US Congress
-
నాన్సీపై సైకత్ పోటీ
వాషింగ్టన్: అమెరికా హౌస్ మాజీ స్పీకర్, 21వసారి కాంగ్రెస్కు పోటీ పడుతున్న నాన్సీ పెలోసీ(85)కి భారత సంతతికి చెందిన యువ రాజకీయ నేత నుంచి అనూహ్యంగా గట్టి పోటీ ఎదురవనుంది. శాన్ఫ్రాన్సిస్కో కంగ్రెషనల్ స్థానానికి డెమోక్రాటిక్ పార్టీ తరఫున పెలోసీపై పోటీ చేయనున్నట్లు సైకత్ చక్రవర్తి ప్రకటించారు. పురుషాధిక్యత కలిగిన అమెరికా రాజకీయాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని నాయకురాలిగా పెలోసీ కొనసాగుతున్నారు. 2026 నవంబర్లో జరిగే ఎన్నికకు మళ్లీ ఎన్నికయ్యేందుకు ఆమె ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఆమె ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ప్రతినిధుల సభలో సభ్యురాలిగా 2027 జనవరి వరకు పెలోసీ కొనసాగుతారు. ఈ పదవికి 2026 నవంబర్లో ఎన్నిక జరగనుంది. అదే సమయంలో డెమోక్రాటిక్ ప్రైమరీకి 2026 ఆరంభంలో ఎన్నిక నిర్వహిస్తారు.శాన్ఫ్రాన్సిస్కో డెమోక్రాట్లకు కంచుకోట వంటిది. ప్రైమరీలో గెలుపొందిన వారే భవిష్యత్తులో ప్రతినిధుల సభకు ఎన్నికయ్యే అవకాశాలెక్కువ. ‘నాన్సీ పెలోసీ మరోసారి పోటీ చేయనున్నారని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోవడం ఖాయం. కానీ, ఇది ఆమెకు 21వ సారి. 45 ఏళ్ల క్రితం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి అమెరికాకు ఇప్పటికి ఎంతో తేడా ఉంది. డెమోక్రాటిక్ పార్టీ కొత్త నాయకత్వాన్ని కోరుకుంటోందన్నది సుస్పష్టం. అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ ల పాలన చూసి ప్రజలు ప్రత్నామ్నాయం కోరుకుంటున్నారు. అందుకే నాన్సీ పెలోసీపై ఈసారి బరిలోకి దిగాలనుకుంటున్నా’అని సైకత్ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పెద్దపెద్ద దాతలిచ్చే విరాళాల కంటే ఓటర్లతో మమేకం అయ్యేందుకు కృషి చేస్తానన్నారు. ఎవరీ సైకత్ చక్రవర్తి? 1986లో టెక్సాస్లో బెంగాలీ కుటుంబంలో జని్మంచిన సైకత్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 2007లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా సిలికాన్ వ్యాలీలో కొంతకాలం పనిచేశారు. 2015లో సెనేటర్ బెర్నీ శాండర్స్ అధ్యక్ష ప్రచార కమిటీలో సేవలందించారు. దీంతోపాటు రాజకీయ సలహాదారుగా డెమోక్రాటిక్ పారీ్టకి చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో– కార్టెజ్కు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా గతంలో వ్యవహరించారు. 2018లో కాంగ్రెస్కు పిన్న వయస్సులోనే గెలిచిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె గెలుపులో సైకత్ కీలకంగా ఉన్నారు. శాన్ఫ్రాన్సిస్కో నుంచి నాలుగు దశాబ్దాలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న నాన్సీ వయోభారంతోపాటు ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. ఈ నేపథ్యంలో యువ రాజకీయ కెరటం సైకత్ రంగ ప్రవేశం నాన్సీ పెలోసీపై ఒత్తిడి పెంచనుంది.అమెరికా చరిత్రలోనే హౌస్ స్పీకర్గా ఎన్నికైన తొలి మహిళ నాన్సీ పెలోసీ. కాంగ్రెస్ ప్రతినిధిగా సుదీర్ఘకాలంలో ఎందరో అధ్యక్షులు తీసుకువచి్చన చట్టాలకు మద్దతివ్వడం లేదా తిరస్కరించడంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షుల తర్వాత మూడో శక్తివంతమైన పదవి హౌస్ స్పీకర్. -
చట్టసభల్లో ట్రంప్ తొలి విజయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయం సాధించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమెరికా కాంగ్రెస్లో ఆమోదం పొందింది. దీంతో అక్రమ వలసదారులపై చర్యలకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది. అలాగే రెండో దఫా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా ఆయన సంతకంతో చట్టం రూపం దాల్చిన తొలి బిల్లు కూడా ఇదే అయ్యింది.లేకెన్ రిలే యాక్ట్ (Laken Riley Act) పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం.. దొంగతనాలు, దొపిడీలు ఇతరత్రా చిన్నచిన్న నేరాల్లో శిక్ష పడిన, లేదంటే అలాంటి కేసులు ఉన్న అక్రమ వలసదారుల్ని ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ICE) కచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. వీలైతే వాళ్లను తిరిగి వెనక్కి పంపించేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే.. ఫెడరల్ ప్రభుత్వంపై దావాలు వేసే హక్కును స్టేట్ అటార్నీ జనరల్కు ఉంటుంది. ఈ చట్టాన్ని కిందటి ఏడాది రూపకల్పన చేశారు. తొలి నుంచి రిపబ్లికన్లు ఈ చట్టానికి మద్ధతుగా నిలవగా, డెమోక్రటిక్ పార్టీ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది.ఆ ఏడాది జనవరి 3వ తేదీన 119వ అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 7వ తేదీన ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో ఇది 264-159తో ఆమోదం పొందింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యులంతా బిల్లుకు మద్ధుతగా ఓటేయగా, డెమోక్రటిక్(Democrtic Party) సభ్యుల్లో 48 మంది మద్దతు ప్రకటించారు. జనవరి 20వ తేదీన సవరణతో కూడిన బిల్లుకు సెనేట్ ఆమోదం లభించింది. దీనికి 12 మంది రిబ్లికన్లు సైతం మద్దతుగా ఓటేశారు. చివరకు.. జనవరి 22వ తేదీన బిల్లు పాసైనట్లు హౌజ్ ప్రకటించింది.అయితే.. లేకెన్ రిలే యాక్ట్ కిందటి ఏడాది మార్చి 27నే ప్రతినిధుల సభ ఆమోదం పొందింది. కానీ, సెనేట్లో డెమోక్రటిక్ సభ్యుల అభ్యంతరాలతో అది ఆచరణకు నోచుకోలేదు.అమెరికా జార్జియా స్టేట్ ఏథెన్లో కిందటి ఏడాది ఫిబ్రవరి 22న 22 ఏళ్ల వైద్య విద్యార్థిని లేకెన్ రిలే(Laken Riley) దారుణంగా హత్యకు గురైంది. వెనిజులా నుంచి అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన జోస్ ఆంటోనియా ఇబర్రా(26).. ఉదయం జాగింగ్కు వెళ్లిన లేకెన్ను దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో దోషిగా తేలిన సదరు అక్రమవలసదారుడికి పెరోల్ లేకుండా జీవితఖైదు విధించింది న్యాయస్థానం. అయితే సదరు వ్యక్తిపై గతంలో ఓ కేసు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్ మాత్రం జరగలేదు. ఆనాడు అరెస్ట్ అయ్యి ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. అలాగే నేరాలకు పాల్పడే అక్రమ వలసదారులకు ఇమ్మిగ్రేషన్ చట్టాలు కల్పిస్తున్న రక్షణ ఆ టైంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం కోరుతూ విద్యార్థులంతా ఆందోళనబాట పట్టడంతో.. ట్రంప్ అప్పటి నుంచి ఈ చట్టానికి మద్దతు చెబుతూ వచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్ మీద కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు -
పాక్కు సాయం ఆపండి
ఇస్లామాబాద్: అమెరికా అందిస్తున్న భారీ ఆర్థిక సాయాన్ని మానవ హక్కుల ఉల్లంఘనకు పాకిస్తాన్ వినియోగిస్తోందని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాక్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగి రాజ్యాంగబద్ధమైన రీతిలో ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఆ దేశానికి ఎలాంటి ఆర్థిక సాయమూ అందించొద్దని అధ్యక్షుడు జో బైడెన్కు విజ్ఞప్తి చేశారు. ఇలాన్ ఒమర్తో పాటు మరో 10 మంది కాంగ్రెస్ సభ్యులు ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్కు లేఖ రాశారు. దైవ దూషణ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం తదితర చర్యలకు పాక్ పాల్పడుతున్న వైనాన్ని అందులో ప్రస్తావించారు. ‘‘ఇవన్నీ పాక్లోని మతపరమైన మైనారిటీలను మరింతగా అణచివేసేందుకు తీసుకుంటున్న చర్యలే. ఎందుకంటే దైవదూషణ బిల్లును పాక్ పార్లమెంటు ఆమోదించిన కొద్ది రోజులకే మతోన్మాద మూకలు చర్చిలను ధ్వంసం చేయడంతో పాటు క్రైస్తవుల ఇళ్లకు నిప్పు పెట్టాయి’’ అంటూ వారు ఆందోళన వెలిబుచ్చారు. -
పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్?
వాషింగ్టన్: అమెరికాలో జో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాట్ల ప్రభుత్వానికి కొత్త ఆర్ధిక సంవత్సరం ముందు షాక్ తగిలింది. అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించగా 232-198 తేడాతో ఆమోదానికి నోచుకోలేదు. దీనివలన వచ్చేనెల ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోనున్నాయి. మొదట్లో బెట్టు చేసినా చివరి నిమిషంలో రిపబ్లికన్లు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందకపోతే షట్ డౌన్ తప్పదంటున్నాయి అమెరికా కాంగ్రెస్ వర్గాలు. షట్ డౌన్? ఎన్నికల నేపథ్యంలో జో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అమెరికాలో ఆర్ధిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. ఈనెలలో చివరి రోజైన శనివారం ఈ బిల్లు ఆమోదం పొందకపోతే అమెరికా అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోనుంది. దీనివలన 18 లక్షల మంది ఉద్యోగులున్న ఫెడరల్ ప్రభుత్వ విభాగాలకు చెల్లింపులు, ఆయా పథకాలకు నిధులతో పాటు సైనికుల జీతాలు కూడా స్తంభించిపోయే ప్రమాదముంది. ఎందుకు ఆగింది? సరిహద్దు భద్రత ఏజెన్సీ తోపాటు మరికొన్ని ఏజెన్సీల చెల్లింపుల్లో ఫెడరల్ ప్రభుత్వం 30 శాతం కోత విధించింది. దీనిని రిపబ్లికన్లు తప్పుబడుతున్నారు. అలాగే ఉక్రెయిన్కు నిధులివ్వాలనే బిల్లును తిరస్కరించనున్నారు. అమెరికా కాంగ్రెస్లోని ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బిల్లు ఆమోదం కష్టసాధ్యంగా మారింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ బిల్లును ఆమోదింపజేసి షట్ డౌన్ నివారించేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేశారు. చివరి రోజున కూడా ఆయన ప్రయత్నాలు ఫలించకపోతే మాత్రం అమెరికా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని అంటున్నాయి యూఎస్ కాంగ్రెస్ వర్గాలు. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే బిల్లులో నుంచి ఉక్రెయిన్ అంశాన్ని తొలగించడం ఒక్కటే మార్గమని అంటున్నారు సెనేటర్ రాండ్ పాల్. Like Sen. McConnell said, nobody benefits from a government shutdown—it hurts our services, economy, and neighbors…and it doesn’t save money. It's our job to pass a budget. House Republicans need to put their partisan games aside & work with us to avoid a disastrous shutdown. pic.twitter.com/uhgtecLDpx — Rep. Morgan McGarvey (@RepMcGarvey) September 29, 2023 ఇది కూడా చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి.. -
టీసీఎస్లో అమెరికా కాంగ్రెస్ బృందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రో ఖన్నా సారథ్యంలోని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం హైదరాబాద్లోని టీసీఎస్ కార్యాలయాన్ని సందర్శించింది. టాటా గ్రూప్, టీసీఎస్ కార్యకలాపాల గురించి ఈ సందర్భంగా వారికి టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి రాజన్న వివరించారు. అమెరికాకు విజిటర్ వీసాల ప్రాసెసింగ్ను వేగవంతం చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఆయన కోరారు. అమెరికన్ ఎంబసీ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్, తెలంగాణ ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీ, తెలంగాణ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ బాలయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
అమెరికా రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం, ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న అమెరికాను ఇప్పుడు చైనా మాల్వేర్ బెంబేలెత్తిస్తోంది. ఓ అజ్ఞాత మాల్వేర్ను తమ రక్షణ పరికరాల్లో చైనా ప్రవేశపెట్టిందని అమెరికా సైనికాధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ అధికారి ఒకరు నిర్ధారించారు. తమ రక్షణ వ్యవస్థపై చైనా హ్యాకర్లు కన్నేశారని, రక్షణ శాఖ పరికరాల్లోకి ఓ కంప్యూటర్ కోడ్ను(మాల్వేర్) ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, సైనిక కేంద్రాలకు నీటిని సరఫరా చేసే వ్యవస్థల్లోకి ఈ మాల్వేర్ రహస్యంగా చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అత్యవసర, సంక్షోభ సమయాల్లో సైన్యానికి అవసరమైన సరఫరాల్లో అంతరాయం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది. టైం బాంబులాంటిదే మాల్వేర్ వ్యవహారం తొలుత ఈ ఏడాది మే నెలలో బయటపడింది. గువామ్లో అమెరికా ఎయిర్ బేస్కు చెందిన టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో అనుమానాస్పద కంప్యూటర్ కోడ్ను తాము గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. మరో కీలక ప్రాంతంలో ఉన్న కంప్యూటర్లలోనూ ఇది ఉన్నట్లు పేర్కొంది. ఓల్ట్ టైఫన్ అనే చైనా హ్యాకింగ్ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్ అనేది నిజంగా టైంబాంబు లాంటిదేనని అమెరికా కాంగ్రెస్ అధికారి చెప్పారు. సైనిక స్థావరాలకు విద్యుత్, నీటి సరఫరాను, సమాచార మారి్పడిని హఠాత్తుగా నిలిపివేయడానికి ఈ మాల్వేర్ను ఉపయోగిస్తుంటారని చెప్పారు. దీనివల్ల సైన్యంలో పనివేగం తగ్గిపోతుందని అన్నారు. కేవలం అమెరికాలోనే కాదు, విదేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లోని పరకరాల్లోకి చైనా హ్యాకర్లు మాల్వేర్ను పంపించినట్లు ప్రచారం సాగుతోంది. తైవాన్ విషయంలో ఇటీవలి కాలంలో చైనా దూకుడు పెంచింది. ఈ దేశంలో సమీపంలో తరచుగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. తమ దేశంలో తైవాన్ ఒక అంతర్భాగమని వాదిస్తోంది. మరోవైపు తైవాన్కు అమెరికా అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ పరికరాల్లోకి చైనా మాల్వేర్ ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
భారత్ అభివృద్ధే ప్రపంచాభివృద్ధి
వాషింగ్టన్: మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయడంలో ‘అయితే, కానీ’లకు ఎంతమాత్రం తావులేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఉగ్రవాదాన్ని నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్పై మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీ గురువారం వాషింగ్టన్ డీసీలో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 60 నిమిషాలపాటు మోదీ ప్రసంగం కొనసాగింది. పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లతోపాటు సందర్శకుల గ్యాలరీల నుంచి వందలాది మంది భారతీయ–అమెరికన్లు మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అమెరికాలో 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు, భారత్లో 26/11 దాడులు జరిగి దశాబ్దం పూర్తయినా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచానికి ఇప్పటికీ సవాలు విసురుతూనే ఉన్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మతి తప్పిన సిద్ధాంతాలు కొత్తరూపును, కొత్త గుర్తింపును సంతరించుకుంటున్నాయని, అయినప్పటికీ వాటి ఉద్దేశాలు మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ముమ్మాటికీ శత్రువేనని స్పష్టం చేశారు. ముష్కర మూకలను అణచివేయడంలో ఎవరూ రాజీ పడొద్దని సూచించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పొరుగు దేశాలను ఎగుమతి చేస్తున్న దుష్ట దేశాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఏం మాట్లాడారంటే.. భారీగానే కాదు.. వేగంగానూ అభివృద్ధి ‘‘గత దశాబ్ద కాలంలో వంద మందికిపైగా అమెరికా పార్లమెంట్ సభ్యులు భారత్లో పర్యటించారు. భారతదేశ అభివృద్ధిని తెలుసుకోవాలని, అక్కడి ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. భారత్ ఇప్పుడేం చేస్తోంది? ఎలా చేస్తోంది? అన్నదానిపై అందరికీ ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో నేను మొదటిసారి పర్యటించినప్పుడు భారత్ ప్రపచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. మేము భారీగానే కాదు, వేగంగానూ అభివృద్ధి సాధిస్తున్నాం. భారత్ ప్రగతి సాధిస్తే మొత్తం ప్రపంచం ప్రగతి సాధిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం .. భూగోళంపై ఆరింట ఒక వంతు జనాభా భారత్లోనే ఉంది. ఇండో–పసిఫిక్లో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం.. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇతర దేశాల సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్ సూచిస్తోంది. ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) అన్ని దేశాలూ అనుసరించాలి. చార్టర్ను గౌరవించాలి. కానీ, ఇండో–పసిఫిక్పై బలప్రయోగం, ముఖాముఖి ఘర్షణ అనే నీలినీడలు ప్రసరిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. భారత్–అమెరికా భాగస్వామ్యానికి ఇది కూడా ఒక ప్రాధాన్యతాంశమే. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ఆవశ్యకతపై అమెరికాతో మా అభిప్రాయాలు పంచుకున్నాం. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ‘క్వాడ్’ వంటి కూటములు ఈ ప్రయత్నంలో ఒక భాగమే. ఇండో–పసిఫిక్ బాగు కోసం క్వాడ్ కృషి చేస్తోంది. ఉక్రెయిన్ సంఘర్షణ ఆసియా ప్రాంతంలో సమస్యలు సృష్టించిన మాట వాస్తవమే. ఇది యుద్ధాల శకం కాదని, చర్చలు, దౌత్యమార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని సూటిగా చెప్పా. ఇదొక గొప్ప గౌరవం 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ అమెరికా పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రెండుసార్లు ఈ అవకాశం దక్కడం గర్వకారణం. మనం ఒక ముఖ్యమైన కూడలిలో ఉన్నాం. గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ(ఏఐ)లో ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అదేసమయంలో మరో ఏఐ(అమెరికా, ఇండియా)లో మరిన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ శతాబ్దం ఆరంభంలో రక్షణ సహకారం విషయంలో మనం(భారత్, అమెరికా) అపరిచితులమే. పెద్దగా రక్షణ సహకారం లేదు. కానీ, ఇప్పుడు భారత్కు అమెరికా అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామిగా మారింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణం ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్ తల్లిలాంటిది. భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా వర్ధిల్లుతున్నాయి. సమానత్వం, ప్రజల గౌరవానికి స్ఫూర్తినిచ్చేదే ప్రజాస్వామ్యం. ఆలోచనకు, వ్యక్తీకరణకు రెక్కలు తొడిగేది ప్రజాస్వామ్యం. ప్రాచీన కాలం నుంచి ప్రజాస్వామ్య విలువలకు భారత్ ఆయువుపట్టుగా నిలుస్తోంది. వెయ్యి సంవత్సరాల పరాయి పాలన తర్వాత భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణాన్ని పండుగలా జరుపుకుంది. ఇది కేవలం ప్రజాస్వామ్య ఉత్సవం కాదు, వైవిధ్య వేడుక. సామాజిక సాధికారత, ఐక్యత, సమగ్రత వేడుక. డిజిటల్ చెల్లింపుల అడ్డా భారత్ యువ జనాభా అధికంగా ఉన్న ప్రాచీన దేశం భారత్. సంప్రదాయాలకు పెట్టింది పేరు భారత్. నేటి యువత భారత్ను టెక్నాలజీ హబ్గా మారుస్తున్నారు. భారత్లో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీల విలువ 320 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రక్రియలో 25 బిలియన్ డాలర్లు ఆదా చేశాం. భారత్లో ఇప్పుడు అందరూ స్మార్ట్ఫోన్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వీధి వ్యాపారుల సైతం యూపీఐ సేవలను వాడుకుంటున్నారు. గత ఏడాది ప్రపంచంలో జరిగిన ప్రతి 100 రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 46 చెల్లింపులు భారత్లోనే జరిగాయి. వేలాది మైళ్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, చౌక డేటాతో భారత్లో సాంకేతిక విప్లవం కొనసాగుతోంది. మహిళల సారథ్యంలో అభివృద్ధి ప్రాచీన కాలం నాటి వేదాలు నేటి మానవాళికి గొప్ప నిధి లాంటివి. మహిళా రుషులు సైతం వేదాల్లో ఎన్నో శ్లోకాలు, పద్యాలు రాశారు. ఆధునిక భారతదేశంలో మహిళలు ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ప్రజలను ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో మహిళల సారథ్యంలో అభివృద్ధి జరగాలన్నదే మా ఆకాంక్ష. గిరిజన తెగకు చెందిన ఓ మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 10.5 లక్షల మంది మహిళలు వివిధ పదవులు చేపట్టారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళంలోనూ విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశం భారత్. అంగారక గ్రహంపైకి మనుషులను చేర్చేందుకు చేపట్టిన మార్చ్ మిషన్లో మహిళామణులు పనిచేస్తున్నారు. మహిళలకు సాధికారత కలి్పసే సమూల మార్పులు రావడం ఖాయం. ఆడపిల్లల చదువులు, వారి ఎదుగుదల కోసం పెట్టుబడి పెడితే వారు మొత్తం కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. సంస్కరణల సమయమిది.. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం వచి్చంది. ప్రపంచం మారుతోంది. అంతర్జాతీయ సంస్థలూ మారాల్సిందే. భారత్–అమెరికా మరింత సన్నిహితమవుతున్నాయి. పరస్పర సంబంధాల విషయంలో నూతన ఉషోదయం కనిపిస్తోంది. భారత్–అమెరికా సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలనే కాదు, ప్రపంచ భవితవ్యాన్ని కూడా నిర్ధారిస్తాయి. మహాత్మా గాం«దీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్తోపాటు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడినవారిని మేమే స్మరించుకుంటున్నాం. భారత్లో 2,500కు పైగా రాజకీయ పారీ్టలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలను 20 వేర్వేరు పార్టీలు పరిపాలిస్తున్నాయి. దేశంలో 22 అధికార భాషలున్నాయి. వేలాది యాసలున్నాయి. కానీ, మేమంతా ఒకే స్వరంతో మాట్లాడుతాం. ప్రపంచంలోని అన్ని నమ్మకాలు, విశ్వాసాలకు భారత్లో స్థానం ఉంది, వాటిని గౌరవిస్తున్నాం. వైవిధ్యం అనేది భారత్లో ఒక సహజ జీవన విధానం. అమెరికా పార్లమెంట్లో భారతీయ–అమెరికన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సభలో సమోసా కాకస్ ఫ్లేవర్ ఉంది. ఇది మరింత విస్తరించాలి. భారత్లోని భిన్న రుచులు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నాను. -
140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప గౌరవమిది: మోదీ
వాషింగ్టన్: భారత్, అమెరికా సమాజాలు, సంస్థలు ప్రజాస్వామిక విలువలపై నిర్మితమై ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమ వైవిధ్యాన్ని ఇరు దేశాలు గర్వకారణంగా భావిస్తున్నాయని చెప్పారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికాలో అడుగుపెట్టిన మోదీకి గురువారం శ్వేతసౌధంలో సాదర స్వాగతం లభించింది. అధికారిక లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్, అమెరికా రాజ్యాంగాలు ‘దేశ ప్రజలమైన మేము’ అనే మూడు పదాలతోనే ప్రారంభమవుతాయని గుర్తుచేశారు. తనకు అద్భుతమైన స్వాగతం పలికిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులకు, అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఇక్కడ తనకు లభించిన స్వాగతం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప గౌరవమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో నివసిస్తున్న 40 లక్షల మందికిపైగా భారతీయులకు గర్వకారణమని అన్నారు. ప్రజాస్వామ్య బలానికి ఇదొక రుజువు: మోదీ ‘అందరి ప్రయోజనాల కోసం, అందరి సంక్షేమం కోసం’ అనే ప్రాథమిక సూత్రాన్ని భారత్, అమెరికా ఎంతగానో విశ్వసిస్తున్నాయని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల క్రితం ఒక సామాన్యుడిగా అమెరికా వచ్చానని, అప్పుడు వైట్హౌస్ బయటి నుంచే చూశానని అన్నారు. ప్రధానమంత్రి హోదాలో చాలాసార్లు ఇక్కడికి వచ్చానని చెప్పారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భారతీయ–అమెరికన్ల కోసం వైట్హౌజ్ గేట్లు తెరవడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని అన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు కష్టపడి పని చేస్తున్నారని, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని మోదీ ప్రశంసించారు. చదవండి: అది మా డీఎన్ఏలోనే ఉంది: బైడెన్తో కలిసి మీడియా సమావేశంలో మోదీ భారత్–అమెరికా స్నేహం మొత్తం ప్రపంచాన్ని బలోపేతం చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయని వివరించారు. ప్రజాస్వామ్య బలానికి భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యమే ఒక రుజువు అని వెల్లడించారు. కీలకమైన అంశాలపై అధ్యక్షుడు జో బైడెన్తో చర్చించబోతున్నానని పేర్కొన్నారు. చర్చలు సానుకూలంగా జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా పార్లమెంట్ను రెండోసారి ఉద్దేశించి ప్రసంగించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత్ సహకారంతో ‘క్వాడ్’ బలోపేతం: బైడెన్ భారత్–అమెరికా సంబంధాలు 21వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల సంబంధాల్లో ఒకటి అని జో బైడెన్ స్పష్టం చేశారు. వైట్హౌస్లో మోదీని ఆహా్వనిస్తూ ఆయన మాట్లాడారు. ఈ రోజు రెండు దేశాలు కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి అంశాలపై ఇరుదేశాలు సన్నిహితంగా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. స్వేచ్ఛాయుత, భద్రమైన ఇండో–పసిఫిక్ లక్ష్యంగా భారత్ సహకారంతో ‘క్వాడ్’ కూటమిని బలోపేతం చేస్తున్నామని బైడెన్ వివరించారు. చదవండి: Narendra Modi: ఎదురొచ్చి మరీ మోదీకి బైడెన్ దంపతుల సాదర స్వాగతం.. ప్రత్యేక విందు -
భారత్లో ముస్లింల హక్కులపై ప్రశ్న.. అది మా డీఎన్ఏలోనే ఉంది: మోదీ
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన ఆధ్యాయం చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పినట్లుగా ప్రజాస్వామ్యం అనేది భారత్, అమెరికా దేశాల డీఎన్ఏలో ఉందని అన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ రోజు బైడెన్తో కీలక అంశాలపై చర్చలు జరిపానని తెలిపారు. ప్రజాస్వామిక విలువల గురించి తాము మాట్లాడుకున్నామని వెల్లడించారు. గురువారం వైట్హౌస్లో చర్చలు ముగిసిన అనంతరం మోదీ, బైడెన్ ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. అరుదైన సంఘటనలో, ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో సంయుక్త విలేకరుల సమావేశంలో పాత్రికేయుల నుంచి ప్రశ్నలు సంధించారు. ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కుల పరిరక్షణకు, వాక్ స్వాతంత్య్రాన్ని నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అమెరికా మీడియా అడిగిన ప్రశ్నకు మోదీ బదులిస్తూ ‘ప్రజాస్వామ్యం మన సిరల్లో నడుస్తోంది’ అని అన్నారు. దేశం మతం లేదా కుల ప్రాతిపదికన వివక్ష చూపదని నొక్కిచెప్పిన ప్రధానమంత్రి, బిజెపి యొక్క చాలా నొక్కిచెప్పబడిన నినాదం - సబ్కా సాథ్, సబ్కా వికాస్. భారత్–అమెరికా సంబంధాల చరిత్రలో ఈ రోజుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయంచామన్నారు. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని ఫలవంతం చేయడానికి ఇరుదేశాల ప్రభాత్వాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఒక్కతాటిపైకి వచ్చి, కలిసి పనిచేసేలా అంగీకారానికి వచ్చామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం నేడు మరో కొత్త స్థాయికి చేరిందన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై భారత్, అమెరికా కలిసి పోరాడుతున్నాయని చెప్పారు. నూతన రంగాల్లో భారత్, అమెరికా కలిసి చేయాలన్నదే తన ఆకాంక్ష అని జో బైడెన్ వివరించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయన్నారు. భారత్, అమెరికాకు అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దాపరికాలకు తావు లేదని, పరస్పరం చక్కగా గౌరవించుకుంటున్నాయని బైడెన్ తెలియజేశారు. ప్రతి పౌరుడికీ గౌరవం లభించాలన్నారు. అమెరికా స్ఫూర్తితో సాహసోపేత నిర్ణయాలు రక్షణ, అంతరిక్షం, ఇంధనం, ఆధునిక సాంకేతికత వంటి రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో గురువారం అధికారిక చర్చలు జరిపారు. అధ్యక్ష భవనం వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసు ఈ ముఖాముఖి సమావేశానికి వేదికగా మారింది. పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి బైడెన్ చేపట్టిన చర్యలను మోదీ ప్రశంసించారు. చదవండి: H-1B Visa: ఎన్ఆర్ఐలకు గుడ్న్యూస్.. హెచ్–1బీ వీసా రెన్యువల్ అక్కడే! భారత్–అమెరికా ప్రజల మధ్యనున్న బలమైన అనుబంధమే ఇరు దేశాల నడుమ సంబంధాలకు అసలైన చోదక శక్తి అని పేర్కొన్నారు. నేడు భారత్–అమెరికా సముద్రాల లోతుల నుంచి ఆకాశం అంచుల దాకా, ప్రాచీన సంస్కృతి నుంచి ఆధునిక కృత్రిమ మేధ దాకా భుజం భుజం కలిపి ముందుకు సాగుతున్నాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో అమెరికా చూపుతున్న అంకితభావం తాము సాహసోపేత నిర్ణయాలు, చర్యలు తీసుకోవడానికి స్ఫూర్తినిస్తోందని వ్యాఖ్యానిచారు. మోదీ, బైడెన్ శ్వేతసౌధంలో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు కలిసి మాట్లాడుకున్నారు. మోదీకి ప్రత్యేక విందు.. అగ్రరాజ్య పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్ష భవనంలో ఘనమైన స్వాగతం లభించింది. బుధవారం అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్, ఆయన సతీమణి జిల్ ఎదురొచ్చి మరీ మోదీకి సాదర స్వాగతం పలికారు. ద్వారం వద్దే సరదాగా మాట్లాడుతూ ఫొటోలు దిగారు. తర్వాత శ్వేతసౌధంలోకి తోడ్కొని వెళ్లారు. వ్యక్తిగతంగా ప్రత్యేకమైన విందు ఇచ్చేందుకు అంతకుముందే మోదీని బైడెన్ దంపతులు ఆహ్వానించిన విషయం విదితమే. వైట్హౌజ్లో బైడెన్ కుటుంబసభ్యులతో మోదీ కాసేపు మాట్లాడారు. ‘ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొనడం ఇరుదేశాల గాఢమైన స్నేహబంధానికి సంకేతం’ అని భారత విదేశాంగ శాఖ ఒక ట్వీట్చేసింది. తృణధాన్యాలు, మొక్కజొన్న పొత్తులు, పుచ్చకాయ, పుట్టగొడుగులు, మిల్లెట్ కేక్, స్ట్రాబెర్రీ కేక్ ఇలా భిన్న పదార్థాలతో వేర్వేరు వంటకాలను మోదీకి వడ్డించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ విందులో ముందుగా భారత పలు ప్రాంతాలను గుర్తుచేస్తూ అగ్రనేతలకు సంగీతం వినిపించారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు జాక్ సులేవాన్, అజిత్ దోవల్లు పాల్గొన్నారు. మరోవైపు మోదీకి దాదాపు 400 మంది అతిథుల సమక్షంలో అధికారిక విందు ఇవ్వనున్నారు. -
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అమెరికా కాంగ్రెస్ ఆహ్వానం
న్యూఢిల్లీ: ఈనెల 22న యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగించనున్నారు. ఈమేరకు సెనేట్ సభాపతి కెవిన్ మెక్ కార్తి స్వయంగా భారత ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సభలో ప్రధాని భారత్ అమెరికా సంబంధాల రీత్యా అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణతోపాటు ఉభయ దేశాలు ప్రాపంచికంగా ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రసంగం చేయనున్నారు. మోదీ అరుదైన ఘనత... ఏడేళ్ల కిందట 2016లో ఇదే వేదికపై ప్రసంగించారు మోదీ. బ్రిటీష్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా తర్వాత రెండు సందర్భాల్లో యూఎస్ కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించిన నాయకుడిగా చరిత్ర సృష్టించనున్నారు. 2016 ప్రసంగంలో మోడీ... గతంలో మోదీ ఇదే సభను ఉద్దేశించి మాట్లాడుతూ వాతావరణ మార్పుల నుంచి ఉగ్రవాదం వరకు, రక్షణ శాఖ, భద్రతా వ్యవహారాలు, వాణిజ్య సంబంధాలు, రెండు దేశాల మధ్య ఆర్ధిక పురోగతి వంటి అనేక అంశాలను స్పృశించారు. చదవండి: రాహుల్ గాంధీ చెప్పింది అక్షరాలా నిజం -
కవ్వింపులకు దిగితే మోదీ సర్కారు సహించబోదు: అమెరికా నిఘా వర్గాలు
వాషింగ్టన్: పాకిస్తాన్, చైనాలతో భారత్ సంబంధాలు నానాటికీ మరింతగా క్షీణిస్తున్నాయని, పెరుగుతున్న ఉద్రిక్తతలు సాయుధ ఘర్షణకూ దారితీసే ఆస్కారం లేకపోలేదని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పాక్ కవ్వింపులను భారత్ గతంలోలా సహించే పరిస్థితి లేదు. మోదీ హయాంలో పాక్పై సైనిక చర్యకు దిగే అవకాశముంది’’ అని అంచనా వేశాయి. అమెరికా కాంగ్రెస్కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ మేరకు పొందుపరిచాయి. ‘‘ముఖ్యంగా భారత వ్యతిరేక ఉగ్రవాద తండాలకు మద్దతిచ్చిన సుదీర్ఘ చరిత్ర పాక్ది. అందుకే ఇకపై పాక్ కవ్విస్తే మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండబోదు’’ అని నివేదిక అభిప్రాయపడింది. చైనాతో కూడా పలు సరిహద్దు సమస్యలను భారత్ చర్చల ద్వారా పరిష్కరించుకున్నా 2020 గల్వాన్ ఘర్షణ, తాజాగా అరుణాచల్ సరిహద్దుల వద్ద గొడవ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయని పేర్కొంది. చైనాతో అమెరికాకు పెనుముప్పు అమెరికా జాతీయ భద్రతకు, అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ స్థానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి అత్యంత ముప్పు పొంచి ఉందని యూఎస్ నిఘా విభాగపు నివేదిక అభిప్రాయపడింది. ‘‘రష్యాతో ఏడాదిగా చైనా బంధం బలపడుతున్న తీరు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. నానాటికీ పెరుగుతున్న ఈ చైనా సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి’’ అని ప్రభుత్వానికి సూచించింది. సెనేట్ సెలెక్ట్ కమిటీ సభ్యులకు నిఘా నివేదిక సమర్పించిన సందర్భంగా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. -
రిపబ్లికన్ అభ్యర్థి మెక్కార్తీకి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభ(హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీదే మెజార్టీ. అయినప్పటికీ స్పీకర్ ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి నెగ్గలేకపోయారు. నూతన సభ మంగళవారం కొలువుదీరింది. తొలిరోజు సభాపతి (స్పీకర్) ఎన్నిక నిర్వహించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కెవిన్ మెక్కార్తీ మెజార్టీ ఓట్లు కూడగట్టడంలో విఫలమమ్యారు. మంగళవారం రాత్రంతా సభలో హైడ్రామా చోటుచేసుకుంది. మూడు రౌండ్లు ఓటింగ్ నిర్వహించారు. స్పీకర్గా నెగ్గడానికి 218 ఓట్లు అవసరం కాగా, మెక్కార్తీకి తొలి రెండు రౌండ్లలో 203 ఓట్ల చొప్పున, మూడో రౌండ్లో 202 ఓట్లు వచ్చాయి. దీంతో తదుపరి ఓటింగ్ను స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. స్పీకర్ లేకుండానే సభ వాయిదా పడింది. అమెరికా చరిత్రలో 1923 నుంచి చూస్తే ప్రతినిధుల సభలో తొలి రోజు స్పీకర్ను ఎన్నుకోలేకపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మెక్కార్తీ ఇక ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త స్పీకర్ ఎన్నికయ్యే దాకా సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. మెక్కార్తీకి వ్యక్తిగతంగా, రాజకీయంగా చాలామంది ప్రత్యర్థులు ఉన్నారని రిపబ్లికన్ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఆయన స్పీకర్గా ఎన్నిక కావడం సొంత పార్టీలోనే కొందరికి ఇష్టం లేదన్నారు. మెక్కార్తీ స్పీకర్ కావడం కష్టమేనని రిపబ్లికన్ సభ్యుడు బాబ్గుడ్ వ్యాఖ్యానించారు. స్పీకర్ లేకుండా సభ సంపూర్ణం కాదు. నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం, కమిటీలకు చైర్మన్లను నియమించడం, సభా కార్యకలాపాలు నిర్వహించడం వంటివి స్పీకర్ బాధ్యతలే. మెజారిటీ ఉన్నా సొంత పార్టీ అభ్యర్థి స్పీకర్గా నెగ్గకపోవడం విపక్షానికి చేదు అనుభవమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
ఉక్రెయిన్కు చేసేది సాయం కాదు.. పెట్టుబడి..
వాషింగ్టన్: రష్యా తమపై దండయాత్ర చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. బుధవారం అమెరికా కాంగ్రెస్లో ప్రసంగించారు. అగ్రరాజ్యం తమ దేశానికి అందిస్తున్న భారీ సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఉక్రెయిన్కు అమెరికా అందిస్తుంది సాయం కాదని, ప్రాజాస్వామ్యం, అంతర్జాతీయ భద్రతకు అగ్రరాజ్యం పెడుతున్న పెట్టుబడి అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. 2023లోనూ తమకు సాయాన్ని కొనసాగించారని కోరారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై అమెరికా విజయం సాధించినట్లు తాము కూడా వెనుకడుగు వేయకుండా రష్యాపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని జెలన్స్కీ స్పష్టం చేశారు. ఆయన ప్రసంగాన్ని అమెరికా కాంగ్రెస్ అభినందించింది. సభ్యలందరూ లేచి నిలబడి కరత్వాల ద్వనులతో జెలెన్స్కీ పోరాట స్ఫూర్తిని మెచ్చుకున్నారు. అగ్రరాజ్యం ఇప్పటికే ఉక్రెయిన్కు 50 బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించింది. త్వరలో పేట్రియట్ మిసైల్స్ కూడా పంపిస్తామని హామీ ఇచ్చింది. అయితే అమెరికా అందిస్తున్న సాయాన్ని జెలెన్స్కీ పెట్టుబడి అనడం వెనుక కారణం లేకపోలేదు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి అమెరికా ప్రతినిధుల సభ రిపబ్లికన్ల చేతిలోకి వెళ్లనుంది. ఉక్రెయిన్కు భారీ ప్యాకీజీపై వారు సుముఖంగా లేరు. డెమొక్రాట్లు భారీ మొత్తాన్ని యుద్ధ సాయంగా సమకూర్చడంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు దిగవ సభ వాళ్ల నియంత్రణలోకే వస్తుంది కనుక కచ్చితంగా ప్యాకీజీ బిల్లును అడ్డుకుంటారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ల మనసు మార్చే విధంగా జెలెన్స్కీ మాట్లాడారు. కాంగ్రెస్లో ప్రసంగించడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు జెలెన్స్కీ. ఇద్దరూ కలిసి ఓవల్ ఆఫీస్లో కన్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. చదవండి: వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో.. -
US midterm elections 2022: ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే పైచేయి
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తుది ఫలితాలపై స్పష్టత వచ్చింది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పైచేయి సాధించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. రిపబ్లికన్లు 218 సీట్లు, అధికార డెమొక్రాట్లు 211 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)లో కీలకమైన ప్రతినిధుల సభలో ప్రతిపక్షం మెజారిటీ సాధించడం అధ్యక్షుడు జో బైడెన్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది. బైడెన్ నిర్ణయాలు, చర్యలను ప్రతిపక్షం నిలువరించే అవకాశం కనిపిస్తోంది. చట్టసభలో రిపబ్లికన్ పార్టీ బలం పుంజుకోవడంతో అధ్యక్షుడి దూకుడుకి అడ్డుకట్ట పడనుంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ప్రతినిధుల సభ స్పీకర్గా రిపబ్లికన్లు తమ నాయకుడు కెవిన్ మెక్కర్తీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ ఉన్నారు. కొత్త దిశ కోసం అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని, రిపబ్లికన్లు వారిని ముందుకు నడిపించబోతున్నారని మెక్కర్తీ ట్వీట్ చేశారు. స్పీకర్గా ఎన్నికైన మెక్కర్తీకి ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తానని ఉద్ఘాటించారు. రా బోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెనేట్పై డెమొక్రాట్ల పట్టు మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజలు వారి ఆకాంక్షలను వ్యక్తం చేశారని చెప్పారు. ధరలు, జీవన వ్యయం తగ్గాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎవరితోనైనా కలిసి పని చేస్తానని పేర్కొన్నారు. జనం ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్లోని మరో సభ అయిన సెనేట్లో అధికార డెమొక్రాట్లు పట్టు నిలుపుకొనే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 100 స్థానాలకు గాను, వారు ఇప్పటిదాకా 50 స్థానాలు దక్కించుకున్నారు. జార్జియా రాష్ట్రం కూడా వారి ఖాతాలో పడనుంది. దీంతో సెనేట్లో మెజారిటీ సాధించబోతున్నారు. -
Russia Ukraine war: ఉక్రెయిన్ శిథిలాల్లో ఆయుధ కంపెనీల... కాసుల పంట
ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధంలో విజేతలెవరు? రష్యా వంటి అత్యంత శక్తివంతమైన దేశం మూడు నెలలుగా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్ వంటి చిన్న దేశంపై పట్టు చిక్కలేదు. పైగా సైనికంగా, సాయుధ సంపత్తి పరంగా అపార నష్టం చవిచూస్తోంది. అంతర్జాతీయంగా, దౌత్యపరంగా తీవ్ర వ్యతిరేకతనూ మూటగట్టుకుంది. అంతర్జాతీయ సాయంతో రష్యాను ఉక్రెయిన్ ఢీకొడుతున్నా, ఆ దేశం నిండా శిథిల నగరాలే దర్శనమిస్తున్నాయి. మరి ఇంతకూ ఈ యుద్ధంలో గెలుస్తున్నదెవరు? రష్యానా, ఉక్రెయినా? రెండూ కాదు. అమెరికా, పాశ్చాత్య దేశాల ఆయుధ కంపెనీలదే అసలు విజయంగా కన్పిస్తోంది... ఉక్రెయిన్లో రష్యా యుద్ధం వల్ల ఆయుధ కంపెనీల పంట పండుతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్కు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఈ కంపెనీల్లో తయారవుతున్నవే. ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్తో పాటు టాప్ సెవెన్ కంపెనీలు అమెరికావే. అమెరికా, యూరప్ల్లోని ఆయుధ కంపెనీలు చాలావరకు ప్రైవేట్ సంస్థలే. ఐదేళ్లుగా పెద్దగా వ్యాపారం సాగక సతమతమవుతున్న ఈ సంస్థలు ఉక్రెయిన్ యుద్ధం పుణ్యామా అని లాభాల బాట పట్టాయి. అమెరికాతో సహా నాటో దేశాలు ఉక్రెయిన్కు అందిస్తున్న సాయంలో చాలావరకు ఆయుధాల రూపంలోనే అందుతోంది. విమాన విధ్వంసక స్ట్రింగర్, ట్యాంకు విధ్వంసక జావలిన్ ఆయుధ వ్యవస్థలను తయారు చేస్తున్నది అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్, రేథియాన్లే. యుద్ధం మొదలవగానే మార్చిలో లాక్హీడ్ సంస్థ షేరు విలువ ఒక్కసారిగా 16 శాతం పెరిగింది. రేథియాన్ సంస్థ షేరు విలువ 8 శాతం, యూరప్లో అతిపెద్ద ఆయుధ కంపెనీ బీఏఈ షేరు విలువ ఏకంగా 26 శాతం పెరిగాయి. అమెరికాకు చెందిన జనరల్ డైనమిక్స్ షేరు 12 శాతం, నార్త్రోప్ గ్రూమన్ షేరు 22 శాతం పెరిగాయి. కాంగ్రెస్ సభ్యులకు కాసుల పంట అమెరికా కాంగ్రెస్ సభ్యుల్లో చాలామందికి ఆయుధ కంపెనీల్లో షేర్లున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వారికి లాభదాయకంగా మారిందన్నది బిజినెస్ ఇన్సైడర్ పత్రిక కథనం. కనీసం 20 మంది కాంగ్రెస్ సభ్యులకు, లేదా జీవిత భాగస్వాములకు లాక్హీడ్ మార్టిన్, రేథియాన్ సంస్థల్లో నేరుగా షేర్లున్నాయి. మరెందరో వాటిలో చాలాకాలంగా పెట్టుబడులు పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ కొత్తగా షేర్లు కొన్నవారికీ కొదవ లేదు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు మార్జోరీ టైలర్ గ్రాన్ ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 22న లాక్హీడ్ మార్టిన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. పైగా, ‘యుద్ధం రాజకీయ నాయకులకు మంచి వ్యాపారం’ అంటూ ట్వీట్ కూడా చేశారు! టెనెసీకి చెందిన మరో రిపబ్లికన్ సభ్యురాలు డయానా హార్స్బర్జర్ తన భర్తతో కలిసి రేథియాన్ షేర్లు కొన్నారు. ఉక్రెయిన్కు ఆయుధ సాయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్లో ముందు పెట్టిన ప్రతిపాదనలు చకచకా ఆమోదం పొందుతున్నాయి. పైగా అడిగినంత కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. బిలియన్లు గుమ్మరిస్తున్న యూఎస్ ఉక్రెయిన్కు బైడెన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 4,000 కోట్ల డాలర్లకు పైగా నిధులిచ్చేందుకు సిద్ధమైంది. దాంతో ఉక్రెయిన్ యుద్ధం కోసం గత రెండు నెలల్లోనే అమెరికా మంజూరు చేసిన సాయం ఏకంగా 5,300 కోట్ల డాలర్లను దాటింది. ఇందులో చాలావరకు ఆయుధ రూపంలో అందేదే. గత రెండు దశాబ్దాల్లో అమెరికా ఇచ్చిన అతిపెద్ద విదేశీ సాయం ఇదే! యుద్ధం సాగే కొద్దీ ఉక్రెయిన్కు సాయాన్ని ఇంకా పెంచుతానంటూ హామీకూడా ఇచ్చింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఆయుధ కంపెనీలు కాసుల పంట పండించుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ ఇదే విధంగా జరిగింది’’ అని రిటైర్డ్ మేజర్ జనరల్ జి.డి.భక్తి గత చరిత్రను గుర్తు చేశారు. యూరప్ దేశాలూ... ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో సరిహద్దు పంచుకుంటున్న పలు యూరప్ దేశాలు తమ రక్షణ కేటాయింపులను భారీగా పెంచుకుంటున్నాయి. జర్మనీ రక్షణ కేటాయింపులు జీడీపీలో 1.5 శాతం నుంచి 2 శాతానికి పెరగనున్నాయి. జపాన్ 60 ఏళ్ల తర్వాత తమ జీడీపీలో ఒక శాతానికిపైగా నిధులను రక్షణ అవసరాలకు కేటాయించబోతోంది. అమెరికా రక్షణ నిధులు కూడా వచ్చే ఏడాది ఎన్నడూ లేనంతగా జీడీపీలో 3.5 శాతం నుంచి 5 శాతానికి చేరొచ్చన్నది బ్యాంక్ ఆఫ్ అమెరికా నిపుణుల అంచనా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మా కలలను కల్లోలం చేశారు: జెలెన్ స్కీ ఆవేదన
Zelenskyy receives a standing ovation from the US lawmakers: ఉక్రెయిన్ పై రష్యా గత 21 రోజులుగా నిరవధిక దాడి చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ ఆక్రమణే ద్యేయంగా రష్యా మరింత దుశ్చర్యలకు ఒడిగడుతోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ యూఎస్ కాంగ్రెస్తో వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ఉక్రెయిన్ పరిస్థితి గురించి మాట్లాడారు. వ్లోదిమిర్ జెలెన్ స్కీ స్క్రీన్ పై కనబడగానే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల నిలబడి ప్రశంసించారు. జెలెన్స్కీ అమెరికా కాంగ్రెస్ని మరింత సైనిక సాయం చేయమని కోరారు. రష్యా పై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా రష్యాతో సాగిస్తున్న వ్యాపారాలను ఉపసంహరించవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఆదాయం కంటే శాంతికి పెద్ద పీట వేస్తూ అమెరికా తప్పనిసరిగా దిగుమతులను నిరోధించేలా కట్టుదిట్టం చేయమని కోరారు. రష్యా ఉక్రెయిన్ ఆకాశాన్ని వేలాది మంది మరణాలకు వేదికగా చేసింది." రష్యా మా దేశంలోని విలువలకు, స్వేచ్ఛయుత జీవనానికి భంగం కలిగించేలా దాడి చేసింది. మా కలలను కల్లోల పరిచేలా క్రూరంగా దాడి చేసిందని జెలెన్స్కీ ఆవేదనగా పేర్కొన్నారు". మరోసారి జెలెన్ స్కీ నో ఫ్లై జోన్ అంశం గురించి ప్రస్తావించారు. ఈ మేరకు రష్యా తమ దేశం పై క్రూరంగా చేస్తున్న దాడుల తాలుకా వీడియోని ప్లే చేశారు. యూఎస్ ఇస్తున మద్దతుకు కృతజ్ఞతలు తెలపడమే కాక తమ దేశం కోసం మరింత చేయమని కోరారు. అమెరికా మద్దతు తమ దేశానికి ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. (చదవండి: రష్యా టీవీ లైవ్షోలో నిరసన.. మహిళా జర్నలిస్ట్కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!) -
గ్రీన్కార్డుకు ఇక సూపర్ ఫీ!
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయులకు ఊరట లభించనుంది. అమెరికన్ కాంగ్రెస్లో ప్రతినిధుల సభకు చెందిన జ్యుడీషియరీ కమిటీ రూపొందించిన రీకన్సిలియోషన్ బిల్లులో వివరాల ప్రకారం... గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సూపర్ ఫీ చెల్లించడానికి ముందుకు వస్తే గ్రీన్కార్డుని అప్పటికప్పుడే పొందవచ్చు. అదే విధంగా లీగల్ డ్రీమర్స్ (తల్లిదండ్రుల హెచ్–1బీ వీసాతో చిన్నారులుగా దేశానికి వచ్చి 21 ఏళ్లు నిండిన వారు) ఈ సప్లిమెంటరీ ఫీజు కడితే వారికి శాశ్వత నివాసం, పౌరసత్వం లభిస్తుంది. త్వరలోనే ఈ బిల్లు కాంగ్రెస్ ముందుకు రానుంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డుల్ని ప్రతీ ఏడాది అమెరికా 1.40 లక్షలు మంజూరు చేస్తుంది. దీంట్లో ఏ ఒక్క దేశానికీ 7 శాతానికి మించి గ్రీన్కార్డులు మంజూరు చేయకూడదనే పరిమితి ఉంది. భారతీయులు అధిక సంఖ్యలో గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేస్తూ ఉండడంతో ఈ కోటా వల్ల దరఖాస్తుదారులు ఎక్కువగా పెరిగిపోతున్నారు. కాటో ఇనిస్టిట్యూట్కు చెందిన వలస విధాన నిపుణుడు డేవిడ్ బెయిర్ అధ్యయనం ప్రకారం ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డుల కోసం వేచి చూస్తున్న భారతీయుల సంఖ్య ఏప్రిల్ 2020 నాటికి 7.41 లక్షలుగా ఉంది. వీరందరికీ కార్డు రావాలంటే 84 ఏళ్లు వేచి చూడాలని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ ఫీ చెల్లిస్తే గ్రీన్కార్డు రావడం అన్నది సువర్ణావకాశమని బెయిర్ అన్నారు. 5 వేల డాలర్లు చెల్లించే వారందరికీ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తే అంతకు మించినది ఏముంటుందని పేర్కొన్నారు. ఇక అత్యవసర రంగాలైన ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయంతో పాటుగా రవాణా, ఐటీకి చెందిన కంపెనీల్లో పని చేసేవారికి వారి యాజమాన్యం స్పాన్సర్ చేయకపోయినా.. 5 వేల డాలర్లు చెల్లించి గ్రీన్కార్డు పొందే అవకాశం ఉంటుంది. ఒక రకంగా బైడెన్ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ఈ పని చేస్తూ ఉందని న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ లా సంస్థ వ్యవస్థాపకుడు సైరస్ డి మెహతా అన్నారు. బడ్జెట్ రీ కన్సిలేషన్ బిల్లులో భాగంగా దీనిని చేర్చడంతో కాంగ్రెస్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందని మెహతా ధీమాగా చెప్పారు. బిల్లులో ఏముందంటే.. ► ఉద్యోగ ఆధారిత వలసదారులు గ్రీన్కార్డు ప్రయార్టీ తేదీ కంటే ఇంకా రెండేళ్లు ఎక్కువ గా నిరీక్షించాల్సి వచి్చనప్పుడు 5 వేలడాలర్ల సూపర్ ఫీ చెల్లిస్తే అప్పటికప్పుడు వారికి గ్రీన్ కార్డు మంజూరు చేస్తారు. ► కుటుంబ ఆధారిత వలసదారులు, అమెరికా పౌరులెవరైనా స్పాన్సర్ చేస్తే గ్రీన్కార్డు రావాల్సిన సమయంలో కంటే రెండేళ్లు ఎక్కువ నిరీక్షించిన తర్వాత సప్లిమెంట్ ఫీజు కింద 2,500 డాలర్లు చెల్లించాలి. ► వలస విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దేశాల పరిమితి కోటా ఎత్తేయడం, హెచ్–1బీ వీసా వార్షిక కోటా పెంచడం వంటి వాటికి ఈ బిల్లులో చోటు దక్కలేదు. -
డీమర్స్ కోసం యూఎస్ కాంగ్రెస్లో బిల్లు
వాషింగ్టన్: దేశంలో చాన్నాళ్లుగా నాన్ ఇమిగ్రంట్ వీసాపై ఉన్నవారితో పాటు డిపెండెంట్స్గా అమెరికా వచ్చిన పిల్లలకు(డాక్యుమెంటెడ్ డ్రీమర్స్) శాశ్వత నివాస సదుపాయం కల్పించే దిశగా ముందడుగు పడింది. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల సభ్యులు సంబంధిత బిల్లును కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో పలువురు భారతీయ పిల్లలు, యువతకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం నాన్ ఇమిగ్రంట్ వీసాదారుల పిల్లలు, 21 ఏళ్ల వయస్సు దాటితే, స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అమెరికాలో ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సంఖ్య దాదాపు 2 లక్షలు ఉంటుంది. వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. -
ఫౌచీ ఊస్టింగ్.. వైరస్ గుట్టు వీడిందా?
డాక్టర్ ఆంటోనీ ఫౌచీ.. కరోనా టైం నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. వైరస్ వ్యాప్తి తీరుపై విశ్లేషణ, సలహాలు ఇస్తున్న ఫౌచీని ఉన్నపళంగా ఆ పదవి నుంచి తొలగించారట. అంతేకాదు ఆయన ఊస్టింగ్కు సంబంధించి ప్రత్యేకంగా ఒక బిల్లును కూడా కాంగ్రెస్(పార్లమెంట్)లో ప్రవేశపెట్టారని కూడా తెలుస్తోంది. మరోవైపు కరోనా వైరస్ ల్యాబ్ల్లోనే తయారు చేశారనే విషయాన్ని అమెరికా అధికారికంగా ధృవీకరించిందనేది మరో వార్త. ఫేస్బుక్, వాట్సాప్లో ఫార్వార్డ్ అవుతున్న ఈ వార్తల్లో ఉన్న సగం నిజమెంతంటే.. సీనియర్ ఫిజిషియన్, అమెరికాలోనే టాప్ ఇమ్యునాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడి) డైరెక్టర్ ఆంటోనీ ఫౌచీ. అంతెందుకు అమెరికా అధ్యక్షుడికి ఈయనే ఆరోగ్య సలహాదారు కూడా. అలాంటి వ్యక్తిని ఉన్నపళంగా పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఏముందసలు?.. విషయంలోకి వెళ్తే.. ఫౌచీ నిర్లక్క్ష్యం వల్లే అమెరికాలో కరోనాతో తీరని నష్టం వాటిల్లిందని, వైరస్ వ్యాప్తి టైంలో ఆయన ప్రభుత్వానికి సరైన మార్గనిర్దేశం చేయలేకపోయాడని, పైగా వైరస్ వ్యాప్తికి సంబంధించి రహస్య ఈ-మెయిల్స్ ద్వారా ఫౌచీ కుట్రకు పాల్పడ్డారనేది రిపబ్లికన్ ఎంపీ మర్జోరి టేలర్ గ్రీనె ఆరోపణ. ఈ మేరకు ఆమె ‘ఫైర్ ఫౌచీ యాక్ట్’ పేరుతో ప్రత్యేకంగా ఒక బిల్లును రూపొందించింది. అయితే ఈ బిల్లు ఇంకా పార్లమెంట్లో చర్చదశకు రాలేదు. ఈలోపే ఓటింగ్ జరిగిందని, ఆమోదం దొరికిందని, ఫౌచీ పని అయిపోయిందని ఫేక్ కథనాలు వెలువడ్డాయి. ఇక కరోనా వైరస్ గుట్టు తేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా నిఘా వర్గాలకు 90 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే(మే 26 ఆదేశాలు వెలువడ్డాయి). వైరస్ను ల్యాబ్లోనే తయారు చేశారా?, లేదంటే జంతువుల ద్వారా సోకిందా? తేల్చాలని ఆయన నిఘా ఏజెన్సీలను ఆదేశించాడు. అయితే నెలలోపే దర్యాప్తు పూర్తైందని, ఇది మనిషి తయారు చేసిందని అమెరికా ధృవీకరించిందని ఒక ప్రైవేట్ బ్లాగ్ ద్వారా ఫేక్ వార్త వైరల్ అయ్యింది. ఇక ఈ రెండు ఫేక్ అని వైట్హౌజ్ ప్రతినిధి ఒకరు అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు ‘ఫౌచీ పట్ల తాను అత్యంత నమ్మకంగా ఉన్నట్లు’ ఈ నెల మొదట్లో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బైడెన్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు ఆ అధికారి. చదవండి: కరోనా పుట్టకపై ఫౌచీ కీలక వ్యాఖ్యలు -
అమెరికన్ల జీవితాలు మారుతాయ్!
వాషింగ్టన్: కరోనా సంక్షోభంతో అతాలాకుతలమవుతున్న అమెరికా పౌరుల్ని ఆదుకోవడానికి 1.9 లక్షల కోట్ల అమెరికా డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి బుధవారం కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. 220–211 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ అమెరికన్ రెస్క్యూ ప్లాన్ యాక్ట్ని ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఈ ప్యాకేజీకి వ్యతిరేకంగానే ఓటు వేశారు. నాలుగు రోజుల క్రితం సెనేట్ ఆమోదం పొందిన బిల్లుని అక్కడ కూడా రిపబ్లికన్లు వ్యతిరేకించారు. కోవిడ్–19 సంక్షోభం తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో ఈ భారీ ప్యాకేజీ ప్రకటించడం ఎందుకనేది వారి వాదనగా ఉంది. అయితే కాంగ్రెస్ దీనిని ఆమోదించగానే ‘‘సాయం ఇక్కడే ఉంది’’అని అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు. తాను ఆ బిల్లుపై శుక్రవారం సంతకం చేస్తానని చెప్పారు. బిల్లు చట్టరూపం దాల్చగానే అమెరికాలో తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలకు ఈ ఏడాది 1400 డాలర్ల ఆర్థిక సాయం చేస్తారు. నిరుద్యోగులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ఆదుకుంటారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, కోవిడ్పై పరిశోధనలకు నిధుల్ని భారీగా ఖర్చు పెడతారు. కోవిడ్–19తో కుదేలైన విమానయానం నుంచి ఫంక్షన్ హాల్స్ వరకు అందరికీ ఈ ప్యాకేజీ ద్వారా ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. ఎన్నికల్లో బైడెన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఈ బిల్లు ఆమోదం పొందడం అత్యంత అవసరం. అందుకే చట్టసభల్లో బైడెన్ సాధించిన తొలి విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ప్రజల జీవితాలను మార్చే నిర్ణయం ఇదేనని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి చెప్పారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే అమెరికాలో ప్రస్తుతం పేదల సంఖ్య 4.4 కోట్ల నుంచి 2.8 కోట్లకు తగ్గిపోతుందని అంచనాలున్నాయి. -
అదిగదిగో గ్రీన్ కార్డు
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన గ్రీన్ కార్డు కోసం భారతీయులు ఇకపై ఏళ్లకి ఏళ్లు ఎదురు చూసే పని లేదు. వేలాదిమంది భారతీయ టెక్కీలు, వారి కుటుంబసభ్యులతో పాటు విదేశీయులెందరికో లబ్ధి చేకూరేలా బైడెన్ సర్కార్ అడుగు ముందుకు వేసింది. గ్రీన్కార్డుపై దేశాల కోటా పరిమితిని ఎత్తేయడంతో పాటుగా దేశంలో చట్టవిరుద్ధంగా తలదాచుకుంటున్న 1.1కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి వీలు కల్పించే అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని గురువారం కాంగ్రెస్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కాంగ్రెస్ ఉభయ సభలు ఆమోదించి, అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేస్తే అమెరికాలో ఉంటున్న వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకి, వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారితో పాటు చట్టబద్ధంగా ఉంటున్న వారికి కూడా లబ్ధి చేకూరేలా ఈ బిల్లుని రూపొందించారు. దీనిని సెనేటర్ బాబ్ మెనెండెజ్, కాంగ్రెస్ సభ్యురాలు లిండా సాంచెజ్లు చట్టసభలో ప్రవేశపెట్టారు. వలస విధానంలో సమూల సంస్కరణల ద్వారా వలసదారుల్లో భయం లేకుండా వారికి ఆర్థిక భద్రత కల్పించేలా అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని తీసుకువచ్చినట్టుగా వారు మీడియాకు చెప్పారు. ‘‘నా తల్లిదండ్రులు మెక్సికో నుంచి వచ్చారు. ఈ దేశంలో వలసదారులు భయాందోళనలు లేకుండా జీవించేలా వలస విధానాన్ని రూపొందించడానికే నేను శ్రమిస్తున్నాను’’ అని సాంచెజ్ అన్నారు. వలస దారులంటే పొరుగువారు, స్నేహితులని చెప్పారు. కాంగ్రెస్లోని ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు పూర్తి మెజారిటీ ఉంది. ఎగువ సభ అయిన సెనేట్లో రెండు పార్టీలకు 50 చొప్పున సీట్లు ఉన్నాయి. సెనేట్లో ఈ బిల్లు పాస్ కావాలంటే మరో 10 మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం. వారి కలలు నెరవేరుద్దాం: బైడెన్ దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఉన్న వలసదారుల సంక్షేమం కోసం రిపబ్లికన్లు ఈ బిల్లుకి మద్దతునిస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ గత ప్రభుత్వ తప్పిదాలను సరవిస్తూ వలసదారులకి న్యాయం జరిగేలా చూద్దామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వలస కుటుంబాలను కలుపుతూ వారికి భద్రమైన జీవితాన్ని ఇవ్వడానికి మానవత్వంతో కూడిన వలస విధానాన్ని ముందుకు తీసుకువెళదామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘వలస విధానంలో సంస్కరణల వల్ల అమెరికాలో ఉండాలనుకునే వారి కలలు ఫలించి, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఈ సంస్కరణలు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల ప్రాధాన్యత కాదు. అమెరికా ప్రజల ప్రాధాన్యం కోసమే ఈ బిల్లుని తెచ్చాం. మన దేశం కోసం కష్టపడే వారి కలలు తీరుద్దాం’’ అని బైడెన్ వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఉన్న వలసదారుల సంక్షేమం కోసం రిపబ్లికన్లు ఈ బిల్లుకి మద్దతునిస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ గత ప్రభుత్వ తప్పిదాలను సరవిస్తూ వలసదారులకి న్యాయం జరిగేలా చూద్దామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వలస కుటుంబాలను కలుపుతూ వారికి భద్రమైన జీవితాన్ని ఇవ్వడానికి మానవత్వంతో కూడిన వలస విధానాన్ని ముందుకు తీసుకువెళదామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘వలస విధానంలో సంస్కరణల వల్ల అమెరికాలో ఉండాలనుకునే వారి కలలు ఫలించి, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఈ సంస్కరణలు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల ప్రాధాన్యత కాదు. అమెరికా ప్రజల ప్రాధాన్యం కోసమే ఈ బిల్లుని తెచ్చాం. మన దేశం కోసం కష్టపడే వారి కలలు తీరుద్దాం’’ అని బైడెన్ వివరించారు. బిల్లులో ఏముంది ? ► గ్రీన్కార్డు మంజూరులో ఏడుశాతం దేశాల కోటాను ఎత్తేస్తూ మొదట దరఖాస్తు చేసుకునే వారికి మొదట గ్రీన్కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో పదేళ్లకు పైబడి గ్రీన్కార్డుల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు బిల్లు చట్టరూపం దాల్చగానే లబ్ధి చేకూరనుంది ► హెచ్1–బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఈ వర్క్ ఆథరైజేషన్ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ► విదేశాల్లో పుట్టి తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో ఉంటున్న పిల్లలందరికీ వారి వయసుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలు లభిస్తాయి. ► అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకి మూడేళ్లలో పౌరసత్వం లభిస్తుంది. ► ఎల్జీబీటీక్యూ హక్కుల పరిరక్షణ, వారి కుటుంబసభ్యులకి, అనాథలకి చట్టపరమైన రక్షణ కలుగుతుంది. ► అమెరికా యూనివర్సిటీల్లో చదివే విదేశీ విద్యార్థుల్లో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) కోర్సులు చేసేవారికి దేశంలో ఉండడం మరింత సులభంగా మారనుంది ► పరిశ్రమల్లో తక్కువ వేతనానికి పని చేసే కార్మికులకు కూడా గ్రీన్కార్డులు ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. -
ట్రంప్ స్వీయ క్షమాభిక్ష..?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి వీడే ముందు మరో అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాపిటల్ భవనంపై దాడికి మద్దతుదారులను ప్రోత్సహించి ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న ట్రంప్ తనని తాను క్షమించుకునే అవకాశాల గురించి యోచిస్తున్నారు. జనవరి 20కి ముందే ట్రంప్ని గద్దె దింపేయాలని కాంగ్రెస్ సభ్యుల నుంచి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ క్షమాభిక్షకి గల సాధ్యా«సాధ్యాలపై సలహాదారులతో సంప్రదిస్తున్నట్టుగా అమెరికా మీడియా అంటోంది. క్షమాభిక్షతో ఎదురయ్యే పర్యవసానాల గురించి నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబానికి క్షమాభిక్షకు వ్యూహరచన క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి ట్రంప్కి చట్టపరంగా కూడా ముప్పును ఎదుర్కొనే అవకాశముంది. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ తన ముందున్న ఏకైక మార్గం స్వీయ క్షమాభిక్ష అని యోచిస్తున్నారు. కేవలం తనొక్కడినే కాకుండా కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్ ట్రంప్ సహా కుటుంబ సభ్యులందరికీ క్షమాభిక్ష పెట్టడానికి వ్యూహ రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేవారంలో ట్రంప్ అధ్యక్షుడి హోదాలో కొందరికి క్షమాభిక్ష పెట్టనున్నారు. అదే సమయంలో తనని తాను క్షమించుకున్నట్టు ప్రకటించుకుంటే పదవి వీడాకా ఎలాంటి సమస్యలు ఎదురుకావన్న భావనలో ట్రంప్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. చట్టపరంగా వీలవుతుందా ? అమెరికా చరిత్రలోనే ఇప్పటివరకు ఏ అధ్యక్షుడు కూడా ఇలా తనని తాను క్షమించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో అమెరికా చట్టాలు అస్పష్టంగా ఉన్నాయి. రాజ్యాంగ నిపుణులు మాత్రం స్వీయ క్షమాభిక్షకు అవకాశం లేదంటున్నారు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారి వాదన. చట్టాల్లో స్వీయ క్షమాభిక్షపై స్పష్టత లేకపోవడంతో ట్రంప్ ఏదైనా చేయవచ్చునని డ్యూక్ లా ప్రొఫెసర్ జెఫ్ పావెల్ అన్నారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్ జొనాథన్ టర్లీ కూడా ట్రంప్ స్వీయ క్షమాభిక్షను ఎవరూ ఆపలేరన్నారు. మూడేళ్ల క్రితం నుంచి.. అధ్యక్షుడికి తనని తాను క్షమించుకునే హక్కు ఉంటుందంటూ మూడేళ్ల క్రితం ట్రంప్ చేసిన ట్వీట్ దుమారాన్నే రేపింది. రాజ్యాంగ నిపుణులు అధ్యక్షుడికి స్వీయ క్షమాభిక్ష హక్కు ఉందని తనతో చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. -
ట్రంప్ని గడువుకు ముందే తప్పిస్తారా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని గడువుకి ముందే గద్దె దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీనికి గల మార్గాలను అన్వేషిస్తోంది. ట్రంప్ని ఎలాగైనా తప్పించాలని సభ్యుల్లో చర్చ జరుగుతోంది. అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ ఈలోగా అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధికరణం ద్వారా ట్రంప్ని తొలగించడానికి గల అవకాశాలను కాంగ్రెస్ సభ్యులు పరిశీలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అభిశంసన తీర్మానం కాగా, రెండోది 25వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన అధికరణం. దేశ ఉపాధ్యక్షుడు, మంత్రి మండలి సభ్యులు కలిసి ఈ అధికరణాన్ని ప్రయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఏమిటీ సవరణ? రాజ్యాంగంలోని 25వ సవరణలో నాలుగు సెక్షన్లు ఉన్నాయి. అమెరికా అ«ధ్యక్షుడు పదవిలో ఉండగానే మరణిస్తే దీనిలో మొదటి సెక్షన్ ద్వారా ఉపాధ్యక్షుడు పదవి బాధ్యతలు చేపడతారు. రెండో సెక్షన్ ఉపాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి సంబంధించినది కాగా, మూడోది అధ్యక్షుడెవరైనా తనంతట తానుగా పదవిలో కొనసాగలేనని, తప్పుకుంటానని చెప్పినప్పుడు ఉపాధ్యక్షుడికి అధికారాన్ని అప్పగించడానికి వినియోగిస్తారు. ఇక అధ్యక్షుడు పాలనా వ్యవస్థపై నియంత్రణ కోల్పోతే ఉపాధ్యక్షుడు, కేబినెట్ సభ్యుల ఆమోదంతో నాలుగో సెక్షన్ ద్వారా అధ్యక్షుడిని తొలగించవచ్చు. అభిశంసన చేయొచ్చా? ట్రంప్ని అభిశంసన ద్వారా కూడా పదవి నుంచి తొలగించవచ్చు. అయితే ఇది ప్రతినిధుల సభ ద్వారా జరగాలి. మూడింట రెండు వంతుల మెజార్టీతో ప్రతినిధుల సభ ఆమోదిస్తే, దానిని సెనేట్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఒకే రోజులో ఈ ప్రక్రియని ముగించేలా వెసులుబాటు ఉంది. గత ఏడాది ట్రంప్పై అభిసంశన తీర్మానం పెట్టినా సెనేట్లో వీగిపోయింది. -
బైడెన్కు కాంగ్రెస్ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్ ఎన్నికకు గురువారం అధికారికంగా కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించింది. క్యాపిటల్ బిల్డింగ్లో ప్రస్తుత అధ్యక్షుడు, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల అసాధారణ హింసాత్మక విధ్వంసం అనంతరం.. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ఆమోదించడం ద్వారా ఆ ఇరువురు డెమొక్రటిక్ నేతల ఎన్నికను నిర్ధారించాయి. పెన్సిల్వేనియా, ఆరిజోనా రాష్ట్రాల ఫలితాలపై రిపబ్లికన్ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రతినిధుల సభ, సెనెట్ తోసిపుచ్చాయి. బైడెన్, కమల 306 ఎలక్టోరల్ సీట్లను, ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి పెన్స్ 232 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు నిర్ధారించాయి. 78 ఏళ్ల బైడెన్ జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ హిల్లో బుధవారం జరిగిన హింసాకాండలో ఒక మహిళ సహా నలుగురు చనిపోయారు. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ మహిళ మరణించారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆందో ళనకారులను చెదరగొట్టిన తరువాత సమావేశాలు మళ్లీ కొనసాగాయి. గురువారం తెల్లవారు జాము వరకు సాగిన సమావేశంలో అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్లను, కౌంటింగ్ను నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరిజోనా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ సభ్యుల అభ్యంతరాలను సెనెట్ 93–6 ఓట్లతో, ప్రతినిధుల సభ 303–121 ఓట్లతో తోసిపుచ్చాయి. పెన్సిల్వేనియా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ సభ్యుల అభ్యంతరాలను సెనెట్ 92–7 ఓట్లతో, ప్రతినిధుల సభ 282–138 ఓట్లతో తోసిపుచ్చాయి. భారత సంతతి ఎంపీలు రో ఖన్నా అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్ కూడా ఆయా అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటమి ఒప్పుకున్న ట్రంప్ బైడెన్, కమల ఎన్నికకు కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించిన అనంతరం.. డొనాల్డ్ ట్రంప్ ఒక అధికారిక ప్రకటనలో ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించనప్పటికీ.. జనవరి 20న అధికార మార్పిడి సజావుగా సాగుతుందని స్పష్టం చేశారు. అత్యద్భుతమైన తన తొలి టర్మ్ అధ్యక్ష పాలనకు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పోలైన వాటిలో న్యాయమైన ఓట్లనే లెక్కించాలన్న డిమాండ్పై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఫలితాలపై కుట్రపూరిత వాదనలను పోస్ట్ చేస్తుండటంతో ట్రంప్ అకౌంట్లను ఫేస్బుక్ 24 గంటల పాటు, ట్విటర్ 12 గంటల పాటు నిలిపివేశాయి. మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ చేసిన ప్రసంగం సహా మూడు ట్వీట్లను బ్లాక్ చేసింది. ప్రమాణస్వీకారం చేసేంత వరకు ట్రంప్ను బ్లాక్ చేయాలని ఫేస్బుక్ నిర్ణయించింది. ట్రంప్ ఫేస్బుక్ను వాడేందుకు అనుమతించడం ప్రమాదకరమని సంస్థ వ్యవస్థాపకుడు జుకర్బర్గ్ అన్నారు. ట్రంప్ అకౌంట్ను 2వారాలు బ్లాక్ చేస్తున్నామని స్పష్టం చేశారు. -
ట్రంప్కి అమెరికా కాంగ్రెస్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికన్ కాంగ్రెస్ ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ వీటో అధికారాలను వినియోగించుకోవడానికి వీల్లేకుండా 74 వేల కోట్ల డాలర్ల వార్షిక రక్షణ విధాన బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ట్రంప్ హయాంలో అధ్యక్షుడి వీటో అధికారాన్ని తోసిరాజని ఒక బిల్లు చట్ట రూపం దాల్చడం ఇదే తొలిసారి. రిపబ్లికన్ పార్టీకి బలం ఉన్న కాంగ్రెస్లోని ఎగువ సభ అయిన సెనేట్ కూడా ట్రంప్ అధికారాన్ని పక్కకు పెట్టి నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)ని 81–13 ఓట్ల తేడాతో ఆమోదించడం గమనార్హం. ఈ పరిణామంతో అధికారానికి దూరమవుతున్న క్షణాల్లో సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్కి ఎదురు దెబ్బ తగిలిట్టనయింది. ఈ వారం మొదట్లోనే ప్రతినిధుల సభ ఈ బిల్లుని 322–87 ఓట్లతో ఆమోదించింది. ట్రంప్ రక్షణ బిల్లుని మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ బిల్లులోని కొన్ని అంశాలు దేశ భద్రతకు భంగకరంగా ఉన్నాయన్నది ఆయన వాదన. కానీ అమెరికా ప్రజాప్రతినిధులు మాత్రం ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేశారు. సాధారణంగా కాంగ్రెస్లోని రెండు సభలు బిల్లుని ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు సంతకం చేస్తే అది చట్టరూపం దాలుస్తుంది. అయితే అధ్యక్షుడు తన వీటో అధికారాన్ని వినియోగించి బిల్లుని తిప్పి పంపడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అధ్యక్షుడు బిల్లుని వీటో చేసే అవకాశం లేకుండా కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజార్టీతో బిల్లుని చట్టంగా మార్చే అవకాశం ఉంది. ట్రంప్ ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉండడంతో కాంగ్రెస్లో ఉభయ సభలు ఆయన సంతకం అవసరం లేకుండానే బిల్లుని ఆమోదించాయి. దేశ భద్రత, మిలటరీ అవసరాలు, సైనిక కుటుంబాలకు అండగా ఉండడానికి కావల్సిన నిధులను మంజూరు చేసే బిల్లు కావడంతో కాంగ్రెస్ ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆమోదించింది. భారత్లో 19 వేల కేసులు న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 19,079 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,05,788కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్తో 224 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,49,218కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 99,06,387కు చేరిం. రికవరీ రేటు 96.12 శాతానికి చేరింది. యూకే నుంచి భారత్కు వచ్చిన మరో నలుగురికి బ్రిటన్ వేరియంట్ కరోనా సోకింది. దీంతో మొత్తం బ్రిటన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య భారత్లో 33కు చేరింది. -
పథకం ప్రకారమే గల్వాన్ ఘర్షణలు
న్యూఢిల్లీ: భారత్ను లక్ష్యంగా చేసుకొని చైనా చేసే కుట్రలు, కుతంత్రాలు మరోసారి బట్టబయలయ్యాయి. గత జూన్లో భారత్కు చెందిన 20 మంది సైనికుల్ని బలి తీసుకున్న గల్వాన్ ఘర్షణల్ని డ్రాగన్ దేశం పక్కాగా కుట్ర పన్ని పాల్పడినట్టుగా అమెరికా–చైనా ఆర్థిక, భద్రత రివ్యూ కమిషన్ అమెరికన్ కాంగ్రెస్కి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు గత కొన్ని దశాబ్దాలుగా సరిహద్దుల్లో నెలకొన్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించింది. లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జూన్ 15న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), భారత సైనికుల మ««ధ్య హోరాహోరీ జరిగిన పోరులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోతే, చైనా తరఫున ఎంత ప్రాణ నష్టం జరిగిందో డ్రాగన్ దేశం ఇప్పటికీ వెల్లడించలేదు. చైనా ఒక పథకం ప్రకారమే సరిహద్దుల్లో భారత్తో కయ్యానికి కాలు దువ్విందని ఆ నివేదిక స్పష్టం చేసింది. వారాల ముందు నుంచే... గల్వాన్ ఘర్షణలకు కొద్ది వారాల ముందే చైనా రక్షణ మంత్రి తమ సైన్యం సరిహద్దుల్లో ఘర్షణలకు దిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్.. అమెరికా, చైనా మధ్య జరిగే పోరులో భారత్ కల్పించుకుంటే చైనాతో ఆర్థిక, వాణిజ్య బంధాలు తెగిపోతాయని హెచ్చరించింది. ఘర్షణకు ముందే చైనా ఆర్మీకి చెందిన వెయ్యి మంది సైనికులు గల్వాన్ లోయను చుట్టుముట్టడం శాటిలైట్ ఇమేజ్లో కనిపించింది. భారీగా ఆయు«ధాల మోహరింపు దృశ్యాలు కూడా ఆ చిత్రాల్లో కనిపించాయని ఆ నివేదిక ప్రస్తావించింది. -
ట్రంప్ చర్యలతో మరింత ప్రాణనష్టం: బైడెన్
వాషింగ్టన్: కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సరైన సహకారం అందకపోతే చాలా మంది అమెరికన్లు చనిపోయే అవకాశముందని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను తిరస్కరించిన విషయం తెలిసిందే. కొత్త ఉపశమన చట్టాన్ని ఆమోదించాలని యుఎస్ కాంగ్రెస్ను జో బైడెన్ కోరారు. కోవిడ్ -19 మహమ్మారి తరువాత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి వ్యాపారవేత్తలు ,కార్మిక నాయకులు కలిసి పనిచేయాలన్నారు. ‘మనము డార్క్ వింటర్లోకి వెళ్తున్నాము. కొన్ని విషయాలు సులభతరం అయ్యే ముందు కఠినంగానే ఉంటాయి’ అని బైడెన్ అన్నాడు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మిలియన్ల కొద్దీ ఉద్యోగ నష్టాలను చవిచూసిన ఆర్థిక వ్యవస్థను జో బైడన్ రాబోయే కాలంలో వాటి భారాన్నిమోయనున్నారు.ఇప్పటికే అమెరికాలో 2,46,000 మందికి పైగా మరణించారు. రోజువారీగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి 20 న బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరోవైపు ట్రంప్ తన మొండి వైఖరిని వీడడంలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిచానని ట్వీట్లు వేస్తున్నారు. మోడెర్నా వ్యాక్సిన్ ప్రకటన తరువాత,‘మరొక టీకా ఇప్పుడే ప్రకటించారు. ఈసారి మోడెర్నా95% ప్రభావవంతంగా పనిచేస్తుంది. చరిత్రకారులారా గుర్తుంచుకోండి.. చైనా మహమ్మారిని అంతం చేసే ఈ గొప్ప ఆవిష్కరణలు అన్నీ నా పాలనలోనే బయటకు వచ్చాయి. ’ అని ట్రంప్ అన్నారు. -
అమెరికా అధ్యక్ష ఫలితం తేలకపోతే...
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘ఎలక్టోరల్ కాలేజీ’ ఓట్లలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోయినా, ఎన్నికలు వివాదాస్పదమైనా కోర్టులు జోక్యం చేసుకొని తీర్పులు చెప్పడం అనివార్యమని అనుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా నిర్ణయాధికారాన్ని అమెరికా పార్లమెంట్ (కాంగ్రెస్)కు అప్పగిస్తారు. వాస్తవానికి దేశాధ్యక్షడి ఎన్నికల్లో అమెరికా పార్లమెంట్ అధికారం ఉండకూడదనే ఉద్దేశంతో అమెరికా ఎన్నికల రాజ్యాంగ నిర్ణేతలు ‘ఎలక్టోరల్ కాలేజీ’ని ఏర్పాటు చేశారు. ఈ కాలేజీలో ఫలితం తేలనప్పుడు కాంగ్రెస్కు అప్పగించడం, అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ‘ప్రజాప్రతినిధుల సభ’కు అప్పగించే ఆనవాయితీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కనిపిస్తోంది. 1800, 1824లో జరిగిన ఎన్నికల్లో ‘విజేత’ను ఎలక్టోరల్ కాలేజీ తేల్చకపోవడంతో నాడు దేశాధ్యక్షుడిని నిర్ణయించే అధికారాన్ని ప్రజాప్రతినిధుల సభకు అప్పగించగా, 1800 సంవత్సరంలో థామస్ జఫర్సన్, 1824లో జాన్ క్విన్సీ ఆడమ్స్ను ప్రజా ప్రతినిధుల సభనే ఎన్నుకుంది. దేశంలో ద్విపార్టీ వ్యవస్థ బలపడుతూ రావడంతో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని ఎన్నుకునే సంప్రదాయం దూరమవుతూ వచ్చింది. దేశాధ్యక్షుడి ఎన్నికల్లో ‘కాంగ్రెస్’ ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదనే ఎన్నికల నియమావళిని రచించిన నిర్మాతల స్ఫూర్తిని పరిగణలోకి తీసుకొని 18వ శతాబ్దంలో ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. (ట్రంప్ నిర్ణయాలన్నీ ‘తలకిందులే’నా?!) ఎలక్టోరల్ కాలేజీ ఫలితాలు టై అయితే, అంటే ట్రంప్, బైడెన్లకు చెరి 269 సీట్లు వచ్చినా, ఓట్ల వివాదం వల్ల ఎవరికి 270 ఓట్లు వచ్చినా కాంగ్రెస్కు అప్పగించే అవకాశాలు నేడు కూడా కనిపిస్తున్నాయి. 2020 ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని ట్రంప్ న్యాయవాదులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అమెరికా సుప్రీంకోర్టు కూడా ప్రతి అధ్యక్ష ఎన్నిక వివాదాల్లో జోక్యం చేసుకోదు. ఎన్నికలకు సంబంధించిన చట్టాలు, నిబంధన విషయంలో అస్పష్టత ఉంటే వాటికి వివరణ ఇచ్చేందుకు మాత్రమే పరిమితం అవుతుంది. మిగతా సందర్భాల్లో రాజకీయ నిర్ణయాధికారాన్ని రాజకీయ వ్యవస్థకే వదిలేస్తుంది. 2000 సంవత్సరంలో అమెరికా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని తీర్పు చెప్పడం చాలా అరుదు. (నువ్వు కూడా ప్రెసిడెంట్ కావొచ్చు!) అమెరికా ప్రజా ప్రతినిధుల సభలో డెమోక్రట్లకు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నందున నిర్ణయాధికారాన్ని సభకు అప్పగిస్తే డెమోక్రట్ల అభ్యర్థి అయిన జో బైడెన్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనుకుంటే పొరపాటు. ఎన్నికల్లో పాల్గొనేది ప్రజా ప్రతినిధులే అయినా ఎంత మంది సభ్యులుంటే అన్ని ఓట్లు కాకుండా ప్రతి రాష్ట్రానికి ఒక్క ఓటు చొప్పునే కేటాయిస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులంతా కలిసి తమ రాష్ట్రం ఓటును ఎవరికి వేయాలనే విషయమై నిర్ణయం తీసుకుంటారు. నాలుగు కోట్ల మంది జనాభా కలిగిన కాలిఫోర్నియాకు, ఆరు లక్షల జనాభా కలిగిన వ్యోమింగ్ రాష్ట్రానికి ఒకే ఓటు ఉంటుంది. ప్రజా ప్రతినిధుల సభలో డెమోక్రట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వారికన్నా ఎక్కువ రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు ప్రాతినిథ్యం ఉంది. 2018 నుంచి 26 రాష్ట్రాల్లో రిపబ్లికన్ల ప్రాతినిథ్యం కొనసాగుతోంది. పైగా ఇటీవలి కాలంలో మిన్నెసోట, ఐయోవా రాష్ట్రాల్లో డెమోక్రట్లు ప్రాతినిథ్యం కోల్పోయారు. అందుకనే ఎన్నికలు వివాదమైతే అమెరికా కాంగ్రెస్ ద్వారా ట్రంప్కు కలిసొస్తుందని మొదటి నుంచి ఆయన ఎన్నికల సలహాదారులు, వ్యూహకర్తలు చెబుతూ వస్తున్నారు. -
యూఎస్ ఎలక్షన్స్: చరిత్ర సృష్టించిన నల్లజాతి గే
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్(32) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఎస్ కాంగ్రెస్(పార్లమెంట్)కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడిగా(గే) టోరెస్ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా పని చేస్తున్న ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని 15వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి పార్లమెంట్కు ఎన్నికయ్యాడు. తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పాట్రిక్ డెలిసెస్ను ఓడించాడు. నేటి నుంచి కొత్త శకం మొదలవుతుందని టోరెస్ వ్యాఖ్యానించాడు. తన గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. తాను ఆఫ్రో–లాటినో అని టోరెస్ తరచూ చెబుతుంటాడు. ( భారత సంతతి విజేతలు ) 2013 నుంచి సిటీ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అలా మాండెయిర్ జోన్స్(33) అనే మరో నల్లజాతి గే కూడా వెస్ట్చెస్టర్ కౌంటీ నుంచి పోటీ చేశాడు. ఫలితాన్ని ఇంకా వెల్లడించకపోవడంతో అతడు గెలిచాడా లేదా అనే తెలియరాలేదు. ఒకవేళ గెలిస్తే అమెరికా కాంగ్రెస్లో ఇద్దరు నల్లజాతి స్వలింగ సంపర్కులు ఉన్నట్లు అవుతుంది. సామాజిక వివక్షను తట్టుకొని, ప్రజల మద్దతు పొంది, నల్లజాతి స్వలింగ సంపర్కులు పార్లమెంట్లో అడుగుపెడుతుండడం శుభపరిణామమని ప్రజాస్వామ్య ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
టెక్ దిగ్గజాలకు ఊహించని ప్రశ్నలు..
వాషింగ్టన్ : గూగుల్, ఫేస్బుక్లు తమ మార్కెట్ ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని డెమొక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి టెక్ దిగ్గజాలకు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. అమెరికన్ కాంగ్రెస్లో జ్యుడిషియరీ కమిటీ ఎదుట బుధవారం విచారణకు హాజరైన గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ సీఈఓలను సెనేటర్లు నిలదీసినంత పనిచేశారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఉమ్మడి మార్కెట్ విలువను కలిగిన ఈ దిగ్గజాలు మార్కెట్ వాటా కోసం చిన్న సంస్ధలను దారుణంగా నలిపేస్తున్నాయని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు టెక్ సీఈఓలు మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్లను కడిగేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణలో దిగ్గజ సిఈఓలను ప్రతినిధులు తమ పదునైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.గూగుల్, అల్ఫాబెట్ సీఈఓకు ప్రతినిధుల నుంచి తీవ్ర ఆరోపణలు, ప్రశ్నలు ఎదురవగా వీటన్నింటినీ సమీక్షించి తిరిగి సభకు వివరిస్తానని పిచాయ్ వివరణ ఇచ్చారు. గూగుల్ కంటెంట్ చోరీకి పాల్పడుతోందని డెమొక్రాట్, యాంటీ ట్రస్ట్ సబ్కమిటీ చీఫ్ డేవిడ్ సిసిలిన్ సుందర్ పిచాయ్ను నిలదీశారు. యెల్ప్ ఇంక్ నుంచి గూగుల్ రివ్యూలను దొంగిలిస్తోందని, దీన్ని ఆక్షేపిస్తే సెర్చి రిజల్ట్స్ నుంచి యెల్ప్ను డీలిస్ట్ చేస్తామని గూగుల్ బెదిరిస్తోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల గురించి నిర్ధిష్టంగా తాను తెలుసుకోవాలనుకుంటున్నానని పిచాయ్ బదులిచ్చారు. చదవండి : సుందర్ పిచాయ్: ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాల్టీ యూజర్ల కోసం గూగుల్ కంటెంట్ చోరీకి పాల్పడుతుందనే ఆరోపణలతో తాను ఏకీభవించనన్నారు. ఇక 2012లో ఇన్స్టాగ్రామ్ను ఫేస్బుక్ కొనుగోలు చేయడంపై ఎఫ్బీ చీఫ్ జుకర్బర్గ్ పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ పెనుముప్పుగా మారుతుందనే ఆందోళనతోనే దాన్ని కొనుగోలు చేశారా అని ప్రతినిధులు జుకర్బర్గ్ను ప్రశ్నించారు. తాము ఇన్స్టాగ్రామ్ను కొనుగోలుచేసిన సమయంలో అది ఓ చిన్న ఫోటో షేరింగ్ యాప్ మాత్రమేనని జుకర్బర్గ్ బదులిచ్చారు. ఈ ఒప్పందాన్ని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సమీక్షించిందని గుర్తుచేశారు. ఫేస్బుక్ తన ప్రత్యర్ధులను ఏయే సందర్భాల్లో అనుకరించిందని మరో ప్రతినిధి ప్రమీలా జయపాల్ జుకర్బర్గ్ను అడగ్గా ఇతరుల ముందుకెళ్లిన ఫీచర్లు కొన్నింటిని తాము అనుసరించిన సందర్భాలున్నాయని అంగీకరించారు. నలుగురు దిగ్గజ టెక్ అధినేతలు ఒకేసారి చట్టసభ సభ్యుల ముందు విచారణకు హాజరవడం ఇదే తొలిసారి. -
చైనా యాప్స్ నిషేధించండి
వాషింగ్టన్: జాతీయ భద్రత దృష్ట్యా, చైనాకు సంబంధించిన 60 యాప్స్పై నిషేధం విధించి భారత్ అసాధారణ చర్యకు పూనుకుందని, ఇదే మాదిరిగా అమెరికాలో సైతం టిక్టాక్ తదితర చైనా యాప్లను నిషేధించాలని 24 మంది కాంగ్రెస్ రిపబ్లికన్ సభ్యుల బృందం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కోరింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధం ఉన్న టిక్ టాక్, ఇతర సామాజిక మాధ్యమాలను అమెరికా మార్కెట్లోకి ప్రవేశించకుండా నిరోధించాలని కోరుతూ చట్టసభ సభ్యులు ట్రంప్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ చట్టాలను బట్టి, టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్తో సహా చైనా కంపెనీలు సామాజిక మాధ్యమాల వినియోగదారుల డేటాను అధికార కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వాల్సి ఉంటుందని, ఇది అమెరికా జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అని లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని వైట్హౌస్ అధికారి మీడియాకు వెల్లడించారు. -
అలసిపోయాం.. ఇక ఆపండి!
వాషింగ్టన్: తన సోదరుడిలా నల్లజాతీయులెవరూ అమెరికా పోలీసుల దాష్టీకాలకు బలికాకుండా చూడాలని ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ తమ్ముడు ఫిలోనిస్ ఫ్లాయిడ్ కోరుకున్నారు. జార్జ్ హత్య విచారణలో భాగంగా అమెరికా చట్టసభ(కాంగ్రెస్) ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. అగ్రరాజ్యంలో నల్లజాతీయులపై దారుణాలు కొనసాగుతుండటం పట్ల ఫిలోనిస్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘నేను అలిసిపోయాను. ఇప్పుడు అనుభవిస్తున్న బాధతో నేను విసిగిపోయాను. ఎటువంటి కారణం లేకుండా నల్లజాతీయులు చంపబడిన ప్రతిసారీ అనుభవిస్తున్న బాధతో నేను వేసారిపోయాను. దీన్ని ఆపమని మిమ్మల్ని అడగడానికి నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను. ఈ బాధలు ఇక వద్దు’ అని ఫిలోనిస్ ఫ్లాయిడ్ గద్గత స్వరంతో అన్నారు. జార్జ్ తమ్ముడి మాటలతో విచారణ గది నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక నల్లజాతీయుడి ప్రాణం విలువ 20 వేల డాలర్లా? ఇది 2020. ఇక చాలు’ అన్న ఫిలోనిస్ ఆవేదన అందరినీ కదిలించింది. (ఫ్లాయిడ్కు కన్నీటి వీడ్కోలు) ఆ వీడియో బాధ కలిగిస్తోంది.. ‘మంచి పనులు చేస్తూ ఈ దేశానికి, ప్రపంచానికి అవసరమైన నాయకులుగా ఉండండి. పోలీసు హింస, అన్యాయానికి జార్జ్ ఫ్లాయిడ్ మరణం ప్రపంచ ప్రతీక నిలిచింది. కానీ జీవితంలో అతడు తండ్రి, సోదరుడు, సౌమ్యుడైన దిగ్గజం’ అని చట్టసభ సభ్యులతో ఫిలోనిస్ అన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మెడపై ఒక పోలీసు అధికారి మోకాలు ఉంచి ఊపిరాడకుండా చేసిన వీడియో న్యాయం కోసం చేసే ఉద్యమాలకు కొత్త ఊపిరి పోసినప్పటికీ.. పదేపదే జార్జ్ చివరి క్షణాలను గుర్తుచేయడం తమ కుటుంబానికి చాలా క్షోభ కలిగిస్తోందన్నారు. ‘నేను ఆ వీడియో గురించి పదే పదే ఆలోచిస్తాను. మనుషులతో ఎవరూ అలా ప్రవర్తించరు. జంతువులను కూడా అలా చేయరు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సోదరుడి చావుకు కారణమైన పోలీసులను శిక్షించి తమకు న్యాయం చేయాలన్నారు. పోలీసు వ్యవస్థను ఇప్పటికైనా సంస్కరించాలని అమెరికా చట్టసభకు విన్నవించారు. తన సోదరుడి మరణం వృధా కాకుండా ఉండాలంటే వైట్హౌస్ సమీపంలోని వీధికి పెట్టిన ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ పేరును కొనసాగించాలని ఫిలోనిస్ కోరారు. (అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్ ) కరోనా కారణంగా వర్చువల్ విధానంలో విచారణ చేపట్టారు. ఫ్లాయిడ్ కుటుంబం తరపు న్యాయవాది బెంజమిన్ క్రంప్, పౌర హక్కుల నాయకులు, చట్టసభ సభ్యులు సహా కొంతమంది మాత్రమే ముఖానికి మాస్కులతో విచారణకు హాజరయ్యారు. పోలీసులు అనుసరిస్తున్న పద్ధతులు, జవాబుదారీతనంలో సంస్కరణలు చేపట్టాలని బెంజమిన్ క్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, పోలీసు విభాగానికి బడ్జెట్ను కోత పెట్టాలని, ఈ నిధులను సామాజిక సేవకు వినియోగించాలని ఆందోళకారులు డిమాండ్ చేస్తున్నారు. (పోలీస్ విభాగం రద్దుకు ఓటు) -
యూఎస్ కాంగ్రెస్ బరిలో మంగ అనంతత్ములా
వాషింగ్టన్ : అమెరికా చట్ట సభ బరిలో భారత సంతతికి చెందిన అమెరికన్ మహిళ నిలిచారు. ఐవీ లీగ్ పాఠశాలలో అసియా ప్రజలపై చూపిన వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మంగ అనంతత్ములా వర్జీనియా స్టేట్ నుంచి యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగిన ఆమె ఇప్పటికే రక్షణ సంబంధిత కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. సెనేట్ పోటీకి సంబంధించి మంగ ఇప్పటికే 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి రిపబ్లిక్ పార్టీ నుంచి నామినేట్ అయ్యారు. తద్వారా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్కు పోటీ చేస్తున్న మొదటి భారత సంతతి అభ్యర్ధిగా నిలిచారు. ఈమె ఇటీవలే హెర్న్డన్ నుంచి తన ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. సంపన్న జీవితాన్ని విడిచి.. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన మంగ.. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించంచారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం భర్త ఉన్నత చదువుల నిమిత్తం కుమారుడితో కలిసి అమెరికాకు వెళ్లారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంపన్న కుటుంబంలో జన్మించిన తాను.. భర్త చదువుల కోసం విలాసవంతమైన జీవితాన్ని వదిలి అమెరికాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతినిధుల సభకు ఎన్నికైతే అమెరికా ఇండియా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ట్యాక్స్లను తగ్గించేందుకు, మహిళల హక్కుల కోసం పోరాడుతానని తెలిపారు. ఆరోగ్య రంగాన్ని మెరుగు పరుస్తానని, చిన్న, మధ్య తరహ పరిశ్రయలను అభివృద్ధి పరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమాజానికి, ముఖ్యంగా అమెరికాలోని హిందువుల తరఫున పోరాడుతానని తెలిపారు. అదే విధంగా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ మహళ ప్రమీలా జయపాల్ను అనంతత్ములా విమర్శించారు. కాంగ్రెస్లో కశ్మీర్ అంశంపై తీర్మానం చేసినందుకు ఆమెపై మండిపడ్డారు. ఆరుసార్లు గెలిచిన కాంగ్రెస్ సభ్యుడు జెర్రీ కొన్నోలీని నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఓడిస్తానని అనంతత్ములా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదారులు ఈ సారి పెద్ద సంఖ్యలో రిపబ్లికన్ పార్టీలోకి మారుతున్నారు. వర్జీనియాలోని హెర్న్ డన్ డెమొక్రాటిక్ కంచుకోట కోట అని చెప్పవచ్చు. హెర్న్డన్ దాదాపు 17 శాతం ఆసియా ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ఏడు శాతం భారతీయ సంతతికి చెందినవారు ఉన్నారు. -
డొనాల్డ్ ట్రంప్కి ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం సెనేట్లో వీగిపోయింది. తద్వారా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్కు రాజకీయ విజయం లభించినట్లయింది. ట్రంప్పై డెమొక్రాట్లు పెట్టిన అభిశంసన తీర్మానం రిపబ్లికన్ల ఆధిక్యంలోని సెనేట్లో వీగిపోవడంతో ట్రంప్కి ఊరట లభించింది. అయితే, అభిశంసనకు గురైన అధ్యక్షులెవరూ తర్వాతి ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. అభిశంసనను ఎదుర్కొన్నా, తిరిగి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోన్న తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంపే అవుతారు. అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణలతో ట్రంప్పై గత డిసెంబర్లో డెమొక్రటిక్ పార్టీ అమెరికన్ కాంగ్రెస్లో అభిశంసనను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఆమోదం పొందిన అభిశంసన తీర్మానాన్ని తాజాగా సెనేట్లో ప్రవేశపెట్టారు. ఇందులో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగం 52–48 ఓట్ల తేడాతో, కాంగ్రెస్ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం 53–47 ఓట్ల తేడాతో వీగిపోయాయి. అభిశంసనను తిప్పికొట్టేందుకు 100 మంది సభ్యుల సభలో మూడింట రెండొంతుల ఓట్లు అవసరం. సెనేట్లో అ«ధికార రిపబ్లికన్ పార్టీకి 53 సీట్లు, డెమొక్రటిక్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. ట్రంప్పై వెల్లువెత్తిన ఆరోపణలు.. రాబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ ఇచ్చే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ను నైతికంగా దెబ్బతీసేందుకు ట్రంప్ ఉక్రెయిన్ సాయం తీసుకున్నారనీ, బదులుగా ఉక్రెయిన్కు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు విమర్శలొచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బిడెన్పైనా, ఆయన కొడుకు హంటర్పై ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేయాలని ఉక్రెయిన్పై ట్రంప్ ఒత్తిడితెచ్చారన్న విమర్శలొచ్చాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడారనీ డెమొక్రటిక్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే ట్రంప్పై అభిశంసన తీర్మానం తీసుకువచ్చింది. ఖండించిన ట్రంప్..: తనపై అభిశంసనకు డెమొక్రటిక్ పార్టీ చేసిన యత్నం సిగ్గుచేటని అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. 2020లోనూ, ఆ తరువాత కూడా అమెరికా ప్రజల పక్షాన నిలుస్తానని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు అధ్యక్షభవనం ప్రకటించింది. తొలి నుంచీ తనపై ఆరోపణలు అవాస్తవమని చెబుతున్న ట్రంప్.. అభిశంసనపై దేశం విజయం సాధించిందనీ, అధ్యక్షభవనం నుంచి ప్రకటన చేస్తానని ట్విట్టర్లో వెల్లడించారు. అయితే, అమెరికా ప్రజల ఆకాంక్షలనూ, రాజ్యాంగ బాధ్యతలను సెనేటర్లు విస్మరిస్తున్నారనీ, వాస్తవాలను గుర్తించడంలో వారు విఫలమవుతున్నారని డెమొక్రటిక్ పార్టీ విమర్శించింది. -
అమెరికా ఎన్నికల్లో తెలుగు వ్యక్తి పోటీ
అర్వపల్లి: అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో తెలుగు వ్యక్తి పోటీ పడుతున్నాడు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన ప్రవాస భారతీయుడు ఆలూరు బంగార్రెడ్డి అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్ఏ) కాంగ్రెస్కు టెక్సాస్ రాష్ట్రంలోని టెక్సాస్ 22 స్థానానికి (మన దేశంలో లోకసభ స్థానంతో సమానం) డొనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాగా ఆ దేశంలో ఎన్నికల్లో పోటీకి ముందు సంబంధిత పార్టీ నిర్వహించే ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగానే రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం బంగార్రెడ్డి నామినేషన్ వేశారు. జాజిరెడ్డిగూడేనికి చెందిన ఆలూరి రామచంద్రారెడ్డి–సక్కుబాయమ్మల కుమారుడు బంగార్రెడ్డి 25 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో స్థిరపడ్డారు. -
లైంగిక ఆరోపణలపై యుఎస్ కాంగ్రెస్ సభ్యురాలు రాజీనామా
వాషింగ్టన్ : అమెరికన్ కాంగ్రెస్లో పనిచేసే ఓ ఉద్యోగితో శారీరక సంబంధం కలిగిఉందనే ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణను ఎదుర్కొంటున్న అమెరికన్ డెమొక్రాట్ సభ్యురాలు కేటీ హిల్ తన పదవికి రాజీనామా చేశారు. 2018 నవంబర్లో కాలిఫోర్నియా నుంచి యూఎస్ కాంగ్రెస్కు ఎన్నికైన డెమొక్రాట్, 32 సంవత్సరాల హిల్ తన రాజీనామా లేఖను ట్విటర్లో పోస్ట్ చేశారు. సమాజం, దేశం, తన ప్రాంత ప్రయోజనాల కోసం ఇది సముచితమైన నిర్ణయమని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో తాను అమెరికన్ కాంగ్రెస్కు ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన సమయంలో తన ప్రచార సిబ్బందిలో ఒకరితో అభ్యంతరకర సంబంధం నెరపిన విషయం వాస్తవమేనని హిల్ అంగీకరించారు. అయితే తన కార్యాలయ సిబ్బందితో తనకు లైంగిక సంబంధం లేదని నిరాకరించారు. మరోవైపు చట్టసభకు సంబంధించి ఆమెకు కేటాయించిన సిబ్బందితో హిల్కు అనైతిక బంధం ఉందనే ఆరోపణలపై విచారణ జరుగుతోందని ఎథిక్స్ కమిటీ పేర్కొంది. భర్తతో విడాకుల ప్రక్రియ సాగుతున్న క్రమంలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని హిల్ మండిపడ్డారు. అభ్యంతరకర ఫోటోలు విడుదల చేసిన మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు చేపడతానని హెచ్చరించారు. వ్యక్తిగత క్షణాల్లో తీసుకున్న ప్రైవేట్ ఫోటోలను తనకు వ్యతిరేకంగా ఆయుధంలా వాడటం చట్టవిరుద్ధమని, అది తన గోప్యతపై దండెత్తడమేనని ఆమె దుయ్యబట్టారు. -
డాలర్ డ్రీమ్స్కి పచ్చజెండా!
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం, ఉపాధి కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డు బిల్లుపై అమెరికా కాంగ్రెస్లో ఓటింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే దశాబ్దాల తరబడి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు భారీగా ప్రయోజనాలు దక్కుతాయి. గ్రీన్ కార్డు విషయంలో అమెరికా ఒక్కో దేశానికి గరిష్టంగా ఏడు శాతానికి మించి ఇవ్వకూడదన్న కోటా నిబంధనలు భారత్ వలసదారులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. జనాభా ఎక్కవ ఉన్న దేశాలకు, తక్కువ ఉన్న దేశాలకు ఒకే నిబంధనలు అమలవుతూ ఉండడంతో భారత్, చైనా, ఫిలిప్పీన్స్కు చెందిన వలసదారుల దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ ఇక్కట్లకు తెరదించడానికి గత ఫిబ్రవరిలో ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్ యాక్ట్ (హెచ్ఆర్1044) బిల్లును భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హ్యారిస్ తన సహచరుడు మైక్లీతో కలిసి సెనేట్లో ప్రవేశపెట్టారు. ఇదే తరహా బిల్లును కాంగ్రెస్ ప్రతినిధుల సభలో జో లాఫ్రెన్, కెన్బర్గ్లు ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో మొత్తం 435 సభ్యులకు గాను రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీకి చెందిన 310 మందికి పైగా ప్రజాప్రతినిధుల మద్దతు ఈ బిల్లుకు ఉంది. 203 మంది డెమొక్రాట్లు, 108 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు కో స్పాన్సరర్లుగా ఉన్నారు. 290 ఓట్లు బిల్లుకు అనుకూలంగా వస్తే దీనిపై ఎలాంటి చర్చలూ, సవరణలూ లేకుండా ఆమోదం పొందుతుంది. భారతీయులకు కలిగే ప్రయోజనాలేంటి? భారతీయుల డాలర్ డ్రీమ్స్ సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఏకంగా 3 లక్షల మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వలస విధానం వల్ల ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులు, ఐటీ వృత్తి నిపుణులు ఎక్కువగా నష్టపోతున్నారు. అతి పెద్ద ఐటీ కంపెనీలు కూడా తక్కువ వేతనాలకు భారతీయుల్ని నియమిస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తున్నాయి. గ్రీన్కార్డు బిల్లు దేశాల కోటా పరిమితిని ఎత్తివేయడంతో పాటుగా కుటుంబాల ప్రాతిపదికన వలస వీసా కోటాను 15శాతానికి పెంచనుంది. అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వీలుగా హెచ్1బీ వీసా దారులకు ఈబీ కేటగిరీ కింద ప్రతి ఏటా 1.4 లక్షల మందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తున్నారు. ఏడు శాతం కోటా నిబంధనలతో ఒక్కో దేశం 9,800కు మించి ఎక్కువ కార్డులు పొందలేదు. ఫలితంగా జనాభా అత్యధికంగా ఉండే ఇండియా, చైనా వంటి దేశాల నిపుణులు గ్రీన్ కార్డు కోసం ఎ క్కువ కాలం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు ఇక ఆ ఎదురుచూపులకు తెరపడినట్టే. మనోళ్లలో 90 శాతం మందికి లబ్ధి గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయుల్లో ఇప్పటివరకు ప్రతీ ఏడాది 25 శాతం మందికి మాత్రమే మంజూరవుతూ వచ్చాయి. కొత్త చట్టం రూపుదాల్చితే వచ్చే పదేళ్లలోనే 90 శాతానికిపైగా భారతీయులకు గ్రీన్ కార్డులు లభిస్తాయని యూఎస్సీఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్) అంచనా వేస్తోంది. విదేశాల్లో భారతీయం కెనడాలో 51% పైకి కెనడాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్టు ఆ దేశ ప్రభుత్వ వలస విభాగం వెల్లడించింది. 2018 సంవత్సరానికి 39,500 మందికిపైగా భారతీయులకు ఈ ఏడాది గ్రీన్ కార్డులు మంజూరైనట్టు ఒక నివేదికలో తెలిపింది. 2017తో పోల్చి చూస్తే గ్రీన్ కార్డులు 51శాతం పెరిగినట్టు కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీ అండ్ సిటిజన్ షిప్ నివేదిక వివరించింది. కెనడాలో జస్టిన్ ట్రాడ్యూ నేతృత్వంలో ప్రభుత్వం ఈ ఏడాది ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ విధానం ద్వారా ఏకంగా 92 వేల మంది వలసదారులకు శాశ్వత నివాసం కోసం అనుమతులు మంజూరు చేసింది. దీని ప్రకారం 46శాతం మంది భారతీయులకు కెనడా పౌరసత్వం వస్తే, ఆ తర్వాత స్థానం నైజీరియన్లు, చైనీయులు ఉన్నారు. అమెరికాలో వలస విధానాన్ని కఠినతరం చేయడం, హెచ్1బీ వీసాలు లభించడం కష్టమైపోవడం, గ్రీన్కార్డు మంజూరులో జాప్యాలు, వలసదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగ అవకాశాలు కరువైపోవడంతో భారతీయుల చూపు ఈ మధ్య అమెరికా నుంచి కెనడా వైపు తిరిగింది. దానికి తగ్గట్టుగానే అక్కడి ప్రభుత్వం రికార్డు స్థాయిలో శాశ్వత నివాసం కోసం వీసాలు మంజూరు చేసింది. షార్జా గోల్డెన్ వీసా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన పారిశ్రామికవేత్త లాలో శామ్యూల్కు శాశ్వత నివాసాన్ని కల్పిస్తూ మొదటిసారిగా షార్జా గోల్డ్కార్డు వీసా మంజూరు చేసింది. కింగ్స్టన్ హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన లాలో శామ్యూల్ గత కొన్నేళ్లుగా యూఏఈలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ అరబ్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు పొందారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అభివృద్ధి కోసం ఈ మధ్య కాలంలో పెట్టుబడుల్ని ఆకర్షించడానికి, ఆర్థికంగా దేశాన్ని పరుగులు పెట్టించడానికి గోల్డెన్ కార్టు వీసా వివిధ దేశాల పారిశ్రామికవేత్తలకు మంజూరు చేస్తోంది. అందులో భాగంగానే లాలో శామ్యూల్కు వీసా లభించింది. ఈ వీసా ప్రకారం స్పాన్సరర్లు లేకుండా శామ్యూల్, ఆయన భార్యా పిల్లలు షార్జాలో శాశ్వత నివాసం ఉండవచ్చు. మధ్య ప్రాచ్య దేశాల్లో ప్లాస్టిక్, మెటల్ ప్రాసెసింగ్ యూనిట్లను నడుపుతూ శామ్యూల్ వరుసగా కొన్నేళ్ల పాటు ఫోర్బ్స్ మ్యాగజైన్లో స్థానం పొందారు. వజ్రాభరణాల సంస్థ మలబార్ గ్రూపు కో చైర్మన్,కేరళలో పుట్టిన డాక్టర్ ఇబ్రహీం హాజీకూ గోల్డెన్ వీసా లభించింది. -
హెచ్1బీ దరఖాస్తుల కోటా పూర్తి
కాలిక్సో/వాషింగ్టన్: 2020 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసా దరఖాస్తుల సంఖ్య అమెరికా కాంగ్రెస్ నిర్దేశించిన 65,000 పరిమితికి చేరుకుందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది. ఈ హెచ్1బీ వీసా దరఖాస్తులను 2019 ఏప్రిల్ నుంచి స్వీకరిస్తున్నామని వెల్లడించింది. అయితే తొలి ఐదురోజుల్లో ఎన్ని హెచ్1బీ దరఖాస్తులు అందాయన్న యూఎస్సీఐఎస్ స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయమై యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎల్. ఫ్రాన్సిస్ సిస్నా మాట్లాడుతూ..‘2019 అక్టోబర్ 1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి అమెరికా కాంగ్రెస్ నిర్దేశించిన పరిమితి మేరకు హెచ్1బీ దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదివి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసిన 20,000 మంది విదేశీయులను ఈ జాబితా నుంచి మినహాయిస్తాం. అలాగే మాస్టర్స్ విభాగానికి సంబంధించి హెచ్1బీ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది’ అని తెలిపారు. అమెరికాలో ఏటా గరిష్టంగా 65,000 మంది విదేశీ నిపుణులకే హెచ్1బీ వీసాలు జారీచేయాలని ఆ దేశ కాంగ్రెస్(పార్లమెంటు) గతంలో యూఎస్సీఐఎస్ను ఆదేశించింది. హెచ్1బీ వీసా జారీ నియమనిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం వల్ల అమెరికాలో మాస్టర్స్ చేసిన 5,340 మంది విదేశీయులకు ఏటా అదనంగా లబ్ధి చేకూరుతుందని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎల్.ఫ్రాన్సిస్ సిస్నా తెలిపారు. అమెరికా–మెక్సికో సరిహద్దులోని డెల్రియో సెక్టార్లో 3.21 కిలోమీటర్ల పొడవు, 30 అడుగుల ఎత్తుతో నిర్మించిన గోడను పరిశీలించాక ట్రంప్ మాట్లాడారు. ‘మాదేశం ఇప్పటికే వలసదారులతో నిండిపోయింది. కాబట్టి సరిహద్దులో ఉన్నవారంతా వెనక్కి వెళ్లిపోండి’ అని అక్రమ వలసదారులు, శరణార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత 2–3 సంవత్సరాలుగా అమెరికాలోకి అక్రమంగా వస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందన్నారు. తాజాగా సరిహద్దు గోడ కారణంగా ఈ వలసలు 56 శాతం తగ్గిపోయాయని గస్తీ అధికారి చావెజ్ పేర్కొన్నారు. -
హెచ్4లకు ఉద్యోగాల రద్దు వద్దు!
వాషింగ్టన్: హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములు దేశంలో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పించే నిబంధనను రద్దు చేయొద్దంటూ అమెరికా కాంగ్రెస్లో ఇద్దరు సభ్యులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములైన హెచ్ 4 వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో కల్పించారు. అప్పటినుంచి లక్షకు పైగా హెచ్ 4 వీసాదారులు, వారిలో అధికులు మహిళలే.. అమెరికాలో ఉద్యోగాలు సాధించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికన్ల ఉద్యోగ భద్రత కారణంగా చూపుతూ ఈ అవకాశాన్ని రద్దు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఏడాది చివరలోగా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చ వచ్చన్న వార్తల నేపథ్యంలో.. అమెరికా కాంగ్రెస్లో అనా జీ ఏషూ, జో లాఫ్రెన్ ‘హెచ్ 4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్’ పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగావకాశాలను నిరాకరించడం వల్ల అమెరికా ఆర్థికవ్యవస్థకు నష్టం కలుగుతుందని, భారత్, చైనా తదితర దేశాలకు చెందిన నిపుణులైన విదేశీ ఉద్యోగులు దేశం విడిచి వెళ్లడం కానీ, లేదా మెరుగైన వీసా నిబంధనలున్న మరో దేశానికి వెళ్లడం కానీ జరిగే అవకాశముం దని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక, సైద్ధాంతిక నిపుణులైన విదేశీయులకు అమెరికా లో ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించేదే హెచ్1 బీ వీసా. భారత్ నుంచి వేలాది మంది ఈ వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హెచ్ 4 వీసాపై అమెరికా వెళ్లిన వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేయడం వల్ల ఆ కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడిందని, అది అమెరికా ఆర్థిక వ్యవస్థకూ ఉపయోగపడిందని లాఫ్రెన్ పేర్కొన్నారు. హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగావకాశం కల్పించడం ఆర్థిక సమానత్వానికి, కుటుంబ విలువలకు సంబంధించిన అంశమన్నారు. -
రిపబ్లికన్లా? డెమొక్రాట్లా?
అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్లో ఉన్న 100 స్థానాల్లో 35 స్థానాలకు ఈ నెల 6న మధ్యంతర ఎన్నికలు (మిడ్ టర్మ్ ఎలక్షన్స్) జరగనున్నాయి. అధ్యక్షుడి పాలనా కాలం మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వీటిని మధ్యంతర ఎన్నికలు అని పిలుస్తారు. ప్రతినిధుల సభ, సెనేట్తో పాటు 39 రాష్ట్రాలు, ప్రాదేశిక పాలనా మండళ్లకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఎవరికి వారు తామే మెజారీటీ సీట్లు దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 22 నెలల పాలనపై రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ (రిపబ్లికన్లు)గెలిస్తే ఆయన వివాదాస్పద నిర్ణయాలు, అమెరికా ఆధిపత్య చర్యలు పెరుగుతాయనీ, ఆయనకు అడ్డూ అదుపూ ఉండదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే డెమొక్రాట్లు గెలిస్తే ట్రంప్ దూకుడుకు ముకుతాడు పడుతుందని, ఆయన తీరు ప్రజలకు నచ్చలేదన్న సంగతి స్పష్టమవుతుందని వారంటున్నారు. ప్రస్తుతం ప్రతినిధుల సభ, సెనేట్లలో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 241 స్థానాలు, డెమొక్రాట్లకు 194 సీట్లు ఉన్నాయి. సెనెట్లో 52 రిపబ్లికన్లవయితే, 48 డెమొక్రాట్లవి. అయితే దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి మధ్యంతర ఎన్నికలు అచ్చిరావడం లేదని గత ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 1934 నుంచి ఇంత వరకు 21 సార్లు మధ్యంతర ఎన్నికలు జరగ్గా కేవలం మూడు సార్లు మాత్రమే అధ్యక్ష పార్టీ గెలిచింది. ట్రంప్ పాలనపై రెఫరెండం అమెరికా అధ్యక్ష పదవి చేపటాక ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు ఆ దేశంలోనే కాక అంతర్జాతీయంగానూ వివాదాస్పదమయ్యాయి. అమెరికన్లకు ఉద్యోగ ప్రయోజనాలు కలిగేలా వలస నిబంధనలను కఠినతరం చేస్తుండటం, ఏడు ముస్లిం దేశాల పౌరులకు అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించడం, చైనాతో వాణిజ్య యుద్ధం, గత ప్రభుత్వం ఇరాన్తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగడం, ఐక్యరాజ్య సమితి సంస్థల నుంచి కూడా తప్పుకోనున్నట్టు ప్రకటించడం తదితర తీవ్ర, వివాదస్పద నిర్ణయాలను ట్రంప్ తీసుకున్నారు. వీటిని ట్రంప్ పార్టీలోనే చాలా మంది తప్పుబడుతున్నారు. ఇప్పటికి ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టి 22 నెలలు అవుతోంది. దీంతో మధ్యంతర ఎన్నికలను ట్రంప్ పాలనపై రెఫరెండంగా భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో డెమొక్రాటిక్ పార్టీ ఒబామా కేర్గా పేరొందిన ఆరోగ్య బీమా చట్టం కొనసాగింపును ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ట్రంప్ ప్రకటించిన పన్నుల కోతనూ తమకనుకూలంగా మార్చుకుని ప్రచారం చేస్తోంది. అటు రిపబ్లికన్లు వీసాలు, అక్రమ వలసలపై దృష్టి పెట్టడంతో పాటు ఆర్థిక పునరుజ్జీవానికి ప్రాధాన్యత ఇస్తామంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు ఓటేసిన వారిలో 51శాతం మంది ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారనీ, ఇది డెమొక్రాట్లకు లాభం కలిగిస్తుందని సర్వేలో వెల్లడయింది. విదేశీ జోక్యం 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనీ, దాని ప్రమేయం వల్ల ఫలితాలు తారుమారయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో కూడా రష్యా, చైనాలు జోక్యం చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎన్నికలను రష్యా నియంత్రిస్తోందని ఆరు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉమ్మడి నివేదికలో స్పష్టం చేశాయి. సామాజిక మాధ్యమాల ద్వారా రష్యా అమెరికన్లను ప్రభావితం చేస్తోందని ఆ సంస్థలు ఆరోపించాయి. మధ్యంతర ఎన్నికల్లో రష్యా చురుకుగా జోక్యం చేసుకుంటుండటం వాస్తవమేనని, అదింకా కొనసాగుతోందని గత ఆగస్టులో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ అధ్యక్ష భవనంలో మీడియాతో చెప్పారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అధికంగా ముందస్తు పోలింగ్ మధ్యంతర ఎన్నికలకు పోలింగ్ మంగళవారం జరగనున్నప్పటికీ ముందుగానే ఓటు వేసే అవకాశం ఓటర్లకు ఉంటుంది. పోలింగ్ రోజు రద్దీని తగ్గించేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఈ ముందస్తు పోలింగ్ను గతంలో కన్నా ఈసారి చాలా ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారనీ, ముఖ్యంగా యువత ముందున్నారని అధికారులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గతే డాది కన్నా ఈ ఏడాది రెట్టింపు ముందస్తు ఓటిం గ్ నమోదైందన్నారు. అమెరికా వ్యాప్తంగా 3.15 కోట్ల మంది ఇప్పటికే ముందస్తు ఓటింగ్ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటేశారు. -
ట్రంప్ టార్గెట్ ‘ఈబీ–5’
వాషింగ్టన్: అమెరికాలో విదేశీయులకు గ్రీన్ కార్డు ఇచ్చే ‘ఈబీ–5 వీసా’ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈ వీసా నిబంధనల ప్రకారం అమెరికాలో 10లక్షల డాలర్లు (దాదాపు రూ.6.78 కోట్లు) పెట్టుబడి పెట్టే వారికి (దీని ద్వారా కనీసం 10 మంది శాశ్వత ఉద్యోగాల కల్పన జరుగుతుంది) ఆ దేశం గ్రీన్ కార్డులు అందిస్తోంది. అయితే ఈ వీసా విధానాన్ని పూర్తిగా సంస్కరించడం లేదా పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని యూఎస్ కాంగ్రెస్ను ట్రంప్ సర్కారు కోరింది. ఈబీ–5 విధానం ద్వారా వచ్చిన గ్రీన్కార్డును సంపాదించిన వారు దీన్ని దుర్వినియోగం చేయడంతోపాటు మోసాలకు పాల్పడుతున్న కేసులు నమోదవుతున్న నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది అమల్లోకి వస్తే.. ఈబీ–5 విధానంలో అమెరికాలో గ్రీన్ కార్డులు పొందుతున్న భారతీయులపైనా పెను ప్రభావం పడనుంది. ఈ జాబితాలో చైనా, వియత్నాంలు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్ మూడో దేశంగా ఉంది. ఈ విధానంలో ఏటా10వేల వీసాలను విదేశీయులకు ఇస్తున్నారు. ఇందులో ఒక్కో దేశానికి గరిష్టంగా 7% పరిమితి ఉంటుంది. గతేడాది భారత్ నుంచి 500 ఈబీ–5 వీసా పిటిషన్లు దాఖలవగా.. ఈసారి ఈ సంఖ్య 700కు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నమోదు చేసుకున్న వారి వీసా తిరస్కరణ రేటు గరిష్టంగా 20% మాత్రమే. ఇది కూడా సమర్పించే దస్తావేజులు, నిధుల విషయంలో సమస్యలతోనే. భారత్ నుంచి ఈ వీసాలు పొందేవారిలో చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కర్ణాటక నుంచే ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఉంటారు. అమెరికా ‘గూఢచర్య’ ఆరోపణ! అమెరికా సీనియర్ చట్టసభ్యులు కూడా ఈబీ–5 ఇన్వెస్టర్స్ వీసా కార్యక్రమాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఈ వీసాల దుర్వినియోగం జరుగుతున్న ఘటనలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ‘ఈబీ–5 విధానం ఈ ఏడాది సెప్టెంబర్తో ముగియనుంది. ’మనీలాండరింగ్, గూఢచర్యం చేసేందుకు కూడా కొందరు ఈ విధానాన్ని వినియోగించుకుంటున్నారు’ అని అమెరికా సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా ఇటీవలే.. కాంగ్రెస్ సభ్యుల విచారణలో వెల్లడించారు. 1990లో కేటగిరీ–5ను సృష్టించినపుడు.. ఉద్యోగ కల్పన, పెట్టుబడుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందనే కాంగ్రెస్ భావించింది. రెండేళ్ల తర్వాత నిరుద్యోగం పెరగడంతో రీజనల్ సెంటర్ ప్రోగ్రామ్ను అమల్లోకి తెచ్చి.. దీనికి ఈబీ–5 వీసా విధానాన్ని జోడించారు. చైనీయులే మోసగిస్తున్నారు! గత ఐదేళ్లలో ఈ వీసాల ద్వారా దేశ భద్రతను ప్రశ్నించేలా 19 కేసులు నమోదయ్యాయని సిస్నా తెలిపారు. ఈబీ–5 వీసాలను దుర్వినియోగం చేస్తున్న వారిలో ఎక్కువమంది చైనీయులే ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో 120 మంది చైనీయులు తప్పుడు విధానాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించారని అమెరికా ఇమిగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా వివిధ కేసులు బయటపడుతూ.. అమెరికా భద్రతకే సవాల్ విసురుతున్నందున ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు భావిస్తోంది. 350 గ్రాములకు మించి పౌడర్లు తేవొద్దు! అమెరికా వచ్చే ప్రయాణికులు 350 గ్రాములకు మించి బరువున్న పొడి పదార్థాలు విమానం కేబిన్లోకి తీసుకురాకుండా అమెరికా నిషేధం విధించింది. జూన్ 30 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అమెరికా రవాణా భద్రత పరిపాలన విభాగం (టీఎస్ఏ) పేర్కొంది. గతేడాది ఆస్ట్రేలియాలో ఓ గల్ఫ్ విమానంలో పౌడర్ ఎక్స్ప్లోజివ్స్ ద్వారా పేలుడు జరిపేందుకు విఫలయత్నం చేసిన నేపథ్యంలో టీఎస్ఏ ఈ నిర్ణయం తీసుకుంది. ‘350 గ్రాములకు మించి బరువున్న పొడి పదార్థాలను ఎక్స్రే స్క్రీనింగ్ చేయనున్నాం. అలాంటి పదార్థాలను చెకింగ్ బ్యాగుల్లో ఉంచితే అదనపు తనిఖీలు ఉండవు’ అని టీఎస్ఏ పేర్కొంది. పౌడర్ లాంటి పదార్థాలు తీసుకొస్తే అదనపు తనిఖీలుంటాయని, వాటిని చెకింగ్ బ్యాగుల్లో ఉంచడం ఉత్తమమని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. వైద్యం, పిల్లలకు సంబంధించిన పౌడర్లు, చితాభస్మం, సుంకం లేని పౌడర్లను వెంట తీసుకెళ్లొచ్చని తెలిపాయి. -
‘ట్రంప్పై లైంగిక ఆరోపణల నిగ్గుతేల్చాలి’
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని 50 మందికి పైగా అమెరికన్ కాంగ్రెస్ మహిళా ప్రతినిధులు డిమాండ్ చేశారు. పాలనా సంస్కరణల సభా కమిటీ ఛైర్మన్, ర్యాంకింగ్ మెంబర్కు రాసిన లేఖపై మహిళా ప్రతినిధులు సంతకాలు చేశారు.అమెరికా అంతటా మి టూ క్యాంపెయిన్లో భాగంగా పెద్ద ఎత్తున మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపులు, దాడులను వివరిస్తూ ముందుకొస్తున్న క్రమంలో ట్రంప్ వ్యవహారాలపై దర్యాప్తును కోరుతున్నామని అమెరికన్ కాంగ్రెస్ మహిళా ప్రతినిధులు స్పష్టం చేశారు. ట్రంప్ తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళలు చేస్తున్న ఆరోపణలపై అధ్యక్షుడు స్పందించాలని, తనను సమర్ధించుకునేందుకు ఆయన తగిన ఆధారాలు సమర్పించాలని మహిళా సభ్యులు ఈ లేఖలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు ట్రంప్ తమను అసభ్యకరంగా తాకాడని, అభ్యంతరకరంగా ప్రవర్తించాడని గత రెండేళ్లుగా దాదాపు 16 మంది మహిళలు ఆరోపించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిపై తమ ఆరోపణలకు సంబంధించి యూఎస్ కాంగ్రెస్ విచారణ చేపట్టాలని ఆయనపై ఆరోపణలు గుప్పించిన ముగ్గురు మహిళలు ఇటీవల డిమాండ్ చేశారు. మరోవైపు తనపై వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఆరోపణలను 71 ఏళ్ల ట్రంప్ తోసిపుచ్చారు.తానింతవరకూ ఎవరి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరినీ లైంగికంగా వేధించలేదని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై అధ్యక్షుడు ఇప్పటికే వివరణ ఇచ్చారని, నిరాధార ఆరోపణలుగా కొట్టిపారవేశారని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ స్పష్టం చేశారు. -
హెచ్1–బీ బిల్లుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ కమిటీ
-
హెచ్1–బీ బిల్లుకు కాంగ్రెస్ కమిటీ ఆమోదం
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తూ రూపొందించిన బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. హెచ్ 1–బీ వీసాదారుల కనీస వార్షిక వేతనాన్ని 60 వేల డాలర్ల నుంచి 90 వేల డాలర్లకు పెంచడంతో పాటు అనేక నిబంధనల్ని ఈ బిల్లులో చేర్చారు. ‘ద ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్(హెచ్ఆర్ 170)’గా పేర్కొనే ఈ బిల్లును బుధవారం ప్రతినిధుల సభకు చెందిన జ్యుడీషి యరీ కమిటీ ఆమోదించింది. దీనిని ఆమోదం కోసం కాంగ్రెస్లోని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనున్నారు.. ఈ బిల్లును సెనెట్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఉభయ సభలు ఆమోదించాక అధ్యక్షుడు ట్రంప్ సంతకంతో ఇది చట్టంగా అమల్లోకి వస్తుంది. హెచ్ఆర్ 170 చట్టంగా మారితే అమెరికా వ్యాపారాలకు నష్టం తప్పదని, వేలాది ఉద్యోగులకు ముప్పని నాస్కాం అధ్యక్షుడు చంద్రశేఖర్ హెచ్చరించారు. -
డల్లాస్లో కృష్ణమూర్తికి సన్మానం
యూఎస్ కాంగ్రెస్ మెంబర్గా రాజా కృష్ణమూర్తి ఎన్నికైన సందర్భంగా డాల్లస్లో శనివారం విజయోత్సవ సభ నిర్వహించారు. డాల్లస్లోని టచ్నైట్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రవాస భారతీయ మిత్రులు పాల్ పాండియన్, డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఎంవీఎల్ థియోఫిన్, శ్రీధర్ తుమ్మలలు రాజ కృష్ణమూర్తి విజయానికి కృషి చేశారు. కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర రాజా కృష్ణమూర్తిని సభకు పరిచయం చేస్తూ ఆయన చాలా భాద్యత గల సభ్యుడని, అవసరమైన అన్ని సందర్భాల్లోనూ కాంగ్రెస్ లో తన గళాన్ని వినిపిస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ముందంజలో ఉంటారని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం జరిగిన 236 రోల్ కాల్స్ లో 235కి హాజరవడం రాజా చిత్తశుద్ధిని తెలుపుతుందన్నారు. రాజా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న అంశాలు: 1. ఉద్యోగాలను సృష్టించడం ద్వారా మన ఆర్ధికవ్యవస్థను వృద్ధి చేయడం 2. వర్కింగ్ ఫ్యామిలీస్ కోసం అండగా నిలబడడం 3. మహిళలకు సహాయ పడటం 4. ఒబామా “ఎఫోర్డ్బెల్ కేర్ యాక్ట్” ను సమర్ధించడం 5. సీనియర్స్ కు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టడం 6. దేశ భద్రతను కాపాడటం 7. యుద్ధాల్లో పోరాడిన సైనికులను గౌరవించడం పలు అంశాలను కేంద్రీకరిస్తూ ఆశించిన ఫలితాల కోసం త్రీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాజా కృష్ణమూర్తి ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా విద్య మరియు ఉద్యోగుల కమిటీ, పర్యవేక్షణ మరియు ప్రభుత్వ సంస్కరణల కమిటీల్లో కీలక సభ్యుడిగా పని చేస్తున్నారని చెప్పారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఒబామా కేర్ యాక్ట్ ను తొలగించాలని ప్రయత్నాలు చేసినప్పుడు, దాన్ని వ్యతిరేకిస్తూ రాజా ధృడంగా నిలబడ్డారని తెలిపారు. ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించినప్పుడు కూడా రాజా తీవ్రంగా వ్యతిరేకించారని వివరించారు. చికాగోలోని ఓహారే అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతమంది ముస్లిం దేశస్తులను ఇమిగ్రేషన్ అధికారులు ప్రవేశాన్ని అడ్డుకున్నారనే విషయాన్ని తెలుసుకుని, హుటాహుటిన అక్కడికి చేరుకొని నిరసనలు తెలుపుతున్న ప్రజలకు మద్దతు తెలుపడం ద్వారా రాజా ప్రజల మనిషిగా నిరూపించుకున్నారని అన్నారు. భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి కాంగ్రెస్ కు ఎన్నిక కావడానికి సహకరించిన డాలస్ మిత్రులందరికీ తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మున్ముందు అమెరికా రాజకీయాల్లో రాజా ఒక తిరుగులేని శక్తిగా ఎదగాలని డాక్టర్ తోటకూర ఆకాంక్షించారు. రాజా కృష్ణమూర్తి తన ప్రసంగంలో భారతీయ అమెరికన్లకు చాలా ఓర్పు గల వారని, వాళ్ళు అవసరమైనప్పుడు హక్కులను కాపాడుకోవటం కోసం గళాన్ని ఐకమత్యంగా వినిపించాలని చెప్పారు. లేకుంటే అమెరికా జనజీవన స్రవంతిలో వెనుక బడిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సభకు హాజరైన సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తూ.. మనమందరం కొంత సమయం కేటాయించి అమెరికా పార్లమెంట్ ను సందర్శించాలని, అక్కడి కార్యకలాపాలు, కాంగ్రెస్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడం ఎంతో అవసరం అని తెలిపారు. ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లోనూ అగ్రపథంలో ఉన్నపటికీ రాజకీయ రంగంలో ఇంకా ఎంతో పురోగతి సాధించాలని ముఖ్యంగా ఆసక్తి గల యువతరం రాజకీయాల్లోకి రావాలని రాజా కోరారు. రాజా చివరిగా డాలస్ లోని ప్రజలు తన విజయానికి ఎంతో కృషి చేశారని అందుకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం డాల్లస్ ఆహ్వాన సంఘం, మద్దతుదారులు రాజా కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. నిర్వాహకులలో ఒకరైన ఎంవీఎల్ ప్రసాద్ రాజా కృష్ణమూర్తికి పూల దండ వేయగా, డాక్టర్ ప్రసాద్ తోటకూర, సి.సి. థియోఫిన్ రాజాకు శాలువా కప్పి, జ్ఞాపికను బహుకరించారు. రాజా కేక్ కట్ చేసి తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. సి.సి. థియోఫిన్ తన వందన సమర్పణలో ఎంతో ఆప్యాయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డాలస్ నగరాన్ని విచ్చేసి, తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేసిన రాజా కృష్ణమూర్తికి, ఎంతో ప్రోత్సాహం ఇస్తున్న డాల్లస్ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. -
కాల్ సెంటర్ల పై ట్రంప్ కన్ను
కఠినమైన ఆంక్షలతో బిల్లు తెచ్చిన అమెరికా సర్కారు ⇒ ఉద్యోగాలు విదేశాలకు తరలిపోకుండా కట్టడి ⇒ విదేశాల్లో సెంటర్లు పెడితే కంపెనీలకు గ్రాంట్లు కట్ ⇒ రుణాలూ ఇవ్వకుండా నిబంధనలు ⇒ అమెరికా కాంగ్రెస్లో బిల్లు ⇒ ఆందోళనలో లక్షలాది మంది భారత కాల్సెంటర్ ఉద్యోగులు హెచ్–1బీ వీసాల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై పడింది! తక్కువ విద్యార్హతలతో అమెరికా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించగల కాల్ సెంటర్లపై గురిపెట్టారు. తద్వారా ‘మన ఉద్యోగాలు మనకే..’ అని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అమలు దిశగా ముందుకెళ్తున్నారు. కాల్ సెంటర్ ఉద్యోగాలు అమెరికా నుంచి తరలివెళ్లకుండా ఉండేందుకు కఠిన ఆంక్షలు ప్రతిపాదిస్తూ బిల్లును తెచ్చారు. హెచ్1–బీ వీసాపై వచ్చే ఉద్యోగుల కనీస వేతనం 1.3 లక్షల డాలర్లు ఉండాలనే బిల్లును ఇదివరకే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ నాస్కామ్ అంచనా ప్రకారం 2015లో భారత్ ఐటీ ఎగు మతులు 100 బిలియన్ డాల ర్లు. వీటిలో అమెరికా వాటా 60 శాతం. అంటే.. 60 బిలియన్ డాలర్లు. ఐటీ ఆదాయంలో బీపీఓల వాటా 5.11 శాతం ఉంది. అంటే మూడు బిలియన్ డాలర్ల పైచిలుకే. రూ పాయల్లో చెప్పాలంటే ఇది 20,019 కోట్లు. అమెరికా నుంచి ఏడాదికి రూ.20 వేల కోట్లు ఆర్జించి పెడు తున్న కాల్ సెంటర్లు ఇకపై ఈ వ్యాపా రంపై ఆశలు వదులుకోవాల్సిందే! ఇక ఉ ద్యోగాల విషయానికి వచ్చేసరికి ప్రస్తు తం భారత్లో 3.3 లక్షల ఉద్యోగాలను కాల్ సెంటర్ రంగం కల్పిస్తోంది. వీటిలో మూడింట రెండొంతుల ఉద్యోగాలు అమెరికా వినియోగదారులకు సేవలందిస్తున్న కాల్ సెంటర్లు కల్పిస్తున్నవే. అంటే రాబోయే రోజుల్లో భారత్లో కనీసం 2 లక్షల మంది ఈ రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇంకా ఎక్కువ కొలువులు పోయేవి.. నిజానికి భారత్కు ఇంతకుమించి భారీ దెబ్బ పడేదే. 1990 నుంచి 2010 దాకా భారత్లో కాల్సెంటర్ల బూమ్ నడిచింది. ఖర్చులు తగ్గించుకోవడానికి పాశ్చాత్య దేశాల్లోని కంపెనీలు వినియోగదారులకు సేవలందించే కాల్ సెంటర్లను పొరుగు సేవల (ఔట్సోర్సింగ్కు ఇవ్వడం) ద్వారా భారత్కు మార్చాయి. ఈ సమయంలో మెట్రో నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాలకూ కాల్ సెంటర్లు విస్తరించాయి. రూ.15 నుంచి రూ.20 వేల వేతనానికే ఉద్యోగులు లభించడం, ఆంగ్లంపై భారతీయులకు పట్టుండటం అప్పట్లో మనకు కలిసి వచ్చింది. అయితే యాసతో ఇబ్బందులు వచ్చేవి. ఈ విషయంలో తమకు సరైన సేవలు అందలేదని వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు బాగా పెరిగిపోవడంతో కంపెనీలకు ఫిలిప్పీన్స్ ఆశాకిరణంలా నిలిచింది. ఒకప్పుడు ఆంగ్లేయుల పాలనలో ఉన్న కారణంగా ఫిలిప్పీన్స్ దేశస్తులకు ఆంగ్లం బాగావచ్చు. అదీగాకుండా అమెరికన్ల యాసకు దగ్గరగా వీరు మాట్లాడతారు. దాంతో 2010 నుంచి భారత్ 70 శాతం కాల్ సెంటర్ల వ్యాపారాన్ని ఫిలిప్పీన్స్కు కోల్పోయింది. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ వంటి భారత దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా తమ కాల్ సెంటర్లను ఫిలిప్సీన్స్కు తరలించాయి. అలా ఈ రంగంపై ఆధారపడ్డ భారతీయుల ఉద్యోగాలు తగ్గిపోయాయి. లేకుంటే అమెరికా చట్టసభల ముందుకొచ్చిన కొత్త బిల్లు ప్రభావం మనపై ఇంకా తీవ్రంగా ఉండేది. బిల్లులో ఏముందంటే.. జెనె గ్రీన్ (డెమొక్రాట్), డేవిడ్ మెకిన్లే (రిపబ్లికన్)లు గురువారం అమెరికా కాంగ్రెస్లో ‘యూఎస్ కాల్ సెంటర్, కన్సూ్మర్ ప్రొటెక్షన్ యాక్ట్’ను ప్రవేశపెట్టారు. అమెరికా కంపెనీలు వినియోగదారులకు సేవలందించేందుకు తమ కాల్ సెంటర్లను విదేశాల్లో పెట్టకుండా ఈ బిల్లు నిరోధించదు. కానీ అమెరికా నుంచి కాల్సెంటర్ ఉద్యోగాలు మరో దేశానికి తరలి వెళ్లకుండా నిరోధించే పలు చర్యలు ఇందులో పొందుపరిచారు. ► కాల్ సెంటర్లను విదేశాల్లో నెలకొల్పే కంపెనీలతో ఒక జాబితాను రూపొందిస్తారు ► ఈ జాబితాలో ఉన్న కంపెనీలకు అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు (గ్రాంట్లు) అందవు. అమెరికాలో ఉద్యోగాల కల్పనకు మాత్రం కంపెనీలకు గ్రాంట్లు ఇస్తుంది ► ఇలాంటి కంపెనీలకు రుణాలు (థర్డ్ పార్టీ పూచీకత్తుపై ఇచ్చేవి) ఇవ్వరు ► కాల్ చేసే వినియోగదారులకు తాము ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామో కంపెనీ ప్రతినిధి ముందుగా చెప్పాలి ► ఒకవేళ అమెరికా గడ్డపై నుంచి పనిచేస్తున్న కాల్ సెంటర్కు తమ కాల్ను మళ్లించాలని వినియోగదారుడు కోరుకుంటే... కంపెనీ తప్పనిసరిగా అలా చేయాల్సిందే ► వినియోగదారుడు కోరితే కాల్ను అమెరికాలో పనిచేసే వ్యక్తికి మళ్లించడం తప్పనిసరి చేయడం మూలంగా... విదేశాల్లో కాల్ సెంటర్లు ఉన్నప్పటికీ అమెరికాలోనూ అలాంటి సేవలను అందించే కేంద్రం నెలకొల్పక తప్పని పరిస్థితిని కంపెనీలకు కల్పిస్తున్నారు. తమ వారికి ఉద్యోగాలు వస్తాయనే భావనతో అమెరికన్లు.. కాల్ను తమ దేశానికే మళ్లించమని కోరతారు ► తక్కువ వేతనాలు, ఖర్చులు ఉంటాయనే కారణంతో భారత్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో కాల్ సెంటర్లు పెట్టిన కంపెనీలు.. రెండు చోట్ల (విదేశాల్లో, అమెరికాలో) కేంద్రాలను నిర్వహించే ఖర్చును తట్టుకోలేవు. దాంతో అనివార్యంగా తమ కాల్ సెంటర్లను తిరిగి అమెరికాకు తీసుకెళ్తాయి ► పైగా ఈ జాబితాలోకి ఎక్కితే దేశ ప్రయోజనాలను పట్టించుకోని కంపెనీగా అధికారికంగా ముద్ర పడుతుంది. బ్రాండ్ ఇమేజ్కు ఎంతో ప్రాధాన్యమిచ్చే పెద్ద కంపెనీలు ఈ పరిస్థితిని కోరుకోవు -
అమెరికా సిద్ధంగా ఉంది: ట్రంప్
అమెరికన్ కాంగ్రెస్లో బుధవారం ట్రంప్ తన మొదటి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను ట్రంప్ ఖండించారు. శ్రీనివాస్ మృతి పట్ల అమెరికన్ కాంగ్రెస్ నిమిషం పాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది. విద్వేష దాడులకు అమెరికాలో చోటు లేదని.. విద్వేషాలను అందరూ ఖండించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఒబామా పాలనా కాలంలోనే ఉగ్రవాద దాడులు పెరిగాయని తొలి కాంగ్రెస్ ప్రసంగంలో ట్రంప్ విమర్శించారు. అమెరికా పౌరులకు రక్షణ, ఉద్యోగాల కల్పనే తన తొలి ప్రాధాన్యత అని ట్రంప్ పునరుద్ఘాటించారు. యూదులపై జరుగుతున్న దాడులను ట్రంప్ ఖండించారు. అధ్యక్ష ఎన్నికల తరువాత పరిస్థితి సానుకూలంగా మారుతుందని వెల్లడించారు. మాదకద్రవ్య వ్యాపారులు, రౌడీలను నిర్మూలించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తమ పాలనలో అవినీతికి తావు లేదని, లాబీయింగ్పై ఐదేళ్లు నిషేధం అని ట్రంప్ తెలిపారు. అమెరికా శక్తివంతమైన, స్వేచ్ఛాదేశం అని ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నెలరోజుల్లో తన పనితీరుపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయని తెలిపారు. దేశ దక్షిణ దిశలో గోడను నిర్మించి సరిహద్దులను బలోపేతం చేస్తామని, ఇస్లామిక్ తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని తెలిపిన ట్రంప్.. ప్రపంచాన్ని ముందుండి నడిపేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. -
మధ్యలోనే డంప్ చేస్తారా?!
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఏడాదిన్నరలోనే పదవీ గండం! - అయితే అభిశంసన.. లేదంటే 25వ రాజ్యాంగ సవరణ ప్రయోగం - ట్రంప్ను సాగనంపేందుకు సొంత రిపబ్లికన్ పార్టీలోనే వ్యూహరచన - 2018లో కాంగ్రెస్ ఎన్నికలకు ముందే ట్రంప్కు పదవీచ్యుతి? ‘అధ్యక్షుడిని వదిలించుకోవడం ఎలా?’ ఇప్పుడు అమెరికాలో అత్యధికులు పరిశోధిస్తున్న అంశమిది. అమెరికాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా రాజకీయ నిపుణులు ఈ అంశంపై దృష్టి సారిస్తున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల పాలనతోనే.. అమెరికానే కాదు.. ప్రపంచమంతా గగ్గోలు పెడుతోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే ట్రంప్ ప్రజల్లో మెజారిటీ విశ్వాసం కోల్పోయారని.. దేశంలో మూడో వంతు మందికన్నా ఎక్కువ మందే అధ్యక్షుడిని అభిశంసించాలని కోరుకుంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఎంతో కాలం అధ్యక్షుడిగా కొనసాగబోరని.. మధ్యలోనే సొంత రిపబ్లికన్ పార్టీయే ఆయనను బలవంతంగా సాగనంపాలని వ్యూహం రచిస్తోందని అంతర్గత విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే అభిశంసనను ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉన్నాయని.. లేదంటే 25వ రాజ్యాంగ సవరణను ప్రయోగించడం ద్వారా ట్రంప్ను గద్దె దింపి.. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని రాజకీయ నిపుణులు జోస్యం చెప్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. అభిశంసన, 25వ సవరణల ప్రయోగంపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ట్రంప్ను తొలగించగల మార్గాలపై ఆ విశ్లేషణల సారాంశం... అమెరికా అధ్యక్ష అనూహ్యంగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ‘మా అధ్యక్షుడు కాదు’ అంటూ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ దేశ రాజధాని సహా అన్ని ప్రముఖ నగరాల్లోనూ భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు ‘ట్రంప్ను అభిశంసించాలి’ అనే ఉద్యమం అమెరికాలో బలపడుతోంది. ఇప్పటికే పలు సంస్థలు ఇందుకోసం సంతకాలు, విరాళాల సేకరణ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ను అభిశంసించగల అంశాలేవి అన్నది ఆసక్తిగా మారింది. ‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అభిశంసించదగ్గ అంశాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. కానీ.. ఆయన తమకు భారమని రిపబ్లికన్లు ఎప్పుడు నిర్ణయించుకుంటారనేదే ప్రశ్న’ అని పలువురు రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వచ్చిన రష్యాతో సంబంధాలు మొదలుకొని.. అధ్యక్షుడిగా జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల్లోని అంశాల వరకూ చాలా విషయాల్లో ట్రంప్ను అభిశంసించదగ్గ కోణాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. - కోర్టులతో ట్రంప్ పోరాటం కూడా అభిశంసన దిశగా దారితీయవచ్చు. అమెరికాలోకి శరణార్థులు, ఏడు దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన న్యాయమూర్తి జేమ్స్ రాబర్ట్ ఉత్తర్వును సమర్థిస్తూ 9వ సర్క్యూట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వేగంగా సమీక్షించవచ్చు. ట్రంప్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినట్లయితే.. కోర్టును ధిక్కరించడానికి ఆయన ప్రయత్నిస్తారా? అలా చేయడం.. అభిశంసించగల మొదటి తరగతి నేరమవుతుంది. - ఇక రెండో రకం అభిసంసించగల నేరం.. ట్రంప్ వ్యక్తిగత ప్రయోజనాలు, అధ్యక్షుడిగా అధికారిక విధులు రాజీపడటం. ట్రంప్కు రష్యాలో విస్తృత వాణిజ్య ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఆయన ‘సత్సంబంధాలు’ ఈ కోవలోకి రావచ్చు. అలాగే.. పలు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులో పేర్కొన్న దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు కూడా ఇందులోకి వస్తాయి. ట్రంప్ తనకు వ్యాపార ప్రయోజనాలు ఉన్న ముస్లిం దేశాలను ఈ ఉత్వర్వు నుంచి మినహాయించారు. అయితే.. ఆ దేశాల నుంచే ఉగ్రవాదులు వస్తుండటం గమనార్హం. ట్రంప్ ఉత్తర్వులో నిషేధించిన దేశాల నుంచి ఉగ్రవాదులు ఎవరూ రాలేదు. ఆ దేశాల్లో ట్రంప్ పెట్టుబడులూ లేవు. - మరోవైపు.. రష్యా అధ్యక్షుడితో ట్రంప్ విచిత్ర సన్నిహిత సంబంధాలపై సీఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. పుతిన్కి అనుకూలంగా ప్రవర్తించడాన్ని ట్రంప్ కొనసాగిస్తే అభిశంసన ఇంకా ముందుకు జరగొచ్చు. గత ఆదివారం ట్రంప్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. పుతిన్ మీద మాట పడకుండా సమర్థించుకొచ్చారు. ‘పుతిన్ ఒక హంతకుడు’ అని టీవీ వ్యాఖ్యాత అభివర్ణిస్తే.. ‘మనకు చాలా మంది హంతకులు ఉన్నారు. మన దేశం చాలా అమాయకమైనదని మీరు అనుకుంటున్నారా?’ అని ట్రంప్ ఎదురు ప్రశ్నించారు. ఇలా దేశాధ్యక్షుడే తన దేశమైన అమెరికాను కించపరచడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ సంపాదకుడు బ్రెట్ స్టీఫెన్స్ వ్యాఖ్యానించారు. మరికొందరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ట్రంప్ తీరును తప్పుబట్టారు. ఆ పనులయ్యాక వారే దింపేస్తారు! ట్రంప్ను అభిశంసించడానికి ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూడా తన వ్యూహానికి పదును పెడుతోంది. అయితే.. ప్రస్తుత కాంగ్రెస్లో బలాబలాలను బట్టి అధికార రిపబ్లికన్ పార్టీ సాయం లేకుండా ఇప్పట్లో ట్రంప్ అభిశంసన సాధ్యంకాదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్లో తమ బలం పెరిగితే ఆ పార్టీ స్వయంగా అభిశంసన చేపట్టవచ్చు. మరోవైపు రిపబ్లికన్ పార్టీలో కూడా ట్రంప్ మీద ప్రేమ లేదు. నిజానికి ఆ పార్టీ అధినాయకత్వం మొదటి నుంచీ ట్రంప్ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల సమయానికి ఆ పార్టీ స్వయంగా ట్రంప్ను సాగనంపాలని యోచిస్తున్నట్లు చెప్తున్నారు. ‘‘రిపబ్లికన్లు కొంత కాలం ట్రంప్ను సహిస్తారు. గ్యాస్, చమురు, వాల్ స్ట్రీట్లపై నియంత్రణల తొలగింపు, పన్నుల కోతలు, పాఠశాలల ప్రైవేటీకరణ, కార్మిక రక్షణ కుదింపు, సుప్రీంకోర్టులో కనీసం ఒక మితవాద న్యాయమూర్తి నియామకం వంటి పనులను పూర్తిచేసే వరకూ ట్రంప్ను భరిస్తారు. కొంత కాలానికి ట్రంప్ ఒక వైపరీత్యమని, పార్టీకి ప్రమాదకరమని, 2018 ఎన్నికలకు నష్టదాయకుడని రిపబ్లికన్ పార్టీ నాయకత్వం నిర్ధారణకు వస్తుంది. దీంతో ఆయనను వదిలించుకుని, ఉపాధ్యక్షుడు పెన్స్ ను అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయిస్తారు. ఈ వ్యూహాన్ని రిపబ్లికన్ పార్టీలోని ఉన్నతస్థాయి వర్గాలు ఇప్పటికే చర్చిస్తున్నారు. రిపబ్లికన్లు సుదీర్ఘ ప్రక్రియ అయిన అభిశంసన ద్వారా ఈ పని చేయవచ్చు. ఇలాంటి చర్యలతో దెబ్బతిన్న ట్రంప్ మరింత క్రోధంతో ఇంకా ప్రతీకార చర్యలు చేపట్టవచ్చు. లేదంటే.. 25వ రాజ్యాంగ సవరణను అనుసరించి ట్రంప్ను అసమర్థుడిగా నిర్ధారించి మరింత వేగంగా తప్పించవచ్చు. తద్వారా ఒక అనిశ్చితుడైన, నిరంకుశుడు కాగల అధ్యక్షుడి నుంచి అమెరికాకు విముక్తి కలిగించిన ఖ్యాతి కూడా రిపబ్లికన్ పార్టీకి లభిస్తుందన్నది వారి ఆలోచన. 2018 ఎన్నికల నాటికి పెన్స్ నేతృత్వంలో వీరంతా మళ్లీ ఏకం కావచ్చు’’ అని బ్రాండీస్ యూనివర్సిటీలోని హెల్లెర్ స్కూల్ ప్రొఫెసర్, అమెరికన్ ప్రాస్పెక్ట్ పత్రిక సహ సంపాదకులు రాబర్ట్ కట్నర్ తాజాగా రాసిన ఒక వ్యాసంలో విశ్లేషించారు. కాంగ్రెస్లో అభిశంసన ఇలా... అమెరికా రాజ్యాంగంలో రెండో అధికరణలోని సెక్షన్ 4లో అధ్యక్షుడి అభిశంసన గురించి చెప్తుంది. దేశద్రోహం, లంచం తీసుకోవడం, అధికార దుర్వినియోగం, బెదిరింపులు, నిధుల దుర్వినియోగం, పర్యవేక్షణలో వైఫల్యం, విధులు నిర్వర్తించకపోవడం, తప్పుడు నడవడిక తదితర నేరాలకు పాల్పడినపుడు అభిశంసన ద్వారా అధ్యక్షుడిని పదవీచ్యుతిడిని చేయవచ్చు. కాంగ్రెస్లో ప్రతినిధుల సభ సాధారణ మెజారిటీతో అధ్యక్షుడిపై నేరాభియోగం మోపి అభిశంసించడానికి ఓటు వేయాలి. ఆ తర్వాత సెనేట్ విచారణ చేపట్టి అధ్యక్షుడి మూడింట రెండు వంతుల మెజారిటీతో అభిశంసనను ధృవీకరించాలి. నిజానికి కాంగ్రెస్లో అభిశంసన ప్రక్రియను ప్రారంభించడానికి.. దేశద్రోహం, హత్య వంటి నేరాలకు ఆధారాలు అవసరం లేదు. ఆచరణలో ఏ అంశాన్నైనా ఇతర నేరాలుగా పరిగణించవచ్చు. ఇంతకుముందు మోనికా లూయిన్స్కీ కేసులో బిల్ క్లింటన్ను, గతంలో వాటర్గేట్ కుంభకోణంలో రిచర్డ్ నిక్సన్పైన అభిశంసన చేపట్టారు. 25వ సవరణ ప్రయోగం ఇలా... అధ్యక్షుడు మరణించినపుడు, లేదా ఇతరత్రా కారణాల వల్ల అధికారాలు, విధులు నిర్వర్తించలేనపుడు ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారని వివరించే నిబంధనను.. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ వివరిస్తుంది. ఇందులోని నాలుగో సెక్షన్ ప్రకారం.. ‘అధ్యక్షుడు తన అధికారాలు, విధులు నిర్వర్తించలేకపోతున్నారు’ అని ఉపాధ్యక్షుడు, మెజారిటీ మంత్రులు రాతపూర్వకంగా కాంగ్రెస్ ఉభయసభల సభాపతులకు తెలియజేయాలి. అలా జరిగినపుడు ఉపాధ్యక్షుడు తక్షణం క్రియాశీల అధ్యక్షుడిగా అధికారాలు, బాధ్యతలు చేపడతారు. ఈ 25వ రాజ్యాంగ సవరణను కొద్ది మార్లే వినియోగించారు. జాన్ ఎఫ్. కెన్నడీ హత్యానంతరం ఒకసారి, రొనాల్డ్ రీగన్కు క్యాన్సర్ సర్జరీ చేసినపుడు మరోసారి, జార్జ్ డబ్ల్యు. బుష్ కొలనోస్కోపీలు చేయించుకున్నపుడు ఇంకోసారి ఉపాధ్యక్షుడు క్రియాశీల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించేలా ఈ అధికరణను అమలుచేశారు. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
H-1-B వీసా బిల్లును మళ్లీ ప్రవేశ పెట్టిన రిపబ్లికన్లు
-
చట్టసభ ముందుకు హెచ్1బీ వీసా బిల్లు
వాషింగ్టన్: హెచ్1బీ వీసా ప్రొగ్రామ్ లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును మరోసారి అమెరికా చట్టసభ(కాంగ్రెస్)లో ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు ఈ బిల్లును సభ ముందుకు తెచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే హెచ్1బీ వీసా ప్రొగ్రామ్ లో ఉల్లంఘనలకు కళ్లెం పడుతుందని ఇద్దరు సభ్యులు డారెల్ ఇసా, స్కాట్ పీటర్స్ అభిప్రాయపడ్డారు. అమెరికన్ల ఉద్యోగాలకు ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందన్నారు. హెచ్1బీ వీసా ఉన్నవారికి వారిక వేతనం కనీసం 10 లక్షల డాలర్లకు పెంచడం, మాస్టర్ డిగ్రీ మినహాయింపు రద్దు చేయడం లాంటి కీలక ప్రతిపాదనలు బిల్లులో ఉన్నాయి. విదేశీ ఉద్యోగుల స్థానే అమెరికన్లను అవకాశాలపై బిల్లులో దృష్టి సారించారు. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడేందుకు విదేశీయుల ఉద్యోగ నిబంధనల్లో మార్పలు చేస్తామని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బిల్లు మరోసారి కాంగ్రెస్ ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
టీపీపీ నుంచి వైదొలుగుతాం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా కార్యాలయంలో బాధ్యతలు తీసుకునే రోజే (జనవరి 20) ట్రాన్స పసిఫిక్ పార్టనర్షిప్ (టీపీపీ) నుంచి వైదొలుగుతామని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య ఒప్పందమైన టీపీపీలో అమెరికా భాగస్వామి కావడం భారీ తప్పిదమన్నారు. అమెరికన్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న వర్క్ వీసాల దుర్వినియోగాలపై కూడా విచారణ జరుపుతానని హామీనిచ్చారు. శ్వేతసౌధంలో తన తొలి 100 రోజుల విధాన ప్రణాళికలను ఆయన సంక్షిప్తంగా వివరించారు. వాణిజ్యం, ఇంధనం, శాసనం, జాతీయ భద్రత, వలసలు, నైతిక విలువలు వంటివాటిపై దృష్టిపెట్టి అమెరికాను అగ్రస్థానంలో నిలబెడతానన్నారు. మీడియా ప్రతినిధులను ప్రత్యేక సమావేశానికి పిలిచిన ట్రంప్ అక్కడ వారిపై ‘మీరంతా నిజారుుతీ లేని, మోసపూరితంగా అబద్ధాలు ఆడే వారు’ అని విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా అమెరికా కాంగ్రెస్లో తొలి హిందూ సభ్యురాలైన తులసీ గబార్డ్ సోమవారం ట్రంప్తో భేటీ అయ్యారు. ట్రంప్ ఉగ్రవాద నిరోధానికి కొత్త ఆలోచనలు ముందుకు తీసుకొచ్చే అవకాశముందనీ, ఆయన శాంతిభద్రతలను పరిక్షించగలరని బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ వాషింగ్టన్లో పేర్కొన్నారు. -
రిపబ్లికన్ల ఖాతాలోకి సెనెట్, హౌస్
అమెరికా కాంగ్రెస్లో ఇక రిపబ్లికన్లదే ఆధిపత్యం గవర్నర్ పదవుల్ని చెరిసగం పంచుకున్న రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్లోని సెనెట్(100), హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స కూడా రిపబ్లికన్స ఖాతాలో చేరా యి. సెనెట్లో 33, ప్రతినిధుల సభలో లో 431 స్థానాలకు ఎన్నికలు జరిగారుు. సెనెట్లో..: అమెరికా సెనెట్ను ఈ సారైనా దక్కించుకోవాలన్న డెమోక్రాట్ల ఆశలు గల్లంతయ్యాయి. ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఇండియానా, జార్జియా, విస్కాన్సన్, అలబామా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో అమెరికన్ కాంగ్రెస్లో ట్రంప్ ఆధిపత్యం చెల్లుబాటయ్యేందుకు వీలుచిక్కనుంది. ఇల్లినాయి, కాలిఫోర్నియా, మేరీలాండ్, కనెక్టికట్ వంటి రాష్ట్రాల్లో డెమోక్రటిక్ అభ్యర్థులు గెలుపొందారు. అమెరికా ఎన్నికలకు ముందు సెనెట్లో డెమోక్రాట్లకు 44 మంది ఉండగా... ఇద్దరు స్వతంత్రులు ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీకి 54 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం 100 సీట్లలో మూడో వంతు సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో 24 సీట్లు రిపబ్లికన్లు ప్రాతినిధ్యం వహిస్తున్నవే... 33 స్థానాల్లో రిపబ్లికన్లు 21, డెమోక్రాట్లు 12 గెలుచుకున్నారు. దీంతో సెనెట్లో రిపబ్లికన్ల బలం 51కి చేరింది. డెమోక్రాట్ల బలం 48గా ఉంది. ప్రతినిధుల సభలోనూ...: మొత్తం 435 స్థానాలు ఉండగా... ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలతో పాటే వీటికి ఎన్నికలు నిర్వహించారు. రిపబ్లికన్లు 238 గెలుచుకోగా, డెమోక్రాట్లు 193 స్థానాలతో సరిపెట్టుకున్నారు. నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగాలి. రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. గవర్నర్ ఎన్నికల్లో చెరిసగం: 12 రాష్ట్రాలకు గవర్నర్ పదవి కోసం ఎన్నికలు జరగగా రిపబ్లికన్లు 6, డెమోక్రాట్లు 6 రాష్ట్రాల్ని గెలుచుకున్నారు.రిపబ్లికన్లు గెలిచినవి: న్యూహ్యాంప్షైర్, ఇండియానా, వెర్మాంట్, మిస్సోరీ, ఉటావా, నార్త్డకోటా. డెమోక్రాట్లు గెలిచినవి: ఓరెగాన్, వాషింగ్టన్, నార్త్ కరోలినా, మోంటానా, వెస్ట్ వర్జినీయా, డెలావేర్.ఒబామాతో ట్రంప్ భేటీ: అధ్యక్ష అధికారాలను సజావుగా కాబోయే అధ్యక్షుడిగా బదిలీ చేయడమే లక్ష్యంగా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాతో కాబోయే అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు. -
తొలి భారతీయ అమెరికన్ సెనేటర్గా కమలా హారిస్!
లాస్ ఏంజిలిస్: కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్ అమెరికా కాంగ్రెస్కు ఎన్నికయ్యే తొలి భారతీయ అమెరికన్ సెనేటర్గా నిలిచే అవకాశాలు మెరుగయ్యాయి. తాజా సర్వేల ప్రకారం ప్రత్యర్థి శాన్చెజ్ కన్నా ఆమె చాలా ముందంజలో ఉన్నారు. 51 ఏళ్ల కమలకు అధ్యక్షుడు ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడెన్ మద్దతు ప్రకటించారు. ఇప్పటికే ఓటేసిన వారిలో 55 శాతం మంది కమలకు, 26 శాతం మంది శాన్చెజ్కు ఓటేశారు. కమల తల్లి 1960లో చెన్నై నుంచి అక్కడికి వలసవెళ్లారు. -
రాజా కృష్ణమూర్తికి ఇండో అమెరికన్ల మద్ధతు
భారత సంతతికి చెందిన అమెరికన్లు డల్లాస్లోని డాక్టర్ ప్రసాద్ తోటకూర నివాసంలో సమావేశమయ్యారు. ఇండో అమెరికన్ రాజా కృష్ణమూర్తి నవంబర్ 8న జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలిస్తే ఆయన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు అవుతారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు నిధులు సమకూర్చుకునేందుకు డాక్టర్ ప్రసాద్ తోటకూర తన నివాసంలో కొందరు కీలక నేతలతో సమావేశమయ్యారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడిగా మారడానికి రాజా కృష్ణమూర్తికి వేదిక సిద్ధంగా ఉందని ఈవెంట్ నిర్వాహకులు ప్రసాద్ తోటకూర అన్నారు. సామాన్య ప్రజల కష్టాలు ఆయనకు తెలుసునని, అమెరికా చరిత్రలోనే ఆయన అత్యుత్తమ రిప్రజెంటేటివ్ కానున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఫిలడెల్ఫియాలో నిర్వహించిన డెమొక్రాటిక్ జాతీయ సదస్సులో ప్రైమరీ ఎన్నికల్లో గెలవడంతో పార్టీలో ఉన్నత వ్యక్తిగా ఎదిగారని కొనియాడారు. దలీప్ సింగ్, బాబీ జిందాల్, అమి బెరా తర్వాత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నికైన నాల్గవ వ్యక్తి కానున్నారని తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులలో ఒకరైన ఎంవిఎల్ ప్రసాద్ మాట్లాడుతూ... రాజా కృష్ణమూర్తి స్వస్థలం న్యూఢిల్లీ ఆయన చిన్నతనంలోనే కుటుంబంతో పాటు న్యూయార్క్ వచ్చారని తెలిపారు. ఇండో అమెరికన్ సభ్యులకు ఆయన ఓ రోల్ మోడల్ అని, ఆయన విద్యారంగం కోసం విశేషకృషి చేశారని కొనియాడారు. 2004లో అమెరికా సెనేట్ ఎన్నికల కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ విభాగంలో డైరెక్టర్గా సేవలు అందించారని పేర్కొన్నారు. తన ఎదుగుదలకు తల్లిదండ్రుల త్యాగాలే కారణమని, వారికి తాను రుణపడి ఉంటానని రాజా కృష్ణమూర్తి అన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, విలువలు, సాంప్రదాయంపై ఉన్న గౌరవం తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే ఎంతో సేవ చేసే అవకాశం ఉంటుందని, అయితే ఇండో అమెరికన్లు ఈ రంగంలోకి రావడం లేదని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దాదాపు 30 లక్షలకు పైగా జనాభా ఉన్న ఇండో అమెరికన్లు విద్యారంగం, మెడిసిన్ , వ్యాపారం, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఇతర రంగాలలో రాణిస్తున్నారని, రాజకీయాల్లో కూడా మనం రాణించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసాద్ తోటకూర, పాల్ పాండియన్, శ్రీదర్ తుమ్మల, ఎంవిఎల్ ప్రసాద్, సీసీ థియోఫిన్ సహా తనకు మద్ధతు తెలిపేందుకు వచ్చిన అందరకీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యర్థి పార్టీ నేతల కంటే అధికంగా నిధులు సమకూర్చుకోవడంతోనే రాజా కృష్ణమూర్తి దాదాపు విజయం సాధించినట్లే అని సీసీ థియోఫిన్ అన్నారు. చికాగో మిత్రులంతా త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ ఓటును రాజాకు వేయాలని పిలుపునిచ్చారు. సాయి సతీష్, ప్రశాంతి, ఇతర ముఖ్య సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రసాద్ తోటకూర, శ్రీదర్ తుమ్మల, ఎంవిఎల్ ప్రసాద్, సీసీ థియోఫిన్, పాల్ పాండియన్, సాయి సతీష్, డార్టర్ ప్రశాంతి గణేశా, స్వరూప తోటకూర, క్రిత్తిక గణేశా, మురళీ వెన్నం, అమృత్ కృపలాణి, మహేష్.జి, ఆర్ చేబ్రోలు, ఫాతిమా, తాయిబ్ కుంద్రావాలా, తన్వీర్, బెనజీర్ అర్ఫీ, అబిద్ అబేది, విజయ అండ్ లక్ష్మణ్ ఉప్పల, డాక్టర్ ఎస్ గుప్తా, మహేశ్ శెట్టి, డాక్టర్ సీఆర్ రావు శ్రీకాంత్.పి, పరిమళ, దినేష్, సింధు, చెన్నకేశవులు మొక్కపాటి, షిజు అబ్రహం, రాఘవేంద్ర కులకర్ణి, అరవింద్ ముప్పిడి, మోహన్ చంద్రన్, మురుగనాథన్.పి, శ్రీనివాస్ కాసు, డాక్టర్ యోగి చిమాటా, డాక్టర్ ధ్రువ్ బాలకొండి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భారత్కు ప్రత్యేక హోదా బిల్లుకు సెనేట్ అడ్డు
వాషింగ్టన్: భారత్ను అంతర్జాతీయ వ్యూహాత్మక, రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తించేందుకు అడ్డంకి ఎదురైంది. ఎగుమతి నియంత్రణ నిబంధనలకు సంబంధించిన సవరణల బిల్లు అమెరికా సెనెట్లో ఆమోదం పొందలేదు. ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త భేటీని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతి రోజు రిపబ్లికన్ పార్టీ సెనేటర్ జాన్ మెక్కెయిన్ నేషనల్ డిఫెన్స్ అధరైజేషన్ యాక్ట్(ఎన్డీఏఏ-17)కి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ఒబామా, మోదీ చర్చల అనంతరం భారత్ను ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. ఎన్డీఏఏ 85-13 ఓట్లతో సెనేట్ ఆమోదం పొందినా.. కొన్ని కీలక సవరణలకు ఆమోదం లభించలేదు. -
మ్యాజిక్... మోదీ
అమెరికా కాంగ్రెస్ మంత్రముగ్ధం మాట మాటకూ మోగిన చప్పట్లు.. కాంగ్రెస్ సభ్యుల హర్షామోదాలు మాట మాటకూ మోగిన చప్పట్లు.. కాంగ్రెస్ సభ్యుల హర్షామోదాలు 45 నిమిషాల్లో 40 సార్లు కరతాళాలు.. 8 సార్లు లేచి నిల్చుని మరీ అమెరికా కాంగ్రెస్లో ప్రధాని చరిత్రాత్మక ప్రసంగం ప్రపంచానికి ఉగ్రవాదమింకా పెనుముప్పే.. ఉగ్రవాదాన్ని పోషిస్తోంది మా పొరుగునే వారిని ఏకాకులను చేయాలి.. ప్రోత్సాహకాలు నిరాకరించాలి అమెరికా, భారత్లు రెండూ ప్రపంచ శాంతి, సుసంపన్నతలను ఆకాంక్షిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం పెనుముప్పుగానే ఉంది. దానిని ఓడించడానికి కేవలం సైన్యం, నిఘా, దౌత్యం వంటి సంప్రదాయ పద్ధతులు మాత్రమే సరిపోవు. దానిపై చాలా స్థాయిల్లో పోరాడాలి. లష్కరే తోయిబా, తాలిబాన్, ఐసిస్ ఇలా విభిన్నమైన పేర్లు ఉండొచ్చు.. కానీ దాని సిద్ధాంతం ఒక్కటే.. విద్వేషం, హత్య, హింస. మానవాళిపై నమ్మకమున్న వారు ఉగ్రవాదంపై పోరాడటానికి ఒకటిగా ముందుకు రావాలి. - ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్: మోదీ మాటలతో అమెరికా కాంగ్రెస్ సభ్యులు మంత్రముగ్ధులయ్యారు. ప్రధాని నోట వెలువడిన మాట మాటకూ చప్పట్లు చరుస్తూ హోరెత్తించారు. ఆయన ప్రసంగం ఆద్యంతం సభ్యులంతా చాలా సార్లు లేచి నిల్చుని మరీ చప్పట్లు చరుస్తూ తమ గౌరవమన్ననలు తెలియజేశారు. ముప్పావుగంట ప్రసంగంలో 40 సార్లు చప్పట్లతో హర్షామోదాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యులు.. అందులో 8 సార్లు లేచి నిల్చుని మరీ చప్పట్లు కొట్టటం విశేషం. అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయసభల సంయుక్త సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి ప్రసంగించారు. బుధవారం వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్లో హౌస్ ఆఫ్ చాంబర్స్లో జరిగిన ఈ సమావేశానికి మోదీ తన ప్రత్యేకమైన తెల్ల కుర్తా, పైజామాలపై నలుపు రంగు చేతులు లేని కోటును ధరించి హాజరయ్యారు. చట్టసభల సభ్యులందరూ లేచి నిల్చుని కరతాళ ధ్వనులతో సాదర స్వాగతం పలికారు. సభ్యులను పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్న మోదీ.. ఇరు దేశాల సంబంధ బాంధవ్యాలపై.. భవిష్యత్ మార్గంపై.. ప్రపంచంలో ఉమ్మడిగా పోషించగల పాత్రపై.. ఉగ్రవాదం విషయంలో అనుసరించాల్సిన విధానంపై అనర్గళంగా ఉపన్యసించారు. మధ్యమధ్యలో తనదైన శైలిలో చతురోక్తులతో సభ్యులను నవ్విస్తూనే.. అంతలోనే గంభీర అంశాలను ప్రస్తావిస్తూ వారిని సమ్మోహితులను చేశారు. అమెరికా కాంగ్రెస్ పనితీరు, భారత పార్లమెంటు పనితీరును పోల్చుతూ హాస్యమాడినపుడు.. అమెరికాలో యోగాకు ఆదరణ పెరుగుతున్నా తాము మేధో సంపత్తి హక్కు డిమాండ్ చేయలేదని ఛలోక్తి విసిరినపుడు.. కాంగ్రెస్ సభ్యులు పెద్ద పెట్టున నవ్వులతో చప్పట్లతో హోరెత్తించారు. మోదీ ప్రసంగం తర్వాత ప్రతినిధుల స్పీకర్ పాల్ ర్యాన్ తదితరులు ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. వివేకానంద, మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మా గాంధీ, అంబేడ్కర్, వాజపేయిలను ఉటంకిస్తూ మోదీ ప్రసంగం కొనసాగింది. భారత్ - అమెరికాల మధ్య పెరుగుతున్న బంధాలకు సంబంధించి అన్ని కోణాలనూ.. ప్రత్యేకించి వ్యూహాత్మక సంబంధాలు, పౌర అణు సహకారం గురించి ప్రస్తావించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భవిష్యత్తుకు పునాదులు బలపడిన నేపథ్యంలో గత కాలపు అవరోధాలను విడిచిపెట్టాలన్నారు. ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని భారతదేశానికి పొరుగునే పెంచి పోషిస్తున్నారంటూ ఆయన పరోక్షంగా పొరుగుదేశం పాకిస్తాన్ను ఎండగట్టారు. లష్కరే తోయిబా, తాలిబన్, ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఏదైనా సరే వాటి సిద్ధాంతం విద్వేషం, హత్యలేనని.. వాటి మధ్య ఎటువంటి తేడా చూపరాదని.. ఉగ్రవాదంపై ఒకే గొంతుతో పోరాడాల్సి ఉంటుందని అమెరికాకు సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని బోధించే వారికి ప్రోత్సాహం ఇవ్వటాన్ని నిరాకరించటం ద్వారా విస్పష్టమైన సందేశం పంపించాలని అమెరికా కాంగ్రెస్కు పిలుపునిచ్చారు. తద్వారా పాక్కు అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయం ప్రతిపాదనను అమెరికా కాంగ్రెస్ నిరోధించటం గురించి పరోక్షంగా ప్రస్తావించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... వారిని ఏకాకులను చేసే ప్రాతిపదికపై సహకారం... ‘‘అమెరికా, భారత్లు రెండూ ప్రపంచ శాంతి, సుసంపన్నతలను ఆకాంక్షిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం పెను ముప్పుగానే ఉంది. దానిని ఓడించటానికి కేవలం సైన్యం, నిఘా, దౌత్యం వంటి సంప్రదాయ పద్ధతులు మాత్రమే సరిపోవు. దానిపై చాలా స్థాయిల్లో పోరాడాలి. భారత సరిహద్దుకు పశ్చిమం నుంచి ఆఫ్రికా వరకూ దానికి లష్కరే తోయిబా, తాలిబాన్, ఐసిస్ ఇలా విభిన్నమైన పేర్లు ఉండొచ్చు. కానీ దాని సిద్ధాంతం ఒక్కటే.. విద్వేషం, హత్య, హింస. దాని నీడ ప్రపంచమంతా విస్తరించి ఉన్నప్పటికీ.. దానిని పెంచి పోషిస్తోంది భారత్ పొరుగునే. మానవాళిపై నమ్మకమున్న వారు ఉగ్రవాదంపై పోరాడటానికి ఒకటిగా ముందుకు రావాలి.. ఆ మహమ్మారికి వ్యతిరేకంగా ఒకే గొంతుతో మాట్లాడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని బోధించే వారికి, ఆచరించే వారికి విస్పష్టమైన సందేశం పపించాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులను నేను కోరుతున్నా. వారికి ప్రోత్సాహం ఇవ్వటానికి నిరాకరించటం.. వారి చర్యలకు వారిని బాధ్యులుగా నిలబెట్టే దిశగా తొలి చర్య అవుతుంది. మనం మన భద్రతా సహకారాన్ని బలోపేతం చేసుకోవటం ఇప్పుడు తక్షణావసరం. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే, మద్దతిచ్చే, ప్రేరేపించే వారిని ఏకాకులను చేసే విధానం ప్రాతిపదికగా ఈ సహకారం ఉండాలి. అది మంచి, చెడు ఉగ్రవాదం అనే తేడా చూపని, ఉగ్రవాదాన్ని మతంతో వేరు చేసే విధానమై ఉండాలి. ఉగ్రవాదంపై పోరాటంలో మన రెండు దేశాలూ ప్రజలను, సైనికులను కోల్పోయాయి. 2008 నవంబర్లో ముంబైపై ఉగ్రవాద దాడి అనంతరం భారత్కు మద్దతుగా అమెరికా నిలబడింది. అది మేం ఎన్నడూ మరచిపోం. వాణిజ్య అన్వేషణల్లో భారత్ మంచి భాగస్వామి... ఆర్థిక రంగంలో 7.6 శాతం వార్షిక వృద్ధి రేటుతో పయనిస్తున్న భారత్లో అపారమైన అవకాశాలున్నాయి. పురోగమిస్తున్న భారత్లోని ప్రతి రంగంలోనూ అమెరికాను ఒక అవిభాజ్య భాగస్వామిగా నేను చూస్తున్నా. ప్రపంచంలో అతి పెద్ద, అతి పురాతన ప్రజాస్వామ్యదేశాలైన భారత్, అమెరికాలు తమ దేశాల తాత్వికతల నుంచి, ఆచరణల నుంచి పరస్పరం చాలా నేర్చుకున్నాయి. మన ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించటమే కాదు.. మరింత సమైక్య, మానవీయ, సుసంపన్న ప్రపంచానికి వారధిలా ఉండేలా దృష్టి కేంద్రీకరించాలి. మా పౌరులకు భయం నుంచి స్వాతంత్య్రం ఉంది: భారత్ ఒకటిగా జీవిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, పండుగ చేసుకుంటుంది. నా ప్రభుత్వానికి రాజ్యాంగం నిజమైన పవిత్ర గ్రంథం. అది పౌరులందరికీ మత, వాక్స్వాతంత్య్రం, ఓటు హక్కు, సమానత్వాలను ప్రాథమిక హక్కులుగా అందిస్తుంది. 80కోట్ల మంది నా దేశ ప్రజలు ఐదేళ్లకోసారి ఓటేయొచ్చు. కానీ.. మా 125 కోట్ల మందికీ భయం నుంచి ప్రతిక్షణం స్వాతంత్య్రముంది. వారు మీ బలం.. మాకు గర్వకారణం... మన రెండు దేశాలనూ అనుసంధానిస్తున్న మరో విశిష్ట వారధి 30 లక్షల మంది భారతీయ అమెరికన్లు. మీ ఉత్తమ సీఈఓలు, అధ్యాపకులు, వ్యోమగాములు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, వైద్యులు, చివరికి స్పెల్లింగ్ చాంపియన్లలోనూ వారు ఉన్నారు. వారు మీ బలం. వారు భారత్కు గర్వకారణం కూడా’’ అని మోదీ అన్నారు. అమెరికాలో 3 కోట్ల మంది పాటిస్తున్న యోగాపై మేధో హక్కులను డిమాండ్ చేయడం లేదని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఘొల్లున నవ్వారు. అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ.. వాషింగ్టన్ నుంచి మెక్సికో వెళ్లారు. ''ఈ ప్రజాస్వామ్య దేవాలయం.. ప్రజాస్వామ్యం దిశగా వెళ్లేందుకు అనేక దేశాలకు స్ఫూర్తినిచ్చింది. ప్రోత్సాహాన్నిచ్చింది. లింకన్ మాటల్లో చెప్పాలంటే.. స్వేచ్ఛ, సమానత్వ భావనలకు ఊపిరులూదింది. ఇక్కడ ప్రసంగించే అవకాశం లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా'' - మోదీ మన బంధం శాంతి, సుస్థిరతలకు ఆధారం.. భారత్ - అమెరికా సంబంధాలు ప్రబలమైన భవిష్యత్తు దిశగా పయనిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం.. ఆసియా నుంచి ఆఫ్రికా వరకూ హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకూ శాంతి, సుసంపన్నత, సుస్థిరతలకు పటిష్టమైన ఆధారంగా నిలవగలదు. సముద్ర వాణిజ్య మార్గాల భద్రతకు, సముద్ర ప్రయాణంలో స్వేచ్ఛను కాపాడటానికి సాయపడగలదు. హిందూమహాసముద్ర ప్రాంతాన్ని సురక్షితం చేసే బాధ్యతలను భారత్ ఇప్పటికే చేపడుతోంది. అయితే.. 20వ శతాబ్దపు ఆలోచనలతో రూపొందిన అంతర్జాతీయ సంస్థలు నేటి వాస్తవాలను ప్రతిబింబిస్తే మన సహకారం సామర్థ్యం మరింత పెరుగుతుంది.’’ ఇదే స్ఫూర్తి పదే పదే చూస్తున్నా ‘‘అమెరికా కాంగ్రెస్ పనితీరు సామరస్యపూరితంగా ఉంటుందని నేను విన్నాను. రెండుగా విడిపోయి పనిచేయటంలో కూడా మీకు మంచి పేరు ఉందనీ నేను విన్నాను. బాగుంది.. మీరు ఒక్కరే కాదు. నేను ఎప్పటికప్పుడు భారత పార్లమెంటులో ఇదే స్ఫూర్తిని చూశాను.. ప్రత్యేకించి మా ఎగువ సభలో. మన విధానాలు ఒకేలా ఉన్నాయి చూశారుగా’’ అని మోదీ పేర్కొన్నపుడు కాంగ్రెస్ సభ్యులు పెద్ద పెట్టున నవ్వులు, కరతాళ ధ్వనులతో స్పందించారు. మోదీ.. ఆరో ప్రధాని! అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానుల్లో మోదీ ఆరవ వ్యక్తి. తొలి ప్రధాని నెహ్రూ 1949 అక్టోబర్ 13న అక్కడ ప్రసంగించారు. ప్రపంచ శాంతి, మానవాళి స్వేచ్ఛ పరిరక్షణ లక్ష్యంగా తమ విదేశాంగ విధానం ఉంటుందన్నారు. జూన్ 13, 1985న నాటి ప్రధాని రాజీవ్ మాట్లాడుతూ.. సర్వ స్వతంత్ర, దృఢమైన, స్వయం సమృద్ధ భారత్ తన స్వప్నమన్నారు. 1994 మే18న పీవీ నరసింహరావు, 2000 సెప్టెంబర్ 14న వాజ్పేయి, 2005 జూలై 19న మన్మోహన్ అగ్రదేశ పార్లమెంటులో ప్రసంగించారు. యూఎస్ కాంగ్రెస్ ప్రశంసలు వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్లో మోదీ ప్రసంగంపై ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్తోపాటు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ప్రసంగం ఆలోచింపజేసేలా ఉందని స్పీకర్ పాల్ ర్యాన్ తెలిపారు. ప్రపంచంలో శాంతి, స్వాతంత్య్రం పరిఢవిల్లటంతోపాటు భారత-అమెరికా సంబంధాల గురించి మోదీ మాట్లాడిన తీరు అద్భుతమన్నారు. ఇరుదేశాల సంబంధాలు ఈ పర్యటనతో వేగం పుంజుకుంటాయని కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు. మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
అమెరికా వేదికగా పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా పార్లమెంటు వేదికగా దాయాది పాకిస్థాన్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టి సందేశం పంపించారు. అమెరికా చట్టసభ అయిన కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడంలో ఆ దేశం అవలంబిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 'భారత ఇరుగుపొరుగులోనే ఉగ్రవాదం పురుడుపోసుకుంటున్నది' అని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాద నీడ ప్రపంచమంతా పరుచుకుంటున్నదని, మానవత్వంపై విశ్వాసమున్నవారంతా ఏకతాటిపైకి వచ్చి.. ఈ ఉపద్రవానికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మోదీ ప్రసంగానికి అమెరికా చట్టసభ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో మద్దతు లభించింది. ఆయన ప్రసంగానికి ముగ్ధులైన చట్టసభ సభ్యులు తరచూ కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. మోదీ ప్రసంగిస్తూ చైనా పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ దక్షిణ చైనా సముద్రం వివాదం ముదురుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 'సముద్రతల భద్రత, సముద్రం మీదుగా వాణిజ్యం, సముద్రమార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానానికి భారత్ అండగా నిలబడుతుంది' అని మోదీ స్పష్టం చేశారు. అమెరికా ఉభయ చట్టసభలనుద్దేశించి ప్రసంగించిన ఐదో భారతీయ నాయకుడు నరేంద్రమోదీ. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకాలంలోనే ఆయన నాలుగోసారి అమెరికా పర్యటనకు వచ్చారు. -
ఒబామా ప్రసంగం.. కాస్త వెరైటీగా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చేవారం కాంగ్రెస్(అమెరికా ఉభయ సభలు)ను ఉద్దేశించి చివరిసారి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. దేశంలో కొత్త ఏడాదిలో తీసుకురాబోయే చట్టాలు, ప్రభుత్వ విధానాలను ఈ ప్రసంగం(స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్)లో వివరించడం ఆనవాయితీ. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా ఒబామా ప్రసంగం సాగనుంది. దేశాన్ని శక్తిమంతంగా మార్చాలంటే ఏం చేయాలి? చిన్నారుల బంగారు భవిత కోసం ఏం చర్యలు తీసుకోవాలన్న అంశాలపై మాట్లాడనున్నారు. -
'హిందూ సంప్రదాయంలోనే పెళ్లి'
వాషింగ్టన్: యూఎస్ కాంగ్రెస్లో మొట్టమొదటి హిందు సభ్యురాలు తులసీ గబార్డ్ (33) త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ (26) ను ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరగనున్న వివాహం ద్వారా తాము ఒక్కటవుతున్నామని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గురువారం ఆమె వెల్లడించింది. తమ వివాహం హిందు సంప్రదాయ పద్దతుల్లోనే జరుగుతుందని తెలిపింది. ఇద్దరికి వివాహ నిశ్చితార్థం జరిగి నెల రోజులు దాటిందని పేర్కొంది. నిశ్చితార్థ సమయంలో డైమండ్ రింగ్ చేతి వేలికి తొడిగారని చెప్పారు. బోళాతనం, మంచితనం మూర్తిభవించిన వ్యక్తి అని అబ్రహం సుగుణాలను తులసీ ఈ సందర్భంగా కీర్తించారు. విలియమ్స్ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్గా విధులు నిర్వహిస్తూ ... మరో వైపు షార్ట్ ఫిల్మ్స్తోపాటు రాజకీయ, వాణిజ్య ప్రకటనల కోసం అడ్వర్టజమెంట్లు రూపొందిస్తున్నాడు. -
అమీ బెరాకు ఏఏహెచ్ఓఏ శుభాకాంక్షలు
వాషింగ్టన్: యూఎస్ చట్టసభకు మరోసారి ఎన్నికైన ఇండియన్ అమెరికన్ అమీ బెరాకు ఆసియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ (ఏఏహెచ్ఓఏ) శుభాకాంక్షలు తెలిపింది. అమీ బెరాకు మద్దతు ఇస్తున్నందుకు తామంతా గర్విస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ఏఏహెచ్ఓఏ ఛైర్మన్ ప్రతీక పటేల్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. యూఎస్ చట్టసభకు ఎన్నికైనా అమీ బెరా ఏఏహెచ్ఓఏలో సభ్యుడని ఆమె గుర్తు చేశారు. ఆయనతో పని చేస్తూ అతిథ్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని తెలిపారు. దాదాపు పక్షం రోజుల క్రితం జరిగిన కాలిఫోర్నియాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమీబెరా గెలుపొందారు. 2012లో అమీబెరా యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్కు ఎన్నికయ్యారు. యూఎస్ చట్టసభకు ఎన్నికైన మూడో ఇండియన్ అమెరికన్గా అమీబెరా చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు బాబీ జిందాల్, దలిప్ సింగ్ సంద్లు ఎన్నికయ్యారు. -
భారత ఫార్మా కంపెనీలపై దర్యాప్తు
- అమెరికా కాంగ్రెస్ నిర్ణయం -జనరిక్ ఔషధ ధరల పెంపుపై ఆరా - జాబితాలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, మైలాన్ వాషింగ్టన్: ఎంపిక చేసిన కొన్ని జనరిక్ ఔషధాల ధరలను పెంచుతూపోవడంపై భారత ఫార్మా దిగ్గజాలు సన్, డాక్టర్ రెడ్డీస్, మైలాన్ తదితర 14 సంస్థలపై యూఎస్ కాంగ్రెస్ దర్యాప్తును చేపట్టింది. కొన్ని జనరిక్ ఔషధాల ధరలను పెంచుతూ పోవడంపై వివరణ ఇవ్వాల్సిందిగా 14 కంపెనీలను నోటీసుల ద్వారా హౌస్ కమిటీ ర్యాకింగ్ సభ్యుడు ఎలిజా ఇ కమింగ్స్, సెనేటర్ బెర్నార్డ్ శాండర్స్ ఆదేశించారు. సాధారణ అనారోగ్య పరిస్థితుల దగ్గర్నుంచి ప్రాణాపాయాన్ని కలిగించే వ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధాల వరకూ ధరల అంశంపై వీరిరువురూ దర్యాప్తు చేపట్టినట్లు అమెరికా ప్రతినిధుల సభ తమ వెబ్సైట్లో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా చికిత్స వ్యయాలను తగ్గించేందుకు వీలుగా తగిన చర్యలను వీరు సూచించనున్నట్లు తెలిపింది. తద్వారా అమెరికాలో రోగులకు చేయూత అందించనున్నట్లు వివరించింది. ఏడాది కాలంగా గత రెండేళ్లలో 10 రకాల జనరిక్ ఔషధాల ధరలు పెరిగిన తీరుపై కమింగ్స్, శాండర్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా గత ఏడాది కాలంలో వీటి ధరలు ఆశ్చర్యకరంగా పెరిగాయని, వీటికి కారణాలు తెలుసుకోవలసి ఉన్నదని వ్యాఖ్యానించారు. కొన్ని సందర్భాలలో రోగులు వీటిని ఖరీదు చేసేందుకు వీలులేకుండా పెరిగాయని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు హెల్త్కేర్ సప్లై చైన్ అసోసియేషన్ నుంచి తీసుకున్న గత రెండేళ్ల గణాంకాలను ప్రస్తావించారు. నోటీసులిచ్చిన కంపెనీల జాబితాలో అక్టావిస్, అపోటెక్స్ కార్ప్, ఎండో ఇంటర్నేషనల్, గ్లోబల్ ఫార్మాస్యూటికల్స్, హెరిటేజ్ ఫార్మాస్యూటికల్స్, లానెట్ కంపెనీ, మారథాన్ ఫార్మాస్యూటికల్స్, మైలాన్, పీఏఆర్ ఫార్మాస్యూటికల్, టెవా, వెస్ట్వార్డ్ ఫార్మాస్యూటికల్, జైడస్ ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి. సందేహాలు తీరుస్తాం యూఎస్ కాంగ్రెస్ నోటీస్కు వివరణ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ కంపెనీ ప్రతినిధి చెప్పారు. నోటీస్లో లేవనెత్తిన అంశాలపై తగిన విధంగా స్పందించనున్నట్లు తెలిపారు. నోటీస్లో పేర్కొన్న ఔషధాల ధరలను పెంచే ప్రయత్నాలు చేయలేదని వివరించారు. కాగా, సన్ ఫార్మా కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. 2012 నుంచీ వివరాలు 2012 నుంచీ ఆదాయాలు, ఔషధాల అమ్మకాలు, ధరలు, ధరల పెంపునకు కారణాలు, ధరల పెంపు నిర్ణయాలు తీసుకున్న అధికారుల వివరాలు అందించాల్సిందిగా సభ్యు లు కంపెనీలను కోరారు. కోట్లమంది అమెరికన్లకు ఔషధాలు అందుబాటులోకి తీసుకురావడమే నిజానికి జనరిక్స్ పరమార్థమని ప్రైమరీ హెల్త్ సబ్కమిటీ, హెల్త్, ఎడ్యుకేషన్ సెనేట్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న శాండర్స్ ధరల పెరుగుదలపై వ్యాఖ్యానించారు. జనరిక్స్ ధరల పెరుగుదలకు మూలకారణాలను తెలుసుకోవలసిన అవసరమున్నదని పేర్కొన్నారు. జనరిక్ ఔషధ ధరల పెరుగుదల తీరును వివరిస్తూ ఆస్త్మా, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సకు వినియోగించే అల్బుటరోల్ సల్ఫేట్ను ప్రస్తావించారు. ఈ ఔషధం (2ఎంజీ) 100 ట్యా బ్లెట్ల ధర 4,014% పెరిగినట్లు తెలిపారు.