ఐదుగురు సీఐలకు స్థానచలనం | - | Sakshi
Sakshi News home page

ఐదుగురు సీఐలకు స్థానచలనం

Published Thu, Sep 26 2024 2:00 AM | Last Updated on Thu, Sep 26 2024 2:00 AM

ఐదుగురు సీఐలకు స్థానచలనం

విశాఖ సిటీ: నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అయిదుగురు ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఇందులో రేంజ్‌ నుంచి వచ్చిన ఇద్దరికి పోస్టింగ్‌ ఇవ్వగా.. ఇక్కడి నుంచి రేంజ్‌కు ఇద్దరిని సరెండర్‌ చేశారు. ఈ మేరకు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేంజ్‌ నుంచి వచ్చిన వి.చంద్రశేఖర్‌ను కంచరపాలెం లా అండ్‌ ఆర్డర్‌ సీఐగా వేశారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌.భాస్కర్‌రావును సిటీ టాస్క్‌ఫోర్స్‌–1కు బదిలీ చేశారు. అలాగే రేంజ్‌ నుంచి వచ్చిన జి.అప్పారావును సోషల్‌ మీడియా సెల్‌, సీఎంఎస్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. ఇక్కడ ఉన్న బి.లక్ష్మణరావును, సీఎస్‌బీ పొలిటికల్‌లో ఉన్న వి.రామారావును రేంజ్‌కు సరెండర్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement