World Cup Cricket
-
సెంచరీతో రికార్డ్ సాధించిన భద్రాచలం యువతి త్రిష
-
పురుషులతో సమానంగా ప్రైజ్మనీ
దుబాయ్: వచ్చే నెలలో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ విజేతకు భారీ ప్రైజ్మనీ దక్కనుంది. పురుషుల వరల్డ్కప్ విజేతతో సమానంగా... మహిళల ప్రపంచకప్ చాంపియన్కు నగదు బహుమతి ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయించింది. యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ నుంచే దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు ఐసీసీ మంగళవారం వెల్లడించింది. దీంతో మహిళల టి20 వరల్డ్ కప్ విజేతకు రూ. 19.60 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది. గత ప్రపంచకప్ నగదు బహుమతితో పోల్చుకుంటే... ఇది 134 శాతం ఎక్కువ కావడం విశేషం. 2023లో నిర్వహించిన మహిళల టి20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్మనీ రూ. 20.52 కోట్లు (2.45 మిలియన్ అమెరికన్ డాలర్లు) కాగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ. 66.67 కోట్ల(7,958,080 అమెరికన్ డాలర్లు)కు పెంచారు. దీంతో రానున్న మెగాటోర్నీలో రన్నరప్గా నిలిచిన జట్టుకు రూ.9 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది. సెమీఫైనల్స్లో ఓడిన రెండు జట్లకు కూడా భారీగా నగదు బహుమతి అందుకోనున్నాయి. ‘వచ్చే నెల జరగనున్న టి20 ప్రపంచకప్ నుంచి మహిళలకూ పురుషులతో సమానంగా నగదు బహుమతి ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ఇది క్రీడా చరిత్రలోనే సరికొత్త నిర్ణయం’అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదే జరిగిన పురుషుల టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.20 కోట్ల నగదు బహుమతి లభించింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా టి20 ప్రపంచకప్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదిక మార్చాల్సి వచ్చింది. -
భారీ విజయం... భావి ప్రయాణం...
శనివారం రాత్రి పొద్దుపోయాక... అద్భుతమే జరిగింది. గతంలో అనేకసార్లు ఊరించి ఉసూరుమనిపించినట్టే ఈసారీ ఫలితం అటూ ఇటూగా ఉంటుందేమోనని భయపడుతున్న క్రీడాభిమానుల సందేహాలు తుదిఘట్టంలో పటాపంచలయ్యాయి. పదిహేడేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. భారత క్రికెట్ జట్టు విజయపతాకం ఎగరేసింది. పొట్టి క్రికెట్ విధానంలో తొలి ప్రపంచ కప్ను 2007లో గెలిచిన భారత జట్టు... మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తొమ్మిదో ప్రపంచ కప్ను అందుకుంది. మరెక్కడా లేనంత భారీగా, హంగులూ ఆర్భాటాలతో ఆకర్షణీయంగా, అత్యంత సంపన్నంగా టీ20 లీగ్ను జరిపే భారత్ మరోసారి ఆ ఫార్మట్లో జగజ్జేతగా నిలిచింది. జూన్ 29న వెస్టిండీస్లోని బార్బడోస్లో ఆఖరు దాకా ఉత్కంఠగా సాగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్– 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత జట్టు సాధించిన విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా, న్యూయార్క్లో కొత్తగా వెలసిన స్టేడియమ్ మొదలు వివిధ కరేబియన్ దీవుల్లో సాగిన ఈ వరల్డ్ కప్ కొత్త ఉత్తేజం తెచ్చింది. చివరకు కప్ గెలుపుతో కోచ్గా ద్రావిడ్కూ, టీ20ల నుంచి రోహిత్ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజాలకూ తీయటి వీడ్కోలు దక్కింది.గతంలో ఎన్నో విజయాలు సాధించినా... ఫార్మట్ ఏదైనప్పటికీ ప్రపంచ కప్ విజేతగా నిలవడమనేది ఎప్పుడూ ప్రత్యేకమే. 1983లో తొలిసారిగా కపిల్దేవ్ సారథ్యంలోని భారత జట్టు వన్డేలలో వరల్డ్ కప్ సాధించినప్పటి నుంచి సామాన్య ప్రజానీకంలో సైతం క్రికెట్ పట్ల, ప్రపంచ కప్ పట్ల పెరిగిన ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత 20 ఓవర్ల పొట్టి క్రికెట్ వచ్చాక, 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సేన తొలి టీ20 వరల్డ్ కప్ మనం దక్కించుకోవడంతో ఇక ఆకాశమే హద్దయింది. 2011లో మరోసారి వన్డేల్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్నాం. లెక్కలు తీస్తే... మనం టీ20 వరల్డ్ కప్ గెలిచి 17 ఏళ్ళయితే, అసలు ఏదో ఒక ఫార్మట్లో ప్రపంచ కప్ గెలిచి 13 ఏళ్ళవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే ఏదో ఒక టోర్నీలో విజేతగా నిలిచి, స్వదేశానికి ట్రోఫీ పట్టుకొచ్చి కూడా కనీసం 11 ఏళ్ళవుతోంది. 2013లో ఇంగ్లండ్లో ‘ఛాంపియన్స్ ట్రోఫీ’ తర్వాత ఐసీసీ పోటీల్లో మనకు మళ్ళీ ట్రోఫీలు దక్కలేదు. ఇన్నాళ్ళకు ఆ కొరత తీరింది. కొన్నేళ్ళుగా విజయావకాశాలు పుష్కలంగా ఉన్న ఫేవరెట్గా భారత క్రికెట్ జట్టు రకరకాల టోర్నీలలో బరిలోకి దిగుతోంది. కానీ, ప్రతిసారీ ఏదో ఒక దశలో విఫలమవుతోంది. కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ల జోడీ సంగతికే వస్తే, ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్’లో జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్ళినా ఫలితం దక్కలేదు. చివరకు ఏడు నెలల క్రితం గత నవంబర్లో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ మంచి ఫామ్లో ఉన్న భారత జట్టు ఆఖరి ఘట్టంలో అహ్మదాబాద్లో తడబడింది. ఆ రెండుసార్లూ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ తాజా టీ20 వరల్డ్ కప్లో సైతం మొదటి నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకువచ్చిన మన జట్టు శనివారం నాటి ఫైనల్లో ఒక దశలో ఓటమి అంచుల దాకా వెళ్ళిపోయింది. ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు 30 బంతుల్లో 30 పరుగులే చేయాలి. పైగా 6 వికెట్లున్నాయి. ఆ పరిస్థితుల్లో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్, ఆల్రౌండర్ హార్దిక్పాండ్యా తెలివైన ఆట తీరు, బౌండరీ దాటుతున్న బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకొని ప్రత్యర్థి బ్యాట్స్మన్ను అవుట్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ మ్యాచ్ దిశను మార్చేశాయి. ఎట్టకేలకు సమష్టి స్ఫూర్తితో ఓటమి కోరల నుంచి కూడా విజయాన్ని అందుకొనే కళలో భారత్ ఆరితేరింది. జట్టు అవసరాలకు తగ్గట్టు భిన్నమైన ఆట శైలిని ఆటగాళ్ళు అవలంబించడం నేర్చుకున్నారు. పోయిన పాత ఫామ్ను మళ్ళీ అత్యవసరమైన ఫైనల్లో అందుకొని, అవతల వికెట్లు పడిపోతున్నా తడబడకుండా పిచ్ వద్ద పాతుకుపోయి, కోహ్లీ 76 పరుగులు చేసిన తీరు అందుకు మచ్చుతునక. రోహిత్ శర్మ సారథ్యం, అక్సర్ పటేల్ లాంటి ఆల్రౌండర్ల ప్రదర్శన, కీలకమైన ఫైనల్లో ప్రమాదకరంగా మారిన క్లాసెన్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాట్స్మన్లను ఔట్ చేసిన యువ సీమర్ అర్ష్దీప్ సింగ్ పరిణతి... ఇలా అన్నీ కలిస్తేనే ఈ ప్రపంచ విజేత పట్టం. దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన ఆట... అందులోనూ వరల్డ్కప్ విజయం... అర్ధరాత్రి దాటినా సరే దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చి మరీ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకొన్నది అందుకే! మన దేశంలోనే కాదు... దేశదేశాల్లో పెరుగుతున్న భారత క్రికెట్ క్రీడాభిమానులకూ ఇది పండుగ వాతావరణం తెచ్చింది. ఒక్కమాటలో, మన దేశం ఇప్పుడు క్రికెట్ సూపర్పవర్. ఒకప్పుడు 1970లు – 80లలో బలమైన బ్యాటింగ్, బౌలింగ్ సేనతో వీరవిహారం చేసిన వెస్టిండీస్ జట్టుతో ఇప్పుడు భారత్ ఆటగాళ్ళను విశ్లేషకులు పోలుస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. మరి ఇక్కడ నుంచి మన క్రికెట్ ప్రయాణం ఎలా ముందుకు సాగనుందన్నది ఇక కీలకం. కోచ్ ద్రావిడ్ మొదలు కీలక ఆటగాళ్ళ దాకా పలువురి రిటైర్మెంట్తో ఒక శకం ముగిసింది. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ళపై గతంలో పెట్టుబడి పెడితేనే ఇప్పుడీ ఫలితాలు వచ్చాయని మర్చిపోరాదు. భవిష్యత్తే లక్ష్యంగా జట్టుకు కొత్త రక్తాన్ని ఎక్కించాలి. కొత్తగా కోచ్ బాధ్యతలు చేపట్టనున్న గౌతమ్ గంభీర్ ఖాళీ అవుతున్న కీలక స్థానాల భర్తీపై దృష్టి పెట్టాలి. మ్యాచ్లు ఆడకున్నా ఈ వరల్డ్కప్ జట్టులో భాగమైన యశస్వీ జైస్వాల్ సహా పలువురు ప్రతిభావంతుల్ని ఏరి, ఇకపై మరింత సానబెట్టాలి. కొద్ది నెలల్లోనే 2025లో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ట్రోఫీ నాటికి సర్వసన్నద్ధం కావాలి. ఆ పునర్నిర్మాణానికి తాజా విజయం ఓ బలమైన పునాది. -
ఫైనల్ లో బోల్తా పడ్డ కుర్రోళ్ళు
-
ఆ రోజు మీటింగ్లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస..
ఇటీవల జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఏకంగా అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్లారు. మరికొందరు టీవీలకు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయి లైవ్ చూడటం మొదలెట్టసారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ళ' (Satya Nadella) సైతం మ్యాచ్ మిస్ చేసుకోలేదని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఏఐ ప్రాజెక్టుకి సంబంధించి ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు, అయినప్పటికీ మధ్య మధ్యలో ఫైనల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం, విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటూనే ఉన్నట్లు ఆంగ్ల మీడియా సంస్థ న్యూయార్కర్ వెల్లడించింది. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ను కూడా రాత్రంగా మేల్కొని మరీ చూసినట్లు సత్య నాదెళ్ల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్సీఎల్ - ఎందుకిలా? ఈ ఇంటర్వ్యూలోనే టీమ్ ఇండియా ఓటమికి ప్రతీకారంగా ఆస్ట్రేలియాను కొంటారా? అంటూ సత్య నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. Next time you think your job is more important than cricket, remember that this man had $12 billion on the line and the potential for a very public egg-on-his-face, but that didn’t stop him from updating an uncomprehending audience about Kohli’s batting https://t.co/dSZP9Wn9Dk pic.twitter.com/EPspe36BwU — Sriram (@sriramin140) December 2, 2023 -
ప్రపంచకప్ క్రికెట్ను ఎంతమంది చూశారంటే..
భారతదేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ చాలాఎక్కువ. గల్లీలో క్రికెట్ ఆడే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఇండియా మ్యాచ్ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతారు. అదీ ఫైనల్ మ్యాచ్ అంటే మరీ ఎక్కువ. అందులోనూ వరల్డ్కప్ ఫైనల్స్ అంటే చెప్పనక్కర్లేదు. ఇటీవల ఉత్కంఠభరితంగా జరిగిన తుదిపోరులో భారత ఆటగాళ్లు పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు రికార్డుస్థాయిలో ఈసారి వరల్డ్కప్ టోర్నమెంట్ను వీక్షించినట్లు తెలిసింది. ఏకంగా 51.8 కోట్ల మంది భారతీయులు ఇటీవల జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్ను తిలకించినట్లు డిస్నీ సంస్థ తెలిపింది. ఐసీసీ ఆధ్యర్యంలో 48 రోజుల పాటు జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ను 51.8 కోట్ల మంది భారతీయులు వీక్షించారని డిస్నీ చెప్పింది. హాట్స్టార్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా 5.9 కోట్ల మంది ఫైనల్ మ్యాచ్ను చూసి రికార్డు నెలకొల్పినట్లు కంపెనీ వివరించింది. 2024 నుంచి 2027 వరకు భారతదేశంలో జరిగే అన్ని ఐసీసీ టోర్నమెంట్లను ప్రసారం చేయడానికి దాదాపు రూ.25 వేల కోట్లు చెల్లించి డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులను కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇదీ చదవండి: 15 ఏళ్ల బాలుడు.. రూ.100 కోట్ల కంపెనీ.. ఎలా సాధ్యమైందంటే.. పన్నెండేళ్ల తర్వాత భారత్లో ఆడిన ఐసీసీ ఫైనల్ టోర్నమెంట్ను 51.8 కోట్ల మంది చూసినట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఇండియా(బీఏఆర్సీ) నిర్ధారించింది. దాదాపు 42,200 కోట్ల నిమిషాల టీవీ స్క్రీన్ టైం నమోదైందని బీఏఆర్సీ తెలిపింది. కేవలం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను 13 కోట్ల మంది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ను 8 కోట్ల మంది, ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ను 7.5 కోట్ల మంది వీక్షించారని వివరించింది. -
CWC 2023 Final: పోరాట యోధులు.. మ్యాచ్ ఓడినా, మనసులు గెలుచుకున్నారు..!
తాడేపల్లి : వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ పై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 2023 వరల్డ్ కప్లో మన క్రికెటర్లు మంచి పోరాట పటిమ చూపించారు. మ్యాచ్ మనకు అనుకూలంగా లేకపోయినా వారి క్రీడా స్ఫూర్తి, యావత్ దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఇండియా టీమ్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది అంటూ సీఎం వైస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. My admiration and respect for our warriors of the Indian Cricket Team for their incredible journey in the 2023 Cricket World Cup. Although the match didn’t go in our favour, their spirit, sportsmanship and innumerable moments through this journey have greatly inspired the entire… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 19, 2023 -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: బీజేపీ ట్వీట్కు కాంగ్రెస్ రీట్వీట్..!
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్లో జరుగుతోంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-భారత్ నేడు తలపడుతున్నాయి. మ్యాచ్ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అటు.. టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ టీమిండియాకు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్కు కాంగ్రెస్ పార్టీ చమత్కారంగా రీట్వీట్ చేసింది. 'కమాన్ టీమిండియా.. మీపై నమ్మకం ఉంది' అని పేర్కొంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. 'నిజమే.. జితేగా ఇండియా' అంటూ ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ రీట్వీట్ చేసింది. అయితే.. ఇండియా అనే అనే పదంపై ఇటీవల పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే. బీజేపీని ఓడించే లక్ష్యంతో దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడంపై రాజకీయంగా పెద్ద వివాదం నడిచింది. ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ పార్టీలు పేర్లు పెట్టుకోవడంలో నిబంధనలు విధించలేమని ఎలక్షన్ కమిషన్ కూడా తెలిపింది. ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టిన తర్వాత జరిగిన జీ-20 సమావేశంలో దేశం పేరును కేంద్రం భారత్గా పేర్కొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వాన పత్రంలోనూ భారత్ ప్రెసిడెంట్ అని సంబోధించింది. దీనిపై కేంద్రంలోని బీజేపీని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కలకలం.. ఫ్రీ-పాలస్తీనా టీషర్ట్తో మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి -
వరల్డ్ కప్ ఫైనల్, దేశంలో బిజినెస్ అప్ & డౌన్
ప్రపంచకప్ ఫైనల్లో అహ్మాదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియాలో హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన భారత్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ సందర్భంగా భారత్ - ఆస్ట్రేలియా వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ ప్రభావం భారత్లోని పలు వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దేశంలో ఆయా రంగాలకు చెందిన వ్యాపార విభాగాలకు వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. వాటిల్లో యూపీఐ లావాదేవీలు డల్ మ్యాచ్ జరిగే సమయంలో యూపీఐ చెల్లింపులతో సహా డిజిటల్ లావాదేవీలు విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. జనమంతా మ్యాచ్ ల కోసం టీవీలకు అతుక్కుపోయే అవకాశం ఉండడంతో.. UPI ట్రాన్సాక్షన్లు బాగా తగ్గిపోతాయని పలు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గత వరల్డ్ కప్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా UPIలపై తీవ్రప్రభావం పడింది. కేవలం ఫుడ్ ఆర్డర్, హోటళ్ల బిజినెస్ మాత్రం జరిగింది. గత ఏడాది దీపావళి సమయంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నంత సేపు UPI లావాదేవీలు పూర్తిగా క్షీణించాయి. కింద ఇచ్చిన గ్రాఫ్ లో ఆ వివరాలను గమనించవచ్చు. ముఖ్యంగా కొహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు UPIలు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాయి. మ్యాచ్ పూర్తయిన తర్వాత లావాదేవీలు సాధారణంగా మారాయి. అమ్మకాలలో హెచ్చుతగ్గులు ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో ఆన్లైన్ విక్రయాలు హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. టీమ్ జెర్సీలు, ఫ్లాగ్లు, క్రికెట్కు సంబంధించిన వస్తువులకు డిమాండ్ పెరగవచ్చు. మరోవైపు, ప్రజలు మ్యాచ్పై దృష్టి సారించడంతో క్రీడలకు సంబంధించిన ఆన్లైన్ విక్రయాలు భారీగా క్షీణించే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్లు ప్రపంచ దేశాల్లో ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో బెట్టింగ్ యాప్స్ వినియోగం విపరీతంగా ఉంటుంది. మ్యాచ్ ఫలితం లేదా గేమ్లోని వివిధ ఈవెంట్లపై బెట్టింగ్పై ఎక్కువ మొగ్గు చూపుతారు. బెట్టింగ్ కార్యకలాపాల పెరుగుదల, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ , బెట్టింగ్ సెక్టార్లో నిర్వహించే వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఎంగేజ్మెంట్ వరల్డ్ కప్ ఫైనల్ కొనసాగుతున్న ఈ సమయంలో ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫారమ్లు వినియోగించేందుకు ఔత్సాహికులు పోటీపడుతుంటారు. జరుగుతున్న లైవ్ వరల్డ్ కప్ మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వినియోగదారులు ఫాంటసీ లీగ్లలో పాల్గొనే అవకాశం ఉంది. కొత్త జట్లను ఏర్పాటు చేసి ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు. బిజినెస్ ప్రమోషన్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను లేదా సేవలను అందించేందుకు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బాగా ఉపయోగపడుతుంది. టీవీలు, యాప్స్, లైవ్ స్ట్రీమ్లలో యూజర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల్ని, సేవల ప్రచారానికి ఉపయోగిస్తుంటాయి. రెస్టారెంట్లు, బార్లపై ప్రభావం ప్రపంచ కప్ ఫైనల్ను ప్రదర్శించే రెస్టారెంట్లు, బార్లలో మ్యాచ్ను తిలకించేందుకు ఎగబడుతుంటారు. ఆ సమయంలో మద్యం, బిర్యానీతో పాటు ఇతర ఆహార వంటకాలు విపరీతంగా అమ్ముడు పోతుంటాయి. సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ వరల్డ్ కప్ ఫైనల్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈవెంట్ జరిగే సమయంలో భారీగా ఎత్తున నెటిజన్లు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను సమర్థవంతంగా ఉపయోగిస్తుంటారు. మ్యాచ్ ఫలితాల్ని బట్టి మీమర్స్.. మీమ్స్ క్రియేట్ చేసి వారి వారి సోషల్ మీడియా అకౌంట్ల ఫాలోవర్స్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. -
WC Final: టీమిండియాకు మోదీ శుభాకాంక్షలు
అహ్మదాబాద్: క్రికెట్ వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కప్లో భారత్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్రీడా స్ఫూర్తిని నిలబెట్టాలని కోరారు. 140 కోట్ల మంది భారత్ టీంకు అండగా నిలబడతారని అన్నారు. All the best Team India! 140 crore Indians are cheering for you. May you shine bright, play well and uphold the spirit of sportsmanship. https://t.co/NfQDT5ygxk — Narendra Modi (@narendramodi) November 19, 2023 అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. న్యూజిలాండ్పై విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకుంది. అటు.. సౌతాఫ్రికాపై గెలిచి ఆసిస్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఇదీ చదవండి: భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ! -
ఆస్ట్రేలియాతో ఫైనల్ సమరానికి రెడీ
-
స్లో పిచ్?..టీమిండియానే ఫేవరెట్
-
భారత్ గెలుస్తుందని అభిమానుల ధీమా
-
తిరుపతిలో క్రికెట్ ఫీవర్
-
దేశమంతటా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్
-
భారత్ విజయం కోరుతూ ట్రాన్స్జెండర్ల ప్రత్యేక పూజలు
భారత్.. ప్రపంచకప్ గెలవాలని ప్రతి భారతీయుడు అభిలషిస్తున్నాడు. ఇందుకోసం దేశంలోని పలు ప్రాంతాల్లో తమ నమ్మకాలకు అనుగుణంగా పలువురు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ట్రాన్స్జెండర్ల సంఘం సభ్యులు ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు తమ చేతులతో టీమ్ ఇండియా సభ్యుల ఫోటోలను పట్టుకుని పూజల్లో పాల్గొన్నారు. టీమ్ ఇండియాకు శుభం జరగాలని అభిలషిస్తూ శంఖం ఊదారు. భగవంతునికి హారతులిచ్చారు. డప్పులు వాయిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ల ప్రార్థనలను భగవంతుడు స్వీకరిస్తాడని, వారి పూజలు ఫలవంతమవుతాయిని స్థానికులు చెబుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు వరుసగా 10 విజయాలతో ఫైనల్స్కు చేరుకుంది. అయితే ఆస్ట్రేలియా తన మొదటి రెండు మ్యాచ్లలో ఓడిపోయినా, తరువాత జరిగిన అన్ని మ్యాచ్లను గెలుచుకుంది. ప్రపంచకప్లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చూపాయి. అటువంటి స్థితిలో ఈరోజు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: సూర్యునికి అర్ఘ్యమిస్తూ మ్యాచ్ చూసే మహత్తర అవకాశం! -
ఇండియా టీం కి ఆల్ ది బెస్ట్ చెబుతున్న హీరో వెంకటేష్
-
వరల్డ్ కప్ లో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా
-
టీం ఇండియాకి భారీ షాక్..ఎందుకంటే..!
-
రివేంజ్ పక్కా అంటున్న భారత్..!
-
వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ కు మొదలైన కౌంట్ డౌన్
-
World Cup 2023: గట్టెక్కిన బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: ప్రపంచకప్లో అద్భుతం సాధిద్దామనే లక్ష్యంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి సెమీఫైనల్ రేసు నుంచి ని్రష్కమించింది. ఈ ప్రపంచకప్లో టాప్–7లో నిలిస్తేనే 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశం ఉండటంతో బంగ్లాదేశ్కు ఎనిమిదో మ్యాచ్ కీలకంగా మారింది. మాజీ విశ్వవిజేత శ్రీలంకతో జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గి మళ్లీ గెలుపుబాట పట్టింది. గెలుపుదారిలో వికెట్లను చేజార్చుకోవడం కలవరపెట్టినా... చివరకు బంగ్లాదేశ్ నుంచి విజయం మాత్రం చేజారలేదు. ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంకపై బంగ్లాదేశ్కిదే తొలి విజయం కావడం విశేషం. 280 పరుగుల లక్ష్య ఛేదనలో నజ్ముల్ హొస్సేన్ షాంతో (101 బంతుల్లో 90; 12 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (65 బంతుల్లో 82; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించారు. చివర్లో తౌహిద్ హ్రిదయ్ (7 బంతుల్లో 15 నాటౌట్; 2 సిక్సర్లు) నిలబడి బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. చరిత్ అసలంక (105 బంతుల్లో 108; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లు తంజిమ్ హసన్ (3/80), షోరిఫుల్ (2/51), షకీబుల్ హసన్ (2/57) సమష్టిగా వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లాదేశ్ 41 పరుగులకే ఓపెనర్లు తంజిద్ హసన్ (9), లిటన్ దాస్ (23) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నజ్ముల్, షకీబ్ అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. మూడో వికెట్కు 169 పరుగులు జోడించారు. 210 వద్ద షకీబ్, మరో పరుగు తర్వాత నజ్ముల్ నిష్క్రమించారు. మహ్ముదుల్లా (22), ముషి్ఫకర్ (10), మిరాజ్ (3) స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో బంగ్లాదేశ్కు ఇబ్బంది ఎదురైంది. అయితే తౌహిద్, తంజిమ్ జట్టును విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) తంజిమ్ 41; పెరీరా (సి) ముష్ఫికర్ (బి) షోరిఫుల్ 4; మెండిస్ (సి) షోరిఫుల్ (బి) షకీబ్ 19; సమరవిక్రమ (సి) మహ్ముదుల్లా (బి) షకీబ్ 41; అసలంక (సి) లిటన్ (బి) తంజిమ్ 108; మాథ్యూస్ (టైమ్డ్ అవుట్) 0; ధనంజయ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) మిరాజ్ 34; తీక్షణ (సి) సబ్–అహ్మద్ (బి) షోరిఫుల్ 21; చమీర (రనౌట్) 4; రజిత (సి) లిటన్ (బి) తంజిమ్ 0; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 279. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–135, 5–135, 6–213, 7–258, 8–278, 9–278, 10–279. బౌలింగ్: షోరిఫుల్ 9.3–0–51–2, టస్కిన్ 10–1–39–0, తంజిమ్ హసన్ 10–0–80–3, షకీబ్ 10–0–57–2, మిరాజ్ 10–0–49–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తంజిద్ (సి) నిసాంక (బి) మదుషంక 9; లిటన్ దాస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 23; నజ్ముల్ (బి) మాథ్యూస్ 90; షకీబ్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 82; మహ్ముదుల్లా (బి) తీక్షణ 22; ముష్ఫికర్ (బి) మదుషంక 10; తౌహిద్ (నాటౌట్) 15; మిరాజ్ (సి) అసలంక (బి) తీక్షణ 3; తంజిమ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 23; మొత్తం (41.1 ఓవర్లలో 7 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–17, 2–41, 3–210, 4–211, 5–249, 6–255, 7– 269. బౌలింగ్: మదుషంక 10–1–69–3, తీక్షణ 9–0–44–2, కసున్ రజిత 4–0–47–0, చమీర 8–0–54–0, మాథ్యూస్ 7.1–1–35–2, ధనంజయ డిసిల్వా 3–0–20–0. ప్రపంచకప్లో నేడు ఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్ వేదిక: ముంబై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం. -
అలాంటి రికార్డ్ కింగ్ కోహ్లీకి మాత్రమే సాధ్యం.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్!
టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ ఇవాళ 35వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా విరాట్కు క్రికెటర్స్, ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం విరాట్ స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో పరుగుల వరద పారిస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో మెరిశారు. మరో సెంచరీ చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సెంచరీల రికార్డ్ను సమం చేయనున్నారు. నవంబర్ 5న కోహ్లీ బర్త్ డే కావడంతో ఆయన భార్య, నటి అనుష్క శర్మ ఆసక్తికర ట్వీట్ చేసింది. తన భర్తకు ప్రత్యేకంగా విషెస్ తెలియజేసింది. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. (ఇది చదవండి: ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్ ఫ్రెండ్!) అనుష్క శర్మ తన ఇన్స్టాలో రాస్తూ..'తన జీవితంలోని ప్రతి పాత్రలో అక్షరాలా అసాధారణంగానే ఉంటాడు! కానీ ఏదో ఒక విధంగా నేను కూడా అతని అద్భుతమైన ప్రయాణంలో కొనసాగుతున్నా. నా ఈ జీవితంలో అంతకు మించి ప్రేమిస్తున్నా. అది ఏ రూపంలోనైనా, ఏదైనా కావచ్చు. లవ్ యూ విరాట్' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే తన పోస్ట్లో కోహ్లీ గురించి ఓ ఆసక్తికరమైన ఫోటోను పంచుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క బంతి కూడా వేయకుండా వికెట్ సాధించిన ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ అంటూ పోస్ట్ చేసింది. 2011లో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో మొదటిసారి బౌలింగ్ చేసిన కోహ్లీ.. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కెవిన్ పీటర్సన్ను అవుట్ చేశాడు. అయితే ఆ బాల్ వైడ్ వెళ్లగా.. ధోని అతన్ని స్టంప్ అవుట్ చేశాడు. దీంతో ఒక్క బాల్ వేయకుండానే వికెట్ సాధించిన బౌలర్గా కోహ్లీ నిలిచాడు. ఇలాంటి ఘనత ఇప్పటివరకు ఎవరూ సాధించలేదంటూ అనుష్క శర్మ తన భర్తపై ప్రేమను కురిపించింది. ఇలాంటి అరుదైన ఫీట్ సాధించిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది. (ఇది చదవండి: హీరోతో డేటింగ్.. నిజం బయట పెట్టేసిన హీరోయిన్!) కాగా.. అనుష్క, విరాట్ 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట జనవరి 2021లో తమ మొదటి బిడ్డను ఆహ్వానించారు. తమ ముద్దుల కూతురికి వామిక అని పేరు పెట్టారు. సినిమాల విషయాకొనిస్తే అనుష్క శర్మ నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యే చక్దా ఎక్స్ప్రెస్లో కనిపించనుంది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) -
రషీద్ ఖాన్కు రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ఇచ్చారా?
ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషిద్ ఖాన్కు రూ.10 కోట్ల వరకు ఆర్ధిక సహాయం చేసినట్లు సోషల్ మీడియాలోని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వార్తల్ని రతన్ టాటా కొట్టిపారేశారు. గత వారం ప్రపంచకప్లో ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు షాకిచ్చిన ఆ జట్టు.. పాక్పై పంజా విసిరింది. పాకిస్తాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఆఫ్గాన్ రెండే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్ విజయంతో ఆఫ్గాన్ క్రికెటర్ రషిద్ ఖాన్ ఇండియన్ ఫ్లాగ్ను ప్రదర్శించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. రషిద్ ఖాన్కు ఐసీసీ రూ.55 లక్షల జరిమానా విధించిందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన రతన్ టాటా..రషిద్ ఖాన్కు భారీ మొత్తంలో ఆర్ధిక సహాయం చేసేలా హామీ ఇచ్చారంటూ’ సోషల్ మీడియాలో పోస్టులు వెలుగులోకి వచ్చాయి. I have made no suggestions to the ICC or any cricket faculty about any cricket member regarding a fine or reward to any players. I have no connection to cricket whatsoever Please do not believe WhatsApp forwards and videos of such nature unless they come from my official… — Ratan N. Tata (@RNTata2000) October 30, 2023 ఆ కథనాల్ని రతన్ టాటా ఖండించారు. తనకు క్రికెట్తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాను ఏ క్రికెటర్కి రివార్డ్ ఇవ్వలేదని, అలా ఇచ్చేలా ఐసీసీకి సైతం ఎలాంటి సూచనలు చేయలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. తన అధికారిక ప్లాట్ఫారమ్ల నుండి వస్తే తప్ప వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్లు, తప్పుడు వీడియో కథనాల్ని నమ్మొద్దని రతన్ టాటా నెటిజన్లను కోరారు. చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై.. -
ఇంగ్లాండ్ ఫెయిల్యూర్ కి కారణం అదేనా..?
-
కోహ్లి సెంచరీ..బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం
-
World Cup 2023: సౌతాఫ్రికా జట్టును చిత్తు చేసిన నెదర్లాండ్స్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా జట్ల మద్య జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. తమ కంటే ఎంతో బలంగా ఉన్న సౌతాఫ్రికా జట్టును నెదర్లాండ్స్ మట్టికరిపించి అందరికీ షాక్ ఇచ్చింది. మొత్తం 246 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికాపై 38 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది నెదర్లాండ్స్ జట్టు. One of the greatest ICC Men's Cricket World Cup upsets of all time in Dharamsala as Netherlands overcome South Africa 🎇#SAvNED 📝: https://t.co/gLgies5ZBv pic.twitter.com/KcbZ10qdAG — ICC Cricket World Cup (@cricketworldcup) October 17, 2023 246 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు డచ్ బౌలర్లు చుక్కలు చూపారు. కేవలం 44 పరుగులకే నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టును కష్టాల్లోకి నెట్టారు. వర్శం కారణంగా ఈ మ్యాచ్ను 43 ఓవర్లకే కుదించారు. స్కోర్లు: నెదర్లాండ్స్ 245-8 (43), దక్షిణాఫ్రికా 207 (42.5) -
భారత బౌలర్ల అద్భుతం.. కుప్పకూలిన పాకిస్థాన్
-
మరికాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా భారత్ - పాక్ మధ్య హై వోల్టేజ్ ఫైట్
-
భారత్ పాకిస్థాన్ మ్యాచ్..అభిమానుల సందడి
-
హై వోల్టేజ్ మ్యాచ్..ఇండియా వర్సెస్ పాకిస్థాన్
-
ప్రతి మ్యాచ్ లో పరుగుల వరద...ఐసీసీ అసలు ప్లాన్ అదేనా ?
-
వన్డే ప్రపంచకప్ లో దుమ్మురేపిన భారత్
-
వన్డే ప్రపంచకప్ లో భారత్ బోణి
-
వరల్డ్కప్ క్రికెట్ ప్రతీ సిక్స్, ఫోర్పైనా.. బెట్టింగ్ నీదా.. నాదా..!?
ఖమ్మం: క్రికెట్ ప్రపంచకప్ మొదలైంది. దీంతోపాటు బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. వరుసగా భారత్ మ్యాచ్లు ఉండటంతో బెట్టింగ్ రాయుళ్లు ఈసారైనా గతంలో పోగొట్టుకున్నది వస్తుందేమోననే ఆశతో బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో వన్డే క్రికెట్ టోర్నమెంట్లు వరుసగా జరగడంతో స్వల్ప సమయంలో ఎక్కువ ధనార్జన కోసం ఈ పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచకప్ సుమారు నెలన్నరపాటు జరగనుండటంతో బెట్టింగ్ జోరుగా సాగే అవకాశాలున్నాయి. ఒకప్పుడు కేవలం మెట్రో ప్రాంతాలకే పరిమితమైన బెట్టింగ్ ప్రస్తుతం పల్లెలకు సైతం విస్తరించింది. జిల్లాలోని ఖమ్మంలో బార్లు, హోటళ్లు మ్యాచ్లు ఉన్న సమయంలో నిండిపోతున్నాయి. బెట్టింగ్లు ఉండటంతోనే ఇవి కళకళలాడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బెట్టింగ్ను నియంత్రించే వాళ్లు లేకపోవడంతో పందెం కాసేవాళ్లకు హద్దు లేకుండా పోయింది. అయితే, బెట్టింగ్లో పాల్గొని అప్పులపాలై కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా జిల్లాలో ఉన్నాయి. ప్రతీ సిక్స్, ఫోర్పైనా.. ఒకప్పుడు ఆన్లైన్ ద్వారా బెట్టింగ్లు జరిగేవి. మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం ఫోన్పే, గూగుల్ పే ద్వారా జోరుగా పందేలు సాగుతున్నాయి. భారత్ ఆడే 9 మ్యాచ్ల్లో ఎవరు గెలుస్తారనే దానిపైనే పందేలు ఎక్కువగా కాస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు కూడా బెట్టింగ్ నడుస్తూనే ఉంటుందని తెలుస్తోంది. బ్యాట్స్మెన్ కొట్టే సిక్స్, ఫోర్లపైనా.. బౌలర్ తీసే వికెట్లపైనా.. వైడ్ బాల్, నోబాళ్లపైనా పందేలు నడుస్తుంటాయి. మ్యాచ్ టై అయ్యే దానిపైన కూడా పందెం వేసుకునే వెసులుబాటు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు పోగొట్టుకుంటున్న యువత.. గ్రామీణ ప్రాంతాల్లోని యువత జోరుగా బెట్టింగ్కు పాల్పడుతోంది. ఇంట్లో తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి డబ్బు తీసుకోవడం.. స్నేహితుల దగ్గర అప్పుగా తీసుకొని పందెంలో పెట్టి పోగొట్టుకోవడం తరచుగా కనిపిస్తోంది. ఆన్లైన్లో జరిగే బెట్టింగ్లో వంద పెడితే రూ.300 ఇస్తామంటూ ఊరిస్తూ వలలో వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఇరుక్కుంటే ఇక అంతే సంగతులు. తొలుత డబ్బులు వచ్చినట్టే వచ్చి ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. అప్పుడు పోయిన డబ్బు కోసం మళ్లీ పందెం కాయడం, ఉన్న డబ్బు అంతా పోగొట్టుకోవడం.. దీంతో మనస్తాపానికి గురై యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలువురు చెబుతున్నారు. కాగా, ఖమ్మంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో లింక్బార్లే బెట్టింగ్కు అడ్డాలుగా మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. లింక్ బార్లో కూర్చోని, మద్యం సేవిస్తూ సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం, బెట్టింగ్ ఖర్చులను లింక్బార్ యాజమాని వద్దే అప్పుగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆఫ్లైన్లోనూ.. గతంలో క్రికెట్ బెట్టింగ్ కేవలం ఆన్లైన్ ద్వారానే కొనసాగేది. ఇందుకోసం ముందస్తుగా రూ.లక్ష డిపాజిట్ చేస్తే ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పేలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బెట్టింగ్కు పాల్పడటం సులభంగా మారింది. ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడితే దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే కారణాలతో ఫోన్ పే, గూగుల్ పేనే ఆశ్రయిస్తున్నారు. అయితే, దాదాపు నెలన్నర రోజుల పాటు బెట్టింగ్ జరిగే అవకాశాలున్నప్పటికీ దీనిని నియంత్రించే వారు కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖ పట్టిష్టమైన గస్తీని ఏర్పాటు చేసి బెట్టింగ్కు పాల్పడే ముఠాలను పట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
నిఘా నీడలో చేపాక్కం!
సాక్షి, చైన్నె : ప్రపంచకప్ పోటీల్లో భాగంగా చైన్నె చేపాక్కం స్టేడియం వేదికగా ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి మ్యాచ్లో తడపడనున్నాయి. ఇందుకోసం చేపాక్కంలో సర్వం సిద్ధం చేశారు. ఆ పరిసరాలను నిఘా నీడలోకి తీసుకొచ్చారు. అయితే మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వివరాలు.. తమిళనాట క్రికెట్ అభిమానం మరీ ఎక్కువే అన్న విషయం తెలిసిందే. చైన్నె చేపాక్కంలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగితే చాలు టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో చైన్నె చేపాక్కం స్టేడియం ఐదు మ్యాచ్లకు వేదికగా మారనుంది. ఇందులో భారత్ జట్టు ఓ మ్యాచ్ మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్ను ఆదివారం డే అండ్ నైట్ పోటీగా నిర్వహించనున్నారు. ఇప్పటికే టికెట్లు అన్ని అమ్ముడయ్యాయి. సుమారు 40 మంది వరకు వీక్షించేందుకు ఈ స్టేడియంలో వీలుంది. తరలి వచ్చే అభిమానుల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. అలాగే చేపాక్కం పరిసరాల్లో ట్రాఫిక్ మార్పులు జరిగాయి. అభిమానుల కోసం అర్ధరాత్రి వరకు అదనంగా ఎంఆర్టీఎస్ రైలు సేవలు నడుపనున్నారు. మెట్రో రైలు సేవలకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆదివారం మరమ్మతుల కారణంగా తాంబరం – బీచ్ మధ్య ఎలక్ట్రిక్ రైళ్ల సేవలు ఆగుతుండటంతో ఆ పరిసరాల నుంచి వచ్చే అభిమానులను బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే స్టేడియం పరిసరాలు వివిధ వర్ణాల పెయింటింగ్స్తో శోభాయమానంగా కనిపిస్తున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు స్టేడియంలోకి వెళ్లేందుకు వీలుగా ఆయా మార్గాల నుంచే బారికేడ్లను ప్రవేశ మార్గం వరకు ఏర్పాటు చేశారు. నిఘా కట్టుదిట్టం.. ఈ స్టేడియంలో ఆదివారం భారత్, ఆసీస్ మ్యాచ్తో పాటు 13వ తేదీన న్యూజిలాండ్ – బంగ్లాదేశ్, 18న న్యూజిలాండ్ – ఆఫ్గానిస్తాన్, 23న పాకిస్తాన్ – ఆప్గానిస్తాన్, 27న పాకిస్తాన్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య చైన్నె వేదికగా మ్యాచ్లు జరనున్నాయి. దీంతో మ్యాచ్లు జరిగే రోజుల్లో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మార్పుల ప్రకటన వెలువడింది. అలాగే స్టేడియం పరిసరాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. 2 వేల మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. ఈ పరిసరాలలోని నిఘా నేత్రాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే పోర్టబుల్ వాకింగ్ కెమెరాలను రంగంలోకి దించారు. ఈ కెమెరాలు మనుషుల తరహాలో నడుచుకుంటూ వెళ్లి వీడియో చిత్రీకరిస్తున్నాయి. స్టేడియానికి వచ్చే మహిళా అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకభద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన పక్షంలో కటకటాల్లోకి నెట్టే విధంగా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినా, వర్షం బెంగ అభిమానులను వెంటాడుతోంది. గత రెండు మూడు రోజులుగా చైన్నెలో మధ్యాహ్నం, సాయంత్రం వేళవ్వో అక్కడక్కడ వర్షం పడుతోంది. శనివారం సాయంత్రం కూడా వర్షం కురవడంతో ఆదివారం వర్షం మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. -
CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN — ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023 అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326 -
క్రికెట్ అంటే పిచ్చి.. కానీ ఆ నమ్మకంతో మిస్సవుతున్న అమితాబ్ !
బాలీవుడ్లో బిగ్ బీ పేరున్న అమితాబ్ బచ్చన్ పేరు తెలియని వారు ఉండరు. దక్షిణాదిలోనూ ఆయనకు పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. వయసు పెరిగినా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఇంతకీ ఏంటా విషయం తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా? అయితే చూసేద్దాం పదండి. (ఇది చదవండి: కృష్ణ తనయుడు రమేశ్ బాబు సినిమాల్లో ఎంట్రీ.. హీరోగా ఆ సినిమాతోనే!) వాటిని కూడా నమ్ముతారా? ఇప్పుడున్న కాలంలో మూఢనమ్మకాలు నమ్మేవారు ఉంటారంటే నమ్ముతారా? పైగా సెలబ్రిటీలు అలాంటి వాటిని విశ్వసిస్తారా?అస్సలు ఛాన్సే లేదు. నేను కూడా వాటిని నమ్మను. కానీ మన బిగ్ బీకి ఉన్న మూఢనమ్మకం గురించి తెలిస్తే నిజంగానే షాకవుతారు. ఎందుకంటే ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. ఇండియా మ్యాచ్ ఏదైనా సరే మిస్ కాకుండా చూడాల్సిందే. అలాంటి ఆ నమ్మకం వల్ల స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూసేందుకు వెళ్లరట. (ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లండి'.. ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన అఖిల్!) అంతలా క్రికెట్ను అభిమానించే అమితాబ్ బచ్చన్ స్టేడియం వెళ్లి క్రికెట్ చూడనే చూడరు. ఎందుకంటే ఆయన కేవలం ఇంట్లోనే ఉండి లైవ్ మ్యాచ్ చూస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఆయన స్టేడియం వెళ్లి చూస్తే తన ఫేవరేట్ టీమ్ ఓడిపోతుందట. ఒకటి, రెండుసార్లు అలా జరగడంతో ఇక బిగ్ బీ మొత్తానికే స్టేడియ వెళ్లడం మానేశారట. ఆరు నూరైనా సరే ఇంట్లో ఉండే టీవీలో చూస్తారట. మరీ ఇప్పుడు ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతోంది. మరీ ఈ మ్యాచ్లకైనా మూఢనమ్మకాన్ని పక్కనపెట్టి స్టేడియానికి వెళ్లి చూస్తారో లేదో? కొద్ది రోజులు వేచి చూద్దాం. అయినా సెలబ్రిటీలకు కూడా మూఢనమ్మకాలు ఉంటాయంటే నాలాంటి అభిమానులు నిజంగానే షాకవ్వాల్సిందే. -
తొలి ‘వామప్’ వర్షార్పణం
గువహటి: వన్డే వరల్డ్కప్లో భారత్కు సరైన సన్నాహకం లభించలేదు. వామప్ మ్యాచ్లను వరుసగా రెండో రోజూ వాన వెంటాడటంతో ఆట సాధ్యం కాలేదు. భారీ వర్షం కారణంగా శనివారం భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్ రద్దయింది. రోజంతా కురిసిన వర్షం తెరిపినివ్వకపోవడంతో ఒక్క బంతి కూడా వేసే అవకాశం లేకపోయింది. మ్యాచ్ ఆరంభానికి కాస్త ముందు పరిస్థితి మెరుగ్గా ఉండటంతో టాస్ వేశారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ తర్వాత జోరందుకున్న వానతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేయక తప్పలేదు. నిజానికి ఇరు జట్ల ఆటగాళ్లు అధికారికంగా అంపైర్లు ప్రకటించక ముందే మైదానం వీడి హోటల్కు వెళ్లిపోయారు. ఈ నెల 3న తిరువనంతపురంలో జరిగే తమ తర్వాతి వామప్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో భారత్ తలపడుతుంది. అయితే తాజా స్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్ నిర్వహణ కూడా సందేహంగానే ఉంది. వరల్డ్ కప్ అసలు సమరంలో ఈ నెల 8న చెన్నైలో ఆస్ట్రేలియాను టీమిండియా ఎదుర్కొంటుంది. -
పరుగుల జోరులో కివీస్దే పైచేయి
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్లుగానే ఉప్పల్ స్టేడియం భారీ స్కోర్లకు వేదికైంది. బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉన్న పిచ్పై పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు పరుగుల వరద పారించాయి. అయితే చివరకు ఛేదనలో సత్తా చాటిన కివీస్దే పైచేయి అయింది. శుక్రవారం రాజీవ్గాంధీ స్టేడియంలో జరిగిన తొలి వామప్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్హర్ట్; 9 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించగా... కెపె్టన్ బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్స్లు), సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధసెంచరీలు చేశారు. చివర్లో ఆగా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడాడు. అనంతరం న్యూజిలాండ్ 43.4 ఓవర్లలో 5 వికెట్లకు 346 పరుగులు సాధించి గెలిచింది. రచిన్ రవీంద్ర (72 బంతుల్లో 97; 16 ఫోర్లు, 1 సిక్స్), మార్క్ చాప్మన్ (41 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు), డరైల్ మిచెల్ (57 బంతుల్లో 59 రిటైర్డ్ నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు), కేన్ విలియమ్సన్ (50 బంతుల్లో 54 రిటైర్డ్ నాటౌట్; 8 ఫోర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు. భద్రతా కారణాలతో పోలీసు యంత్రాంగం సూచనల కారణంగా ఈ మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించలేదు. ఖాళీ మైదానంలో ఇరు జట్ల బ్యాటర్లు భారీ షాట్లు బాదారు. ఈ స్టేడియంలో అక్టోబర్ 3న పాకిస్తాన్, ఆ్రస్టేలియా మధ్య మరో వామప్ మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్కు విలియమ్సన్ దూరం పాక్తో వామప్ మ్యాచ్లో సత్తా చాటినా... అసలు పోరు సమయానికి విలియమ్సన్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండే అవకాశం కనిపించడం లేదు. అందుకే అక్టోబర్ 5న ఇంగ్లండ్తో జరిగే వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్కు అతను దూరమయ్యాడు. శ్రీలంకకు బంగ్లాదేశ్ షాక్ గువహటి: మరో వామప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఏడు వికెట్లతో శ్రీలంకను ఓడించింది. శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (68), ధనంజయ (55) అర్ధ సెంచరీలు చేయగా... మెహదీ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బంగ్లాదేశ్ 42 ఓవర్లలో 3 వికెట్లకు 264 పరుగులు సాధించి నెగ్గింది.తన్జీద్ (84), మిరాజ్ (67 నాటౌట్), లిటన్ దాస్ (61) కలిసి జట్టును గెలిపించారు. మరోవైపు తిరువనంతపురంలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చార్మినార్.. హుస్సేన్ సాగర్.. ఉప్పల్
సాక్షి, హైదరాబాద్: పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై నిర్వహిస్తున్న వన్డే వరల్డ్ కప్కు సంబంధించిన సందడి అంతటా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు వేదికల్లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రచార కార్యక్రమాల తర్వాత ఇప్పుడు మన నగరంలో వరల్డ్ కప్ ట్రోఫీ సందడి చేసింది. క్రికెట్ అభిమానులను అలరిస్తూ వచ్చిన ఈ కప్ రెండు రోజుల పాటు హైదరాబాద్లో అభిమానులకు చేరువగా వచ్చింది. గురువారంతో నగరంలో ఈ ఐసీసీ ట్రోఫీ టూర్ ముగిసింది. బుధవారం అభిమానుల కోసం రామోజీ ఫిల్మ్సిటీ, ఇనార్బిట్ మాల్లలో ట్రోఫీని ఉంచారు. క్రికెట్ ప్రేమికులు సెల్ఫీలతో ఆటపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. గురువారం వరల్డ్ కప్ నిర్వాహకులు నగరంలో మూడు చోట్ల ట్రోఫీని ప్రదర్శించారు. నగరానికి చిరునామా అయిన చారిత్రాత్మక చార్మినార్ వద్ద, ఆ తర్వాత హుస్సేన్ సాగర్ ఐసీసీ ప్రతినిధులు ట్రోఫీని ఉంచి ప్రచారం నిర్వహించారు. అనంతరం వరల్డ్ కప్లో మూడు మ్యాచ్లకు వేదికై న ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో ట్రోఫీని ప్రదర్శించారు. ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 10 తేదీల్లో మూడు వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతాయి. అంతకు ముందు ఈ నెల 29, అక్టోబర్ 3 తేదీల్లో వార్మప్ మ్యాచ్లు కూడా నిర్వహిస్తారు. భారత జట్టు పాల్గొనే మ్యాచ్లు ఇక్కడ లేకపోయినా.. వరల్డ్ కప్ పోరు కావడంతో ఇతర టీమ్ల మ్యాచ్లపై కూడా ఆసక్తి నెలకొంది. వరల్డ్ కప్ టూర్లో భాగంగా ట్రోఫీ నగరం నుంచి చైన్నెకి వెళ్లింది. -
15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ
-
అరుదైన ఛాన్స్ కొట్టేసిన రౌతేలా.. ఆ విషయంలో తొలి నటి ఆమెనే!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు అభిమానులను మెప్పించింది. బాస్ పార్టీ అంటూ సాగే సాంగ్తో ఉర్రూతలూగించింది. ఆ తర్వాత కూడా అఖిల్ అక్కినేని చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో మెరిసింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది. అయితే తాజాగా ఈ భామ అరుదైన అవకాశాన్ని అందుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: 'స్నానం చేస్తుండగా వీడియోలు తీసేవాడు'.. హీరోయిన్ తీవ్ర ఆరోపణలు! ) ఇండియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు ట్రీఫీ చాలా దేశాలను చుట్టేసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రాన్స్లోని ప్రతిష్ఠాత్మక ఈఫిల్ టవర్ ముందు ఐసీసీ ప్రపంచ కప్ -2023ను ఆవిష్కరించారు. అయితే ఈ ట్రోఫీని బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఆవిష్కరించింది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి నటిగా ఉర్వశి నిలిచింది. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వరల్డ్ కప్ ముందు ఫోటోలకు పోజులిచ్చింది. పంచుకుంది. ఈ అవకాశమిచ్చిన ఐసీసీకి కృతజ్ఞతలు తెలిపింది. ఇది చూసిన అభిమానులు ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'రిషబ్ భయ్యా దృష్టిలో పడేందుకేనా..' అంటూ కామెంట్స్ చేశాడు. మరో నెటిజన్ ఊర్వశి రౌతేలా వరల్డ్ కప్ పట్టుకుందంటే.. ఇక నెక్స్ట్ రిషబ్ భయ్యా వంతు అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు గెలవాల్సింది ఒకటి కాదు.. రెండు ట్రోఫీలు అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. రిషభ్ పంత్తో డేటింగ్ రూమర్స్ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్-2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. కాగా.. గతంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్తో ఊర్వశి రౌతేలా డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరీ ఈ ఫోటో చూసిన రిషబ్ పంత్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. డిప్రెషన్లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి!) -
కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్ చేసాడు
-
రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎర్త్ పెట్టిన రహానే
-
T20 - ప్రపంచ కప్ 2024ను నిర్వహించనున్న ఇంగ్లాండ్
-
వరల్డ్ కప్ కి కొత్త వికెట్ కీపర్ ఎవరంటే...?
-
టీ 20 వరల్డ్ కప్ గెలిచేది ఆ మూడు జట్లే...
-
T20 World Cup: అయ్యో బుమ్రా..!
టి20 ప్రపంచకప్కు బయల్దేరక ముందే భారత క్రికెట్ జట్టుకు పెద్ద షాక్! ఆసీస్ గడ్డపై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించగలడని భావించిన స్టార్ పేసర్ ఇప్పుడు టోర్నీకే దూరం కానున్నాడు. వెన్ను నొప్పి గాయం (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా నొప్పి తిరగబెట్టడంతో తప్పనిసరిగా ఆటకు విరామం పలకాల్సి వచ్చింది. దాంతో అతను టి20 ప్రపంచకప్ వెళ్లే అవకాశం లేదని తేలిపోయింది. ఇప్పటికే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో మెగా టోర్నీనుంచి తప్పుకోగా, ఇప్పుడు బుమ్రా కూడా లేకపోవడం టీమిండియాను బలహీనంగా మార్చింది. న్యూఢిల్లీ: గాయంనుంచి కోలుకొని విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆట రెండు మ్యాచ్లకే పరిమితమైంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో, మూడో టి20లో ఆడిన అతను బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో బుమ్రాకు వెన్ను నొప్పి వచ్చిందని, అందుకే మ్యాచ్ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆ వెన్ను బాధ అంతటితో ఆగిపోలేదని బుధవారం సాయంత్రం తేలింది. తిరువనంతపురంనుంచి బుమ్రా నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి చేరుకున్నాడు. పరీక్షల అనంతరం గాయం తీవ్రమైందని తేలగా, కొన్ని నెలల పాటు ఆటకు దూరం కావాల్సి ఉందని అర్థమైంది. బీసీసీఐ అధికారికంగా బుమ్రా గాయంపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటన చేయకపోయినా...బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘బుమ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ టి20 ప్రపంచకప్ ఆడే అవకాశం లేదు. అతని వెన్ను గాయం చాలా తీవ్రమైంది. స్ట్రెస్ ఫ్రాక్చర్ కాబట్టి కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది’ అని ఆయన వెల్లడించారు. వరల్డ్ కప్కు ప్రకటించిన జట్టులో స్టాండ్బైలుగా ఇద్దరు పేసర్లు అందుబాటులో ఉన్నారు. మొహమ్మద్ షమీ లేదా దీపక్ చహర్లలో ఒకరిని ప్రధాన జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బుమ్రా గాయాన్ని బీసీసీఐ వైద్యులు పర్యవేక్షిస్తారని, టీమ్లో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న అక్టోబర్ 15 వరకు వేచి చూడవచ్చని చెబుతున్నా... పూర్తి ఫిట్గా లేని ఆటగాడిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. బలమే బలహీనతై... ‘బుమ్రా పూర్తి స్థాయిలో మళ్లీ బౌలింగ్ చేయడం సంతోషంగా అనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే వెన్ను నొప్పితో రెండు నెలలు విశ్రాంతి తీసుకొని మళ్లీ బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. అతని ప్రదర్శన ఎలా ఉందన్నది అనవసరం. మెల్లగా లయ అందుకుంటున్నాడు. అతను తిరిగి రావడమే విశేషం. ’...ఆసీస్తో రెండో టి20 తర్వాత బుమ్రా గురించి రోహిత్ వ్యాఖ్య ఇది. అయితే మరో మ్యాచ్కే గాయం తిరగబెట్టి బుమ్రా మళ్లీ అందుబాటులో లేకుండా పోతాడని బహుశా రోహిత్ కూడా ఊహించి ఉండడు. విజయావకాశాలు ప్రభావితం చేయగల తన స్టార్ బౌలర్ లేకపోవడం ఏ కెప్టెన్కైనా లోటే. అయితే బుమ్రా గాయాన్ని బోర్డు వైద్యులు, ఎన్సీఏ పర్యవేక్షించిన తీరే సరిగా కనిపించడం లేదు. బుమ్రా విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా ఏమీ ఆడటం లేదు. బోర్డు రొటేషన్ పాలసీ, వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతను చాలా తక్కువ మ్యాచ్లే ఆడాడు. 2022లో అతను ఐపీఎల్తో పాటు 5 టెస్టులు, 5 వన్డేలు, 5 అంతర్జాతీయ టి20లు మాత్రమే ఆడాడు. నిజానికి బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ కొత్త కాదు. 2019లోనే అతను ఇదే బాధతో మూడు నెలలు ఆటకు దూరమయ్యాడు. నిపుణులు చెప్పినదాని ప్రకారం అతని భిన్నమైన శైలే అందుకు ప్రధాన కారణం. వెన్నునొప్పితోనే అతను ఇటీవలే ఆసియా కప్లోనూ ఆడలేదు. అయితే సరిగ్గా ఇక్కడే టీమ్ మేనేజ్మెంట్ తొందరపాటు కనిపిస్తోంది. అతను పూర్తి స్థాయిలో కోలుకోకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్కు ఎంపిక చేసినట్లుగా అనిపిస్తోంది. లేదంటే ఎన్సీఏ బుమ్రా గాయాన్ని సరిగ్గా అంచనా వేయలేక తగినంత రీహాబిలిటేషన్ లేకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఉంది. ఎందుకంటే పూర్తి ఫిట్గా ఉంటే రెండు మ్యాచ్లకే గాయం తిరగబెట్టడం ఊహించలేనిది. ‘తక్కువ రనప్తో ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు బుమ్రా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎంత కాలం ఇలా అతని శరీరం సహకరిస్తుందనేదే నా సందేహం. అది మానవశరీరం. మెషీన్ కాదు’ అని రెండేళ్ల క్రితం దిగ్గజ పేసర్ మైకేల్ హోల్డింగ్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు వాస్తవంగా మారినట్లు అనిపిస్తోంది. -
17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఇంగ్లండ్
కరాచీ: ప్రపంచకప్ దృష్ట్యా అన్నీ జట్లు టి20లు ఆడేందుకు తెగ సిద్ధమవుతున్నాయి. ఎన్నాళ్ల నుంచో అసలు పాక్ గడపే తొక్కని ఇంగ్లండ్ కూడా పొట్టి ఫార్మాట్లో పెద్ద ముఖాముఖీ టోర్నీ ఆడేందుకు వచ్చింది. చివరిసారిగా 2005లో పాక్లో పర్యటించిన ఇంగ్లండ్ 17 ఏళ్ల తర్వాత ఏడు మ్యాచ్ల టి20ల సిరీస్ ఆడేందుకు ఇక్కడ అడుగుపెట్టింది. మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. రెగ్యులర్ సారథి జోస్ బట్లర్ కండరాల గాయంతో ఇబ్బంది పడుతుండగా, మొయిన్ అలీ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. 20, 22, 23, 25 తేదీల్లో కరాచీలో నాలుగు మ్యాచ్లు... 28, 30, అక్టోబర్ 2 తేదీల్లో లాహోర్ వేదికగా మూడు టి20లు జరుగనున్నాయి. బట్లర్ ఆఖరి దశ మ్యాచ్ల్లో ఒకట్రెండు ఆడే అవకాశముందని జట్టు వర్గాలు తెలిపాయి. -
India vs Australia T20: సమరానికి సై
గత టి20 ప్రపంచకప్కు భారత జట్టు చాలా పటిష్టంగా కనిపించింది. వరుసగా రెండు సీజన్లు ఐపీఎల్ ఆడిన వేదికపై సత్తా చాటడం ఖాయమనిపించింది. అయితే అనూహ్యంగా కనీసం సెమీస్ కూడా చేరలేకపోయింది. నాటి వైఫల్యానికి కారణమైన లోపాలను సరిదిద్దుకుంటూ టీమిండియా ఆ తర్వాతి నుంచి ఆటతీరును మార్చుకుంది. ఇప్పుడు సంవత్సరం తిరిగేలోగా మరో టి20 ప్రపంచకప్పై దృష్టి పెట్టింది. ఆ మెగా ఈవెంట్కు ముందు సరిగ్గా ఆరు మ్యాచ్లతో రోహిత్ సేన సన్నద్ధం కానుంది. పిచ్లు, పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నా ఆత్మవిశ్వాసంతో ఆసీస్ విమానమెక్కేందుకు మిగిలిన మ్యాచ్లలోనే కూర్పు ను పరీక్షించేందుకు లభించిన అవకాశమిది. మొహాలి: ప్రపంచకప్కు ఆతిథ్యం ఇచ్చే జట్టుతో సొంతగడ్డపై భారత్ సమరానికి సై అంటోంది. ఆస్ట్రేలియాతో జరిగే మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాతో కూడా భారత్ మూడు టి20లు ఆడనుంది. వరల్డ్కప్కు టీమ్ను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆటగాళ్లందరినీ ఈ ఆరు మ్యాచ్ల్లోనూ ఆడించి టీమ్ మేనేజ్మెంట్ ఒక అంచనాకు రానుంది. ముఖ్యంగా ఆసియా కప్లో టీమ్ను ఇబ్బంది పెట్టిన మిడిలార్డర్ను సరిదిద్దుకోవడం భారత్కు కీలకంగా మారింది. అటు ఆస్ట్రేలియా కూడా ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తుండటంతో సిరీస్ ఆసక్తికరంగా సాగనుంది. మూడో పేసర్ను ఆడిస్తారా... ఆసియా కప్తో పోలిస్తే భారత జట్టులో రెండు కీలక మార్పులు ఖాయం. టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి రానుండగా, కొంత కాలంగా ఆటకు దూరమైన హర్షల్ పటేల్ను కూడా పరీక్షించడం అవసరం. అలాంటప్పుడు మరో రెగ్యులర్ బౌలర్ భువనేశ్వర్ను ఆడిస్తారా లేదా అనేది చూడాలి. భువీకి ఎలాగూ అనుభవం ఉంది కాబట్టి వైవిధ్యం కోసం అర్‡్షదీప్ను కూడా ప్రయత్నించవచ్చు. హార్దిక్ పాండ్యా మూడో పేసర్ పాత్రకు సరిపోడనేది ఆసియా కప్ నేర్పిన పాఠాల్లో ఒకటి. కాబట్టి అతడి బౌలింగ్ను కాకుండా రెగ్యులర్ బౌలర్ను నమ్ముకోక తప్పదు. ప్రధాన స్పిన్నర్గా చహల్కు చోటు ఖాయం. రెండో స్పిన్నర్గా అక్షర్, అశ్విన్లలో ఒకరికే అవకాశం దక్కుతుంది. ఈ సిరీస్తో పాటు వరల్డ్కప్ టీమ్లో ఉన్నా, దీపక్ హుడాకు తుది జట్టులో చోటు దక్కుతుందా చెప్పలేని పరిస్థితి. టాప్–3గా రోహిత్, రాహుల్, కోహ్లి ఖాయం కాబట్టి తర్వాతి ముగ్గురు బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడటం అవసరం. సూర్యకుమార్, పంత్, హార్దిక్ సమష్టిగా విఫలం కావడంతోనే ఆసియా కప్లో భారత్ ఫైనల్ చేరలేకపోయింది. హార్దిక్ను పూర్తి స్థాయి బ్యాటర్గానే చూస్తూ ఐదుగురు బౌలర్లతో ఆడితే దినేశ్ కార్తీక్కు స్థానం లభించడం కష్టం. ఫించ్పై తీవ్ర ఒత్తిడి... స్వదేశంలో వరల్డ్కప్కు ముందు మూడు మ్యాచ్ల సిరీస్ కోసం భారత్కు వచ్చి మ్యాచ్లు ఆడటంపై ఆస్ట్రేలియా కూడా అంత ఆసక్తిగా ఉన్నట్లు లేదు. సిరీస్కు ముందే విశ్రాంతి అంటూ డేవిడ్ వార్నర్ తప్పుకోగా, మరో ముగ్గురు కీలక ఆటగాళ్లు స్టార్క్, స్టొయినిస్, మిచెల్ మార్‡్ష కూడా దూరమయ్యారు. ఇలాంటి స్థితిలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ కచ్చితంగా రాణించాలి. పేలవ ఫామ్తో వన్డేల నుంచి రిటైర్ అయిన అతను టి20ల్లోనైనా సత్తా చాటితే జట్టుకు మేలు జరుగుతుంది. ఫించ్తో కలిసి వేడ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. స్మిత్ మూడో స్థానంలో ఆడతాడని ఇప్పటికే ఆసీస్ ప్రకటించగా, మ్యాక్స్వెల్ తనదైన దూకుడును జోడించగలడు. ఈ సిరీస్ ఒక యువ ఆటగాడికి ఎంతో కీలకం కానుంది. అతనే టిమ్ డేవిడ్. ఇంత కాలం సింగపూర్కు ప్రాతినిధ్యం వహించి తొలిసారి ఆసీస్ జట్టులోకి ఎంపికైన అతను ఐపీఎల్ అనుభవంతో ఎంత దూకుడుగా ఆడతాడో చూడాలి. కమిన్స్, హాజల్వుడ్, కేన్ రిచర్డ్సన్ పేస్ భారం మోయనుండగా, లెగ్స్పిన్నర్ జంపాకు మంచి రికార్డే ఉంది. 23: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 23 టి20 మ్యాచ్లు జరిగాయి. 13 మ్యాచ్ల్లో భారత్, 9 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా గెలిచాయి. మరో మ్యాచ్ వర్షంవల్ల రద్దయింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఏడు మ్యాచ్లు ఆడిన భారత్ నాలుగింటిలో గెలిచి, మూడింటిలో ఓడిపోయింది. -
కెప్టెన్లంతా ఔట్.. ఒక్క కేన్ మామ తప్ప..!
ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్గా ఆరోన్ ఫించ్ వైదొలిగిన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 2019 వన్డే వరల్డ్కప్ ఆడిన పది దేశాల కెప్టెన్లలో ప్రస్తుతం ఒకే ఒక్కరు సారధిగా కొనసాగుతున్నారు. గత వన్డే వరల్డ్కప్లో ఇంగ్లండ్ (డిఫెండింగ్ ఛాంపియన్) కెప్టెన్గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్, విరాట్ కోహ్లి (ఇండియా), ఫాఫ్ డుప్లెసిస్ (సౌతాఫ్రికా), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్తాన్), శ్రీలంక (దిముత్ కరుణరత్నే), ముషరఫే మోర్తజా (బంగ్లాదేశ్), గుల్బదిన్ నైబ్ (ఆఫ్ఘనిస్తాన్), తాజాగా ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) కెప్టెన్సీ బాధ్యతలను నుంచి వైదొలగగా ఒక్క కేన్ విలియమ్సన్ మాత్రమే మూడు ఫార్మాట్లలో న్యూజిలాండ్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. కెప్టెన్లకు ఏమాత్రం కలిసి రానిదిగా చెప్పుకునే గడిచిన వన్డే వరల్డ్ కప్ ఆడిన కెప్టెన్లలో కేన్ మామ తప్ప అంతా ఔటయ్యారు. వీరిలో కొందరు స్వతహాగా కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, మరికొందరిని (హోల్డర్, సర్ఫరాజ్, గుల్బదిన్, మోర్తజా, కరుణరత్నే) బలవంతంగా తప్పించారు. తప్పించబడిన కెప్టెన్లలో కొందరు వన్డే జట్టులో స్థానం సైతం కోల్పోయారు. 2019 వన్డే వరల్డ్కప్ ఆడిన కెప్టెన్లలో మిగిలిన ఒకే ఒక్కడు విలియమ్సన్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. కేన్ మామ కెప్టెన్సీ కూడా ఇప్పుడా అప్పుడా అన్నట్లు ఉంది. గత కొంతకాలంగా అతను మూడు ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో కేన్ను పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ విలియమ్సన్ కూడా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించబడితే గత వన్డే వరల్డ్కప్ ఆడిన కెప్టెన్లంతా ఔటైనట్లే. వరల్డ్కప్ ఆడిన పది మంది కెప్టెన్లలో ఒక్క మోర్గాన్ తప్ప మిగతా ఎవ్వరూ అంత హ్యాపీగా జట్టుకు దూరం కాలేదు. ఇంగ్లండ్కు తొట్ట తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్గా మోర్గాన్కు మంచి రెస్పెక్ట్ దక్కింది. ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే.. ఈ టీమిండియా తాజా మాజీ కెప్టెన్కు నాటి వరల్డ్కప్ నుంచే దరిద్రం పట్టుకుంది. 2019 నుంచి మూడేళ్లకు పైగా ఒక్క సెంచరీ కూడా చేయని విరాట్.. ఇటీవలే (ఆసియా కప్ 2022) ఓ సెంచరీ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన పోరులో సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ బాదిన కోహ్లి కెరీర్లో 71వ సెంచరీ, అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ సాధించాడు. చదవండి: Asia Cup 2022: లంకకు ఎదురుందా! -
1983.. ఆ చరిత్రకు 38 ఏళ్లు
ఢిల్లీ: క్రికెట్ అనే పదం భారతీయుల గుండెల్లోకి మరింత చొచ్చుకుపోయిన రోజు ఇదే. బ్రిటీష్ పరిపాలనలోనే మనవాళ్లు క్రికెట్ ఆడడం అలవాటు చేసుకున్నా.. టీమిండియా అంటే 1983 ముందు.. ఆ తర్వాత అని చరిత్ర చెప్పుకుంటుంది. అప్పటివరకు క్రికెట్లో భారత్ అనే పేరు అనామకంగానే ఉండేది. కాగా అప్పటికే క్రికెట్లో పాతుకుపోయిన వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్ల ముందు మన ఆటలు సాగేవి కావు. ఒకవేళ వాళ్లు మనం దేశంలో పర్యటించినా.. లేక మనం వాళ్ల దేశంలో పర్యటించిన రిజల్ట్ మాత్రం మనకు ప్రతికూలంగానే వచ్చేది. కానీ 1983 సంవత్సరం క్రికెట్లో టీమిండియా ఆటతీరును ప్రపంచానికి పరిచయం చేసింది. ముఖ్యంగా ఆ ఏడాది జరిగిన ప్రపంచకప్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు మించి రాణించింది. ఎవరు ఊహించని విధంగా ఫైనల్ చేరింది. కపిల్దేవ్ సారధ్యంలోని భారత జట్టు ఫైనల్లో బలమైన విండీస్ను ఓడించి జగజ్జేతగా నిలిచి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టంది. భారత్లో క్రికెట్కు మతం అనే పదానికి భీజం పడింది ఇక్కడే. అప్పటివరకు హాకీని ఇష్టపడినవాళ్లు క్రమంగా క్రికెట్కు పెద్ద అభిమానులుగా మారిపోతువచ్చారు. మరి అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఇదే.. జూన్ 25, 1983. నేటితో భారత్ మొదటి ప్రపంచకప్ గెలిచి 38 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆనాటి ఫైనల్ విశేషాలను మరోసారి గుర్తుచేసుకుందాం. ఇంగ్లండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటింగ్లో శ్రీకాంత్ 38, మోహిందర్ అమర్నాథ్ 26, ఎస్ఎమ్ పాటిల్ 27 పరుగులు చేశారు. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్కు ఇదేం పెద్ద టార్గెట్ కాకపోవచ్చని.. మరోసారి కప్పును విండీస్ గెలుచుకుంటుందని అంతా భావించారు. దానికి తగ్గట్టుగానే విండీస్ ఇన్నింగ్స్ సాగింది. తొలి వికెట్ను ఐదు పరుగులకే కోల్పోయినా.. 50/1తో పటిష్టంగా కనిపించింది. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. భయంకరమైన ఫామ్లో ఉన్న వివ్ రిచర్డ్స్ 33 పరుగుల వద్ద మదన్లాల్ బౌలింగ్లో కపిల్దేవ్ తీసుకున్న సూపర్ క్యాచ్ మ్యాచ్ను మలుపుతిప్పింది. ఆ తర్వాత భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులు విసురుతూ చెమటలు పట్టించగా.. విండీస్ 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయి 43 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొహిందర్ అమర్నాథ్, మదన్లాల్ ద్వయం చెరో మూడు వికెట్లతో చెలరేగారు.అలా తొలిసారి కపిల్ సారధ్యంలోని టీమిండియా జగజ్జేతగా అవతరించింది. అంతకముందు లీగ్ దశలో జింబాబ్వేపై కపిల్ దేవ్ ఆడిన 175* పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ను ఎవరు మరిచిపోలేరు. సెమీస్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్లో కపిల్ పెయిన్ కిల్లర్స్ ఇంజక్షన్ తీసుకొని బరిలోకి దిగడం.. 175 నాకౌట్ ఇన్నింగ్స్ ఆడడం చరిత్రలో మిగిలిపోయింది. ఆ తర్వాత మళ్లీ సరిగ్గా 28 ఏళ్లకు 2011లో ధోని సారధ్యంలో టీమిండియా రెండో ప్రపంచకప్ను సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: PSL-6 Final: విజేత ముల్తాన్ సుల్తాన్స్ సిక్స్ కొట్టి తలపట్టుకున్నాడు.. వీడియో వైరల్ #OnThisDay in 1983, a moment of triumph for India 🌟 Kapil Dev led them to their first @cricketworldcup win with a 43-run victory over West Indies in the final 🏆 pic.twitter.com/u3oewIaJnX — ICC (@ICC) June 25, 2021 -
8.2 ఓవర్లు, 6 మెయిడెన్, 7 పరుగులు, మరి వికెట్లు?
న్యూఢిల్లీ: 8.2 ఓవర్లు, 6 మెయిడెన్, ఇచ్చిన పరుగులు 7 మాత్రమే, కీలకమైన మూడు వికెట్లు. ఈ గణాంకాలు సాదాసీదా మ్యాచ్లో కాదు. 2003 వన్డే ప్రపంచకప్లో. ప్రత్యర్థి భీకర ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా. బౌలర్ కూడా ఏ పాపులర్ టీమ్ సభ్యుడో అనుకోకండి. క్రికెట్లో పసికూనగా పేరున్న కెన్యాకు చెందిన ఆసిఫ్ కరీం. ఈ రోజు కరీం పుట్టిన రోజు కావడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాటి విశేషాలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన కెన్యా జట్టు బ్రెట్లీ, ఆండీ బిచెల్, డారెన్ లెహ్మాన్ దెబ్బతో 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. (చదవండి : 'విచారకరం.. నా ఇన్నింగ్స్ వారికే అంకితం') 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఆడమ్ గిల్క్రిస్ట్ (43 బంతుల్లో 67; 9 ఫోర్లు, 3 సిక్స్లు), మాథ్యూ హెడెన్ (14 బంతుల్లో 20; 5 ఫోర్లు) మెరుగైన ఆరంభం ఇచ్చారు. ఈ ఇద్దరినీ ఒంగొండో పెవిలియన్ చేర్చాడు. తర్వాత కెప్టెన్ రికీ పాంటింగ్, ఆండ్రూ సిమండ్స్తో కలిసి జట్టును విజయం దిశగా తీసుకెళ్తుండగా.. ఆసిఫ్ కరీం విజృంభించడంతో ఒక్కసారిగా మ్యాచ్లో ఉత్కంఠ పెరిగింది. కీలకమైన పాంటింగ్ (18) వికెట్ తీసిన కరీం.. తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. తక్కువ పరుగుల వ్యవధిలోనే డారెన్ లేహ్మాన్ (2), బ్రాడ్ హాగ్ (0) వికెట్లు తీసి ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. చివర్లో ఇయాన్ హార్వే (43 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో కలిసి సిమండ్స్ (49 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) కెన్యా ఆశలపై నీళ్లు చల్లాడు. దాంతో మరో 112 బంతులు ఉండగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక 1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కరీం 34 వన్డేలు మాత్రమే ఆడి 27 వికెట్లు తీశాడు. 2003 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ అతనికి చివరిది కావడం గమనార్హం. (చదవండి: టెస్ట్ చాంపియన్ షిప్ : నెంబర్ 1 ఆసీస్) -
వరల్డ్ కప్ వాయిదా పడితే...
మెల్బోర్న్: కరోనా కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే ఐసీసీ టోర్నీ స్థానంలో భారత్లో ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమమవుతుందని ఆయన అన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన టి20 వరల్డ్కప్పై అనిశ్చితి నెలకొంది. ఒకవేళ ఐపీఎల్ జరిగితే భారత్కు వెళ్లే బాధ్యత సదరు క్రికెటర్పైనే ఉంటుందని అన్నాడు. ‘నాకు తెలిసి వరల్డ్కప్ టోర్నీ కోసం 15 జట్లు ఆసీస్ రావడం ప్రస్తుత తరుణంలో చాలా కష్టం. ఇంకా 14 రోజులు ఐసోలేషన్ నిబంధన ఈ టోర్నీ నిర్వహణకు మరింత ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి టోర్నీని వాయిదా వేయాలని ఐసీసీ భావిస్తే... ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐకి అవకాశాలు మెరుగవుతాయి. జట్టంతా ఒక దేశం వెళ్లడం కంటే.. ఒక ఆటగాడు లీగ్ కోసం భారత్కు వెళ్లడం సులభంగా ఉంటుంది’ అని 55 ఏళ్ల టేలర్ వివరించారు. -
'వారిని ప్రపంచకప్లో మాత్రం ఓడించలేకపోయాం'
ఇస్లామాబాద్ : భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరుగా ఉంటుందనేది ఇప్పటికే చాలా మ్యాచ్లు నిరూపించాయి. ఒక ప్రపంచకప్లో ఈ రెండు జట్లు తలపడ్డాయంటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. దాయాదుల పోరు అని ముద్దుగా పిలుచుకునే ఈ మ్యాచ్లు చాలావరకు రసవత్తరంగానే సాగుతుంటాయి. మ్యాచ్ ఎవరు గెలిస్తే వారికి దేశంలో సన్మానం జరిగితే ఓడిపోయిన దేశంలో మాత్రం చెప్పుల దండలు పడుతుంటాయి. అయితే ప్రపంచకప్లో మాత్రం విజయాలు టీమిండియానే వరించాయి. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ మరోసారి గుర్తుచేశాడు. '90వ దశకంలో పాకిస్తాన్ జట్టు అన్ని రంగాల్లో మెరుగుపడింది. చిరకాల ప్రత్యర్థి భారత్ను చాలా మ్యాచ్ల్లో ఓడించాము. కానీ ప్రపంచకప్లో మాత్రం ఆ ఫీట్ను రిపీట్ చేయలేకపోయాం. అది 1992 వరల్డ్ కప్ నుంచి1999 ప్రపంచకప్ వరకు భారత జట్టుపై విజయం సాధించలేకపోయాం. 92 ప్రపంచకప్ టైటిల్ నెగ్గినా, 1996 క్వార్టర్ ఫైనల్,1999లో ప్రపంచకప్ ఫైనల్ చేరుకుని మంచి ప్రదర్శన కనబరిచినా భారత్పై మాత్రం విజయం సాధించలేకపోయాం. ఇదే ట్రెండ్ ఇప్పటి దశాబ్దంలో కూడా కొనసాగుతుంది. 2003 నుంచి 2019 ప్రపంచకప్ వరకు మా మధ్య జరిగిన మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా గెలవలేకపోయాం. ఇండియా ఈ రికార్డును ఇప్పటికి పదిలంగా కాపాడుకుంటుంది. ('రోహిత్ ఎదగడానికి ధోనియే కారణం') సాధారణ మ్యాచ్లతో పోలిస్తే టీమిండియా ఆటగాళ్లు ప్రపంచకప్లో చెలరేగిపోతారు. అందుకే వారిని ప్రపంచకప్లో ఇప్పటివరకు ఓడించలేకపోయాం. ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్ల్లో భారత్, పాక్ జట్లు తలపడే అవకాశం తక్కువగా ఉన్నా.. లీగ్ మ్యాచ్లు జరిగితే మాత్రం టీమిండియా ఫేవరెట్గా నిలుస్తుంది. అయితే 2011 ప్రపంచకప్ సెమీస్లో భారత్ను ఓడించే అవకాశం లభించినా మేం దానిని సరిగా వినియోగించుకోలేకపోయాంటూ' రజాక్ చెప్పుకొచ్చాడు. 1992 నుంచి 2019 ప్రపంచకప్ వరకు జరిగిన మ్యాచ్ల్లో 7-0 లీడ్తో భారత్ పాకిస్తాన్పై స్పష్టమైన ఆధిక్యం కనబరించింది. ఒక్క 2007 వరల్డ్ కప్లో మాత్రం ఇరు జట్లు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఆ ప్రపంచకప్లో భారత్, పాక్ జట్లు ఘోర ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.అబ్దుల్ రజాక్ పాక్ తరపున 46 టెస్టుల్లో 1946 పరుగులతో పాటు 100 వికెట్లు, 265 వన్డేల్లో 5080 పరుగులతో పాటు 269 వికెట్లు తీశాడు. ('ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నా') -
సరైన సమయంలో చెబుతాం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే పొట్టి ప్రపంచకప్పై తొందరపడాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వ్యాఖ్యానించింది. కోవిడ్–19 రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా తీవ్రరూపం దాలుస్తోంది. దీంతో అన్ని దేశాల్లోనూ లాక్డౌన్ పొడిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్లో జరగాల్సిన ఈవెంట్పై ఇప్పుడే నిర్ణయానికి రాలేమని... దీనికి చాలా సమయముందని, కాబట్టి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ‘ఐసీసీ ఈవెంట్ల కోసం మా ప్రణాళికతో మేం ముందుకెళ్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం కూడా బాధ్యతాయుతంగా, వివేకవంతంగా ఆలోచించాల్సిన అవసరముంది. అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీసీ ప్రతినిధి తెలిపారు. -
వరల్డ్కప్ ఫైనల్కి దూసుకెళ్లిన ఇంగ్లాండ్
-
యుద్ధం
-
సెమీస్ చేరిన టీమిండియా
-
జైత్రయాత్ర కొనసాగాలని...
ప్రపంచ కప్లో ఓటమి లేకుండా అజేయంగా సాగుతున్న భారత జట్టు ద్వితీయార్ధ పోరుకు సన్నద్ధమైంది. టోర్నీ ఆరంభం నుంచి 28 రోజుల వ్యవధిలో ఐదు మ్యాచ్లే పూర్తి చేసుకున్న టీమిండియా... రాబోయే పది రోజుల్లో నాలుగు మ్యాచ్ల్లో బరిలోకి దిగబోతోంది. ఈ క్రమంలో వెస్టిండీస్ తొలి ప్రత్యర్థిగా భారత్ ముందు నిలిచింది. బలాబలాలు, ఫామ్ దృష్ట్యా విండీస్కంటే టీమిండియా ఎంతో మెరుగ్గా కనిపిస్తుండగా... తమదైన రోజున చెలరేగితే ఆ జట్టు నుంచి కూడా గట్టి పోటీ తప్పకపోవచ్చు. మిగిలిన మూడు మ్యాచ్లు గెలిస్తే తప్ప వరల్డ్కప్లో ముందుకెళ్లడంపై ఆశలు పెట్టుకోలేని స్థితిలో విండీస్ ఉండగా... ఈ మ్యాచ్లో గెలిస్తే కోహ్లి సేన సెమీస్కు దాదాపుగా చేరువవుతుంది. మాంచెస్టర్: మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియాలపై సాధించిన సాధికారిక విజయాలు భారత్ ఆధిపత్యాన్ని చూపాయి. అయితే అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్ ఒక్కసారిగా జట్టులో కొత్త లోపాలను చూపించింది. వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లే క్రమంలో మరో కీలక మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఇక్కడి ఓల్డ్ట్రఫోర్డ్ మైదానంలో నేడు జరిగే తమ ఆరో లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్తో టీమిండియా తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఒకే మ్యాచ్ గెలిచిన విండీస్ ఈ సారైనా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. ధోని ఎలా ఆడతాడో! సాధారణంగా వ్యక్తిగతంగా ఆటగాళ్లను విమర్శించడాన్ని ఇష్టపడని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా అఫ్గాన్తో మ్యాచ్లో ధోని బ్యాటింగ్ను తప్పుపట్టాడు. వాస్తవంగా కూడా గత మ్యాచ్లో మాజీ కెప్టెన్ మిడిలార్డర్లో ఆడిన తీరు జట్టును ఆందోళన కలిగించేదే. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ధోని బ్యాటింగ్పైనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఇది మినహా టీమిండియా జట్టు కూర్పు విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కనిపించడం లేదు. రోహిత్, రాహుల్, కోహ్లిలతో టాపార్డర్ పటిష్టంగా ఉండగా... విజయ్ శంకర్ మరోసారి నాలుగో స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అఫ్గాన్పై అర్ధ సెంచరీ సాధించిన కేదార్ జాదవ్ కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. నలుగురు రెగ్యులర్ బౌలర్లతో గత పోరులో భారత బ్యాటింగ్ కొంత బలహీనంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు స్పిన్నర్లలో జడేజాను ఆడించే అవకాశం కూడా కనిపిస్తోంది. భువనేశ్వర్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షమీ హ్యాట్రిక్ ప్రదర్శనతో తన చోటు ఖాయం చేసుకున్నాడు. గాయం నుంచి కోలుకొని భువీ ఈ మ్యాచ్ కోసం సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేసినా... ఇప్పటికిప్పుడు షమీని తప్పించకపోవచ్చు. బుమ్రా మరోసారి పదునైన ఆరంభం ఇస్తే విండీస్ను దెబ్బ తీయడం భారత్కు కష్టం కాదు. బ్రాత్వైట్ మళ్లీ చెలరేగితే... కివీస్తో మ్యాచ్లో విండీస్ దురదృష్టవశాత్తూ మంచి విజయావకాశాన్ని చేజార్చుకుంది. అయితే విండీస్ బ్యాటింగ్ లోతు ఎలాంటిదో ఈ మ్యాచ్ చూపిం చింది. వరుసగా విధ్వంసక ఆటగాళ్లు ఉన్న ఆ జట్టు సమష్టిగా చెలరేగితే ఆపడం ఎవరి తరం కాదు. మధ్యలో కొన్ని మ్యాచ్లు విఫలమైనా... గేల్ దూకుడు గురించి భారత్కు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హోప్, హెట్మైర్ తమపై ఉన్న అంచనాలకు తగినట్లుగా రాణించాల్సి ఉంది. హెట్మైర్కు స్పిన్ను సమర్థంగా ఎదుర్కోగల నైపుణ్యం ఉంది. గత మ్యాచ్ హీరో బ్రాత్వైట్ తన జోరు కొనసాగిస్తే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఈ ప్రపంచకప్లో వెస్టిండీస్ పదునైన పేస్ బౌలింగ్ కూడా చెప్పుకోదగ్గ అంశం. ముఖ్యంగా కాట్రెల్ ప్రతీ జట్టుపై చెలరేగిపోయాడు. ఆరంభంలో అతని లెఫ్టార్మ్ పేస్ను ఎదుర్కోవడం భారత ఓపెనర్లకు అంత సులువు కాదు. ఈ విషయంలో రోహిత్ తరచుగా విఫలమయ్యాడు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, విజయ్ శంకర్, ధోని, జాదవ్, పాండ్యా, కుల్దీప్, చహల్/ జడేజా, షమీ, బుమ్రా. వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), గేల్, లూయిస్, హోప్, పూరన్, హెట్మైర్, బ్రాత్వైట్, నర్స్, రోచ్, కాట్రెల్, థామస్. పిచ్, వాతావరణం ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం బ్యాటింగ్కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. భారత్ ఇదే వేదికపై ఇప్పటికే పాక్తో ఆడగా... విండీస్ కూడా న్యూజిలాండ్ను ఇక్కడే ఎదుర్కొంది. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. ముఖాముఖి రికార్డు భారత్, వెస్టిండీస్ జట్లు ఇప్పటివరకు 126 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్ల్లో భారత్... 62 మ్యాచ్ల్లో వెస్టిండీస్ విజయం సాధించాయి. రెండు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి. మూడు మ్యాచ్లు రద్దయ్యాయి. ప్రపంచకప్లో ఈ రెండు జట్లు ఎనిమిది మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఐదు మ్యాచ్ల్లో భారత్, మూడు మ్యాచ్ల్లో విండీస్ గెలిచాయి. ప్రపంచకప్లో చివరిసారి 1992లో భారత్పై విండీస్ గెలిచింది. 1996, 2011, 2015 ప్రపంచకప్ మ్యాచ్ల్లో భారత్ను విజయం వరించింది. ఎమ్మెస్కే కీపింగ్ చేయగా... విండీస్తో మ్యాచ్కు ముందు రోజు భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ జోరుగా సాగింది. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ నిర్విరామంగా బౌలింగ్ చేస్తూ ఫిట్గా కనిపించాడు. అతను ‘సింగిల్ వికెట్’ బౌలింగ్ చేస్తున్న సమయంలో భారత మాజీ కీపర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కీపర్గా వ్యవహరించడం విశేషం. ఆ తర్వాత కూడా భారత ఆటగాళ్లతో ప్రసాద్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించడం విశేషం. రిజర్వ్ కీపర్ పంత్ కూడా చాలా సేపు ఫీల్డింగ్ చేశాడు. మరో వైపు ఎమ్మెస్ ధోని స్పిన్నర్ల బౌలింగ్లో ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా అతను స్వీప్ షాట్లు ఆడటంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. గత మ్యాచ్లో అఫ్గాన్ స్పిన్ను ఎదుర్కోవడంలోనే ధోని బాగా ఇబ్బంది పడిన విషయం గమనార్హం. కోహ్లి అన్ని ఫార్మాట్లలో వరల్డ్ నంబర్వన్ బ్యాట్స్మన్. ధోని స్ట్రయిక్రేట్ను కోహ్లితో పోల్చడం సరైంది కాదు. కాబట్టి ధోని ఆటను మరెవరితోనూ పోల్చవద్దు. మేం ఆ మ్యాచ్లో స్వల్ప లక్ష్యాన్ని కూడా కాపాడుకున్నాం. ధోని పరిస్థితులను బట్టి ఆడతాడు. కాబట్టి అతని బ్యాటింగ్ గురించి ఆందోళన అనవసరం. ధోని ఒక్కడితోనే కాదు కోచ్లు, సహాయక సిబ్బంది ఇతర బ్యాట్స్మెన్ అందరితో కూడా వారి ఆటపై చర్చిస్తూనే ఉంటాం. – భరత్ అరుణ్, భారత బౌలింగ్ కోచ్ 50: హార్దిక్ పాండ్యాకు ఇది 50వ మ్యాచ్. మరో 2 వికెట్లు తీస్తే అతని 50 వికెట్లు పూర్తవుతాయి. 59: గేల్ మరో 59 పరుగులు చేస్తే విండీస్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లారాను అధిగమిస్తాడు. -
83.. భారత క్రికెట్లో ఒక మరుపురాని జ్ఞాపకం
న్యూఢిల్లీ : జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఈ తేదీ ఒక సంచలనం. భారత క్రికెట్ అభిమానులకు ఒక మరుపురాని జ్ఞాపకం. సరిగ్గా ఇదే తేదీన 36 ఏళ్ల కిందట కపిల్ దేవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు లార్డ్స్ మైదానంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. అభేద్యమైన వెస్టిండీస్ జట్టును ఫైనల్లో మట్టికరిపించి.. ప్రపంచకప్ను ఒడిసిపట్టింది. మొట్టమొదటి విశ్వ క్రికెట్ కిరీటాన్ని స్వదేశానికి సగర్వంగా తీసుకొచ్చింది. 36 వసంతాల కిందటి ఈ అద్భుత విజయమే.. భారత క్రికెట్ను సమూలంగా మార్చివేసిందని చెప్పవచ్చు. ఈ ప్రపంచకప్ విజయం ప్రపంచ క్రికెట్లో భారతదేశ ఉనికిని బలంగా చాటింది. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఘట్టమిది. 1983లో భారత జట్టుకు సరైన సదుపాయాలు కూడా లేవు. జట్టుకు కావాల్సిన అవసరాలను కూడా తీర్చలేని స్థితిలో నాటి భారత క్రికెట్ బోర్డు ఉండేది. ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు సన్మానం చేయడానికి కూడా నిధులు లేని పరిస్థితి. భారత జట్టు ఈ అపూర్వ విజయాన్ని సాధించిన తర్వాత క్రికెటర్లను సన్మానించడానికి.. ప్రఖ్యాత గాయకురాలు లతా మంగేష్కర్లో సంగీత కచేరీ నిర్వహించి విరాళాలు సేకరించారు. ఇక, 1983నాటి ప్రపంచకప్ పరిస్థితులను పరిశీలిస్తే.. అప్పటివరకు ఏ అంచనాలు లేని కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి బలమైన దేశాలను మట్టికరిపించింది. ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ నుంచి ఫైనల్స్కు భారత జట్టును చేర్చడంలో కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. లీగ్మ్యాచ్లో జింబాబ్వేపై కపిల్ వీరోచితమైన ప్రదర్శనతో 175 పరుగులు చేసి భారత జట్టును ఫైనల్కు చేర్చాడు. ప్రపంచకప్ ఫైనల్ రోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల టీవీలు, రేడియోల ముందు భారత అభిమానులు మ్యాచ్ను తిలకించారు. భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 183 పరుగులు చేసింది. భారత జట్టుకు ఉన్న మదన్ లాల్ , మోహిందర్ అమర్నాథ్ వంటి బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ పటిమతో వెస్టిండీస్ను 140 పరుగులకు ఆలౌట్ చేసి ప్రపంచకప్ను భారతదేశం ఒడిలోకి చేర్చి క్రికెట్ చరిత్రలో నిలిచిపోయారు. ఆ మధుర క్షణాలు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మనస్సుల్లో భద్రంగా ఉన్నాయి. -
రణ్వీర్ సింగ్కు నోటీసులు..
ముంబై: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్కు లీగల్ నోటీసులు వచ్చాయి. ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ ఆటగాడు బ్రాక్ లెస్నర్, అతని లాయర్ పాల్ హేమాన్ ఈ నోటీసులను రణ్వీర్కి పంపించారు. బ్రాక్ లెస్నర్కి చెందిన ఓ నినాదాన్ని ప్రపంచ కప్లో భాగంగా రణ్వీర్ ఉపయోగించింనందుకు వారు ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. గత ఆదివారం ప్రపంచ కప్లో భాగంగా భారత్, పాక్ల మధ్య జరిగిన మ్యాచ్ను రణ్వీర్ వీక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రణ్వీర్ హార్దిక్ పాండ్యాను అభినందిస్తూ.. తన ట్విట్టర్ ఖాతాలో ‘ ఈట్, స్లీప్, డామినేట్, రిపీట్ ’ అనే మేసేజ్తో హార్ధిక్తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. దీనిపై పాల్ హేమాన్ స్పందిస్తూ.. ‘రణ్వీర్ ఉపయోగించిన నినాదం బ్రాక్ లెస్నర్దని.. ఆ నినాదంపై కాపీ రైట్ కూడా అతని వద్ద ఉందన్నారు. రణ్వీర్కు చట్టపరంగా నోటీసులను పంపుతున్నట్లు వెల్లడించారు. -
బాధ్యతగా ఆడాలి: విలియమ్సన్
లండన్: బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో స్వల్ప వ్యవధిలో కోల్పోయిన వికెట్లతో ఇబ్బందులెదురయ్యాయని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెప్పాడు. బ్యాట్స్మెన్ మరింత బాధ్యతగా ఆడాల్సివుందని అన్నాడు. ‘ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఫీల్డింగ్ అద్భుతం. మొదట బంగ్లా చక్కగా బ్యాటింగ్ చేసింది. పిచ్ పరిస్థితుల దృష్ట్యా 250 మెరుగైన స్కోరే! దీంతో ఛేదనలో వికెట్లు కాపాడుకుంటే మంచిదని భావించాం. బ్యాటింగ్లో కష్టపడితేనే విజయం దక్కుతుంది. అయితే రెండు సార్లు స్వల్పవ్యవధిలో కోల్పోయిన వికెట్లతో కష్టాల్లో పడ్డాం. చివరకు విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’ అని విలియమ్సన్ అన్నాడు. బంగ్లాదేశ్తో బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో గట్టెక్కింది. మొదట బంగ్లాదేశ్ 49.2 ఓవర్లలో 244 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాస్ టేలర్ (91 బంతుల్లో 82; 9 ఫోర్లు) కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. పది ఓవర్లలోపే ఓపెనర్లు గప్టిల్ (25), మున్రో (24) వికెట్లను కివీస్ కోల్పోయింది. ఆ తర్వాత విలియమ్సన్ (40; 1 ఫోర్), టేలర్ మూడో వికెట్కు 105 పరుగులు జోడించారు. ఆ తర్వాత కివీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినా... చివర్లో టెయిలెండర్ సాన్ట్నర్ (17 నాటౌట్; 2 ఫోర్లు) పట్టుదలగా ఆడటంతో న్యూజిలాండ్ గట్టెక్కింది. -
బాలీవుడ్కి బన్నీ?
అల్లు అర్జున్ బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ నటించనున్న చిత్రంపై ఎటువంటి క్లారిటీ లేదు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తారని టాక్. ఇప్పుడు మరో టాక్ ఏంటంటే.. మాజీ భారత కెప్టెన్ కపిల్దేవ్ బయోపిక్ ‘83’ చిత్రంలో అల్లు అర్జున్ నటించనున్నారట. కపిల్దేవ్ సారథ్యంలో 1983లో భారత్ క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ‘83’లో కపిల్దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ చేస్తున్నారు. ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రకు చిత్రవర్గాలు అల్లు అర్జున్తో సంప్రదింపులు జరుపుతున్నారట. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాలీవుడ్లో ఆయన చేసే మొదటి చిత్రం ఇదే అవుతుంది. -
పేరుకే 'ప్రపంచకప్'
2014 హాకీ ప్రపంచకప్లో 12 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి జట్ల సంఖ్య 16కు పెరిగింది. వచ్చే ఏడాది జరిగే బాస్కెట్బాల్ ప్రపంచ కప్లో పాల్గొనే జట్ల సంఖ్యను 24 నుంచి 32కు పెంచారు. ప్రస్తుతం ఉన్న 32 జట్ల నుంచి 2026 ఫుట్బాల్ ప్రపంచకప్లో భాగమయ్యే దేశాల సంఖ్యను 48కి పెంచాలని ‘ఫిఫా’ ప్రతిపాదించింది. ఇదంతా ఆయా ఆటలకు ప్రాచుర్యం పెంచే ఆలోచన, ‘ప్రపంచం’లో ఎక్కువ మందికి చేరువయ్యేలా, వారు కూడా భాగమయ్యేలా చేసే పద్ధతి. క్రికెట్కు వచ్చేసరికి 2015లో వన్డే వరల్డ్ కప్ 14 జట్లతో జరిగింది. వచ్చే సంవత్సరం ఇంగ్లండ్లో జరిగే టోర్నీ 10 దేశాలకు మాతమ్రే పరిమితం. 105 సభ్య దేశాలు ఉన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పేరుకే ప్రపంచకప్ను నిర్వహిస్తున్న తీరు ఇది. ఇందులోనూ ఎనిమిది జట్లకు మాత్రమే చోటు ఖరారు చేసి, మిగిలిన 2 స్థానాల కోసం మరో పది జట్ల మధ్య క్వాలిఫయింగ్ పేరుతో నిర్వహించిన ప్రహసనం మరొకటి. ఐసీసీ తమ వెబ్సైట్లో ప్రపంచ వ్యాప్తంగా ఆటకు ప్రాచుర్యం కల్పించడం, క్రీడా స్ఫూర్తి గురించి చాలా చెప్పుకుంటోంది. కానీ వారి మాటలకు, చేతలకు పొంతనే లేదు. తమ ‘విలువల’ గురించి వారు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. –ప్రెస్టన్ మామ్సెన్, స్కాట్లాండ్ సీనియర్ క్రికెటర్ సాక్షి క్రీడా విభాగం : 1975లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 11 టోర్నీలు జరిగాయి. ప్రతీ సారి కనీసం ఒక్క అసోసియేట్ టీమ్ అయినా టోర్నీలో పాల్గొంది. మొదటిసారి అసోసియేట్ టీమ్ ప్రాతినిధ్యం లేకుండా వరల్డ్ కప్ జరగనుంది. ‘ఏకపక్ష మ్యాచ్లు జరుగుతాయి, ఆసక్తి తక్కువ’ పేరుతో ఐసీసీ చిన్న జట్లను మెగా టోర్నీకి దూరంగా ఉంచడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అదృష్టవశాత్తూ సుడి తిరగడంతో వెస్టిండీస్ చివరి క్షణంలో క్వాలిఫై అవగలిగింది కానీ నిజంగా విండీస్ ఓడిపోయి దూరమై ఉంటే వరల్డ్ కప్కు కళ ఉండేదా! అసలు జట్లను పదికి పరిమితం చేయడంలోనే ఐసీసీ వైఫల్యం కనిపిస్తోంది. జట్ల సంఖ్యను పెంచకపోవడం సరే... 2015 తరహాలో కనీసం 14 టీమ్లతోనైనా నిర్వహించడం వారికి ఎందుకు చేత కావడం లేదనేదే అసలు ప్రశ్న. అసలు 10 జట్ల టోర్నీని ప్రపంచకప్ అనగలమా? అద్భుతంగా ఆడినా... వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ మాత్రమే అసలు టోర్నీకి అర్హత సాధించినా... క్వాలిఫయింగ్లో మిగతా జట్లు కూడా అద్భుతమైన ఆటతీరు కనబర్చాయి. ముఖ్యంగా అఫ్గాన్ను ఓడించి, జింబాబ్వేతో మ్యాచ్ ‘టై’ చేసుకొని విండీస్ను దాదాపు ఓడించినంత పని చేసిన స్కాట్లాండ్కు తుది ఫలితం గుండె పగిలేలా చేసింది. కనీస మ్యాచ్ ఫీజులు లేని, రోజూవారీ ఖర్చులకు కూడా డబ్బులు లేని దివాళా స్థితిలో జింబాబ్వే ఈ టోర్నీలో పట్టుదలగా ఆడి మంచి విజయాలు సాధించింది. కానీ డక్వర్త్ లూయిస్ కారణంగా 3 పరుగులతో ఓడిన ఆ జట్టు అర్హత సాధించలేకపోయింది. వరల్డ్ కప్లో కూడా తమను చూసుకోలేని ఇలాంటి స్థితిలో జింబాబ్వే క్రికెట్ మరింత పతనం కావడం ఖాయం. ఎన్నో సార్లు సంచలన ప్రదర్శనతో వరల్డ్ కప్ ఆడే స్థాయి తమకు ఉందని నిరూపించుకున్న ఐర్లాండ్ కూడా త్రుటిలో అవకాశం కోల్పోయింది. టోర్నీని పది జట్లకే పరిమితం చేయకుండా ఉంటే ఈ టీమ్లన్నీ విశ్వ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమయ్యేవి. బలహీన జట్లు ఉంటే టోర్నీ వన్నె తగ్గుతుందని గుడ్డిగా నమ్ముతున్న ఐసీసీకి... పసికూనలుగా బరిలోకి దిగి వరల్డ్ కప్లలో కెన్యా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ సాధించిన సంచలన విజయాల గురించి తెలియదా? కంగాళీ నిర్వహణ... పది జట్ల నుంచి రెండింటికి మాత్రమే అర్హత సాధించే అవకాశం ఉన్నప్పుడు ఆయా టీమ్ల కోణంలో క్వాలిఫయింగ్ టోర్నీకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా వారి అవకాశాలను దెబ్బ తీయవచ్చు. కానీ ఐసీసీ మాత్రం ఈ టోర్నీని అథమ స్థాయిలో నిర్వహించింది. నిబంధనలపై వారికే స్పష్టత లేకుండా పోయింది. కొన్ని మ్యాచ్లకు వన్డే హోదా ఇచ్చి మరికొన్నింటికి దేశవాళీ మ్యాచ్గా గుర్తింపు ఇచ్చింది. లీగ్ దశలో లేని సూపర్ ఓవర్ నిబంధనను అప్పటికప్పుడు సూపర్ సిక్స్లో చేర్చి తర్వాతి రోజే దానిని తొలగించింది. జింబాబ్వేలో వర్షాకాలంలో మ్యాచ్లు నిర్వహిస్తూ కనీసం సూపర్ సిక్స్కు కూడా రిజర్వ్ డే పెట్టకుండా డక్వర్త్ లూయిస్కే ఫలితాన్ని అప్పగించేసింది. అన్నింటికి మించి ఇంత ప్రాధాన్యత ఉన్న టోర్నీకి కనీసం డీఆర్ఎస్ అమలు చేయలేదు. అంపైర్ తప్పుడు ఎల్బీడబ్ల్యూ నిర్ణయంతో స్కాట్లాండ్.. రెండు సార్లు తప్పుడు నోబాల్లతో జింబాబ్వే తమ విజయావకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. పెద్ద దేశాలు, ఆదాయ పంపిణీలే తప్ప చిన్న జట్ల భవిష్యత్తు, ఆయా దేశాల్లో క్రికెట్ ఎదుగుదల గురించి ఏమాత్రం పట్టింపు లేని ఐసీసీ లెక్కలేనితనమే ఈ టోర్నీ నిర్వహణలో కనిపించింది. ఎప్పుడో మళ్లీ వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆ దేశాల్లో క్రికెట్ మనగలుగుతుందా! -
విండీస్కు విషమ పరీక్ష
ప్రపంచ క్రికెట్ను శాసించింది వెస్టిండీస్. ఇది కరీబియన్ క్రికెట్ గతం... ఘనం. ప్రపంచకప్లో ఎదురులేదనిపించింది వెస్టిండీస్. ఇది ఒకప్పటి మాట. కానీ... ఈ మాట ఓ మూటగా అటకెక్కింది. విండీస్ క్రికెట్ అథఃపాతాళానికి పడిపోయింది. అది ఎంతగా అంటే... అప్పట్లో తమకు పోటీరాని జట్లపై సాటిలేని విజయాలు సాధించిన జట్టే... ఇప్పుడు మెగా ఈవెంట్ అర్హత కోసం కూనలతో తలపడాల్సినంత దైన్యంగా తయారైంది. ఇదంతా వెస్టిండీస్ కథైతే... ఇప్పుడు ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గురించి తెలుసుకుందాం... హరారే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ఆటకు నేటి నుంచి తెరలేవనుంది. ఈ ‘రెండు బెర్తుల’ (తుది అర్హత 2 జట్లకే) పోటీలకు జింబాబ్వే ఆతిథ్యమిస్తుంది. బరిలో పది జట్లున్నా... 2019 వన్డే ప్రపంచకప్ వేదిక ఇంగ్లండ్కు చేరే సత్తా వెస్టిండీస్, అఫ్గానిస్తాన్లకే ఉండొచ్చు. ఎటువంటి సంచలనాలు లేకపోతే తుదకు అర్హత సాధించేవి ఆ రెండు జట్లేననే అంచనాలున్నాయి. జాసన్ హోల్డర్ నాయకత్వంలోని విండీస్ జట్టు క్రిస్ గేల్, కార్లోస్ బ్రాత్వైట్, ఇవిన్ లూయిస్, మార్లోన్ శామ్యూల్స్లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే వార్మప్ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ చేతిలో విండీస్కు అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో విండీస్ తన ప్రత్యర్థి జట్లను తక్కువ అంచనా వేస్తే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశముంది. పది జట్లతోనే ప్రపంచకప్... గతంలో వన్డే ప్రపంచకప్ 12 జట్లతో, 14 జట్లతోనూ జరిగాయి. బోర్ మ్యాచ్లు బోలెడు ఉండేవి. దీంతో చప్పగా సాగే ప్రపంచకప్కు చరమగీతం పాడుతూ మేటి పది జట్లకే ఈ భాగ్యం కల్పించారు. అయితే తమ అసోసియేట్, అఫీలియేట్ జట్లకు న్యాయం చేయలనుకుంది ఐసీసీ. ఈ ఉద్దేశంతోనే ర్యాంకింగ్స్లో టాప్–10లో మొదటి 8 జట్లకే నేరుగా ప్రపంచకప్ ఆడే అవకాశమిచ్చింది. మిగతా రెండు బెర్తుల కోసం క్వాలిఫయింగ్ ఈవెంట్ను నిర్వహిస్తోంది. అంటే ర్యాంకింగ్స్లో దిగువన ఉన్న జట్లు, ఐసీసీ శాశ్వత సభ్య దేశాలు (విండీస్, జింబాబ్వే, ఐర్లాండ్, అఫ్గాన్)తో పాటు మరో ఆరు అసోసియేట్, అఫీలియేట్ జట్లు ఈ అర్హత పోటీల్లో తలపడతాయి. ఇందులో చివరకు విజేత, రన్నరప్ జట్లు ఇంగ్లండ్ బయల్దేరతాయి. మిగతా ఆరు జట్ల సంగతేంటి? ఐసీసీలో అసోసియేట్, అఫీలియేట్ జట్లు ఎన్నో ఉన్నాయి. కానీ ఆరు జట్లే అర్హతకెలా వచ్చాయంటే... నెదర్లాండ్స్, స్కాట్లాండ్, హాంకాంగ్, పపువా న్యూగినియాలు ప్రపంచ క్రికెట్ లీగ్ (డబ్ల్యూసీఎల్) చాంపియన్షిప్ ద్వారా (టాప్–4) అర్హత పొందాయి. మిగతా రెండు జట్లు యూఏఈ, నేపాల్ డబ్ల్యూసీఎల్ డివిజన్–2 టోర్నీ ద్వారా క్వాలిఫయింగ్ ఛాన్స్ దక్కించుకున్నాయి. లైవ్ లేదు... డీఆర్ఎస్ లేదు గతంలో ప్రపంచకప్ అర్హత కోసం క్రికెట్ లీగ్ డివిజన్, చాంపియన్షిప్లు నిర్వహించారు. కానీ ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. అయితే ఈసారి ఐసీసీ బ్రాడ్కాస్ట్ చేయాలనుకుంది. స్టార్ నెట్ వర్క్ వద్ద హక్కులున్నాయి. కానీ స్టార్ చానెళ్లు తమకు గిట్టుబాటు కాదనో లేక ఇతరాత్ర కారణాలేవైనా... ఏవో కొన్ని తప్ప మొత్తం అన్ని మ్యాచ్లను ప్రసారం చేయడం లేదు. దీంతో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)కి అవకాశం లేదు. పైగా డీఆర్ఎస్ ఆర్థికంగా కూడా భారమే! అఫ్గాన్, స్కాట్లాండ్ల మధ్య తొలి పోరు పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. మొత్తం 34 మ్యాచ్లు జరుగుతాయి. గ్రూప్ ‘ఎ’లో వెస్టిండీస్, ఐర్లాండ్, పపువా న్యూగినియా, యూఏఈ... గ్రూప్ ‘బి’లో అఫ్గానిస్తాన్, నేపాల్, హాంకాంగ్, స్కాట్లాండ్, జింబాబ్వే జట్లున్నాయి. ఒక్కో గ్రూపు నుంచి మూడేసి జట్లు సూపర్ సిక్స్కు అర్హత సాధిస్తాయి. ఇందులో టాప్–2 జట్లు ఫైనల్ చేరతాయి. అఫ్గాన్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్తో క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతాయి. -
అప్పుడే నా రిటైర్మెంట్! - యువరాజ్
సాక్షి, స్పోర్ట్స్ : 2019 ప్రపంచకప్ తర్వాతే రిటైర్మెంట్పై ఓ నిర్ణయం తీసుకుంటానని టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పష్టం చేశారు. గతేడాది జూన్లో చివరిసారిగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన యువరాజ్ జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్పై వస్తున్న ప్రశ్నలపై యూవీ ఓ స్పోర్ట్స్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ‘ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నా. 2019 ప్రపంచకప్కు ఎంపికవ్వడానికి ఉపయోగపడే ఈ టోర్నీ నాకెంతో ముఖ్యం. నేను 2019 వరకు క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. ఏదైమైనా నా రిటైర్మెంట్ నిర్ణయం 2019 తర్వాతే ప్రకటిస్తా. నా కెరీర్ తొలి 6-7 ఏళ్లు అద్భుతంగా సాగింది. కానీ గొప్ప ఆటగాళ్లు ఉండటంతో టెస్టు మ్యాచ్లో అవకాశాలు రాలేదు. అవకాశం వచ్చినప్పుడు క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నాను. ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలీదు. ఏది మన చేతుల్లో లేదు. నేనిప్పుడు కేవలం నా ఆటపైనే దృష్టి సారించాను.’అని యువీ చెప్పుకొచ్చాడు. ఇక దక్షిణాఫ్రికా గడ్డపై కోహ్లి సేన విజయంపై స్పందిస్తూ.. ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన ఇచ్చారని, ముఖ్యంగా విరాట్ కెప్టెన్గా ముందుండి నడిపించాడని కొనియాడాడు. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్లు అద్భుతంగా రాణించారని చెప్పుకొచ్చారు. అండర్-19 ప్రపంచకప్ సాధించిన యువ ఆటగాళ్లకు ఐపీఎల్ చక్కని వేదికని ఈ సిక్సర్ల సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీని ఆస్వాదిస్తూ.. మరింత రాటుదేలుతారని యువీ అభిప్రాయపడ్డాడు. -
భారత్ శుభారంభం
దుబాయ్: అంధుల వన్డే ప్రపంచకప్లో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 359 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32 ఓవర్లలో అధిగమించింది. భారత ఓపెనర్ దీపక్ మాలిక్ (103 బంతుల్లో 179) అజేయ శతకంతో చెలరేగాడు. ప్రకాశ్ జయరామయ్య 76 పరుగులు చేశాడు. అంతకుముందు శ్రీలంక 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. సురంగ సంపత్ (68), కేఏ సిల్వా (64) రాణించారు. -
ఇండియన్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త అందించింది. 2023 వన్డే వరల్డ్ కప్ను భారత్లో నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బీసీసీఐ సర్వసభ్య సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించింది. దీంతో తొలిసారి పూర్తిస్థాయి ప్రపంచకప్నకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2023లో వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్కప్తోపాటు 2021 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్లో నిర్వహించబోతున్నారంట. ఇక గతంలో పలుసార్లు భారత్లో క్రికెట్ వరల్డ్ కప్ లు జరిగాయి. అయితే, ఆయా మ్యాచ్లకు భారత్ పూర్తి స్థాయి ఆతిథ్యం ఇవ్వలేదు. ఇతర దేశాలతో కలిసి వేదికను పంచుకుంది. 1987, 1996, 2011 లలో భారత్ వరల్డ్ కప్ను నిర్వహించింది. 1983, 2011లో భారత్ కప్లను కైవసం చేసుకుంది. దీంతోపాటు 2019-23 సంవత్సరాల కాలంలో భారత్ స్వదేశంలో మొత్తం 81 మ్యాచ్లు ఆడబోతుందని బీసీసీఐ వెల్లడించింది. 2019 ఐసీసీ వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. -
వన్డేలకు హాడిన్ వీడ్కోలు
సిడ్నీ: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ విజయానంతరం గత మార్చిలోనే తాను ఇక వన్డేలు ఆడలేనని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా 126 వన్డేలు ఆడిన హాడిన్ 3,122 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 16 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే 170 క్యాచ్లు, 11 స్టంపింగ్లు చేశాడు. ‘నా వన్డే కెరీర్ అద్భుతంగా సాగింది. ఆసీస్ తరఫున మూడు ప్రపంచకప్ల్లో పాలుపంచుకున్నాను. ఇక ముగింపునకు ఇదే సరైన సమయంగా భావించాను’ అని 37 ఏళ్ల హాడిన్ తెలిపాడు. అయితే టెస్టు ఫార్మాట్లో కొనసాగుతున్న హాడిన్ నేడు (సోమవారం) వెస్టిండీస్, ఇంగ్లండ్లతో టెస్టు సిరీస్ కోసం జట్టుతో పాటు వెళ్లనున్నాడు. -
క్రికెట్ ఫీవర్
నేటి దాయాదుల పోరుపై సర్వత్రా ఉత్కంఠ నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు టీమిండియా గెలుపు కోసం ప్రత్యేక పూజలు విజయవాడ స్పోర్ట్స్ : నగరానికి ఒక్కసారిగా క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఒక్కడ చూసినా టీమిండియా చరిత్రను రిపీట్ చేస్తుందా.. పాకిస్తాన్ చరిత్రకు చెక్ పెడుతుందా.. అనే చర్చసాగుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యమిస్తున్న పదో క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ శనివారమే ప్రారంభమైంది. అయితే, ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే దాయాదుల పోరుపైనే అందరి దృష్టి నెలకొంది. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్ను తిలకించేందుకు నగర వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రీడాభిమానుల కోసం నగరంలోని ముఖ్య హోటళ్లు, క్లబ్లలో ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటుచేశారు. టీమిండియా గెలుపొందాలని అభిమానులు పలు ఆలయాల్లో పూజలు చేశారు. ఎమ్మెల్యే బొండా ఉమా కూడా పూజలు నిర్వహించారు. చరిత్ర రిపీట్ కావాలని... ప్రపంచ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియాపై ఈసారి పెద్దగా అంచనాలు లేవు. అయినప్పటికీ పాకిస్తాన్తో జరిగే తొలి మ్యాచ్కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. క్రికెట్ ప్రపంచ కప్ ప్రాంభించిన 1975 నుంచి ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్పై ఒక్క మ్యాచ్లో కూడా భారత్ ఓడిపోలేదు. ఇటీవల టీమిండియా క్రికెటర్లు ఫాం కోసం తంటాలు పడుతున్నారు. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి చరిత్ర పునరావృతం చేస్తుందా.. లేక పాకిస్తాన్ విజయం సాధించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందా.. అనే అంశంపై సర్వత్రా చర్చనడుస్తోంది. ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం విజయవాడ క్లబ్, ఎగ్జిక్యూటీవ్ క్లబ్, పెద్దపెద్ద హోటల్స్లో క స్టమర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలుపొంది సెమీస్ వరకు చేరితే నగరం నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణం కట్టేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. జోరుగా బెట్టింగ్లు..! ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్పై భారీ అంచనాలు ఉంటాయి. అదే తరహాలో పందేలు, బెట్టింగ్లకు తెరతీయనుంది. నగరంలోని బెట్టింగ్ రాయుళ్లు ఇప్పటికే తమ ఏజెంట్ల ద్వారా పందేలు ప్రారంభించారు. గెలుపు, ఓటములపైనే కాకుండా క్రీడాకారుల వ్యక్తిగత పరుగులు, వికెట్లు.. ఇలా రకరకాలుగా పందేలు కాస్తున్నారు. రాజధానిగా ప్రకటించిన తర్వాత నగరంలో ట్రాఫిక్ పెరగడంతో విసిగెత్తిపోతున్న ప్రజలకు బహుశా ఆదివారం పగలంతా కాస్తంత ఉపశమనం కలగవచ్చు. దాయాదుల పోరు జరుగుతున్నంత సేపూ ఎవరూ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదు.