uscis
-
హెచ్-1బీ వీసా : భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత ఆమెరికాలో ఉండే భారతీయులు, అక్కడ చదువుకునే భారతీయ విద్యార్థుల భవితపై అనే సందేహాలు నెలకొన్ని నేపథ్యంలో యూఎస్ ప్రకటన లక్షలాది మంది భారతీయ టెకీల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అధికారం నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ నిబంధనలను సడలించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసా ప్రోగ్రామ్ను ఆధునీకరించే నిర్ణయాన్ని ప్రకటించింది. 2025 జనవరి 17 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం యూఎస్లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నియమాలు కొత్త ఉద్యోగాల్లోకి మారడానికి వారికి సహాయపడతాయి. అలాగే అత్యంత నిపుణులైన టెకీలను నిలుపుకోవడానికి యజమానులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌ చెప్పారు.హెచ్ 1 బీ వీసా : కీలకమైన అప్డేట్స్F-1 విద్యార్థి వీసాదారులు, ఉద్యోగాలు, H-1B స్థితికి మారడం, తద్వారా అమెరికాలో కొనసాగడం వంటి మార్పులు ఉండనున్నాయి.దరఖాస్తుదారులు తమ హెచ్-1బీ దరఖాస్తులను సమర్పించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 అప్లికేషన్ ఫారంను ఉపయోగించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ వీసా దరఖాస్తు తమ డిగ్రీతో నేరుగా ముడిపడి ఉన్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించాలి. దీంతో వీసాల జారీలో దుర్వినియోగాన్ని తగ్గించాలనేది లక్ష్యం.అంతేకాదు హెచ్1 బీ వీసా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకునే, జరిమానాలు విధించే, లేదా వీసా (VISA) లను రద్దు చేసే అధికారం మరింత ఉంటుంది. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేని విధానమైన డ్రాప్ బాక్స్ సిస్టమ్ ను మరింత సరళతరం చేయ నున్నారు. అభ్యర్థుల మునుపటి దరఖాస్తు రికార్డులపై ఆధారపడటాన్ని విస్తరించవచ్చు, పునరుద్ధరణలను వేగవంతం చేయవచ్చు.గతంలో H-1B వీసాకు అనుమతి లభించినవారి ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. కొన్ని షరతులతో పిటిషన్ సంస్థపై నియంత్రణ ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు అర్హతను పొడిగిస్తుంది.కాగా ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతీ ఏడాది వేలాదిమంది ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు H-1B వీసాలపై ఆధారపడతాయి. హెచ్-1బీ వీసా హోల్డర్లలో సింహభాగం భారతదేశానికి చెందినవారే. 2023లో, జారీ చేసిన వీసాల్లో భారతీయులు 72.3శాతంఉన్నారు.H-1B వీసా దరఖాస్తులు తరచుగా వార్షిక పరిమితిని మించిపోవడంతో వీసాలు లాటరీ విధానంద్వారా కేటాయిస్తున్నారు. దీంతో కొంతమంది నష్టపోతున్న సంగతి తెలిసిందే. -
హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
వాషింగ్టన్: అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, ఆపిల్, డెల్, ట్విటర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. నాన్–ఇమ్మిగ్రెంట్లను తొలగిస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాలో 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. లే–ఆఫ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రధానంగా హెచ్–1బీ వీసాలతో అమెరికా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కంపెనీ యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. ఇలాంటి వారికి యూఎస్ సిటిజెన్íÙప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. హెచ్–1బీ వీసాదారులు ఉద్యోగం పోతే 60 రోజులు దాటినా కూడా అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చని వెల్లడించింది. అయితే, నాన్–ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలోనే ఉన్న జీవిత భాగస్వామిపై డిపెండెంట్గా మారొచ్చు. అంటే హెచ్–4, ఎల్–2 వీసా పొందొచ్చు. ఈ వీసాలు ఉన్నవారికి పని చేసుకొనేందుకు(వర్క్ ఆథరైజేషన్) అనుమతి లభిస్తుంది. స్టూడెంట్(ఎఫ్–1), విటిటర్ (బి–1/బి–2) స్టేటస్ కూడా పొందొచ్చు. కానీ, బి–1/బి–2 వీసా ఉన్నవారికి పని చేసుకొనేందుకు అనుమతి లేదు. 60 రోజుల గ్రేస్ పిరియడ్లోనే వీసా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్సీఐఎస్ సూచించింది. -
USA: 99 ఏళ్ల భారతీయ బామ్మకు అమెరికా పౌరసత్వం
వాషింగ్టన్: భారతీయ మహిళ దైబాయి 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొందారు. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించింది. ‘వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అనడానికి 99 ఏళ్ల దైబాయి నిదర్శనం. మా ఓర్లాండో కార్యాలయానికి ఆమె ఉత్సాహంగా వచ్చారు. యూఎస్ కొత్త సిటిజన్కు మా అభినందనలు’అని యూఎస్సీఐఎస్ పోస్టు చేసింది. దైబాయికి అమెరికా పౌరసత్వం లభించడం పట్ల పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా మరికొందరు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి -
గుడ్న్యూస్.. హెచ్-1బీ వీసా నమోదు గడువు పొడగింపు
వాషింగ్టన్: 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువును యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పొడిగించింది. మార్చి 22వ తేదీతో ఈ గడువు ముగియనుండగా మరో మూడు రోజులు అంటే మార్చి 25 వరకూ పొడిగించినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తాత్కాలికంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గడువును యూఎస్సీఐఎస్ పొడిగించింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్-1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
హెచ్–1బీ రిజిస్ట్రేషన్కు ఆఖరు తేదీ మార్చి 22
వాషింగ్టన్: 2025వ సంవత్సరానికి గాను హెచ్–1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువు మార్చి 22వ తేదీతో ముగియనుందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. అదేవిధంగా, హెచ్–1బీ క్యాప్ పిటిషన్లకు ఏప్రిల్ ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. నాన్ క్యాప్ దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉండే తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్–1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన!
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా ధరఖాస్తుల కోసం ఆన్లైన్ ఫైలింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని తెలిపింది. దీంతో పాటు హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ల సమర్పణను ప్రారంభించే ఆర్గనైజేషనల్ అకౌంట్స్ను ప్రారంభించనుంది. వీటిని సంస్థాగత ఖాతాలు అని పిలుస్తారు. సంస్థాగత ఖాతాల్లో ఒక సంస్థ లేదా ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వారి కోసం సంస్థ తరుపున పనిచేసే న్యాయపరమైన వ్యవహారాలు చూసుకునే ప్రతినిధులను హెచ్ -1బీ రిజిస్ట్రేషన్లు, ఫారమ్ ఐ-129, వలసేతర వర్కర్ కోసం ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తుదారుల కోసం ఫారమ్-ఐ 907ను అనుమతి ఇస్తుంది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) విభాగాల్లో కీలక మార్పులు చేటుచేసుకున్నాయి. వాటిల్లో ప్రధానంగా ఫీచర్లు: హెచ్-1బీ రిజిస్ట్రెంట్ ఖాతాలతో చట్టపరమైన ప్రతినిధులు, సంస్థల కోసం సంస్థాగత ఖాతాలు మెరుగైన డిజైన్ కేస్ మేనేజ్మెంట్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఫైలింగ్ ఆప్షన్స్ : హెచ్-1బీ పిటిషనర్లు తమ సంస్థ ఖాతాల ద్వారా ఫారమ్లు ఐ-129, అనుబంధిత ఫారమ్ ఐ-907 ప్రీమియం ప్రాసెసింగ్ అభ్యర్థనలను ఆన్లైన్లో ఫైల్ చేయవచ్చు. ఆన్లైన్ ఫైలింగ్ కోసం చట్టపరమైన ప్రతినిధి ద్వారా చేసుకోవచ్చు. లేదంటే పేపర్ ఆధారిత ఫైలింగ్ని ఎంచుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ : హెచ్-1బీ వీసా నమోదు ప్రక్రియ ప్రత్యేకంగా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. యూజర్ ఫీడ్ బ్యాక్ : యూఎస్సీఐఎస్ వివిధ స్టేక్ హోల్డర్స్తో కలిసి యుజబిలిటి టెస్టింగ్ను నిర్వహించనుంది. ఫలితంగా ఆర్గనైజేషనల్ అకౌంట్ పూర్తి స్థాయిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కంటిన్యూడ్ ఫీడ్బ్యాక్ : యూఎస్ సీఐఎస్ వినియోగదారుల అభిప్రాయాన్ని సేకరించి, యూజర్ ఎక్స్పీరీయన్స్ను అందించే ప్రయత్నాలు చేయనుంది. నేషనల్ ఎంగేజ్మెంట్: యూఎస్సీఐఎస్ జనవరి 23, జనవరి 24న నేషనల్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రక్రియ ద్వారా సంస్థలు, చట్టపరమైన ప్రతినిధులకు నిర్దేశం చేసేందుకు సంస్థాగత ఖాతాల సమాచారాన్ని అందిస్తుంది. ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ : హెచ్-1బీ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తులను సమాచార సెషన్లకు హాజరు కావడానికి యూఎస్సీఐఎస్ ప్రోత్సహిస్తుంది. సంస్థాగత ఖాతాలు, ఆన్లైన్ ఫైలింగ్ వివరాలు హెచ్ -1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేజీలో అందుబాటులో ఉంటాయి. -
పర్యాటక వీసాతోనూ ఉద్యోగ దరఖాస్తులు: అమెరికా
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో ఉద్యోగం కోల్పోయి కొత్త కొలువు దొరక్క దేశం వీడాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్న హెచ్–1బి వీసాదారులకు, ముఖ్యంగా భారత టెకీలకు భారీ ఊరట! బిజినెస్ (బి–1), పర్యాటక (బి–2) వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకూ హాజరు కావచ్చని ఆ దేశ పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. ‘‘అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం చూసుకోలేని పక్షంలో అమెరికా వీడటం తప్ప మరో మార్గంలేదనే అపోహలో ఉన్నారు. మరింత కాలం దేశంలో ఉండేందుకు వారికి పలు మార్గాలున్నాయి. 60 రోజుల్లోపు వీసా స్టేటస్ను (బి–1, బి–2కు) మార్చుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ ముగిశాక కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చు’’ అని వివరించింది. అయితే ఉద్యోగం దొరికాక అందులో చేరేలోపు వీసా స్టేటస్ను తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయమై పలువురు వెలిబుచ్చిన పలు సందేహాలకు సమాధానంగా సంస్థ ఈ మేరకు ట్వీట్ చేసింది. బి–1 వీసాను స్వల్పకాలిక బిజినెస్ ప్రయాణాలకు, బి–2ను ప్రధానంగా పర్యాటక అవసరాలకు అమెరికా జారీ చేస్తుంటుంది. మాంద్యం దెబ్బకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా గత నవంబర్ నుంచి అమెరికాలోనే 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులయ్యారు. వీరిలో కనీసం లక్ష మంది భారతీయులేనని అంచనా! -
అమెరికాలో మనోళ్ల వాటా పెరిగింది
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అదే సమయంలో చైనా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. 2021లో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 12 శాతం పెరిగింది, చైనా విద్యార్థుల సంఖ్య 8 శాతానికి పైగా పడిపోయింది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజాగా తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి గతేడాది విదేశీ విద్యార్థుల చేరికపై ప్రభావం చూపిందని తెలిపింది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఇప్పటికీ చైనా జాతీయులదే మెజారిటీ వాటా కాగా భారతీయ విద్యార్థులు రెండో స్థానంలో ఉన్నారు. స్టూడెంట్స్, ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవిస్) ప్రకారం.. నాన్–ఇమ్మిగ్రెంట్ స్టూడెంట్ వీసాలైన ఎఫ్–1, ఎం–1 ద్వారా 2021లో 12,36,748 మంది అమెరికాలో ఉన్నారు. 2020తో పోలిస్తే ఇది 1.2% తక్కువ. 2021లో చైనా నుంచి 3,48,992 మంది, భారత్ నుంచి 2,32,851 మంది అమెరికాకు వచ్చారు. 2020తో పోలిస్తే చైనా విద్యార్థులు 33,569 మంది తగ్గిపోయారు. ఇక భారత్ నుంచి 25,391 మంది అదనంగా వచ్చారు. విదేశీయులు విద్యాభ్యాసం కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాల కంటే కాలిఫోర్నియాకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2021లో 2,08,257 మంది (16.8 శాతం) విదేశీయులు కాలిఫోర్నియా విద్యాసంస్థల్లో చేరారు. 2021లో యూఎస్లో 11,42,352 మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యలో డిగ్రీలు పొందారు. -
మార్చి 1 నుంచి హెచ్1–బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
వాషింగ్టన్: భారత టెకీలు ఎంతో ఆత్రంగా ఎదురుచూసే హెచ్1–బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్నవారిని అమెరికా కంపెనీలు ఈ వీసాల కింద ఉద్యోగాల్లో నియమించుకుంటాయి. 2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి మార్చి 18 వరకు జరుగుతుందని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఒక ప్రకటనలో వెల్లడించింది. హెచ్1–బీ వీసాలను ఆశించే వారు, కంపెనీ ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్కు 10 డాలర్ల రుసుము (రూ.750) చెల్లించాలి. ఆ తర్వాత లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి మార్చి 31లోగా వీసా వచ్చిన వారికి తెలియజేస్తామని స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగుల్ని హెచ్1–బీ వీసా ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం ప్రతీ ఏడాది యూఎస్సీఐఎస్ 65 వేల హెచ్1–బీ వీసాలను మంజూరు చేస్తుంది. అవే కాకుండా అమెరికా యూనివర్సిటీ నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్ సబ్జెక్టుల్లో) అంశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల హెచ్1–బీ వీసాలను ఏటా మంజూరు చేస్తుంది. ఈ వీసాల్లో అగ్రభాగం భారతీయ టెక్కీలకే దక్కుతుంటాయి. -
హెచ్-1బి వీసా దరఖాస్తు దారులకు శుభవార్త..!
2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బి వీసాల ప్రాథమిక రిజిస్ట్రేషన్లు మార్చి 1 నుంచి మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. ఈ మధ్య కాలంలో దరఖాస్తుదారులు, ప్రతినిధులు(పిటిషనర్ తరఫున వీసాకోసం అప్లయ్ చేసే వారు) ఆన్లైన్ ద్వారా హెచ్-1బీ వీసాకోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి హెచ్-1బీ క్యాప్ కోసం ఓ ప్రత్యేక సంఖ్యను కేటాయించనున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ నంబర్ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ను ట్రాక్ చేయొచ్చని పేర్కొంది. దరఖాస్తు స్టేటస్ను మాత్రం ఈ నంబర్ ద్వారా ట్రాక్ చేయలేరని స్పష్టం చేసింది.అమెరికాలో పని చేయాలంటే విదేశీయులకు హెచ్-1బీ విసా తప్పనిసరి. పరిమితకాలంతో ఈ వీసాను అమెరికా ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని టెక్ నిపుణులు హెచ్-1బీ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. వారిలో ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. ఈ వీసా కార్యక్రమం ద్వారా యుఎస్ కంపెనీలు భారతీయులను నియమించుకోవచ్చు. అమెరికాలో అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 65,000 హెచ్-1బి వీసాలు జారీ చేయగా, 20,000 వీసాలు యుఎస్ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్ల కోసం రిజర్వ్ చేశారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బి వీసాలను అందుకున్న వారిలో అమెజాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. హెచ్-1బీ వీసా కోసం పిటిషనర్లు, వారి తరఫు ప్రతినిధులు మైయూఎస్సీఐఎస్ ఆన్లైన్ అకౌంట్ను వినియోగించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో అభ్యర్థి 10 డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. స్వియ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు.. ఫిబ్రవరి 21 నంచి మైయూఎస్సీఐఎస్ ఆకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చని వివరించింది. మార్చి 31 నాటికి ఎంపిక దరఖాస్తుకు ఎంపికైన వారి వివరాలు.. మైయూఎస్సీఐఎస్ అకౌంట్కు అందుతాయని పేర్కొంది. దరఖాస్తు యాదృచ్ఛికంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల హెచ్-1బి వీసా దరఖాస్తుదారులకు నిర్వహించే వ్యక్తిగత ఇంటర్వ్యూను అమెరికా రద్దు చేసింది. (చదవండి: 5 నిమిషాల్లో పాన్కార్టులోని పేరు, పుట్టిన తేదీని మార్చుకోండి ఇలా..!) -
హెచ్1బీ భాగస్వాములకు భారీ లబ్ధి
వాషింగ్టన్ : భారత్ నుంచి వచ్చే వారితో సహా వలసదారులకి ప్రయోజనం చేకూరేలా అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు (భర్త/భార్య) ఆటోమేటిక్గా వర్క్ ఆథరైజేషన్ కల్పించడానికి అంగీకరించింది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ నిపుణుల భార్యలకి ఈ నిర్ణయంతో ఎంతో ఊరట లభించింది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) హెచ్–1బీ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులు (భార/భర్త, 21 ఏళ్ల వయసులోపు పిల్లలు)కి హెచ్–4 వీసా జారీ చేస్తుంది. ఈ వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కలిగి ఉండాలి. దీనిని ఎప్పటికప్పుడు వారు పొడిగించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇకపై అలాంటి బాధ లేకుండా ఉద్యోగం చేయడానికి వీలుగా ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్తో కూడిన హెచ్–4 వీసాను మంజూరు చేయడానికి బైడెన్ సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఈ నిర్ణయంతో భారత్ నుంచి వెళ్లే మహిళలకే అత్యధికంగా లబ్ధి చేకూరనుంది. ఈఏడీని పొడిగించుకోవడాన్ని సవాల్ చేస్తూ హెచ్–4 వీసాదారుల తరఫున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్ఏ) కోర్టులో పిటిషన్ వేసింది. ‘హెచ్–4 వీసాదారులు తరచూ రెగ్యులేటరీ పరీక్ష ఎదుర్కోవాలి. అయితే గతంలో హోంల్యాండ్ ఏజెన్సీ వారికి ఉద్యోగం రాకుండా నిషేధం విధించింది. దీంతో రీ ఆథరైజేషన్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండా వారు అత్యధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది’అని ఏఐఎల్ఏ లాయర్ జాన్ వాస్డెన్ చెప్పారు. దీనిపై బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం 90 వేలమందికి పైగా హెచ్–4 వీసాదారులకు వర్క్ ఆథరైజేషన్ ఉంది. -
లక్ష గ్రీన్కార్డులు వృథా అయ్యే ప్రమాదం!
వాషింగ్టన్: దాదాపు లక్షకు పైగా గ్రీన్కార్డులు ఈ సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే భారతీయ ఐటీ నిపుణుల్లో చాలామంది ఆశలపై నీళ్లు జల్లినట్లు కానుంది. ఈ ఏడాది ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డుల కోటా గతేడాదితో పోలిస్తే లక్షకు పైగా పెరిగి 2,61,500కు చేరిందని భారత్కు చెందిన సందీప్ పవార్ చెప్పారు. అయితే చట్టం ప్రకారం సెప్టెంబర్ 30లోపు అవసరమైన వీసాలు జారీ కాకుంటే అధికంగా పెరిగిన కోటాలోని లక్ష కార్డులు వృ«థా అవుతాయన్నారు. ఈ విషయమై బైడెన్ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ఇంకా ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) చేస్తున్న జాప్యమే గ్రీన్కార్డుల వృ«థాకు కారణమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు భారత్, చైనాకు చెందిన 125 మంది ఈ వృ«థా నివారించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఒకపక్క దశాబ్దాలుగా గ్రీన్కార్డు కోసం ఎదురుచూసేవారుండగా, మరోపక్క ఇలా కార్డులు వృ«థా కావడం సబబుకాదని వీరు కోర్టుకు విన్నవించారు. యూఎస్సీఐఎస్ అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల పలువురు భారతీయుల భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులకు గ్రీన్కార్డులందడంలేదని భారతీయ హక్కుల పోరాట కార్యకర్త పవార్ చెప్పారు. డ్రీమర్ల హక్కులకు రక్షణ కల్పించాలని, గ్రీన్ కార్డులపై పరిమితి ఎత్తివేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
హెచ్–1బీ వీసాల జారీకి రెండోసారి లాటరీ
వాషింగ్టన్: హెచ్–1బీ వర్క్ వీసా కోసం ఎదురు చూస్తున్న భారత ఐటీ నిపుణులకు శుభవార్త. ఈ వీసాల జారీకి రెండోసారి లాటరీ నిర్వహించాలని యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) నిర్ణయించింది. మొదటి దశలో వీసాలు పొందలేని వారికి ఈ విధంగా మరో అవకాశం లభించనట్లే. హెచ్–1బీ వీసాల జారీకి ఈ ఏడాది ప్రారంభంలో కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించారు. అయితే, అర్హులైన వారు చాలామంది వీసాలు పొందలేకపోయారు. అందుకే రెండోసారి లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ గురువారం ప్రకటించింది. ఏటా కేవలం 65వేల హెచ్–1బీ వీసాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. హెచ్–1బీ అనేది నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా. దీనితో అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను స్వదేశంలో ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు. రెండోసారి లాటరీ విషయంలో పిటిషన్ ఫైలింగ్ ఆగస్టు 2 నుంచి నవంబర్ 3 వరకు ఉంటుందని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. -
H-1B Visa: భారత టెక్కీలకు మరో ఛాన్స్!
H-1B Visa Second Lottery: భారత టెక్కీలకు ఊరట ఇచ్చే వార్త ప్రకటించింది యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ. రెండో రౌండ్ లాటరీ పద్ధతిలో హెచ్-1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయినందున.. జులై 28న మరికొందరిని ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆగష్టు 2 నుంచి ప్రారంభం కాబోయే పిటిషన్ ఫైలింగ్ ప్రక్రియ నవంబర్ 3తో ముగియనన్నుట్లు అర్హులైన అభ్యర్థులకు సూచించింది. ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30) హెచ్-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లలో (ఏప్రిల్ 1 నుంచి 30 దాకా నమోదు చేసుకున్నవాళ్ల) మొదటి లాటరీలో ఎంపిక చేసింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో ఎంపికలు చేయలేకపోయామని, కాబట్టే, ఇప్పుడు రెండో లాటరీ నిర్వహిస్తున్నట్లు USCIS వెల్లడించింది. తద్వారా అదనంగా వందల మంది ఆశావాహ టెక్కీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఇది స్టెమ్-ఓపీటీ స్టూడెంట్స్కు భారీ ఊరట ఇవ్వనుంది. కాగా, హెచ్-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్ -1 బీ వీసాలను జారీ చేస్తుంటుంది. తద్వారా చైనీయులకు-భారతీయులకు ఆయా దేశాల ,ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరునుంది. హెచ్-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. -
USA: గ్రీన్కార్డు నిరీక్షణకు తెరపడేనా!
గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న భారతీయుల నిరీక్షణకు తెరపడేదెన్నడు? కంట్రీ కోటా పరిమితి 7 శాతాన్ని ఎత్తేస్తే భారతీయులకి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుంది? కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాదిగా అమెరికా రాకపోకలపై ఆంక్షలతో గ్రీన్ కార్డులు మంజూరు కాకపోవడం మన దేశానికి కలిసి వస్తుందా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం ఉద్దేశించిన గ్రీన్కార్డు మంజూరులో పెద్ద దేశం, చిన్నదేశం అన్న తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో 20వ శతాబ్దం మధ్యలో దేశాలకు పరిమితి విధించారు. ప్రతీ ఏడాది జారీ చేసే గ్రీన్కార్డుల్లో ఏ ఒక్క దేశానికీ ఏడు శాతానికి మించి జారీచేయకూడదని పరిమితి విధించారు. ఇప్పుడవే భారతీయ టెక్కీలకు శాపంగా మారాయి. అగ్రరాజ్యంలో పర్మనెంట్ రెసిడెంట్ హోదా పొందాలంటే జీవిత కాలం వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చాక దేశాల పరిమితిని ఎత్తేయడం కోసం రెండు బిల్లుల్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టడంతో భారతీయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆ రెండు బిల్లుల్లో ఏది ఆమోదం పొందినా భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభిస్తుంది. భారత్ నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన టెక్కీలు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నా... గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. చిన్న దేశాల నుంచి తక్కువ సంఖ్యలో వెళ్లేవారికి వెనువెంటనే గ్రీన్ కార్డు రావడం అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. ఏ దేశం నుంచి వచ్చారు అన్నది కాకుండా అమెరికాకు ఎంతవరకు వారి సేవలు ఉపయోగపడతాయి అన్నదే ఆధారంగా గ్రీన్ కార్డులు మంజూరు చేయాలని డెమొక్రాటిక్ ప్రజాప్రతినిధి లోప్గ్రెన్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యం కలిగిన వారే దేశంలో స్థిరపడితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు అండదండగా ఉంటారని, అందుకే కాలం చెల్లిన కంట్రీ క్యాప్ను తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అదే జరిగితే భారత్, చైనా దేశాలకే అత్యధికంగా గ్రీన్ కార్డులు మంజూరు అవుతాయి. ప్రతినిధుల సభలో బిల్లులు ► ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) చట్టం–2021ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో 7 శాతంగా ఉన్న కంట్రీ క్యాప్ను ఎత్తేయడం, కుటుంబ వీసాల పరిమితిని ఏడు నుంచి 15 శాతానికి పెంచడం ఉన్నాయి. దీని ప్రకారం ఉద్యోగంలో అత్యంత ప్రతిభను చూపిస్తూ, అధిక జీతం తీసుకుంటున్న వారికి తొలుత గ్రీన్ కార్డులు మంజూరు చేస్తారు. ఇది ప్రతినిధుల సభ ఆమోదం పొంది, సెనేట్లో పాసైతే... బైడెన్ సంతకంతో చట్టం అవుతుంది. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల సమయంలో అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పిస్తానన్న హామీని నెరవేర్చుకోవడానికి అమెరికా పౌరసత్వ చట్టం 2021ను ఇప్పటికే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఇందు లో కూడా గ్రీన్కార్డులకు సంబంధించి కంట్రీ కోటాను ఎత్తేయాలని ఉంది. ఈ బిల్లు ప్రకారం ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ముందు గ్రీన్ కార్డు మంజూరు చేయాలి. గ్రీన్కార్డు మంజూరైన తర్వాత అయిదేళ్లకి అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చునన్న ప్రస్తుత నిబంధనల్ని మూడేళ్లకి తగ్గించారు. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్), 2020 గణాంకాల ప్రకారం పెండింగ్లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తులు – 12 లక్షలు పైగా పెండింగ్లో ఉన్న భారతీయుల దరఖాస్తులు – 8 లక్షలు (66%) ప్రతీ ఏడాది జారీ చేసే గ్రీన్ కార్డులు – 3,66,000 (ఇందులో రెండు కేటగిరీలు ఉంటాయి) కుటుంబాలకు ఇచ్చే గ్రీన్ కార్డులు – 2,26,000 ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు – 1,40,000 ఈ గ్రీన్కార్డుల్లో భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే ఈబీ–2, ఈబీ–3 కేటగిరీ కింద ఏడాదికి 40,040 గ్రీన్ కార్డుల జారీ కంట్రీ కోటా కారణంగా నష్టపోతున్న దేశాలు: భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ – నేషనల్ డెస్క్, సాక్షి -
మార్చి నుంచి హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్లు
వాషింగ్టన్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1–2022 సెప్టెంబర్ 30) హెచ్–1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 1న ప్రారంభం కానుందని అమెరికా సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు అందజేస్తామని వెల్లడించింది. కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. హెచ్–1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. -
లాటరీ విధానంలోనే హెచ్1బీ వీసా
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి భారతీయులు సహా విదేశీయులకు వీలు కల్పించే హెచ్–1బీ వీసాల మంజూరు ప్రక్రియలో ట్రంప్ హయాంలో తీసుకువచ్చిన మార్పుల్ని బైడెన్ సర్కార్ వాయిదా వేసింది. ఈ ఏడాది కూడా సంప్రదాయ లాటరీ విధానం ద్వారా వీసాలు జారీ చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 31వరకు లాటరీ విధానమే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త వీసా విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు చేర్పుల కోసం అధికారులకు మరింత సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. హెచ్–1బీ వీసా కింద అమెరికాలో పలు టెక్ కంపెనీలు భారత్, చైనా ఇతర దేశాల నుంచి వేలాది మందిని ఉద్యోగాల్లో తీసుకుంటూ ఉంటారు. ట్రంప్ అధికారంలో ఉండగా ఈ వీసాల జారీ ప్రక్రియలో çకంప్యూటరైజ్డ్ లాటరీకి స్వస్తి పలికి ప్రతిభ ఆధారిత విధానం తీసుకువచ్చారు. ఈ కొత్త విధానం మార్చి 9 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీని అమలుకు అవసరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులకు మరింత సమయాన్ని ఇస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ కొత్త విధానం అమలును మార్చి 9 నుంచి డిసెంబర్ 31కి వాయిదా వేసినట్టుగా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వివరించింది. ప్రతిభ ఆధారిత వీసాలు..! వలసేతర వీసా అయిన హెచ్–1బీ కింద అమెరికా ఏటా 65 వేల వీసాలను మంజూరు చేస్తుంది. వర్సిటీల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో ఉన్నత స్థాయి విద్యనభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. ఈ వీసాలున్న విదేశీయులకు తక్కువవేతనం చెల్లిస్తూ పలు కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటూ ఉండడంతో అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న భావన నెలకొంది. -
భారతీయ మహిళలకే అధిక ప్రయోజనం!
వాషింగ్టన్: అమెరికాలో హెచ్4 వీసాలు ఉన్నవారికి పని అనుమతిని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఉపసంహరించారు. ఈ నిర్ణయంలో భారతీయ మహిళలే అధికంగా ప్రయోజనం పొందుతారన్న అంచనాలు వెలువడుతున్నాయి. హెచ్–1బీ వీసా కలిగి ఉన్నవారి జీవిత భాగస్వాములకు(భార్య లేదా భర్త), వారి పిల్లలకు (21 ఏళ్లలోపు వయసు) హెచ్4 వీసాలను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జారీ చేస్తోంది. అమెరికాలో హెచ్–1బీ వీసా కింద పనిచేస్తున్నవారిలో అత్యధిక శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే. ఈ వీసాలతో అమెరికా కంపెనీలు విదేశీ సాంకేతిక నిపుణులను స్వదేశంలోనే నియమించుకోవచ్చు. ఇండియా, చైనా నుంచి ప్రతిఏటా వేలాది మంది హెచ్–1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు. బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో హెచ్–1బీ వీసాలున్నవారి జీవిత భాగస్వాములు అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగ అనుమతి కార్డులు దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతీయ మహిళలే కావడం విశేషం. డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక వలసలపై కఠినంగా వ్యవహరించారు. హెచ్4 వీసాదారులకు ఉద్యోగ అనుమతిని రద్దు చేస్తున్నట్లు 2017లో ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాలను తిరగదోడుతామని ఎన్నికల ప్రచారంలో జో బైడెన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే.. గడువు ముగిసిన హెచ్4 వీసాదారుల ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) చెల్లుబాటును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
హెచ్ 1బీ వీసా లాటరీ విధానానికి చెల్లు చీటీ
వాషింగ్టన్: హెచ్1 బీ వీసా ఎంపికకు ఇప్పటివరకు వాడుతున్న లాటరీ విధానాన్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అధిక వేతనాలు, అత్యున్నత నైపుణ్యాల ఆధారంగా ఇక హెచ్ 1 బీ వీసాలను జారీ చేయనున్నట్లు మంగళవారం అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ (డీఓఎల్) ప్రకటించింది. తాజా మార్పులతో హెచ్ 1 బీ వీసాతో, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్తో యూఎస్లో ఉద్యోగాలు చేస్తున్నవారి వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. విదేశాల నుంచి చవకగా లభించే ఉద్యోగుల వల్ల అమెరికన్ ఉద్యోగులు ఎదుర్కొనే ముప్పును తొలగించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. తాజా నిబంధనలు ఈ సంవత్సరం మార్చి 9 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయం ప్రధానంగా భారతీయ టెక్కీలపై, అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. తాజా నిబంధనల ప్రకారం.. సంబంధిత రంగంలో ఉద్యోగికి లభిస్తున్న సగటు వేతనం కన్నా ఎక్కువ వేతనం అందించేందుకు సిద్ధమైన కంపెనీల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా ఏటా జారీ చేసే 85 వేల హెచ్1బీ వీసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఆక్యుపేషనల్ ఎంప్లాయిమెంట్ స్టాటిస్టిక్స్ (ఓఈఎస్) డేటా ఆధారంగా వివిధ ఉద్యోగ విభాగాల్లో వేతనాలను, నాలుగు స్థాయిలుగా (4 లెవెల్స్) విభజించి, డీఓఎల్ నియంత్రిస్తుంది. తాజా మార్పుల ప్రకారం.. ఈ స్థాయుల్లో కనీస వేతన స్థాయి భారీగా పెరగనుంది. అలాగే, భారత్ సహా విదేశీ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్1బీ వీసా పొందేందుకు భారీగా వేతనాలను ఇవ్వాల్సి ఉంటుంది. రెండేళ్ల అనుభవం ఉన్నవారిపైనా ప్రభావం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థులపై, అలాగే, కాలేజీ అనంతరం ఒకటి, రెండేళ్ల అనుభవం ఉన్నవారిపై కూడా ఈ మార్పులు భారీగా ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. వేతనాల ఆధారంగా హెచ్1బీ వీసాలను జారీ చేసే విధానంలో.. అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, సీనియర్లకు ప్రాధాన్యత లభించడం వల్ల విద్యార్థులు, తక్కువ అనుభవం ఉన్నవారు ఆ మేరకు నష్టపోనున్నారు. విదేశీ విద్యార్థులు ప్రధానంగా లెవెల్ 1 పరిధిలోకి వస్తారు. అయితే, తాజా నిబంధనలు విద్యార్థులపై ప్రభావం చూపబోవని యూఎస్సీఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) పేర్కొంది. వారి ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) సమయాన్ని అధిక వేతనం పొందగల స్థాయికి వెళ్లేలా అనుభవం పొందేందుకు వినియోగించుకునే అవకాశముందని వివరించింది. అయితే, కేవలం ‘స్టెమ్’ విద్యార్థులకు మాత్రమే మూడేళ్ల ఓపీటీ ఉంటుంది. మిగతా విభాగాల విదేశీ విద్యార్థులు కేవలం ఒక సంవత్సరం ఓపీటీకే అర్హులు. మరోవైపు, మాస్టర్స్ డిగ్రీ ఉన్న, ఓపీటీ ద్వారా కొంత అనుభవం పొందిన విద్యార్థులు లెవెల్ 2 ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. కానీ, ఈ లెవెల్ హెచ్1బీ వీసా దరఖాస్తుల్లో పోటీ అత్యంత తీవ్రంగా ఉండటంతో వారికి వీసా లభించడం దాదాపు అసాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 50% పైగా దరఖాస్తులు ఈ లెవెల్ నుంచే వస్తాయన్నారు. ఈ ప్రతిపాదనలపై గతంలో జరిపిన అభిప్రాయ సేకరణలో పలు విశ్వవిద్యాలయాలు ఈ మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగం లభించే విషయంలో నెలకొనే అనిశ్చితి వల్ల విదేశీ విద్యార్థులు అమెరికాను ఉన్నత విద్యకు ఎంపిక చేసుకోకపోవచ్చని పేర్కొన్నాయి. -
గ్రీన్కార్డ్ వెయిటింగ్ లిస్ట్లో 8 లక్షల మంది!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా యూఎస్ సిటిజన్షిప్ కోసం వేచిచూస్తున్న వారి జాబితా 2020లో 1.2 మిలియన్లకు చేరింది. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది యూఎస్ చరిత్రలో అత్యధికమని క్యాటో ఇన్స్టిట్యూట్ పేర్కొంది. యూఎస్ సిటిజన్షిప్ను కల్పించే గ్రీన్కార్డు పొందేందుకు వేచిచూస్తున్న జాబితాలో భారతీయుల సంఖ్య 8 లక్షలకు చేరినట్లు యూఎస్సీఐఎస్ పేర్కొంది. గ్రీన్కార్డు దరఖాస్తుదారుల్లో భారతీయుల వాటా 68 శాతానికి సమానమని తెలియజేసింది. కాగా.. వెయిటింగ్ లిస్ట్ అధికంగా ఉండటం, జారీకి పట్టే కాలాన్ని పరిగణిస్తే.. సుమారు 2 లక్షల మందికి తమ జీవితకాలంలో గ్రీన్కార్డ్ అందే అవకాశాలు లేనట్లేనని క్యాటోకు చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ లిబర్టీ అండ్ ప్రాస్పెసరిటీ అభిప్రాయపడింది. చైనీస్కు రెండో ర్యాంకు యూఎస్ గ్రీన్కార్డులు పొందేందుకు వేచిచూస్తున్న జాబితాలో భారతీయుల తదుపరి చైనీయులు అధికంగా ఉన్నట్లు యూఎస్సీఐఎస్ తాజాగా వెల్లడించింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలవారు 18 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు వివరించింది. శాశ్వత ఉపాధి కార్యక్రమంలో భాగంగా యూఎస్ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ గ్రీన్కార్డులను జారీ చేస్తోంది. తద్వారా అత్యంత నైపుణ్యమున్న వారికి దేశంలో నివసించేందుకు వీలు కల్పిస్తోంది. వార్షికంగా 1.4 లక్షల మందికి మించి ఎంప్లాయ్మెంట్ గ్రీన్కార్డుల జారీకి అవకాశంలేదని ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికైన జో బైడెన్ ఈ అంశంలో సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ ప్రాసెస్ పూర్తికావడానికి చాలా కాలంపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. -
‘హెచ్1బీ’పై మరిన్ని ఆంక్షలు
వాషింగ్టన్: అమెరికా హెచ్ 1బీ వీసా విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతో తాజాగా మరికొన్ని ఆంక్షలను చేర్చింది. తాజా నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు కోరుకుంటున్న వేలాది భారతీయుల ఆకాంక్షలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)మంగళవారం దీనికి సంబంధించిన తాత్కాలిక తుది ఉత్తర్వులను జారీ చేసింది. హెచ్1బీకి వీలు కల్పించే ‘ప్రత్యేక నైపుణ్య వృత్తి(స్పెషాలిటీ ఆక్యుపేషన్)’ నిర్వచనానికి ఇప్పటివరకు ఉన్న విస్తృతార్థాన్ని ఇప్పుడు కట్టుదిట్టం చేసి, సంక్షిప్తం చేశారు. నిబంధనల్లో ఉన్న లొసుగులను తొలగించి అత్యంత అర్హులైన విదేశీయులకు స్థానిక కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించేలా మార్పులు చేశారు. అమెరికన్లను తొలగించి, ఆ ఉద్యోగాలను చవకగా లభించే విదేశీయులకు ఇచ్చే విధానాన్ని అడ్డుకునేలా నిబంధనలు రూపొందించారు. హెచ్1బీ పిటిషన్ ఆమోదం పొందకముందు, పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో, దరఖాస్తు ఆమోదం పొందిన తరువాత కూడా వర్క్సైట్ ఇన్స్పెక్షన్ అధికారాన్ని డీహెచ్ఎస్కు కల్పించారు. ఈ నిబంధనలు రెండు నెలల్లో అమల్లోకి వస్తాయని డీహెచ్ఎస్ పేర్కొంది. అమెరికాలోని కంపెనీలు వృత్తి నిపుణులైన విదేశీయులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించినదే హెచ్1బీ వీసా అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏడాదికి 85వేల వీసాలు జారీచేస్తున్నారు. భారత్, చైనా తదితర దేశాల నుంచి ఈ వీసాలతో వేలాదిగా అమెరికాకు వెళ్తుంటారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత ఐటీ నిపుణులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇప్పటికే హెచ్1బీపై అమెరికాలో ఉన్న చాలామంది భారతీయులు కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్ 19తో ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థ.. హెచ్1బీ ఉద్యోగాల వల్ల మరింత దిగజారకుండా, ముఖ్యంగా అమెరికన్ల ఉద్యోగ భద్రతకు ముప్పు కలగకుండా చూసే లక్ష్యంతో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) పనిచేస్తోందని డీహెచ్ఎస్ పేర్కొంది. తాజా ఆంక్షలను వైట్హౌజ్ సమర్ధించింది. అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూ, అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకే ప్రాధాన్యం కల్పిస్తూ.. అమెరికా వర్క్ వీసా విధానాన్ని అధ్యక్షుడు ట్రంప్ మరింత మెరుగుపరుస్తున్నారని పేర్కొంది. ఇన్నాళ్లూ ఈ విధానం దుర్వినియోగమైందని విమర్శించింది. తక్కువ వేతనాలకు లభించే విదేశీ ఉద్యోగుల కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోకుండా ట్రంప్ చూస్తున్నారని వివరించింది. ‘దేశ ఆర్థిక భద్రత హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో భాగంగా మారిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇప్పుడు ఆర్థిక భద్రతే అంతర్గత భద్రత’ అని డీహెచ్ఎస్ సెక్రటరీ చాడ్ వాల్ఫ్ వ్యాఖ్యానించారు. -
హెచ్1బీ వీసాదారులకు ఊరట
వాషింగ్టన్: అమెరికాలో భారత్ సహా వివిధ దేశాల నుంచి వచ్చిన వలసదారులకు భారీ ఊరట లభించింది. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న హెచ్1బీ వీసాదారులు, గ్రీన్కార్డు దరఖాస్తుదారులు స్పందించడానికి, అవసరమైన పత్రాలను సమర్పించడానికి ట్రంప్ సర్కార్ మరో రెండు నెలలు గడువు పొడిగిస్తూ అనుమతులు మంజూరు చేసింది. హెచ్1బీ, గ్రీన్కార్డులకు సంబంధించి నోటీసులు అందుకున్న వారు స్పందించడానికి గడువును మరో 60 రోజులు పెంచినట్టుగా యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. వీసా పొడిగింపు విజ్ఞప్తులు (ఎన్–14), తిరస్కరణ నోటీసులు, ఉపసంహరణ నోటీసులు, ప్రాంతీయ పెట్టుబడుల ఉపసంహరణ, ముగింపు నోటీసులు, ఫారమ్ ఐ–290బీ సమర్పణలు, దరఖాస్తు నోటీసులు వంటి వాటిపై అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడానికి గడువు పెంచింది. ఇప్పటికే జారీ చేసిన నోటీసులపై ఉన్న గడువు తేదీ తర్వాత మరో రెండు నెలలపాటు వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఫారమ్ ఐ–290బీ నింపి పంపించడానికి ఈ ప్రకటన విడుదలైన నుంచి 60 రోజుల వరకు గడువు ఉంటుంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటుకు వీలు కల్పించే గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు రెండున్నర లక్షల వరకు ఉన్నారు. -
హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట
వాషింగ్టన్: కరోనా సంక్షోభంతో చిక్కుల్లో పడ్డ అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట. అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సంబంధిత పత్రాలను సమర్పించాలంటూ నోటీసుల జారీ చేసిన హెచ్-1బీ వీసాదారులకు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యుఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శుభవార్త అందించింది. అవసరమైన పత్రాలను సమర్పించడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో రెండు నెలలపాటు ఇమ్మిగ్రేషన్ ను ఇటీవల నిలిపివేయడంతో గ్రీన్ కార్డు కార్డు కోసం ఎదురు చూస్తున్నవారికి రెండు నెలల సమయం దొరికింది. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది ఎదురు చూస్తుండగా, వీరిలో హెచ్-1బీ వీసాదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. శుక్రవారం నాటి యుఎస్సీఐఎస్ ఉత్తర్వుల ప్రకారం హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు కొనసాగింపు వీసా(ఎన్-14), తిరస్కరించే నోటీసులు, ఉపసంహరించుకునే నోటీసు, ప్రాంతీయ పెట్టుబడి కేంద్రాలను ముగించే నోటీసులు, ఫారం ఐ-290బీ నోటీస్ ఆఫ్ అప్పీల్ లేదా మోషన్ తదితర అంశాలకు సంబంధించిన వాటిని 60 రోజుల్లోగా సమర్పించాలని సూచించింది. అభ్యర్థనలు, నోటీసుల విషయంలో చర్యలు తీసుకోవడానికి ముందు 60 రోజులలోగా స్పందించాలని తెలిపింది. గడువు ముగిసిన వారిపై ఏదైనా చర్య తీసుకునే ముందు నిర్ణీత తేదీ నుండి 60 క్యాలెండర్ రోజుల వరకు అందుకున్న ఫారం ఐ-290బీ ను పరిశీలిస్తామని యుఎస్సీఐఎస్ తెలిపింది. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు) కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంటామని ఏప్రిల్ 10న ప్రభుత్వం తెలిపింది. పరిస్థితిని అంచనా వేసిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంటామని భారత ప్రభుత్వం సూచించిన కొద్ది రోజుల తరువాత అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసలదారులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
హెచ్-1బీ వీసా : పరిమితి ముగిసింది
వాషింగ్టన్ : వచ్చే ఏడాది 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్1-బీ దరఖాస్తుల పరిమితి ముగిసిందని యూఎస్సీఐఎస్(యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) వెల్లడించింది. ఎవరి దరఖాస్తులను ఆమోదించాలనే విషయంపై లాటరీ ద్వారా నిర్ణయిస్తామని కౌన్సిల్ తెలిపింది. ఎంపికైన వారి వివరాలను ఆయా దరఖాస్తుదారులు, వారి సంస్థలకు మార్చి 31 లోపు సమాచారాన్ని అందిచేస్తామని ప్రకటించింది. అలాగే హెచ్1-బీ క్యాప్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 30వ తేదీని వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి కాంగ్రెస్ నిర్దేశించిన 65 వేల దరఖాస్తుల స్వీకరణ పరిమితి మించిందని తెలిపింది. అయితే ఎంత మంది హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేశారనే విషయాన్ని యూఎస్సీఐఎస్ ప్రకటించలేదు. భారత్, చైనా దేశాల నుంచి వేల మంది ఐటీ నిపుణులు ఎక్కువగా హెచ్1-బీ వీసా ద్వారా అమెరికాకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటం తెలిసిన విషయమే. -
నిబంధనలు సరళిస్తేనే మరిన్ని వీసాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలన్నా, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నా నిబంధనల సరళీకరణ కీలకమని, సులభతర వ్యాపార నిబంధనలుంటేనే స్థానిక ప్రభుత్వానికి ఆదాయంతో పాటు, ఉద్యోగాలూ వస్తాయని సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. భారతీయ టెక్నాలజీ కంపెనీలు యూఎస్లో బిలియన్ల డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సీఈఓల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పాల్గొన్న మోహన్ రెడ్డి.. టెక్నాలజీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ట్రంప్ ముందు ప్రస్తావించారు. ఆ వివరాలు ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘హెచ్1బీ వీసాలకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గతేడాది నవంబర్లో 50:50 కంపెనీ చార్జెస్ నిబంధనలను తెచ్చింది. అంటే.. అమెరికాలోని భారతీయ కంపెనీల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులుంటే.. హెచ్1బీ వీసా కింద 4 వేల డాలర్లు, ఎల్1 కింద 4500 డాలర్ల రుసుము చెల్లించాలి. నిజానికి కొత్త హెచ్1బీ లేదా ఎల్1 వీసాల జారీలో ఈ నిబంధనలు ఓకే. కానీ రెన్యువల్ వీసాలకూ ఈ రుసుములు చెల్లించాలంటున్నారు. ఇది భారతీయ కంపెనీలకు పెనుభారమే. హెచ్1బీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్స్కే ఉద్యోగాలిద్దామంటే.. ఉద్యోగ అనుభవం అడ్డొస్తుంది. కొత్తగా వెళ్లే కంపెనీలు కూడా 50:50 కంపెనీ చార్జీల భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి ఉద్యోగులను తీసుకెళ్లే బదులు స్థానిక అమెరికన్స్కే ఉద్యోగాలిస్తున్నాయి. ఇక హెచ్1బీ వీసా వారి గ్రీన్కార్డ్ కోటా తొలగించటం వంటి లెజిస్లేటివ్ నిబంధనలూ ఇలాంటివే. ఈ విషయాన్ని ట్రంప్తో మేం ప్రస్తావించాం’’ అని మోహన్రెడ్డి వివరించారు. ట్రంప్ ఏం చెప్పారంటే... వచ్చే 3–6 నెలల్లో అమెరికాలోని భారతీయ టెక్నాలజీ కంపెనీలకు సంబంధించి నియంత్రణలను సరళీకరిస్తామని ట్రంప్ హామీ ఇచ్చినట్లు మోహన్రెడ్డి వెల్లడించారు. ‘‘గతంలో ఏ ప్రభుత్వమూ చేయనివిధంగా ట్రంప్ సర్కారు గత మూ డేళ్లలో నియంత్రణల్ని సడలించినట్లు చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ నిబంధనల తొలగింపును ప్రారంభించామని, వాటిని నోటిఫై చేయాల్సి ఉందని చెప్పారాయన’’ అని మోహన్రెడ్డి వివరించారు. -
‘హెచ్–1బీ’కి ఇక ఇ–రిజిస్ట్రేషన్
వాషింగ్టన్: భారత్ టెక్కీల డాలర్ కలలను నెరవేర్చే, అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేయడానికి వీలు కల్పించే హెచ్–1బీ వీసా దరఖాస్తు విధానాన్ని మార్చినట్లు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. 2021ఏడాది హెచ్1బీ దరఖాస్తులను ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కంపెనీలు తాము తీసుకోబోయే ఉద్యోగుల వివరాలను సమగ్రంగా అందజేయాలని కోరింది. రిజిస్ట్రేషన్ కోసం 10 డాలర్లను ఫీజుగా చెల్లించాలి. ఏటా 85 వేల హెచ్–1బీ వీసాలను ఈ వీసా దరఖాస్తులు పూర్తయ్యాక లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన 85 వేల వీసాలు మంజూరు చేస్తారు. ‘ఎలక్ట్రానిక్ ప్రక్రియ వల్ల పేపర్ వర్క్ తగ్గుతుంది. ఐటీ కంపెనీల, ఉద్యోగుల సమాచారం ఇవ్వడం సులభతరం అవుతుంది’అని ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. 2020–21 సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్, ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. -
భారత ఐటీ నిపుణులకు గుడ్న్యూస్
వాషింగ్టన్ : హెచ్1బీ వీసాలకోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్. హెచ్-1 బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తులను 2020 ఏప్రిల్ 1నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా జాతీయ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను హెచ్1 బీ (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసాలు జారీకి అవసరమైన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్)శుక్రవారం వెల్లడించింది. భారతదేశం, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం వేల మంది ఐటీ ఉద్యోగులకు హెచ్1 బీ వీసాలకోసం ఆయా కంపెనీలు దరఖాస్తు చేసుకుంటాయి. ఇందుకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోనున్నాయి. హెచ్1బీ కోసం దరఖాస్తు చేసుకునే ఐటీ కంపెనీలు ఆన్లైన్లో నమోదు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు కింద 10 అమెరికన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ 1, 2020 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ కొత్త ప్రక్రియ ద్వారా పరిమితికి లోబడి హెచ్1బీ వీసాలను దక్కించుకోవచ్చు. కేవలం తమ కంపెనీకి సంబంధించిన ప్రాథమిక సమాచారంతోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 1 నుండి 20 వ తేదీ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లకు అనుమతి వుంటుందని యుఎస్సిఐఎస్ తెలిపింది. -
అలా అయితే గ్రీన్కార్డ్ రాదు!
వాషింగ్టన్: అమెరికా గ్రీన్కార్డ్ పొందేందుకు ఎదురుచూస్తున్న ఆశావహులకు ఆ దేశ ప్రభుత్వం చేదువార్త చెప్పింది. ఫుడ్ స్టాంప్స్(అల్పాదాయ వ్యక్తులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చవకగా ఇచ్చే వోచర్లు), వైద్య సాయం(మెడిక్ఎయిడ్), గృహ సదుపాయం(హౌజింగ్ అసిస్టెన్స్) తదితర సౌకర్యాలు కోరుకుంటున్న వారికి గ్రీన్ కార్డ్ నిరాకరించే అవకాశముందని స్పష్టం చేసింది. గ్రీన్కార్డ్ పొందినవారికి అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశంతో పాటు పలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. అమెరికా తమ పౌరులకు ఇచ్చే ఇలాంటి ప్రభుత్వ సౌకర్యాలను తాము భవిష్యత్తులో కూడా ఆశించబోమని కాన్సులార్ ఆఫీసర్ను నమ్మించాల్సి ఉంటుందని పేర్కొంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా నిబంధనలను జారీ చేసింది. అమెరికాకు రావాలనుకునే లేదా అమెరికాలో ఉండాలనుకునే విదేశీయులు తమ ఖర్చులను తామే భరించేలా, అమెరికా ప్రభుత్వం అందించే సౌకర్యాలపై ఆధారపడకుండా ఉండేలా ఈ తాజా నిబంధనలు తోడ్పడుతాయని వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక స్థాయిని మించి ప్రభుత్వ సౌకర్యాలు పొందే వ్యక్తులను ‘పబ్లిక్ చార్జ్(ప్రజలపై భారం)’గా పరిగణిస్తారు. అలా పబ్లిక్ చార్జ్గా మారే అవకాశమున్న వారిని దేశంలోకి అడుగుపెట్టకుండానే నిరోధిస్తారు. ఇప్పటికే దేశంలో ఉంటున్నవారైతే.. వారి ఇమిగ్రేషన్ స్థాయిని మార్చుకునే అవకాశం ఇవ్వరు. విదేశీయులపై ప్రజాధనం ఖర్చుకాకూడదనే ఈ నిబంధనలను అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చారని వైట్హౌజ్ పేర్కొంది. ‘ఈ చట్టం 1996 నుంచే ఉంది కానీ కఠినంగా అమలు చేయలేదు’ అని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌర, వలస సేవల సంస్థ(యూఎస్సీఐఎస్) డైరెక్టర్ కెన్ స్పష్టం చేశారు. ఈ నిబంధనల వల్ల గ్రీన్కార్డ్ ఆశావహులు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వ్యాఖ్యానించింది. -
10% తగ్గిన హెచ్1బీ వీసాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన వలస విధానం దెబ్బ హెచ్–1బీ వీసాల జారీపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. అత్యంత నైపుణ్యం కలిగిన భారత్, ఇతర విదేశీ ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగానికి వీలు కల్పించే ఈ వీసాల జారీ బాగా తగ్గిపోయింది. అంతకుమందు ఏడాదితో పోలిస్తే 2018 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం మేర తగ్గింది. అమెరికా పౌరసత్వ, వలస సర్వీసుల సంస్థ (యూఎస్సీఐఎస్) 2018లో కొత్త వీసాలు, రెన్యువల్స్ కలిపి మొత్తం 3,35,000 హెచ్1బీలపై ఆమోద ముద్ర వేసింది. 2017లో 3,73,400 వీసాలిచ్చారు. 2017లో ప్రతి 100 దరఖాస్తులకు 93 వీసాలు మంజూరైతే, 2018లో ప్రతి 100 దరఖాస్తులకు 85 వీసాలు మంజూరయ్యాయి. అమెరికాలో విదేశీ వర్కర్లు పని చెయ్యాలంటే హెచ్1బీ వీసా తప్పనిసరి. హెచ్1 బీ వీసా నిబం«ధనల్ని అతిక్రమించే సంస్థల చుట్టూ ట్రంప్ ఉచ్చు బిగించారు. అమెరికా పౌరులకు ఉద్యోగాలు నిరాకరించే ఐటీ కంపెనీలపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. అమెరికా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు చెల్లించేలా, వారికి ఆర్థిక భరోసా కల్పించేలా నిబంధనల్ని మార్చేశారు. దీంతో వీసాల సంఖ్య తగ్గిపోయింది. -
హెచ్-1బీ వీసా తిరస్కరణ : అమెరికాపై దావా
శాన్ఫ్రాన్సిస్కో : సిలికాన్ వ్యాలీ ఆధారిత ఐటీ సంస్థ అమెరికా ప్రభుత్వంపై లా సూట్ ఫైల్ చేసింది. భారతీయ ఐటీ ప్రొఫెషనల్కు హెచ్-బీ వీసా జారీ నిరాకరణపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ దావా దాఖలు చేసింది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన తమ ఉద్యోగికి వీసా నిరాకరణ ఏకపక్షమైనందనీ విచక్షణ పూరితమైందని వ్యాఖ్యానించింది. తమ సంస్థలో బిజినెస్ సిస్టం ఎనలిస్టు ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట అనిశెట్టి( 28) కి హెచ్-1బీ వీసాను యుఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిరాకరించిందని ఎక్స్ టెర్రా సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ ఆరోపించింది. ఫిబ్రవరి 19, 2019 ఇమ్మిగ్రేషన్ విభాగం విచక్షణా రహితంగా, చట్ట విరుద్ధంగా అనిశెట్టి వీసాను తీరస్కరించిదని పేర్కొంటూ దావా వేసింది. అన్ని అర్హతలున్నప్పటికీ ఏకపక్షంగా వ్యవహరించిందని కంపెనీ ఆరోపించింది. అనిశెట్టి బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) డిగ్రీతోపాటు డాలస్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో మాస్ట్ర్స్ డిగ్రీ చేశారని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం అనిశెట్టి (భార్య ద్వారా) హెచ్-4 డిపెండెంట్ వీసాతో ఉన్నారని తెలిపింది. మరోవైపు దీనిపై స్పందించేందుకు ఇమ్మిగ్రేషన్ విభాగం తిరస్కరించింది. కాగా మొత్తం 65,000 మందికి హెచ్1 బీ వీసా ఇవ్వాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. వీరితోపాటు లబ్ధిదారుల తరపున వచ్చిన మొదటి 20వేల మంది విదేశీయులకు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఈ లిమిట్నుంచి మినహాయింపునిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హెచ్1బీ దరఖాస్తుల కోటా పూర్తి
కాలిక్సో/వాషింగ్టన్: 2020 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసా దరఖాస్తుల సంఖ్య అమెరికా కాంగ్రెస్ నిర్దేశించిన 65,000 పరిమితికి చేరుకుందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది. ఈ హెచ్1బీ వీసా దరఖాస్తులను 2019 ఏప్రిల్ నుంచి స్వీకరిస్తున్నామని వెల్లడించింది. అయితే తొలి ఐదురోజుల్లో ఎన్ని హెచ్1బీ దరఖాస్తులు అందాయన్న యూఎస్సీఐఎస్ స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయమై యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎల్. ఫ్రాన్సిస్ సిస్నా మాట్లాడుతూ..‘2019 అక్టోబర్ 1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి అమెరికా కాంగ్రెస్ నిర్దేశించిన పరిమితి మేరకు హెచ్1బీ దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదివి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసిన 20,000 మంది విదేశీయులను ఈ జాబితా నుంచి మినహాయిస్తాం. అలాగే మాస్టర్స్ విభాగానికి సంబంధించి హెచ్1బీ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది’ అని తెలిపారు. అమెరికాలో ఏటా గరిష్టంగా 65,000 మంది విదేశీ నిపుణులకే హెచ్1బీ వీసాలు జారీచేయాలని ఆ దేశ కాంగ్రెస్(పార్లమెంటు) గతంలో యూఎస్సీఐఎస్ను ఆదేశించింది. హెచ్1బీ వీసా జారీ నియమనిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం వల్ల అమెరికాలో మాస్టర్స్ చేసిన 5,340 మంది విదేశీయులకు ఏటా అదనంగా లబ్ధి చేకూరుతుందని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎల్.ఫ్రాన్సిస్ సిస్నా తెలిపారు. అమెరికా–మెక్సికో సరిహద్దులోని డెల్రియో సెక్టార్లో 3.21 కిలోమీటర్ల పొడవు, 30 అడుగుల ఎత్తుతో నిర్మించిన గోడను పరిశీలించాక ట్రంప్ మాట్లాడారు. ‘మాదేశం ఇప్పటికే వలసదారులతో నిండిపోయింది. కాబట్టి సరిహద్దులో ఉన్నవారంతా వెనక్కి వెళ్లిపోండి’ అని అక్రమ వలసదారులు, శరణార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత 2–3 సంవత్సరాలుగా అమెరికాలోకి అక్రమంగా వస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందన్నారు. తాజాగా సరిహద్దు గోడ కారణంగా ఈ వలసలు 56 శాతం తగ్గిపోయాయని గస్తీ అధికారి చావెజ్ పేర్కొన్నారు. -
మోసపోయాం : అమెరికాలో తెలుగు విద్యార్థుల గగ్గోలు
సాక్షి, టెక్సాస్ : ఆ యూనివర్సిటీ వెబ్ సైట్ చూస్తే ఎంతో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నట్టు కనిపిస్తుంది. అందులోనూ స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) కరికులమ్ తో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను అందిస్తామని సైట్ లో పేర్కొన్నారు. పైగా అందులోని ఫోటోలను గమనిస్తే పెద్ద పెద్ద భవనాలతో క్యాంపస్, అత్యాధునిక లైబ్రరీ, విద్యార్థులతో ఫ్యాకల్టీ మధ్య చర్చలు సాగిస్తున్నట్టు... ఎన్నో దృశ్యాలు... అదే ఫార్మింగ్టన్ యూనివర్సిటీ. అలాంటివి చూసే మోసపోయామని మొత్తుకుంటున్నారు. అడ్మిషన్ పొందిన మన తెలుగు విద్యార్థులు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఐసీఈ) కు చెందిన అండర్ కవర్ ఏజెంట్లు సృష్టించిన ఈ ఫేక్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుని వారి ట్రాప్ లో చిక్కుకున్న విద్యార్థులు ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఒక్కొక్కరిది ఒక్కో గాధ. తక్షణ కర్తవ్యమేంటో అంతుపట్టక కొట్టుమిట్టాడుతున్నారు. యూనివర్సిటీ గురించి తెలియక ఎంతో డబ్బు ఖర్చుపెట్టి యూనివర్సిటీ ఫీజులు చెల్లించి చేరిన పలువురు విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా మారినట్టు సమాచారం. ఆటా, నాటా తదితర సంస్థలు వెబినార్ కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేస్తోంది. అక్కడి అటార్నీలతో మాట్లాడిస్తూ వారి సందేహాలను నివృతి చేయించే కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి ఆ సంఘాలు. ఆటా తాజాగా రెండో రోజు నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ఐసీఈ ట్రాప్ లో చిక్కుకున్న పలువురు విద్యార్థులతో పాటు అనేక మంది ఇతర విద్యార్థులు కూడా పాల్గొని అనేక సందేహాలను వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఐసీఈ డిటెన్షన్ నుంచి బయటకు వచ్చిన వారు సైతం అనేక సందేహాలను వ్యక్తం చేశారు. అటార్నీలు వారందరికీ సలహాలు సూచనలు ఇచ్చారు. యూనివర్సిటీ బోగస్ అని, అక్కడ క్లాసులు జరగవని, కేవలం సీపీటీ కోసం చేరిన విద్యార్థులు మాత్రం దేశం విడిచి వెళ్లకతప్పదని తెలుస్తోంది. ఈ ఫేక్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులందరికీ ప్రస్తుతం ఐసీఈ నోటీసులను అందజేస్తోంది. ఐసీఈ డిటెన్షన్ నుంచి కొందరు ఒక రోజులోనే బయటకురాగా అమెరికాలో కొనసాగిన షెట్ డౌన్ కారణంగా కొన్ని సాంకేతిక సమస్యలతో మరికొద్ది రోజుల పాటు డిటెన్షన్ లో కొనసాగకతప్పదని అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుత సమస్యల నుంచి బయటపడటం ఎలా? ఉన్న మార్గాలేంటి? ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా? ఉంటే ఎలా ముందుకు వెళ్లాలి? వంటి అనేక సందేహాలను విద్యార్థులు అటార్నీలను అడిగి తెలుసుకున్నారని సంఘాల ప్రతినిధులు చెప్పారు. తక్షణం దేశం విడిచి వెళతానని చెప్పేవారు విధిగా బాండ్ తో పాటు కాన్సులేట్ లో సంప్రదించాలి. అలాగే రుజువుగా ఫ్లయిట్ టికెట్ కూడా చూపించాల్సి ఉంటుంది. అమెరికాలో అక్రమంగా గత ఆరు మాసాలుగా ఉన్నట్టు తేలితే అలాంటి వారికి కనీసం 5 సంవత్సరాలపాటు మళ్లీ దేశంలో అడుగుపెట్టకుండా బ్యాన్ విధించే అవకాశాలున్నాయి. అలాగే ఏడాదికిపైగా అక్రమంగా ఉన్నట్టు రుజువైతే కనీసం పదేళ్ల పాటు బ్యాన్ విధించే అవకాశాలున్నాయి. కొందరు విద్యార్థులు మూడవసారి సెవిస్ లో ప్రవేశించిన తర్వాత ఈ వర్సిటీలో అడ్మిషన్ పొందినట్టు తెలుస్తోంది. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో తరగతులు జరగవన్న సంగతి తెలియదని, ఆ తర్వాత కాలంలో క్లాసులు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించినా ఎవరి నుంచి సమాధానం రాలేదని ఒక విద్యార్థి తెలుపగా, అలాంటి సందర్భాల్లో యూనివర్సిటీ అధికారులతో కరస్పాండెన్స్ జరిపినట్టు రుజువులు ఉన్నట్టయితే వాటి ఆధారంగా కోర్టులో సవాలు చేయొచ్చని తెలిపారు. ఫోన్ కన్వర్సేషన్స్, ఈ మెయిల్ కరస్పాండెన్స్, లెటర్స్ రాయడం వంటి ఎలాంటి ఆధారాలున్నా ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించి రిలీఫ్ పొందడానికి ఆస్కారం ఉంది. అడ్మిషన్ పొందినప్పుడు క్లాసులు నిర్వహించరన్న విషయం తెలియకపోయినా, ఆ తర్వాత కాలంలో మీ తరఫున జరిగిన ప్రయత్నాలు, వాటికి ఉన్న ఆధారాలే కీలకమని అటార్నీలు వివరించారు. సీపీటీ కోసం కాకుండా కేవలం ఉన్నత విద్యను అభ్యసించడానికే యూనివర్సిటీలో చేరినట్టు రుజువు చేసుకోగలిగినా, లేదా క్లాసులు జరగడం లేదన్న కారణంగా మధ్యలో యూనివర్సిటీని వదలివెళ్లినా అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రస్తుత చర్యను చట్టపరంగా కోర్టులో సవాలు చేసుకోవడానికి ఆస్కారం ఉందని తెలిపారు. 2016 లో యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ (యూఎన్ఎన్జే) పేరుతో ఇలాంటి స్టింగ్ ఆఫరేషన్ నిర్వహించినప్పుడు కూడా అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు అమెరికా వదిలి సొంత రాష్ట్రాలకు వచ్చేశారు. మా యూనివర్సిటీలో చేరమంటూ ఒత్తిడి ఫార్మింగ్టన్ యూనివర్సిటీ వ్యవహారంలో ఇరుక్కుని విద్యార్థులు ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతుండగా, ఆటా నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో పాల్గొన్న ఒక విద్యార్థి ద్వారా మరో యూనివర్సిటీ వ్యవహారం బయటపడింది. క్లాసులు ఉండవు... కాలేజీ ఉండదు... సీపీటీ ఇస్తాం చేరండి అంటూ మిడ్ ఫ్లొరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఒక విద్యార్థి అటార్నీల దృష్టి తెచ్చారు. తొలుత ఆ ఇన్ స్టిట్యూట్ లో చేరడానికి వెళ్లానని అయితే అక్కడి పరిస్థితులు గమనించిన తర్వాత వెనక్కి వచ్చానని చెబుతూ, ఆ రోజు నుంచి కాలేజీలో చేరాలంటూ తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే ఆ కాలేజీలో 50 మంది విద్యార్థులు చేరినట్టు చెబుతున్నారు. కాలేజీ ప్రతినిధులు ఎంత ఒత్తిడి తెచ్చినా తాను చేరలేదని, అయితే, ఇప్పుడు కొందరు తెలుగు విద్యార్థులే ఫోన్లు చేసి కాలేజీలో చేరొచ్చనీ, క్లాసులు లేకుండా హాయిగా సీపీటీ ఇస్తున్నప్పుడు ఎందుకు చేరడం లేదంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దాంతో అటార్నీలు ఆవిద్యార్థిని హెచ్చరిస్తూ, కాలేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా సీపీటీ కోసం తొందరపడి యూనివర్సిటీలను మార్చడం మంచిది కాదని సలహా ఇచ్చారు. -
అమెరికా డిగ్రీలకు ‘హెచ్1బీ’లో ప్రాధాన్యత
వాషింగ్టన్: నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు అమెరికా జారీచేస్తున్న హెచ్1బీ వీసా నిబంధనల్లో ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అమెరికాలో మాస్టర్ డిగ్రీలు చదివిన విదేశీ విద్యార్థులకే ఇకపై హెచ్1బీ వీసాల జారీలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. భారత్, చైనా వంటి దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాలనుకునే ఐటీ నిపుణులపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది. యూఎస్సీఐఎస్ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు ఏటా 65 వేల హెచ్1బీ దరఖాస్తులను జారీచేస్తున్నారు. అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించే విదేశీయుల కోసం మరో 20 వేల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అయితే, హెచ్1బీ వీసా ప్రక్రియలో మార్పులతో 65 వేల వీసాల్లో కూడా అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన విదేశీ విద్యార్థులకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ కొత్త నిర్ణయం 2019, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, అప్పటి నుంచే దరఖాస్తులను స్వీకరిస్తామని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా తెలిపారు. దీనివల్ల ఏటా అమెరికాలో మాస్టర్స్ చేసిన 5,340 మంది విదేశీయులు అదనంగా లబ్ధి పొందుతారని వ్యాఖ్యానించారు. -
అమెరికాలో పట్టుబడ్డ 200 మంది తెలుగువారు!
వాషింగ్టన్: అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వలసదారుల గుట్టును రాబట్టేందుకు మిచిగన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీని సృష్టించి.. సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో పట్టుబడ్డవారిలో దాదాపు 200 మంది తెలుగు వారు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి విదేశీ విద్యార్థులను తీసుకువచ్చారనే అభియోగాలతో ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం డెట్రాయిట్ పోలీస్స్టేషన్లో ఉన్న వీరిలో భరత్ కాకిరెడ్డి (29) (ఫ్లోరిడా), అశ్వంత్ నూనె (26) (అట్లాంటా), సురేష్రెడ్డి కందాల (31) (వర్జినియా), ఫణిదీప్ కర్నాటి (35) (కెంటకీ), ప్రేమ్కుమార్ రామ్పీసా (26) (నార్త్ కరోలినా), సంతోష్రెడ్డి సామ, (28) (కాలిఫోర్నియా), అవినాష్ తక్కళ్లపల్లి (28) (పెన్సిల్వేనియా), నవీన్ పత్తిపాటి (29) (డల్లాస్) తదితరులు ఉన్నారు. మరో 14మంది తెలుగు విద్యార్థులను కూడా అరెస్టు చేశారని, వీరిలో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తోంది. (పలువురు భారతీయ విద్యార్థుల అరెస్ట్) అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకే 2015లో డీహెచ్ఎస్.. మిచిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్లో యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ పేరిట ఒక ఫేక్ వర్సిటీని ఏర్పాటు చేసింది. ఈ వర్సిటీలో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అధికారులు మారుపేర్లతో అధికారులుగా రంగంలోకి దిగి.. అక్రమ వలసదారులకు అడ్మిషన్ పేరిట గాలం వేశారు. ఉన్నత విద్య పేరిట నకిలీ పత్రాలతో అమెరికాలోకి ప్రవేశించి.. అక్రమంగా నివసిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని వారు ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్లో విద్యార్థుల పేరిట నమోదైన అక్రమ వలసదారుల గుట్టు బట్టబయలైంది. అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి హెచ్ 1బీ వీసా కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు కూడా ఉండడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్ అధికారుల విచారణలో.. నకిలీ మాస్టర్స్ డిగ్రీలతో కొందరు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్టు వెల్లడైంది. -
అమెరికాలో భారతీయ విద్యార్థుల అరెస్ట్
వాషింగ్టన్: అమెరికా మిచిగాన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీ బండారం బట్టబయలైంది. అందులో అడ్మిషన్ పొందిన పలువురు భారతీయ విద్యార్థులను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అరెస్టు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే, మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ లో కొనసాగుతున్న యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్లో అడ్మిషన్ తీసుకుని తద్వారా పొందిన ధ్రువపత్రాలు బోగస్ గా గుర్తించిన కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్ మెంట్ బుధవారం పలువురు విద్యార్థులను అరెస్టు చేసినట్టు తెలిసింది. ఈరోజు ఉదయం అరెస్టు చేసిన వారిలో నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నట్టు అక్కడి వర్గాలు చెప్పాయి. కేవలం అమెరికాలో కొనసాగేందుకు వీలుగా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతున్నారని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గుర్తించి తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సందర్భంగా మొత్తం యూనివర్సిటీయే ఫేక్ అని బయటపడింది. మిడిల్ ఈస్ట్ కు చెందిన పలువురు వ్యక్తులు ఈ ఫేక్ యూనివర్సిటీని నడిపిస్తున్నారని, తరగతులు నిర్వహించకపోవడం, ఏ డిపార్ట్మెంట్లో కూడా ప్రొఫెసర్లు లేకపోవడం వంటి అనేక విషయాలు తనిఖీల్లో బయటపడినట్టు తెలిసింది. యూనివర్సిటీకి అక్రిడిటేషన్ కూడా లేదని బయటపడినట్టు సమచారం అందింది. యూనివర్సిటీ సెవిస్ ఉల్లంఘన కింద అట్లాంటా జార్జియాలో నలుగురు భారతీయ విద్యార్థులను అరెస్టు చేసినట్టు తెలిసింది. అయితే, మొత్తంగా ఎంతమందిని అరెస్టు చేసింది? ఎలాంటి చర్యలకు ఉపక్రమించారన్న పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
అత్యంత నిపుణులకే హెచ్1బి
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియను మరింత కఠినం చేస్తూ అమెరికాలో ట్రంప్ సర్కారు కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు అవకాశం కల్పించడం, వారికి అత్యధిక వేతనాలు పొందేలా చూడటమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని ప్రభుత్వం తన తాజా నోటీసుల పేర్కొంది. తాజా సవరణల కారణంగా అమెరికాలో ఉన్నత విద్యార్హతలు సాధించిన విదేశీయులు ఎక్కువ మందికి హెచ్1బీ వీసాలొస్తాయని ట్రంప్ సర్కారు చెబుతోంది. హెచ్1బీ వీసాపై విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు తమ దరఖాస్తులను ముందుగానే ఎలక్ట్రానిక్ విధానంలో నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనను ప్రతిపాదించింది. భారతీయ ఐటీ కంపెనీలు, వృత్తి నిపుణులు ఎక్కువగా ఆశించే హెచ్1బీ వీసా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసా కింద సాంకేతిక నైపుణ్యం అవసరమైన ప్రత్యేక ఉద్యోగాలకు విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అక్కడి ప్రభుత్వం అనుమతినిస్తోంది. భారత్, చైనా తదితర దేశాలకు చెందిన నిపుణులను అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాలపైనే ఉద్యోగులుగా నియమిస్తున్నాయి. అయితే, తమ ఉద్యోగులుగా నియమించనున్న విదేశీ నిపుణుల తరఫున కంపెనీలు దరఖాస్తులను యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్)లో ఎలక్ట్రానిక్ విధానంలో నమోదు చేయించుకోవాలనే కొత్త నిబంధన ప్రభుత్వం ప్రతిపాదించింది. నిర్దేశించిన గడువులోపే ఎలక్ట్రానిక్ నమోదు పూర్తవ్వాలని పేర్కొంది. 65వేల హెచ్1బీ వీసాలు ప్రస్తుత విధానం ప్రకారం అమెరికా ఏటా 65,000 సాధారణ హెచ్1బీ వీసాలు, 20,000 అధిక విద్యార్హతల వీసాలు మంజూరు చేస్తోంది. అధిక విద్యార్హతలున్న వారు 20,000 కంటే ఎక్కువుంటే కంప్యూటర్ లాటరీ ద్వారా 20వేల మందినే ఎంపిక చేస్తోంది. మిగిలిన వారిని సాధారణ దరఖాస్తుదారులతో కలిపేసి వారిలోంచి 65,000 మందిని ఎంపిక చేస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం మొదట పరిమితి మేరకు 65,000 మందిని ఎంపిక చేస్తారు. వీరిలో అధిక విద్యార్హతలున్న వారూ కొంత మంది ఎంపికవుతారు. ఎంపికకాని అధిక విద్యార్హతలున్న వారందరినీ ప్రత్యేక కోటాలో చేర్చి వారిలోంచి 20,000 మందిని ఎంపిక చేస్తారు. అంటే, కోటా కింద ఎంపికయ్యే 20వేల మంది కాక, సాధారణ కోటాలో ఎంపికయ్యే వారిలోనూ అధిక విద్యార్హతలున్నవారు ఉండే అవకాశం ఉంది. నిబంధనల మార్పు కారణంగా మొత్తం వీసాలు పొందిన వారిలో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన వారు 16శాతం వరకు (5,340 మంది) పెరుగుతారని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) వివరించింది. తాజా ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా అక్కడి పౌరులను డీహెచ్ఎస్ కోరింది. జనవరి 2లోగా అభిప్రాయాలు సమర్పించాలని సూచించింది. ఎలక్ట్రానిక్ నమోదు ప్రక్రియతో ఉద్యోగుల కోసం సంస్థలు చేసే దరఖాస్తుల ఖర్చు తగ్గుతుందని, ఎంపిక ప్రక్రియ సమర్థవంతంగా పూర్తవుతుందని యుఎస్సీఐఎస్ తెలిపింది. వేల దరఖాస్తులను, ధ్రువీకరణ పత్రాలను ఒక్కొక్కటిగా పరిశీలించే శ్రమ తగ్గుతుందని, తుదిజాబితా కోసం ఎక్కువ కాలం వేచిచూడాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. అమెరికన్ల ప్రయోజనాల కోసం వీసా నిబంధనలను మార్చాలని గత ఏడాది డీహెచ్ఎస్ను ఆదేశించారు. -
‘హెచ్1బీ ప్రీమియం’పై సస్పెన్షన్ పెంపు
వాషింగ్టన్: అమెరికా హెచ్1బీ వీసా ఆశావహులకు మరోసారి షాకిచ్చింది. హెచ్1బీ వీసా దరఖాస్తులను వేగంగా పరిశీలించే ప్రీమియం ప్రాసెసింగ్ విధానంపై ఇప్పటికే ఉన్న తాత్కాలిక సస్పెన్షన్ను మరో 6 నెలల పాటు పొడిగించింది. తాజా నిర్ణయం హెచ్1బీ వీసాలను గణనీయంగా దక్కించుకుంటున్న భారతీయ ఐటీ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ విషయమై యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) స్పందిస్తూ.. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిశీలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా భారీగా వస్తున్న ప్రీమియం దరఖాస్తుల కారణంగా ఇతర హెచ్1బీ వీసాలు పెండింగ్లో ఉండిపోతున్నాయని వెల్లడించింది. సాధారణంగా అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణులకు ఈ హెచ్1బీ వీసాను జారీచేస్తారు. ఈ వీసా దరఖాస్తును పరిశీలించేందుకు 6 నెలల సమయం పడుతుంది. కానీ ప్రీమియం ప్రాసెసింగ్ విధానంలో రూ.86,181(1,225 డాలర్లు) చెల్లిస్తే కేవలం 15 రోజుల్లో అధికారులు వీసా జారీపై తుది నిర్ణయం తీసుకుంటారు. దీంతో పలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ విధానానికి మొగ్గుచూపుతున్నాయి. తాజాగా ప్రీమియం వీసాలపై ఉన్న తాత్కాలిక సస్పెన్షన్ను మరో ఆరు నెలల పాటు పొడిగించడం భారత ఐటీ నిపుణులకు శరాఘాతమేనని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. -
అమెరికన్లకే ఉద్యోగాలు...!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికులకే ఉద్యోగాలన్న విధానం విదేశీ విద్యార్థుల పాలిట పట్ల శాపంగా మారుతోంది. అమెరికా ఫస్ట్ అన్న తన నినాదాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో భాగంగా హెచ్ 1 బీ వీసా నిబంధనల్లో మార్పు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికన్లతోనే అక్కడి ఉద్యోగాల భర్తీకి ఆ దేశ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కారణంగా విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది జూన్ దాకా పరిశీలిస్తే... అమెరికా పౌరసత్వం లేదా ఫెడరల్ ప్రభుత్వం నుంచి ‘వర్క్ ఆథరైజేషన్’ ఉన్న వారినే అక్కడి కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకోవడం 19 శాతం పెరిగింది. వీసా నిబంధనల ప్రభావం కారణంగా అమెరికాలోని బిజినెస్ స్కూళ్లలో చదువుకున్న విదేశీవిద్యార్థుల ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. రెండున్నర కోట్ల ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించిన ‘ద వాషింగ్టన్ పోస్ట్’ ఓ నివేదికలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. 2017లో 55 శాతం అమెరికా కంపెనీలు విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. 2018లో అది 47 శాతానికి పడిపోయింది. హెచ్ 1బీ వీసా దరఖాస్తులపై ట్రంప్ ప్రభుత్వ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడినట్టు ఈ అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతమున్న విధానం మేరకు సాంకేతిక, సైద్ధాంతిక నైపుణ్యమున్న వలసదారులు కాని వారిని (నాన్ ఇమ్మిగ్రెంట్స్) కూడా అమెరికా కంపెనీలు ఉద్యోగాల్లో తీసుకునేందుకు హెచ్ 1బీ కేటగిరి అనుమతిస్తోంది. ఇది మూడేళ్ల వరకు చెల్లుబాటు కావడంతో పాటు మళ్లీ పొడిగించేందుకు అవకాశాలుంటాయి. అయినప్పటికీ ఆయా రంగాల్లో విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నట్టు వెల్లడైంది. అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, వర్క్ పర్మిట్లు పొందుతున్న వారి సంఖ్య మాత్రం దిగజారినట్టు తెలుస్తోంది. 2016 సెప్టెంబర్తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1,14,503 హెచ్ 1బీ వీసాలు అనుమతించగా, 2017లో అది 1,08,101కు పడిపోయింది. వీరిలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారి సంఖ్య 52,002 నుంచి 45,405కు తగ్గిపోయింది. హెచ్ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. 200717 మధ్య కాలంలో ఈ వీసాల కోసం అమెరికా పౌర, వలస సేవా సంస్థ (యూఎస్సీఐఎస్)కు 22 లక్షల మంది ఇండియన్లు దరఖాస్తు చేసుకోగా.. 3,01,000 మందితో చైనీయులు రెండోస్థానంలో నిలిచారు. -
హెచ్1–బీ దరఖాస్తులను తిప్పి పంపాం
వాషింగ్టన్: హెచ్1–బీ హోదా కోసం అందిన దరఖాస్తుల్లో ఎంపిక కాని వాటిని తిరిగి అభ్యర్థులకే పంపించి వేసినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల (యూఎస్సీఐఎస్) విభాగం తెలిపింది. 2019వ సంవత్సరానికి హెచ్1–బీ దరఖాస్తుల స్వీకరణ ప్రకటన వెలువడిన వారం రోజుల్లోనే జనరల్ కేటగిరీలో 94,213 దరఖాస్తులు, అడ్వాన్స్డ్ డిగ్రీ కేటగిరీలో 95,885 దరఖాస్తులు అందినట్లు యూఎస్ఐఎస్ తెలిపింది. హెచ్1–బీ వీసా జనరల్ కేటగిరీకి 65వేలు, అడ్వాన్స్డ్ డిగ్రీ కేటగిరీకి 20వేల పరిమితి ఉండగా ఈ ఏప్రిల్లో నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత లాటరీలో ఎంపిక కాని వాటిని తిప్పి పంపామని తెలిపింది. ప్రస్తుతం 2019 ఆర్థిక సంవత్సరంతో సంబంధం లేని హెచ్1–బీ దరఖాస్తులను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. హెచ్1–బీ వీసా కోసం భారత్, చైనా దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు ఎక్కువమంది దరఖాస్తు చేసుకుంటుంటారు. ఈ వీసా మంజూరైతే మూడేళ్ల పాటు, గరిష్టంగా ఆరేళ్ల వరకు అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునే వీలుంటుంది. కొన్ని షరతులకు లోబడి ఈ కాల పరిమితిని పొడిగించే అవకాశాలూ ఉన్నాయి. హెచ్1–బీ వీసా కోసం 2007–17 మధ్య కాలంలో 22 లక్షల మంది భారతీయ నిపుణులు దరఖాస్తు చేసుకోగా తర్వాతి స్థానంలో 3 లక్షల మందితో చైనీయులు ఉన్నారని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. -
గడువు ముగిస్తే బహిష్కరణ!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా విధానంలో అగ్రరాజ్యం అమెరికా కీలక మార్పులు తీసుకొచ్చింది. హెచ్–1బీ వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరణకు గురైనా, వీసాలో ఉన్న గడువు దాటిపోయి ఎక్కువకాలం అమెరికాలో ఉన్నా ఇకపై అలాంటివారు దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉద్యోగం లేకపోయినప్పటికీ కేసుల విచారణకు హాజరవ్వాల్సి ఉన్నందున వెంటనే అమెరికాను వదిలి వేరే దేశం వెళ్లే అవకాశం ఉండకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం గత నెల 28 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలు హెచ్–1బీ వీసాదారులకు పీడకలలు తెప్పిస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి హెచ్–1బీ వీసా పొడిగింపునకు లేదా స్టేటస్ మార్పు కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైనా లేదా అతను వీసా గడువు తీరిపోయాక అమెరికాలో ఉన్నా అలాంటి వారికి అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ‘నోటీస్ టు అప్పియర్’ (ఎన్టీయే)ను జారీ చేస్తుంది. దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియలో ఇదే తొలి చర్య. గతంలో ఈ ఎన్టీయేను నేరం చేసిన వాళ్లకు మాత్రమే జారీ చేసేవారు. గతానికి, ఇప్పటికి తేడా ఏంటి? గతంలో ఉన్న విధానం ప్రకారం ఉద్యోగి హెచ్–1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసినప్పుడు అది తిరస్కరణకు గురైతే సదరు ఉద్యోగి వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేస్తాడు. ఆ తర్వాత అతని కంపెనీ మళ్లీ కొత్తగా (పొడిగింపు కాదు) అతని పేరిట హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేస్తుంది. వీసా వచ్చాక మళ్లీ అమెరికా వెళ్లొచ్చు. అయితే తాజాగా వచ్చిన నిబంధన ప్రకారం ఉద్యోగి హెచ్–1బీ వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేస్తే అతని ప్రస్తుత వీసా గడువు తీరినప్పటి నుంచి 240 రోజులు అమెరికాలో ఉండి పనిచేసుకోవచ్చు. ఇక్కడో మెలిక ఉంది. వీసా పొడిగింపునకు ఆమోదం లభిస్తే ఏ సమస్యా లేదు. దరఖాస్తు తిరస్కరణకు గురైతే మాత్రం ఉద్యోగులు ఇబ్బందులు తప్పవు. వీసా పొడిగింపు లభించకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురైన నాటి నుంచి అతను అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు పరిగణిస్తారు. వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరించిన వెంటనే యూఎస్సీఐఎస్ సదరు ఉద్యోగికి ఎన్టీయే జారీ చేస్తుంది. అంటే అతను ఇక స్వచ్ఛందంగా అమెరికా వీడి రావడానికి లేదు. వీసా లేకపోవడంతో ఉద్యోగం పోతుంది. ఏ ఉద్యోగం లేకపోయినా, విచారణను ఎదుర్కోవడానికి ఉద్యోగి అమెరికాలోనే ఉండాలి. ఇలా అక్రమంగా ఉన్నందుకు కొన్నాళ్లు అమెరికాకు రాకుండా దేశం నుంచి బహిష్కరిస్తారు. ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం అక్రమంగా అమెరికాలో ఉన్నట్లయితే పదేళ్ల వరకు అమెరికాకు రాకుండా బహిష్కరించే నిబంధన ఉంది. స్వచ్ఛందంగా వచ్చేసే అవకాశం లేదా? ఒకసారి ఉద్యోగికి ఎన్టీయే జారీ అయితే అతను తప్పకుండా కోర్టులో విచారణకు హాజరుకావాల్సిందే. ఒకవేళ విచారణకు గైర్హాజరైతే ఐదేళ్ల వరకు తిరిగి అమెరికాలోకి రాకుండా బహిష్కరిస్తారు. స్వచ్ఛందంగా అమెరికాను వీడి రావాలన్నా అందుకు జడ్జి ఆమోదం అవసరం. అయితే ఇప్పటికే వీసా కేసులు కుప్పలు తెప్పలుగా ఉన్నందుకు సదరు ఉద్యోగి కేసు అప్పటికప్పుడు విచారణకు రాదు. స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లిపోతానని జడ్జిని కోరేందుకు తొలి విచారణ వరకు అమెరికాలో ఉండాల్సిందే. కొత్త నిబంధనతో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు తలనొప్పులు పొంచిఉన్నాయి. చదువు తర్వాత అక్రమంగా ఉద్యోగంలో చేరినా, విద్యార్థుల రికార్డులను అప్డేట్ చేయడంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరించినా తిప్పలు విద్యార్థులకే. వీసాను తిరస్కరించిన నిర్ణయంపై అప్పీల్కు వెళ్లే అవకాశమున్నా, అప్పీల్ పరిష్కారానికి కూడా సుదీర్ఘ సమయం పట్టనుంది. దీంతో అమెరికాలో ఉద్యోగం చేస్తూ హెచ్–1బీ వీసా గడువు చివరి దశలో ఉన్నవారికి తాజా నిబంధన పెద్ద ఎదురుదెబ్బే. మనవాళ్లకే పొడిగింపులు ఎక్కువ సాధారణంగా భారతీయ ఉద్యోగుల్లో కొత్తగా అమెరికా వెళ్లే వారి కన్నా, ఇప్పటికే అక్కడ ఉండి వీసా గడువు పొడిగింపు పొందేవారే ఎక్కువ. హెచ్–1బీపై ఉద్యోగం చేస్తున్న భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2016 అక్టోబరు నుంచి 2017 సెప్టెంబరు మధ్య కాలంలో దాదాపు 2 లక్షల మంది భారతీయ ఉద్యోగులు హెచ్–1బీ వీసా పొడిగింపు పొందారు. వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకునే వారికి అమెరికా ప్రభుత్వం తాజాగా నిబంధనలు కఠినతరం చేయడంతో ఇకపై దరఖాస్తు చేసే వాందరికీ గడ్డు కాలమేనని నిపుణులు అంటున్నారు. -
పరిమితి దాటిన హెచ్–1బీ వీసా దరఖాస్తులు
వాషింగ్టన్: 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్–1బీ వీసా దరఖాస్తులు నిర్దేశిత పరిమితి అయిన 65 వేలను దాటిపోయాయని అమెరికా వీసా సేవల సంస్థ యూఎస్సీఐఎస్ ప్రకటించింది. తదుపరి దశలో లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేసి వీసాలు జారీ చేయనున్నారు. అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం 2018, అక్టోబర్ 1న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 2న హెచ్–1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపిక కాలేకపోయిన దరఖాస్తుదారులకు ఫైలింగ్ రుసుమును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. మాస్టర్స్(అడ్వాన్స్డ్ డిగ్రీ) విభాగంలోనూ పరిమితి 20 వేలకు సరిపడ హెచ్–1బీ దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. -
హెచ్1 బీ దరఖాస్తుల కోటా ముగిసింది..కానీ
వాషింగ్టన్: హెచ్1బీ వీసాల దరఖాస్తులు కోటాకు సరిపడా స్వీకరించినట్టు అమెరికా పౌర, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. 2019 సంవత్సరానికి సంబంధించి హెచ్1 బీ వీసాలకు స్పందన భారీగా వచ్చిందని తెలిపింది. ఈ ఏడాది కోటా 65వేల దరఖాస్తులను స్వీకరించినట్టు తెలిపింది. లాటరీ నిర్వహించి అనంతరం వీసాకు అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పింది. అయితే ఎప్పుడు లాటరీ పద్ధతి నిర్వహిస్తారు, దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. మరోవైపు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టతనిచ్చింది. అమెరికా ప్రభుత్వం జారీ చేసే భారతీయ ఐటి నిపుణులకు పాపులర్ అయిన హెచ్1బీ వీసాలపై ప్రభుత్వ కోటాను మించి ఎక్కువగానే దరఖాస్తులు వచ్చాయి. వీటితో పాటు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి మంజూరు చేసే 20వేల వీసా క్యాప్కు సంబంధించి సరిపడా దరఖాస్తులు వచ్చినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ‘హెచ్1బీ వీసాల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాన్ని చెప్పలేం. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లాటరీ పద్ధతి అనుసరించే వీసాలు జారీ చేస్తాం’ అని యూఎస్సీఐఎస్ ప్రతినిధి తెలిపారు. అలాగే వీసాకుఎంపిక కాని దరఖాస్తుదారులు చెల్లించిన రుసుమును తిరిగి ఇచ్చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 2 నుంచి హెచ్1 వీసాల దరఖాస్తుల ప్రకియ ప్రారంభమైన విషయం తెలిసిందే. -
నేటి నుంచే హెచ్1బీ ప్రక్రియ
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాల కోసం విదేశీయులకు అందించే హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. భారత ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసే ఈ వర్క్ వీసా నిబంధనలను ఇటీవల ట్రంప్ యంత్రాంగం కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అమెరికా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్1బీ దరఖాస్తులను ఈ నెల 2 నుంచి స్వీకరించనున్నట్లు యూఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) వెల్లడించింది. వీసాల జారీలో పొరపాట్లు జరగకుండా కఠిన చర్యలను చేపట్టినట్టు పేర్కొంది. వివిధ సోషల్ మీడియా వెబ్సైట్లు, గ్రూపుల్లో ఇమిగ్రేషన్ అటార్నీలు స్పందిస్తూ.. ఈసారి తిరస్కరణకు గురయ్యే దరఖాస్తుల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. హెచ్1బీ అనేది నాన్–ఇమిగ్రెంట్ వీసా. అమెరికా కంపెనీలు ఈ వీసా ఉన్న విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన కంపెనీలు ఎక్కువగా ఈ వీసా కలిగి ఉండే భారత్, చైనా లాంటి దేశాలకు చెందిన వారికి ఎక్కువగా ఉద్యోగాలు ఇస్తుంటాయి. ఈసారి ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే అన్నిటినీ తిరస్కరించే అవకాశం ఉందని యూఎస్సీఐఎస్ చెప్పింది. -
హెచ్1బీలో ఒక దరఖాస్తుకే అనుమతి
-
హెచ్1బీలో ఒక దరఖాస్తుకే అనుమతి
వాషింగ్టన్: ఒక వ్యక్తి తరఫున ఒకటి కంటే ఎక్కువ హెచ్–1బీ వీసా దరఖాస్తులు వస్తే అన్నింటిని తిరస్కరించే వీలుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం హెచ్చరించింది. అలాంటి దరఖాస్తుల్ని క్షుణ్నంగా పరిశీలిస్తామని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి హెచ్–1బీ పిటిషన్లను స్వీకరించనున్న నేపథ్యంలో నిబంధనల్ని కఠినతరం చేస్తూ ఆదేశాలిచ్చింది. హెచ్–1బీ వీసాల జారీలకు సంబంధిన లాటరీలో తమ పేరు ఎలాగైనా వచ్చేందుకు ఒక వ్యక్తి తరఫున ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలవుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏదైనా వ్యాపార అవసరముంటే తప్ప ఒకే లబ్ధిదారుడి తరఫున సంబంధిత సంస్థలు(రిలేటెడ్ ఎంటిటీస్) దాఖలుచేసే అన్ని హెచ్–1బీ పిటిషన్లను తోసిపుచ్చడం కానీ రద్దు చేయడంగానీ చేస్తాం’ అని స్పష్టం చేసింది. హెచ్ 4 రద్దు చేస్తే తగ్గనున్న అమెరికాపై మోజు! హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే హెచ్ 4 వీసా ప్రక్రియను ఒకవేళ ట్రంప్ సర్కారు రద్దు చేస్తే నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికాపై ఆకర్షణ తగ్గే ప్రమాదముందని వలసదారుల అనుకూల సంస్థ ఒకటి తన నివేదికలో పేర్కొంది. హెచ్–1బీ వీసాపై వచ్చి శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు 2015లో ఒబామా ప్రభుత్వం వీలుకల్పించింది. అయితే ఆ పాలసీని రద్దు చేయాలని ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోంది. హెచ్ 4 వీసాతో జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించడం వల్ల.. అదనపు ఆదాయం సమకూరడంతో నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఆకర్షణీయ ప్రాంతంగా కొనసాగుతుందని, ప్రతిభావంతుల్ని ఆకర్షించడంలో ఇతర దేశాలతో అమెరికా పోటీ పడేందుకు దోహదపడుతుందని ఆ నివేదిక తెలిపింది. సిలికాన్ వ్యాలీ కంటే అక్కడే హెచ్–1బీలు ఎక్కువ.. అమెరికాలో సిలికాన్ వ్యాలీ కంటే తూర్పు తీర ప్రాంతం, టెక్సాస్ మెట్రో ప్రాంతాల్లోనే ఎక్కువమంది హెచ్–1బీ వీసాదారులు ఉన్నారని ‘ప్యూ’ సంస్థ తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆ సంస్థ లెక్కల ప్రకారం.. 2010–2016 మధ్య కాలంలో మొత్తం 8,59,600 వీసాలు జారీ కాగా వాటిలో 2,47,900 మంది న్యూయార్క్ మెట్రో ప్రాంతంలోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపింది. టెక్సాస్ మెట్రో ప్రాంతంలో పెద్ద సంఖ్యలో హెచ్1–బీ వీసాదారులు పనిచేస్తున్నట్లు ‘ప్యూ’ నివేదిక పేర్కొంది. సిలికాన్ వ్యాలీ కేంద్రమైన శాన్జోస్లో 2010–16 మధ్య కాలంలో 22,200 మంది హెచ్–1బీపై పనిచేశారని పేర్కొంది. డాలస్, వాషింగ్టన్ మెట్రో ప్రాంతాల్లో వరుసగా 74 వేలు, 64,800 మంది.. బోస్టన్లో 38,300 మంది హెచ్–1బీ వీసాదారులు నివసిస్తున్నట్లు వెల్లడించింది. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయాల్ని వెల్లడించారు. టెక్సస్ కాలేజీ స్టేషన్ మెట్రో ప్రాంతంలో పనిచేసే ప్రతి వంద మందిలో 32 మంది హెచ్–1బీ వీసాదారులేనని, వారిలో 99% మంది అక్కడున్న కాగ్నిజెంట్ టెక్నాలజీ కార్పొరేషన్లో పనిచేస్తున్నారని తెలిపింది. పాత ఫోన్ నంబర్లు, ఈమెయిల్ వివరాలివ్వాలి హెచ్–1బీ వీసా దరఖాస్తు సమయంలో వారి పాత ఫోన్ నంబర్ వివరాలు, ఈ మెయిల్ చిరునామాలు, సోషల్ మీడియా వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుందని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఆ దేశ ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించిన డాక్యుమెంట్లో పేర్కొన్న వివరాల మేరకు.. ‘అమెరికా రావాలనుకుంటున్నవారు కొత్త నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వాలి. అమెరికాకు ముప్పు కలిగించే వ్యక్తులు దేశంలోకి రాకుండా నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. గత ఐదేళ్లుగా ఉపయోగిస్తున్న సోషల్మీడియా ఖాతాల వివరాలు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు అందించాలి. ఇంతకుముందు ఏ దేశమైనా మిమ్మల్ని బహిష్కరించిందా? మీ కుటుంబంలో ఎవరికైనా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయా? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి’ అని డాక్యుమెంట్లో స్పష్టం చేశారు. తాజా నిబంధనలపై స్పందన తెలియచేసేందుకు 60 రోజుల గడువునిచ్చారు. -
2 నుంచి హెచ్1బీ దరఖాస్తులు
వాషింగ్టన్: 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసాల దరఖాస్తులను ఏప్రిల్ 2 నుంచి స్వీకరిస్తామని అమెరికా పౌర, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. అయితే 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ను మాత్రం తాత్కాలికంగా నిలిపివేయనున్నామని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరం పరిమితి కిందకు రాని హెచ్1బీ వీసాల దరఖాస్తులైతే ప్రీమియం ప్రాసెసింగ్ కోసం కూడా అభ్యర్థించవచ్చని యూఎస్సీఐఎస్ స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా హెచ్1బీ వీసాతోపాటు ప్రీమియం ప్రాసెసింగ్కూ కలిపి ఒకేసారి దరఖాస్తు చేస్తే (2019 ఆర్థిక సంవత్సరం కింద) ఆ అప్లికేషన్లను తిరస్కరిస్తామంది. ప్రీమియం ప్రాసెసింగ్ను సెప్టెంబరు 10న తిరిగి ప్రారంభించే అవకాశం ఉందనీ, కచ్చితంగా ఎప్పుడు ఆరంభించేదీ త్వరలో ప్రకటిస్తామని యూఎస్సీఐఎస్ చెప్పింది. అమెరికాలోని కంపెనీలు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించేవే ఈ హెచ్1బీ వీసాలు. భారత్, చైనా తదితర దేశాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా హెచ్1బీపైనే అమెరికాకు వెళ్తుంటా రు. ఒకసారి వీసా పొందితే మూడేళ్లు అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. వీసాను మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఏమిటీ ప్రీమియం ప్రాసెసింగ్? దరఖాస్తుదారులు కొంత అధిక రుసుము చెల్లించి తమ హెచ్1బీ వీసా దరఖాస్తును వేగవతంగా పరిశీలించాల్సిందిగా యూఎస్సీఐఎస్ను కోరడమే ప్రీమియం ప్రాసెసింగ్. సాధారణంగా ప్రీమియం ప్రాసెసింగ్ కింద వచ్చిన దరఖాస్తులను యూఎస్సీఐఎస్ 15 రోజుల్లోపే పరిశీలించి ఆమోదించడమో, తిరస్కరించడమో చేస్తుంది. ఈసారి ప్రీమియం ప్రాసెసింగ్ లేకపోయినప్పటికీ.. వీసా దరఖాస్తులను తొందరగా పరిశీలించాల్సిందిగా అభ్యర్థులు విజ్ఞప్తి చేసే అవకాశాన్ని ఇస్తున్నామనీ, అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయని యూఎస్సీఐఎస్ చెప్పింది. ప్రీమియం ప్రాసెసింగ్ను నిలిపివేయడం వల్ల సాధారణ హెచ్1బీ దరఖాస్తులను వేగంగా పరిశీలించే వెసులుబాటు తమకు లభిస్తుందని తెలిపింది. పదేళ్లలో భారత్ నుంచి 22 లక్షలు అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు ఉంటుంది. ఒక్కో ఆర్థిక సంత్సరానికి 65 వేల హెచ్1బీ వీసాలను యూఎస్సీఐఎస్ మంజూరు చేస్తుంది. ఇవి కాకుండా మరో 20 వేల వీసాలను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదివిన వారి కోసం ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల్లో పని చేసేందుకు వచ్చే వారికి కూడా 65 వేల పరిమితితో సంబంధం లేకుండా హెచ్1బీ వీసాలు ఇస్తారు. 2007 నుంచి 2017 మధ్య హెచ్1బీ కోసం అత్యధికంగా భారత్ నుంచి ఏకంగా 22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
హెచ్1బీ వీసా కొత్త పాలసీపై క్లారిటీ
వాషింగ్టన్: అమెరికన్లు, వలసేతర కార్మికుల వేతనాలు, పరిస్థితుల్ని మెరుగుపర్చేందుకే ట్రంప్ యంత్రాంగం కొత్త హెచ్1బీ వీసా పాలసీని తీసుకొచ్చిందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) శనివారం తెలిపింది. అమెరికాలో కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన దానికన్న తక్కువ వేతనాలు చెల్లించడం, ఖాళీగా కూర్చోబెట్టడం, నైపుణ్యానికి సంబంధంలేని పనుల్ని అప్పగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. ఇలాంటి మోసాలను అరికట్టేందుకే కొత్త హెచ్1బీ విధానాన్ని తీసుకొచ్చామని వివరించింది. ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం థర్డ్ పార్టీ వర్క్సైట్లలో కాంట్రాక్ట్ కాలపరిమితి మేరకే హెచ్1బీ వీసాను జారీచేస్తారు. పని ఉన్నంత కాలానికే.. అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) గురువారం జారీ చేసిన ఏడు పేజీల తాజా పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్సైట్లో ఎంత కాలం పనుంటే అంత కాలానికే హెచ్–1బీ వీసాలు జారీ చేస్తారు. ఇప్పటిదాకా మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసాల్ని జారీచేస్తుండగా... ఇక నుంచి అంతకంటే తక్కువ కాలానికే జారీ చేయనున్నారు. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్–1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుందన్న వార్తల నేపథ్యంలో ఈ పాలసీని కొత్తగా అమెరికా తెరపైకి తెచ్చింది. -
హెచ్1బీ మరింత కఠినం
వాషింగ్టన్: భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై పెను ప్రతికూల ప్రభావం చూపేలా హెచ్1–బీ వీసాల జారీలో అమెరికా భారీ మార్పులు చేసింది. విదేశీ కంపెనీల తరఫున అమెరికాలోని ‘థర్డ్ పార్టీ వర్క్ సైట్ల’లో పనిచేసేవారికి హెచ్–1బీ వీసాల జారీని కఠినంచేస్తూ కొత్త పాలసీ తెచ్చింది. ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్సైట్లో హెచ్–1బీ వీసా కోరుతున్న ఉద్యోగి పనిచేయాల్సిన అవసరాన్ని, వారి నైపుణ్యాల్ని కంపెనీలు నిరూపించాలి. హెచ్–1బీ వీసాదారు వర్క్ కాంట్రాక్ట్ ఎంతకాలముంటే అంత కాలానికే వీసాలు జారీ చేస్తామని, ఒకవేళ వీసాల్ని పొడిగించుకోవాలనుకుంటే తాజా నిబంధనల్ని పాటించాల్సిందేనని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. ఉద్యోగి తరఫున వీసా దరఖాస్తు సమయంలోనే ఆ వివరాల్ని సమర్పించాలని సూచించింది. భారతీయ కంపెనీల తరఫున హెచ్–1బీ వీసాదారులు పనిచేసే కంపెనీలను ‘థర్డ్ పార్టీ వర్క్సైట్లు’ అంటారు. పని ఉన్నంత కాలానికే.. అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) గురువారం జారీ చేసిన ఏడు పేజీల తాజా పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్సైట్లో ఎంత కాలం పనుంటే అంత కాలానికే హెచ్–1బీ వీసాలు జారీ చేస్తారు. ఇప్పటిదాకా మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసాల్ని జారీచేస్తుండగా... ఇక నుంచి అంతకంటే తక్కువ కాలానికే జారీ చేయనున్నారు. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్–1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుందన్న వార్తల నేపథ్యంలో ఈ పాలసీని కొత్తగా అమెరికా తెరపైకి తెచ్చింది. యజమాని–ఉద్యోగి బంధం కొనసాగించాలి ఈ పాలసీ ప్రకారం ‘థర్డ్ పార్టీ వర్క్సైట్లో ఉద్యోగి పనిచేస్తున్నంతకాలం చట్టబద్ధమైన యజమాని–ఉద్యోగి సంబంధం కొనసాగేలా కంపెనీ చూసుకోవాలి. అలాగే ఉద్యోగి ప్రత్యేక నైపుణ్యమున్న వృత్తిలోనే పనిచేస్తాడని నిరూపించాల్సి ఉంటుంది. ఉద్యోగి చేయాల్సిన ప్రత్యేకమైన పని.. ఎంత కాలం పనిచేస్తాడు.. అందుకు సరిపడా నైపుణ్యం ఉందా? మొదలైన వివరాల్ని వీసా దరఖాస్తు సమయంలోనే కంపెనీలు వెల్లడించాలి. హెచ్–1బీ వీసాను గరిష్టంగా మూడేళ్ల వరకూ జారీచేయవచ్చని, అయితే ఆ నిర్ణయం తన విచక్షాణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని, అయితే దరఖాస్తు సమయంలో కంపెనీ పేర్కొన్న కాలానికే వీసా జారీ చేస్తామని యూఎస్సీఐఎస్ తెలిపింది. అయితే వీసా కోసం దరఖాస్తు చేసిన కంపెనీ.. యజమాని–ఉద్యోగి సంబంధాన్ని తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీసా పొడిగింపునకు తాజా నిబంధనలే హెచ్–1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేస్తే తాజా నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని యూఎస్సీఐఎస్ తెలిపింది. ‘తాము సూచించిన నిబంధనల్ని పాటించకపోయినా.. నియమాలకు అనుగుణంగా వీసా పిటిషన్ లేకపోయినా తగిన చర్యలు తీసుకునేందుకు అధికారం ఉంటుంది’ అని స్పష్టం చేసింది. కొన్నిసార్లు అమెరికన్ కంపెనీలు ఉద్యోగితో కాంట్రాక్టును అర్థాంతరంగా రద్దు చేసుకుంటాయి. ఆ సమయంలో ఉద్యోగులకు తాత్కాలికంగా ఎలాంటి పని ఉండదు. బెంచ్ పిరియడ్గా పేర్కొనే ఆ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించవు. అయితే అలా చేయడం చట్ట విరుద్ధమని, వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని యూఎస్సీఐఎస్ స్పష్టం చేసింది. భారతీయ కంపెనీలకు ఇబ్బందే.. తాజా నిబంధనల నేపథ్యంలో హెచ్–1బీ ఉద్యోగుల్ని అమెరికాకు పంపే కంపెనీలు వీసా దరఖాస్తులు సమర్పించేందుకు మరింత ఎక్కువ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వీసా దరఖాస్తు లేఖతో పాటు.. ఉద్యోగికి కేటాయించే పని వివరాలు, ఆ పని చేసేందుకు అవసరమయ్యే నైపుణ్యం, విద్యార్హతలు, పని ఎంతకాలం ఉంటుంది, వేతనం, పనిగంటలు, ఇతర ప్రయోజనాల్ని జతపరచాలి. -
అమెరికాలో రెన్యువల్ భయం !
⇔ హెచ్1బీ వీసా పొడిగింపు దరఖాస్తులకు అధికారుల కొర్రీలు ⇔ దాదాపు ప్రతి దరఖాస్తుకూ ఎవిడెన్స్ కావాలంటూ లేఖలు ⇔ కొన్ని ఆఫీసులకు నేరుగా వెళ్తున్న యూఎస్సీఐఎస్ సిబ్బంది ⇔ బ్యాచిలర్ డిగ్రీ లేకున్నా స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామంటున్న అమెరికన్ సంస్థలు ⇔ భారత ఐటీ కంపెనీల స్థానిక రిక్రూట్మెంట్లు కూడా షురూ ⇔ దీంతో అమెరికాలోని తెలుగు ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన ⇔ మున్ముందు పరిస్థితులు ఇబ్బందికరమేనంటున్న నిపుణులు ⇔ కొత్త టెక్నాలజీలకు అప్గ్రేడ్ కావడమే మార్గమని సూచన హైదరాబాద్– బిజినెస్ బ్యూరో : శ్రీధర్ చాన్నాళ్ల కిందట హెచ్1బీ వీసాపై అమెరికా వెళ్లాడు. గ్రీన్కార్డుకు అప్లయ్ చేశాడు కానీ... ఇంకా రాలేదు. అది క్యూలో ఉంది కనక డిపెండెంట్ వీసాపై అమెరికా వెళ్లిన శ్రీధర్ భార్య భార్గవి కూడా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) సాయంతో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ రెండేళ్ల కిందటే అక్కడ ఇల్లు కూడా కొన్నారు. ఈఎంఐ కాస్త ఎక్కువే. అయితేనేం!! ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కనక ఇబ్బంది లేదు. కాకపోతే శ్రీధర్ హెచ్1బీ గడువు ముగుస్తోంది. దీంతో మూడేళ్ల పొడిగింపు కోసం దరఖాస్తు చేశాడు. దానికి వీసా కార్యాలయం నుంచి ఎవిడెన్స్లు కావాలనే అభ్యర్థన (ఆర్ఎఫ్ఏ) వచ్చింది. దీంతో తన వీసా తిరస్కరణకు గురవుతుందా? ఇబ్బందులేమైనా వస్తాయా? అనే గుబులు శ్రీధర్లో మొదలైంది. రాఘవ కూడా దాదాపు రెండున్నరేళ్ల కిందట హెచ్1బీపై అమెరికాకు వెళ్లాడు. తన వీసా గడువు మూడేళ్లు. మరో ఆరు నెలలే ఉండటంతో గతనెల్లో రెన్యువల్ కోసం దరఖాస్తు చేశాడు. తనక్కూడా యూఎస్సీఐఎస్ కార్యాలయం నుంచి ఆర్ఎఫ్ఏ వచ్చింది. ఆ రిక్వెస్ట్లో వారు పేర్కొన్న అన్ని పత్రాలనూ రాఘవ సమర్పించాడు. అయితే యూఎస్సీఐఎస్ సిబ్బంది రాఘవ పనిచేస్తున్న కార్యాలయాన్ని కూడా సందర్శిస్తామని చెప్పారు. ఇదంతా చూశాక... రాఘవకు తన వీసా రెన్యువల్ అవుతుందా? అనే అనుమానం మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ అది పెరుగుతోంది కూడా!! ‘అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే’ అనే నినాదంతో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాక అక్కడి ఉద్యోగ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఆ ప్రభావం ఇండియాపై ఎక్కువగానే పడుతోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్... అక్కడే మూడు కేంద్రాలు ఆరంభిస్తామని, స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పటమే కాక... దానికి తగ్గట్టు అక్కడ రిక్రూట్మెంట్లు కూడా మొదలుపెట్టింది. కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ దిగ్గజాలు కూడా అదే పనిలో పడ్డాయి. ఫలితంగా ఆయా సంస్థలు ఇండియాలో సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. కోతలు పెంచుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే... కొన్నాళ్ల కిందటే అమెరికాకు హెచ్1బీపై వెళ్లి... అక్కడి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారికి వీసా రెన్యువల్ రూపంలో కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘‘ఇదివరకు వీసా రెన్యువల్కు చేసిన దరఖాస్తుల్లో తక్కువ వాటికే ఆర్ఎఫ్ఏ వచ్చేది. కానీ ఇపుడు దాదాపు అన్ని దరఖాస్తులకూ ఆర్ఎఫ్ఏ వస్తున్నట్లు చెబుతున్నారు. దీన్నిబట్టి వీసా నిబంధనలను మరింత కఠినం చెస్తున్నట్లు అర్థమవుతోంది. పరి స్థితి ఇలాగే కొనసాగితే పలువురు తెలుగువారు తిరిగి స్వదేశానికి వెళ్లక తప్పదు’’ అని 20 ఏళ్ల కిందట యూఎస్కు వెళ్లి స్థిరపడ్డ అనంతపురం వాసి ఒకరు చెప్పారు. పోటీ మరో రూపంలోనూ వస్తోంది! అమెరికాలో ఇండియన్లు పలు రంగాల్లో ఉన్నా... ఐటీ రంగంలో మాత్రం తెలుగువారిదే పైచేయి. దాదాపు 25 లక్షల మంది తెలుగువారు ఐటీ ఉద్యోగులుగా కొనసాగుతున్నట్లు స్థానిక అసోసియేషన్లు చెబుతున్నాయి. స్థానికులు చెబుతున్న సమాచారం మేరకు... ఇపుడు రిక్రూట్మెంట్లలో అమెరికన్ కంపెనీల దృక్పథం కూడా మారుతోంది. ట్రంప్ పాలసీలకు అనుగుణంగా మరింత మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించటానికి వారు కొన్ని నిబంధనల్ని కూడా సడలించుకుంటున్నారు. అక్కడ ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ఇప్పటిదాకా బీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) ఉత్తీరణ తప్పనిసరి అనేవారు. ‘‘నిజానికి అక్కడ హైస్కూల్ చదువుతో ఆపేసిన పలువురు యువతకు వివిధ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లపై పట్టు ఉంది. కోడ్ రాయటం వారికి పెద్ద పనేమీ కాదు. కానీ బీఎస్ లేదన్న కారణంతో ఇన్నాళ్లూ వారు ఐటీ ఉద్యోగాలకు నోచుకోలేదు. కానీ ఇపుడు కంపెనీలు తమ ధోరణి మార్చుకుంటున్నాయి. బీఎస్ అనే నిబంధనను సడలించి ఉద్యోగంలోకి తీసుకుందామని, తరవాత తామే బీఎస్ చదువుకునేలా స్పాన్సర్ చేయొచ్చని అవి యోచిస్తున్నాయి. ఇది పూర్తిస్థాయిలో అమలయితే దీని ప్రభావం ఎక్కువగా పడేది తెలుగువాళ్లపైనే’’ అని స్థానికంగా సాఫ్ట్వేర్ సంస్థ నడుపుతున్న మరో తెలుగు వ్యక్తి అభిప్రాయపడ్డారు. స్థానిక కంపెనీలదీ అదే బాట!! టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటిదాకా తమ సిబ్బందిని క్లయింట్ సంస్థలుండే అమెరికాకు పంపటం ఎక్కువగానే జరిగేది. ఈ సంవత్సరం అది బాగా తగ్గిపోయింది. అక్కడి వారినే తీసుకుందామని కంపెనీలు భావించటం దీనికి ప్రధాన కారణం. అదేకాదు. కొన్నాళ్ల కిందటి దాకా క్లయింట్లతో సమావేశాలకు తమ సిబ్బందిని ఈ కంపెనీలు తాత్కాలికంగా యూఎస్, యూకేలకు పంపించేవి. ఇపుడు వాటికి కూడా పూర్తిగా కోతపెట్టాయి. ఇక్కడి నుంచే ‘టెలీ ప్రజెన్స్’లో సమావేశం కావాలని తమ సిబ్బందికి చెబుతున్నారు. అంటే ఒకరకమైన వీడియో కాల్స్ వంటివన్న మాట. మనం సర్వీసెస్లో ఉండిపోవటం వల్లేనేనా? భారత ఐటీ రంగం చిరకాలంగా సర్వీసులపైనే ఆధారపడి నెట్టుకొస్తోందని, మన నుంచి బ్లాక్బస్టర్ ఉత్పత్తి ఒక్కటీ లేదని ఐటీ కన్సల్టెంట్ ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు పలు ఉత్పత్తుల్ని తెస్తున్నాయి. భారతీయులే వాటిని నడిపించే స్థానాల్లో ఉన్నా... భారత దేశం నుంచి ఒక్క ఉత్పత్తీ లేకపోవటం విషాదకరమే. ప్రస్తుతం ఉత్పత్తులు పెరుగుతున్నాయి కానీ సర్వీసులు పెరగటం లేదు. అదే తాజా పరిస్థితులకు కారణం’’ అని ఆయన తెలియజేశారు. అసలు కారణాలివీ... నిజానికి ఐటీ రంగంలో ఉద్యోగాలు పోవటానికి అంతా ట్రంప్నే కారణంగా చూపిస్తున్నా... నిపుణులు మాత్రం అదొక్కటే కారణం కాదని చెబుతున్నారు. ‘‘కొన్నాళ్లుగా ఐటీ రంగం నెమ్మదించింది. ఎందుకంటే వివిధ సంస్థలు ఐటీపై పెడుతున్న ఖర్చును తగ్గించేశాయి. దీంతో గత నాలుగేళ్లుగా ఐటీ కంపెనీల బిల్లింగ్ పెరగటం లేదు. పైపెచ్చు ఐటీ సంస్థల మధ్య పోటీ పెరగటంతో ఇపుడు బిల్లింగ్ తగ్గిస్తామని బేరాలు కూడా ఆడుతున్నారు. మరోవంక ఐటీ కంపెనీలు మాత్రం ప్రతి ఏటా తమ సిబ్బందికి కనీసం 10 శాతం జీతం పెంచాల్సి వస్తోంది. దీంతో ఖర్చులు పెరిగి, చివరకు ఉద్యోగాల్లో కోత పెట్టాల్సి వస్తోంది’’ అని టీసీఎస్ సీనియర్ ఉద్యోగి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల పలు భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడి వారినే నియమించడానికి దిగుతున్నాయి. ఈ ప్రభావం ఇక్కడి ఉద్యోగాలపై కచ్చితంగా ఉంటుంది. దీనికితోడు ఆటోమేషన్ వల్ల పలువురి ఉద్యోగాలు పోతున్నాయి. ఈ మూడు కారణాలూ కలిసి ఐటీని భయపెడుతున్నాయి’’ అని కాగ్నిజెంట్ సీనియర్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. ఆటోమేషన్, డిజిటల్ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని, ఆ టెక్నాలజీకి అప్గ్రేడ్ అయిన వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని అమెరికాలో క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థను నిర్వహిస్తూ... విజయవాడలో ‘ఫ్రిస్కా’ పేరిట హోమ్హెల్త్కేర్ సంస్థను ఏర్పాటు చేసిన అసిఫ్ మొహమ్మద్ చెప్పారు. ‘‘మనమిపుడు క్లౌడ్ కంప్యూటింగ్ ప్రపంచంలో ఉన్నాం. క్లౌడ్ ఆటోమేషన్ ఇంకా పెరుగుతుంది. ఉద్యోగులు అత్యాధునిక సర్వర్లెస్ కంప్యూటింగ్ (లాంబ్డా), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) డేటా సైన్స్ వంటి టెక్నాలజీల్లో తమ నైపుణ్యాల్ని అప్గ్రేడ్ చేసుకోవటం తప్పనిసరి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగమని, ప్రతిదీ ఇంటర్నెట్తో కనెక్ట్ కావాల్సిందేనని చెబుతూ... అందుకే తాము టెక్నాలజీ ఆధారంగా విజయవాడలో తొలి హోమ్హెల్త్కేర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. -
ప్రింటింగ్ తప్పు.. వీసా హోల్డర్స్ గుండెల్లో గుబేలు
అసలకే ట్రంప్ ఇచ్చే షాక్లతో గుండెలు గుబేలుమంటున్న వీసా హోల్డర్స్ కు, అక్కడి అధికారులు మరో ఝలక్ ఇచ్చారు. వీసా జారీలో తప్పుడు ప్రింటింగ్ వేయడంతో దేశీయ టెక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కసారిగాలో గుబులు ప్రారంభమైంది. వీసా ప్రాసెసింగ్ సెంటర్స్ ఆధీనంలో పనిచేసే అమెరికా వీసా ప్రింటింగ్ ప్రెస్, పొరపాటున హెచ్1బీ కు బదులుగా 1బీ1 అని ప్రింట్ చేసింది. చాలామంది వీసాహోల్డర్స్ పిటిషన్లలో హెచ్1బీ బదులుగా 1బీ1ను ఆమోదిస్తున్నట్టు పేర్కొంది. దీంతో అమెరికా ప్రయాణించాలనుకునే వారిలో ఆందోళన ప్రారంభమైంది. హెచ్1బీకి అప్లయి చేస్తే 1బీ1 రావడమేమిటని తలలు పట్టుకున్నారు. ఇటీవలే సస్పెండ్ అయిన ప్రీమియం ప్రాసెసింగ్ ప్రొగ్రామ్ ను రెన్యూవల్ చేపించుకోవడానికి అప్లయి చేసిన విదేశీ పాస్ పోర్టు హోల్డర్స్ ఈ తప్పుడు ప్రింటింగ్ ను గుర్తించారు. వారితో పాటు మిగతా అభ్యర్థులు గుర్తించి, యూఎస్సీఐఎస్ ని సంప్రదించడం ప్రయత్నించారు. కానీ వారు తమ గోడును వినిపించుకోలేదని హెచ్1బీ వీసా హోల్డర్స్ పేర్కొంటున్నారు. వీసా జారీలో తప్పుడు ప్రింటింగ్ వీసా ఆఫీసర్ క్షమించరాని నేరమని, పిటిషనర్ కాని వారి తరుఫున లాయర్ కాని ఫోన్ చేసిన ఎలాంటి స్పందన ఉండట్లేదని మరో వీసా హోల్డర్ ఆవేదన వ్యక్తంచేశారు. 1బీ1 వల్ల అమెరికా వెలుపల ప్రయాణించాలంటే చాలా కష్టమని పేర్కొన్నారు. ఈ తప్పుడు స్టాంపింగ్ తో స్వదేశానికి ప్రయాణించాంటే వీలుపడదని చెప్పారు. ఈ ఏడాది 3న ప్రారంభించిన ఆరు నెలల ప్రీమియం ప్రాసెసింగ్ ప్రొగ్రామ్ ను ట్రంప్ కార్యాలయం సస్పెండ్ చేసింది. హెచ్1బీ వీసాలను దాదాపు 60 శాతం మంది అప్లయి్ చేశారు. మొత్తం లక్షా 20వేల మంది హెచ్1వీసా హోల్డర్స్ అమెరికాలోఉన్నారు. వారిలో ఎక్కువ మంది టెక్ వర్గానికి చెందినవారే. -
హెచ్-1బీ వీసా కోటా ముగిసింది
వాషింగ్టన్: విదేశీ ఐటి నిపుణులకు అమెరికా మంజూరు చేసే హెచ్-1బీ వీసా మాండేటరీ కోటా ముగిసింది. 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బీ వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ముగిసిందని ఫెడరల్ ఏజెన్సీ శనివారం ప్రకటించింది. దీనికి సంబంధించిన మాండేటరీ కోటా 65 వేలకు చేరిందని తెలిపింది. 2018ఆర్థిక సంవత్సరానికి గాను 65వేల తప్పనిసరి కోటా రీచ్ అయినట్టు అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే మాస్టర్ క్యాప్గా పిలిచే అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు కోటా కింద 20వేల అభ్యర్థుల ఎంపిక కూడా ముగిసిందని పేర్కొంది. అమెరికన్ కంపెనీలు విదేశీ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్ నిపుణులను తమ దేశానికి రప్పించుకుని తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుకు హెచ్-1బీ వీసా మంజూరు చేస్తాయి. అయితే, 65 వేలకు మించకుండా ఈ వీసాలను జారీ చేస్తుంది. దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణను ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించింది. అయితే, గత సంవత్సరాల వలే కాకుండా ఈ ప్రక్రియను ఎలా చేపట్టింది అనేది స్పష్టం చేయలేదు. ఇప్పటివరకు ఉన్న కంప్యూటర్ ద్వారా లాటరీ ద్వారా వీసాలను జారీ చేసే పద్ధతికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే.