికం బ్లూచిప్ భారతీ ఎయిర్టెల్ డీలా పడ్డాయి.అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా రూపొందించే ఈ జాబితాలో గతేడాది 11 దేశీ కంపెనీలకు మాత్రమే జాబితాలో చోటు లభించగా తాజాగా 12కు చేరింది. వివరాలు ఇవీ.. విలువ పెరిగినా..: ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 11 శాతం బలపడి 188 బిలియన్ డాలర్లను తాకినప్పటికీ కంపెనీ ర్యాంకు మూడంచెలు తగ్గి 57కు చేరింది. ఈ బాటలో 164 బిలియన్ డాలర్ల విలువతో టీసీఎస్ 75 నుంచి 74వ ర్యాంకుకు నీరసించగా.. 113 బిలియన్ డాలర్ల విలువ గల హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 19 పొజిషన్లు క్షీణించి 124వ స్థానానికి చేరింది. ఇక హెచ్డీఎఫ్సీ 52 అంచెలు జారి 301వ ర్యాంకును తాకింది. అయితే ఈ కాలంలో కంపెనీ మార్కెట్ విలువ 1 శాతం పుంజుకుని 56.7 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! కోటక్ మహీంద్రా బ్యాంక్ విలువ 8% తగ్గి 46.6 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. 96 ప్లేస్లు క్షీణించి 380వ ర్యాంకుకు చేరింది. కాగా.. బ్యాంకింగ్ బ్లూచిప్ ఐసీఐసీఐ విలువ 36 శాతం జంప్చేసి 62 బిలియన్ డాలర్లను అందుకోవడంతో 48 స్థానాలు మెరుగుపడి 268వ ర్యాంకుకు ఎగసింది. కొత్తగా 3 కంపెనీలు గ్లోబల్ టాప్–500 జాబితాలో కొత్తగా దేశీ దిగ్గజాలు విప్రో(457వ ర్యాంకు), ఏషియన్ పెయింట్స్(477), హెచ్సీఎల్ టెక్నాలజీస్(498)కు చోటు లభించింది. దేశీయంగా స్టార్టప్ల జోరు కొనసాగుతుండటంతో ఇకపై జాబితాలోకి మరిన్ని కంపెనీలు చేరే వీలున్నట్లు హురున్ నివేదిక అభిప్రాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ మార్కెట్ విలువ 15 శాతం పురోగమించి 2.4 లక్షల కోట్ల డాలర్లను తాకింది. తద్వారా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్(గూగుల్) తదుపరి ర్యాంకులను ఆక్రమించాయి. జాబితాలో 243 కంపెనీలతో యూఎస్ టాప్ ర్యాంకును కైవసం చేసుకోగా.. చైనా(47), జపాన్(30), యూకే(24) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
సృజనాత్మకత పెంచుకోవాలి
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సృజనాత్మకను, నైపుణ్యాలను పెంచుకుంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుం దని, అలాగే విద్యా వ్యవస్థలో నాణ్యమైన విద్యను అందించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు అన్నారు. గ్రామాలే కేంద్రంగా అభివృద్ధి జరగాలని అప్పుడే అనుకున్న ప్రగతి సాధించగలుగుతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్)లో ‘‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ డెవలప్మెంట్ డిస్కోర్స్’’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్రావు మాట్లాడుతూ చదువంటే కేవలం పరీక్షల కోసమేనన్న భావన నుంచి బయటకు రావాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి దోహదపడతాయన్నారు. టాటా కన్సల్టెంట్ సర్వీస్(టీసీఎస్) నిర్వహించిన సర్వేలో గణిత సమస్యల సాధనలో ఇండియాలోని 21 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఓఈసీడీ దేశాల 15 ఏళ్ల విద్యార్థుల కంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉండటం బాధాకరమన్నారు. మన దేశ విద్యా విధానాన్ని ప్రక్షాళన చేసే దిశగా కృషి జరగాలన్నారు. యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరముందని లేకుంటే అది సమాజా నికి పెను సవాలుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తు న్నా గిరిజన గ్రామాలు ఇంకా అభివృద్ధి ఫలా లు అందుకోలేకపోతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ వైస్ చైర్మన్ డా.రాజీవ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
టిసిఎస్లో ఉద్యోగ ఆఫర్లు
-
టీసీఎస్కు 2 బిలియన్ డాలర్ల డీల్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా 2 బిలియన్ డాలర్ల డీల్ దక్కించుకుంది. అమెరికాకు చెందిన బీమా సంస్థ ట్రాన్స్ అమెరికా నుంచి ఈ కాంట్రాక్టు లభించినట్లు టీసీఎస్ తెలిపింది. ఈ కాంట్రాక్టు కింద అమెరికాలో ఆ కంపెనీ బీమా, యాన్యుటీ వ్యాపార విభాగాలను మెరుగుపర్చేందుకు అవసరమైన సర్వీసులు అందించాల్సి ఉంటుంది. 2018 రెండో త్రైమాసికంలో ఈ ఒప్పందం పూర్తి కాగలదని టీసీఎస్ తెలియజేసింది. దీంతో ట్రాన్స్అమెరికాకు వార్షికంగా 70–100 మిలియన్ డాలర్ల దాకా వ్యయాలు ఆదా కాగలవని పేర్కొంది. ప్రస్తుతం ట్రాన్స్ అమెరికాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 2,200 మంది సిబ్బందికి తమ సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు టీసీఎస్ తెలిపింది. అలాగే, స్థానికంగా మరింత మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ పేర్కొన్నారు. మరింతగా పొదుపు, మదుపు చేసేలా తమ కస్టమర్లకు తోడ్పాటునివ్వడానికి టీసీఎస్తో డీల్ ఉపయోగపడగలదని ట్రాన్స్ అమెరికా ప్రెసిడెంట్ మార్క్ మలిన్ చెప్పారు. టీసీఎస్ డిసెంబర్ క్వార్టర్లో సుమారు నాలుగు శాతం క్షీణతతో రూ.6,531 కోట్లకు నికర లాభం ప్రకటించిన నేపథ్యంలో తాజా డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం బీఎస్ఈలో టీసీఎస్ షేరు సుమారు అరశాతం క్షీణించి రూ. 2,773 వద్ద క్లోజయ్యింది. -
జేఎన్టీయూతో టీసీఎస్ ఒప్పందం
► బోధన, శిక్షణ కార్యక్రమాల్లో సహకారం అందించనున్న ఐటీ దిగ్గజం సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన బోధన కోసం జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్)మరో ముందడుగు వేసింది. ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో ఒప్పందం కుదు ర్చుకుంది. ఇందులో భాగంగా జేఎన్టీయూహెచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించే కార్యక్రమాలకు టీసీఎస్ సహకారం అందించనుంది. పరిశ్రమ ఆధారిత శిక్షణలు, బోధన అభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థుల ఇంటర్న్షిప్, అవార్డులు, పరిశోధన ల్లోనూ టీసీఎస్ పాలుపంచుకోనుంది. శనివారం జేఎన్టీ యూహెచ్ వైస్ చాన్స్లర్ వేణుగోపాల్రెడ్డి, టీసీఎస్ ఉపాధ్యక్షుడు వి.రాజన్న ఒప్పంద పత్రా లపై సంతకాలు చేశారు. జేఎన్టీయూ భాగస్వామ్యంతో దాదాపు పదేళ్లుగా వివిధ అంశాల్లో ఒప్పం దం కుదుర్చుకుని కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపా రు. టీసీఎస్ రీసెర్చ్ స్కాలర్ ప్రొగాంను కూడా పొడిగిం చినట్లు చెప్పారు. -
టీసీఎస్ తర్వాత హెచ్సీఎల్ టెక్ కూడా..
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ తర్వాత మరో దేశీయ అగ్రగామి హెచ్సీఎల్ టెక్ కూడా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. షేర్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించేందుకు సిద్ధమైంది. షేర్ బైబ్యాక్ ప్రకటించాలని కంపెనీ యోచిస్తోందని, ఈ విషయాన్ని బోర్డు ముందుకు తీసుకురాబోతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. రెండు రోజుల క్రితమే టీసీఎస్ రూ.16వేల కోట్ల మెగా షేర్ల బైబ్యాక్ను చేపట్టనున్నట్టు ప్రకటించి, ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది. ప్రస్తుతం తాము కూడా ఇన్వెస్టర్ల వాల్యు పెంచేందుకు చూస్తున్నామని, షేర్ బైబ్యాకుకు పిలుపునివ్వబోతున్నామని ఓ అధికారి చెప్పారు. ఒక్కసారి ఈ విషయంపై తాము ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక, బోర్డు ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు. బోర్డు ముందుకు వెళ్లిన తర్వాత హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ హోల్డర్స్ దీన్ని ఆమోదించాల్సి ఉంది. డిసెంబర్ 31 వరకు కంపెనీ వద్ద నగదు, నగదుతో సమానమైన నిల్వలు రూ.2,214.5 కోట్లు ఉన్నాయి. అంతేకాక ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10,506.9 కోట్లున్నాయి. టీసీఎస్ తరహాలో మెగా బైబ్యాక్ ఆఫర్ చేయకపోయినా.. బైబ్యాక్ మాత్రం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. -
అమెరికా అత్యంత విలువైన బ్రాండ్లలో టీసీఎస్
లండన్: దేశీ దిగ్గజ ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) అమెరికాలోని అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటిగా స్థానం పొందింది. ప్రముఖ బ్రాండ్ వేల్యుయేషన్ కం పెనీ ‘బ్రాండ్ ఫైనాన్స్’ రూపొందించిన వార్షిక ‘టాప్-500 యూఎస్ బ్రాండ్స్’ జాబితాలో టీసీఎస్ 58వ ర్యాంక్ను సొంతం చేసుకుంది. ఇక టాప్-100 బ్రాండ్లలో కేవలం ప్రపంచపు అత్యుత్తమ గ్లోబల్ ఐటీ సర్వీసెస్ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. అందులో టీసీఎస్ ఒకటి. 2010లో 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్న టీసీఎస్ బ్రాండ్ విలువ 2016నాటికి 286% వృద్ధితో 9.04 బిలియన్ డాలర్లయ్యింది. -
ఐటీ ఉపాధి కల్పనలో టీసీఎస్ టాప్: నాస్కామ్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) టాప్ ఎంప్లాయర్గా నిలిచింది. ఇందులో 3.62 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రకారం.. టీసీఎస్ తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, క్యాప్జెమిని ఉన్నాయి. కాగ్నిజెంట్.. అమెరికా కంపెనీ అయినప్పటికీ ఆ కంపెనీ దేశంలో చాలా మందికి ఉపాధి కల్పిస్తోందని నాస్కామ్ పేర్కొంది. దీనికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. జూన్ నెల చివరకు.. టీసీఎస్లో 3.62 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇన్ఫోసిస్, విప్రోలలో వరుసగా 1.97 లక్షలు, 1.73 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక టాప్-10లో హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జెన్ప్యాక్ట్, ఇంటెలిజెంట్ గ్లోబల్ సర్వీసెస్, ఏజీస్ వంటి సంస్థలున్నాయి. టాప్-20లో హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్, సీఎస్సీ ఇండియా, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్, సింటెల్, ఎంఫసిస్, ఈఎక్స్ఎల్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్ట్రీ, ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్, సీజీఐ వంటి కంపెనీలు స్థానం పొందాయి. దేశీ ఐటీ-బీపీఎం పరిశ్రమ దాదాపు 37 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో మహిళా ఉద్యోగుల వాటా 13 లక్షలు. -
జలయోగం
సుంకిశాలపై మళ్లీ కదలిక మూడేళ్లు ఆలస్యం రూ.300 కోట్లు పెరిగిన అంచనా వ్యయం సిటీబ్యూరో: నాగార్జున సాగర్ జలాశయం నుంచి నగరానికి కృష్ణా జలాల (రా వాటర్) పంపింగ్కు ఉద్దేశించిన సుంకిశాల ఇన్టేక్ వెల్ (కృష్ణా హెడ్వర్క్స్ పనులు) ప్రాజెక్టుపై మళ్లీ కదలిక వచ్చింది. శాసనసభలో ఇటీవల విపక్షాలు ఇదే అంశంపై సర్కారును నిలదీయడంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు సభ్యులకు తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మూడేళ్ల క్రితమే పూర్తి చేసింది. దీనిపై రాష్ట్ర సర్కారు మూడేళ్లుగా దృష్టి సారించకపోవడంతో అంచనా వ్యయం రూ.900 కోట్ల నుంచి రూ.1200 కోట్లకు చేరుకుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వేసవిలో నీటి మట్టాలు సాగర్లో 465 అడుగులకు పడిపోయినప్పటికీ ఈ పథకం ద్వారా జంట నగరాలకు నీటిని తరలించే అవకాశం ఉంటుంది. ఇన్టేక్ వెల్ ఎందుకంటే... ప్రస్తుతం సాగర్ నీటి పారుదల కాల్వల (ఇరిగేషన్ కెనాల్స్) నుంచి కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా కోదండాపూర్ (నల్లగొండ జిల్లా)కు నిత్యం 180 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి నగర శివార్లలోని సాహెబ్ నగర్ రిజర్వాయర్కు కృష్ణా జలాలను పంపింగ్చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, వేసవిలో నీటి మట్టాలు 510 అడుగుల దిగువకు పడిపోయినపుడు నగరానికి తాగునీటి సరఫరాపై తరచూ ఆందోళన నెలకొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే సుంకిశాల ఇన్టేక్ వెల్ నిర్మాణ పథకం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి కోదండాపూర్కు... అక్కడి నుంచి పుట్టంగండికి రావాటర్ పంపింగ్ చేస్తున్నారు. అటు నుంచి నగర శివారుల్లోని సాహెబ్నగర్ వరకు శుద్ధి చేసిన కృష్ణా జలాలు తరలిస్తున్నారు. తాజా ప్రాజెక్టు ద్వారా కోదండాపూర్కు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంకిశాల వద్ద ఇన్టేక్ వెల్ నిర్మిస్తారు. ఈ ప్రాంతంలో భూమికి అత్యంత లోతున మూడు పెద్ద బావులు (జాక్వెల్స్) నిర్మిస్తారు. వాటికి 18 మోటార్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి రావాటర్ను కోదండాపూర్కు పంపింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల సాగర్ నీటిమట్టం 465 అడుగులకు పడిపోయినప్పటికీ నగర తాగునీటి అవసరాలకు నీటిని తరలించవచ్చని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. మూడు దశల పంపింగ్ సుంకిశాల నుంచే... ఈ ఇన్టేక్ వెల్ నిర్మాణం పూర్తయితే రోజువారీగా కృష్ణా మొదటి, రెండు, మూడో దశలకు అవసరమైన 270 మిలియన్ గ్యాలన్లను సుంకిశాల నుంచే పంపింగ్కు అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనకు నీటి పారుదల శాఖ గతంలో సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది. గతంలో దీనికి అవసరమైన రూ.900 కోట్ల రుణాన్ని జైకా (జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) అందజేసేందుకు ముందుకొచ్చినప్పటికీ సర్కారు దృష్టి పెట్టకపోవడంతో పనులు మొదలుకాలేదు. దీనిపై సర్కారు దృష్టి సారించడం అత్యవసరమని నీటి పారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. -
యూరప్యేతర ఉద్యోగులపై వెయ్యిపౌండ్ల సర్చార్జ్
యూకే సర్కారు పన్ను ♦ భారత ఐటీ నిపుణులకు మంచి అవకాశం లండన్: యూకేలో యూరప్యేతరులను ఉద్యోగులుగా నియమించుకునే కంపెనీలు ఇకపై ఏడాదికి అదనంగా వెయ్యి పౌండ్ల (దాదాపు రూ.95 వేలు) సర్చార్జ్ను చెల్లించాల్సి ఉంటుంది. టైర్2 వీసా విధానంలో భాగంగా.. కంపెనీల ‘ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్’ను సమీక్షించాక యూకే మైగ్రేషన్ అడ్వయిజరీ కమిటీ(మ్యాక్) ఈ సిఫార్సు చేసింది. దీంతో యూకేలో ఉద్యోగానికి వచ్చే వారికి శిక్షణనిచ్చి ఉద్యోగంలో చేర్చుకోవటం కంపెనీలకు భారమవుతుంది. నేరుగా నైపుణ్యమున్న వారికే ఉద్యోగాలివ్వాల్సి ఉంటుంది. కొత్త విధానంతో కనీసం మూడేళ్ల వీసాపై వచ్చే యూరప్యేతరులపై కంపెనీలు 3 వేల పౌండ్లు చెల్లించాలి. దీనివల్ల అవి స్థానికులకే శిక్షణనిచ్చి వారికే ఉద్యోగాలిచ్చేందుకు అవకాశం ఉంటుందని మ్యాక్ తన నివేదికలో పేర్కొంది. నివేదికను యూకే ప్రభుత్వం త్వరగానే ఆమోదించనున్నట్లు సమాచారం. 2015 సెప్టెంబర్ వరకున్న లెక్కల ప్రకారం.. టైర్ 2 వీసా కింద అనుమతి పొందిన వారిలో 90శాతం మంది భారతీయ స్కిల్డ్ వర్కర్లే ఉన్నారని మ్యాక్ తెలిపింది. భారత్లోని మల్టీనేషనల్ కంపెనీలు పోటీ వాతావరణం వల్ల యూకేలో ఐటీ ప్రాజెక్టులకోసం భారతీయ ఉద్యోగులను తీసుకొస్తున్నాయంది. యూకేతో పోలిస్తే.. భారత్లో వేతనాలు చాలా తక్కువగా ఉండట కారణమంది. భారత్లోనూ శిక్షణ సంస్థల మధ్యతో నిపుణులైన ఉద్యోగులు బయటకు వస్తున్నారని.. వారికి యూకే కంపెనీలు మంచి వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయ పేర్కొంది. కాగా, 2016 నుంచి 2020 వరకు వెయ్యిమంది యూకే గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందుకొచ్చినట్లు తెలిసింది. -
'మా బిడ్డను బలవంతంగా లాక్కున్నారు'
జైపూర్: తాము ఏ తప్పూ చేయకపోయినా తామేదో కావాలని చేసినట్లు భావించి అమెరికా అధికారులు తమ బిడ్డను బలవంతంగా లాక్కున్నారని, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంరక్షణ కేంద్రానికి అప్పగించారని రాజస్థాన్కు చెందిన దంపతులు వాపోయారు. జైపూర్ కు చెందిన దంపతులు ఆశిష్ పరీక్, విదిశా అమెరికాలోని న్యూజెర్సీ లో టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. విదిశా గత అక్టోబర్ నెలలోనే ఓ బాబుకు జన్మనిచ్చింది. గత నెలలో ఆ బాలుడు చేతిలోకి తీసుకొని ఆడిస్తుండగా చేయి జారి కిందపడ్డాడు. ఆ క్రమంలో అతడి తల టీవీ స్టాండ్ కు తగిలి అనంతరం నేలకు బలంగా తాకింది. దీంతో ఆ బాలుడిని న్యూజెర్సీలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలుడికి ప్రాణగండం తప్పింది. సురక్షితంగా కోలుకున్నాడు. అయితే, అమెరికా శిశు సంరక్షణ శాఖకు చెందిన అధికారులు మాత్రం వారు కావాలనే బాబుకు హానీ కలిగించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ వారి చేతినుంచి బిడ్డను తీసుకొని ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో ఇప్పుడు తమ బిడ్డను ఎలాగైనా తమకు ఇప్పించండని, అది కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదం మాత్రమేనని అంటున్నారు. గతంలో నార్వేలో కూడా తమ పిల్లలకు సంబంధించి భారతీయ దంపతులకు ఇలాంటి చిక్కులు ఎదురైన విషయం తెలిసిందే. -
84% స్మార్ట్ ఫోన్ ప్రియులే!
హైదరాబాద్: విద్యార్థులకు అత్యంత ప్రియమైన గాడ్జెట్ స్మార్ట్ఫోన్ అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జనరేషన్ జెడ్ సర్వేలో తేలింది. డిజిటల్ గాడ్జెట్ వినియోగంలో విద్యార్థులు ముందున్నారని, వీరిలో 84 శాతం మంది స్మార్ట్ఫోన్ ప్రియులని తేటతెల్లమైంది. 83 శాతం మంది విద్యార్థులు ఫేస్బుక్ వినియోగిస్తున్నారని, టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ 80 శాతం మంది సమాచారం, వినోదం కోసం టీవీలు, న్యూస్ పేపర్లపైనే ఆధారపడుతున్నారని వెల్లడైంది. విద్యార్థులకు డిజిటల్ అవగాహనపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జనరేషన్ జెడ్ హైదరాబాద్లోని 50 స్కూళ్లలో చదివే వెయ్యి మంది విద్యార్థులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికమైన విషయాలు వెలుగు చూశాయి. శుక్రవారం గచ్చిబౌలిలోని టీసీఎస్ సినర్జీ పార్కులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీసీఎస్ టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్, వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ వి.రాజన్న సర్వే వివరాలను వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద సర్వేల్లో ఇది ఒకటని, నగరంలోని 50 స్కూళ్లలో చదివే 12 నుంచి 18 ఏళ్లలోపు వెయ్యి మంది విద్యార్థులపై సర్వే నిర్వహించామని తెలిపారు. ప్రధానంగా 10 అంశాలైన స్మార్ట్ఫోన్, ఫేస్బుక్, సోషల్ మీడియా, వాట్సప్, ఆన్లైన్ వినియోగం, ఎనీ టైమ్ ఎనీవేర్ లెర్నింగ్, టీవీ చూడడం, న్యూస్పేపర్లు చదవడం, ప్రొఫెషనల్ కోర్సుల పట్ల వారికున్న అవగాహనపై సర్వే నిర్వహించినట్టు చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులను చదవాలని 61 శాతం మంది విద్యార్థినులు అభిప్రాయపడగా, 48 శాతం మంది విద్యార్థులు మా త్రమే ప్రొఫెషనల్ కోర్సు లు చేయాలని కోరుకుంటున్నారని సర్వేలో తేలిందన్నారు. ఆన్లైన్ షాపింగ్పై 62 శాతం మంది.. బుక్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్పై 59 శాతం, సినిమాలు, ఇతర ఈవెంట్లపై 55 శాతం మంది ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ప్రతి నిత్యం 75 శాతం మంది గంట పాటు ఆన్లైన్లోనే ఉంటున్నారని, వీరిలో 59 శాతం మందికి వచ్చే స్పందనలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో సాగడం విశేషమని రాజన్న వివరించారు. అవగాహనకు కార్యక్రమాలు విద్యార్థులకు డిజిటల్ రంగంలో అవగాహన పెంచేందుకు టీసీఎస్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు రాజన్న వివరించారు. విద్యార్థుల కోసం క్యాంపస్ కమ్యూన్ పేరిట దేశంలో ఎక్కడివారైనా వినియోగించుకోవడానికి ఏర్పాటు చేశామని అలాగే యాస్పైర్ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ-లెర్నింగ్, ఆన్లైన్ కోర్సులను శిక్షణా కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నామని, హైదరాబాద్లో కూడా ఈ కేంద్రం పనిచేస్తోందన్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా శిక్షణ కోసం విద్యార్థుల ఎంపిక జరుగుతోందన్నారు. పీహెచ్డీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఐదు యూనివర్శిటీలను ఎంపిక చేసుకుని వారికి చేయూత ఇస్తున్నామని రాజన్న తెలిపారు. -
అంచనాలను అందుకున్న టీసీఎస్ ఫలితాలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో త్రైమాసికం ఫలితాలు అంచనాలను అందుకునేవిధంగా ఉన్నాయి. టీసీఎస్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6శాతం వృద్ధితో రూ. 6,055.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే సంస్థ మొత్తం ఆదాయం విషయంలో మాత్రం అంచనాలకు దూరంగా ఉండిపోయింది. రెండో త్రైమాసికంలో సంస్థ రెవెన్యూ ఆదాయం 5.8శాతం పెరిగి.. రూ. 27,165 కోట్లకు చేరుకుంది. డాలర్ ఆదాయం మూడు శాతం మాత్రమే పెరిగి 4,156 మిలియన్ డాలర్లకు చేరుకుంది. డాలర్తో పోలిస్తే కాన్స్టంట్ కరెన్సీ రెవెన్యూ మూడుశాతానికి మించి పెరుగకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. -
వృద్ధిలో టాప్... టీసీఎస్ బ్రాండ్
ముంబై: టాటా గ్రూప్కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. ఐదేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి సాధించిన సాఫ్ట్వేర్ బ్రాండ్గా అవతరించింది. 2010లో 230కోట్ల డాలర్లుగా ఉన్న తమ బ్రాండ్ విలువ 2015 కల్లా 271 శాతం వృద్ధితో 870 కోట్ల డాలర్లకు చేరిందని టీసీఎస్ తెలిపింది.అంతర్జాతీయ బ్రాండ్ వాల్యూయేషన్ సంస్థ, బ్రాండ్ ఫైనాన్స్ను ఉటంకిస్తూ టీసీఎస్ ఈ వివరాలు వెల్లడించింది. ఐటీ పరిశ్రమలో ఉండే అత్యున్నత బ్రాండ్ రేటింగ్ ఏఏప్లస్ను నిలుపుకున్నామని టీసీఎస్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు. ఐటీ సర్వీసుల విభాగంలో ప్రపంచంలో అగ్రశ్రేణి నాలుగు బ్రాండ్లలో ఒకటిగా వరుసగా నాలుగో ఏడాది కూడా నిలిచామని వివరించారు. 46 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న టీసీఎస్లో 3,18,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
9 నెలల్లో 2,574 మందికి టీసీఎస్లో ఉద్వాసన
న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్ మధ్య) 2,574 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. పూర్తి సంవత్సరానికికొస్తే ఈ సంఖ్య 3,000 పైచిలుకు ఉండొచ్చని అంచనా. పనితీరు మదింపు, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అన్నది సంస్థాగతంగా సాధారణంగా జరిగేదే తప్ప భారీ స్థాయిలో తొలగింపులు ఉంటాయంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని కంపెనీ తెలిపింది. -
టీసీఎస్ సీఈవోగా మళ్లీ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవోగా ఎం. చంద్రశేఖరన్ మళ్లీ నియమితులయ్యారు. ఆయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు (2019, అక్టోబర్) పొడిగిస్తున్నామని టీసీఎస్ బుధవారం తెలిపింది. ఆయన నేతృత్వంలో తమ కంపెనీ మంచి వృద్ధిని సాధిస్తోందని పేర్కొంది. ఆయన సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్వార్టర్లో (2009-10 జూలై-సెప్టెంబర్) రూ.29,091 కోట్లుగా ఉన్న కంపెనీ రాబడులు ఈ ఏడాది జూన్ చివరి నాటికి రూ.85,933 కోట్లకు పెరిగాయని వివరించింది. అంతేకాకుండా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ.4.97 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది. తమ కంపెనీ 24 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తోందని, ఐటీ పరిశ్రమలో ఇదే అధికమని టీసీఎస్ వివరించింది. -
టీసీఎస్ శిక్షణ అకాడమీ ప్రారంభం..
సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ జపాన్కు చెందిన శిక్షణ అకాడమీని మోడీ మంగళవారమిక్కడ ప్రారంభించారు. ఇరు దేశాల్లోని ఐటీ నిపుణులకు సాంకేతిక, సాంస్కృతికపరమైన నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ అకాడమీ కృషిచేస్తుంది. ఈ సందర్బంగా 48 మంది టీసీఎస్ జపాన్ ట్రైనీల తొలి బ్యాచ్ భారత్ పర్యటనను కూడా మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ‘21 శతాబ్దాన్ని నడిపిస్తున్నది సాంకేతికత, మేధోపరమైన పరిజ్ఞానమే. మీరంతా భారత్లో పర్యటించి తగిన విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటారని భావిస్తున్నా. టీసీఎస్లో మీరు ఉద్యోగులుగా మారనున్నారు. అయితే, భారత్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మీరు జపాన్కు తిరిగిరావాలని నేను ఆకాంక్షిస్తున్నా’ అని మోడీ పేర్కొన్నారు. ఈ రెండు గొప్ప దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో తాము కూడా పాలుపంచుకుంటుండటం తమకు గర్వకారణమని టీసీఎస్ సీఈఓ, ఎండీ ఎన్.చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. -
సృజనాత్మక సంస్థల్లో హెచ్యూఎల్, టీసీఎస్
న్యూయార్క్: అభివృద్ధికి వినూత్న ఆలోచనలు సృష్టించేవిగా ఇన్వెస్టర్లు భావిస్తున్న ప్రపంచంలోని 100 అత్యంత సృజనాత్మక కంపెనీలతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఐదు భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. హిందుస్థాన్ యూనిలీవర్ 14, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 57వ ర్యాంకుల్లో నిలిచాయి. లార్సెన్ అండ్ టూబ్రో 58, సన్ ఫార్మా ఇండస్ట్రీస్ 65, బజాజ్ ఆటో 96వ స్థానాల్లో ఉన్నాయి. కాలిఫోర్నియా కేంద్రంగా గల క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ సేల్స్ఫోర్స్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఓ కంపెనీ భవిష్యత్తులో ఎలాంటి వినూత్న ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెస్తుంది, ఆ కంపెనీ ప్రస్తుత వ్యాపార విలువ కంటే మున్ముందు ఎంత అధిక ఆదాయాన్ని ఆర్జిస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారనే అంశాల ఆధారంగా ఇన్నోవేషన్ ప్రీమియంను లెక్కించామని ఫోర్బ్స్ తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్కు 54.7 శాతం, ఐటీ దిగ్గజం టీసీఎస్కు 39.58 శాతం, లార్సెన్ అండ్ టూబ్రోకు 39.4 శాతం ఇన్నోవేషన్ ప్రీమియం వచ్చిందని పేర్కొంది. సన్ ఫార్మాకు 38.34 శాతం, బజాజ్ ఆటోకు 31.73 శాతం ఇన్నోవేషన్ ప్రీమియం వచ్చిందని వివరించింది. ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించిన వాటిలో 41 కంపెనీలు అమెరికాకు చెందినవి కాగా మరో 29 కంపెనీలు యూరప్నకు చెందినవి. -
పరిశోధనలతోనే దేశ ప్రగతి
ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో టీసీఎస్ ఉపాధ్యక్షుడు ఎస్. రామదొరై భవిష్యత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీదే : కేటీఆర్ హైదరాబాద్ : నిత్య విద్యార్థిగా ఉంటేనే కెరీర్లో రాణించగలరని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఉపాధ్యక్షుడు ఎస్.రామదొరై అన్నారు. పోటీ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేలా యువత కెరీర్ను నిర్మించుకోవాలన్నారు. హైదరాబాద్ ట్రిపుల్ఐటీ 13వ స్నాతకోత్సవ సభకు హాజరైన రామదొరై మాట్లాడుతూ భారత్ సైన్స్పరంగా అభివృద్ధి చెందుతున్నా పరిశోధనల్లో చైనా కంటే వెనుకే ఉందన్నారు. రాబోయే రోజుల్లో భారత్ ‘రీసెర్స్ పవర్ హౌస్’గా ఆవిర్భవించనుందన్నారు. ఫార్మా, ఐటీ, బయోటెక్నాలజీ, ఆటోమోటివ్ రంగాలు 2015 నాటికి మరింత వృద్ధి చెందుతాయనే ఆశాభావం వ్యక్తంచేశారు. ఐటీ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భవిష్యత్లో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు దీటుగా సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ ఛైర్మన్ ప్రొఫెసర్ రాజరెడ్డి, డెరైక్టర్ పి.జె.నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ పూర్తిచేసిన సుమారు 375 మంది విద్యార్థినీ, విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. వీరిలో ఏడుగురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. బెస్ట్ ఆల్ రౌండర్-2014గా ఎంపికైన బీటెక్(సీఎస్ఈ) విద్యార్థి చెట్లూర్ మాధవన్ మలోలన్ కు పసిడి పతకం బహూకరించారు. -
అత్యంత విలువైన భారత్ బ్రాండ్.. టాటా
న్యూఢిల్లీ: భారత అత్యంత విలువైన బ్రాండ్గా టాటా గ్రూప్ నిలిచింది. 2,100 కోట్ల డాలర్ల విలువతో తన అగ్రస్థానాన్ని టాటా గ్రూప్ ఈ ఏడాది కూడా నిలుపుకుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదిక వెల్లడించింది. భారత టాప్ 100 బ్రాండ్ల విలువ మొత్తం 9,260 కోట్ల డాలర్లని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం వెల్లడించిన మరికొన్ని వివరాలు... ఏడాదికాలంలో టాటా బ్రాండ్ విలువ 300 కోట్ల డాలర్లు పెరిగింది. టాటా గ్రూప్ అంతర్జాతీయ వివిధీకరణ వ్యూహం, గ్రూప్ ప్రధాన ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. టాప్ 50 బ్రాండ్ల విలువ గత ఏడాది విలువతో పోల్చితే 10 శాతం పెరిగింది. టాటా, గోద్రేజ్, హెచ్సీఎల్, ఎల్ అండ్ టీ ల బ్రాండ్ విలువ చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ బ్రాండ్ విలువ 51 శాతం పెరిగింది. బలహీనమైన రుణ నియంత్రణ నిబంధనలు, నిర్వహణ తీరు సరిగ్గా లేనందున ప్రభుత్వ బ్యాంక్ల బ్రాండ్ విలువ తగ్గింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ విలువ 190 కోట్ల డాలర్లు తగ్గింది. ఆదాయ అంచనాలు బాగా లేకపోవడం, మొండి బకాయిలు బ్రాండ్ విలువ తగ్గడంలో ప్రభావం చూపాయి. భారత అగ్రశ్రేణి 100 బ్రాండ్లకు సంబంధించి బ్రాండ్ విలువ, వ్యాపార విలువకు ఉన్న నిష్పత్తి సగటున 12%గా ఉంది. కొన్ని భారీ ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నిష్పత్తి 3 శాతంగా ఉంది. -
మార్కెట్ కింగ్... టీసీఎస్ రూ. 5 లక్షల కోట్లు
ముంబై: టాటా గ్రూప్నకు చెందిన సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) స్టాక్ మార్కెట్లలో సంచలనానికి తెరలేపింది. బుధవారం ట్రేడింగ్లో షేరు బీఎస్ఈలో 2% లాభపడి రూ. 2,587 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక రికార్డు ధరకాగా, తద్వారా దేశీ కార్పొరేట్ చరిత్రలోనే తొలిసారి రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించి, కొత్త చరిత్రను సృష్టించింది. తొలిసారి 2004లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన టీసీఎస్ తొలిసారి 84 బిలియన్ డాలర్ల(రూ. 5,06,703 కోట్లు) విలువను అందుకున్న ఒక దేశీ కంపెనీగా కొత్త రికార్డును లిఖించింది. ఇందులో విశేషమేమిటంటే... దేశీ ఐటీ రంగంలో తరువాతి స్థానాల్లో ఉన్న ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రాల మొత్తం మార్కెట్ క్యాప్కంటే ఇది అధికం కావడ ం! ఇక టాటా గ్రూప్లోని ఇతర 16 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 3,06,334 కోట్లు మాత్రమే కావడం విశేషం! విశేషాలెన్నో... టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) మార్కెట్ క్యాప్లో 6% వాటాకు సమానం. దశాబ్దంక్రితం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్లో ఇది సగభాగం. 2004 జూలైలో ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాప్ సుమారు రూ. 10 లక్షల కోట్లు. 2014 మే 9 - జూలై 23 కాలంలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 83,000 కోట్లమేర పెరిగింది. 2009 మార్చిలో నమోదైన రూ. 52,700 కోట్లతో పోలిస్తే ప్రస్తుత విలువ 10 రెట్లు ఎగసింది. అక్టోబర్ 2009లో కంపెనీ సీఈవోగా ఎన్.చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టాక కంపెనీ మరింత వృద్ధి బాటలో సాగుతూ వచ్చింది. దేశీ ఐటీ సేవలకు ద్వితీయ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ కంటే టీసీఎస్ ఆదాయం 2009-10లో రూ. 7,600 కోట్లు మాత్రమే ఎక్కువ. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఆదాయం కంటే టీసీఎస్ టర్నోవర్ రూ. 20,000 కోట్లు అధికం. ఇదే విధంగా ఇన్ఫోసిస్ నికర లాభం కంటే టీసీఎస్ లాభం 2010లో రూ. 782 కోట్లు మాత్రమే అధికం. 2013-14లో ఇన్ఫోసిస్ కంటే టీసీఎస్ రూ. 8,300 కోట్లు అధికంగా నికర లాభాన్ని ఆర్జించింది. ఇన్ఫోసిస్ సిబ్బంది సంఖ్య సుమారు 1.6 లక్షలుకాగా, టీసీఎస్లో 3 లక్షలకుపైగా సిబ్బంది ఉన్నారు. విఖ్యాత మ్యాగజీన్ ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచవ్యాప్త ఇన్నోవేటివ్ దిగ్గజాల జాబితాలో టీసీఎస్కు 40వ స్థానం లభించింది. టీసీఎస్ సంగతిదీ... 2004 ఆగస్ట్ తొలి వారంలో రూ. 850 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఆగస్ట్ 25న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. వాటాదారులకు రెండుసార్లు బోనస్ షేర్లను జారీ చేసింది. 2006 జూలైలో ఒకసారి, 2009 జూన్లో మరోసారి వాటాదారుల వద్దనున్న ఒక్కో షేరుకి మరో షేరును ఫ్రీ(బోనస్)గా ఇచ్చింది. అంటే ఐపీవోలో రూ. 85,000 ఇన్వెస్ట్చేసి 100 షేర్లను కొనుగోలు చేసిఉంటే ప్రస్తుతం ఆ విలువ రూ. 11,54,800కు చేరి ఉండేది! ఎలాగంటే ఐపీవోలో లభించిన 100 షేర్లు 2006లో 200 షేర్లుగా మారి ఉండేవి. ఆపై 2009లో మరోసారి ఈ 200 షేర్లు 400 షేర్లు అయ్యేవి. వెరసి 400 షేర్లను ప్రస్తుత ధర రూ. 2,887 తో గుణిస్తే వచ్చే విలువ రూ. 11.54 లక్షలు!! కంపెనీలో ప్రమోటర్ల వాటా 74%కాగా, విదేశీ ఇన్వెస్టర్లకు వాటా 16.5%. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 64,673 కోట్లు కాగా.. నికర లాభం 18,475 కోట్లుగా నమోదైంది. టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1లోనూ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 5.5% వృద్ధి చెందగా, డాలర్ల రూపేణా 5.7% పుంజుకుంది. ఇదే కాలంలో మరో దిగ్గజం ఇన్ఫోసిస్ ఆదాయం 2% మాత్రమే వృద్ధి చూపడం గమనార్హం. సాఫ్ట్వేర్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ఈ ఏడాది ఐటీ రంగం 13-15% పురోగమించగలదని అంచనా వేసింది. ఈ బాటలో ప్రస్తుత ఏడాదికి నాస్కామ్ అంచనాలను మించిన పనితీరును చూపగలమని టీసీఎస్ ప్రకటించగా, 7-9% వృద్ధిని సాధించగలమని ఇన్ఫోసిస్ అంచనా వేసింది. తొలి క్వార్టర్లో టీసీఎస్లో ఉద్యోగుల వలస(అట్రిషన్) రేటు 12%కు చేరగా, ఇన్ఫోసిస్లో ఇది 19%పైగా నమోదైంది. గతేడాది(2013-14)లో 100 మిలియన్ డాలర్ల క్లయింట్లు 24కు చేరారు. ఇన్ఫీ 13 మంది క్లయింట్లను పొందగా, విప్రోకు 10 మంది లభించారు. దేశీ ఐటీ సర్వీసుల ఆదాయంలో కేవలం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 40% వాటాను ఆక్రమిస్తుండటం విశేషం! అయితే గతేడాది డాలర్ల రూపేణా టీసీఎస్ 16% జోరు చూపగా, ఇన్ఫీ 11.5%, విప్రో 6.4% వృద్ధిని సాధించాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి టీసీఎస్ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. టర్నోవర్లో ఉత్తర అమెరికా వాటా 53%. బ్రెజిల్, ఉరుగ్వే, చిలీ, కొలంబియా, పెరూ, అర్జెంటీనా వంటి లాటిన్ అమెరికా దేశాలలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఆఫ్రికాలో దేశాలలోనూ విస్తరణ పథంలో ఉంది. -
మార్కెట్లకు ఐటీ షేర్ల ఊతం
ఐటీ స్టాక్స్ తోడ్పాటుతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 25,641.56 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 7,663.90 వద్ద ముగిశాయి. రెండు సూచీలూ రెండు వారాల గరిష్టంలో ముగిశాయి. మలేషియా ఎయిర్లైన్స్ విమానం కూల్చివేత ఘటనతో రాజకీయమైన పరిణామాలపై ఆందోళన కారణంగా శుక్రవారం ఆసియా మార్కెట్లు బలహీనపడటం దేశీ మార్కెట్లపైనా ప్రభావం చూపింది. దీంతో, దేశీ మార్కెట్లూ బలహీనంగా ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టమైన 25,713 స్థాయిని కూడా తాకినా చివరికి 0.31 శాతం లాభంతో ముగిసింది. క్రితం రోజు ఐటీ దిగ్గజం టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలను వెల్లడించడంతో ఐటీ స్టాక్స్ బాగా లాభపడ్డాయి. టీసీఎస్ 2.58 శాతం, విప్రో 1.83 శాతం, ఇన్ఫోసిస్ 0.31 శాతం లాభాలు నమోదు చేశాయి. అటు బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సంస్థల షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. అయితే, ఈ మధ్య కాలంలో పెరుగుతూ వస్తున్న స్మాల్క్యాప్, మిడ్క్యాప్ స్టాక్స్లో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 617 పాయింట్లు పెరిగినట్లయింది. క్రూడ్ ధరలు తగ్గుతుండటం, వర్షపాతం మెరుగవుతుండటం వల్ల అధిక ద్రవ్యోల్బణ భయాలు తగ్గుముఖం పడుతుండటం వంటివి ఇందుకు దోహదపడినట్లు కోటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింటు గ్రూప్ రీసెర్చ్ దీపేన్ షా తెలిపారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 574 కోట్ల కొనుగోళ్లు జరపగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 283 కోట్ల మేర విక్రయించారు. రూ. 5,000 కోట్ల సమీకరణలో హిందాల్కో న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్ తాజాగా రూ. 5,000 కోట్ల మేర నిధులను సమీకరించనుంది. సంస్థలకు ఈక్విటీ షేర్లు, బాండ్లు జారీ ద్వారా గానీ లేదా ఇతర మార్గాల్లో గానీ సమీకరించే ప్రతిపాదనను డెరైక్టర్ల బోర్డు ఆమోదించిందని కంపెనీ తెలిపింది. ఆగస్టు 14న జరిగే సమావేశంలో దీనికి షేర్హోల్డర్ల అనుమతి పొందనున్నట్లు వివరించింది. హిందాల్కో ప్రధానంగా అల్యూమినియం, కాపర్ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద అల్యూమినియం రోలింగ్ కంపెనీ ఇది. -
ఫేస్బుక్తో తగ్గుతున్న హైరింగ్ భారం
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 55 వేల మందికి ఉద్యోగాలివ్వనున్నది. ఇప్పటికే 25 వేల మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చామని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ అజోయ్ ముఖర్జీ చెప్పారు. టైర్-వన్, టైర్-టూ నగరాల నుంచే ఈ సారి హైరింగ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇక హైరింగ్ విషయంలో ఫేస్బుక్, లింక్డెన్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వలన తమపై భారం తగ్గుతోందని వివరించారు. వీటి ద్వారా నేరుగా అభ్యర్ధులను ఎంపిక చేసుకుంటున్నామని, ఫలితంగా ఇతర నియామక ఏజెన్సీలపై ఆధారపడడం తగ్గుతోందని తెలిపారు. మూణ్నెళ్లలో కొలువులే... కొలువులు: మ్యాన్పవర్ సర్వే కాగా వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడటంతో భారత కంపెనీలు భారీగా ఉద్యోగాలివ్వనున్నాయి. రానున్న మూడు నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియలు జోరుగా చేపట్టాలని ఆ కంపెనీలు యోచిస్తున్నాయని ప్రముఖ హెచ్ఆర్ సంస్థ మ్యాన్పవర్ రూపొందించిన ద మ్యాన్వపర్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ సర్వే వెల్లడించింది. మొత్తం 5,389 కంపెనీలపై నిర్వహించిన ఈ తాజా సర్వే వివరాలు.., - స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడి ఇప్పటికే కొన్ని రంగాల్లో హైరింగ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. - జూలై-సెప్టెంబర్ కాలానికి భారీ స్థాయిలోనే ఉద్యోగాలివ్వగలమని కంపెనీలు భావిస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే హైరింగ్ అవుట్లుక్ 46 శాతం అధికంగా ఉంది. - భారత్, తైవాన్, టర్కీ, న్యూజిలాండ్, సింగపూర్ కంపెనీలు ఉద్యోగ కల్పన పట్ల పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఇటలీ, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాల కంపెనీలు మాత్రం ఏమంత ఆశావహంగా లేవు. -
ఐటీ సేవల మార్కెట్ అంతంతే
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల మార్కెట్ ఆశించిన దానికంటే తక్కువ వృద్ధిని సాధిస్తోందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది. గత ఏడాది జూలై-డిసెంబర్ కాలానికి భారత ఐటీ సర్వీసుల మార్కెట్ 6.5 శాతం వృద్ధితో రూ.2.56 లక్షల కోట్లకు పెరిగిందని ఈ సంస్థ వెల్లడించింది. మౌలిక రంగంపై ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు తక్కువగా వ్యయం చేయడం, వివిధ వాణిజ్య సంస్థలు టెక్నాలజీ బడ్జెట్పై ఆచి తూచి వ్యవహరించడం దీనికి ప్రధాన కారణాలని వివరించింది. ఐడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం... గత ఏడాది రెండో అర్థ భాగంలో సపోర్ట్ సర్వీసులు 5.5 % వృద్ధి సాధించాయి. వివిధ కంపెనీలు వ్యయ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది. సిస్టమ్ ఇంటిగ్రేషన్ 6.8 శాతం, ఐటీ కన్సల్టింగ్ సర్వీసులు 6.3 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. గత ఏడాది జనవరి-జూన్ కాలం వృద్ధితో పోల్చితే ఇది తక్కువే. అవుట్ సోర్సింగ్ సర్వీసుల మార్కెట్ వృద్ధి స్వల్పంగా తగ్గి 7.1 శాతానికే పరిమితమైంది. మేనేజ్డ్ సర్వీసుల మార్కెట్ స్వల్పంగా వృద్ధి సాధించింది. ఐటీ సర్వీసుల మార్కెట్లో 12 శాతం వాటాతో ఐబీఎం మొదటి స్థానంలో నిలిచింది. 7.4 శాతం మార్కెట్ వాటాతో విప్రో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది జూలై-డిసెంబర్ కాలంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, తయారీ, టెలికాం, ప్రభుత్వ రంగాలు... ఐటీ సర్వీసులపై పెద్ద ఎత్తున దృష్టి సారించాయి. -
హెచ్సీఎల్ టెక్ భేష్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ జవనరి-మార్చి(క్యూ3)లో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. నికర లాభం 59% ఎగసి రూ. 1,624 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 1,021 కోట్లను మాత్రమే ఆర్జించింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. ఇక ఇదే కాలానికి ఆదాయం కూడా దాదాపు 30% పుంజుకుని రూ. 8,349 కోట్లకు చేరింది. గతంలో రూ. 6,430 కోట్లు నమోదైంది. ఇక డాలర్ల రూపేణా చూస్తే... నికర లాభం 40% వృద్ధితో 26.42 కోట్ల డాలర్లకు చేరగా, 14% అధికంగా 136 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, త్రైమాసిక ప్రాతిపదికన కూడా 3% స్థాయిలో వృద్ధిని చూపగలిగినట్లు హెచ్సీఎల్ టెక్ ప్రెసిడెంట్ అనంత్ గుప్తా చెప్పారు. వరుసగా 10వ క్వార్టర్లో మార్జిన ్లను పెంచుకోగలిగినట్లు తెలిపారు. అక్టోబర్-డిసెంబర్(క్యూ2) కాలంతో పోలిస్తే క్యూ3లో నికర లాభం 8.5% పుంజుకోగా, ఆదాయం 2% వృద్ధిని సాధించినట్లు వివరించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సేవలను అందించడం ద్వారా కాంట్రాక్ట్లను పెంచుకున్నట్లు కంపెనీ సీఎఫ్వో అనిల్ చనానా చెప్పారు. సాధారణ, పాలనా సంబంధ వ్యయాలను కట్టడి చేయడం ద్వారా మార్జిన్లను 15.9% నుంచి 19.4%కు మెరుగుపరచుకున్నట్లు తెలిపారు. ఇతర విశేషాలివీ... వాటాదారులకు షేరుకి రూ. 4 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. క్యూ3లో స్థూలంగా 8,291 మందికి ఉద్యోగాలను కల్పించగా, నికరంగా 1,858 మంది మిగిలారు. మార్చి చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 90,190గా నమోదైంది. 50 మిలియన్ డాలర్లు, 30 మిలియన్ డాలర్ల విభాగంలో కొత్తగా ఇద్దరేసి చొప్పున క్లయింట్లను పొందింది. నగదు, తత్సమాన నిల్వల విలువ దాదాపు రూ. 1,046 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ఇంట్రాడేలో 3% ఎగసి గరిష్టంగా రూ.1,455ను తాకింది. చివరికి 1% లాభంతో రూ. 1,424 వద్ద ముగిసింది. -
టీసీఎస్.... జోష్ !
క్యూ4, పూర్తి ఏడాది ఫలితాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించడమే కాకుండా, పోటీ కంపెనీలకంటే మార్కెట్ పరిమాణాన్ని పెంచుకోగలిగాం. గడిచిన 12 నెలల్లో యూరప్లోని కొత్త మార్కెట్లలో మరింతమంది కస్టమర్లను సంపాదించడమే కాకుండా, వ్యాపారాన్ని కూడా భారీగా విస్తరించాం. డిజిటల్ టెక్నాలజీలతో పాటు మేం పెడుతున్న వ్యూహాత్మక పెట్టుబడులు కొత్త మార్కెట్లలో తాజా ధోరణులను అందిపుచ్చుకోవడంతోపాటు మాకు మరింత విలువను చేకూర్చిపెడుతున్నాయి. విభిన్న పారిశ్రామిక విభాగాలు, మార్కెట్లు అన్నింటినుంచీ రాబోయే ఏడాది కాలంలో మరిన్ని వ్యాపారావకాశాలను చేజిక్కించుకోగలమన్న విశ్వాసం ఉంది. - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ ముంబై: దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ మెరుగైన ఫలితాలతో ఆకట్టుకుంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2013-14, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.5,358 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.3,616 కోట్లతో పోలిస్తే(వార్షిక ప్రాతిపదికన) 48.2 శాతం ఎగబాకింది. ప్రధానంగా యూరప్, ఆసియా పసిఫిక్ మార్కెట్ల నుంచి ఆదాయాల వృద్ధి, డిజిటల్ టెక్నాలజీల్లో పెట్టుబడుల ఆసరాతో రాబడులు జోరందుకునేం దుకు దోహదపడ్డాయని కంపెనీ పేర్కొంది. కాగా, మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా క్యూ4లో 31.2% వృద్ధి చెంది రూ. 21,551 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.16,430 కోట్లు మాత్రమే. సీక్వెన్షియల్గా... 2013-14 మూడో త్రైమాసికం(క్యూ3)లో నమోదైన రూ.5,333 కోట్లతో పోలిస్తే క్యూ4లో నికర లాభం స్వల్పంగా 0.5 శాతం వృద్ధి సాధించింది. ఆదాయం రూ.21,294 కోట్లతో పోలిస్తే 1.2 శాతం పెరిగింది. కాగా, మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు క్యూ4లో రూ.5,175 కోట్ల నికర లాభం, రూ.21,600 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా, దీనికి అనుగుణంగానే ఆకర్షణీయమైన పనితీరును టీసీఎస్ నమోదు చేయడం గమనార్హం. దేశీ ఐటీ దిగ్గజాల్లో రెండో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్తో పోలిస్తే అన్నివిధాలుగా టీసీఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తి ఏడాదికి ఇలా... 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం రూ.19,164 కోట్లకు ఎగసింది. 2012-13లో నమోదైన రూ.13,917 కోట్లతో పోలిస్తే 37.69 శాతం వృద్ధిని సాధించింది. ఇక మొత్తం ఆదాయం 29.87 శాతం పెరుగుదలతో రూ.62,989 కోట్ల నుంచి రూ.81,809 కోట్లకు వృద్ధి చెందింది. ఫలితాల్లో ఇతర ప్రధానాంశాలు... గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.20 చొప్పున తుది డివిడెండ్ను ప్రకటించింది. దీంతో పూర్తి ఏడాదికి మొత్తం డివిడెండ్ రూ.32కు చేరింది. డాలరు రూపంలో చూస్తే ఆదాయం క్యూ4లో వార్షిక ప్రాతిపదికన 16.2% వృద్ధితో 13.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నికర లాభం 22.9% పెరిగి 3.1 బిలియన్ డాలర్లకు చేరింది. అన్ని వ్యాపార రంగాల నుంచి వ్యాపారంలో రెండంకెల వృద్ధిని కంపెనీ సాధించింది. ప్రధానంగా రిటైల్, తయారీ, లైఫ్సెన్సైస్-హెల్త్కేర్, బీఎస్ఎఫ్ఐ(బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సర్వీసెస్) రంగాలు టాప్లో నిలిచినట్లు కంపెనీ సీఎఫ్ఓ రాజేశ్ గోపీనాథన్ వివరించారు. క్యూ4లో కంపెనీ అన్ని వ్యాపార రంగాల్లో కలిపి కొత్తగా 9 భారీ కాంట్రాక్టులను చేజిక్కించుకుంది. బుధవారం టీసీఎస్ షేరు ధర బీఎస్ఈలో 2.51% నష్టపోయి రూ.2,195 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
క్యూ4 అంతంతే: టీసీఎస్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్(జనవరి-మార్చి’14)లో ఫలితాలు అంత ప్రోత్సాహకరంగా ఉండబోవని సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తెలిపింది. మరో సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం క్యూ4 ఫలితాలకు సంబంధించి ఇప్పటికే ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజా వ్యాఖ్యలతో బీఎస్ఈలో టీసీఎస్ షేరు దాదాపు 4% పతనమై రూ. 2,041 వద్ద ముగిసింది. ఒక దశలో 5%పైగా దిగజారి రూ. 2,015కు కూడా చేరింది. ఇది మూడు నెలల కనిష్టంకాగా, కంపెనీ మార్కెట్ విలువలో రూ. 16,000 కోట్లు ఆవిరైంది. కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ. 3.99 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈ బాటలో ఇన్ఫోసిస్ షేరు సైతం 2.3% క్షీణించి రూ. 3,271 వద్ద ముగిసింది. సాధారణమే... అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంతో పోలిస్తే ప్రస్తుతం నడుస్తున్న క్యూ4లో ఫలితాలు బలహీనంగా ఉండవచ్చునని టీసీఎస్ యాజమాన్యం వెల్లడించింది. ఇందుకు అధిక సెలవులు కారణంకాగా, సహజంగానే సాఫ్ట్వేర్ కంపెనీల నాలుగో క్వార్టర్ ఫలితాలు అంత ప్రోత్సాహకరంగా ఉండవని వ్యాఖ్యానించింది. యూరప్లో మంచి వృద్ధిని సాధిస్తున్నప్పటికీ అమెరికా, యూకే మార్కెట్లలో సగటు వృద్ధి నమోదవుతున్నట్లు వివరించింది. ఇక దేశీయ మార్కెట్లలో మందగమనం కొనసాగుతున్నదని, క్షీణత నమోదుకావచ్చునని వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3లో కంపెనీ నికర లాభం 50%పైగా ఎగసి రూ. 5,333 కోట్లకు చేరిన విషయం విదితమే. ఇదే కాలంలో ఆదాయం కూడా 32.5% జంప్ చేసి రూ. 21,294 కోట్లను తాకింది. కాగా, ప్రాజెక్ట్లు రద్దుకావడం, డిమాండ్ మందగించడం వంటి కారణాల వల్ల సమీప కాలానికి పనితీరు బలహీనపడే అవకాశమున్నదని ఇన్ఫోసిస్ సీఈవో ఎస్డీ సిబూలాల్ గత వారమే పేర్కొన్నారు. దీంతో ఇన్ఫోసిస్ షేరు 9% పడింది కూడా. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2014-15) ప్రోత్సాహకర ఫలితాలను సాధించగలమంటూ టీసీఎస్ యాజమాన్యం నమ్మకాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇందుకు క్లయింట్ల వ్యయాలు పెరుగుతుండటం దోహదపడగలదని తెలిపింది. మీడియా, లైఫ్సైన్స్ విభాగాలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తుండగా, బీఎఫ్ఎస్ఐ, రిటైల్, తయారీ, టెలికం సైతం సగటు వృద్ధిని సాధించగలవని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇక కరెన్సీకి సంబంధించి పెద్ద ప్రభావం ఉండబోదని అభిప్రాయపడింది. ఇటీవల సాఫ్ట్వేర్ షేర్లలో వచ్చిన పటిష్టమైన ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపడుతున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. మార్చి ముగియనుండటంతో లాభాల స్వీకరణ ధ్యేయంతో అమ్మకాలు పెరుగుతున్నాయని తెలిపారు. -
టీసీఎస్.. భేష్!
ముంబై: భారత్లో అగ్రశ్రేణి ఐటీ కంపెనీ టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలతో ఆకట్టుకుంది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం డిసెంబర్తో ముగిసిన మూడో క్వార్టర్(2013-14; క్యూ3)లో 50.3 శాతం దూసుకెళ్లి... రూ.5,333 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.3,550 కోట్లుగా ఉంది. కాగా, మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా రూ.16,070 కోట్ల నుంచి రూ.21,294 కోట్లకు ఎగబాకింది. 32.5% వృద్ధి చెందింది. యూరప్లో వ్యాపారం పుంజుకోవడం... లైఫ్సెన్సైస్, టెలికం, తయారీ రంగం తదితర విభాగాల్లో మెరుగైన పనితీరు మూడో క్వార్టర్లో జోరుకు దోహదం చేసింది. బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు టీసీఎస్ క్యూ3లో సగటున రూ. 5,179 కోట్ల లాభాన్ని రూ. 21,373 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. సీక్వెన్షియల్గానూ... ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్(క్యూ2-రూ.4,633 కోట్లు)తో పోల్చినా కూడా(సీక్వెన్షియల్గా) క్యూ3 నికర లాభంలో 15.1% వృద్ధి నమోదవడం విశేషం. ఆదాయం మాత్రం 1.5% స్వల్పంగా పెరిగింది. క్యూ2లో ఆదాయం రూ.20,977 కోట్లుగా ఉంది. ఇతర ముఖ్యాంశాలివీ... డిసెంబర్తో ముగిసిన క్వార్టర్కు గాను టీసీఎస్ రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. 2013-14లో వరుసగా మూడో క్వార్టర్లోనూ మధ్యంతర డివిడెండ్ ఇవ్వడం విశేషం. కాగా, దీనికి ఈ నెల 28ని రికార్డు తేదీగా నిర్ణయించింది. కంపెనీ నిర్వహణ మార్జిన్లు 29.7 శాతంగా నమోదయ్యాయి. 8 బడా డీల్స్ కుదిరాయి. ఇందులో 2 కోట్ల డాలర్ల విలువైన 4 కాంట్రాక్టులు, 5 కోట్ల డాలర్ల 2 కాంట్రాక్టులున్నాయి. మరిన్ని ఉద్యోగాలు... ఐటీ సేవలకు డిమాండ్ పుంజుకుంటుండటంతో టీసీఎస్ మరిన్ని ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈ ఏడాది(2013-14)లో నియామకాల లక్ష్యం 50 వేలు కాగా, దీనికి మరో 5 వేల మందిని జోడించనున్నట్లు కంపెనీ గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ ప్రకటించారు. ఇదిలాఉండగా... క్యూ3లో స్థూలంగా 14,663 మంది ఉద్యోగులను టీసీఎస్ జతచేసుకుంది. అయితే, 9,200 మంది సిబ్బంది కంపెనీని వీడటంతో నికరంగా 5,463 మంది జతయ్యారు. డిసెంబర్ చివరినాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,90,713కు చేరింది. జోరు ఎందుకంటే.. ఈ ఏడాది క్యూ3లో కంపెనీ ఫలితాలు చాలా బాగున్నాయి. మా సేవలకు అంతర్జాతీయంగా ఐటీకి పటిష్టమైన డిమాండ్, కాంట్రాక్టుల నిర్వహణలో క్రమశిక్షణే ఈ మెరుగైన వృద్ధికి కారణం. తక్కువ ఫారెక్స్ నష్టాలు, మార్జిన్లు అంచనాల కంటే ఎక్కువగా నమోదవడం కూడా లాభాలను పెంచాయి. వచ్చే ఏడాది (2014-15)లో మా రాబడులు కూడా మరింత జోరందుకోవచ్చు. - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ టీసీఎస్ షేరు ధర గురువారం బీఎస్ఈలో రూ. 2.90 స్వల్ప నష్టంతో రూ. 2,351.35 వద్ద ముగిసింది. ఒకానొక దశలో రూ. 2,380 గరిష్టాన్ని తాకింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
హైదరాబాద్లో భారీ సాఫ్ట్వేర్ డెలివరీ సెంటర్
హైదరాబాద్: సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) హైదరాబాద్లోని ఆదిభట్లలో భారీ సాఫ్ట్వేర్ డెలివరీ సెంటర్ని ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇది మొదలు కావొచ్చని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయేంద్ర ముఖర్జీ తెలిపారు. 79 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ సెంటర్లో సుమారు 26,000 మంది ఉద్యోగులు ఉండగలరని పేర్కొన్నారు. అయితే, దీనిపై ఎంత పెట్టుబడి పెడుతున్నదీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వివిధ డెలివరీ సెంటర్లలో 24,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారని ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా టీసీఎస్లో 27,000 మంది ఉద్యోగులు చేరారని, మిగతా వ్యవధిలో మరో 23,000 మంది చేరొచ్చని ముఖర్జీ పేర్కొన్నారు. మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25,000 మందిని తీసుకోవచ్చని, ఇందులో సుమారు 75% మంది చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్లకు సంబంధించి వచ్చే ఏడాది దాదాపు 3,000-3,500 దాకా ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందన్నారు. -
క్యాంపస్ కొలువులు... పాతిక వేలు: టీసీఎస్
బెంగళూరు: సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంస్థ క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 25 వేల ఉద్యోగాలివ్వనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా 25 వేలమందికి ఉద్యోగాలివ్వగలమని టీసీఎస్ అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టామని కంపెనీ ఈవీపీ అండ్ గ్లోబల్ హెడ్ (హ్యూమన్ రిసోర్సెస్) అజోయ్ ముఖర్జీ చెప్పారు. వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికైన అభ్యర్థులు జూలై నుంచి ఉద్యోగాలు చేస్తారని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీన్ని సాధించగలమన్నారు. ఈ సంఖ్య పెంపు/తగ్గింపుపై త్వరలోనే సమీక్షిస్తామని తెలిపారు. ఆట్రీషన్ తక్కువ..: చాలా కంపెనీల్లాగా తాము ఉద్యోగాలివ్వడాన్ని వాయిదా వేయబోమని చెప్పారు. ఏ ఆర్థిక సంవత్సరంలో నియామకాలు నిర్వహిస్తామో, అదే ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలిస్తామని అజోయ్ ముఖర్జీ వివరించారు. ట్రైనీలుగా చేరేవారికి ఏడాదికి రూ.3.15-3.25 లక్షల వేతనం ఇస్తామని తెలిపారు. గత నాలుగేళ్లుగా ఫ్రెషర్స్కు ఇదే స్థాయిలో వేతనాలిస్తున్నామని, దీన్ని మార్చితే మొత్తం వేతన విధానాన్ని సమూలంగా మార్చాల్సి వస్తుందని వివరించారు. ఆట్రీషన్(ఉద్యోగుల వలస) తమ కంపెనీలో తక్కువగా ఉందని, కంపెనీని వదిలిపోకుండా ఉన్న ఉద్యోగుల సంఖ్య విషయంలో తామే అగ్రస్థానంలో ఉన్నామని వివరించారు. మార్కెట్ మొత్తం అస్తవ్యస్తంగా ఉండడం, డిమాండ్ కూడా తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు. -
సౌదీలో టీసీఎస్ మహిళా బీపీవో సెంటర్
రియాద్: దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్... పూర్తిగా మహిళలు పనిచేసే బీపీవో సెంటర్ను సౌదీ అరేబియా లో ప్రారంభించింది. జీఈ, సౌదీ ఆరామ్కో భాగస్వామ్యంతో ఈ మహిళా బీపీవోను ఏర్పాటు చేశామని టీసీఎస్ పేర్కొంది. గల్ఫ్లో 3,000 ఉద్యోగాలను ఈ సెంటర్ కల్పిస్తుందని తెలి పింది. సౌదీ ఆరామ్కో కేంద్ర కార్యాలయం దహ్రన్లో దీన్ని ఏర్పాటు చేశామని పేర్కొంది. ఈ ప్రాంత మహిళలకు మంచి కెరీర్ను అందించడానికి సౌదీ ఆరామ్కో, జీఈలతో కలిసి ఈ సెం టర్ను నెలకొల్పడం సంతోషంగా ఉందని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ వ్యాఖ్యానించారు. -
టాటా గ్రూప్ : రూ.6 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకూ భిన్న రకాల ఉత్పత్తులను అందించే దిగ్గజ గ్రూప్ ‘టాటా’... రూ. 6 లక్షల కోట్ల మార్కెట్ విలువకు చేరువైంది. తద్వారా తొలిసారి ఈ ఘనత సాధించిన దేశీయ గ్రూప్గా రికార్డు సృష్టించనుంది. గ్రూప్లో మొత్తం 100 కంపెనీలుండగా, 32 మాత్రమే స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసేసరికి గ్రూప్లోని మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 5.90 లక్షల కోట్లకు చేరింది. ఇందుకు ప్రధానంగా గ్రూప్లోని సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ చేయందించింది. ఓవైపు స్టాక్ మార్కెట్లు నష్టాలతో విలవిల్లాడుతున్నప్పటికీ టీసీఎస్ షేరు ఏడాది కాలంలో 50%కు మించి దూసుకెళ్లింది. దీంతో టీసీఎస్ మార్కెట్ విలువ దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరింది! వెరసి ఈ స్థాయి విలువను సాధించిన రెండో దేశీయ కంపెనీగా నిలిచింది. గతంలో ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే ఈ కిరీటాన్ని అందుకుంది. కాగా, ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఆర్ఐఎల్తో కూడిన ముకేశ్ అంబానీ గ్రూప్ విలువ కేవలం రూ. 2.75 లక్షల కోట్లకు పరిమితంకావడం గమనార్హం. ఇక మూడో ర్యాంక్లో నిలుస్తున్న కుమార మంగళం బిర్లా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 1.5 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్లకు ఎదురీదుతూ: గత మూడు నెలల్లో స్టాక్ మార్కెట్ల విలువ 10% క్షీణించగా, టాటా గ్రూప్ విలువ 15%(రూ. 80,000 కోట్లు) పుంజుకోవడం చెప్పుకోదగ్గ అంశం! గ్రూప్లోని మిగిలిన ప్రధాన దిగ్గజాల మార్కెట్ విలువ ఇలా ఉంది. టాటా మోటార్స్ విలువ రూ. 90,000 కోట్లుకాగా, టాటా స్టీల్ రూ. 27,000 కోట్లు, టైటన్ ఇండస్ట్రీస్ రూ. 20,000 కోట్లు, టాటా గ్లోబల్ బెవరేజెస్ మార్కెట్ క్యాప్ రూ. 8,600 కోట్లు. గ్రూప్లో ఇంకా టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా కమ్యూనికేషన్స్, ర్యాలీస్ ఇండియా, టాటా కాఫీ, వోల్టాస్, టాటా కెమికల్స్ తదితరాలున్నాయి. గ్రూప్ మొత్తంలో ఒక్క టీసీఎస్ విలువే దాదాపు ముప్పావు వంతు కావడం విశేషం. స్టాక్ ఎక్స్ఛేంజీలలో 2004 ఆగస్ట్ 25న టీసీఎస్ లిస్టయ్యాక టాటా గ్రూప్ విలువ తొలిసారి రూ. లక్ష కోట్లను అధిగమించింది. అప్పటికి లిస్టెడ్ కంపెనీల సంఖ్య 28గా ఉంది. 1991లో 18 లిస్టెడ్ కంపెనీలతో టాటా గ్రూప్ విలువ రూ.8,000 కోట్లే. గ్రూప్ మార్కెట్ విలువలో అప్పటికి టాటా స్టీల్దే అగ్రస్థానం! -
వారం రోజుల గరిష్టానికి సూచీలు
ఆసియా మార్కెట్ల జోరు కొనసాగడంతో వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ సూచీలు ర్యాలీ జరిపాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 19, 230 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 283 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించింది. మూడురోజుల్లో సూచీ 500 పాయింట్ల మేర ర్యాలీ జరిపింది. 5,600 సమీపంలో మొదలైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 87 పాయింట్ల పెరుగుదలతో 5,699 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రూపాయి క్షీణత నేపథ్యంలో ఐటీ, ఫార్మా షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. సూచీల్లో 8 శాతంపైగా వెయిటేజీ వున్న ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 2.6 శాతం ర్యాలీ జరిపి 52 వారాల గరిష్టస్థాయి వద్ద ముగిసింది. విప్రో కూడా 3 శాతం పెరుగుదలతో 52 వారాల గరిష్టస్థాయి వద్ద ముగియగా, టెక్ మహీంద్రా 5 శాతం ర్యాలీ జరిపి ఐదేళ్ల గరిష్టస్థాయి వద్ద క్లోజయ్యింది. రియల్టీ, బ్యాంకింగ్ షేర్లకూ కొనుగోలు మద్దతు లభించింది. నిఫ్టీ కాంట్రాక్టుల్లో షార్ట్ కవరింగ్... ఇటీవలి ర్యాలీ నేపథ్యంలో నిఫ్టీ ఫ్యూచర్, కాల్ ఆప్షన్ కాంట్రాక్టుల్లో భారీగా షార్ట్ కవరింగ్ జరిగింది. నిఫ్టీ ఆగస్టు ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి ఒక్కసారిగా 8.48 లక్షల షేర్లు (5.5 శాతం) కట్ అయ్యాయి. దాంతో ఓఐ 1.38 కోట్లకు తగ్గింది. అలాగే 5,500, 5,600 స్ట్రయిక్స్ వద్ద పెద్ద ఎత్తున కాల్ కవరింగ్ జరిగింది. ఈ కాల్ ఆప్షన్స్ నుంచి వరుసగా 8.33 లక్షలు, 5.27 లక్షల చొప్పున షేర్లు కట్ అయ్యాయి. 5,700 స్ట్రయిక్ వద్ద మాత్రం స్వల్పంగా కాల్ రైటింగ్ జరగడంతో 1.80 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. అదే సమయంలో 5,500, 5,600, 5,700 స్ట్రయిక్స్ వద్ద భారీగా పుట్ రైటింగ్ జరిగింది. ఈ పుట్ ఆప్షన్లలో వరుసగా 4.63 లక్షలు, 12.78 లక్షలు, 6.31 లక్షల షేర్ల చొప్పున పుట్ బిల్డప్ జరిగింది. సమీప భవిష్యత్తులో సూచీ ఫలానా స్థాయి దిగువకు తగ్గదన్న అంచనాలతో ఇన్వెస్టర్లు పుట్ ఆప్షన్లను విక్రయించడంవల్ల ఈ తరహా పుట్ బిల్డప్ జరుగుతుంది.