Youtube video
-
కడపుబ్బా నవ్వించే డాక్టర్! ఇలా కూడా ఆరోగ్య సూచనలు ఇవ్వొచ్చా?
నవ్వు ఆరోగ్యానికి మంచిది అని అంటుంటారు. మనస్పూర్తిగా నవ్వేవాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని కూడా అంటారు. నవ్వు నాలుగు విధాల చేటు అనేది తప్పని, చాలా రోగాలకు చిరునవ్వు చక్కటి ఔషధం అని విన్నాం. అయితే అది ఎలాగే ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు ఓ వైద్యుడు. ఏ డాక్టర్ చేయని రీతీలో రోగులకు ఆరోగ్యంపై అవగాహన కలిగేలా చేస్తూనే కామెడీ షో నిర్వహిస్తున్నాడు. వారందర్నీ కడుపుబ్బా నవ్వేలా చేసి ఆరోగ్యంగా ఉండమని చెబుతున్నాడు. అంతేగాదు ఆయన కామెడీ షో వీడియోలను యోట్యూబ్లో ఉన్న క్రేజ్ వింటే ఆశ్చర్యపోతారు. ఆ వైద్యుడు వైద్యలందరికంటే విభిన్నంగా ఈ జర్నీని ఎలా ఎంచుకున్నాడో తెలుసుకుందామా! కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్గా పిలిచే పళనియప్పన్ మాణిక్కమ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజషన్ కోసం ఆరోగ్యానికి సంబంధించిన కామెడీ వీడియోలను చేశారు. అ తర్వాత అదే తన ప్రోఫెషన్గా మార్చుకున్నాడు. అందుకు ప్రధాన కారణం 2020లో వచిన కరోనా మహమ్మారి. ఆ టైంలో లాక్డౌన్లతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ధైర్య చెప్పేలా యూట్యూబ్లో ఈ కామెడీ వీడియోలు చేయడం నుంచి మొదలైంది ఆయన జర్నీ. అలా ఆయన తన వీడియోల్లో హాస్యాన్ని జోడిస్తు బరువు తగ్గడం, ఉపవాసం చేయడం తదితర చక్కటి ఆరోగ్య విషయాలను వివరించేవారు. దీంతో అతని వీడియోలకు భారీ ఫాలోయింగ్ రావడం మొదలైంది. ఆయన తొలి వీడియో క్లిప్ ఏకంగా ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇన్స్టాగ్రాంలో అయితే మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 'మెడ్కామ్' అనే యూట్యూబ్ ఛానెల్లో తన వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. అందులో వైద్య సమాచారంతో కూడిన కామెడీ షో ఉంటుంది. అందులో హేమోరాయిడ్స్, అనోరెక్టల్ సమస్యలు, పెద్దప్రేగు పెద్దప్రేగు క్యాన్సర్ గురించి వైద్యుడు పాల్ మాట్లాడతారు. ఆ అనారోగ్య సమస్యలను తదదైన శైలిలో సామాన్య రోగికి కూడా అర్థమయ్యేలా చెబుతాడు. ఇక్కడ రోగి భయపడడు కాదుగదా! ధైర్యంగా అనారోగ్య సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు. అందువల్లే అతని వీడియోలకు ఇంత క్రేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ డాక్టర్ పాల్ యూఎస్లో వైద్యుడిగా చేస్తున్న టైంలో ఏకంగా 110 కిలోల బరువు ఉండేవాడు. గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయోమోనని భయపడేవాడు. అసలు వైద్యుడిగా నేనే ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించి తాను చికిత్స అందించే రోగులకు చెబితేనే దాని ప్రభావం ఉంటుందని గ్రహించాడు. చాలామంది రోగులకు బరువుతగ్గాలని, వ్యాయామాలు చేయాలని సూచిస్తామే గానీ వైద్యులే ముందుగా ఇవేమీ చేయరని అన్నారు. ఇలా పాల్ ముందుగా తనాఉ చక్కటి జీవనశైలిని అవలంభించి ఆ తర్వాత తన వీడియోలతో ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాడు. గుండెకు స్టంట్ వేయించుకుంటే సరిపోదు, బరువు పెరగకుండా చూసుకోవడమూ చాల ముఖ్యం అని అంటున్నారు వైద్యుడు పాల్. ఆయన తన వీడియోల్లో చాల వరకు ప్రతి ఆరోగ్య సమస్యకు ఇప్పటి వరకు శాశ్వత నివారణ లేదని చెబుతారు. ఇక్కడ కేవలం వైద్యుడి మీద రోగికి గల నమ్మకం, అతడి మానసిక స్థితి తదితరాలే వ్యాధిని నయం చేయగలవని అన్నారు. అందుకే తాను నమ్మకంగా చెప్పగలను పెదాలపై ఉండే చిరునవ్వు రోగి ఆయుర్ధాయాన్ని పెంచగలదని. అందుకే తాను ఇలా హాస్య భరితంగా ఆరోగ్య సలహలు ఇస్తున్నాని అన్నారు డాక్టర్ పాల్. దీని గురించే చాలామంది రోగులు ఆయన స్టాండప్ కామెడీ షోకి వస్తారు. అక్కడ ఆయన చెప్పే ఆరోగ్య చిట్కాల తోపాటు హాస్య భరితంగా సాగే ఆరోగ్య సలహాలను మనసారా ఆశ్వాదిస్తారు. తన కామెడీలో శర్వణ కుమార్ అనే కాల్పనిక పాత్రతో హాస్యం పండిస్తారు. ఆ పాత్ర అతిగా అల్పాహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్ తినే వ్యక్తి. ఇలా శరవణ్ కుమార్ 'తినడం' అనే వీక్నెస్ అతని ఆరోగ్యానికి ఎలా చేటు తెస్తుందో హాస్యంతో వివరించడం విశేషం. ఇలాంటి శరవన్ కుమార్లు మనలో ఎందరో ఉన్నారని చెబుతుంటారు పాల్. తినాలనే కోరిక మిమ్మల్ని ఎలాంటి వాటిని తినేలా ప్రోత్సహిస్తుందో గమనించాలి అంటారు. అంతేగాదు డైటింగ్, ఉపవాసాల పేరుతో నోరు కుట్టేసుకోకుండా ప్రతి ఫంక్షన్కి హాజరయ్యి ఎలా తక్కువుగా తినాలో వివరిస్తారు. అక్కడ ఉండే ప్రతి ఒక్క పదార్థంతో అరటి ఆకు ప్లేట్ని నింపేలా కొద్ది కొద్దిగా వడ్డించుకోండి. ఇక్కడ మీ లోపల ఉన్న అంతరంగిక వ్యక్తి కోరిక తీరుతుంది. అన్ని రుచులు ఆశ్వాదిస్తూ తక్కువగా కడుపు ఫుల్ అయ్యేలా తినగలుగుతారని అంటారు డాక్టర్ పాల్ . మీరు కూడా అతని వీడియోలు చూసి మనసారా నవ్వుకుని హాయిగా జీవించండి. (చదవండి: న్యూమోనియాతో పోరాడుతుండగానే కరోనా బారినపడ్డ నటుడు విజయ్కాంత్!అలా కాకుండా ఉండాలంటే..) -
మోదీపై డాక్యుమెంటరీ.. దెబ్బకు ఆ లింక్లు బ్లాక్
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ.. బీబీసీ తీసిన డాక్యుమెంటరీలను షేర్ చేసే పలు యూట్యూబ్ వీడియోలను, ట్విటర్లోని ట్వీట్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార మత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే సంబంధిత యూట్యూబ్ వీడియోలు కలిగి ఉన్న 50కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలని ట్విట్టర్ని కేంద్రం ఆదేశించింది. ఐటీ నిబంధనల ప్రకారం.. విశేషాధికారాలను ఉపయోగించి సమాచార ప్రసార కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఐతే యూట్యూబ్, ట్విట్టర్ రెండూ ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. బీబీసీ భారత్లోకి డాక్యుమెంటెరీని అందుబాటులోకి తీసుకురానప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానెల్లు భారత్ వ్యతిరేక ఎజెండాను ప్రచారం చేయడానికి అప్లోడ్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే మళ్లీ తన ఫ్లాట్ఫామ్లో ఈ వీడియోలను అప్లోడ్ చేస్తే బ్లాక్ చేయమని యూట్యూబ్కు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేగాదు ఇతర ఫ్లాట్ఫామ్లలో ఈ వీడియో లింక్ను కలిగి ఉన్న ట్వీట్లను కూడా గుర్తించి బ్లాక్ చేయమని అదేశించినట్లు పేర్కొన్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నత ప్రభుత్వాధికారులు ఈ డాక్యుమెంటరీని పరిశీలించి.. దేశ ప్రతిష్టను దెబ్బ తీసేలా, భారత సుప్రీం కోర్టు అధికారం విశ్వసనీయతపై దుష్ప్రచారం చేసేలా, పైగా.. వివిధ భారతీయ వర్గాల మధ్య విభేదాలను కలిగించేలా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం ఫైర్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా ఉందని, విదేశాలతో భారత్కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని కేద్రం అభిప్రాయపడింది. ఇంతకు ముందు బీబీసీ నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీని విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా, యూకే నేషనల్ బ్రాడ్కాస్టర్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ గురించి వ్యతిరేకంగా రెండు భాగాల సిరీస్ను ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీపై దుమారం రేగడంతో.. ఎపిసోడ్ లింక్లను తొలగించమని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: మోదీపై డాక్యుమెంటరీలో ఏముంది? రిషి సునాక్ ఎలా రియాక్ట్ అయ్యారు? -
FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా?
ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్కప్ 2022 ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే గ్రూప్ దశతో పాటు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ముగిశాయి. శుక్రవారం నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. అరబ్ గడ్డపై జరుగుతున్న వరల్డ్కప్ను లైవ్లో వీక్షించేందుకు దాదాపు కోటికి పైగా వెళ్లారు. లైవ్ చూడలేని వాళ్లు మాత్రం టీవీల్లో, జియో సినిమాలో, తమకు నచ్చిన ఫ్లాట్ఫాంలో చూస్తూ ఆనందిస్తున్నారు. తాజాగా యూట్యూబ్ మాత్రం ఫిఫా అభిమానులను దారుణంగా మోసం చేసింది. ఫిఫా వరల్డ్కప్ సందర్భంగా గ్రూప్ దశలో జపాన్, జర్మనీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రీప్లేను యూట్యూబ్లో టెలికాస్ట్ చేశారు. రియల్ మ్యాచ్ అనుకొని ఎంజాయ్ చేసిన అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ ట్విస్ట్ ఏంటంటే.. అది రియల్ మ్యాచ్ కాదు ఫేక్ గేమ్ అని. ఫిఫా 23 గేమ్ప్లే(ఆన్లైన్ గేమ్)లో భాగంగా ఒక గేమింగ్ కంపెనీ దీనిని రూపొందించింది. మాములుగా యూట్యూబ్లో మనం ఏదైనా మ్యాచ్ వీక్షిస్తే.. ఒరిజినల్కు, డూప్లికేట్కు తేడా ఇట్టే తెలిసిపోతుంది. కానీ సదరు యూట్యూబ్ చానెల్ మాత్రం మ్యాచ్ రెజల్యూషన్(క్వాలిటీ) తగ్గించి గేమింగ్ను కాస్త రియల్ గేమ్లాగా చూపించారు. దూరం నుంచి చూస్తే మాత్రం అచ్చం రియల్ మ్యాచ్లానే కనిపిస్తోంది. కాస్త దగ్గరి నుంచి పరిశీలిస్తే కానీ అది బొమ్మల గేమ్ అని అర్థమవుతుంది. అంత మాయ చేశారు యూట్యూబ్ నిర్వాహకులు. అయితే నిజంగానే జపాన్, జర్మనీలు ఒకే గ్రూప్లో ఉండడంతో ఎవరికి అనుమానం రాలేదు. చిత్రమైన విషయం ఏంటంటే.. ఫేక్ మ్యాచ్ను ఒరిజినల్ అనుకొని దాదాపు 40వేల మంది వీక్షించారు. ఇక ఫిఫా వరల్డ్కప్లో నాలుగుసార్లు చాంపియన్ అయిన జర్మనీ గ్రూప్ దశలో వెనుదిరగ్గా.. జపాన్ ప్రీక్వార్టర్స్లో ఇంటిబాట పట్టింది. చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్బాలర్ పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం! -
ఊహించని షాక్.. భారత్లో 17 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్!
కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వీడియోలపై కొరడా ఘుళిపించింది ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్. భారతలో ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య దాదాపు 17 లక్షలకు పైగా రూల్స్ పాటించిన వీడియోలను తొలగించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 56 లక్షలకు వరకు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు 73.7 కోట్ల కామెంట్లను కూడా యూట్యూబ్ నుంచి తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో రోజు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అయితే అందులో తప్పుదారి పట్టించే మెటాడేటా, థంబ్నెయిల్స్, నిబంధన పాటించని వీడియోలు స్పామ్ కామెంట్లు వంటివి కలిగి ఉన్న వీడియోలను 50 లక్షలకు పైగా తొలగించింది. డేటా ప్రకారం, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పరీక్షించిన తర్వాత 99 శాతం కామెంట్లు తొలగించింది. మెషీన్ల ద్వారా గుర్తించి వీడియోలలో 36 శాతం వీడియోలు ఒక వ్యూస్ కూడా పొందకముందే తీసేవేసింది. కంపెనీ అనుసరిస్తున్న నియమాల ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేసింది. యూట్యూబ్ దీనిపై స్పందిస్తూ.. “మేము ఇందులో మెషీన్ లెర్నింగ్తో హ్యూమన్ రివ్యూయర్ల కలయిక ఉన్న టెక్నాలజీని ఉపయోగించి మా విధానాలను అమలు చేస్తున్నాము. మా ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్ల కంపెనీ మార్గదర్శకాలకు లోబడి పని చేస్తుంటాయి. ఇవి ఉల్లంఘనలకు పాల్పడిన వీడియోలను గుర్తించడంతో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. చదవండి: బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..! -
మోసం చేస్తూ ఏడాదికి రూ.312 కోట్లు సంపాదన.. స్వయంగా అంగీకరించిన యూట్యూబర్!
యూట్యూబ్.. ఈ మధ్య కాలంలో విపరీతంగా వినపడుతున్న పేరు. ప్రత్యేకంగా చెప్పాలంటే వినోదంతో పాటు సామాన్యులను కూడా సెలబ్రిటీలుగా మారుస్తోంది ఈ వీడియో ప్లాట్ఫాం. గత కొన్నేళ్లుగా స్మార్ట్ఫోన్ వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో వీటి యూజర్లు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసందే. కొందరు దీని ఎంటర్టైన్మెంట్ సాధనంగా చూస్తుంటే మరికొందరు తమ ఉపాధికి యూట్యూబ్ని మార్గంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వీడియోలు అప్లోడ్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఓ యూట్యూబర్ అందరూ షాక్ అయ్యేలా ఏడాదికి రూ.312 కోట్లు సంపాదిస్తూన్నాడు. దీంతోపాటు మరికొన్ని సంచలన విషయాలను అతను బయటపెట్టాడు. ఇదంతా మోసం చేసి సంపాదించాను! వివరాల్లోకి వెళితే.. మార్క్ ఫిష్బాచ్ అనే ఒక యూట్యూబర్ ఒక సంవత్సరంలో యూట్యూబ్ ద్వారా 38 మిలియన్ డాలర్లు (రూ. 312 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఈ సంపాదన చూసి అతనే ఆశ్చర్యపోతున్నాడట. అయితే ఎందుకో గానీ ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు అతనే స్వయంగా అంగీకరించాడు. యూట్యూబ్ ప్రారంభించిన మొదట్లో అనిపించకపోయినా ఇంత పెద్ద మొత్తంలో సంపద రావడంతో మోసం చేస్తున్న భావన కలుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ వ్యక్తి మార్క్ సంపాదన గురించి అడిగాడు. అందుకు అతను బదులిస్తూ.. ‘యూట్యూబ్ ద్వారా నాకు ఇంత డబ్బు వస్తోందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనే నమ్మలేకపోతున్నాను. అయితే ఒక్కోసారి ఈ దారిలో సంపాదించడం నాకు అన్యాయంగా అనిపిస్తుంది. ఈ అంశంపై మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే ఈ స్థాయిలో సక్సెస్, సంపాదన రావడం వెనుక సమాజాన్ని మోసగిస్తున్నట్లు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందని’ తెలిపాడు. భవిష్యత్తులో తన సంపాదనతో ప్రజలకు సహాయం చేయాలని, వారి స్నేహితులు, బంధువుల జీవితాలను మెరుగుపరచాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవలే యూట్యూబర్ MrBeast, (అసలు పేరు జిమ్మీ డోనాల్డ్సన్), అతని యూట్యూబ్ ఛానెల్ కోసం $1 బిలియన్ల డీల్ను ఆఫర్ చేసిన సంగతి తెలసిందే. చదవండి: స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! -
యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ భారీ షాక్!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. 2016లో లాంఛ్ చేసిన 'యూట్యూబ్ గో'ను షట్ డౌన్ చేస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్లో అధికారికంగా ప్రకటించింది. గూగుల్ నిర్ణయంతో కొంత మంది యూజర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. 2016లో గూగుల్ సంస్థ యూట్యూబ్గోను విడుదల చేసింది. కనెక్టివిటీ తక్కువగా ఉండి, ప్రాసెసర్ స్లోగా ఉండి, లిమిటెడ్గా టెక్నాలజీ అందుబాటులో ఉండే లో ఎండ్ మొబైల్ ఫోన్స్ వినియోగిస్తున్న యూట్యూబ్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ తరహాలో 'యూట్యూబ్ గో'ను అందుబాటులోకి తెచ్చింది. కానీ యూట్యూబ్ను ఎలా డెవలప్ చేసిందో ఆ స్థాయిలో యూట్యూబ్ గోను అభివృద్ధి చేయడం అసాధ్యంగా మారింది. అందుకే ఇకపై యూట్యూబ్ గో సేవల్ని నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ ప్రకటనతో లో ఎండ్ మొబైల్స్ ఫోన్స్తో యూట్యూబ్ వీడియోలు చేస్తున్న క్రియేటర్లకు షాక్ తగలనుంది. కానీ గూగుల్ మాత్రం యూట్యూబ్ గో క్రియేటర్లకు ఎలాంటి నష్టం లేదని, యూట్యూబ్ గో క్రియేటర్లు మెయిన్ స్ట్రీమ్ యాప్ యూ ట్యూబ్ను వినియోగించాలని కోరింది. లోఎండ్ మొబైల్స్ వినియోగిస్తున్న యూజర్లు సైతం యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసేలా మార్పులు చేసినట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. అంతేకాదు యూట్యూబ్ గోలో అందుబాటులో లేని ఫీచర్లను యూట్యూబ్లో అందిస్తున్నామని..ఆ ఫీచర్లలో కామెంట్ చేయడం, పోస్ట్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేసేలా అవకాశం కల్పించడంతో పాటు డార్క్ థీమ్ను అందిస్తున్నట్లు' కంపెనీ అధికారిక బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. చదవండి👉యూట్యూబ్కు భారీ షాక్..! పడిపోతున్న యూజర్లు! -
'వార్న్ భుజాలు బలమైనవి'... రహస్యం తెలుసన్న అశ్విన్
ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 52 ఏళ్ల వార్న్ మార్చి 4న థాయ్లాండ్లోని తన విల్లాలో అచేతన స్థితిలో మృతి చెందడం అందరిని కలిచివేసింది. వార్న్ మరణంపై క్రీడాలోకం తమ అశ్రు నివాళి అర్పిస్తోంది. వార్న్ది సహజ మరణమేనని తేల్చిన పోలీసులు.. భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం వార్న్ అంత్యక్రియలను అధికార లాంచనాలతో జరుపుతామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా వార్న్ మృతిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నివాళి అర్పించాడు. దిగ్గజ స్పిన్నర్గా క్రికెట్ను ఏలిన వార్న్ సేవలు మరువలేనివని.. అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి ప్రకటించాడు. ఈ సందర్భంగా వార్న్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సాధారణంగా వార్న్ భుజాలు చాలా బలంగా ఉండేవని.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తనకు తెలిసిందని అశ్విన్ పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్తో జరిగిన చిట్చాట్లో వార్న్ గురించి కొన్ని విషయాలు తెలిశాయని తెలిపాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా అశ్విన్ మాట్లాడుతూ.. '' కోచ్ ద్రవిడ్తో సంభాషణ సందర్భంగా వార్న్ మృతి ప్రస్తావన మా మధ్య వచ్చింది. దిగ్గజ స్పిన్నర్గా ఆయన సేవలు మరువలేనివి. ఒక స్పిన్నర్కు భుజాలతో పాటు శరీరంలో నడుము పై భాగం బలంగా ఉండాలి.. ఎందుకంటే వివిధ రొటేషన్లు ఉపయోగిస్తూ స్పిన్ బౌలింగ్ చేయాలి. అందుకోసం నెట్స్లో తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఒక లెగ్ స్పిన్నర్ బౌలర్కు భుజాలు మరింత బలంగా ఉండాలి.. అప్పుడే ఆ బౌలర్కు అది అడ్వాంటేజ్గా మారుతుంది. ఈ విషయంలో వార్న్ అదృష్టవంతుడు. అతని భుజాలు చాలా బలమైనవి. ఈ విషయం నాకు రాహుల్ ద్రవిడ్ వల్ల తెలిసింది. వార్న్ బలమైన భుజాల వెనుక ఒక చిన్న కథ ఉంది. వార్న్ పిల్లాడిగా ఉన్నప్పుడు.. ఒక సందర్భంలో తన రెండు కాళ్లు గాయానికి గురయ్యాయి. తన స్నేహితుడు ఆడుకుంటూ కాస్త ఎత్తు నుంచి వార్న్ కాళ్ల మీదకు దూకాడంట. దీంతో అతని రెండు కాళ్లు కాస్త దెబ్బతిన్నాయి. మూడు, నాలుగు వారాల పాటు వార్న్ నడవలేక బెడ్కే పరిమితమయ్యాడు. ఆ సమయంలో తన చేతులను కిందపెట్టి నడవడం అలవాటు చేసుకున్నాడు. ఇది వార్న్లో కసిని పెంచింది. ఆ తర్వాత క్రికెటర్గా మారే సమయంలో.. ఎక్కువగా భుజాలపై ఒత్తిడి తెస్తూ బలంగా తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత వార్న్కు ఎదురు లేకుండా పోయింది. ఒక రకంగా వార్న్ దిగ్గజ స్పిన్నర్గా తయారు కావడానికి తన భుజాలే సక్సెస్ ఫార్ములాగా నిలిచింది.'' అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్విన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక షేన్ వార్న్ 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 15 ఏళ్ల కెరీర్లో వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: 'భయమేస్తే గట్టిగా హత్తుకునేదాన్ని.. మిస్ యూ నాన్న' Shane Warne: ‘నేను వార్న్ను అంతమాట అనకుండా ఉండాల్సింది’ Prithvi Shaw: నా బ్యాటింగ్ చూస్తే అసహ్యమేస్తోంది: పృథ్వీ షా -
చికెన్ కర్రీ అదరగొట్టిన రణు మండల్ .. వీడియో వైరల్
రణు మండల్ పేరు గుర్తుందా! అదేనండి ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ సింగర్ గా మారడమే కాకుండా సెలబ్రిటీ స్టేటస్ సొంతం కూడా చేసుకుంది. అదే ఊపులో బాలీవుడ్ లో పాటలు పాడే అవకాశాలు కూడా వచ్చాయి. ఏమైందో గానీ ఆమె జీవితంలో అనుకోకుండా వచ్చిన అదృష్టం ఆమెను స్టార్ సింగర్ గా మార్చలేకపోయింది. సినిమాలో పాటల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియా లో మాత్రం ట్రెండింగ్ లో ఉంటుంది రాను మండల్. తాజాగా మరోసారి నెట్టింట ఆమె వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. కానీ ఈ సారి పాటతో కాకుండా, ఆమె వంటతో వైరల్ గా మారింది. తాజాగా ఓ యూట్యూబర్.. రాను మండల్ ఇంటికి వెళ్ళాడు. సింగర్ దగ్గర పాట కామన్ అనుకున్నాడో ఏమో వంట వండించాలని ఫిక్స్ అయ్యి తనతో చికెన్ కర్రీ వండించాడు. ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్లో పెట్టాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాను మండల్.. చికెన్ కర్రీ వండుతూ.. పాటలు పాడుతూ.. యూట్యూబ్ వీక్షకులను ఫుల్గా ఎంటర్టైన్ చేసింది. చదవండి:Fake Jalakanya Video: మైపాడు బీచ్లో జలకన్య? అసలు నిజం ఏంటంటే.. -
జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ
Anchor Suma Reveals About The Secrets She Hide From Long Time: యాంకర్ సుమ కనకాల..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతుంది. ఆడియో ఫంక్షన్, ఈవెంట్ సహా పలు టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన సుమ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలాకాలంగా దాచిపెట్టిన ఒక విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. చదవండి: 'గుండె తరుక్కుపోతుంది..సమంత ఎలా భరిస్తుందో' 'చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇకపై దాన్ని దాచాలనుకోవడం లేదు. నేను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ప్రాబ్లమ్తో బాధపడుతున్నా. అంటే ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. అంటే చిన్న గాయం కూడా పెద్దదిగా చూపిస్తుందనమాట. దీన్ని పోగొట్టుకోవడానికి చేయాల్సినవి అన్నీ చేసి చూశాను. కానీ ఫలితం లేదు. ఇది నా శరీరంలో భాగమైపోయిందని అర్థమైంది.చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ గతంలో ఈ ప్రొఫెషనలిజంలోకి వచ్చినప్పడు మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి తెలియక జరగాల్సిన డ్యామెజ్ జరిపోయింది. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. సాదారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచిపెడుతూ వస్తాం. కానీ అది మన శరీరంలోనే ఉంటుంది అని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం' అంటూ వీడియోను షేర్ చేసింది. చదవండి: సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ -
కొత్త అప్డేట్, ఇక యూట్యూబ్లో డబ్బులే డబ్బులు
క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆడియన్స్ నుంచి యూట్యూబ్ క్రియేటర్ల మనీ ఎర్నింగ్ చేసేందుకు కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ తో యూట్యూబ్ క్రియేటర్లు వ్యూవర్స్ నుంచి నాలుగు రకాలుగా డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించినట్లైంది. షార్ట్ వీడియో యాప్ టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ సంస్థలు క్రియేటర్లు మంచి కంటెంట్ను అందించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే వాటికి పోటీగా యూట్యూబ్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. కాంపిటీటర్ల నుంచి పోటీని ఎదుర్కొనేలా యూట్యూబ్ క్రియేటర్లు డబ్బులు సంపాదించేందుకు ఈ ఫీచర్ను ఎనేబుల్ చేసింది. 'సూపర్ థ్యాంక్స్' అనే ఫీచర్ ద్వారా వ్యూవర్స్ క్రియేటర్లను సపోర్ట్ చేస్తూ సుమారు రూ.150 నుండి రూ.3,730 వరకు చెల్లించవచ్చు. తద్వారా తమ అభిమాన యూట్యూబ్ ఛానల్ లో మద్దతు ఇవ్వడానికి ఒక మార్గంగా ఉంటుందని యూట్యూబ్ ప్రకటించింది. సూపర్ థ్యాంక్స్ ఫీచర్ నుంచి మనీ డొనేట్ చేస్తే వారి పేర్లు కామెంట్ సెక్షన్లో హైలెట్గా నిలుస్తాయి. ఈ ఆప్షన్ ప్రపంచ వ్యాప్తంగా 68 దేశాలలో ఉన్న యూట్యూబ్ క్రియేటర్లకు అందుబాటులో ఉంటుందని యూట్యూబ్ ప్రతినిథులు అధికారికంగా వెల్లడించారు. కాగా,ఇప్పటికే యాడ్స్, ఛానల్ సబ్స్కిప్షన్,లైవ్ స్ట్రీమ్లో సూపర్ చాట్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండగా..మనీ ఎర్నింగ్ కోసం మరో ఫీచర్ అందుబాటులోకి తేవడంపై ఆన్ లైన్ లో మనీ ఎర్నింగ్ చేయాలనుకునే ఔత్సాహికులు, యూట్యూబ్ క్రియేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కమ్మని ‘అమ్మచేతి వంట’!
అమ్మ... ప్రేమ ఎంత తియ్యగా ఉంటుందో ఆమె చేతి వంట కూడా అంతే కమ్మగా ఉంటుందని గుర్తించిన ఆవుల భార్గవి ‘అమ్మచేతి వంట’ను ఆయుధంగా చేసుకుని సక్సెస్పుల్ యూట్యూబర్గా రాణిస్తున్నారు. భార్గవి తల్లి వెన్నుతట్టి దారిచూపడంతో తనదైన శైలిలో వంటల వీడియోలు పోస్టుచేస్తూ లక్షలమంది యూజర్లను ఆకట్టుకుంటూ ఎంతోమంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తున్నారు. రాజమండ్రిలో పుట్టిపెరిగిన భార్గవికి బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తవ్వగానే పెద్దలు పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక భర్తతో విశాఖపట్నంలో ఉండేది. వెంట వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టడంతో ఇల్లు, పిల్లలతో బిజీగా ఉండేది. 2017 జనవరిలో.. సంక్రాంతి పండక్కి పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో భార్గవి తల్లి గీతామహాలక్ష్మి ‘‘మనం చేసే వంటలను వీడియోలు తీసి యూ ట్యూబ్లో పెడితే అవి చాలామంది చూస్తారు. నువ్వు అలా చేయవచ్చు కదా! మొదట నేను వంట చేసి వీడియోలు తీస్తాను. నువ్వు వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చెయ్యి’’ అని సలహా ఇచ్చారు. దానికి సరేనంది భార్గవి. తల్లి ప్రోత్సాహంతోనే... యూట్యూబ్లో వీడియోలు పెట్టాలని ఎప్పుడూ సీరియస్గా తీసుకోని భార్గవి సంక్రాంతి తరువాత విశాఖపట్నం తిరిగి వెళ్లి బిజీ అయిపోయింది. ఆ సమయంలో భార్గవి తల్లి ఫోన్ చేసిప్పుడల్లా గుర్తు చేసేవారు. దాంతో భార్గవి తను వంట చేసేటప్పుడు వీడియోలు తీసి పెట్టుకునేది. 2017 మే 31న ‘అమ్మ చేతివంట’ పేరిట యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి .. ఆ వీడియోలను పోస్టు చేసింది. అయితే వాటికి చెప్పుకోదగ్గ వ్యూస్ రాకపోవడంతో సబ్స్రై్కబర్స్ని ఎలా పెంచుకోవాలి? వ్యూస్ ఎలా పెరుగుతాయి? ట్యాగ్స్, టైటిల్స్, థంబ్ నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి... అనే విషయాలపై టెక్ ఛానల్స్లో గాలించి, తెలుసుకుని ప్రొఫెషనల్గా వీడియోలు పెట్టడం నేర్చుకుంది. మొదటి నెలలోనే 90 వీడియోలు పోస్టు చేసింది. ఛానల్ క్లిక్ అవడంతో..గతేడాది..‘‘మనలో మనమాట’’ పేరిట మరోఛానల్ను ప్రారంభించి వ్యూవర్స్కు ఉపయోగపడే సమాచారం అందిస్తోంది. ప్రసాదాలతో ఫేమస్.. దసరా నవరాత్రులలో నైవేద్యం పెట్టే ప్రసాదం తయారీ వీడియోలకు మంచి స్పందన రావడంతో భార్గవి ఛానల్ బాగా ఫేమస్ అయ్యింది. వ్యూవర్స్ ‘‘మీరు చేసిన వంటను మేము ప్రయత్నించాము... చాలా బాగా వచ్చింది’’ అని ప్రోత్సాహంతో కూడిన కామెంట్లు చేయడంతో మరిన్ని వీడియోలు పోస్టుచేసేది. ఛానల్ ప్రారంభించిన ఐదు నెలల్లో మంచి గుర్తింపుతోపాటు, యాడ్లు కూడా వచ్చేవి. తన వీడియోలలో ఆనియన్ సమోసా బాగా క్లిక్ అయ్యింది. వీడియో అప్లోడ్ చేసిన రెండు వారాల్లోనే పదిలక్షల వ్యూస్ వచ్చాయి. ఇన్స్టంట్గా చేసుకునే టమోటా పచ్చడి, పానీపూరి వీడియోలు సబ్స్క్రైబర్స్ని అమాంతం పెంచేశాయి.ముఖ్యంగా స్నాక్స్ వీడియోలు, లాక్డౌన్లో ఓవెన్ లేకుండా కేక్ తయారీ వంటకాల వీడియోలకు మంచి ఆదరణ వచ్చింది. కేక్ తయారీ వీడియోలు యూ ట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోలలో భార్గవి కేక్ తయారీ వీడియోలు నంబర్ వన్ స్థానంలో నిలిచాయి. వెజ్, నాన్వెజ్ వంటకాల వీడియోలకు సబ్స్రై్కబర్స్ పెరగడంతో యూట్యూబ్ సిల్వర్ బటన్, గోల్డ్ ప్లే బటన్లతో భార్గవిని సత్కరించింది. ప్రస్తుతం ‘అమ్మ చేతివంట’ ఛానల్కు దాదాపు ఇరవై లక్షలమంది సబ్స్రై్కబర్స్ ఉన్నారు. కంటెంట్ను బట్టి సబ్స్క్రైబర్లు.. ‘‘నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే యూట్యూబ్ ఛానల్ను నడపగలుగుతున్నాను. ‘యూ ట్యూబ్లో చేసిన వంటకాలు మనం చేస్తే సరిగ్గా రావు’ అని జనాల్లో నాటుకుపోయిన అభిప్రాయాన్ని తీసేయాలనుకున్నాను. అందుకే నేను చేసిన వంటను మా వారికి రుచి చూపించి ఆయన ఓకే అంటే ఆ వీడియోను పోస్టు చేస్తాను. వ్యూవర్స్ నా వీడియో చూసి చేసిన వంటకు కూడా అదే రుచి వచ్చే విధంగా చేస్తాను. కొత్తగా ఛానల్స్ పెట్టినవారు.. వ్యూస్ రావడం లేదని నిరాశపడకూడదు. మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి. కంటెంట్ను బట్టి సబ్స్రై్కబర్స్ పెరుగుతారు’’ అని భార్గవి చెప్పింది. –సంభాషణ: పి. విజయ -
కుకింగ్ క్వీన్ .. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్..
పిల్లల చదువులు పూర్తయ్యి ఉద్యోగాల్లో స్థిరపడగానే పెళ్లి చేసి కోడళ్లకు కిచెన్ బాధ్యత లు అప్పజెప్పి మనవళ్లు మనవరాండ్రతో ఆడుకోవాలనుకుంటారు మన భారతీయ సంప్రదాయ మహిళలు. కానీ నిషా మధులిక మాత్రం అలా అనుకోలేదు. జీవితంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్ను ప్రారంభించి కోట్లమంది అభిమానుల్ని సంపాదించారు. దాంతో ఆమె సోషల్ మీడియా స్టార్గానే గాక ..‘‘పాపులర్ ఇండియన్ వెజిటేరియన్, యూట్యూబ్ చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్, ఫుడ్ బ్లాగర్, టెలివిజన్ పర్సనాలిటీ’’ వంటి అనేక సెలబ్రిటీ హోదాలను సొంతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో పుట్టి పెరిగిన నిషాకి ఢిల్లీకి చెందిన ఎంఎస్ గుప్తాతో వివాహం జరిగింది. ఢిల్లీకి వచ్చేసిన నిషాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల పెంపకంలోనూ, మరోపక్క భర్త వ్యాపారంలో సాయం చేస్తూ బిజీగా ఉండేవారు. పిల్లలు చదువులు పూరై తమ ఉద్యోగాలతో బిజీ అయిపోయారు. దీంతో అప్పటిదాకా తీరిక లేకుండా గడిపిన నిషాకి ఒక్కసారిగా తీరిక ఏర్పడడంతో తనని తాను బిజీగా ఉంచుకునేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తన కొడుకు బ్లాగ్కు రాస్తుండడం చూసి.. తనకు బాగా అనుభవమున్న కుకింగ్ను బ్లాగ్స్లో రాయాలనుకున్నారు. కొడుకు సాయంతో.. భర్త, కొడుకు సాయంతో.. నిషా 2007లో కుకింగ్ బ్లాగ్ను ప్రారంభించి దానిలో వంటల తయారీ గురించి రాసేవారు. తర్వాత తనే సొంత వెబ్సైట్ https:/nishamadhulika.com లో తన తల్లి దగ్గర నేర్చుకున్న విభిన్న వంటకాలు వండుతూ అవి ఎలా వండాలో రాసి పోస్టులు పెట్టేవారు. నిషా వంటలను ఇష్టపడిన అభిమానులు ‘‘వీడియోలు పెట్టండి మేడం’’ అని అడగడంతో.. వీడియోలు కూడా అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటిదాకా 1300 కుపైగా వంటల వీడియోలను అప్లోడ్ చేశారు. సిసలైన శాకాహార వంటలు మధులిక కుటుంబం 2009 లో నోయిడాకు మకాం మార్చింది. అప్పుడే ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. శాకాహార వంటకాలకు ప్రాధాన్యత నిచ్చిన నిషా ఉల్లి, వెల్లుల్లి లేని వంటకాల వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వీడియోలు మిలియన్ల మందిని ఆకర్షించేవి. ప్రస్తుతం నిషా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోటీ పదిహేను లక్షలకు పైనే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా వేలమంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఐదుగురితో టీం .. యూ ట్యూబ్ వీడియోల ద్వారా ఆదాయం వస్తుండడంతో.. మంచి కిచెన్ను సెటప్ చేసి, ఐదుగురితో టీమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీమ్ రెండుమూడు వంటల వీడియోలు తీసి.. తరువాత ఛానల్లో అప్లోడ్ అయిన వంటకాలకు వచ్చే కామెంట్లు, అభిప్రాయాలను సమీక్షిస్తూ లోపాలను ఎలా సరిదిద్దాలో చూసుకునేది. టాప్టెన్ బెస్ట్ యూ ట్యూబర్.. మొదట్లో బ్లాగ్స్, వీడియోలు చేయడం ప్రారంభించినప్పుడు ఇది వ్యాపారంగా చూడని నిషా.. తనకు తెలిసిన అనేక వంటకాలను హిందీలో అప్లోడ్ చేసేవారు. తరువాత ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలో ఉన్న తన ఫాలోవర్స్ తమ భాషల్లో వీడియోలు అప్లోడ్ చేయమని అడగగా వాళ్ల భాషల్లో వంటల వీడియోలు, సబ్టైటిల్స్తో పోస్టు చేసేవారు. అంతేగాక పలు వెబ్సైట్లకు వంటల ఆర్టికల్స్ రాసిచ్చేవారు. దీంతో సబ్స్క్రైబర్స్తోపాటు, ఆదాయం పెరిగింది. ఈ క్రమంలో ఆమె 2014లో యూట్యూబ్ చెఫ్స్ టైటిల్, 2017లో టాప్ యూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్ అవార్డులు అందుకున్నారు. ఇండియన్ టాప్టెన్ బెస్ట్ యూ ట్యూబ్ స్టార్స్ జాబితాలో.. రెండుసార్లు నిషా స్థానం దక్కించుకున్నారు. అంతేగాక ప్రముఖ మ్యాగజీన్లు బ్లూమ్బర్గ్, ఎకనామిస్ట్, ఇండియా టుడే వంటివి ఆమె సక్సెస్ స్టోరీని ప్రచురిస్తూ ‘కుకింగ్ క్వీన్’గా అభివర్ణించాయి. లోక్సభ టీవీ ఆమె ఇంటర్వ్యూనూ టెలికాస్ట్ చేయడం విశేషం. -
యూట్యూబర్ గౌరవ్ శర్మ అమానుష ప్రవర్తన
-
పైశాచిక చర్య: కుక్కపై యూట్యూబర్ అమానుషం
న్యూఢిల్లీ: శునకంపై ఓ యూట్యూబర్ పైశాచికంగా ప్రవర్తించాడు. హైడ్రోజన్ బెలూన్లు కుక్క మెడకు కట్టి వదిలేశాడు. ఆ బెలూన్లు పైకి వెళ్తుండగా దానికి కట్టిన కుక్క కూడా గాల్లోకి వెళ్తుంటే అతడు పైశాచిక ఆనందం పొందాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. అతడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికుడు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని మాలవ్యనగర్కు చెందిన గౌరవ్ జాన్ ఓ యూట్యూబర్. తన యూట్యూబ్ చానల్లో వ్యూస్ కోసం పై విధంగా చేసి వీడియో రూపొందించాడు. తన కుక్కకు డాలర్ అని పేరు పెట్టుకున్నాడు. దాని బర్త్ డే సందర్భంగా ఈ విధంగా చేశాడు. పార్క్ వద్ద అతడు తన తల్లితో కలిసి హైడ్రోజన్ బెలూన్లు కట్టి ఎగురవేస్తున్నారు. ఇంట్లో.. బయట.. చాలాసార్లు కుక్కకు బెలూన్లు మొత్తం కట్టి గాల్లోకి వదిలారు. గాల్లోకి బెలూన్లతో పాటు కుక్క కూడా ఎగురుతుండంతో అతడు, అతడి తల్లి, కొందరు యువతులు కేరింతలు వేస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఈ బిత్తిరి చర్యను చూసిన కొందరు మాలవ్య నగర్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో గౌరవ్ జాన్తో పాటు అతడి తల్లిపై కేసు నమోదైంది. ఈ చర్యకు అతడు క్షమాపణలు చెప్పాడు. జంతు ప్రేమికులు, వ్యూవర్స్కు క్షమాపణలు చెబుతూ వీడియో రూపొందించాడు. అయితే అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. -
BTS Butter Music Video: గంటలో రికార్డులు బద్ధలు!
'బీటీఎస్'... వరల్డ్ వైడ్గా పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ బ్యాండ్. ఇండియాలోనూ ఈ గ్రూప్కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏడుగురు సౌత్ కొరియన్ బాయ్స్తో ఉండే ఈ గుంపు.. పాప్ ప్రపంచంలో ఓ ప్రభంజనం. కొరియా నుంచి మొదలై జపాన్, అమెరికా.. ఇలా వరుస దేశాల్లో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ.. ఇంటర్నేషనల్ సెన్సేషన్గా మారింది. వీళ్ల ఆల్బమ్స్ మిలియన్ల కొద్దీ కాపీల్ని అమ్ముడు పోతుంటాయి. రీసెంట్గా ట్విట్టర్, యూట్యూబ్లతో అదిరిపోయే రికార్డులతో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది బీటీఎస్. బీటీఎస్ లేటెస్ట్ ఆల్బమ్ ‘బటర్’ శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అయిన కాసేపటికే రికార్డుల మోత మొదలైంది. సాంగ్ లాంచ్ లైవ్ను 3.89 మిలియన్ల మంది యూట్యూబ్ ప్రీమియర్లో వీక్షించగా, కేవలం పదమూడు నిమిషాల్లోనే కోటి మంది యూట్యూబ్లో ఈ ఆల్బమ్ను చూశారు. 54 నిమిషాల్లో రెండు కోట్ల మంది వీక్షించడం కూడా యూట్యూబ్లో ఓ రికార్డే. ఇది వరకు ఈ రికార్డు బీటీఎస్ వాళ్ల ‘డైనమైట్’ ఆల్బమ్ పేరిటే ఉండేది. ఇక నాలుగు గంటల్లో యూట్యూబ్లో 37 మిలియన్ల వ్యూస్ దాటేసి దూసుకుపోతోంది బటర్. ఇది బీటీఎస్కి రెండో ఇంగ్లీష్ సింగిల్ ఆల్బమ్. ఇంకోవైపు వరల్డ్వైడ్గా బటర్కి సంబంధించిన హ్యాష్ట్యాగులు ట్విట్టర్లో టాప్ ట్రెండ్లో కొనసాగుతున్నాయి. -
నటిని అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ ట్రెండ్
ముంబై : ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే ఈజీగా దొరకిపోతారు. ఫలితంగా సోషల్ మీడియా మీతో ఓ ఆటాడేసుకోవడం మాత్రం ఖాయం. టెలివిజన్ నటి మున్మున్ దత్తాకు కూడా సరిగ్గా ఇలాంటి చేదు అనుభమే ఎదురైంది. యూట్యూబ్లో చేసిన ఓ వీడియో ఆమెను ముప్పుతిప్పలు పెట్టింది. మున్మున్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రెండ్ చేయడంతో ఆఖరికి ఆమె క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవలె మేకప్ టిప్స్పై యూట్యూబ్లో వీడియో చేసిన మున్మున్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. నేను భంగీ (దళిత కులానికి చెందిన వ్యక్తి)లా కనిపించాలనుకోవడం లేదు. ఎంతో అందంగా కనిపించాలనుకుంటున్నా అంటూ వీడియోలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అగ్గిని రాజేశాయి. ఓ కులాన్ని తక్కువ చేసి మాట్లాడిందన్న కారణంతో మున్మున్పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. #ArrestMunmunDuttaఅంటూ హ్యాష్ట్యాగ్ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. దీంతో తన తప్పు తెలుసుకున్న నటి మున్మున్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, భాషపై అంతగా అవగాహన లేకపోవడంతో, అందుకే ఈ తప్పు జరిగిందని వివరణ ఇచ్చింది. తను చెప్పిన భావాన్ని అర్థం చేసుకోకుండా కేవలం ఓ పదాన్ని మాత్రమే టార్గెట్ చేసి తనను దూషించడం సబబు కాదని పేర్కొంటూ ట్విట్టర్లోఘో పోస్టును రిలీజ్ చేసింది. इस घटिया मानसिकता पर @moonstar4u की जातिवादी टिप्पणी करने पर sc-st एक्ट के तहत मुकदमा दर्ज होना चाहिए।@BhimArmyChief pic.twitter.com/T2RQulNBA1 — Kanishk Singh (@kanishkbhimarmy) May 10, 2021 చదవండి : 'కూతురిని బోల్డ్ సీన్లలో చూసి.. 'ఓ మై గాడ్' అని షాకవుతాడు' ఆర్థిక ఇబ్బందులున్నాయి.. అందుకే తప్పడం లేదు: శృతి హాసన్ -
మహిళకు మరిచిపోలేని షాకిచ్చిన ఒంటె
-
సిగ్గులేని బతుకు’.. యూట్యూబ్ ఛానల్పై విశ్వక్ ఫైర్
-
‘సిగ్గులేని బతుకు’.. యూట్యూబ్ ఛానల్పై విశ్వక్ ఫైర్
యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్పై తన ప్రతాపాన్ని చూపించాడు. ఇబ్బందికరమైన హెడ్డింగ్తో యూట్యూబ్లో ఓ వీడియోను పోస్టు చేసినందుకు సంబంధిత ఛానల్పై తీవ్రంగా మండిపడ్డాడు. ఇలాంటి వీడియోలు పోస్టు చేసే ముందు మన ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారన్న విషయం గుర్తుంచుకొని కొంచెం ఇంగితజ్ఞానంతో వ్యవహరించాలని ఫైర్ అయ్యాడు. ఆ వీడియో పెట్టిన వ్యక్తి 24 గంటల్లో క్షమాపణలు చెబుతూ మరో వీడియో పోస్టు చేయాలని, లేకుంటే తన ఇంటికి వచ్చి మరీ వీడియో పెట్టిస్తానని గట్టిగా హెచ్చరించాడు. అయితే విశ్వక్ సేన్ ఇంతలా అగ్రెసివ్ అవ్వడానికి బలమైన కారణమే ఉంది. అదేంటంటే.. నందితశ్వేత హీరోయిన్గా నటిస్తున్న ‘అక్షర’ చిత్రంలోని ఓ పాట విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. దీనికి విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా.. విశ్వక్ గురించి హీరోయిన్ నందిత మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విశ్వక్సేన్ రావడం సంతోషంగా ఉందని.. ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే.. ఆ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్లో అర్థం మార్చి ఇబ్బందికరమైన టైటిల్తో పోస్టు చేశాడు. ‘విశ్వక్.. నీకు ఏం కావాలన్నా సిగ్గులేకుండా అడుగు ఇచ్చేస్తా’ అనే థంబ్నైల్ పెట్టగా.. ఇది కాస్తా విశ్వక్సేన్ దృష్టికి వెళ్లింది. ఇంకేముంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో ఓ వీడియో పెడుతూ.. సదరు యూట్యూబ్ ఛానల్ను ఏకిపారేశాడు. ‘ఇప్పుడే థంబ్నైల్ చూశా. అంటే మీకు మన ఇంట్లో ఆడవాళ్లు ఉండారని కొంచెం కూడా అనిపించడం లేదా.. వాళ్ల గురించి కూడా ఇలానే మాట్లాడదాం అనే ఇంటెన్షన్ ఉంటేనే నువ్వు ఇలా రాస్తావ్.. ఆ అమ్మాయి మాట్లాడింది ఏంటి.. మీరు రాసింది ఏంటి. మీరు రాసింది ఎంత గలీజ్గా ఉంది తెలుసా.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్న కానీ.. అది రాసినవాడు ఎవడో కానీ ఎంత సిగ్గులేని బతుకు వాడిది. ఆ ఛానల్ పేరు అక్కడే రాసి ఉంది. 24 గంటల్లో సారీ(sorry) చెబుతూ ఇంకో వీడియో పెట్టకుంటే.. ఎక్కడున్నా నీ ఇంటికొచ్చి మరీ నీతో వీడియో పెట్టిస్తా. నాకు షూటింగ్ ఉన్నా పర్వాలేదు’.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు యూట్యూబ్లో ఇలాంటివి ఇలాంటివి సర్వసాధారణంగా మారిపోయిందని నెటిజన్లు విశ్వక్కు సపోర్ట్గా నిలుస్తున్నారు. చదవండి: టీజర్: హీరో నిజంగా పిచ్చోడే! -
యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. రెస్టారెంట్ మూత
సియోల్: తప్పుడు రివ్వూ ఇచ్చి రెస్టారెంట్ మూతపడటానికి కారణమైన ఓ యూట్యూబర్పై నెటిజన్లు మండిపడుతూ అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన హయన్ ట్రీ యూట్యూబ్లో ఫుడ్ బ్లాగ్ నడుపుతున్నాడు. దీనికోసం అతడు రెస్టారెంట్లు, హోటళ్లను సందర్శిస్తూ అక్కడి వంటకాలపై తన యూట్యూబ్ చానల్లో వీడియోలు పోస్టు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్ను సందర్శించిన హయన్ ట్రీ తప్పుడు రివ్యూ ఇచ్చి ఆ రెస్టారెంటు మూసివేతకు కారణమయ్యాడు. వివరాలు.. డయగు అనే ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంటుకు హయాన్ ట్రీ వెళ్లి ఫుడ్ అర్డర్ ఇచ్చాడు. అయితే తన ప్లేటులో వడ్డించిన ఆహారపదార్థాల్లో అన్నం మెతుకులు కనిపించాయి. దీంతో ఇతర కస్టమర్లు తినగా మిగిలిన వాటిని మళ్లీ వడ్డిస్తున్నారని భావించాడు. దీంతో రెస్టారెంటు నిర్వహకులు కస్టమర్లను ఈ విధంగా మోసం చేస్తున్నారంటూ వీడియో పోస్టు చేసి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. (చదవండి: టర్కీలో కరువు తాండవం.. 45 రోజుల్లో..) అయితే అతడి చానల్కు 7లక్షలకు పైగా సబ్స్రైబర్స్ ఉన్నారు. దీంతో ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకరు తిన్న ఫుడ్ మళ్లీ సర్వ్ చేసి ఇలా కస్టమర్లను మోసం చేస్తున్నారా అని సదరు రెస్టారెంట్పై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఈ వీడియో కాస్తా ఫుడ్ సెక్క్యూరిటీ అధికారుల కంటపడింది. ఇక వెంటనే అధికారులు స్పందిస్తూ ఆ రెస్టారెంట్పై దాడికి దిగారు. అక్కడి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ రెస్టారెంట్ను మూసివేశారు. ఈ క్రమంలో రెస్టారెంట్ యాజమాన్యం హయాన్ ట్రీ వీడియో తప్పని తాము తాజా ఆహర పదార్థాలనే వడ్డిస్తున్నామని చెబుతూ వీడియో సాక్ష్యాన్ని చూపించినప్పటిక అధికారులు పట్టించుకోకుండా రెస్టారెంట్ను మూసివేశారు. చదవండి: అమెరికా మా ప్రధాన శత్రువు: కిమ్ జాంగ్ ఉన్ అయితే ఈ సంఘటన గతంలో జరిగినప్పటికి ఇటీవల హయాన్ ట్రీ మళ్లీ ఆ రెస్టారెంటు వీడియోని వీక్షించగా అసలు విషయం బయటపడింది. ఆ పదార్థాలకు అంటుకున్న మెతుకులు అతడి ప్లేటులోనివేనని తెలిసి అతడు విస్తుపోయాడు. జరిగిన తప్పుకు తానే కారణం కావడంతో పశ్చాతాపం పడుతూ రెస్టారెంట్ యాజమాన్యాన్ని తాజాగా క్షమాపణలు కోరాడు. అంతేగాక తాను చేసిన తప్పిదాన్ని మన్నించాలని తను పెట్టిన వీడియోలో తప్పుడు సమాచారం ఇచ్చానంటూ మరో వీడియో పోస్టు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. దీంతో అతడి సబ్స్రైబర్స్ అంతా తమని తప్పుదొవ పట్టించడమే కాకుండా.. రెస్టారెంట్ మూతకు కారణమయ్యావంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వెనకాముందు చూసుకొకుండా తప్పుడు వీడియో పోస్ట్ చేయడంతో వేల సంఖ్యలో సబ్స్రైబర్స్ ఆ చానల్ను అన్సబ్స్క్రైబ్ చేశారు. -
16 లక్షల వ్యూస్తో బిలాల్ వీడియో
మీకు బిలాల్ గోరెగెన్ గుర్తుండే ఉంటారు. అతను టర్కిష్కు చెందిన వీధి సంగీత కారుడు, వైబింగ్ క్యాట్ మీమ్ ద్వార ప్రసిద్ధి చెందాడు. 1981లో జ్యోతి మూవీకి చెందిన హిట్ సాంగ్ కలియోన్ కా చమన్ పాటను పాడటంతో ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు. దృష్టిలోపం ఉన్న సంగీత కారుడు బిలాల్ . గత సంవత్సరం తను పాడిన ఒక పాట చాల వైరల్ అయింది. 1930లో ప్రసిద్ధి చెందిన ఇవాన్ పోల్కా అనే పాటను బిలాల్ ఒక పార్కులోని బెంచ్పై కూర్చోని దర్బుకా(తబలా) ప్లే చేస్తూ పాడాడు. ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అయి వైరల్ అయింది. చదవండి: (దేశంలో మరింత తగ్గిన కరోనా మరణాలరేటు) అక్టోబర్ 2020లో ఒక వ్యక్తి బిలాల్ సంగీతానికి పిల్లి ఆశ్వాదిస్తూ తలూపుతున్నట్లు మీమ్ను చేశాడు. అది ట్విట్టర్లో, పలు సోషల్ మీడియా వేదికలపై తెగ హల్ చల్ చేసింది. దీంతో బిలాల్ వైబింగ్ క్యాట్ మీమ్ ద్వారా ప్రసిద్ధి చెందాడు. పలు కారణాలతో వార్తల్లో నిలుస్తు వస్తున్న బిలాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఐదురోజుల క్రితం దర్బుకా ప్లే చేస్తు కలియోన్ అనే పాటను పాడాడు. చాల అద్భుతంగా పాడిన ఆ పాటను యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో 16 లక్షల వ్యూస్తో వైరల్ అయ్యింది. -
యూట్యూబ్ యూజర్లకు గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: మళ్లీ ఇప్పుడు ఇండియాలో హెచ్డీ క్వాలిటీలో వీడియోలు చూసే అవకాశాన్ని యూట్యూబ్ కల్పించనుంది. లాక్డౌన్ సమయంలో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగిలిన వారందరూ వర్క్ ఫ్రం హోం ద్వారా సేవలను అందించారు. అందువల్ల మొబైల్ నెట్వర్క్ల మీద అధిక భారం పడింది. దీనిని అదుపు చేయడానికి యూట్యూబ్ మార్చి నెలలో 1080 పిక్సల్ హెడీ వీడియోలను నిలిపివేసింది. బ్రాండ్ బాండ్ సేవలకు అంతరాయం కలగకుండా 480 పిక్సల్ క్వాలిటి వీడియోలకు మాత్రమే యూట్యూబ్ అనుమతినిచ్చింది. మొబైల్నెట్ వర్క్, బ్రాండ్బాండ్ నెట్వర్క్ల మీద కూడా ఈ నిషేధాన్ని విధించింది. అయితే ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేయడంతో దాదాపు కార్యాలయాలన్ని తిరిగి ప్రారంభమయ్యాయి. ఇంటి నుంచి కాకుండా ఆఫీసుల నుంచి వర్క్ చేయడం ప్రారంభిస్తున్నారు. దీంతో భారతదేశంలో మళ్లీ హెచ్డీ 1080 పిక్సల్ హెడీ వీడియోలకు యూట్యూబ్ అనుమతినిచ్చింది. వైఫై నెట్వర్క్ ద్వారా వీడియోలను హై క్వాలిటీలో చూడొచ్చు. కొన్ని ఫోన్స్లో 1080 పిక్సల్ వీడియోలు ప్లే అవుతుండగా కొన్ని మొబైల్స్లో 1440 పిక్సల్ వీడియోలు ప్లే అవుతున్నాయి. అయితే రీసెంట్గా విడుదలై ఐవోఎస్తో నడిచే ఐఫోన్ XR, ఐఫోన్ 11 వంటి వాటిలో ప్రస్తుతం మొబైల్ నెట్వర్క్ల ద్వారా 4కే వీడియోలను ప్లే చేయవచ్చు. అదేవిధంగా ఎయిర్టెల్, జియో నెట్వర్క్లలో ఐఫోన్ ఎక్స్ఆర్లో 4 కె వీడియోలను, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రోలో 1440 పి వీడియోలను ప్లే చేయవచ్చు. వీడియో క్వాలిటీ మీద ఉన్న నిషేధాలను ఎత్తివేయడంతో ఇక నుంచి హెచ్డీ వీడియోలను చూసి ఆనందించవచ్చు. చదవండి: రికార్డు బ్రేక్: ఈ పాటకు 7+ బిలియన్ వ్యూస్ -
రికార్డు బ్రేక్: ఈ పాటకు 7+ బిలియన్ వ్యూస్
యూట్యూబ్లో పిల్లల సాంగ్స్ కానీ, రైమ్స్ కానీ కనిపిస్తే పట్టించుకోకుండా వదిలేస్తాం. కానీ ఓ పాట మాత్రం యూట్యూబ్లో రికార్డులను తిరగరాసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. యూట్యూబ్ చరిత్రలోనే ఎక్కువ మంది వీక్షించిన వీడియోగా "బేబీ షార్క్" రికార్డుకెక్కింది. పిల్లల కోసం రూపొందించిన ఈ సాంగ్ను దక్షిణ కొరియాలోని పింక్ఫాంగ్ అనే కంపెనీ 2016లో జూన్ 17న రిలీజ్ చేసింది. ఆ పాటలో ఉన్న మ్యాజిక్ పిల్లలనే కాదు పెద్దలను కూడా ఆకర్షించింది. ఎలెన్ డీజెనర్స్, జేమ్స్ కార్డన్, సోఫీ టర్నర్ వంటి సెలబ్రిటీలు సైతం 2018లో ఈ పాటను రీక్రియేట్ చేసి చాలెంజ్లు విసురుకున్నారు. వాషింగ్టన్ నేషనల్ బేస్బాల్ టీమ్ కూడా ఈ పాట నుంచి మనసు తిప్పుకోలేకుండా పోయింది. దీన్ని జాతీయ గేయంగా ప్రకటించింది. ఈ పాట ఇచ్చిన ఉత్సాహంతో గతేడాది ఈ జట్టు ఆటగాళ్లు ప్రపంచ సిరీస్ను కైవసం చేసుకోవడం విశేషం. (చదవండి: కనకవ్వ: అన్నీ బతుకుపాటలే..) 2019లో బిల్బోర్డ్ హాట్ 100లో ఈ సాంగ్ 32వ స్థానాన్ని సైతం సంపాదించింది. ఇక ఇప్పటివరకు 7.039 బిలియన్ల వ్యూస్తో యూట్యూబ్లో డెత్రోన్ లూయిస్ ఫాన్సికి చెందిన "డెస్పాసిటో" సాంగ్ అత్యధిక మంది వీక్షించిన వీడియోగా తొలిస్థానంలోనే ఉండేది. కానీ బేబీ షార్క్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. 7.046 బిలియన్ల వ్యూస్తో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2.16 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ పాప, ఓ బాబు మాత్రమే ఉంటారు. వాళ్ల చుట్టూ షార్క్(సొరచేప)లు ఉంటాయి. పాట మొత్తంలో 'షార్క్ డుడుడుడు' అనే క్యాచీ పదాలే ఎక్కువగా ఉండటంతో పిల్లలు ఈ పాటను సులువుగా నేర్చేసుకుంటున్నారు. ఇక యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోల్లో బేబీ షార్క్ తర్వాత డెస్పాసిటో, షేప్ ఆఫ్ యూ, సీ యూ అగెన్, మాషా అండ్ ద బీర్ రెసిపీ ఫర్ డిజాస్టర్ అనే వీడియోలు తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. (చదవండి: అప్పులపాలై ఇంటికి తిరిగొచ్చిన పిల్లి!) -
యూట్యూబ్లో రికార్డు సృష్టిస్తున్న సాంగ్
కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ మొదటి ఇంగ్లీష్ సింగిల్ “డైనమైట్” ను శుక్రవారం విడుదల చేసింది. డైనమైట్ విడుదలయిన ఒక్కరోజులోనే అత్యధిక వీక్షణలు పొంది యూట్యూబ్లో రికార్డు సృష్టించింది. డైనమైట్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విడుదలయ్యింది. అయితే శనివారం ఉదయం 6.05 గంటలకు వరకు ఈ వీడియోను 86.4 మిలియన్ల మంది చూశారు. అంతకుముందు కూడా మరొక కొరియా పాప్ బ్యాండ్ బ్లాక్పింక్ చేసిన ట్రాక్ “హౌ యు లైక్ దట్” కూడా 86.3 మిలియన్ల వీక్షణలతో రికార్డ్ను సృష్టించింది. శనివారం యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోలలో డైనమైట్ మొదటిస్థానంలో నిలిచింది. కేవలం ఇది మాత్రమే కాకండా డైనమైట్ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ వీడియో 3 మిలియన్లకు పైగా ప్రత్యక్ష వీక్షకులతో అత్యధికంగా వీక్షించిన యూట్యూబ్ ప్రీమియర్గా రికార్డును సృష్టించింది. అయితే, కొరియా పాప్ బ్యాండ్ ఈ ఘనతను సాధించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు విడుదలైన “బాయ్ విత్ లవ్” 24 గంటల్లో 74.6 మిలియన్ వీక్షణలను పొందింది. దీని గురించి బీటీఎస్ సంస్థ వారు మాట్లాడుతూ, ‘ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ఒక ఇంగ్లీష్ పాటను రూపొందించి వారికి కొంత ఆనందాన్ని పంచాలనుకుంటున్నాం’ అని తెలిపారు. -
యువతుల్ని వేధించిన 'డ్రీమ్ బాయ్'
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ చానళ్లకు పరిమితమైన ప్రాంక్ వీడియోల విష సంస్కృతి యూట్యూబ్ చానళ్ల పుణ్యమా అని నగరానికీ పాకింది. ప్రాంక్ పేరుతో కొందరు హద్దు మీరి వ్యవహరిస్తున్నారు. ఆడవాళ్లను వేధింపులకు గురిచేస్తున్నారు. ‘నేను సింగిల్ అండి... నాకు ఓ హగ్ ఇస్తారా? అంటూ ప్రాంక్ పేరిట వీడియో రూపొందించిన ‘డ్రీమ్ బాయ్ జయసూర్య’ అనే యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు రమావత్ సురేష్..తన చానల్లో వీడియోను పోస్టు చేశాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇద్దరు యువతులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులుదర్యాప్తు చేపట్టారు. ఈ తరహా కేసు నమోదు కావడం నగరంలో ఇదే తొలిసారి. సురేష్ గత కొన్నాళ్లుగా డ్రీమ్ బాయ్ జయసూర్య పేరుతో ఓ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే దీని కేంద్రంగా ఆన్లైన్ గేమ్స్కు సంబంధించిన లింకులు ఏర్పాటు చేయడం, బెట్టింగ్స్కు అవసనరమైన లింకులు పొందుపరచడం, వీటిని వినియోగించుకోవడానికి నిర్ణీత మొత్తం సబ్స్క్రిప్షన్ కట్టించుకోవడం వంటివి చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు. దీనికితోడు తన చానల్ పాపులారిటీ పెంచుకోవడానికి ప్రాంక్ వీడియోలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒంటిపై షార్ట్..పైన టవల్ కట్టుకుని ఓ పబ్లిక్ ప్లేసులో సంచరిస్తూ యువతుల్ని వేధించాడు. సినిమా చూస్తారా? అంటూ వారిని ప్రశ్నిస్తూ హఠాత్తుగా తన టవల్ తీసేసి భయభ్రాంతులకు గురి చేశాడు. ఇలా రూపొందించిన ప్రాంక్ వీడియోను గత ఏడాది ద్వితీయార్థంలో తన యూట్యూబ్ చానల్లో పెట్టాడు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ సైబర్ స్పేస్ పోలీసింగ్ ద్వారా ఈ విషయం గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది జనవరిలో రమావత్ సురేష్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఇతడు రూపొందించిన వీడియో ఇప్పడు కేసు నమోదుకు కారణమైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో సంచరించిన ఇతగాడు నేను సింగిల్ అండి... ఓ హగ్ ఇస్తారా? అంటూ యువతులు, విద్యార్థినుల్ని అడుగుతూ వీడియో రికార్డు చేశాడు. దాదాపు పది నిమిషాల నిడివితో ఉన్న దీన్ని తన యూట్యూబ్ చానల్ డ్రీమ్బాయ్ జయసూర్యలో పొందుపరిచాడు. ప్రతి సీన్ను వెనుక బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్, మ్యూజిక్ ఏర్పాటు చేశాడు. దీన్ని ఇప్పటి వరకు 12 లక్షల మంది వీక్షించారు. ప్రతి సీన్ ముగిసిన తర్వాత ఇది ప్రాంక్ వీడియో అంటూ వారికి చెబుతూ..అదిగో అక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పండి అంటూ సూచించాడు. అయితే ఇద్దరు యువతుల విషయంలో మాత్రం వారికి ఇలా చెప్పలేదు. యూ ట్యూబ్ చానల్లో ఉన్న ఆ వీడియో ఇటీవల ఈ ఇద్దరు యువతుల దృష్టికి వచ్చింది. తమ అనుమతి లేకుండా రూపొందించిన వీడియోను చానల్లో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నగర సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
పలుకే బంగారమాయెగా
ఉన్నికృష్ణన్– అందరికీ పరిచితమైన పేరు.. ఉత్తర కృష్ణన్– ఈ పేరూ అందరికీ పరిచితమే.. ఇద్దరూ సంగీతంలో అభినివేశం ఉన్నవారే. ఇద్దరూ చలన చిత్రాలలో పాటలు పాడినవారే.శ్రీరామనవమి సందర్భంగా ఈ తండ్రికూతుళ్లు ‘పలుకే బంగారమాయెనా’ అనే రామదాసు కీర్తనను పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. వారం కూడా పూర్తి కాకుండానే ఈ వీడియోను 20 లక్షలకు పైగా విని పరవశించారు. ఈ సందర్భంగా సాక్షి ఫోన్ ద్వారా సంభాషించింది. వివరాలు... మా అమ్మాయి పాడిన భక్తి గీతాలు, సినీ గీతాలు, పాశ్చాత్య సంగీతం వీడియోలకి మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు శ్రీరామ నవమి సందర్భంగా రామదాసు కీర్తన పెట్టాలనుకున్నాం. ఎస్. జయకుమార్ అందుకు సహకరించారు. రామదాసు కీర్తనకు ప్రస్తుత పాశ్చాత్య ఆర్కెస్ట్రాను సమకూర్చారు. అంతకుముందే నేను మా అమ్మాయితో కలిసి వీడియో చేద్దామనుకున్నాను. ఇలా తండ్రికూతుళ్లు పాడటం చాలా అరుదు. మా అమ్మాయి ఉత్తరకి ఐదో ఏట నుంచే సుధారాజన్ దగ్గర సంగీతం నేర్పించాను. అమ్మాయి కర్ణాటక సంగీతం, సినిమా పాటలు, పాశ్చాత్య సంగీతం అన్నీ పాడుతోంది. అన్నిటికీ తోడు అమ్మాయి చదువుతున్న స్కూల్లో సంగీతానికి సంబంధించిన విశ్లేషణ, స్వరకల్పన, సంగతులు వేయటం నేర్పిస్తారు. అలా అన్నిచోట్లా సంగీతంతో ప్రయాణం చేస్తోంది. చదువును నిర్లక్ష్యం చేయకుండా సంగీతాన్ని నేర్చుకుంటోంది. నేను అమ్మాయి కలిసి పాడాలంటే మా ఇద్దరు శృతులు వేరు వేరు. అందువల్ల నేను పాడటానికి వెనకాడాను. అయినా ప్రయత్నిద్దామనుకున్నాను. మాకు ఆడియో పంపేశారు. నేను ఉత్తర బాగా సాధన చేశాం. నాకు తెలుగు రాదు కనుక దోషాలు లేకుండా పాడటం కోసం డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన ‘పలుకే బంగారమాయెనా’ కీర్తనను చాలాసార్లు విన్నాను. ఉచ్చారణ దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. అమ్మాయి కూడా తప్పులు పాడకుండా శిక్షణ ఇచ్చాను. అలాగే ఆయన బాణీలోనే పాడాం. ఇద్దరం సాధన చేసి, మా కెమెరాలో వీడియో తీశాం. అందులో వచ్చిన దోషాలను మళ్లీ సరిచేసుకున్నాం. అలా ఆ వీడియో తప్పులు లేకుండా రావటం కోసం ఇన్ని శ్రద్ధలు తీసుకున్నాం. మా అమ్మాయితో కలిసి మరిన్ని పాటలు పాడి, వీడియోలు చేయాలని కోరికగా ఉంది. రామదాసుదే ‘సీతా కల్యాణ వైభోగమే’ కీర్తన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ శ్రీరామనవమి మాకు నిజంగా పండుగే. రామనామం పానకం వంటిది. ఆ నామాన్ని జపించడం మాకు సంతోషంగా ఉంది.– సంభాషణ: జయంతి -
వీడియో క్వాలిటీ తగ్గించిన యూట్యూబ్
సాక్షి, హైదరాబాద్ : కరోనా ఎఫెక్ట్ యూట్యూబ్ వీడియో క్వాలిటీపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వడంతో కాలక్షేపం కోసం ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. దీంతో ఇంటర్నెట్ రవాణా వ్యవస్థపైన ఒక్కసారిగా భారం పడింది. ఈ నేపథ్యంలో వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు, క్వాలిటీని తగ్గించి భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత్లో వీడియోలను ఆండ్రాయిడ్ మొబైల్లలో వీక్షించే యూజర్లకు క్వాలిటీని 480 పిక్సల్లకు యూట్యూబ్ తగ్గించింది. ఏ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా ఆండ్రాయిడ్ మొబైల్లలో క్వాలిటీ 480 పిక్సల్లకు మించి ప్లే అవ్వడం లేదు. అయితే డెస్క్టాప్లో యూట్యూబ్ వీక్షకులకు మాత్రం ఎప్పటిలానే ఆటోమేటిక్గా 1080 పిక్సల్ క్వాలిటీతో వీడియోలు ప్లే అవుతున్నాయి. ఇప్పటికే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్లు గతవారమే క్వాలిటీని తగ్గించిన విషయం తెలిసిందే. -
యూట్యూబ్లో చూసి కిరాతకం!
నిజామాబాద్అర్బన్: నగరంలోని ఆర్యనగర్లో రెండ్రోజుల క్రితం జరిగిన వివాహిత హత్య కేసు మిస్టరీ వీడింది. తెలిసిన వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు కక్ష పెంచుకు ని, ఎలాగైనా అంతమొందించాలని నిందితులు నిర్ణయించుకున్నారు. ఏ విధంగా హత్య చేయాలి, పోలీసులకు ఆధారాలు దొరకకుండా ఏం చేయాలో ఆరా తీశారు. ఇందుకోసం యూట్యూబ్లో పలు క్రైం సీన్స్ చూశారు. పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసి, పరారయ్యారు. కానీ పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్లో రెండ్రోజుల క్రితం జరిగిన వివాహిత హత్య కేసును 48 గంటల వ్యవధిలోనే ఛేదించారు. కేసు వివరాలను సీపీ కార్తికేయ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆర్యనగర్లో నివాసముండే రాజవరపు శ్రీనివాస్ భార్య లక్ష్మి (43) సోమవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు నాగరాజు, నగేశ్కుమార్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డబ్బు ఇవ్వమని అడిగినందుకు.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముంబోజీపేటకు చెందిన పసులాడి నాగరాజు, డిచ్పల్లి మండం ధర్మారం గ్రామానికి చెందిన దుమాల నగేశ్కుమార్ అలియాస్ నాగరాజు.. ఆర్యనగర్కు చెందిన శ్రీనివాస్ వద్ద గతంలో పని చేసేవారు. పసులాడి నాగరాజుతో పాటు అతడి తండ్రి గతంలో శ్రీనివాస్ వద్ద అప్పు తీసుకున్నారు. ఈ అప్పు తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరగా ఇవ్వని నాగరాజు అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం ధర్మారం గ్రామానికి వచ్చిన నాగరాజు నగేశ్కుమార్ను కలిశాడు. శ్రీనివాస్ డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఎలాగైనా చంపాలని చెప్పాడు. దీంతో ఇద్దరు కలిసి కంఠేశ్వర్లోని ఓ వైన్స్లో మద్యం కొనుగోలు చేసి, మాధవనగర్ వద్ద బైపాస్ రోడ్డుకు వెళ్లారు. యూట్యూబ్లో చూసి.. ఇద్దరు మద్యం సేవిస్తూ మర్డర్ ఎలా చేయాలని చర్చించుకున్నారు. హత్య ఎలా చేయాలి.. పోలీసులకు ఆధారాలు దొరకకుండా ఏం చేయాలనే దానిపై యూట్యూబ్లో అనేక క్రైం సీన్లను చూశారు. అనంతరం నగేశ్కుమార్ హత్యకు ప్రణాళిక రూపొందించాడు. ధర్మారంలోని తన ఇంటి నుంచి పసుపు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఓ షాపులో కారంపొడి కొనుగోలు చేశారు. ఇద్దరు కలిసి ఆర్యనగర్కు చేరుకున్నారు. నగేశ్కుమార్ కొద్ది దూరంలోనే ఆగిపోగా, నాగరాజు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నాడు. తెలిసిన వ్యక్తే కావడంతో శ్రీనివాస్ భార్య ఇంట్లోకి ఆహ్వానించింది. అయితే, ఆమె సోఫాలో కూర్చోగానే నాగరాజు రాడుతో ఆమె తలపై బలంగా మోదాడు. అనంతరం కత్తితో మెడ, ఛాతిలో పొడిశాడు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు నాగరాజు మృతదేహంతో పాటు ఘటనా స్థలంలో పసుపు, కారంపొడి చల్లాడు. లక్ష్మి కాలి వేళ్లను నరికి, కాళ్లకు ఉన్న పట్టీలు, మెడలోని నగలు, ఫోన్ తీసుకున్నాడు. అనంతరం మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె చుట్టూ దీపాలు వెలిగించాడు. సుమారు 45 నిమిషాల పాటు ఇంట్లోనే ఉన్న అతడు తీరిగ్గా బయటకు వెళ్లాడు. అయితే, ఆ రోజు హోలీ కావడం, అప్పటికే నాగరాజు దుస్తులపై రంగు పడడంతో ఆయనపై పడిన రక్తపు మరకలను స్థానికులు గుర్తించలేదు. హత్యకు ఉపయోగించిన కత్తి, రాడ్ను బోర్గాం వద్ద దాచి పెట్టి, వెళ్లి పోయారు. పట్టిచ్చిన కుక్క.. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రొఫెషనల్ గ్యాంగ్ పనేనని తొలుత భావించిన పోలీసులు ఆ కోణంలో విచారించారు. మరోవైపు, శ్రీనివాస్కు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా..? అన్న వివరాలు సేకరించారు. అయితే, శ్రీనివాస్ ఇంట్లో ఉండే కుక్క హత్య జరిగిన రోజు మొరగక పోవడాన్ని గుర్తించిన పోలీసులు.. ఆ కోణంలో దృష్టి సారించారు. సాధారణంగా ఎవరెవరు వస్తే కుక్క అరవదని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో నాగరాజు పేరు చెప్పడం, హత్య జరిగిన రోజు కాలనీలో అతడు స్థానికులకు కనిపించడంతో పోలీసులు దాదాపు అతడేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో లింగంపేటకు వెళ్లి నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో రెండో నిందితుడు నగేశ్కుమార్ను కూడా అరెస్టు చేశారు. అయితే, హత్య జరిగిన తర్వాత రోజు ఆర్యనగర్కు వచ్చిన నగేశ్కుమార్.. ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫోన్లో నాగరాజుకు సమాచారమివ్వడం గమనార్హం. 48 గంటల్లోపు కేసును ఛేదించిన అడిషనల్ డీసీపీ రఘువీర్, ఏసీపీ ప్రభాకర్, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు లక్ష్మయ్య, నరేందర్, రమణ తదితరులను సీపీ అభినందించారు. -
‘నేను నా రాక్షసి’ సినిమా తరహాలో బలవన్మరణం
బంజారాహిల్స్: ‘చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది’ అంటూ బీటెక్ విద్యార్థి గణేష్ సూసైడ్ నోట్ రాసి.. నైట్రోజన్ ఆక్సిజన్ కలిగి ఉన్న సిలిండర్ పైపులను బిగించుకొని.. ముఖంపై పాలిథిన్ కవర్తో కప్పుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ వినాయకనగర్లో జరిగిన అతని ఆత్మహత్య తీరు కుటుంబ సభ్యులను నివ్వెరపోయేలా చేసింది. యూ ట్యూబ్లో చూసి.. వారం పది రోజులుగా తేలికగా ఎలా చనిపోవాలో గణేష్ యూట్యూబ్ సెర్చ్ చేసినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే ఎర్రగడ్డలోని ఓ గ్యాస్ ఏజెన్సీస్లో ఈ నెల 14న రూ.3,154 వెచ్చించి సిలిండర్ను, పైపులు, పాలిథిన్ కవర్లు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంట్లోని స్టోర్ రూంలో వీటిని భద్రపరిచాడు. నైట్రోజన్ ఆక్సిజన్ సిలిండర్ పైపులను ముక్కులోకి పెట్టుకొని రసాయన వాయువులు బయటికి రాకుండా తన శరీరంలోకి వెళ్లేలా ముఖాన్ని పాలిథిన్ కవర్లతో గట్టిగా చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నేను నా రాక్షసి’ సినిమాలో ఇలాగే తేలికగా చనిపోయే కొన్ని దృశ్యాలు చూసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ సినిమాలో బండరాళ్లు కట్టుకొని నీటిలో దూకడం, ఇంజక్షన్లు తీసుకొని శరీరం బండబారేలా చేసుకోవడం వంటివి చూసినట్లుగా కూడా తెలుస్తోంది. స్మార్ట్ ఫోనే కారణమా..? గణేష్ వద్ద స్మార్ట్ ఫోన్ లేకుంటే ఇలాంటి పని చేసి ఉండేవాడు కాదని గణేష్ అతని స్నేహితులు చెబుతున్నారు. స్మార్ట్ పోన్ ఉండటంతోనే ఇంటి వద్ద సెర్చ్ చేసి మరీ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. బండ్లగూడలోని మహవీర్ కాలేజీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న గణేష్ మొదటి సంవత్సరంలోనే పరీక్షలు సరిగా రాయకపోవడంతో డిటెండయ్యాడు. మరోసారి పరీక్షలు రాసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మూడు రోజులుగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడకుండా అన్యమనస్కంగా ఉంటున్నాడు. ఫోన్ను సైలెంట్ మోడ్లో పెట్టాడు. ఈ నెల 14నే ఆత్మహత్య చేసుకోవాలని పథకం రచించుకున్నాడు. ఇందులో భాగంగానే మూడు రోజుల ముందే సామగ్రిని తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాత్రమే ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. సోమవారం కుటుంబ సభ్యులు బయటికి వెళ్లడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నా’నంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
యూ ట్యూబ్ చూశారు.. ప్రింటింగ్ చేశారు
సాక్షి, సిటీబ్యూరో: తమ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అరెస్టు కావడంతో నకిలీ కరెన్సీ ప్రింటింగ్ విషయం తెలిసింది.. యూ ట్యూబ్లో చూసి ఎలా ముద్రించాలో అధ్యయనం చేశారు.. ఓఎల్ఎక్స్లో స్కానర్ కమ్ ప్రింటర్ను ఖరీదు చేసి మొదలెట్టారు.. సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని సంతల్లో సర్క్యులేట్ చేస్తున్నారు.. సిటీలో మార్చేందుకు వచ్చిన అనుచరుల్ని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకోగా మొత్తం గ్యాంగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో వరుసదాడులు చేసిన అధికారులు ముగ్గురు జువైనల్స్తో సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం తెలిపారు. టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వీరి నుంచి రూ.9.27 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ అరెస్టుతో ఆలోచన... సంగారెడ్డి పట్టణానికి చెందిన ఇబ్రహీం బిన్ సాలేహ్ అక్కడి బసవేశ్వర నగర్లో స్టీలు పాత్రల విక్రయం వ్యాపారం చేస్తుంటాడు. ఇతడి స్నేహితుడైన అక్కడి శ్రీనగర్కాలనీ వాసి బండారి గౌతమ్ కంప్యూటర్ సైన్స్లోని డిప్లొమో పూర్తి చేసి ప్రస్తుతం రియల్టర్గా వ్యవహరిస్తున్నాడు. మూడేళ్ల క్రితం నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నాడనే ఆరోపణలపై సంగారెడ్డి పోలీసులు అక్కడే ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అప్పుడే ఈ ఇద్దరికీ తామూ నకిలీ కరెన్సీ ముద్రించి చెలామణి చేయాలనే ఆలోచన వచ్చింది. కంప్యూటర్ సైన్స్లో డిప్లమో చేసిన గౌతమ్ తనకు ఉన్న పరిజ్ఞానానికి యూ–ట్యూబ్లో చూసిన అంశాలు జోడించి స్కానర్, ప్రింటర్ వినియోగించి నకిలీ నోట్లు ముద్రించే విధానాన్ని తెలుసుకున్నాడు. దీంతో గత ఏడాది మార్చ్లో ఈ ద్వయం ఓఎల్ఎక్స్ ద్వారా స్కానర్ కమ్ కలర్ ప్రింటర్ను కొనుగోలు చేసింది. ఇషాక్ బిన్ సాలేహ్ ఇంట్లోనే కంప్యూటర్కు వీటిని సెట్ చేసిన రూ.200, రూ.100 డినామినేషన్స్లో నకిలీ కరెన్సీ ముద్రించడం మొదలు పెట్టింది. సంతలే టార్గెట్.. ఇలా ముద్రించిన కరెన్సీని చలామణి చేయడానికి సంగారెడ్డికే చెందిన మహ్మద్ సోహైల్ అలీ (వస్త్ర దుకాణంలో సేల్స్మెన్), నగరానికి చెందిన మహ్మద్ గౌసుద్దీన్ (ప్రైవేట్ ఉద్యోగి), అబ్రార్ ఖాన్ (డీజే ఈవెంట్స్ నిర్వాహకుడు), సయ్యద్ ఖాసిఫ్ బహదూర్లతో (విద్యార్థి) పాటు ముగ్గురు మైనర్లను ఏర్పాటు చేసుకుంది. సంగారెడ్డికే చెందిన సోహైల్ ప్రస్తుతం బంజారాహిల్స్లో పని చేస్తుండటంతో ఇక్కడి వారితో ముఠా సూత్రధారులకు పరిచయాలు ఏర్పడ్డాయి. వీరికి ప్రధాన నిందితులు ఇద్దరూ రూ.10 వేల అసలు కరెన్సీకి రూ.30 వేల నకిలీ కరెన్సీ చొప్పున అందించేది. ఈ ముఠా ప్రధానంగా సంగారెడ్డితో పాటు జహీరాబాద్, సదాశివపేట్, మెదక్ల్లో జరిగే సంతల్ని టార్గెట్గా చేసుకుని నకిలీ కరెన్సీ చెలామణికి పథకం వేసింది. అక్కడ మార్పిడికి తేలికనే ఉద్దేశంతోనే రూ.200, రూ.100 డినామినేషన్స్లో ముద్రిస్తోంది. ఆ సంతలతో పాటు గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాలు నిర్వహించే నిరక్షరాస్యుల వద్ద ఈ కరెన్సీని మార్చేస్తోంది. చాట్ బండార్ వద్ద దొరికి.. కొన్ని నెలలుగా సంగారెడ్డి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో చలామణి చేసిన ఈ ముఠా కన్ను ఇటీవల నగరంపై పడింది. చిన్న చిన్న దుకాణాల్లో మార్పిడి చేయడం మొదలెట్టింది. ఈ ముఠాకు చెందిన ముగ్గురు జ్యువైనల్స్ జగదీష్ మార్కెట్లోని ఓ చాట్ బండార్ వద్దకు వెళ్ళి రూ.200 ఇచ్చి చాట్ తిని చిల్లర తీసుకువెళ్ళారు. మళ్ళీ 10 నిమిషాలకే వచ్చిన వీరు మరోసారి చాట్ తిన్నారు. మూడోసారీ అలానే రావడం, రూ.200 ఇవ్వడంతో దాని నిర్వాహకుడికి అనుమానం వచ్చింది. అతడి ద్వారా సమాచారం అందుకున్న ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్ని ఆ ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి విచారణలో ఇతర నిందితుల వివరాలు వెలుగులోకి రావడంతో ఆరుగురు నిందితుల్నీ అరెస్టు చేసి వీరి నుంచి రూ.9.27 లక్షల విలువైన నకిలీ కరెన్సీతో పాటు ముద్రణకు ఉపకరించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. గిఫ్ట్ రేపర్తో సెక్యూరిటీ థ్రెడ్ సాక్షి, సిటీబ్యూరో: నకిలీ కరెన్సీ ముద్రించే స్థానిక ముఠాలు నానాటికీ తెలివి మీరుతున్నాయి. ఆ నోట్లు అసలు వాటిని పోలినట్లుగా ఉండేందుకు అనేక ‘జాగ్రత్తలు’ తీసుకుంటున్నాయి. దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కిన గ్యాంగ్ స్కానర్, ప్రింటర్ ద్వారా రూపొందించిన ఫేక్ నోట్కు సెక్యూరిటీ థ్రెడ్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. దీనికోసం గిఫ్ట్ రేపర్ను కత్తిరించిన వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన నలుగురు నిందితుల్ని పట్టుకున్నామని, వీరి నుంచి రూ.8.5 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. సినిమా పెట్టుబడితో నష్టాలు వచ్చి.. నగరంలోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన బీవీ శివ సందీప్ ఎంబీఏ పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాడు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న ఇతడు కొన్నాళ్ల క్రితంఓ బ్యానర్ను ఏర్పాటు చేశారు. ఓ సినిమా నిర్మాణం ప్రారంభించిన ఇతగాడు దాదాపు రూ.కోటి పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేస్తూ... పూర్తిగా ఆ ఊబిలో కూరుకుపోయాడు. ఆసిఫ్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్బర్ పాషా అక్యుప్రెషర్ విద్యను అభ్యసించి చిన్న క్లినిక్ నిర్వహిస్తున్నాడు. మురాద్నగర్కు చెందిన మహ్మద్ మొమిన్ ఎంబీబీఎస్లో సీటు సాధించినా.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దాని బాక్లాగ్స్ పూర్తి చేయలేక మెడికల్ రిప్రజెంటేటివ్గా మారాడు. ఈ ముగ్గురికీ ఖిల్వత్ గ్రౌండ్స్ ప్రాంతానికి చెందిన పాల సరఫరాదారుడు మహ్మద్ రజియుద్దీన్తో పరిచయం ఏర్పడింది. వీరంతా ఓ ముఠాగా మారి నకిలీ కరెన్సీ ముద్రించి చలామణి చేయాలని పథకం వేశారు. స్కాన్ చేసి ‘గ్రాఫ్’తో సరిచేస్తూ.. కంప్యూటర్తో పాటు ప్రింటర్, స్కానర్లను ఖరీదు చేసిన శివ సందీప్ తన ఇంట్లోనే ప్రింటింగ్ ప్రారంభించాడు. అసలు నోటును స్కానర్లో స్కాన్ చేసే ఇతగాడు దాన్ని కంప్యూటర్లోకి తీసుకువస్తాడు. నోటు ముందు, వెనుక వేర్వేరుగా స్కాన్ చేస్తుండటంతో ఒకే కాగితంపై రెండూ పక్కాగా ముద్రితం కావడానికి ఇతగాడు కంప్యూటర్లో గ్రాఫ్ పేపర్ మాదిరిగా డిజైన్ చేసి దానిపై స్కాన్ చేసిన నోట్ను సెట్ చేస్తున్నాడు. ఇలా ప్రింట్ చేసిన కరెన్సీలో ఎంబోజింగ్తో పాటు సెక్యూరిటీ థ్రెడ్, వాటర్ మార్క్ ఉండట్లేదు. మిగిలిన రెండూ తీసుకురావడం కష్టంగా భావించిన ఇతగాడు సెక్యూరిటీ థ్రెడ్ని మాత్రం గిఫ్ట్ రేపర్తో ‘డిజైన్’ చేయగలిగాడు. దందాల్లో మార్చేస్తూ... ఈ గ్యాంగ్ తమ దందాల్లో కొన్ని అసలు నోట్ల మధ్యలో నకిలీ నోట్లు ఉంచి చలామణి చేస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా ఈ వ్యవహారం సాగిస్తున్న వీరికి సంబంధించిన సమాచారం దక్షిణ మండల టాస్క్ఫోర్స్కు అందింది. దీంతో ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, వి.నరేందర్లు వల పన్ని నలుగురినీ పట్టుకున్నారు. -
ముచ్చట్ల కంటే వీడియోలు చూసేందుకే..
సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్ల రాకతో దేశంలో మొబైల్ డేటా వినియోగం భారీగా పెరుగుతోంది. మొబైల్లో ముచ్చట్ల కంటే నచ్చిన వీడియోలను తిలకించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి మొబైల్ వినియోగదారుడు రోజుకు సగటున 67 నిమిషాలు వీడియోలు చూడటానికే సమయం కేటాయిస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. 2012లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే వీడియోలకు కేటాయించగా ఇప్పుడు రోజుకు ఏకంగా గంటకుపైగా వీడియోల లోకంలో విహరిస్తున్నట్లు ‘యాప్ అన్నే’ సంస్థ తెలిపింది. వీడియోలు తిలకించేందుకు అత్యధికంగా యూట్యూబ్ను అనుసరిస్తుండగా ఆ తర్వాత స్థానాల్లో హాట్స్టార్, జియో టీవీ, ప్రైమ్ వీడియో యాప్స్ ఉన్నాయి. జియో రాకతో జోరుగా... రిలయన్స్ జియో రాకతో దేశంలో డేటా వినియోగం ఒక్కసారిగా పెరిగినట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. డేటా ధరలు దిగి రావడంతో 2016లో నెలకు సగటున 20 కోట్ల జీబీగా ఉన్న డేటా వినియోగం 2018 నాటికి ఏకంగా 370 కోట్ల జీబీకి చేరింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 5491 కోట్ల జీబీ డేటాను వినియోగించినట్లు టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాంతీయ భాషల్లో తెలుగు హవా... హిందీయేతర వీడియోల విషయానికి వస్తే తెలుగు వీడియోలకు అత్యధిక డిమాండ్ ఉన్నట్లు ‘విడోలి’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. తెలుగు వీడియోలకు అత్యధిక వీక్షకాదరణ ఉంది. యూట్యూబ్లో అప్లోడ్ అయ్యే వీడియోల్లో తెలుగువే అత్యధికంగా ఉంటున్నాయి. ప్రాంతీయ భాషల్లో 2018లో తెలుగు వీడియోలను 6,740 కోట్ల సార్లు వీక్షించడంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో తమిళ, పంజాబీ, మలయాలీ, భోజ్పురి వీడియోలున్నాయి. తెలుగులో న్యూస్ చానళ్లు, సినీరంగ విషయాలకు ఆదరణ లభిస్తోంది. ఇక 5 జీ రంగప్రవేశం చేస్తే డేటా వినియోగం హోరెత్తనుంది. యూజర్లు ఇలా పెరిగారు సంవత్సరం ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య (కోట్లలో) 2015 25.99 2016 29.6 2017 48.1 2018 56.6 2019 62.7 (అంచనా) ప్రాంతీయ భాషా వీడియోల వీక్షణల సంఖ్య (కోట్లలో) భాష 2016 2018 తెలుగు 1,270 6,740 తమిళం 8,20 4,550 పంజాబీ 4,40 3,000 మలయాళం 380 1,990 భోజ్పురి 250 3,140 రెండేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల... 2016లో తెలుగు వీడియోల వీక్షణల సంఖ్య 1,270 కోట్లు కాగా రెండేళ్లలో ఇది 6,740 కోట్లకు చేరింది. యూట్యూబ్లో అత్యధికంగా అప్లోడ్ అవుతున్న వీడియోల్లో తెలుగే మొదటి స్థానంలో ఉన్నట్లు ‘విడోలి’ తెలిపింది. 2016లో మొత్తం 1.6 కోట్ల తెలుగు వీడియోలు అప్లోడ్ కాగా 2018 నాటికి ఇది 16.6 కోట్లు దాటేసింది. -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న వైఎస్ జగన్ సాంగ్
-
యూట్యూబ్ వీడియోలతో రూ. 500 కోట్ల నష్టం...!
తిరువనంతపురం : సోషల్ మీడియాలో తమ బ్రాండ్ గురించి నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రసిద్ధ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. నకిలీ ఆభరణాలు అమ్ముతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారం వల్ల సుమారు 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కళ్యాణ్ జువెల్లర్స్ కేరళ బ్రాంచ్ పేర్కొంది. ఈ మేరకు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. వివరాలు... నకిలీ బంగారు ఆభరణాలు అమ్ముతున్న కారణంగా కళ్యాణ్ జువెల్లర్స్ను సీజ్ చేశారంటూ యూట్యూబ్లో వీడియోలు ప్రసారం కావడంతో కంపెనీ యాజమాన్యం కంగుతింది. కళ్యాణ్ జువెల్లర్స్ కువైట్ బ్రాంచ్లో జరిగిన సాధారణ తనిఖీలకు సంబంధించిన వీడియోలను ఎడిట్ చేసి ఈవిధంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నట్లు గుర్తించింది. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాధారణ తనిఖీలను అవినీతి నిరోధక దాడులుగా చిత్రీకరించి ప్రత్యర్థి కంపెనీలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని కళ్యాణ్ జువెల్లర్స్ ఆరోపించింది. తమ బ్రాండ్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా కళ్యాణ్ జువెల్లర్స్ లోగోతో యూట్యూబ్ చానల్లో నకిలీ వీడియోలను అప్లోడ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. సోషల్ మీడియాపై సరైన నిఘా లేనందు వల్లే ఇలాంటి నకిలీ వార్తలు, వీడియోలు ప్రసారం అవుతున్నాయని ఆరోపించింది. కళ్యాణ్ జ్యువెల్లర్స్ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు.. సోషల్ మీడియా నకిలీ వార్తలు అదుపు చేసేందుకు క్రమబద్దీకరణలు ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా గతంలో కూడా కళ్యాణ్ జ్యువెల్లర్స్పై సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం జరిగింది. కళ్యాణ్ జువెల్లర్స్లో అమ్ముతున్న బంగారు ఆభరణాలు నకిలీవని ఐదుగురు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో గతేడాది నవంబర్లో కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబాయ్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టయిన ఐదుగురు వ్యక్తులకు భారత మూలాలున్నాయని దుబాయ్ పోలీసులు అన్నారు. వీరిపై సైబర్ క్రైమ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
స్టోరీ.. స్క్రీన్ప్లే.. డైరెక్షన్.. అన్నీ వారే..
సుజిత్.. ఒకప్పుడు షార్ట్ ఫిలిం మేకర్.. సినీ ప్రపంచంలో అడుగుపెట్టాలనుకున్న అతనిలో ఓ షార్ట్ ఫిలిం ఆత్మవిశ్వాసాన్ని నింపింది.. ప్రస్తుతం రూ.300 కోట్లతో ప్రభాస్ హీరోగా నిర్మి స్తున్న ‘సాహో’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను చేసేలా చేసింది. సుజిత్ ఎక్కడ అవకాశాల కోసం వెదకలేదు. తనకు తాను అవకాశాలను సృష్టించుకున్నాడు.. అవకా«శాన్ని అందిపుచ్చుకున్నాడు.. తన సినీ ప్రస్థానాన్ని సిల్వర్స్క్రీన్ వైపు నడిపించాడు.. ఫన్ బకెట్.. యూట్యూబ్లో అత్యంత హిట్ కొట్టిన నవ్వుల షార్ట్ ఫిలిం.. ఇందులో కనిపించే యువకులంతా ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు.. వారు అవకాశాల కోసం ఎదురుచూడలేదు.. కాళ్లు అరిగేలా తిరగలేదు.. కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీల్లోనే తమ ఆశయానికి నారు పోశారు. అదే ఫన్ బకెట్గా నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో నటించిన మిల్క్ మహేష్ తదితర నటులకు సినీ అవకాశాలను కల్పించింది. అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన రామ్ కట్రూకు సినిమాలంటే ప్యాషన్. ఇక్కడికొచ్చిన అతనికి సినిమా తీయడానికి కొంత ఇబ్బంది ఎదురైంది. తన ప్రతిభను చూపడానికి సినిమా ఒకటే అవకా«శం కాదు.. అందుకే.. తనలాంటి ఆలోచనలు ఉన్న ఒక టీంతో ఆయన కలిశాడు. అంతే.. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం తనకు తాను రాసుకున్నారు.. కృష్ణానగర్, గచ్చిబౌలి, మసీదు బండ ప్రాంతాల్లో ‘ప్రక్షాళన’ పేరుతో ఒక షార్ట్ ఫిలింను తెరకెక్కించాడు.. ఇది 16 ఫిలిం ఫెస్టివల్స్లో నామినేట్ అయ్యింది. ప్రతిభ ఒకరి సొత్తు కాదని కృష్ణానగర్ అడ్డాగా నిరూపితమైంది. బంజారాహిల్స్: సినిమాల్లో అవకాశాలు నేరుగా ఎవరికీ రావు. అదృష్టం ఉంటే తప్ప. ఇప్పుడు అదృష్టం ఉండాల్సిన పనిలేదు. ప్రతిభ ఉండి, పట్టుదల ఉంటే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అందుకే.. కృష్ణానగర్, ఇందిరానగర్, శ్రీనగర్కాలనీ ప్రాంతాల్లో ప్రతి రోజు ఔత్సాహిక యువకులు షార్ట్ ఫిలింల రూపకల్పనతో బిజీగా ఉంటున్నారు. కృష్ణనగర్లో ఉండేటువంటి పార్కులు, బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు ఇలా అన్ని ప్రాంతాలు వీరికి లోకేషన్లుగా మారుతున్నాయి. అగ్గిపెట్టెలాంటి ఇళ్లలో నివసించే చాలా మంది ఔత్సాహిక కళాకారులు తమను తాము నిరూపించుకొంనేందుకు ఈ లఘుచిత్రాల బాట పడుతున్నారు. ఇందుకు కృష్ణానగర్ ప్రాంతమే అడ్డాగా నిలుస్తోంది. ముడి సరుకులు అవే.. సమాజంలోని చిన్నచిన్న సంఘటనలే కథకు ముడి సరుకులుగా మారుతున్నాయి. ఇక ప్రతిభ ఉన్నవారు, ఉత్సాహం ఉన్నవారు వారికి వారే కథను రాసుకుంటున్నారు. స్క్రీన్ప్లే, దర్శకత్వం చేస్తున్నారు. యాక్షన్ దగ్గరి నుంచి మొదలుకొని ప్యాకప్ వరకు అంతా వారే చూసుకుంటున్నారు. మరికొందరు ఏకంగా ముందడుగు వేసి హీరోలుగా తమను తాము నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 10 నిమిషాల నుంచి అరగంట నిడివి ఉండేటువంటి షార్ట్ ఫిలింలు ఇప్పుడు యూట్యూబ్లో హిట్ కొడుతున్నాయి. మహాతల్లి, ఫ్రస్టేషన్ ఉమెన్లాంటి స్వీయ కార్యక్రమాలతోపాటు ఫన్బకెట్, మై విలేజ్ షో, దేత్తడి, పక్కింటి కుర్రాడు ఇలాంటి షోలన్నీ ఇప్పుడు పెద్ద పాపులర్గా మారాయి. ఇంతెందుకు నిన్నామొన్నటి వరకు కృష్ణానగర్ వీధుల్లో తిరిగి జబర్దస్త్ టీంలో చేసి మహేష్ ఏకంగా ‘రంగస్థలం’ సినిమాలో రాంచరణ్ తేజ పక్కన చాన్స్ కొట్టాడు. కృష్ణానగర్ వీధుల్లో లఘు చిత్రాల చిత్రీకరణ అన్నీ ఇక్కడే.. లఘుచిత్రాలు చేయడమంటే కేవలం నటించడమే కాదు.. పాత్రకు తగిన విధంగా గెటప్ వేస్తున్నారు. భాష, యాస, మేకప్, దుస్తులు ఇలా అన్నింటిని సమకూర్చుకుంటున్నారు. ఇక వీటన్నింటికీ కృష్ణానగర్ ప్రాంతమే అడ్డా. కెమెరాలు ఇక్కడే అద్దెకు లభిస్తాయి. చిన్న కెమెరాల నుంచి మొదలుకొని పెద్ద కెమెరాల వరకు ఇక్కడ అద్దెకు ఇస్తారు. దుస్తులు, విగ్గులు, వివిధ వేషధారణలకు తగిన ఉత్పత్తులు ఇలా అన్నీ కృష్ణానగర్ అడ్డాలోనే లభిస్తాయి. అందుకే.. ఒకప్పుడు కేవలం అవకాశాల కోసం ఏర్పడిన కృష్ణానగర్ నేడు అవకాశాలు సృష్టించుకొనే డిజిటల్ స్థాయి వైపు తీసుకెళ్తోంది. ఆలోచనలే కాదు.. కృష్ణానగరూ మారుతోంది. షార్ట్ ఫిలిం నుంచిఫీచర్ ఫిలింకు.. సినిమాల్లో అవకాశం కోసం చాలా రోజులు కష్టపడ్డాం. కృష్ణానగర్ వీధులన్నింటినీ పరిచయం చేసుకున్నాం. అవకాశాలు అంత సులువుగా రాలేదు. చివరికి ప్రక్షాళన పేరుతో చేసిన షార్ట్ ఫిలిం చేశాం. అది ప్రపంచ స్థాయిలో ఆకర్షించింది. అంతే.. చాలా మంది పెద్ద డైరెక్టర్లు భుజం తట్టారు. కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించారు. – భరత్రాజు, నటుడు షార్ట్ఫిలింలో పాత్ర కోసం క్యాస్టూమ్స్ అద్దెకు తీసుకుంటూ.. అవకాశాలను సృష్టించుకొన్నాం.. ఫన్బకెట్లో దాదాపు 90 ఎపిసోడ్లు చేశాను. అదంతా కృష్ణానగర్, శ్రీనగర్కాలనీ ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకొనే వాళ్లం. అలా నా వీడియో చూసి మొదటిసారి దర్శకులు తేజ అవకాశం నేనే రాజు నేనే మంత్రి సినిమాలో అవకాశం కల్పించారు. ఇప్పటికీ 16 సినిమాల్లో అవకాశం వచ్చింది. పట్టుదల ఉంటే మనమే కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం చేసుకోవడమే కాదు.. నటించి మనల్ని మనం నిరూపించుకోవచ్చు. – మహేష్ విట్టా, నటుడు, ఫన్ బకెట్ ఫేం -
ఫేస్ బుక్ కంటే యూట్యూబే ఇష్టం..
వాషింగ్టన్ : సెల్పోన్లో ఫేస్బుక్లో చాటింగ్ చేయడం కంటే యూట్యూబ్లో వీడియోలు చూడటానికి యువత ఆసక్తి చూపిస్తోందట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఫ్యూ పరిశోదన సంస్థ సర్వే చేసి వెల్లడించింది. 13-17 సంవత్సరాల యువతీ యువకుల్లో దాదాపుగా 85% మంది యూట్యూబ్లో వీడియోలను చూడటంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారంట. ఈ విషయాలను మొత్తం 743 మంది యువతను ప్రశ్నించి వివరాలను ఫ్యూ సంస్థ సేకరించింది. యూట్యూబ్ తర్వాత ఎక్కువ మంది ఇన్స్టాగ్రాంలో గడిపేస్తున్నారని తెలిసింది. ఇన్స్టాగ్రాంలో 72% మంది, చాటింగ్లో 69% మంది, ఫేస్ బుక్లో 57% మంది తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలింది. అమెరకన్లో 95% మందికి స్మార్ట్ఫోన్ వాడే విధానం తెలుసు. అంతేకాక నిత్యం 43% మంది ఇంటర్నెట్ వాడుతున్నారని వెల్లడైంది. సోషల్ మీడియాల వల్ల మంచి జరుగుతుందని 31% మంది అంటున్నారు. కాదు చేటు అని 24% మంది నమ్ముతున్నట్లు ఫ్యూ సంస్థ సర్వేలో పేర్కొంది. ఈ సంస్థ 2014-15లో కూడా సర్వే చేపట్టింది. అప్పటి సర్వేలో కేవలం 24% మంది యువత నిరంతరం ఆన్లైన్లో ఉండేవారని తెలిసింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ పోన్ వాడకం పెరిగిపోయింది. -
సొంతంగా ఐఫోన్ తయారీ.. వీడియా వైరల్
-
సొంతంగా ఐఫోన్ తయారీ.. వీడియా వైరల్
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో బ్రాండెట్ ఫోన్ గా ముద్రపడిన ఐఫోన్ కొనుక్కోవాలంటే మీరందరూ ఎక్కడికి వెళ్తారు.. ఆపిల్ స్టోర్ కు లేదా ఆన్ లైన్ ను ఆశ్రయిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం మీ అందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఐఫోన్ కొనుక్కోవాలంటే వాటి వద్దకే వెళ్లాలా.. సింపుల్ గా మనమే తయారీచేసుకుంటే పోలా అని రంగంలోకి దిగేశాడు. ఐఫోన్ కు కావాల్సిన విడి భాగాలన్నింటిన్నీ చైనాలోని ఫేమస్ మార్కెట్ షెన్జెన్ నుంచి సేకరించి, బెస్ట్ సెల్లింగ్ మొబైల్ గా పేరు తెచ్చుకుంటున్న ఐఫోన్ 6ఎస్ ను తయారీచేసేశాడు. తాను ఐఫోన్ 6ఎస్ ఎలా రూపొందించాడో తెలుపుతూ ప్రాథమిక ప్రక్రియ నుంచి తుది దశ వరకు ఐఫోన్ తయారీ వీడియోను యూట్యూబ్ లోని స్ట్రేంజ్ పార్ట్స్ ఛానల్ లో పెట్టాడు.ఇక అంతే ఆ వీడియోకు లైక్స్, కామెంట్స్ యూట్యూబ్ లో దంచికొడుతున్నాయి. కేవలం ఆ ఒక్క వీడియోతోనే ఆ ఛానల్ కు 20వేల మంది సబ్స్క్రైబర్లు యాడ్ అయ్యారు. అది కూడా కేవలం 22 గంటల్లోనేనట. ఆ వ్యక్తి రూపొందించిన వీడియోకు 2500 కామెంట్లు రాగా, 25వేల లైక్స్, లక్షల కొద్దీ వ్యూస్ వెల్లువెత్తాయి. మెటల్ బ్యాక్ కేసును సెర్చ్ చేయడం నుంచి వీడియో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఐఫోన్ కు అవసరమైన విడిభాగాలన్నింటిన్నీ చైనాలోని షెన్జెన్ మార్కెట్లో వెతుకుతూ ఒక్కొక్కటిగా అమర్చడం ఈ వీడియోలో చూపించాడు ఆ వ్యక్తి. గ్లాస్ ప్యానల్, డిజిటైజర్, ఎల్సీడీ ప్యానల్, బ్యాక్ లైట్, లాజిక్ బోర్డు, బ్యాటరీ, కెమెరా మోడ్యుల్, హోమ్ బటన్, స్క్రీవ్యూస్ వంటి వాటిని ఆ వ్యక్తి మార్కెట్లో పొందడం, అమర్చడం, ఫెయిల్ అవ్వడం మళ్లీ అసెంబ్లింగ్ చేయడం వంటివన్నీ ఈ వీడియోలో చూపించాడు. ఎట్టకేలకు తన కోసం తాను సొంతంగా ఐఫోన్ 6ఎస్ తయారుచేసుకున్నట్టు పేర్కొన్నాడు. -
ఈ ఇంటికి ఇంజనీరు యూట్యూబ్...!
సాధారణంగా ఇంటర్నెట్ను అనుసరించేవారు చాలా మంది యూట్యూబ్ వీడియోలు చూసి వంటలు నేర్చుకుంటుంటారు. వ్యాయామాలు, డ్యాన్సులు చేస్తుం టారు. ఆఖరికి ఆన్ లైన్ తరగతుల ద్వారా చదువుకుంటుంటారు కూడా. కానీ మీలో ఎవరైన ‘ఇల్లు ఎలా కట్టాలి’ అని యూట్యూబ్లో వీడియోలు చూసి ఇంటిని నిర్మించడం గురించి విన్నారా? కానీ అదీ సాధ్యమే. మేము అలానే ఓ ఇల్లు కట్టుకున్నాం అంటోంది ఓ కుటుంబం. ఇంటి నిర్మాణంలో ఎలాంటి అనుభవం లేని ఆ సాదాసీదా కుటుంబం ఐదు బెడ్ రూమ్లతో కూడిన రెండం తస్తుల మేడను నిర్మించుకుని ఔరా అనిపించింది. ఇందులో మరొ వింత ఉంది. ఆ ఇంటిని ఒక తల్లి ఆమె నలుగురి పిల్లల సాయంతోనే కట్టేసింది. అర్కాన్ సాస్లోని కారా బ్రూకిన్స్ అనే మహిళ తన భర్తనుంచి తెగదెంపులు చేసుకుని పిల్లలతో జీవిస్తోంది. ఆమెకు నలుగురు పిల్లలు (వారి వయసులు 7,15, 11, 2). ఉదయమంతా తన ఉద్యోగ ధర్మాన్ని ముగించుకుని సాయంకాలం వేళ యూట్యూబ్లో ఇల్లు నిర్మించు కోవడం ఎలా అనే వీడియోలు వీక్షించేది. అలా తెలుసుకున్న పరిజ్ఞానం ద్వారా ఇంటి నిర్మాణానికి అవసమైన వస్తువులను తన దగ్గరు న్న కొద్దిపాటి సొమ్ముతో సమకూర్చుకుంది. ఆ తర్వాత ఇల్లు నిర్మించడం ప్రారంభించింది. మెల్లమెల్లగా తన పిల్లలు కూడా కారాకి సహాయపడుతూ వచ్చారు. ఇంటి నిర్మాణంలో ఉండగా ప్రతి దశకు సంబంధించి మూడు నాలుగు వీడియోలు చూసి పరిజ్ఞానాన్ని పెంచుకునేది. ఆ వీడియోల్లో నుంచి ఏది ఉత్తమమైన, సులభమైన పద్ధతి అనే ఒక అంచనాకు వచ్చి దాన్ని అనుసరించేది. ఇలా ఏకంగా 9 నెలల్లోనే సుందరమైన తన కలల సౌధాన్ని పూర్తి చేసింది. తన ఇంటికి ఇంజనీరు యూట్యూబే అంటోంది కారా. -
యూట్యూబ్లో చూసి... బాలుడి సాహసం
కరీంనగర్ : కరీంనగర్లో ఓ సాహసం బాలుడి ప్రాణాలను బలిగొంది. యూట్యూబ్లో సాహస వీడియో చూసిన బాలుడు దానిని చేసేక్రమంలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే...విద్యానగర్కు చెందిన రఘచారి కుమారుడు ధనుష్ నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ల్యాప్టాప్ ఉండటంతో యూట్యూబ్లో సాహసాలను చూసిన ధనుష్ అదేమాదిరిగా సాహసం చేశాడు. నోట్లో కిరోసిన్ పోసుకుని మంటలు ఊదే ప్రయత్నం చేయగా..నోరు కాలి తీవ్రంగా గాయపడ్డాడు. నాలుగు రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
విమానంలో గొడవ.. వైరల్ వీడియో!
-
విమానంలో గొడవ.. వైరల్ వీడియో!
అమెరికా అధక్ష ఎన్నికల ఫలితాలపై కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అసంతృప్తి ఉంది. ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంపై ఓ విమానంలో ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా గొడవకు కారణమని తెలుస్తోంది. ఎంతసేపటికీ రెండు వర్గాల వారు వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో పైలట్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ వాగ్వివాదం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మెక్సికో(ప్యుయెర్టా వాల్లార్టా)కు వెళ్లే యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. జాన్ బ్యుయర్ అనే వ్యక్తి విమానంలో జరిగిన తతంగాన్ని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో స్థానికంగా ఎంతో కలకలం రేపింది. ఆఫ్రో-అమెరికన్ మహిళను అగౌరవపరిచే వ్యాక్యలు చేయడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ విషయం పైలట్ వద్దకు చేరింది. 'మనం 35,000 అడుగుల ఎత్తులో వెళ్లబోతున్నాం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిప్రాయం ఉండటం మంచిదే. కానీ ఇలాంటి సమయాలలో ఇవి తగవు' అని పైలట్ సర్దిచెప్పాడు. ఈ విషయంపై యునైటెడ్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి మెక్ కార్తే మాట్లాడుతూ.. గొడవ జరిగిన విసయం వాస్తవమే. ఈ విషయంపై మా పైలట్ జోక్యం చేసుకుని అంతా సర్దుకునేలా చేశాడన్నారు. ఎవరికైనా సమస్య ఉంటే చెప్పండి.. మరుసటి రోజు ఫ్లయిట్లో వెళ్లవచ్చు అని సూచించారు. విమానం నుంచి ఎవరినీ దింపి వేయలేదని మెక్ కార్తే చెప్పారు. -
సన్నీ లియోన్ వీడియో హల్ చల్
-
సన్నీ లియోన్ వీడియో హల్ చల్
బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్కు కుర్రకారులో స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓ చిన్నారి పాప సన్నీ లియోన్ను చూడగానే సొంత మనిషిలా దగ్గరయ్యింది. సన్నీని విడిచి తల్లిదండ్రులకు వద్దకు వెళ్లనంటూ మారాం చేసింది. చివరకు అయిష్టంగానే సన్నీని వీడి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ఈ వీడియో యూ ట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ఈ నెల 20న సన్నీ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అదే రోజు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. ఓ పాపను సన్నీ లియోను ఎత్తుకుంది. బాగా తెలిసినవారి దగ్గరున్నట్టు ఆ పాప సన్నీ భుజాలపై తలవాల్చి ఉండిపోయింది. కాసేపటి తర్వాత ఆ పాప తల్లిదండ్రులు సన్నీ నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తమ దగ్గరకు రమ్మని పిలిచినా ఆ పాప సన్నీని వీడి రాలేదు. ఈ తతంగాన్ని గమనించి ఆపాపపై ముచ్చటపడ్డ సన్నీ.. తల్లిదండ్రులకు బై చెప్పమని ఆ అమ్మాయికి చెప్పి కాస్త దూరం తీసుకెళ్లింది. ఆ పాప నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోయింది కానీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేదు. చివరకు తల్లిదండ్రులు ఆ పాపను బుజ్జగించి సన్నీ నుంచి తీసుకెళ్లారు. తర్వాతి రోజు సన్నీ మరో వీడియోను పోస్ట్ చేసింది. ఫోన్తో సెల్ఫీలు ఎలా తీయవచ్చో ఆ పాపకు సన్నీ నేర్పించింది. కాగా ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఈ ఘటన జరిగింది అన్న విషయాలు తెలియరాలేదు. వీడియోను బట్టి భారత్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. -
వీడియో దుమారంపై హీరోయిన్ సీరియస్!
సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న కమెడియన్ తన్మయ్ భట్ వీడియోపై బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ స్పందించింది. కమెడియన్ తన్మయ్ కు తన పూర్తి మద్ధతు తెలుపుతూ ట్విట్టర్లో కొన్ని కామెంట్లను పోస్టు చేసింది. ఫ్రెండ్ గా నీకు మద్ధతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నువ్వు ఏదైనా పని చేసినప్పుడు.. అది అందరూ మెచ్చుకునేలా, నవ్వు తెప్పించేలా ఉండాలని, అయితే అందరూ వ్యతిరేకించేలా ఉండకూడదని సోనమ్ చురక అంటించింది. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి, ముందు వాటిపై స్పందించాల్సిన అవసరముందని, అంతేకానీ ఇలా దొరికిన వీడియోలపై రెచ్చిపోవడం తగదని సోనమ్ కపూర్ సూచించింది. 'భారత రత్నాలు' అయిన ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ల పట్ల కమెడియన్ తన్మయ్ భట్ హాస్యంతో కూడిన వీడియో చేశాడు. ఆ తర్వాత ఈ వీడియో ఎక్కడ పోస్ట్ అయిందో కానీ ఇంటర్నెట్ లో హల్ చల్ చేసి అందరికీ తీవ్ర ఆవేశం తెప్పించింది. ఈ వీడియో ఆన్లైన్లో కనిపించడకుండా బ్లాక్ చేయాలంటూ గూగుల్, ఫేస్బుక్, యుట్యూబ్ సంస్థలను అడిగారు. ఈ వీడియోను తొలగించాలని తన్మయ్ ను ఆదేశించారు. Being living legends I know @sachin_rt and @mangeshkarlata don't even know and care about what's going on!stop spewing hate on their behalf! — Sonam Kapoor (@sonamakapoor) 31 May 2016 Dear @thetanmay ,being your friend I know what you say and do is never to offend, but to make people laugh.. https://t.co/O2kFj0dhjX — Sonam Kapoor (@sonamakapoor) 31 May 2016 Don't you guys think there are issues that are more important than @thetanmay snapchat jokes??? I'm in shock with this over reaction! — Sonam Kapoor (@sonamakapoor) 31 May 2016 -
ఆ అసభ్య వీడియోను వెంటనే బ్లాక్ చేయండి!
సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న కమెడియన్ తన్మయ్ భట్ వీడియోపై ముంబై సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ల పట్ల అసభ్య హాస్యంతో ఉన్న ఈ వీడియో ఆన్లైన్లో కనిపించడకుండా బ్లాక్ చేయాలంటూ గూగుల్, ఫేస్బుక్, యుట్యూబ్లను వారు అడిగారు. లతా, సచిన్ను అవమానపరిచేవిధంగా ఉన్న ఈ వీడియోను తొలగించాలని ఆదేశించారు. ఇమిటేటింగ్ వాయిస్ తో లత, సచిన్ ముఖాలతో యూట్యూబ్ లో తన్మయ్ పోస్ట్ చేసిన వీడియోపై దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. 'లత: సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లి గొప్ప క్రికెటర్.. సచిన్: మీరు 5000 ఏళ్ల ముసలామెగా మాట్లాడుతున్నారు' అంటూ సంభాషణ సాగే వీడియోలో 86 ఏళ్ల లతా ఇంకా ఎందుకు బతికి ఉందని అంటూ వెకిలీ హాస్యాన్ని చూపించారు. ఈ వీడియోపై ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెలువడగా.. బీజేపీ, శివసేన, ఎమ్మెన్నెస్ దీని రూపకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫేస్బుక్లో, యుట్యూబ్లో ఈ వీడియో పెట్టిన తన్మయ్ భట్తోపాటు ఏఐబీ టీమ్ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వీడియోను పోస్టు చేసిన ఐపీ అడ్రస్ను తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ముంబై అసిస్టెంట్ పోలీసు కమిషనర్ యశ్వంత్ పాఠక్ విలేకరులకు తెలిపారు. -
కష్టాల్లో కమెడియన్
ముంబై: 'సచిన్ వర్సెస్ లత సివిల్ వార్' వ్యవహారంతో కమెడియన్ తన్మయ్ భట్ కష్టాల్లో పడ్డాడు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను అమానించిందుకు అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇమిటేటింగ్ వాయిస్ తో లత, సచిన్ ముఖాలతో యూట్యూబ్ లో తన్మయ్ పోస్ట్ చేసిన వీడియోపై వివాదం రేగింది. వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్టు వీడియో చూపించారు. వీడియాలో ఇలా సాగుతుంది. లత: సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లి గొప్ప క్రికెటర్ సచిన్: మీరు 5000 ఏళ్ల ముసలామెగా మాట్లాడుతున్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన్మయ్ తన వికారాన్ని బయటపెట్టుకున్నాడని మండిపడ్డారు. బాల్ థాకరే బతికివుంటే అతడికి చుక్కలు చూపించేవారని పేర్కొన్నారు. వివాదాలు తన్మయ్ కు కొత్తకాదని దుమ్మెత్తిపోశారు. -
స్వచ్ఛ భారత్ వీడియోకు పది లక్షల హిట్లు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' వీడియో యూట్యూబ్లో పది లక్షల హిట్లు దాటేసింది. ఆర్- విజన్ ఇండియా ఎండీ రవీంద్ర సింగ్ నిర్మించి, పాడిన ఈ వీడియోకు 'ఏక్ భారత్ర శ్రేష్ఠ భారత్' అనే టైటిల్ పెట్టారు. దేశ ప్రజల కోసం దేశం అంతా పరిశుభ్రంగా ఉండాలన్న సందేశాన్ని ఈ వీడియో ఇస్తుంది. ప్రధానమంత్రి ఆలోచనలను, ఆయన దూరదృష్టిని ఈ వీడియో ద్వారా ప్రజలకు అందజేయాలని తాము ప్రయత్నించినట్లు రవీంద్ర సింగ్ చెప్పారు. రాణీ మాలిక్ రాసిన ఈ పాటకు.. మానెక్, సత్య, అఫ్సర్ సంగీతం అందించారు. ఈ వీడియోకు రాజీవ్ ఖండేల్వాల్ దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, హీరోలు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వీడియోలో కనిపిస్తారు. -
చంద్రుడిపై గ్రహాంతర వాసులు?
ఈ ఫొటోను జాగ్రత్తగా గమనించండి. దీన్ని చంద్రగ్రహం మీద తీశారు. అమెరికా స్పేస్ సంస్థ నాసా ఈ చిత్రాన్ని విడుదల చేసింది. పరిశీలించి చూస్తే, ఓ మనిషి నీడ దీనిమీద కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చంద్రుడి మీద మనుషులు ఎవరూ లేరు. నాసా ప్రయోగించిన ఉపగ్రహంలోని కెమెరా మాత్రమే ఈ ఫొటోను తీసింది. అయినా.. మనిషి నీడ ఎలా కనిపించింది? అంటే గ్రహాంతర వాసులు ఉన్నట్లేనంటారా? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను, ఫొటోను చూసినవాళ్లంతా ఇది గ్రహాంతర వాసి (ఏలియన్) ఫొటోనే అని బల్లగుద్ది వాదిస్తున్నారు. నాసా మాత్రం ఈ విషయాన్ని ఇంతవరకు నిర్ధారించలేదు. వావ్ఫర్రీల్ అనే యూజర్ పేరుతో పోస్టయిన ఈ వీడియోను నెల రోజులలోపే 20 లక్షల మంది చూశారు. గూగుల్ ఎర్త్ లాగే గూగుల్ మూన్ కూడా సిద్ధం చేయాలని తలపెట్టడంతో దానికోసమే ఈ ఫొటోలు తీసినట్లు సమాచారం. అందులో భాగంగా తీసిన ఓ ఫొటోలో ఈ మనిషి తరహా బొమ్మ కనపడి ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఐదేళ్లకే ముగ్గురు గర్ల్ఫ్రెండ్స్!!
''ఇప్పటికింకా నా వయసు నిండా ఐదేళ్లే.. కానీ ముగ్గురు గర్ల్ఫ్రెండ్స్తో ఒకటే తలనొప్పే'' అంటూ ఆ బుడతడు చెబుతుంటే, వాళ్ల అమ్మకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఎందుకొచ్చింది, ఆ సంగతేదో నెటిజన్లే చూసుకుంటారని బుడతడి కబుర్లను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఐదేళ్ల బుడతడు ఒకడికి గర్ల్ఫ్రెండ్స్ ఎక్కువైపోయి విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నాడు. అదే విషయాన్ని తన తల్లికి చెప్పడం మొదలుపెట్టాడు. ఆవిడ వెంటనే ఆ విషయాన్ని వీడియో తీయడం మొదలుపెట్టింది. తనకున్న ముగ్గరు గర్ల్ఫ్రెండ్స్లో ఒకళ్లని వదులుకోవాల్సి ఉంటుందని, కానీ అందరూ అందంగా ఉండటంతో ఎవరిని వదలాలో తెలియక తికమక పడుతున్నానని చెప్పాడు. ముగ్గురు గర్ల్ఫ్రెండ్స్ ఉంటే ఇబ్బందేంటని అడిగితే, వాళ్లవల్ల తనకు ఒత్తిడి పెరిగిపోయిందని, ముగ్గురిలో ఒకరిని వదిలేయాలనుకుంటున్నానని అన్నాడు. ఎవరిని వదలాలో ఎలా నిర్ణయించుకుంటావని అడిగితే.. 'అదే అర్థం కావట్లేదు.. ముగ్గురూ బావుంటారే!' అంటాడు. మరి ఐదుగురు గర్ల్ఫ్రెండ్స్ ఉంటే ఏం చేస్తావని తల్లి అడిగితే.. అప్పుడా సంఖ్య నాలుగు అవ్వాలని కోరుకుంటానని ఏమాత్రం తడుముకోకుండా చెప్పాడు. కిడ్ ప్రెడికమెంట్స్ అనే పేరుతో యూట్యూబ్లో పెట్టిన ఈ వీడియోను ఇప్పటికి దాదాపు 29 లక్షల మంది చూశారు!! -
సచిన్ టెండూల్కర్కు గూగుల్ సలాం
సాచిన్.. సాచిన్.. వాంఖడే స్టేడియం మార్మోగింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ వైదొలగి ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయింది. అయినా అభిమానుల హృదయాల్లో మాత్రం ఆ ముద్ర చెరిగిపోలేదు. గూగుల్ సరిగ్గా ఇదే అంశాన్ని పట్టుకుంది. తన వీడియో చానల్ యూట్యూబ్ ద్వారా సచిన్ టెండూల్కర్కు వినూత్న రీతిలో అభినందనలు తెలిపింది. #ThankYouSachin అనే పేరుతో ఉన్న ఈ ప్రకటన చూస్తే.. ఒక్కసారిగా హృదయాలు బరువెక్కక మానవు. సచిన్ టెండూల్కర్ ఆడిన మొట్టమొదటి మ్యాచ్తో వీడియో ప్రారంభం అవుతుంది. తర్వాత మాస్టర్ గురించి వివిధ వార్తాపత్రికల ప్రధాన శీర్షికలు కనిపిస్తాయి. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడంటూ వచ్చిన పత్రికా కథనం పట్టుకుని ఓ పెద్దాయన కళ్లలో నీళ్లు కక్కుకుంటుండగా పాట ప్రారంభం అవుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ మాస్టర్ బ్లాస్టర్ అంటే ఎంత అభిమానాన్ని తమ గుండెల్లో నింపుకొంటున్నారో ఈ పాట చూస్తే ఇట్టే అర్థమవుతుంది. భవన నిర్మాణ కార్మికుల నుంచి దుకాణదారుల వరకు అంతా ప్లకార్డులు పట్టుకుని సచిన్కు కృతజ్ఞతలు చెబుతుంటారు. బ్రాడ్మన్, వివియన్ రిచర్డ్స్, గవాస్కర్ లాంటి వాళ్లు సచిన్ గురించి చెప్పిన విషయాలను కూడా గుర్తుచేసిన ఈ వీడియో.. ఒక తరం ఎలా ముగిసిందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. సాధారణంగా ఏదైనా ప్రమోషన్ వీడియో అనగానే మోడళ్లు, సినిమా తారలు, క్రికెట్ ఆటగాళ్లు.. వీళ్లంతా ఉంటారు. కానీ ఇక్కడ సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండటం వల్ల అందరూ తమను తాము ఇందులో చూసుకోగలరు. క్రికెట్ ప్రేమికులందరికీ ఇది ఓ మంచి వరం అనడంలో సందేహం లేదు!!