vips
-
HYD:10 మంది వీఐపీలపై డ్రగ్స్ కేసు
హైదరాబాద్, సాక్షి: రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో పురోగతి చోటు చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పాలు పంచుకున్న పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్ పేపర్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.. ‘‘రాడిసన్ బ్ల్యూ హోటల్ పై స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులతో దాడి చేశాం. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడం తో సెర్చ్ చేశాం. అప్పటికే హోటల్ నుండి నిందితులు పరారయ్యారు . అప్పటికే అందించిన సమాచారంతో.. వివేకానంద ఇంటికి వెళ్ళాం. వివేకానంద మంజీర గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నాడు. ఇంటికి వెళ్లిన సమయం లో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారు. వివేకానందను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేశాం. వివేకా నంద తో పాటు నిర్భయ్ , కేదార్లకు పాజిటివ్ వచ్చింది. వివేక్ కు యూరిన్ టెస్ట్ చేయించాము, కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది. మొత్తం ఈ పార్టీ లో 10 మంది ఉన్నట్లు గుర్తించాం. రాడిసన్ హోటల్ లో గతంలో పార్టీలు జరిగాయి. సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించాం. వివేకా నంద, నిర్భయ్ , కేదార్ పై 121b 27, NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులు ను కూడా మేము అటాచ్ చేస్తున్నాం అని సీపీ వెల్లడించారు. -
వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీ) డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చిన్నచిన్న తప్పిదాలతో వీఐపీలు ప్రాణాలు కోల్పోతున్నారని.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఘటన నేపథ్యంలో రవాణా శాఖ సుమోటోగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీఐపీలంతా తమ డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ లేఖలు రాస్తామన్నారు. ఈ జాబితాలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారని వివరించారు. వారి డ్రైవర్లకు అన్ని జిల్లాల్లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పరీక్షల అనంతరం డ్రైవర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, వారిని కొనసాగించుకోవాలా వద్దా అనేది వీఐపీల ఇష్టమని చెప్పారు. పొన్నంప్రభాకర్ శనివారం గాం«దీభవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో రోజూ సగటున 45లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని, ఇప్పుడా సంఖ్య 55–60 లక్షల వరకు ఉంటోందని తెలిపారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఆర్టీసీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడుస్తోందని చెప్పారు. పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని, గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని.. పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ స్థలాల్లో ప్రాజెక్టులు చేపడతామని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద అనవసరంగా జీరో టికెట్లు కొట్టే కండక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీకి మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ప్రతిమా శ్రీనివాసరావు లాంటి వారు పాత బకాయిలు చెల్లిస్తున్నారన్నారు. ఆర్టీసీలోకి కొత్తగా వెయ్యి బస్సులు తీసుకువస్తామన్నారు. ఇప్పటికే 100 వచ్చాయని, దశలుగా మిగతావి తెస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్గో ఆదాయం రూ.150 కోట్లకు చేరిందని, రూ.2 వేల కోట్ల ఆదాయార్జన ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీలది డ్రామా బీఆర్ఎస్– బీజేపీ ఒకటేనని.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త డ్రామా మొదలుపెట్టాయని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ ఒకటి కాదని చెప్పుకొనేందుకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తున్నారని.. అందుకే వాయిదాల పద్ధతుల్లో నోటీసులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిహార్ మోడల్లో కులగణన త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని, ఇందుకోసం బిహార్లో అమలు చేసిన ప్రక్రియను అనుసరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ గణన కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతి ఎన్యూమరేటర్కు శిక్షణ ఇస్తామని, కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అంశంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామన్నారు. కులగణన బిల్లును దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆమోదించలేదని, అలాంటిది ఏదైనా ఉంటే బీఆర్ఎస్ నేతలు చూపాలని సవాల్ చేశారు. ఆటో కార్మి కులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చామని.. దీనిపై కేబినెట్లోనూ చర్చించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోల రంగం ఇబ్బంది పడుతుందనడంలో వాస్తవం లేదని.. అందుకు ప్రతి నెలా అమ్ముడవుతున్న ప్యాసింజర్ ఆటోల గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. -
ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే..
ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఎవరికైనా పాస్పోర్ట్ అవసరమనే సంగతి మనకు తెలిసిందే. ఈ నియమం పెద్దపెద్ద వీఐపీలకు కూడా వర్తిస్తుంది. సెలబ్రిటీలు కూడా పాస్పోర్టు లేకుండా ఏ దేశంలోనూ కాలుమోపలేరు. అయితే ప్రపంచంలోని ఆ ముగ్గురు ఎటువంటి పాస్పోర్టు లేకుండా ఏ దేశానికైనా వెళ్లవచ్చు. ఆ ముగ్గురికి పాస్పోర్టుతో పనేమీ లేదు. మరి ఆ ముగ్గురు ఎవరో తెలుసా? ఆ ముగ్గురు వీరే.. ప్రపంచంలో పాస్పోర్ట్ అవసరం లేని ఆ ముగ్గురు ఎవరనే విషయానికొస్తే.. వారు బ్రిటన్ కింగ్, జపాన్ కింగ్, జపాన్ క్వీన్. వీరు విదేశాలు వెళ్లాలనుకుంటే పాస్పోర్ట్ అవసరం లేదు. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన క్వీన్ ఎలిజబెత్కు ఈ అధకారం ఉండేది. తరువాత ఛార్లెస్ రాజయ్యాక అతనికి ఈ అధికారం సంక్రమించింది. ఈ అధికారం కేవలం ఛార్లెస్కు మాత్రమే ఉంటుంది. వారి ఫ్యామిలీలో ఎవరికీ ఈ అధికారం లభించదు. వారు విదేశాలు వెళ్లాలంటే వారికి పాస్పోర్టు అవసరమవుతుంది. ప్రముఖుల విషయంలో.. ఏ దేశంలోనైనా ఎంతటి ప్రముఖులైనా విదేశాల్లో కాలుమోపేందుకు వారికి పాస్పోర్ట్ అవసరమవుతుంది. అయితే వారి దగ్గర డిప్లొమెట్ పాస్పోర్టు ఉంటుంది. ఇది ఏదేశానికి వెళ్లాలన్నా వారికి ప్రత్యేక గుర్తింపును కల్పిస్తుంది. అలాగే ఎయిర్పోర్టులో వీరికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వీరు ప్రత్యేక ప్రొటోకాల్ను పాటించాల్సివుంటుంది. భారత్ విషయానికొస్తే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన కొన్ని పదవుల్లో ఉండే కొందరి దగ్గర డిప్లొమెట్ పాస్పోర్టు ఉంటుంది. దీని సాయంతో వారు తగిన ప్రొటోకాల్ పాటిస్తూ విదేశీయాత్ర చేయవచ్చు. అయితే వీరికి కూడా పాస్పోర్టు అవసరమవుతుంది. ఇది కూడా చదవండి: రాత్రి భోజనం ఉదయం 11కే కానిచ్చేస్తాడు.. 45లో 18లా కనిపిస్తూ.. -
రాజకీయ నేతలతో సెల్ఫీలు.. ఉద్యోగికి కలెక్టర్ షాకింగ్ ట్విస్ట్
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఎన్నికల విధుల్లో ఉండగా వీఐపీల వద్ద సెల్ఫీ తీసుకున్న ఉద్యోగిపై సస్పెన్షన్ వేటుపడింది. వివరాలు.. నెలమంగల తాలూకా సోలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రిల్ మాస్టర్ అయిన అంజన్కుమార్ను సోలూరు వద్ద చెక్ పోస్టులో తనిఖీ బృందం మేనేజర్గా నియమించారు. మధ్యాహ్నం 2గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ డ్యూటీ. ఈ సమయంలో అటుగా వచ్చిన ప్రముఖ రాజకీయ నేతలతో ఆయన సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో బెంగళూరు గ్రామీణ జిల్లా కలెక్టర్ ఆర్.లత అతన్ని సస్పెండ్ చేశారు. చదవండి: బ్యూటీషియన్కు షాక్.. లక్ష కడితే నెలకు రూ.40 వేల వడ్డీ.. చివరికి.. -
వైభవంగా వైకుంఠ ఏకాదశి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
Vaikunta Ekadasi 2022 : శ్రీవారి సేవలో పెద్దఎత్తున ప్రముఖులు
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి.. శ్రీవారి సేవలో ప్రముఖులు
-
ఆసక్తికరంగా వీఐపీల గ్రామాల పోరు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ పోరు ఆసక్తి రేపుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడినన్ని పార్టీలు ఈసారి తెరపై కనపడకపోవడం, రెండు ప్రధాన రాజకీయ పార్టీలే ఈ ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అని తలపడనుండడంతో పంచాయతీ పోరు రక్తికడుతోంది. అధికార టీఆర్ఎస్ అధిష్టానం మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించడంతో ఆ పార్టీ నాయకులు సవాల్గా తీసుకున్నారు. ఇన్నాళ్లు అడపాదడపా మాత్రమే సొంత గ్రామాలవైపు కన్నెత్తి చూసినవారు ఇప్పుడు తమ సొంత ఊళ్లలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఏకగ్రీవ పంచాయతీలను తమ సొంతూరునుంచే మొదలు పెట్టి ఆదర్శంగా నిలవాలని తలపోస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందారు. ఇవి పార్టీ రహితంగా జరిగే ఎన్నికలే అయినా.. అంతటా రాజకీయమే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వారిలో అత్యధికులు టీఆర్ఎస్లో చేరగా, మరి కొందరు కాంగ్రెస్లోనే కొనసాగారు. ఈసారి గ్రామ పోరు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆయా పార్టీల్లోని ముఖ్య నాయకుల సొంతూళ్లు ఈ సారి కొత్తగా పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయి. దీంతో సహజంగానే ఇరు పార్టీల నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందరి దృష్టిని ఆకర్శిస్తున్న నకిరేకల్ నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ముఖ్య నాయకులు ఉన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మ¯న్ నేతి విద్యాసాగర్, టీచర్స్ ఎమ్మెల్సీ పూల రవీందర్ కేతేపల్లి మండలంచెరుకుపల్లి పంచాయతీకి చెందిన వారు. నేతి విద్యాసాగర్ కృషితో గత ఎన్నికల్లో ఈ పంచాయతీని కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకుంది. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కేతేపల్లి మండలం బీమారం వాసి. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యది నకిరేకల్ మండలం నోముల గ్రామం. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్రెడ్డిది నార్కట్పల్లి మండలం నక్కలపల్లి గ్రామం. కాంగ్రెస్ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి, సీపీఎం సీనియర్ నేత చెరుపల్లి సీతారాములు ఇద్దరిదీ చిట్యాల మండలం నేరేడ గ్రామం. ఈ గ్రామాల్లో పోరు పూర్తిగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మ«ధ్యే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిల్లో గత ఎన్నికల్లో నక్కలపల్లి (టీఆర్ఎస్), నేరేడ (సీపీఎం) గెలుపొందాయి. నల్లగొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన వారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉరుమడ్లలో గెలిచిన సర్పంచ్.. ఆ తర్వాత కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య .. ఈ ముగ్గురు నార్కట్పల్లి మండలం, బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన వారే. ఈ గ్రామంలో ఎప్పుడూ కాంగ్రెస్సే విజయం సాధిస్తూ వస్తోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సొంతూరు శాలిగౌరారం మండలం ఉట్కూరు కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఈ సారి ఈ నేతల సొంతూళ్లలో ఎన్నిక చర్చనీయాంశమవుతోంది. ఇవిగో ... మరికొన్ని వీఐపీ పంచాయతీలు ! మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సొంతూరు సంస్థాన్ నారాయాణ్పూర్ మండలం లింగవారిగూడెం. ఈ గ్రామం మొన్నటి వరకు సర్వేల్ పంచాయతీ పరిధిలో ఉండేది. ఇక్కడినుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈసారి లింగవారిగూడెం కొత్త పంచాయతీగా ఏర్పడింది. దీంతో ఈ గ్రామంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మునుగోడు నియోజకవర్గానికే చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సొంత గ్రామం సంస్థాన్నారాయణ్ పూర్. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ గెలుపొందింది. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సొంత గ్రామం దేవరకొండ మండలం రత్యతందా. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ సొంతూరు సూర్యతండా, మరోనేత బిల్యానాయక్ స్వగ్రామం చింతపల్లి మండలం ప్రశాంతపురి తండా. ఈ మూడు తండాలు ఇప్పుడు కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వంద శాతం తండాల జాబితాలో ఉన్నాయి. దీంతో ఇక్కడి ఎన్నిక ఆసక్తి గొల్పుతోంది. నాగార్జునసాగర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి స్వగ్రామం అనుముల, కొత్తగా ఏర్పడిన హాలియా మున్సిపాలిటీలో విలీనం అయ్యింది. టీఆర్ఎస్ నాయకుడు ఎంసీ కోటిరెడ్డి తిరుమలగిరి మండలం బోయగూడెంవాసి. కోటిరెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ పంచాయతీ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లోకి మారడంతో ఈసారి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందా అన్న అంచనాలు మొదలయ్యాయి. జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డిది పెద్దవూర కాగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈసారి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ బలంగానే ఉంటుందని అంటున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్రావు స్వగ్రా మం నిడమనూరు మండలం శాఖాపురం. గత ఎన్ని కల్లో కాంగ్రెస్ ఈ పంచాయతీని ఏకగ్రీవంగా దక్కిం చుకుంది. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్లో ఉండడంతో పోటీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి సొంతూరు సుబ్బారెడ్డిగూడెం. ఇది ఆలగడప పంచాయతీ పరిధిలో ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఈసారి సుబ్బారెడ్డి గూడెం కొత్త పంచాయతీగా ఏర్పాటైంది. మొత్తంగా రాజకీయ ముఖ్యులకు చెందిన సొంతూళ్లను ఈసారి ఏ పార్టీలు గెలుచుకుంటాయి..? ఇక్కడ సర్పంచ్ పీఠం ఎవరి సొంతం కానుందన్న చర్చ జోరుగా సాగుతోంది. -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ హెచ్.ఎల్. దత్తు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో కనకదుర్గమ్మను పలువురు ప్రముఖులు ఆదివారం దర్శించుకున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ప్రతిభరాణి దంపతులు, రాష్ట్ర హైకోర్టు జడ్జి సురే్షకుమార్ కైట్ దంపతులు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర స్పీకర్ సిరికొండ మధుసూదన్చారి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి అదనపు ఈవో వై.వి.అనురాధ ఉన్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు వారికి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. అనంతరం అధికారులు వారికి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం బహుకరించారు. -
తిరుమలలో 30 గంటలుగా క్యూలైన్లోనే..
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునుంచే ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం అయింది. ఆలయంలో వైకుంఠ ద్వారాలను ఆలయ పెద్ద జీయర్ స్వామి తెరిచారు. ధనుర్మాస కైంకర్యాల అనంతరం విఐపి దర్శనం ప్రారంభం అయింది. స్వామి దర్శనానికి విఐపిలు బారులు తీరారు. సామాన్య భక్తులు 30 గంటలుగా క్యూలైన్లో పడిగాపులు పడుతూ చలికి అల్లాడుతున్నారు. నాలుగు కిలోమీటర్ల వరకు భక్తులు క్యూలైన్లో వేచివున్నారు. ఉదయం 8 గంటలకు సామాన్య భక్తులకు వైకుంఠ దర్శనం ప్రారంభం అయింది. భక్తులు భారీగా తరలిరావడంతో వసతి దొరక్క రోడ్లపైనే ఉండాల్సి వచ్చింది. వైకుంఠ ఏకాదశికి 3563 విఐపి టికెట్లను టీటీడీ జారీ చేసింది. విఐపిలకు 4 గంటలుగా శ్రీవారి దర్శనం కొనసాగుతున్నది. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సంతానగౌడర్, హైకోర్టు న్యాయమూర్తులు రామలింగేశ్వర్రావు, శంకర్నారాయణ, సునీల్ చౌదరి,అమర్నాథ్గౌడ్, నాగార్జునరెడ్డి, మాజీ న్యాయమూర్తులు డి.సుబ్రహ్మణ్యం, నూతి రామ్మోహన్, రవీంద్రన్ ఉన్నారు. అలాగే ఏపీ మంత్రులు కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, శిద్ధా రాఘవరావు, సోమిరెడ్డి, విప్లు మేడా మల్లికార్జునరెడ్డి, రామసుబ్బారెడ్డి, కోన రవికుమార్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, మాధవనాయకుడు, సుగుణమ్మ, బొల్లినేని రామారావు, సత్యప్రభ, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రామరెడ్డి ప్రతాప్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలారి ఆదిత్య, అనిల్కుమార్ యాదవ్, మండలి బుద్ద ప్రసాద్, నారాయణస్వామి, రవీంద్రరెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్రెడ్డి, ఎంపీలు అవంతి శ్రీనివాస్, రాయపాటి సాంబశివరావు, సీఎం రమేష్, రామ్మోహన్ నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, సండ్ర వెంకటవీరయ్య, డి.కె.అరుణ ఉన్నారు. టీటీడీ మాజీ చైర్మన్లు కనుమూరి బాపిరాజు, చదలవాడ కృష్ణమూర్తి, సినీ నటులు మోహన్బాబు, సప్తగిరి, అంబరీష్, నిర్మాత బండ్ల గణేష్లు శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు, మాజీ ప్రధాని దేవెగౌడ, చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, మృదంగ వాద్య కళాకారుడు ఎల్లా వెంకటేశ్వర్లు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
స్పెషల్ ట్రీట్మెంట్.. ఇక చాలా కష్టం!
సాక్షి, న్యూఢిల్లీ: వీఐపీ ట్రీట్మెంట్కు ముగింపు పలకాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకు వేసింది. వారి భద్రతా సిబ్బందిని గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర హోంశాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. యూపీఏ హయాంలో 350 మందికి వీపీపీ ట్రీట్మెంట్ కింద ప్రత్యేక భద్రతను కల్పించగా, ఇప్పుడు 457 మందికి ఆ సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) తోపాటు పారామిలిటరీ దళాలు రెండూ కూడా వీరికి భద్రత కల్పిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే గనుక చాలా మంది ఎన్ఎస్జీ సిబ్బందిని వదలుకోవాల్సి ఉంటుంది’ అని ఓ ఉన్నత అధికారి వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యే నేతలకు ముందుగా ఈ నిర్ణయం అమలు చేయబోతున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే సీనియర్ నేత కరుణానిధిలతోపాటు బీజేపీకి చెందిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్లకు భద్రతా సిబ్బందిలో కొత పడే ఆస్కారం కనిపిస్తోంది. ప్రస్తుతం వీరందరికి జ ఫ్లస్ సెక్యూరిటీ కింద 50 మందిని కేటాయించగా, వాళ్లు బయటకు వెళ్లే సమయాలల్లో 35 నుంచి 40 మంది ఎప్పుడూ వెంట ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్య కేవలం 26గా మాత్రమే ఉండేది. అయితే భద్రతా సిబ్బందిని తగ్గించటం.. పెంచటం అనే వ్యవహారంపై పూర్తిగా రాజకీయ స్థితిగతుల మీదే ఆధారపడి ఉంటుందని ఓ అధికారి వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు.. అస్సాం సీఎంగా తరుణ్ గొగోయ్ ఉన్న సమయంలో బ్లాక్ క్యాట్ కమాండోలను ఉపసంహరించుకుంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సర్బనందా సోనోవల్ బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వెంటనే తిరిగి అదే సెక్యురిటీని కేటాయించింది. ఇదే విషయాన్ని ఆ అధికారి ప్రస్తావించారు. గతంలో తమ సిబ్బందిపై నేతలు దురుసుగా వ్యవహరించిన దాఖలాలు కూడా అనేకం ఉన్నాయని ఆయన అంటున్నారు. నేతలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఎక్స్ నుంచి జెడ్ కేటగిరిగా విభజించి వారికి భద్రతా సిబ్బందిని నియమిస్తుంటారు. వై కేటగిరీల్లో ఉన్నవారికి 11 మంది సిబ్బందిని, జెడ్ కేటగిరీల్లో ఉన్న వారికి 30 మంది సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. బాబా రాందేవ్, మాతా అమృతానందమయి, మహంత్ నృత్యగోపాల్ దాస్, సాక్షి మహరాజ్, ముకేష్ అంబానీ-సతీమణి నీతా అంబాని ప్రస్తుతం వీఐపీ ట్రీట్ మెంట్ అందుకుంటుండగా.. ఉత్తర ప్రదేశ్ నుంచే ఎక్కువ మంది ఈ లిస్ట్లో ఉండటం విశేషం. -
ఎయిర్ పోర్టులో వీఐపీల సందడి
మధురపూడి : వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ, వై.ఎస్. జగ¯ŒS మోహ¯ŒS రెడ్డి సోదరి షర్మిల సోమవారం స్పైస్ జెట్ విమాన సర్వీసులో హైదరాబాద్ వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే, పార్టీ కో–ఆరి్డనేటర్ రౌతు సూర్యప్రకాశరావు, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, తానేటి వనిత, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ కార్యదర్శి అడపా శ్రీహరి, పార్టీ అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, వాణిజ్యవిభాగం రాష్ట్ర కార్యదర్శి రాయపురెడ్డి చిన్నా, మహిళా విభాగం రాజమహేంద్రవరం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలు కిరణ్ మోహ¯ŒS రెడ్డి, పార్టీ నాయకులు సుంకర చిన్ని, ఈశ్వర్, రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. బ్రదర్ అనిల్కుమార్కు స్వాగతం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి సోమవారం ప్రముఖుల సందడి ఏర్పడింది. బ్రదర్ అనిల్ కుమార్ జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులో హైదరాబాద్ వెళ్లారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజుబాబు, ఫాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్ సిన్హా, ఫెలోషిప్ జిల్లా అధ్యక్షుడు కోడి మోజేష్, శుభాకర్ శాస్త్రి, జోహ¯ŒS అలో¯ŒS ఆయనను కలిసి స్వాగతం పలికారు. సమాచార హక్కుల చట్టం కమిషనర్ పి. విజయబాబు స్పైస్ జెట్ విమాన సర్వీసులో ఎయిర్పోర్టుకు వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి కాకినాడ వెళ్లారు. సినీ హీరో చరణ్, హీరోయి¯ŒS సమంతలు తిరుగు పయనం ప్రముఖ సినిమా హీరో రామ్చరణ్, హీరోయి¯ŒS సమంతలు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన షూటింగుల్లో వీరు పాల్గొన్నారు. -
‘ఎర్రబుగ్గ’పై బ్యాన్ పడింది
-
‘ఎర్రబుగ్గ’పై బ్యాన్ పడింది
న్యూఢిల్లీ : ఎర్రబుగ్గ కార్లతో అధికారదర్పం ప్రదర్శించే నాయకులు, అధికారులకు చెక్ పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్ ఎరుపురంగు బుగ్గకార్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. దీంతో ప్రతిష్టకు సంకేతంగా భావిస్తూ బుగ్గకార్ల (కార్లపై రెడ్లైట్ల)తో వెలిగిపోతున్న పలువురు వీఐపీలు, ఉన్నతాధికారులు ఇకపై ఈ అవకాశాన్ని కోల్పోనున్నారు. మే 1వ తేదీ నుంచి ఈ ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కేవలం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్ మాత్రమే బుగ్గకార్ల వినియోగించేందుకు అనుమతి ఉంది. ఇంతవరకు జిల్లాధికారులు, జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలు, పార్లమెంటు సభ్యులు, ఇతర వీఐపీలకు ఉన్న ఈ సదుపాయం తొలగిపోనుంది. ప్రధాని మోదీ తాజా నిర్ణయంతో వీఐపీ కల్చర్కి చరమగీతం పాడినట్లు అయింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్లో ఎర్రబుగ్గ కార్ల వినియోగంపై అక్కడ ముఖ్యమంత్రులు బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. కాగా 2002, 2005లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేబినెట్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు ఎర్రబుగ్గ వాహనాలు వాడొచ్చు. అయితే నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఎర్రలైటు వాహనాలను ఉపయోగించేవారికి భారీగా జరిమానాలు విధించేలా మోటారు వాహనాల చట్టానికి సవరణలు తేవాలని సూచించాలంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. నీలిరంగు బీకర్లను అంబులెన్స్, పోలీసులు మాత్రమే అత్యవసర సమయాల్లో ఉపయోగించాలని సుప్రీంకోర్టు గతంలో సూచనలు చేసిన విషయం తెలిసిందే. -
భూమాకు ప్రముఖుల నివాళి
-
అప్పన్న సన్నిధిలో ప్రముఖులు
సింహాచలం : శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈస్టు కోస్టు రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్సింగ్ దంపతులు, ఎల్.పాణిగ్రహి స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. వీరంతా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. -
దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను శుక్రవారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ మురళీమోహన్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు దంపతులు, సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయనిర్మల దంపతులు, పోలవరం ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే బి.ప్రభాకరచౌదరి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే యు.హనుమంతరాయ చౌదరి, గుంతకల్లు ఎమ్మెల్యే జీ.జితేంద్రగౌడ్ కూడా అమ్మను దర్శించుకున్నారు. -
మండలి వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాలు ప్రదానం
అవనిగడ్డ : దివంగత మండలి వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాలను మూడు రంగాల్లోని ప్రముఖులకు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అందజేశారు. స్థానిక గాంధీ క్షేత్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సినీగేయ రచయిత భువనచంద్ర, అంతర్జాతీయ చిత్రకారుడు ఎస్వీ రామారావు, ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాసరెడ్డికి మండల వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాలను బుద్ధప్రసాద్ అందజేశారు. సినీగేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ 1977 దివిసీమ ఉప్పెన సమయంలో తాను మిలటరీలో ఉన్నానని, ఆ నాటి ఘోరకలికి కకావికలమైన దివిసీమను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు మండలి వెంకటకృష్ణారావు ఎంతో శ్రమించారన్నారు. తెలుగుభాషాభివృద్ధికి వెంకటకృష్ణారావు ఎనలేని సేవలు అందించారని, ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు. ఊపిరున్నంతకాలం చిత్రకళను కొనసాగి స్తానని చిత్రకారుడు ఎస్వీ రామారావు చెప్పారు. ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూదివిసీమ దేవాలయాలపై తీసిన లఘు చిత్రం దివి దర్శిని ఉత్తమ లఘు చిత్రంగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. తొలుత మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి ప్రముఖులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ముగ్గురు పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించారు. కేసీపీ సీవోవో జి.వెంకటేశ్వరరావు, మండలి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఏపీ డీజీపీ సాంబశివరావు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనమనంతరం వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని గురువారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, సభ్యులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కార్గ్ దర్శించుకున్నారు. వీరికి డెప్యూటీఈవోలు కోదండరామారావు, హరీంద్రనాథ్, ఓఎస్డీ లక్ష్మీనారాయణ యాదవ్ ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం సినీనటి శ్రియ కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు, భక్తులు ఉత్సాహం చూపారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుటుంబ సభ్యులతో కలసి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. -
గన్నవరం ఎయిర్పోర్టుకు వీఐపీల తాకిడి.
-
గన్నవరం ఎయిర్పోర్టుకు వీఐపీల తాకిడి
గన్నవరం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అతిథులు తరలి వస్తున్నారు. దీంతో గన్నవరం విమానాశ్రయానికి వీఐపీల తాకిడితో కిటకిటలాడుతోంది ఇప్పటికే పలువురు అతిథులు అమరావతి చేరుకోగా, మరికొందరు తరలి వస్తున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ నేత కిషన్ రెడ్డి, నటుడు సుమన్, జపాన్ ప్రతినిథులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోస్లే, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, పలువురు ప్రముఖులు గన్నవరం చేరుకుని అక్కడ నుంచి ఉద్దండరాయపాలెం బయల్దేరారు. ఇక ఇప్పటికే ఏపీ మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు అమరావతి శంకుస్థాపన పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం ఎస్పీజీ ఆధీనంలో ఉండగా, మరో 14వేల మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 25 సీసీ కెమెరాలు, టీవీల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. -
ప్రముఖులకు ప్రకాశం బ్యారేజీ మీదుగా అనుమతి
విజయవాడ : ఏఏఏ పాస్లు ఉన్న ప్రముఖలకు ప్రకాశం బ్యారేజీ మీదుగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంగణానికి ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. సాధారణ వాహనాలకు మాత్రం ఎన్ఆర్ఐ ఆసుపత్రి, మంగళగిరి, నిడుమర్రు మీదగా అనుమతిచ్చారు. మధ్యాహ్నం 12.00 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటల తర్వాత మళ్లీ వాహనాలు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని వెల్లడించారు. గుంటూరు ఐజీ ఎన్ సంజయ్ నేతృత్వంలో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. -
శంకుస్థాపన ప్రాంగణానికి ఏడు మార్గాలు
- వీఐపీలకు రెండు మార్గాలు కేటాయింపు - ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు బంద్ సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకునేందుకు పోలీసు యంత్రాం గం ఏడు మార్గాలను ప్రకటించింది. ఇందులో రెండు పూర్తిగా వీఐపీల కోసం కేటాయించగా ఐదింటిని సాధారణ ప్రజలు వచ్చే వాహనాలకు కేటాయించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏఏఏ పాస్లున్న వాహనాలు వెళ్లాల్సిన మార్గం - గన్నవరం విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలు బెంజిసర్కిల్-కనకదుర్గ వారధి, తాడేపల్లి అండర్పాస్ రోడ్డు, ఎన్టీఆర్ కరకట్ట, న్యూ లాక్ జంక్షన్, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం మీదుగా భీష్మాచార్య రోడ్డు నుంచి శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి. - హైదరాబాద్ నుంచి వైపు వచ్చే వాహనాలు నందిగామ, ఇబ్రహీంపట్నం, బెంజి సర్కిల్, కనకదుర్గ వారధి, ఇస్కాన్ దేవాలయం, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం మీదుగా భీష్మాచార్య రోడ్డు నుంచి ప్రాంగణానికి చేరుకోవాలి. - గుంటూరు వైపు నుంచి వాహనాలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మీదుగా ఖాజా టోల్ ప్లాజా, కేఎల్ యూనివర్సిటీ, భీష్మాచార్య రోడ్డు ద్వారా శంకుస్థాపన ప్రాంతానికి చేరుకోవాలి. ఏఏ, ఏ పాసులు ఉన్న వాహనాలు - గన్నవరం విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలు బెంజిసర్కిల్, కనకదుర్గ వారధి, ఉండవల్లి గుహల మీదుగా కరకట్ట రోడ్డుకు సమాంతరంగా కొత్తగా వేసిన భీష్మాచార్య రోడ్డు ద్వారా ప్రాంగణానికి చేరుకోవాలి. - హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు నంది గామ, ఇబ్రహీంపట్నం, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహల వద్ద బ్రిడ్జి మీదుగా కరకట్టకు సమాం తరంగా కొత్తగా వేసిన రోడ్డు ద్వారా చేరుకోవాలి. - గుంటూరు వైపు నుంచే వచ్చే వాహనాలు నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ ప్లాజా, కేఎల్ యూనివర్సిటీ, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహల వద్ద బ్రిడ్జి మీదుగా కరకట్టకు సమాంతరంగా వేసిన కొత్త రోడ్డు మీదుగా ప్రాంగణానికి చేరుకోవాలి. - విజయవాడ వైపు నుంచి సాధారణ సందర్శకులను తీసుకువచ్చే బస్సులు, లారీలు కనకదుర్గ వారధి, ఎన్ఆర్ఐ ఆస్పత్రి, డాన్బాస్కో స్కూల్, యర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామానికి ఎదురుగా కొత్తగా వేసిన బైపాస్ రోడ్డు మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి. - విజయవాడ వైపు నుంచి వచ్చే చిన్న వాహనాలు కనకదుర్గ వారధి, ఎన్ఆర్ఐ ఆస్పత్రి, మంగళగిరి పాతబస్టాండ్, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, మల్కాపురం, మందడం, తాళ్లాయపాలెం రోడ్డు మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి. - తమిళనాడు, నెల్లూరు, ఒంగోలు వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనదారులు చిలకలూరిపే ట, గుంటూరు బైపాస్ రోడ్డు, పెదకాకాని, కంతే రు, తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు, రా యపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బై పాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంతానికి చేరుకోవాలి. - కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు, హైదరాబాద్ నుంచి వచ్చే లారీలు, బస్సులు వినుకొండ, నర్సరావుపేట బైపాస్, ముప్పాళ్ల, సత్తెనపల్లి-నందిగామ అడ్డరోడ్డు, పెదకూరపాడు, అమరావతి, బోరుపాలెం, తుళ్లూరు బైపాస్, రాయపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి. - హైదరాబాద్, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నందిగామ అడ్డరోడ్డు, పెదకూరపాడు, అమరావతి, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, బోరుపాలెం, తుళ్లూరు బైపాస్రోడ్డు, రాయపూడి, మోదుగులలంక, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి. - కర్నూలు, కడప, అనంతపురం, హైదరాబాద్ నుంచి వచ్చే చిన్న వాహనాలు నర్సరావుపేట బైపాస్, ఫిరంగిపురం, పేరేచర్ల, గుంటూరు ఔటర్రింగ్ రోడ్డు, తాడికొండ రోడ్డు, పెదపరిమి, తుళ్లూరు, రాయపూడి, మోదుగలంకపాలెం మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి. - శంకుస్థాపన రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకలను అనుమతించరు. -
పుష్కరాల్లో వీఐపీల వికృతహేల
సందర్భం భారీ జనసందోహం పోగుపడే పుష్కరాల వంటి సందర్భాల్లో తమ అహాలకంటే, వ్యక్తిగత పుణ్యాన్ని సాధించాలనే యావ కంటే ప్రజా ప్రయోజనాన్ని అన్నిటికంటే ప్రథమస్థానంలో ఉంచాలని గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు గ్రహించాలి. ప్రియమైన ఐ.వై.ఆర్. కృష్ణా రావు గారూ! గోదావరి పుష్కరాల సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు మెల గిన విధానం నన్ను చాలా బాధించింది, వ్యాకులపర్చింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుం బం యాత్రికుల వ్యథపై కాసింత సున్నితంగా వ్యవహరించి ఉంటే పుష్కరాల ప్రారంభ దినాన 30 మంది (పిల్లలతో సహా) తొక్కిసలాటలో అసు వులు బాసిన ఘటన జరిగి ఉండేది కాదు. ఇలాంటి ఘటనల్లో ఒక్కరంటే ఒక్క వీఐపీ ఉన్నా చాలు.. అది భద్రతా ఏర్పాట్లపై, ట్రాఫిక్పై, ఇతర సేవలపై ప్రభావం చూపుతుంది. ప్రముఖ వ్యక్తులు లేకున్నట్లయితే రాజమండ్రిలో పుష్కరాలకు తరలివచ్చిన లక్షలాది మంది యాత్రికులకు పైసేవలన్నీ అందుబాటులో ఉండేవి. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో అతి పెద్ద తొక్కిసలాట సందర్భంగా క్షమా ర్హం కాని ఘటన జరిగినప్పటికీ, స్వయం ప్రకటిత వీఐపీలు తమ కుటుంబాలు, ఇతర పరివారం తోడుగా పుష్కరాల్లో పాల్గొనడానికి కదం తొక్కారని వార్తలు. యాత్రికులు సొం త ఖర్చులు పెట్టుకోవాల్సివచ్చింది కానీ, తమ ప్రైవేట్ ఖర్చులను చెల్లించడానికి ప్రభుత్వ ఖజానా అన్ని వేళలా పుష్కరాల్లో అందుబాటులో ఉందన్న చందాన వీఐపీలు పుష్కరాలకు పోటెత్తారు. నాకు అర్థమయిందేమిటంటే, రాజమండ్రి చేరుకుని పుష్కర జలాల్లో మునగడానికి ఉత్తరాన తుని నుంచి, దక్షి ణాన ఏలూరు వరకు యాత్రికులు భారీ సంఖ్యలో క్యూ కట్టి వేచి ఉన్నారు. ఇంత భారీ జనసందోహం మున్నె న్నడూ కనీవినీ ఎరుగనిది. మామూలు పరిస్థితుల్లో అయితే బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా.. అతడు లేదా ఆమె క్యూలో నిల్చుని వేచి చూడటానికి సిద్ధపడితే తప్ప, ఈ స్వయం ప్రకటిత వీఐపీల ప్రవేశంపై నిషేధం విధించేది. వీఐపీలను కూడా ఇతర యాత్రికులలాగే భావించి వారు మామూ లుగా పుష్కరాల్లో పాలు పంచుకునేలా చేసేది. దురదృష్ట వశాత్తూ ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో కనీస బాధ్య తతో అయినా వ్యవహరించినట్లు కనిపించలేదు. పైన పొందుపర్చిన చిత్రాన్ని చూసినట్లయితే, తొక్కిస లాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా గవర్నర్ తన కుటుంబంతోపాటు రాజమండ్రిని సం దర్శించి ప్రత్యేకంగా రూపొందించిన వీఐపీ ఘాట్లో మునకవెయ్యడానికే సిద్ధపడినట్లు కనిపిస్తుంది. మనలాం టి ప్రజాస్వామ్యవ్యవస్థలో, కొంతమందిని వీఐపీలుగా గుర్తించి ప్రజాధనంతో వారికి అవసరమైన దానికంటే ఎక్కువ స్థలాన్ని వారు ఆక్రమించడానికి అనుమతించడం జరిగితే అలాంటి పరిస్థితి ఎవరికైనా అసహ్యం కలిగించ దా? పుష్కరాల సందర్శన కోసం రాజమండ్రి రావడానికి గవర్నర్ తన కుటుంబ సభ్యులతో కలసి హెలికాప్టర్ను ఉపయోగించారని నాకర్థమైంది. పూర్తిగా వ్యక్తిగతమైన ఇలాంటి సందర్శనలకు ఎవరు డబ్బు చెల్లిస్తున్నారు? గవ ర్నర్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు కారు. ప్రభు త్వ ఖజానా నుంచి వారికోసం ఎలాంటి చెల్లింపులు చేయ కూడదు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం జవాబుదారీత నాన్ని తప్పక పాటించాలి. తమకు తాము పుణ్యం సంపా దిం చుకోవడం కోసం వీఐపీలు చెల్లింపులు జరిపేలా ప్రభు త్వ పన్ను చెల్లింపుదారును ఒత్తిడికి గురిచేయకూడదు. అలాంటి పుణ్యసాధన కోసం తాము ప్రజలను అసౌకర్యా నికి గురి చేయకూడదని వీఐపీలు తెలుసుకోవాలి. ఒక రాష్ట్ర గవర్నర్ పాత్ర ఏమిటన్నది రాజ్యాంగంలో చక్కగా నిర్వచించారు. ఆయన పాత్రకు పరిమితులు న్నాయి. రాజ్యాంగంలో తమకు నిర్దేశించని పాత్రలను వారు చేపట్టనే కూడదు. పైగా, ఈ తొక్కిసలాట ఘటన మధ్యనే సింగపూర్ నుంచి అత్యున్నత స్థాయి బృందం రాజమండ్రిని సంద ర్శించిందని విన్నాను. ఈ బృందం సందర్శన కూడా యాత్రికులకు మరిన్ని ఇబ్బందులను కలుగజేసి ఉంటుం దని నా నమ్మకం. ప్రజలకు అసౌకర్యం కలిగించటమే కాక, ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారే వీఐపీలను ఇలాంటి పరిమాణాలకు పూర్తి బాధ్యత వహించేలా చేసి, వారిపై ఆరోపణలను బుక్ చేసే రోజొకటి వస్తుంది. టైమ్స్ టీవీ న్యూస్ చానల్లో వీఐపీల ఉపద్రవాన్ని విస్తృతంగా కవర్ చేయడం నా దృష్టికి వచ్చింది. కింది లిం కులో దాన్ని మీరు కూడా చూడవచ్చు. https://www.youtube.com/watch?t=75&v=WlLD0kF7DfQ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆర్నాబ్ గోస్వామి సంధించిన ప్రశ్నలకు నేరుగా సమా ధానం చెప్పకూడదు. ఎందుకంటే ఆ ఘటనకు సంబం ధించి వాస్తవంగానే ఎలాంటి సమాధానాలు లేవు. 2014 అక్టోబర్లో హుద్ హుద్ తుపాను సమయంలో ముఖ్య మంత్రి విశాఖపట్నంలో ఉండిపోయిన ఘటన అసాధారణ మని, అది సహాయ చర్యలను వేగవంతం చేయడంలో ఎంతగానో తోడ్పడిందన్న భావం కలిగించడానికి సీఎం అప్పట్లో ప్రయత్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే సహా య చర్యలకు నేతృత్వం వహించడం అభినందనీయమే కానీ బహుశా సీఎం తెలుసుకోని విషయం ఏమిటంటే, విశాఖపట్నంలోని 90 శాతం అధికారులు ఆ సమయంలో సీఎం వద్ద హాజరు వేయించుకోవడంలోనే కాలం గడిపేశా రు. పైగా నిజంగా తుపాను ప్రభావానికి గురైన గుడిసెవా సులను అధికారులు పలకరించలేకపోయారు. ఈ అధికా రుల్లో చాలామంది 5 స్టార్ హోటల్లో బస చేశారు. తుపా ను ముగిసిన తొమ్మిది నెలల తర్వాత కూడా పేదలలో కేవలం 15 శాతం మంది మాత్రమే తుపాను సహాయాన్ని అందుకోగలిగారు. మిగతావారు ఈనాటికీ సహాయం కోసం వేచి చూస్తూనే ఉంటున్నారు. హుద్ హుద్ తుపాను అనంతరం ప్రధానమంత్రి విశాఖపట్నం సందర్శన ఎంత ఇబ్బంది కలిగించిందంటే, బాధితులకు ఉద్దేశించిన ఆహార సామగ్రి మొత్తంగా పాడయిపోయింది, అధికారుల అప్ర మత్తత కూడా దారి తప్పింది. ఇలాంటి సందర్భాల్లో తమ అహాలకంటే, వ్యక్తిగత పుణ్యాన్ని సాధించాలనే యావకంటే ప్రజా ప్రయోజనాన్ని అన్నిటికంటే ప్రథమస్థానంలో ఉంచాలన్న సందేశాన్ని గవ ర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు గ్రహిస్తారని ఆశిస్తు న్నాను. ప్రచారం పట్ల ఆత్రుత, రాజకీయ ప్రయోజనాలకు కూడా వీరు దూరంగా ఉంటేనే మంచిది. తాము ప్రజాస్వా మ్యంలో భాగమే కానీ జమీందారీ వ్యవస్థలో భాగం కాదన్న విషయాన్ని వారు తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. తన ఘోరమైన, అతిశయించిన వీఐపీ సంస్కృతిని భారతదేశం అధిగమించే రోజొకటి వస్తుందని నేను ఆశిస్తు న్నాను. ప్రజాస్వామ్యంలో వీఐపీలకు చోటు లేదు. ఈ ఉత్తరాన్ని గవర్నర్, ముఖ్యమంత్రుల ముందు ఉంచాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో వారు ఎలాంటి పాత్రలను నిర్వహించాలనే విషయంపై నా ఉత్తరం ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నాను. తొక్కిసలాటపై న్యాయవిచారణపై ఇకనయినా దృష్టి పెడతారని ఆశిస్తాను. ఈ ఘటనలో పోలీసులు, జూనియర్ అధికారుల పాత్రపైనే కాదు.. వీఐపీల పాత్రపై కూడా దృష్టి పెట్టగలరని ఆశిస్తున్నాను. (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావుకు భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్ శర్మ రాసిన లేఖ) ఈఎఎస్ శర్మ (వ్యాసకర్త మొబైల్: 9866021646) ఈ మెయిల్:eassarma@gmail.com. -
వీఐపీలూ... మీరు రావద్దు..
భద్రాచలం : రాజమండ్రి ఘటన నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే శని,ఆదివారాల్లో ఖమ్మం జిల్లా భద్రాచలానికి వీఐపీలు రావద్దని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. ఈ రెండు రోజుల్లో మంత్రులు, వీఐపీలు పుష్కరస్నానానికి రాకుండా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. వీఐపీలు రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, సుమారు ఐదు లక్షల మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారు రాకుండా చూడాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. శని, ఆదివారాల్లో భద్రాద్రికి భక్తజనం పోటెత్తనున్నారని, సుమారు 10 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. భద్రతా ఏర్పాట్ల నిర్వహణలో మంత్రి తుమ్మల, కలెక్టర్, ఎస్పీ నిగమగ్నమై ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను అధికారులు రప్పిస్తున్నారు. మిథిలా స్టేడియంలో ప్రత్యేక దర్శనాల నేపథ్యంలో కూడా వీఐపీలు ఆ రెండు రోజులు రావద్దు.. అని అధికారులు సూచిస్తున్నారు. -
వీవీఐపీ 'బాబు' ల కోసం వంగిన నిబంధనలు
హైదరాబాద్: ఏమంత అర్జెంటు పనుందని అందరికంటే ముందుగా చంద్రబాబు పుష్కర స్నానం చేశారు? ఏదైనా అధికారిక కార్యక్రమానికి హాజరు కావాల్సిఉందా? లేదా ఇంకేదైన ముఖ్యమైన పనుందా? పుష్కరాల ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచే రాజమండ్రిలో మకాం వేసిన ఆయన.. పన్నెండు రోజులూ అక్కడే ఉంటానని ప్రకటించారు. అలాంటప్పుడు తీరిక సమయంలోనే భక్తుల రద్దీ తగ్గినప్పుడో.. అదీకాదంటే వీఐపీ ఘాట్ లోనో స్నానం చేస్తే పోయేదికదా? ఇంత మంది చనిపోయేవారు కాదుకదా? అని ఎన్డీటీవీ తన కథనంలో ప్రశ్నించింది. మొత్తం వ్యవహారంలో చంద్రబాబు వీవీఐపీ హోదాలో నిబంధనలను గోదాట్లో కలిపిన తీరును ఎండగట్టింది. 'గోదావరి పుష్కరాలు ప్రారంభమైననాడే 29 మంది అమాయకుల (వారిలో 26 మంది మహిళలు) ప్రాణాలు బలిగొన్నపాపం చంద్రబాబుదే..' నిన్నవరకూ భక్తులూ, రాజకీయ పక్షాలూ మాట్లాడిన ఈ వాస్తవాన్నే ఇప్పుడు జాతీయ మీడియా కూడా చెబుతోంది. అంతేకాదు.. వీవీఐపీ హోదాలో బాబు చేసిన ఘోర తప్పిదాలే అనంత విషాదానికి కారణమని ఎన్డీటీవీ ప్రముఖంగా పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రచారం కల్పించినట్లే రాజమండ్రిలోని ప్రధాన ఘాట్లు అన్నింటివద్దా జనం రద్దీ విపరీతంగా ఉంది. జన సమూహ నిర్వహణ (క్రౌడ్ మేనేజ్మెంట్) నిపుణులు చెప్పినదాన్నిబట్టి మంగళవారం పుష్కర ఘాట్ వద్ద ప్రతి 10 నిమిషాలకు అప్పటికే ఉన్న భక్తులకు తోడు కొత్తగా మరో 10 వేల మంది తోడయ్యారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో కలిసి పుణ్యస్నానం, పితృదేవతలకు సంతర్పణం తదితర కార్యక్రమాలకు దాదాపు రెండు గంటలపాటు సాగింది.. ఆ సమయంలో భక్తులెవరిని నదిలోకి అనుమతించలేదు. అంటే సీఎం గడిపిన నిమిష నిమిషానికి భక్తుల సంఖ్య అమాంతం పెరుగుతూనేపోయింది. అలా రెండు గంటలపాటు.. దాదాపు లక్షన్నర మంది వన్ వే ట్రాఫిక్ లాగా పోగయ్యారు. పుష్కరిణిలోకి తోసుకురావడం తప్ప మరో దారి లేదక్కడ. బాబు వెళ్లిపోగానే భక్తులను అనుమతించడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు. మంత్రులకు ఇంగితం లేకున్నా అధికారులకైనా సోయి ఉండక్కరలేదా? అనే ప్రశ్నలకు వినిపించే సమాధానం.. 'వీఐపీల కోసం నిబంధనలు సైతనం వంగిపోవాల్సిందే' అని. రూ.2 వేల కోట్లతో పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేస్తామన్న చంద్రబాబు ప్రకటనలు అవాస్తవాలని, ఘాట్ల వద్ద టాయిలెట్టుగానీ, మెడికల్ క్యాంపులు గానీ, చివరికు గుక్కెడు మంచినీళ్లు కూడా లేకుండాపోయిన వైనాన్ని తెలిపింది. నిపుణులు వివరణను బట్టి.. జన సమూహం కదులుతున్నప్పుడు చదరపు మీటరుకు గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉండేలా చూడటం రక్షణాత్మక చర్యల్లో ప్రధాన అంశం. నిన్న రాజమండ్రి విషాదంలో ఒక చదరపు మీటరుకు కనిష్ఠమే ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. అంటే కనీసం గాలి పీల్చికునే అవకాశంకూడా మృగ్యమైన స్థితన్నమాట. -
మళ్లీ రెచ్చిపోయిన వీఐపీలు!
అధికారంతో అహం తలకెక్కినవారిని సుమతీ శతకకారుడు ‘అధికార రోగపూరిత బధిరాంధక శవం’తో పోల్చాడు. జనం ఓట్లతో సంక్రమించిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారిపైనే స్వారీచేసే వర్తమాన నాయకగణాన్ని చూసివుంటే ఆయన ఇంకెంత ఆగ్రహించేవాడో ఊహకందదు. వీఐపీల పేరిట ఎక్కడంటే అక్కడ దర్పాన్ని ప్రదర్శించే నాయకుల గురించి మీడియా గతంలో అనేకసార్లు బయట పెట్టింది. కాస్తయినా సిగ్గూ శరమూ లేకుండా రోడ్లపైన ఎర్రబుగ్గ కార్లలో వెళ్తూ సామాన్య పౌరులకు ఎంతో అసౌకర్యం కలిగించే నేతలకు సుప్రీంకోర్టు సైతం చీవాట్లు పెట్టింది. గణతంత్ర వ్యవస్థలో రాచరిక దర్పాన్ని ప్రతిబింబించే ప్రతీకలుండటం తగదని చెప్పింది. ‘అధికార రోగం’ ఎలాంటి జబ్బో కానీ... ఏంచేసినా ఆ బాపతు నేతలను అది వదలడం లేదు. గత మూడురోజుల్లో వెల్లడైన ముగ్గురు నేతల ప్రవర్తనను గమనిస్తే అది ఎప్పటికీ వదిలే రోగం కాదేమోనన్న అనుమానం కలుగుతుంది. ఈ ముగ్గురిలో ఒకరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, మరొకరు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజూ కాగా...మరొకరు డీఎంకే నేత స్టాలిన్. మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శితోపాటు అమెరికా వెళ్తూ ఆ అధికారి కోసమని ఎయిరిండియా విమానాన్ని 57 నిమిషాలపాటు ఆపించారని ఆరోపణలు వచ్చాయి. విమానం ఎక్కబోతుండగా అమెరికా వీసాను ఇంటి దగ్గర మరిచిపోయి వచ్చిన సంగతిని ఆ అధికారి గుర్తించారట. అది వచ్చేవరకూ విమానం ఆపించారని ప్రయాణికులు చెబుతుంటే, అది నిజంకాదని ఫడణవీస్ కొట్టిపారేస్తున్నారు. కానీ, సీఎం ఆదేశంతోనే విమానాన్ని ఆపవలసి వచ్చిందని ఎయిరిండియా డ్యూటీ మేనేజర్ పై అధికారులకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. మరో ఘటన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూకు సంబంధించింది. ఆయన, జమ్మూ-కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్సింగ్, మరో అధికారి లేహ్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కడానికి రాగా అందులో ఖాళీ లేదట. అంతే...అందులో అప్పటికే కూర్చుని ఉన్న ఒక ఐఎఫ్ఎస్ అధికారి కుటుంబసభ్యులు ముగ్గుర్ని దించేశారు. యధావిధిగా ఈ ఉదంతంలో కూడా తమ తప్పేమీ లేదని కిరణ్ రిజిజూ చెబుతున్నారు. 11.40కి బయల్దేరే విమానం కోసం తాము 10.20కే విమానాశ్రయానికి వచ్చామని, కానీ ఆ సమయాన్ని ముందుకు జరపడంవల్ల అప్పటికే విమానం బయల్దేరబోతున్నదని తెలిసి నిర్మల్సింగ్ ఆగ్రహించగా... తప్పు గ్రహించి తమకు చోటిచ్చారని అంటున్నారు. ఈ క్రమంలో మరో ముగ్గుర్ని దించేసిన సంగతి తెలియదంటున్నారు. అయితే, అసలు కేంద్రమంత్రి చివరి నిమిషంలో టిక్కెట్టు కొన్నారని తాజాగా బయటపడింది. మూడో ఉదంతం డీఎంకే నేత స్టాలిన్ది. చెన్నైలో కొత్తగా ప్రారంభమైన మెట్రో రైల్లో ప్రయాణించిన స్టాలిన్ తనకు సమీపంగా నిల్చున్న యువకుణ్ణి పక్కకు వెళ్లమని చెబుతూ చెంపదెబ్బ కొట్టారు. అది యూ ట్యూబ్లో వచ్చి సంచలనం కలిగించాక సమీపంలో ఉన్న మహిళా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాడన్న ఉద్దేశంతో చేత్తో నెట్టానని స్టాలిన్ సంజాయిషీ ఇచ్చారు. చెంపపై చేయివేసి ఎవరినైనా నెట్టడం సాధ్యమేనా అన్న సంగతి పక్కనబెట్టి మహిళా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే పోలీసులకు అప్పగించాలి తప్ప తానే దౌర్జన్యం చేయడం సరైందేనా? ఈ ఉదంతాలన్నిటా తాము నాయకులం...ఏంచేసినా చెల్లుబాటవుతుందనే అహంకారమే కనిపిస్తుంది. ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా చాన్నాళ్లనుంచి నష్టాలు చవిచూస్తున్నది. దాన్ని లాభాల బాట పట్టించడమెలాగో తెలియక పాలకులు తలలు పట్టుకుంటున్నారు. మిగిలిన సమస్యల మాటెలా ఉన్నా ప్రయాణికులంటే కనీస గౌరవం లేకపోవడం, చెప్పిన సమయానికి వారిని గమ్యస్థానాలకు చేర్చలేకపోవడం ఆ సంస్థ ఇబ్బందుల్లో కూరుకుపోవడానికి ముఖ్య కారణమని వారు గుర్తించలేకపోతున్నారు. పైగా అలాంటి సమస్యలు ఏర్పడటానికి ప్రధానంగా తామే బాధ్యులమని తెలుసుకోలేకపోతున్నారు. ఒక ముఖ్యమంత్రి హుకుం జారీచేశారని అమెరికా వెళ్లే విమానాన్ని దాదాపు గంటసేపు ఆపడం... మరో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎంల కోసం టిక్కెట్లు కొని కూర్చున్న ప్రయాణికులనే దించేయడం ఆ సంస్థ నిర్వహణా తీరును వెల్లడిస్తుంది. ఎయిరిండియాకు నిరుడు రూ. 5,500 కోట్ల నష్టం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు అన్ని రూట్లలోనూ అది నష్టాలే చవిచూస్తున్నదని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అవసరమైనంతమంది ప్రయాణికులు లేకపోవడంతో కొన్ని రూట్లలో వెళ్లే విమానాలను తరచు రద్దు చేయాల్సివస్తున్నదని ఈమధ్య వెలువడిన కథనం చెబుతోంది. చెప్పిన సమయానికే విమానాలు బయల్దేరతాయన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రయాణికుల్లో ఎయిరిండియా కలిగించలేకపోతున్నది. అందువల్లే ఆ సంస్థ తిరిగి పుంజుకోవడానికి రాగల పదేళ్లలో ప్రభుత్వం నుంచి రూ.30,000 కోట్లు ఇవ్వాలని ఆమధ్య నిర్ణయించారు. సమస్య ఎక్కడవస్తున్నదంటే ఈ నేతలంతా ఎయిరిండియాను నిలబెడుతున్నది తామేననుకుంటున్నారు. అందుకోసం ఆ సంస్థ సిబ్బంది తమకు కృతజ్ఞులై ఉండాలనీ, తాము చెప్పినట్టల్లా నడుచుకోవాలనీ ఆ నేతలు భావిస్తున్నట్టు కనబడుతోంది. లేహ్ ఉదంతంలో విమానం పెలైట్ కిందకు దిగి వీఐపీల కారణంగానే సమస్యలొస్తున్నాయని ఆగ్రహిస్తే డిప్యూటీ సీఎం ఎదురుదాడి చేయడమే కాక... అతనిపైనా, విమానం సిబ్బందిపైనా ఫిర్యాదుచేస్తానని బెదిరించడం దీన్నే ధ్రువీకరిస్తున్నది. ఈ రెండు ఉదంతాల్లోనూ నివేదిక సమర్పించమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను ప్రధాని ఆదేశించారని చెబుతున్నారు. అందువల్లే కావొచ్చు... పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. అంత మాత్రాన ఇకపై అంతా సవ్యంగా ఉంటుందనుకోలేం. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాము వీఐపీలమని, ఏం చేసినా చెల్లుతుందనుకునే భావన నేతల్లో నరనరానా జీర్ణించుకుపోయింది. ముందు అది వదలగొడితే తప్ప పరిస్థితి దారికి రాదు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వీఐపీ సంస్కృతిని సంపూర్ణంగా తుడిచిపెట్టే చర్యలకు శ్రీకారం చుట్టాలి. అలా చేయగలిగితే పరిస్థితులు కాస్తయినా చక్కబడతాయి తప్ప ‘ఇన్స్టెంట్’ పశ్చాత్తాపాలూ...ఆదరాబాదరా నివేదికల వల్ల ఒరిగేది శూన్యమని గుర్తించాలి. -
తిరుమలకి వీఐపిల తాకిడి
-
తిరుమలకు వీఐపీల తాకిడి
తిరుమల : తిరుమలకు వీఐపీల తాకిడి పెరిగింది. సోమవారం ఉదయం కూడా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలు అందచేశారు. రెండు రాష్ట్రాల్లో విభేదాలున్నా.... ప్రజలందరూ కలిసి సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు సీఎం రమేష్ తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు స్వామివారికి మెక్కుచెల్లించుకోవడానికి వచ్చినట్లు పయ్యావుల కేశవ్ చెప్పారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
చిత్తూరు: శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి, టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. (తిరుపతి) -
తిరుమలకు విఐపీల తాకిడి!
-
గేట్లు విరిచి.. క్యూలైన్లోకి దూసుకెళ్లారు..
తిరుమల : ఏకాదశి దర్శనం కోసం తిరుమలలో భక్తులు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. టీటీడీ సామాన్య భక్తులను పట్టించుకోకుండా వీఐపీలకు పెద్దపీట వేస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు గురువారం ఉదయం లేపాక్షి సర్కిల్ వద్ద వీఐపీలను అడ్డుకుని నిరసన తెలిపారు. మరోవైపు వెంకన్నను ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులతో కొండ కిక్కిరిసిపోయింది. గత రాత్రి 8 గంటలకే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని లైన్లు నిండిపోయాయి. టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తగా క్యూల్లోకి భక్తులను అనుమతించలేదు. దీంతో సహనం కోల్పోయిన భక్తులు శంకుమిట్ట కాటేజ్ వద్ద క్యూ గేట్లను విరిచారు. మరికొందరు రాళ్లతో తాళాలను పగుల గొట్టి, క్యూలోకి దూసుకెళ్లారు. క్యూ కట్టిన ఇనుప కంచె కూడా విరిగి కిందపడ్డాయి.క్యూలోకి దూసుకెళ్లారు. పోలీసు, భద్రతా సిబ్బంది అడ్డుచెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు. -
తిరుమలలో వీఐపీల సందడి
-
'మాకు సామాన్య భక్తులే విఐపిలు'
తమకు సామాన్య భక్తులే విఐపిలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాల రావు గురువారం హైదరాబాద్లో తెలిపారు. రాష్ట్రంలోని దేవాదాయ భూ ములు లీజు వ్యవహారంపై సాధ్యమైనంత త్వరలో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. దేవాదాయాలకు చెందిన ఆస్తులు ద్వారా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. -
వీఐపీలకు టిక్కెట్లు.. భక్తులకు ఇక్కట్లు
-
వీఐపీలకు టిక్కెట్లు.. భక్తులకు ఇక్కట్లు
భక్తుల నిరసనలతో హోరెత్తిన తిరుమల ఏకధాటిగా ఏడు గంటలపాటు సాగిన వీఐపీ దర్శనం ఇష్టానుసారం రూ. 300 టికెట్లు కేటాయింపు చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించిన భక్తులు తమకు కూడా టికెట్లు కేటాయించాలని ధర్నా టికెట్లు అమ్ముకుని ఉంటే విచారణ చేయిస్తాం: మంత్రి సీఆర్ అధికార యంత్రాంగాన్ని ప్రశంసించిన టీటీడీ చైర్మన్ సాక్షి, తిరుమల: గోవింద నామంతో మార్మోగాల్సిన తిరుమలగిరి శనివారం భక్తుల ధర్నాలు, ఆందోళనలు, నినాదాలతో హోరెత్తింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పోటెత్తిన భక్తులకు దర్శనం కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రంగా విఫలమైంది. సామాన్య భక్తులను గాలికి వదిలేసి వీఐపీలకు ఎర్రతివాచీలు పరిచింది. తామంతా శుక్రవారం మధ్యాహ్నం నుంచీ క్యూలో నిరీక్షిస్తున్నా పట్టించుకోకుండా వీఐపీలకు మాత్రం అరగంటలోపే దర్శనం కల్పిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రముఖుల పేరుతో వీఐపీ టికెట్లు నల్లబజారులో విక్రయించారని ఆరోపించారు. అయినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా చైర్మన్ కార్యాలయం నుంచి రూ.300 టికెట్లు అప్పటికప్పుడే ఇష్టానుసారంగా కేటాయించారు. తమవారిని సుపథంనుంచి ఆలయానికి అనుమతించారు. దీంతో భక్తులు ఆగ్రహంతో చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించారు. టీటీడీ చైర్మన్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమకు కూడా రూ.300 టికెట్లు కేటాయించాలంటూ గంటపాటు ధర్నా చేశారు. ఏడుగంటలపాటు వీఐపీలకే దర్శనం: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం ఓ కేంద్రమంత్రి, 11మంది రాష్ట్ర మంత్రులు, సుమారు వందమంది వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాగా, ఇంతకంటే రెట్టింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు తరలివచ్చారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల హైకోర్టులకు చెందిన 14 మంది న్యాయమూర్తులూ వచ్చారు. వీరిలో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, రాష్ట్ర మంత్రులు పార్థసారథి, ప్రసాదరావు, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, కొండ్రు మురళి, డొక్కా మాణిక్య వరప్రసాద్, పితాని సత్యనారాయణ, దానం నాగేందర్, సునీత ల కా్ష్మరెడ్డి, ఏరాసు ప్రతాప్రెడ్డి, శ్రీధర్బాబు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్, తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ, కార్పొరేట్ ఒత్తిళ్లకు తలొగ్గిన టీటీడీ సిబ్బంది సుమారు ఎనిమిదివేల వీఐపీ టికెట్లను జారీ చేశారు. ఫలితంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రారంభమైన రూ.1000 టికెట్ల వీఐపీ దర్శనం ఉదయం 6.54 గంటల వరకు సాగింది. కాలిబాటల్లో నడిచివచ్చి శుక్రవారం నుంచి క్యూలో వేచిఉన్న దివ్యదర్శనం టికెట్ల భక్తులను, క్యూలో వేచి ఉన్న సర్వదర్శనం భక్తులనూ ఆ తర్వాత దర్శనానికి అనుమతించారు. వారితోపాటు మరొక క్యూలో టీటీడీ ఉద్యోగులను, ముందుగా రిజర్వు చేసుకున్న రూ.300 టికెట్ల భక్తులను కూడా అనుమతించారు. దీంతో క్యూల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గతంలో నాలుగు గంటలకు పరిమితమైన వీఐపీ దర్శనం ఏకంగా ఏడుగంటలు సాగడం ఇదే తొలిసారి. దీంతో ధనుర్మాస చలిలో వేచి ఉన్న భక్తులు నానా కష్టాలు పడ్డారు. రాత్రి క్యూలలో కనీస సదుపాయాలు కూడా కరువై, ఉదయం ముఖం కడుక్కోవడానికి నీళ్లు కూడా దొరక్క నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంటిపిల్లలు, వృద్ధుల కష్టాలు చెప్పనలివికాదు. దీంతో భక్తులు, సిబ్బంది మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగి తీవ్ర స్థాయిలో గందరగోళం ఏర్పడింది. 7,958 వీఐపీ టికెట్లు మాత్రమే ఇచ్చాం: జేఈవో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 7,958 వీఐపీ టికెట్లు మాత్రమే ఇచ్చామని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఏకాదశి కోసం మొత్తం 25వేలు, ద్వాదశి దర్శనం కోసం 15వేల టికెట్లు ఇచ్చామన్నారు. ఆలయంలో స్థలాభావం, సమయాభావం వల్ల శ్రీవారి దర్శన విషయంలో అందరనీ సంతృప్తి పరచలేమని చెప్పారు. ఏకాదశి దర్శనం అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేసిందని చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ కితాబిచ్చారు. ఏకాదశి దర్శనం కోసం టికెట్లను అమ్మినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తామని దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య చెప్పారు. దర్శనం లభించనివారికి కోపం రావడం, ఆరోపణలు చేయడం సహజమేననన్నారు. టీటీడీ అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని ఆయన ప్రశంసించారు. కాలిబాట భక్తులకు ఉచిత లడ్డూ పంపిణీ శ్రీవారి దర్శనానికి కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఉచిత లడ్డూ పంపిణీని టీటీడీ శనివారం ప్రారంభించింది. ఏకాదశి దర్శనం కోసం వచ్చిన 25వేల మంది వరకు అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో దివ్యదర్శనం టికెట్లు ఇవ్వగా... తొలి రోజు సుమారు 10వేల మంది భక్తులు ఉచిత లడ్డూను అందుకున్నారు. అలాగే కాలిబాటల్లో నడిచి వచ్చే భక్తులకు సర్వదర్శనం భక్తులతో సమానంగా రూ.10 చొప్పున రూ.20 చెల్లించి రెండు సబ్సిడీ లడ్డూలు కూడా పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. స్వర్ణరథంపై వైకుంఠనాథుని విహారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం స్వర్ణ రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమలేశుడు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 9 గంటల నుంచి 11 వరకు స్వర్ణ రథోత్సవం జరిగింది. అశేష భక్త జనం గోవిందా.. గోవిందా.. అంటూ స్వర్ణ రథాన్ని భక్తి ప్రపత్తులతో లాగుతూ తన్మయత్వం చెందారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ పాల్గొన్నారు. -
వెంకన్న దర్శనానికి క్యూ కట్టిన వీఐపీలు
తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వీఐపీల తాకిడి పెరిగింది. స్వామి వారి దర్శనానికి రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులు, సినీనటులు క్యూ కట్టారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డికే అరుణ, పార్దసారది, దానం నాగేందర్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రసాద్ కుమార్, బొత్స సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, కొండ్రుమురళి ఉన్నారు. వీరితోపాటు చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి తిరుమలకు విచ్చేశారు. అలాగే 32 మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలు తిరుమలలోనే ఉన్నారు. వీళ్లే కాకుండా 12 మంది ఐపీఎస్లు,10 మంది ఐఏఎస్లు దర్శనానికి వచ్చారు. ఇంకా తమిళనాడు,కర్నాటకా, మహారాష్ట్రా,పాండిచ్చేరికి చెందిన ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో వచ్చారు. వారికి ఏర్పాట్లు చేయడంలో టీటీడి అధికారులు తలమునకలయ్యారు. టీటీడీ అధికారులు వీఐపీల సేవలో తరిస్తుంటే మరోవైపు సామాన్య భక్తులు వెంకన్న దర్శనానికి పడిగాపులు పడుతున్నారు. -
వీఐపీల ముసుగులో ఎర్రబుగ్గ కారు వాడుతున్న నలుగురి అరెస్ట్
వీఐపీల ముసుగులో ఎర్రబుగ్గ కారును ఉపయోగిస్తున్న నలుగురు వ్యక్తులను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలపై నీలి బుగ్గ, సైరన్, ఫ్లాషర్స్, ఎర్రబుగ్గను ఉపయోగించకూడదని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించిన నేపథ్యలో గోవా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల అత్యున్నత పదవుల్లో కొనసాగే వ్యక్తులు తప్ప మరెవరూ ఎర్రబుగ్గ వాహనాలను ఉపయోగించడంపై సుప్రీం నిషేధం విధించింది. విలాసవంతమైన కార్లపై ఎర్రబుగ్గ ఉండటంతో తనిఖీ చేశామని.. అనుమానస్పదం వ్యక్తుల తీరు కనిపించడంతో వాహనాలను సీజ్ చేసి వారిని అరెస్ట్ చేశాం అని పోలీసులు తెలిపారు. హర్యానా, ఢిల్లీలకు చెందిన వీఐపీలమని టాటా సఫారీ, టాయోటా ఫార్చునర్ వాహనాల్లో తిరుగుతున్న వారిని విచారించి.. వారిపై చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు. అధికారిక వాహనాలపై ఎర్రబుగ్గలను తీసివేసిన వారిలో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తొలి వరసలో ఉన్నారు. -
చాయ్వాలాలే వీఐపీలు
ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పాల్గొననున్న ఓ బహిరంగ సభలో నగరానికి చెందిన చాయ్వాలాలు వీఐపీలుగా హాజరుకానున్నారు. ఆదివారం నాడు జరగనున్న ఈ సభ కోసం నగరంలోని సుమారు పదివేల మంది చాయ్వాలాలకు బీజేపీ వీఐపీ పాస్లు జారీ చేసింది. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో జరగనున్న ఈ సభకు దక్షిణ ముంబైలోని చాయ్ విక్రేతలను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించామని బీజేపీ నాయకుడు రాజ్ పురోహిత్ గురువారం చెప్పారు. రాజకీయాల్లోకి రాకమునుపు నరేంద్ర మోడీ ఓ చాయ్వాలాగా తన జీవితాన్ని ప్రారంభించారని అన్నారు. నిరాడంబరమైన మోడీ జీవనశైలిని కాంగ్రెస్ ఎగతాళి చేసిందని, దేశాన్ని అమ్ముకోవడం కంటే చాయ్ విక్రయించడం ఎంతో మేలని పురోహిత్ పేర్కొన్నారు. అందుకే ఈ మెగా ర్యాలీలో టీ విక్రేతలే ప్రత్యేక అతిథులని చెప్పారు. వీఐపీ ఆహ్వానపత్రాలు అందుకున్న అనేకమంది టీ విక్రేతలు ఆదివారం నాడు తమ దుకాణాలు మూసేసి మహాగర్జన ర్యాలీలో పాల్గొనాలని నిర్ణయించారు. టీ విక్రేతల కోసం ఓ ప్రత్యేక ఆవరణ ఏర్పాటు చేస్తామని, అక్కడే వారు కూర్చొని మోడీ ప్రసంగం వింటారని పురోహిత్ చెప్పారు. నగరంలోని చాయ్వాలాలే కాకుండా ఈ సభను విజయవంతం చేసేందుకు భారీగా జనాన్ని సమీకరించే ఏర్పాట్లలో బీజేపీ నగరశాఖ తలమునకలైంది. పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారని పురోహిత్ చెప్పారు. సభను గూర్చి మీడియాలోని అన్ని వేదికల నుంచి ప్రచారం చేస్తున్నామని బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్ చెప్పారు. సభకు రావాలనుకునే వారి కోసం ఓ ప్రత్యేక ఫోన్ నంబర్ను ఏర్పాటు చేశామని, దానికి ‘మిస్’ కాల్ ఇస్తే చాలని, వారిని వాహనంలో సభకు తీసుకువెళతామని శేలార్ వివరించారు. మిస్ కాల్ అందిన వెంటనే తమ కార్యకర్త తిరిగి ఆ నంబర్కు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తారని చెప్పా రు. ఈ సభలో మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే, శాసనమండలిలో ప్రతిపక్ష నేత వినోద్ తావ్డే ప్రసంగిస్తారని శేలార్ చెప్పారు. ఇదిలా ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్రూఢీ మూడు వారాలుగా ఇక్కడే తిష్టవేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
ఇష్టారాజ్యంగా ఎర్రబుగ్గ కారులు వాడద్దు: సుప్రీం
-
బాసరలో వీఐపీలకే పెద్దపీట
భైంసా/బాసర, న్యూస్లైన్ :‘మేము ఎంతో దూరం నుంచి వచ్చాం. అమ్మవారిని దర్శించుకునేందుకు లైన్లో ఉంటే దొబ్బేస్తున్నారు. పక్కద్వారం నుంచి ఎవరినో తీసుకువచ్చి ప్రశాంతంగా పూజలు చేయిస్తున్నారు. మాలాంటి సామాన్య భక్తులు గంటల తరబడి లైన్లో నిలబడలేక ఇబ్బంది పడుతున్నాం’. అంటూ నల్గొండ జిల్లా నేరేడిపల్లికి చెందిన బుద్దారెడ్డి అమ్మవారి దర్శనం అనంతరం తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం గగనమవుతోంది. ఉత్సవాలు నిర్వహించే ప్రతీసారి ఇక్కడి సిబ్బంది వీఐపీల సేవలో తరించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దర్శనం కోసం వచ్చిన భక్తులకు సౌకర్యాలు లేక, కనీసం మంచి నీళ్లు దొరకక అసహానానికి గురవుతున్నారు. పిల్లల రోధనలు.. శుక్రవారం వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరి కనిపించారు. ఈయేడాది భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేయడంలో సిబ్బంది విఫలమయ్యారు. క్యూలైన్లలో చంటిపాపలు, పిల్లల రోధనలు ప్రతిధ్వనించినా వారిని పక్క నుంచి పంపలేకపోతున్నారు. వయస్సు మీద పడ్డవారు నిలబడలేక వరుసల్లో నుంచి బయటకు వచ్చారు. లోపలికి వెళ్లి గంటల తరబడి నిలబడలేక ప్రాంగణంలోనే అమ్మవారిని మొక్కుకున్నారు. చాలా మంది పిల్లలు లైన్లో దాహం అంటూ ఏడుస్తూ కనిపించారు. బాసర క్షేత్రానికి పాదయాత్రగా వచ్చే భక్తులను ప్రత్యేక దర్శనానికి అనుమతించడం లేదు. ఎంతో దూరం నుంచి పాదయాత్రగా వచ్చిన వారు కూడా అందరితో కలిసి గంటల తరబడి నిలబడ్డాకే అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీలకే ప్రాధాన్యం శుక్రవారం అమ్మవారి మూలనక్షత్రం కావడంతో అక్కడికి వచ్చే వారిలో వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యం కనిపించింది. తూర్పు ద్వారం నుంచి వారిని అనుమతించారు. ఇలా వీఐపీల రాకతో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మూలనక్షత్రం కావడంతో రెండు రోజుల నుంచి ఆలయ సిబ్బంది సామాన్యులకు వసతి అతిథి గృహాలను కూడా కేటాయించడం లేదు. ముందుగానే గదులన్ని బుకింగ్ అయ్యాయని సమాధానం ఇస్తున్నారు. ప్రైవేటు లాడ్జిలకు వె ళ్లాలంటూ భక్తులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. తొక్కేస్తున్నారు.. సామాన్య భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు టెంకాయలు, పసుపు, కుంకుమ అగర్బత్తులు పవిత్రంగా తీసుకువస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చే సామాన్యుల పసుపు, కుంకుమలు, అగర్బత్తులు,టెంకాయ లు కొట్టే స్థలంలో కాళ్ల కింద తొక్కేస్తున్నారు. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా యి. పవిత్రమైన పసుపు, కుంకుమలను హిం దూ సంప్రదాయ ప్రకారం పక్కన పెద్ద పాత్రలు ఉంచి అందులో వేయాలి. అయినా ఆలయ సిబ్బంది ఇవేమి పట్టించుకోవడం లేదు. బోర్డులకే పరిమితం... ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఇక్కట్లు తలెత్తకుండా నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం వద్ద నోపార్కింగ్ బోర్డును పక్కన పారేసి ద్విచక్రవాహనాలను నిలిపి ఉంచుతున్నారు. బస్సులు ఎక్కే ప్రాంతంలో నీరు నిలిచినా శుభ్రం చేయడం లేదు. ఇక భక్తులు ఎక్కువగా వచ్చే రోజుల్లోనూ ఆలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత సేవలు రైల్వే సమయాలకు అనుకూలంగా అందిస్తున్నారు. శుక్రవారం భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పటికీ ఈ బస్సును వినియోగించలేదు. ఒక పక్క వర్షం కురుస్తున్నా మధ్యాహ్నం సమయంలో ఈ బస్సును పార్కింగ్ స్థలంలోనే నిలిపివేశారు. దీంతో వర్షంలోనే తడుస్తూ భక్తులు వెళ్లాల్సి వచ్చింది. స్నాన ఘట్టాల వద్ద... ఇక స్నాన ఘట్టాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతియేటా బాసరకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. స్నాన ఘట్టాల వద్ద ఉన్న షెడ్ల పైకప్పులు తుప్పుపట్టినా కొత్తవి ఏర్పాటు చేయలేదు. పైకప్పు లేక వర్షానికి భక్తులు తడవాల్సి వచ్చింది. ఇక గంగమ్మ తల్లికి ఇక్కడికి వచ్చే భక్తులంతా నైవేద్యం సమర్పిస్తారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి వంటలు చేసేందుకు స్థలం లేక బట్టలు మార్చుకునే గది గోడకు ఆనుకుని నైవేద్యాలు వండుతూ మహిళా భక్తులు ఇబ్బందులు పడ్డారు. మందు బాబుల జల్సాలు... పవిత్ర గోదావరి నది ఒడ్డున మందుబాబుల జల్సాలు కొనసాగుతున్నాయి. స్నాన ఘట్టాల వద్ద మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదిని నిర్మించారు. ఈ గది స్లాబుపైకి ఎక్కితే తాగిపారేసిన ఖాళీ బీరు సీసాలు కనిపించాయి. గంగమ్మ తల్లి పక్కనే మందుబాబులు జల్సాలు చేసుకుంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఆగడాలు కొనసాగుతున్నా సిబ్బంది, ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా స్నాన ఘట్టాలే మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. పట్టించుకోవడం లేదు బాసరకు వచ్చే సామాన్య భక్తులను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏది కొందామన్న అన్ని రెట్టింపు ధరలే. కనీసం అమ్మవారిని దర్శించుకుందామన్న ఆ కోరిక తీరడం లేదు. ఎంతో భక్తితో ఇక్కడికి వస్తే మాలాంటి సామాన్యులను పట్టించుకోవడం లేదు. ఏర్పాట్లలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. కనీసం చంటి పాపలతో వచ్చిన మహిళలు, వృద్ధులను కూడా లోపలికి అనుమతించడం లేదు. - ధర్మారెడ్డి, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా