పరిశ్రమల స్థాపనకు సహకారం | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల స్థాపనకు సహకారం

Published Sat, Sep 21 2024 2:20 AM | Last Updated on Sat, Sep 21 2024 2:20 AM

-

మహారాణిపేట: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ఎక్స్‌పోర్టు ప్రమోషన్‌ కమిటీ సమావేశంలో శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సింగిల్‌ విండో విధానంలో సులభతర రీతిలో అనుమతులు జారీ చేయాలని, సమస్యలేమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఆటోనగర్‌ పారిశ్రామిక వాడలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా పైప్‌లైన్లకు మరమ్మతులు చేపట్టాలని, ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పీఎం ఈజీపీలో భాగంగా ఎంఎస్‌ఎంఈ పథకం కింద దరఖాస్తులకు పరిశీలించి ఆమోదం తెలపాలన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని, పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు ఆడిట్‌ చేయాలని, మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని సూచించారు. పరిశ్రమల శాఖ జీఎం సీహెచ్‌ గణపతి గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి తెలిపారు. ఏడీ రమామణి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఎం.శ్రీనివాస్‌, డీఆర్‌డీఏ పీడీ ఎం.ఎస్‌.శోభారాణి, ఆర్‌అండ్‌ బీ ఎస్‌ఈ కె.కాంతిమతి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement