-
స్ట్రాంగ్రూమ్లు సిద్ధం చేయండి
● పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ పెద్దపల్లిరూరల్: ఈవీఎం యూనిట్లలో సింబల్ లో డింగ్ చేసిన వాటికి సీల్చేసి స్ట్రాంగ్రూమ్లో భద్రపర్చామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లోని స్ట్రాంగ్రూమ్లో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన యూనిట్లను అడిషనల్ కలెక్టర్ శ్యా మ్ప్రసాద్లాల్తో కలిసి బుధవారం రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపర్చారు. ఈవీఎంలో గుర్తులు లోడ్ చేసి సీల్చేశామన్నారు. సింబల్ లోడింగ్ యూనిట్లను ఫలితాలు ప్రకటించిన తర్వాత నాలుగు రోజుల లోపు ఉంచుతామని వివరించారు. కలెక్టర్ ఏవో శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఈడీఎం కవిత పాల్గొన్నారు.స్ట్రాంగ్రూమ్లను సిద్ధం చేయాలి.. రామగిరి(పెద్దపల్లి): పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను భద్రపర్చేందుకు స్ట్రాంగ్రూమ్లను సిద్ధం చేయాలని, ఇదే సమయంలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. జేఎన్టీయూ లో ఏర్పాటు చేసే స్ట్రాంగ్రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్, దివాకరతో కలిసి ఆయన పరిశీలించారు. పార్లమెంట్లోని ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు జేఎన్టీయూలో చేపడతామన్నారు. -
కమలదళంలో హుషారు
● తన ప్రసంగంతో ఉత్సాహం నింపిన ప్రధాని మోదీ ● రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధాని ● పోలీస్ వలయంలో ఆధ్యాత్మిక క్షేత్రం ● జనహోరుతో మార్మోగిన శైవక్షేత్ర పరిసరాలు ● బహిరంగ సభకు భారీగా జనం హాజరు వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ కాషా యమయమైంది. అడుగడుగునా పోలీసుల తనిఖీ లు.. కమలదళం కవాతులతో మార్మోగింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మో దీ బుధవారం వేములవాడకు రాగా.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ముందుగా రాజన్నను దర్శించుకున్న మోదీ నేరుగా.. బహిరంగసభ వేదికపైకి వచ్చారు. తన ప్రసంగంతో కాషాయదళంలో హుషారు నింపారు. సమరోత్సాహంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని మోదీ కోరారు. ఈ ముగ్గురికి ఓటేస్తే తనకు వేసినట్లేనని ఆయన చెప్పారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు వేదిక ప్రాంగణం మోదీ.. మోదీ.. అనే నినాదాలతో దద్దరిల్లింది. పట్టణంలోని కూడళ్లు, బైపాస్రోడ్డు కాషాయజెండాలతో నిండిపోయింది. పొద్దు పొద్దుగాళ్ల గింత జనప్రవాహమా.. ‘వేములవాడ జనసభ’ పేరుతో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభ విజయవంతమైంది. ఉదయం 10 గంటలకే బహిరంగసభకు భారీగా జనం తరలివచ్చారు. సరిగ్గా 10.30 గంటలకు సభ ప్రాంగణానికి మోదీ చేరుకుని.. జన సందోహాన్ని చూసి చలించిపోయారు. హెలికాప్టర్లో నుంచి జనప్రవాహాన్ని చూసిన మోదీ.. ఈ విషయాన్ని వేదికపై నుంచి ప్రస్తావించారు. ‘నేను గుజరాత్లో మూడుసార్లు సీఎంగా పనిచేసిన. అక్కడ ఎన్నో ఎన్నికలు చూసిన. కానీ గుజరాత్లో కూడా పొద్దు పొద్దుగాళ్ల గింత పెద్ద జనసందోహాన్ని ఎన్నడూ చూడలేదు. కానీ ఇక్కడ ఇంతమంది తరలిరావడం.. సభ బయట కూడా భారీగా జనం వస్తున్న దృశ్యాలను చూస్తుంటే... మీ అందరూ నాపై చూపుతున్న ప్రేమాభినాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ విజయం ముందే ఖాయమైందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అతి కష్టం మీద నిలబెట్టగా.. ఓటమి ఖాయమైందని ఎద్దేవా చేశారు. బీఆర్ ఎస్ అడ్రస్ గల్లంతైందన్నారు. ఆరడుగుల బుల్లెట్ కావాలా? దొంగల ముఠా నేత కావాలా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ కాంగ్రెస్పై పంచ్ల వర్షం కురిపించారు. కాశీ నుంచి దక్షిణకాశీకి వచ్చిన తొలి ప్రధాని నరేంద్రమోదీని కాశీవిశ్వేశ్వరుని ప్రతిరూపంగా అభివర్ణించారు. ఆరడుగుల బుల్లెట్ మోదీ కావాలా? దొంగల ముఠా బ్యాచ్ నేత రాహుల్ కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ను గద్దె దించి మెడలు పట్టి గెంటేసిన జగమొండి నరేంద్రమోదీ అని వ్యాఖ్యానించారు. ‘పక్కా లోకల్ మోదీ, మేడ్ ఇన్ భారత్ బీజేపీ.. నాన్లోకల్ సోనియాగాంధీ, మేడ్ ఇన్ బ్రిటీష్ పార్టీ కాంగ్రెస్..’ ఎవరి పక్షాన నిలుస్తారో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. 370 ఆర్డికల్ను రద్దు చేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను అమలు చేసిన జగమొండి మోదీ అ న్నారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించిన జగమొండి మోదీ.. అని పే ర్కొన్నారు. హిందువుల 500 ఏళ్ల కల అయోధ్య రా మమందిరానికి ప్రాణప్రతిష్ఠ చేసిన జగమొండి అ న్నారు. కరోనా వ్యాక్సిన్ అందించి 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడారన్నారు. మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6వేల కోట్లకుపైగా వెచ్చించి తెరిపించిన విషయాన్ని గుర్తుచేశా రు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కి రూ.12వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. బీజేపీని గె లిపిస్తే హైవేలు, ఇంటర్నెట్, రైల్వేలు, ఎయిర్వేస్లతో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. గాడిదగుడ్డు చూపుతున్నారు ఆరు గ్యారంటీలను అడిగితే కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలకు గాడిదగుడ్డు చూపిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వలేదని, రూ.2లక్షల రైతుల రుణమాఫీ చేయలేదన్నారు. మోదీ ఏ పని చేపట్టినా వాళ్ల అమ్మ ఆశీస్సులు తీసుకుని బయటకొస్తారని.. ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి మనమంతా మోదీ పక్షాన ఉంటూ మూడోసారి ప్రధానిని చేసుకుందామని బండి సంజయ్ పిలుపునిచ్చారు. -
ప్లాన్–3
● మిగిలింది మూడు రోజులే ● దూసుకొస్తున్న గడువు ● వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేసేలా ప్రణాళిక ● రథాలు, సామాజిక మాధ్యమాలే కీలకం ● మండలాల వారీగా సంఘాలతో భేటీలకు ఏర్పాట్లు సాక్షి, పెద్దపల్లి: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి గడువు మరో మూడు రోజులే మిగిలి ఉంది. ఈనెల 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. 48 గంటల ముందే ఎ న్నికల ప్రచారం ముగించాల్సి ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గ విస్తీర్ణం విశాలంగా ఉండడం, ఓ టర్ల సంఖ్య అధికంగా ఉండటంతో అభ్యర్థులు ప్రతీఓటరును నేరుగా కలిసే అవకాశం లేదు. దీంతో సభల నిర్వహణపైనే అభ్యర్థులు దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ బహిరంగ సభల్లో పాల్గొన్ని పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం నింపారు. అయి తే, ఎన్నికల ప్రచారానికి మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటివరకు ప్రచారమంతా మాటలతో సాగింది. ఓటర్లను పూర్తి స్థాయిలో తమవైపు తిప్పుకునేందుకు చివరి అంకానికి తెరతీస్తున్నారు. ఎక్కువ మందిని కలిసేలా.. ● నగరాలు, పట్టణాలు, మండలాల్లో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసిసేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకుంటున్నారు. ● ఏ రోజు.. ఏ మండలంలో ప్రచారం నిర్వహించాలో షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారు. ● ముఖ్యంగా మండలాల వారీగా యువజన, మహిళా, కుల, యువజన సంఘాలతో భేటీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ● హామీలు గుప్పిస్తూ వారిని ఆకట్టుకోవాలని నిర్ణయించారు. ● సమయం తక్కువ ఉన్నందున అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేసే వీలులేకపోవటంతో వారి అనుచరులు, పార్టీ శ్రేణుల ద్వారా గడపగడపకూ తిరిగి ఓట్లు అభ్యర్థించే బాధ్యతలు అప్పగిస్తున్నారు. ● అలాగే పోలింగ్ కేంద్రాల వారీగా ఏజెంట్లను నియమించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరమే లక్ష్యం అన్ని గ్రామాల్లో పర్యటించడం కష్టం కావటంతో మండల కేంద్రాలు, పట్టణాలు, రామగుండం నగరంలో సభలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడా గ్రామాలమీదుగా, పట్టణాలు, నగరంలోని కాలనీల మీదుగా కార్నర్ మీటింగులు, ర్యాలీలు చేపడుతూ ప్రచారం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం చేసే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు అప్పగించారు. మొత్తమ్మీద సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు, ప్రచార బాధ్యతలెత్తుకున్న నాయకులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ప్రచారం చివరిరోజు అధినేతల సభలు, రోడ్షోలు ఏర్పాటు చేయడం ద్వారా వీలైనన్ని ఎక్కువ ఓట్లు సాధించాలని అభ్యర్థులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో హీటెక్కిస్తున్నారు.. ఎండలకుతోడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య మాటల తూటాలతో లోక్సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మంగళవారం కురిసిన అకాల వర్షంతో వాతావరణం చల్లబడినా.. పోలింగ్ ముగిసే వరకూ సోషల్ మీడియా వింగ్ల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించేలా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మాటలు, తూటాలు, విమర్శనాస్త్రాలతో పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధానంగా ప్రచార రథాలు, సోషల్ మీడియాపైనే అభ్యర్థులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. -
కాంగ్రెస్కు సేవ చేసే వారందరికీ గుర్తింపు
కమాన్పూర్(మంథని): కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతీఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని రాష్ట్రమంత్రి శ్రీధర్బాబు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమాన్పూర్, కన్నాలకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇనగంటి రామారావు, పీట్ల గోపాల్, మల్క రామస్వామి, వారి అనుచరులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడారు. కన్నాలలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మా ణానికి నిధులు మంజూరు చేశామన్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతోనే కొ నుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని అన్నారు. తనపై తప్పుడు కూతలు కూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామమని హెచ్చరించారు. యువతకు ఉద్యోగాగాలు ఇస్తాం పెద్దపల్లిరూరల్: తనను పార్లమెంట్కు పంపిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. యూత్కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావుతోపాటు ఎమ్మెల్సీ, యూత్కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, దుద్దిళ్ల శ్రీనుబాబు తదితర నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ మోసపూరిత విధానా లు అవలంబిస్తున్నాయని ఎమ్మెల్యే విజయరమణారావు విమర్శించారు. నాయకులు పాల్గొన్నారు.● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ఉపాధి కల్పనే కాంగ్రెస్ ధ్యేయం
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని: ఉద్యోగాల కల్పన కాంగ్రెస్తోనే సాఽ ద్యమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూ ర్ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్లో బుధవా రం జరిగిన సీపీఎం ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు కనీస మద్దతు ధర, ఉపాధిహామీ కూలీలకు రోజు కూలి రూ.400 వరకు పెంపు, పేద రైతుకు ఏటా రూ.లక్ష, రూ.25 లక్షల వరకు నగదు రహిత వైద్య సదుపాయం, 30లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రామగుండం నగర మేయర్ బంగి అనిల్కుమార్, సీపీఎం నాయకుడు యాకయ్య ఉన్నారు. ఆదాయపు పన్ను మాఫీకి కృషి సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను మాఫీకి వెసులుబాటు కల్పిస్తామని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ హామీ ఇచ్చారు. ఆర్జీ –వన్ జీఎం కార్యాలయం ఎదుట ని ర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. కార్మికు లు వ్యాధుల బారిన పడుతుంటే స్పందించని కేసీఆర్.. కొప్పుల ఈశ్వర్కు ఓటువేయాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలిస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చుతామన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంట నే కార్మికుల ఇళ్లకు పట్టాలతోపాటు కాంట్రాక్టు కార్మికులకు 200గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పారు. కార్మిక క్షేత్రం రాబోయే రోజుల్లో పారిశ్రామిక క్షేత్రం ఇండస్ట్రియల్ హబ్గా మారబోతోందని పేర్కొన్నా రు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, నర్సింహారెడ్డి, తిప్పారపు శ్రీని వాస్, పాతిపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం గోదావరిఖని: అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్య పు గింజ కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు స్వయంగా తనతో ఫోన్లో ఈవిషయం చెప్పారన్నారు. రైతులెవరూ అధైర్య పడవద్దని, అధికారులకు ఆదేశాలు చేశారని ఆయన వివరించారు. -
బీఎల్వోలతో సమీక్ష
జ్యోతినగర్(రామగుండం): రామగుండం అ సెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో), సూపర్వైజర్లతో పోలింగ్ నిర్వహణ తీరుపై బుధవారం సమీక్షించారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించా రు. ఆమె మాట్లాడుతూ, పోల్ స్లిప్పులను ప్రతీఓటరుకు చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలనానరు. ఓటింగ్ శాతం పేంచేలా కృషి చే యా లని కోరారు. రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, డిప్యూటీ తహసీల్దార్ విజయ్, బీఎల్వోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. రైస్మిల్లులకు ధాన్యం తరలించండి సుల్తానాబాద్(పెద్దపల్లి): తూకం వేసిన వెంట నే ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని అ దనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ ఆదేశించా రు. స్థానిక వ్యవసాయ మార్కెట్, సుగ్లాంప ల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. కోత లేకుండా మి ల్లర్లు ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలని తెలిపారు. సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు గోదావరిఖని: జిల్లాలో ఈనెల 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల్లో విధుల నిర్వహణ కో సం ఉద్యోగులను కేటాయించాలని ఎన్నికల సంఘం సిగరేణి యాజమాన్యాన్ని కోరింది. ఈమేరకు సంస్థవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో సెక్యూరిటీ, క్లరికల్, జనరల్ మజ్దూర్లను ఏరియాల వారీగా కేటాయించనుంది. అన్ని ఏరియాల నుంచి సిబ్బందిని కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 11 ఏరియాల్లోని 1100మందిని ఎన్నికల విధులకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇ టీవల గుర్తింపు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్కుమార్.. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని ఆన్డ్యూటీగా పరిగణించాలని కోరారు. ఈక్రమంలో ఆన్డ్యూటీగా పరిగణించనున్నట్లు తెలుస్తోంది. ‘మోదీ పాలనను ప్రశ్నించాలి’ పెద్దపల్లిరూరల్: పదేళ్ల మోదీ పాలనలో అవినీతిపై ప్రజలు ప్రశ్నించాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరా రు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నాయకుడు మాదన కుమారస్వామి, టీ పీఎఫ్ జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమురయ్య త దితరులు బుధవారం కరపత్రం ఆవిష్కరించా రు. ప్రజల ఆకాంక్షలను కాదని ప్రధాని మోదీ ముస్లింలు, మంగళసూత్రాలు లాంటి అంశాల నే ప్రస్తావిస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నా రని విమర్శించారు. బీజేపీ పాలనలో ఆర్థిక వ్యత్యాసాలు బాగా పెరిగాయని పేర్కొన్నారు. నాయకులు రాజమల్లయ్య, మార్వాడి సుదర్శన్, గాండ్ల మల్లేశం, రామిళ్ల బాపు, రవీందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మామిడితోటల పరిశీలన ధర్మారం(ధర్మపురి): ఈదురుగాలులతో కూడి న వడగళ్ల వర్షంతో నేలరాలిన మామిడితోటలను ఉద్యావనశాఖ అధికారి జ్యోతి బుధవారం పరిశీలించారు. బంజేరుపల్లి, గోపాల్రావుపేట, కటికెనపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేశారు. ఇప్పటికే తోటల్లోని మామిడికాయలు కోశారని, మిగిలిన కాయలు ఈదురుగాలులకు రాలిపోయి రైతులకు నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు. నిర్భయంగా ఓటు వేయండి పెద్దపల్లిరూరల్: ఓటర్లు నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పెద్దపల్లి ఏసీసీ కృష్ణ కోరారు. సాయుధ బలగాల కవాతను జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలీసు యంత్రాంగం సాయుధ బలగాలతో రక్షణ కల్పిస్తోందని తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటుహక్కు వినయోగించుకోవాలని ఆయన కోరారు. -
రైతులను ఆదుకోవాలి
పెద్దపల్లిరూరల్: అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోయిన, సాగు నీరు అందక దిగుబడి రాని రై తుకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పు ల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దబొంకూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మ నోహర్రెడ్డితో కలిసి పరిశీలించారు. నాయకులు మ ర్కు లక్ష్మణ్, రాములు, సంపత్, మిట్టపల్లి శ్రీనివా స్, నవీన్కుమార్, లక్ష్మీరాజం, రవి, రాజేశం, పోచమల్లు, అనిల్, తిరుపతి, నరేశ్, రాకేశ్ పాల్గొన్నారు.ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టండి కోల్సిటీ(రామగుండం): ప్రజాసమస్యలపై గొంతెత్తాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తాలో నగరపాలక పారిశుధ్య కార్మికులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్తో కలిసి ఈశ్వర్ ఓట్లు అభ్యర్థించారు. -
టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి
● కొత్త కథ వినండి ● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పెద్దపల్లిరూరల్: వేసవిలో పిల్లలు ఉల్లాసంగా గడిపేందుకు రూమ్ టు రీడ్ సంస్థ రోజుకో కొత్త కథ ఆడియో రూపంలో అందిస్తోందని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రూమ్ టు రీడ్ ఉల్లాస సమయం పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా రూమ్ టు రీడ్ సంస్థ.. ఐవీఆర్ఎస్ సాయంతో ఉల్లాసవంతమైన కొత్త కథలను ఆడియో రూపంలో అందిస్తోందని తెలిపారు. నీతి కథలు, పిల్లల కథలు వింటే చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని ఆయన అన్నారు. కొత్త కథల కోసం టోల్ ఫ్రీ నంబర్ 040– 4520–9722కు కాల్ చేయాలని ఆయన సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, ప్రతినిధులు నరసింహాచారి, పాఠశాల అకడమిక్ అధికారి షేక్, రీడ్ టు రూమ్ సంస్థ రాష్ట్ర ప్రతినిధులు తేజస్వి, మధు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి కన్నెర్ర
● గాలిదుమారంతో కుప్పకూలిన వేదిక ● ముఖ్య అతిథి చేరకముందే ఘటన ● బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం మంథని: పార్లమెంట్ ఎన్నికల వేళ.. క్యాడర్లో జోష్ నింపి, ఓటర్లలో ఉనికి చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ పట్టణంలో మంగళవారం చేపట్టిన బహిరంగసభపై ప్రకృతి కన్నెర్ర జేసింది. కొద్దిరోజులుగా మంథనిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. అయితే, వాతావరణంలో మంగళవారం ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై చల్లబడింది. ఇది తమకు శుభసూచకమని బీజేపీ క్యాడర్ ఆనందం వ్యక్తచేసింది. సరిగ్గా ఇదే సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారీగా జనసమీకరణ.. రాజస్థాన్ సీఎం భజన్లాల్శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యే బహిరంగ సభ ఉదయం 9గంటలకు ఉంటుందని బీజేపీ శ్రేణులు ప్రచారం చేశారు. ఈమేరకు పెద్దసంఖ్యలో జనాన్ని తరలించారు. కానీ, నిర్దేశిత సమయం కన్నా సుమారు ఐదు గంటలు ఆలస్యమైంది. దీంతో పలువురు వేదికపైనుంచి మాట్లాడుతూ, సభికులను ఉత్సాహ పరిచారు. ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఓవైపు మాట్లాడుతుండగానే జనం సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఆ తర్వాత మెల్లిగా గాలిదుమారం ప్రారంభమైంది. ఆ వెంటనే బీభత్సం సృష్టించింది. వేదిక వద్ద టెంట్లు గాలిదుమారం ధాటికి కుప్పకూలిపోయారు. తొలుత జనం కోసం వేసిన టెంట్లు, ఆ తర్వాత స్టేజీ వేసిన టెంట్లు, వేదిక నెలమట్టమైంది. తప్పిన పెనుప్రమాదం ఈదురుగాలులకు వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. టెంట్లకింద ఉన్న ప్రజలు పరుగులు తీశారు. మరికొందరు టెంట్లకు ఆవల ఉండడంతో ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ఏదిఏమైనా బహిరంగ సభ ద్వారా తమ ప్రభావం చాటేందుకు బీజేపీ చేసిన ప్రయత్నంపై ప్రకృతి కన్నెర్ర జేయడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశ చెందారు. -
జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్కు స్వాగతం
జ్యోతినగర్(రామగుండం): జ్యుడీషియల్ క మిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్కు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికా రు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్ షిప్లోని జ్యోతిభవన్కు చేరుకున్న జస్టిస్ ఘో ష్కు కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ఘనస్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తునకు ఏర్పాటైన జ్యుడీషియల్ కమిషన్కు రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్గా నియమితులైన విషయం విదితమే. ఈక్రమంలో ఆయన మేడిగడ్డ బ్యారేజీ సంద ర్శించారు. అనంతరం ఎన్టీపీసీ జ్యోతిభవన్కు చేరుకున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్ఆర్)బిజయ్కుమార్ సిగ్దర్తోపాటు పలువురు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్పూర్, ఎలిగేడులో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత మంగళవారం పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల కో సం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వసతులపై ఆరా తీశారు. తాగునీ టి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించా రు. ఎంపీడీవో భాస్కర్రావు పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగు చేయండి ఎలిగేడు(పెద్దపల్లి): ఆయిల్పామ్ సాగుకు రై తులు ముందుకు రావాలని ఉద్యానవనశాఖ అధికారి జ్యోతి కోరారు. ముప్పిరితోటలో పెద్దపల్లి ఉద్యానవనశాఖ, రివులిస్ కంపెనీ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఆయిల్పా మ్ సాగుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నా రు. త్వరలోనే పెద్దరాతిపల్లిలో ఆయిల్పామ్ శుద్ధి పరివ్రమ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఏఈవో పద్మ, ఫీల్డ్ఆఫీసర్ అభిలాష, రివులిస్ డ్రిప్ ఇరిగేషన్ ప్రతినిధి రహమాన్, కో ఆర్టినేటర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎల్లంపల్లిలో 6.10టీఎంసీలురామగుండం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు. నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం 141 మీటర్లు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 6.10 టీఎంసీలకు పడిపోయింది. చిన్నారుల విహారయాత్ర రామగుండం: స్థానిక తబితా ఆశ్రమంలోని చి న్నారులు వేసవి ఆటవిడుపు కోసం మంగళవా రం హైదరాబాద్లోని వండర్లా సందర్శనకు బయలుదేరి వెళ్లారు. కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ తన సొంత నిధులు వెచ్చించడంతో చిన్నారు మానసిక ఆనందం కోసం వివాహర యాత్రకు తీసుకెళ్తున్నామని ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్నాయక్ ఈ సందర్భంగా తెలిపారు. -
అభివృద్ధికి మరిన్ని పథకాలు
గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి మ రిన్ని పథకాలు ప్రవేశపెట్టేలా చూస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక సింగరేణి జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో మంగళవారం మార్నింగ్ వాకర్స్ను కలిసి సమస్య లు అడిగి తెలుసుకున్నారు. దివంగత నేత వెంకటస్వామి(కాకా) మనుమడు, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చేతిగుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల తర్వాత రూ.36 కోట్లతో లక్ష్మీనగర్ ప్రాంత అభివృద్ధి ప్రారంభిస్తామని, రూ.15 కోట్లతో స్టేడియం అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వెంట నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, ముస్తాఫా తదితరులు ఉన్నారు. పాలకుర్తి మండలంలో.. పాలకుర్తి(రామగుండం): కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరారు. కొత్తపల్లి, ఈసాలతక్కళ్లపల్లిలో ఉపాధిహామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. నాయకులు సూర సమ్మయ్య, గంగాధర రమేశ్, ముక్కెర శ్రీనివాస్, పాత రవీందర్, మహేందర్, ఓడ్నాల రాజు పాల్గొన్నారు. బీ థర్మల్లో ఉత్పత్తి నిలిపివేత రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సా మర్థ్యం గల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రంలో మంగళవారం ఉత్పత్తి నిలిపివేశారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ నుంచి ఆదేశాలు రావడంతో ఇంజినీర్లు విద్యు త్ కేంద్రాన్ని ట్రిప్ చేశారు. వ్యవసాయ వినియోగం తగ్గడం, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారులు తెలిపారు. -
అన్నదాతలంటే బీజేపీకి అక్కసు ఎందుకు?
● రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంథని: దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు అంటే బీజేపీకి అక్కసు ఎందుకని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు. మంగళవారం రాత్రి పట్టణంలోని తన నివాసంలో ఆ యన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ను అడ్డుగా పెట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన సొమ్మును నిలిపివేయడం సరికాదన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికల రోజు రైతుబంధు సొమ్ము జమచేస్తే ఆనా డు నోరు మెదపని బీజేపీ.. నేడు రైతుబంధు డబ్బు ఎందుకు ఆపిందని నిలదీశారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలపై రాజస్థాన్ సీఎం భజన్లాల్శర్మకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రను బీజేపీ చేస్తుందనేనిది నిజం కాదా? అని ప్రశ్నించారు. మంథని మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రి రమ, టీపీసీసీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, ఎంపీపీ కొండ శంకర్, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు పురుశోత్తంరెడ్డి పాల్గొన్నారు. -
గడువు తీరిన మందులపై విచారణ
పెద్దపల్లిరూరల్ : నిట్టూరులో విరిగిపడ్డ తాటిచెట్టుకోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఓ పేషెంట్కు గడువు ముగిసిన మందులు ఇచ్చిన ఘటనపై మంగళవారం ‘సాక్షి’లో ‘సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించారు. ఆస్పత్రి కొత్త బ్లాక్లోని ఫార్మసీ కేంద్రంలో ఆర్ఎంవోలు తిరుమలేశ, రేణుక తనిఖీ చేశారు. పేషెంట్కు ఇచ్చిన మందుల గడువు తేదీలు పరిశీలించారు. గడువు ముగిన మందులను ఫార్మసీ విభాగం ఇన్చార్జిలకు అప్పగించాలని ఆదేశించారు. ఆర్ఎంవో తిరుమలేశ ఫోన్ ద్వారా బాధితుడు బత్తిని రవితో మాట్లాడి వివరాలు సేకరించారు. గడువు ముగిసిన మందులు ఇచ్చినట్లు విచారణలో తేలితే చర్యలు తీసుకుంటామని ఆర్ఎంవో వెల్లడించారు. ఫార్మసీ సిబ్బంది కొరత... జీజీహెచ్ను ఫార్మసీ సిబ్బంది కొరత వెంటాడుతోంది. కేవలం ఇద్దరు ఫార్మాసిస్టులతోనే నెట్టుకొస్తున్నారు. స్టాఫ్నర్స్ల సహకారంతో పేషెంట్లకు మందులు పంపిణీ చేస్తున్నారు. కనీసం ఐదారుగురు ఫార్మాసిస్టుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కుప్పలుగా గడువు ముగిసిన మందులు! గడువు ముగిసిన మందులను ఎప్పటికప్పుడు గుర్తించాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వాటిని భూమిలో పాతిపెట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఫార్మసీ స్టోర్స్లో గడువు ముగిసిన మందులు కుప్పలుగా పడి ఉన్నాయని తెలిసింది. -
అకాలం.. అతలాకుతలం
జిల్లాలోని ధర్మారం, ఎలిగేడు, పెద్దపల్లి, రామగిరి, మంథని, ముత్తారం, ఓదెల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురవడంతో కొను గోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయ్యింది. ఆ రబెట్టిన ధాన్యంతోపాటు తూకం వేసిన వడ్ల బస్తా లు వర్షపునీటిలో తడిశాయి. కొన్నిచోట్ల నీటిలో కొ ట్టుకుపోయాయి. ఎలిగేడు, ధర్మారం మండలాల్లో మామాడికాయలు రాళ్లవర్షం ధాటికి నేలరాలాయి. సౌకర్యాలు కరువు.. గ్రామాల్లో ఎక్కడికక్కడే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మార్కెట్ యార్డులతోపాటు, గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ సౌకర్యాలేమీలేవు. ధాన్యం కుప్పలు పోసుకున్న రైతులకు టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవు. మంగళవారం ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యం తడిసిముద్దయ్యింది. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడాన్ని చూసిన రైతులు కన్నీరుమున్నీరయ్యారు. వడ్లను కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రాలకు ఉరుకులు, పరుగులు తీశారు. ఐదురోజుల పాటు భారీవర్షాలు రాష్ట్రంలో మరో 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం ఉరుములు, మెరుపులు, గంటకు 40 కి.మీ. నుంచి 50కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. భారీవర్షాలు కురుస్తాయని, దీంతో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. జూలపల్లిలో వర్షం.. జూలపల్లి(పెద్దపల్లి): మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొంత వర్షపునీటిలో కొట్టుకుపోయింది. రైతులకు తీరని నష్టం వాటిల్లింది.కాల్వశ్రీరాంపూర్లో.. కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్లో ని గ్రామాల్లో కురిసిన భారీవర్షం, గాలిదుమారానికి ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. చేతికి చేతికి అందివచ్చిన వరి పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదన చెందారు. ఎలిగేడులో.. ఎలిగేడు(పెద్దపల్లి): కొనుగోలు కేంద్రాల్లోని ధా న్యం తడిసింది. లాలపల్లిలో వడగళ్లవాన కురిసింది. వరిపైరు నేలవాలింది. అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. మామిడికాయలు రాలిపడ్డాయి. కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. గ్రామాల్లో..సుల్తానాబాద్రూరల్: మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో కురిసిన భారీవర్షానికి ధాన్యం తడిసిపోయింది. నీటిలో కొట్టుకుపోయిన వడ్లను కాపాడుకునేందుకు అన్నదాతలు నానాఅవస్థలు పడ్డారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.ముత్తారంలో.. ముత్తారం(మంథని): మచ్చుపేటకు చెందిన కల వేన మల్లయ్య ఇంటి పైకప్పు రేకులు గాలిదుమారం ధాటికి కొట్టుకుపోయాయి. సమీపంలోని విద్యుత్ స్తంభానికి తగిలి ఆగాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లక్కారం, మచ్చుపేట, మైదంబండ, సర్వారం, కేశనపల్లి, పారుపల్లి, ముత్తారం, అడవిశ్రీరాంపూర్, ఓడేడ్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకాల వర్షం తమను ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓదెలలో.. ఓదెల(పెద్దపల్లి): కొలనూర్, ఓదెల, పొత్కపల్లి, కనగర్తి, గుంపుల ఐకేపీ కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొంత వర్షపునీటిలో కొట్టుకుపోయింది. కొలనూర్లో జక్కుల రాజ య్యకు చెందిన ఇంటి పైకప్పు గాలిదుమారానికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఓదె ల, పొత్కపల్లిలోనూ కొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు గ్రామస్తులు తెలిపారు. పాలకుర్తి మండలంలో.. పాలకుర్తి(రామగుండం): వివిధ గ్రామాల్లో మధ్యాహ్నం హఠాత్తుగా కురిసిన వర్షంతో కోతకు వచ్చిన వరిపైరు నేలవాలింది. కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలు పాక్షికంగా తడిశాయి. వడగళ్లవాన – విరిగిన చెట్లు పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్లో ధాన్యంపై పరదాలు కప్పేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై వెంటనే టార్పాలిన్లు కప్పడంతో ధాన్యం తడవలేదు. నిట్టూరు, మారేడుగొండ తదితర గ్రామాల్లోనూ వర్షం కురిసింది. నిట్టూరులోని శ్మశానవాటిక పైకప్పు గాలి ధాటికి ఎగిరి పడింది. తాటిచెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడింది. రాఘవపూర్, రాగినేడు, ములసాల, కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట, సుల్తానాబాద్ మండలం కనుకులలోని సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ఎస్ఈ సుదర్శనం తెలిపారు. సమస్యలు ఉంటే 79016 28367 నంబరుకు కాల్చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. తడిసిన ధాన్యం పరిశీలన స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును అడిషనల్ కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ సందర్శించారు. తడిసిన ధాన్యంపై ఆరా తీశారు. వర్షం కురిసేలోపు టార్పాలిన్లు కప్పడంతో పెద్దగా తడవలేదని అధికారులు ఆయనకు వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యా న్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని ఆయన సూచించారు. పాక్షికంగా తడిసిన ధాన్యాన్ని ఆరబోయించి కొనుగోలు చేయాలన్నారు. మార్కెట్ కార్యదర్శి దేవరాజ్పృథ్వీరాజ్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, సీఈవో మదన్మోహన్ ఉన్నారు. వడ్లు.. నీటిపాలు.. సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక వ్యవసాయ మార్కె ట్లో ఆరబోసిన ధాన్యం వర్షపునీటికి తడిసి ముద్దయ్యింది. ఇటుక బట్టీలకు తీరని నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డి పరిశీలించారు. ధర్మారం కొనుగోలు కేంద్రంలో నిలిచిన వర్షపునీరు, తడిసిన ధాన్యంజిల్లా సమాచారం కొనుగోలు కేంద్రాలు 311 సేకరించిన ధాన్యం(మెట్రిక్ టన్నుల్లో) 1,52,179 మిల్లులకు తరలించింది(మెట్రిక్ టన్నుల్లో) 1,50,908 కేంద్రాల్లో ఉన్న ధాన్యం(మెట్రిక్ టన్నుల్లో) 1,271 బలమైన ఈదురుగాలులు ఆ వెంటనే ఉరుములు, మెరుపులు మధ్యాహ్నం దంచికొట్టిన అకాల వర్షం తడిసి ముద్దయిన ధాన్యం.. రాలిన మామిడికాయలు ధ్వంసమైన ఇళ్ల పైకప్పులు విద్యుత్ సరఫరాకు అంతరాయం మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచే ఎండలు దంచికొట్టాయి. ఉక్కపోత తో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులు జనాలను భయకంపితులను చేశాయి. మరోవైపు.. వర్షం, గాలుల ధాటికి కోతకు వచ్చిన వరి పైరు నేలవాలింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉంచిన వడ్లు వర్షపు నీటికి కొట్టుకుపోయాయి. మామిడికాయలు రాలిపోయాయి. చేతికి వచ్చిన పంటను వానదేవుడు హఠాత్తుగా తన్నుకుపోవడంతో అన్నదాత కన్నీరుమున్నీరయ్యాడు. – సాక్షి, పెద్దపల్లిధాన్యం కొట్టుకుపోయింది ధర్మారం కేంద్రంలో పోసిన దాదాపు 3 క్వింటాళ్ల ధాన్యం నీటిలో కొట్టుకపోయింది. వర్షం తగ్గిన తర్వత మిగిలిన ధాన్యంపై కవర్లు కప్పిన. సరిపడా టార్పాలిన్లు ఇవ్వకపోవడంతోనే ధాన్యం నీటిలో కొట్టుకు పోయింది. – గుమ్ముల సతీశ్, రైతు, ధర్మారంధర్మారంలో.. ధర్మారం(ధర్మపురి): బంజేరుపల్లి, పెర్కపల్లి, కటికెనపల్లి, మల్లాపూర్, ఎర్రగుంటపల్లిలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5గంటల వరకు వడగళ్లవాన కురిసింది. మామిడి కాయలు నేలరాలాయి. ధర్మారం, ఎర్రగుంటపల్లి, కటికెనపల్లిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఎర్రగుంటపల్లిలో ధాన్యం కుప్పలు నీట మునిగిపోయాయి. తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిపోయాయి. సరిపడా టార్పిలిన్లు ఇవ్వకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని రైతులు వాపోయారు. -
కమిషనింగ్ పూర్తిచేయండి
జ్యోతినగర్(రామగుండం): ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూ చించారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో ఏర్పా టు చేసిన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సోమవా రం ఆయన తనిఖీ చేశారు. అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తిచేసి, ఈవీఎంల కమిషనింగ్ ప్రారంభించామని తెలిపారు. తహస్దీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల తనిఖీపాలకుర్తి(రామగుండం): కన్నాల జెడ్పీ హై స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను జెడ్పీ సీఈవో నరేందర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. త్వరితగతిన పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పాలకుర్తి, ఈసాలతక్కళ్ళళ్లల్లి, బసంత్నగర్ డీఆర్డీవో రవీందర్ ఠాథోడ్ పర్యటించి పోలింగ్ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పరిశీలించారు. ఎంపీడీవో శశికళ, ఏపీఎం సదానందం, సీసీ రాంబాబు, హెచ్ఎం కమలాకర్రావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘మీరూ ఓటు వేయండి’పెద్దపల్లిరూరల్: ప్రజాస్వామ్యంలో ఓటుహ క్కు విలువైనదని, ప్రతీఓటరు దానిని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ అ న్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి ఉన్నందున సబ్ డివిజనల్ పోలీసు అధికారులు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన సోమవారం వారు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఆదివారం రాత్రి ఉత్పత్తి దశలోకి తీసుకొచ్చా రు. గతనెల 29న మిల్స్లో తలెత్తిన సాంకేతిక లోపంతో యూనిట్ను షట్డౌన్ చేశారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదు రో జులుగా ఇంజినీర్లు, ఉద్యోగుల నిరంతరం శ్ర మిచి యూనిట్ను విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. గత మూడు నెలలుగా తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం, పునరుద్ధరించడం తదితర పనులతో రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా, శాశ్వత పరిష్కారం లభించడంలేదు. నీటి సమస్య పరిష్కరించాలిమంథని: గ్రామాల్లో తాగునీటి సమస్య తలె త్తకుండా చర్యలు తేసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తెలిపారు. గుంజపడుగు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సో మవారం ఆమె తనిఖీ చేశారు. తాగునీటి సరఫరా తీరు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. పంచాయతీ కార్య దర్శి రత్నాకర్ తదితరులు ఉన్నారు. ప్రశాంతంగా ఈసెట్ రామగిరి(మంథని): సెంటినరీకాలనీ జేఎన్టీయూలో సోమవారం ఈసెట్ ప్రశాంతంగా ముగిసింది. 150 మంది విద్యార్థులకు ఇద్దరు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ శ్రీధర్రెడ్డి తెలిపారు. ప్రతీ విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి అనుమతించామని అన్నారు. ఎస్సై సందీప్కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పోలింగ్ కేంద్రాల తనిఖీ
ఫెర్టిలైజర్సిటీ: 39వ డివిజన్ శాంతినగర్లోని ప్ర జా పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రా లని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ సో మవారం తనిఖీ చేశారు. సౌకర్యాలపై ఆరా తీశారు. డిప్యూటీ తాహసీల్దార్ మాధవి పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన ● 7 నుంచి 11 తేదీ వరకు తేలికపాటి వర్షాలు సాక్షిప్రతినిధి, కరీంనగర్: మాడు పగిలే ఎండలతో తల్లడిల్లుతున్న ప్రజలకు భారత వాతావరణశాఖ (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. -
పట్టుదలతో చదవండి
● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పెద్దపల్లిరూరల్: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల తో చదివి లక్ష్యం సాధించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. పదో తరగతి వార్షిక ఫలితాల్లో ఉత్త మ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ప్రోత్సాహించిన ఉపాధ్యాయులను తన కార్యాలయంలో సోమవా రం ఆయన సన్మానించారు. డీఈవో మాధవితో కలి సి విద్యార్థులకు పలు సూచనలిచ్చారు. జిల్లాలో ఈ సారి టెన్త్ ఫలితాలు మెరుగ్గానే వచ్చాయని తెలిపా రు. వచ్చే విద్యాసంవత్సరంలో నూరుశాతం ఫలితా లు సాధించేలా ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ని ర్వహణ, ఇంటివద్ద చదువు ఫాలోఅప్ చేయడం లాంటి చర్యలు మంచి ఫలితాల సాధనకు దోహదపడ్డాయని అన్నారు. నూరు మార్కులు సాధించిన విద్యార్థులతో ముచ్చటించారు. జాతీయస్థాయి ప్రే రణ శిక్షణకు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అకడమిక్ అధికారి షేక్తోపాటు జిల్లా అధికారులు రంగారెడ్డి, మెహరాజ్ మహమూద్, హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక దుర్గానగర్ ఫంక్షన్హాల్లో జరిగిన స్వర్ణకారుల నూతన కార్యవర్గ ప్రమా ణ స్వీకారానికి ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీకి ఓటుద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్పొరేటర్ బాల రాజ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు రంగు శ్రీనివాస్, నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండపర్తి నరహరి, ప్రధాన కార్యదర్శి కట్ట నగేశ్కుమార్, గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ, కోశాధికారి కట్ట శ్రీధరాచారి, ప్రతినిధులు ఉప్పుల లక్ష్మీనర్సయ్య, గుగ్గిళ్ల రవీందరాచారి, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, ప్రకాశ్, నజీముద్దీన్, శివ, ముబీన్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
● ఉద్యోగుల నిర్లక్ష్యమా? అధికారుల బాధ్యతారాహిత్యమా? కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లిన ఓ పేషెంట్కు గడువు ముగిసిన మందులు ఇవ్వడంతో అధికారుల బాధ్యతా రాహిత్యం వెలుగులోకి వ చ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. గోదావరిఖని కల్యాణ్నగర్కు చెందిన కారు డ్రైవర్, ట్రావెల్స్ నిర్వాహకుడు.. బత్తిని రవి రెండు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. సోమవారం జీజీహెచ్కు వెళ్లగా పరీక్షించిన వైద్యులు మందులు రాశారు. ఆస్పత్రి కౌంటర్లో డాక్టరు రాసిచ్చిన చీటీ చూపించి మూడు రకాల మందులు తీసుకున్నాడు. అందులో రెండు రకాలు నాణ్యతగా ఉండగా, మూడోరకానికి చెందిన 10 టాబ్లెట్లు తీసుకున్నాడు. ఓ రాజకీయ పార్టీ ప్రచారం కోసం కారు పంపించే హడావుడిలో ఎన్టీపీసీ వెళ్లిన రవి.. అక్కడే మందులు వేసుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ మిత్రుడు వాటిని చూసి కాలం చెల్లిన మందులని చెప్పాడు. దీంతో చప్పరించే మందులను వాడకుండా పక్కన పెట్టాడు. అనుమానంతో ఓ ప్రైవేట్ మెడికల్ షాప్కు వెళ్లి ఆ మందుల గురించి ఆరా తీశాడు. గతనెల వరకే గడువు ఉందని షాపు నిర్వాహకులు స్పష్టం చేయడంతో బాధితుడు రవి ఆందోళన చెందాడు. మందులు, టానిక్లు, ఇంజక్షన్లు తరచూ తనిఖీచేసి, కాలం చెల్లిన వాటిని పక్కన పెట్టాల్సిన ఉద్యోగులు, అధికారులు.. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంకా ఎంతమందికి ఇచ్చారో? మరోవైపు.. కాలం చెల్లిన మందులు ఆస్పత్రి కౌంటర్లో ఇంకా ఎన్నిఉన్నాయి? ఇప్పటివరకు ఇంకా ఎంతమందికి ఇచ్చారు? వైద్యులకు తెలిసే గడువు ముగిసిన మందులు పంపిణీ చేశారా? లేక వారికి తెలియకుండా, పొరపాటున మందులు పంపిణీ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ విచారణ చేపడితే వెలుగులోకి వస్తాయని పేషెంట్లు అభిప్రాయపడుతున్నారు. విచారణ జరువుతాం గడువు తీరిన మందులు ఇచ్చారనే ఘటనపై విచారణ చేపడతాం. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అరుణ, ఆర్ఎంవో, జీజీహెచ్ -
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
పెద్దపల్లిరూరల్: ‘భారత్ మాతాకీ జై.. అందరికీ నమస్కార్.. ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా’ అ ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్(జేపీ) న డ్డా జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగం ఆరంభించారు. ప్రధాని మోదీ సా రథ్యంలోని ప్రభుత్వం నీతివంతమైన పాలన సాగిస్తోందని, మనదేశాన్ని ప్రపంచంలో అగ్రభాగాన ని లిపేందుకే ఆరాట పడుతోందన్నారు. స్థానిక ప్రభు త్వ జూనియర్ కాలేజీ మైదానంలో పెద్దపల్లి పార్ల మెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతు గా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నడ్డా ప్రసంగాన్ని రాంచందర్రావు తె లుగులో అనువదించారు. మంథని ఎమ్మెల్యేగా ఎ న్నికైన, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భార తరత్న పురస్కారం అందించామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లు అన్నిగ్రామాలకు చేరాయన్నారు. 53వ నంబరు జాతీయ రహదారి పూర్తయితే మరింత మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ సాగుతోందని, రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభించామని తెలిపారు. 25కోట్ల మంది పేదలు ఆత్మ నిర్భర్ ద్వారా ఆర్థికాభ్యున్నతి సాధించేలా ప్రోత్సహించామన్నారు. పదేళ్ల కేసీఆర్ సర్కార్ విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని, కుటుంబపాలనకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, కేంద్రప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద 4కోట్ల ఇళ్లు నిర్మించిందని తెలిపారు. ఓవైసీతో దోస్తానా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఓవైసీతో దోస్తీ చేస్తున్నా రని జేపీ నడ్డా విమర్శించారు. ముస్లింల ఓట్ల కోస మే ఓబీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు పంచారని, తాము వాటినే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి వివేక్ కుటుంబం జాగీరా? ‘పెద్దపల్లి అడ్డా వెంకటస్వామి కుటుంబీకుల జాగీ రా? వెంకటస్వామి పోతే ఆయన కొడుకు వివేక్, ఇ పుడు ఈయన కొడుకు వంశీకృష్ణ పోటీ చేస్తరా? ఈ ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తం.. గడ్డం కుటుంబీకుల ను ఓడించి కాషాయజెండా ఎగురవేస్తం’ అని బీజే పీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. ఇక్క డ ప్రజాప్రతినిధులుగా గెలిచి ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ వెంకటేశ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ వికసిత్ భా రత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారన్నారు. పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గెలుపు ఖాయమని అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్ మాట్లాడుతూ, దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన రిజర్వేషన్లు ఒక్క వెంకటస్వామి కుటుంబమే అనుభవిస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల బీజేపీ అధ్యక్షులు సునీల్రెడ్డి, రఘునాథ్, మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి, శ్రీదేవి, నాయకులు చిలారపు పర్వతాలు, జి.సురేశ్రెడ్డి, వనిత, కందుల సంధ్యారాణి, సుహాసినిరెడ్డి పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై.. అందరికీ నమస్కార్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా -
వేడెక్కిన ప్రచారం
● జిల్లాలో అగ్రనేతల పర్యటనలు ● ప్రధాన పార్టీల శ్రేణుల్లో జోష్ ● సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా రాక ● పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల విజయం కోసం నేతల ప్రచారం ● హామీలిస్తూ, విమర్శలు గుప్పిస్తూ, ఉత్సాహం నింపుతూ ముందుకు.. సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి లోక్సభలో తమ పార్టీ అ భ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు తమ అభ్యర్థుల విజయం కోసం జిల్లా పర్యటనకు వస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ గుడువు సమీపిస్తున్న నేపథ్యంలో అగ్రనేతలు పార్లమెంట్ను చు ట్టేస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదేసమయంలో తమ పార్టీని గెలిపిస్తే చేసే అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు. మరోసారి సీఎం రేవంత్రెడ్డి రాక.. ● సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ● ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారాంపల్లి బహిరంగ సభలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నిక ప్రచారం చేశారు. ● దివంగత పీవీ, శ్రీపాదరావు, కాకాను గుర్తుచేస్తూ, స్థానిక సమస్యల పరిష్కారం కోసం హామీలిస్తూ, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ● కార్యకర్తల శ్రమతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని,టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ● జిల్లాకేంద్రంలో వంశీకృష్ణకు మద్దతుగా నిర్వహించే సభలో సీఎం రేవంత్రెడ్డి మరోసారి పాల్గొననున్నారు. కార్మికులకు అండగా ఉండేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా రామగుండంలో చేపట్టిన రోడ్డుషోలో మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం కావడంతో.. గతంలో కాంగ్రెస్ సింగరేణిని ముంచిందని, బొగ్గు గనులను బీజేపీ ప్రైవేట్పరం చేస్తోందని ఫైర్ ఆయ్యారు. తెలంగాణ కోసం, సింగరేణి కోసం కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఐదునెలల్లో రాష్ట్రంలో కరెంట్, సాగు నీటిసమస్యలు తలెత్తాయని, కార్మికుల పక్షాన పార్లమెంట్లో గళం విప్పేది బీఆర్ఎస్ ఎంపీలేనంటూ ప్రచారం నిర్వహించారు. ఆర్ఎఫ్సీఎల్ను పునరుద్ధరించాం.. ● బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్దపల్లి జనసభలో కాషాయ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ● జగదల్పూర్–పెద్దపల్లి–ధర్మపురి– నిజామాబాద్ జాతీయ రహదారిని త్వరలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ● మూతపడిన ఎఫ్సీఐని ఆర్ఎఫ్సీఎల్గా పునరుద్ధరించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచామని ఆయన అన్నారు. ● బీజేపీ అభ్యర్థికి మద్దతుగా మంథనిలో మంగళవారం నిర్వహించే బహిరంగ సభలో రాజస్థాన్ సీఎం భాజన్లాల్శర్మ పాల్గొననున్నారు. ఎండలోనూ చుట్టేస్తున్నారు ముఖ్య నాయకుల సభలు లేని మిగతా రోజుల్లో అభ్యర్థులు ప్రతీ గ్రామంలో పర్యటిస్తున్నారు. కార్నర్ మీటింగ్లు, రోడ్డుషోలతోపాటు కుల సంఘాలు, యువతతో ప్రత్యేక సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ పల్లె చుట్టేస్తూ ‘అన్నా.. ఎట్లున్నవు.. చెల్లె, అక్కా బాగున్నావా.. అమ్మా ఓటెయ్యాలే’ అని బంధుగణం, అనుచరగణం ఇంటింటి ప్రచారం చేస్తోంది. -
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
పెద్దపల్లిరూరల్: పార్లమెంట్ అభ్యర్థులు ప్రచార వ్యయ వివరాలను రిజిష్టర్లలో పకడ్బందీగా నమో దు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ నైరంతర్యా సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎన్నికల వ్యయం నమోదుపై వివిధ పార్టీల ఎంపీ అభ్యర్థులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వ్యయం వి వరాలు నమోదు చేయాలన్నారు. 36మంది అభ్యర్థులు హాజరు కాగా గైర్హాజరైన ఆరుగురికి నోటీసు లు జారీచేశామని తెలిపారు. తదుపరి సమావేశం ఈనెల 11న ఉంటుందని పేర్కొన్నారు. డీసీవో శ్రీమాల తదితర అధికారులు పాల్గొన్నారు. రూ.కోటి 78లక్షల జప్తు.. పార్లమెంట్ నియోజకవర్గంలో చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.కోటి 78లక్షల97వేల132 నగదు జప్తు చేసి, తగిన ఆధారాలు చూపిన వారికి రూ.కోటి67లక్షల37వేల32 నగదు విడుదల చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ తెలి పారు. ఆధారాలు చూపని రూ.11లక్షల60వేల100 సీజ్ చేసి ఉంచామని ఆయన పేర్కొన్నారు. -
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
● రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుగోదావరిఖని: కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపి స్తే సింగరేణి ఉద్యోగుల ఆదాయపు పన్ను మాఫీపై పోరాటం చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్భాబు హా మీ ఇచ్చారు. స్థానిక సీతానగర్లో సోమవారం రా త్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రామగుండం, చెన్నూర్ ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజ్ఠాకూర్, వివేక్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. ఆరు గ్యారంటీల్లో ఐ దింటిని ఇప్పటికే పూర్తి చేశామని, మిగతావి కూడా పూర్తిచేస్తామన్నారు. అయితే ప్రతిపక్షాల విమర్శల్లో అర్థం లేదన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీ ఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే ఒరిగేదేమీ ఉండదన్నారు. నాయకులు బొంతల రాజేశ్, బంగి అనిల్కుమార్, మ హంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, 49వ డివిజన్ అశోక్నగర్లో పలువురు కాంగ్రెస్లో రాజ్ఠాకూర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాకూబ్, వహీద్బేగ్ పాల్గొన్నారు. -
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
● ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య గోదావరిఖని:ఎండలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి ఓసీపీల్లో షిఫ్టు వేళలు మార్చాలని ఏఐటీయూ సీ అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె. రాజ్కుమార్ కోరారు. సోమవారం హైదరాబాద్లో సీఎండీ బలరాంను కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. తమ పోరాట ఫలితంగా మొదటిషిఫ్టును ఉద యం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, రెండో షిఫ్ట్ను సాయంత్రం 4 నుంచి రాత్రి 12గంటల వరకు, రాత్రి డ్యూటీ యథావిధిగా ఉంటుందని సింగరేణి ప్రకటించిందన్నారు. దీనిని కార్మికవర్గం వ్యతిరేకిస్తోందన్నారు. మొదటి షిఫ్ట్ను ఉదయం 7 నుంచి 1గంట వరకు, మధ్యాహ్న భోజనం కంటి న్యూ, రెండో షిఫ్ట్ను సాయంత్రం 4 నుంచి రాత్రి 11గంటల వరకు మార్చాలని ప్రతిపాదించామని అన్నారు. సీఎండీ సానుకూలంగా స్పందించారని సీతారామయ్య తెలిపారు. తద్వారా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11గంటల వరకు, రాత్రి 11 నుంచి మరుసటి రోజు ఉదయం 7గంటల పని వేళలు ఉంటాయని వివరించారు. కాగా, ఎన్నికల విధులను ఆన్లైన్ డ్యూటీగా పరిగణించాలని నేతలు కోరారు.
Pagination
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
Advertisement