జీవీఎంసీ 10వ వార్డు పరిధి ఇందిరాగాంధీనగర్ రామాలయం ఎదురుగా 8 అడుగులు వెడల్పు గల రోడ్డు ఉంది. ఈ రోడ్డు పక్కన సుమారు 160 చదరపు గజాల విస్తీర్ణంలో ఓ వ్యక్తి స్థానిక టీడీపీ నాయకుల అండతో దర్జాగా అనధికారికంగా అంతస్తులు వేసేశాడు. బయటకు కనిపించకుండా గ్రీన్ సేఫ్టీ నెట్స్ వేసి లోపల పని కానిచ్చేశాడు. సదరు వ్యక్తి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి సిల్ట్, గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు వేయడానికి అనుమతులు తీసుకుని నిర్మాణం ప్రారంభించాడు. ఆ తర్వాత అసలు కథ మొదలు పెట్టాడు. అనధికారికంగా మూడు, నాలుగు ఫ్లోర్లు వేశాడు. ఆ ఫ్లోర్లు కనిపించకుండా గ్రీన్ సేఫ్టీ నెట్స్తో మూసేశాడు. 10 అడుగులు కూడా లేని ఈ రోడ్డులో ఇన్ని అంతస్తుల నిర్మాణం జరుగుతున్నప్పటికీ.. పక్కనే ఉన్న సచివాలయం టౌన్ ప్లానింగ్ సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం.
ఇందిరాగాంధీనగర్లో ఇరుకు రోడ్డులో అనధికారిక
భవన నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment