పలు రైళ్ల రీ షెడ్యూల్‌ | - | Sakshi
Sakshi News home page

పలు రైళ్ల రీ షెడ్యూల్‌

Published Sat, Sep 21 2024 2:18 AM | Last Updated on Sat, Sep 21 2024 2:18 AM

-

ఎంవీపీకాలనీ: వాల్తేర్‌ డివిజన్‌ పరిధి నౌపడ–పూండి సెక్షన్‌లో ఈ నెల 23, 26, 28 తేదీల్లో భద్రత పనుల కారణంగా పలు రైళ్లను రీ షెడ్యూల్‌ చేసినట్లు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న పుదుచ్చేరి–భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12897) రెండు గంటలు ఆలస్యంగా రాత్రి 9.35 గంటలకు, ఈ నెల 25, 27న కేఎస్‌ఆర్‌ బెంగుళూర్‌–భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18464) 2.30 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 4.10 గంటలకు బయలుదేరుతాయి. 22న రూర్కెలా–గుణుపూర్‌ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌(18117) పలాస వరకు, 23న గుణుపూర్‌– రూర్కెల్‌ ఎక్స్‌ప్రెస్‌ పలాస నుంచి బయలుదేరుతుంది. ఈ రెండు రోజులు పలాస– గుణుపూర్‌ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించవు. 26, 28 తేదీల్లో పలాస మెము(07470/07471) విశాఖ–శ్రీకాకుళం మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తుంది. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని వాల్తేర్‌ డీసీఎం డీసీఎం సందీప్‌ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement