డీఎస్పీగా షెహబాజ్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ
పాడేరు : పాడేరు డీఎస్పీగా ఎస్కే షెహబాజ్ అహ్మ ద్ శుక్రవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎస్పీగా పని చేసిన కె.ప్రమోద్ను ఆళ్లగడ్డకు బదిలీ చేసి, చింతపల్లిలో డీఎస్పీగా పనిచేసిన ఎస్కే షెహబాజ్ అహ్మద్ను పాడేరుకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు జిల్లాలో గంజాయి సాగు, రవాణా నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తానన్నారు. బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీని పాడేరు సీఐ డి.దీనబంధు మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment