Diwali
-
‘ఆమె క్షేమంగా వస్తే చాలూ.. మాకు పండుగే!’
ఢిల్లీ: తొమ్మిది నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్(sunita williams) , బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి తిరుగు పయనమయ్యారు. వ్యోమగాములంతా సురక్షితంగా భూమ్మీద అడుగు మోపాలని కోట్ల మంది ప్రార్థిస్తున్నారు. అయితే ఒక ఊరు మాత్రం ప్రత్యేకంగా సునీత క్షేమం కోసం పూజలు, హోమాలు చేస్తోంది. ఆమె రాకను ఒక పండుగలా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. సునీతా విలియమ్స్ భారత సంతతి అనే విషయం తెలిసిందే కదా. గుజరాత్లోని మెహసానా జిల్లా ఝూలాసన్ ఆమె పూర్వీకుల గ్రామం(Ancestral Village). అక్కడ ఇప్పటికీ ఆమెకు బంధువులు ఉన్నారు. కిందటి ఏడాది.. సునీత అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయినప్పటి నుంచి వాళ్లంతా ఆందోళనతోనే ఉన్నారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు.. ఆమె తిరిగి వస్తుండడంపై వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‘‘నా సోదరి సునీతా రాక కోసం మేమంతా ఎంతో ఎదురుచూస్తున్నాం. సునీత తల్లి, సోదరి, సోదరుడుతో సహా ఈ దేశంలోని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఆమె సురక్షితంగా కిందకు దిగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. సునీత కోసం దేవాలయాలకు వెళ్లి పూజలు చేశాం. సునీతా కోసం యజ్ఞం నిర్వహిస్తున్నాం’’ అని ఆమె సోదరుడు దినేశ్ అంటున్నారు. మరోవైపు ఊరు ఊరంతా.. సునీత రాకను చిరస్మరణీయమైన రోజు.. దేశం గర్వించదగిన రోజుగా చెబుతోంది. దీపావళి పండుగలా ఆమె రాకను సంబురంగా జరిపేందుకు సిద్ధం అయ్యింది. సునీతా విలియమ్స్ గతంలో రెండుసార్లు భారత్ పర్యటనకు వచ్చారు. 2007లో తొలిసారి ఇండియాకు వచ్చిన ఆమె.. ఝూలాసన్తో పాటు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. తిరిగి 2013లో పర్యటనకు వచ్చి.. కోల్కతా, న్యూఢిల్లీతో పాటు తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఝూలాసన్ గడ్డకు ఆమె ప్రత్యేకంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. కిందటి వ్యోమగాములను భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్(Space X Crew Dragon Capsule)లోకి వీరు చేరుకున్నారు. ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమ్మీదకు బయల్దేరింది. స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ను వీడే అన్డాకింగ్ దృశ్యాలను ప్రపంచమంతా వీక్షించేందుకు నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. -
న్యూజెర్సీలో దీపావళి వేడుకలు 2024
-
ఇంట్లో నుంచే ‘దేవ్ దిపావళి’ని చూడండిలా..
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆరోజు దశాశ్వమేధ ఘాట్లో అత్యంత వైభవంగా జరిగే గంగా హారతిని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలిరానున్నారు.ఈసారి దేవ్ దీపావళికి కాశీకి వెళ్లలేనివారు ఇంట్లో కూర్చొని గంగాహారతిని, దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. తొలిసారిగా దేవ్ దీపావళి నాడు జరిగే గంగా హారతి వేడుకలు ‘గంగా సేవా నిధి’ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఢిల్లీ నుంచి ఈ వేడుకలను వీక్షించనున్నారు.గంగా సేవా నిధి వెబ్సైట్ను నవంబర్ 15న ప్రారంభిస్తున్నామని గంగా సేవా నిధి అధ్యక్షుడు సుశాంత్ మిశ్రా తెలిపారు. విదేశాలలోని వారు కూడా gangasevanidhi.in వెబ్సైట్ ద్వారా దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. గంగా హారతి సందర్భంగా ‘ఏక్ సంకల్ప్ గంగా కినారే’ పేరుతో కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది తాము గంగా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేయనున్నారు.నవంబర్ 15న దశాశ్వమేధ ఘాట్లో 21 మంది పండితులు వైదిక ఆచారాల ప్రకారం భగవతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. దేవ్ దీపావళి వేళ వారణాసిలోని 84 ఘాట్లను దీపాలతో అందంగా అలంకరించనున్నారు. పురాణాల ప్రకారం త్రిపురాసురుని దౌర్జన్యాల నుంచి దేవతలు విముక్తి పొందిన సందర్భంలో, వారు శివుని నివాసమైన కాశీ నగరానికి వచ్చి దీపాల పండుగను జరుపుకున్నారు. నాటి నుంచి ప్రతియేటా ఇక్కడ దేవ్ దీపావళి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
టపాసుల కాలుష్యంలో టాప్ ఫైవ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మహానగరాల్లో కాలుష్య మేఘాలు మరింత చిక్కబడుతున్నాయి. సాధారణ సమయంలో కూడా వాయు కాలుష్యం రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక పటాకుల పండుగ దీపావళి రోజు వాయు కాలుష్యం అన్ని హద్దులు దాటుతోంది. గత నెల 31న దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంతోషంగా దీపావళి పండుగ జరుపుకొన్నారు. కానీ ఆరోజు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరిందో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సర్వేలో తేలింది. మొదటి స్థానం ఢిల్లీదే దీపావళి రోజు నమోదైన వాయు కాలుష్యం విషయంలో హైదరాబాద్ నగరం బెంగళూరుతో కలిసి ఐదో స్థానంలో నిలిచింది. దీపావళి రోజు 24 గంటల్లో ప్రధాన నగరాల్లో వాయు కాలుష్య వివరాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విడుదల చేసింది. పండుగ రోజు అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. దీపావళి రోజు గ్రీన్ కాకర్స్ మినహా సాధారణ పటాకులు కాల్చటంపై నిషేధం ఉన్నా ఢిల్లీ మొదటి స్థానంలోనే నిలవటం గమనార్హం.దీపావళి రోజు ఢిల్లీలో ఏక్యూఐ 339 పాయింట్లుగా నమోదైంది. స్విస్ కంపెనీ ఐక్యూ ఏఐఆర్ ‘లైవ్ ర్యాంకింగ్ ఆఫ్ గ్లోబల్ సిటీస్ ఆన్ ఏక్యూఐ’నివేదిక ప్రకారం దీపావళి పండుగ మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను విశ్లేషించినపుడు ఢిల్లీ నగరం ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా నిలిచింది. ఐక్యూ ఏఐఆర్ నివేదిక ప్రకారం» పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5) ప్రామాణిక పాయింట్లపరంగా 30 పాయింట్లు దాటితే కాలుష్యకారకంగా పరిగణిస్తారు. » మనదేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య స్థాయిలు జాతీయ సగటు కంటే రెండింతలు నమోదయ్యాయి. » పీఎం 2.5 (అతి సూక్ష్మస్థాయిలోని ధూళి క ణాలు–పీఎం 2.5) విషయానికొస్తే జాతీయ సగటు కంటే ఢిల్లీలో 2022లో 92.6 పాయింట్లు అధికంగా ఉండగా, 2023లో 102.1 పాయింట్లు అధికంగా నమోదైంది. జాతీయసగటు 2022లో 53.3 పాయింట్లు, 2023లో 54.4 పాయింట్లు మాత్రమే ఉన్నది. » పీఎం 2.5 2022లో ముంబైలో 46.7 పాయింట్లు, 2023లో 43.8 పాయింట్లు నమోదైంది. » కోల్కతాలో 2022లో 50.2, 2023లో 47.8 పాయింట్లు రికార్డయ్యింది. » హైదరాబాద్లో 2022లో 42.4 పీఎం 2.5 పాయింట్లు, 2023లో 39.9 పాయింట్లు నమోదైంది. » ప్రామాణికంగా చూస్తే పీఎం 10 స్థాయిలు (మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్) 60 పాయింట్లు దాటితే వాయు కాలుష్యకారకాలు పెరిగినట్టుగా భావించాలి. 2023–24 నాటికి ఏడాదికి 20 నుంచి 30 శాతం పీఎం 10 సాంద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించుకొన్నది. ఐతే సగటు వార్షిక పీఎం 10 స్థాయిలు 2023–24లో ఢిల్లీలో 208, ముంబైలో 94, కోల్కతాలో 94, అహ్మదాబాద్లో 98, పుణేలో 98, బెంగళూరులో 70, హైదరాబాద్లో 81, చెన్నైలో 63 పాయింట్లు రికార్డయ్యింది. -
పందెం విసిరిన స్నేహితులు.. బాంబు మీద కూర్చున్న యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
బెంగళూరు : స్నేహితులతో పందెం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాంబు మీద కూర్చొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. దీపావళి పండుగ సందర్భంగా శబరిష్ (32) అతని ఆరుగురు స్నేహితులు మధ్య పందెం వేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న శబరీష్కు అతని స్నేహితులు పందెం విసిరారు. పందెం ప్రకారం..శబరీష్ కార్డ్ బోర్డ్ కింద అమర్చిన బాంబులపై కూర్చోవాలి. అనంతరం బాంబుకు నిప్పు అంటిస్తాము. నిప్పు అంటించినా అలాగే కూర్చుంటే ఓ కొత్త ఆటో కొనిస్తామని ఆఫర్ ఇచ్చారు.చదవండి : తెగిపడిన కుమారుడి తల.. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తూదీంతో మద్యం మత్తులో ఉన్న శబరీష్ స్నేహితులు చెప్పినట్లుగానే బాంబులు అమర్చిన కార్డ్ బోర్డ్పై కూర్చున్నాడు. అంనతరం అతని స్నేహితులు కార్డ్ బోర్డ్ కింద ఉన్న బాంబులకు నిప్పు అంటించి దూరంగా పరిగెత్తారు. సెకన్ల వ్యవధిలో భారీ శబ్ధాలతో బాంబులు పేలాయి.శబరీష్ అలాగే ఉన్నాడు. అతనికి ఏమైందా అని చూద్దామని ముందుకు వచ్చిన స్నేహితుల్ని చూసిన శబరీష్ వెంటనే కుప్పకూలాడు. ప్రాణాలు కోల్పోయాడు. అత్యవసర చికిత్స కోసం శబరీష్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాంబు పేలుడు ధాటికి శబరీష్ అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి పందెం విసిరిన అతని ఆరుగురు స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. A Bet that proved costly, takes a Life in #Bengaluru !In a shocking incident a 32-yr-old Shabari died in a tragic way on #Diwali, after he accepted a challenge to sit on a box full of #firecrackers in it to win an auto rickshaw, in Konanakunte, South Bengaluru. His friends lit… pic.twitter.com/YGHEmxViV2— Surya Reddy (@jsuryareddy) November 4, 2024 -
అతనితో మృణాల్ ఠాకూర్ వైరల్ అవుతున్న ఫొటోస్
-
వెర్రి వేషాలపై వీసీ సజ్జనార్ సీరియస్
హైదరాబాద్: దీపావళి సందర్భంగా.. హైటెక్సిటీ ప్రాంతంలో కొందరు యువకులు ఇష్టారీతిన బాణసంచా కాలుస్తూ బైక్లపై విన్యాసాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. దీనిపై ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగపూట ఇదేం వికృతానందమని ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు.‘‘దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’’ అని సజ్జనార్ ప్రశ్నించారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 ఆయన పోస్ట్పై పలువురు నెటిజన్లు స్పందించారు. కొంతమంది యువకులు తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలను రిస్క్లో పెట్టుకుంటున్నారన్నారు. ఈ చేష్టలతో మిగతా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: ఏడాది క్రితం అదృశ్యమై.. ఆధార్తో దొరికాడు -
దేశ ప్రగతి కొన్ని కంపెనీలపైనే ఆధారపడరాదు
ముంబై: దేశ అభివృద్ధి అన్నది కేవలం కొన్ని కంపెనీలు లేదా కొన్ని గ్రూపులపైనే ఆధారపడి ఉండరాదని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దేశమంతటా మరిన్ని కంపెనీలు వృద్ధి చెందేలా విస్తృతంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చూస్తే ఆశావహంగానే కనిపించినా.. సూక్ష్మంగా చూస్తే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. బారత కంపెనీలు రక్షణాత్మక ధోరణి కంటే పోటీతత్వంపైనే ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇన్వెస్టర్లకు ఉదయ్ కోటక్ ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. కంపెనీలకు సాయం చేయడం ద్వారా ‘వెయ్యి పువ్వులు వికసించనివ్వండి’ అనే సామెతను ఆచరణ దాల్చేలా క్యాపిటల్ మార్కెట్లు చూడాలన్నారు. గతేడాది ఈక్విటీలు, ఫైనాన్షియల్ మార్కెట్లకు గొప్ప సంవత్సరంగా ఉండిపోతుందంటూ, ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు వచి్చనట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్ధాన పతనాలకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణిస్తుండడంతో అప్రమత్తతో కూడిన ఆశావహ ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయంటూ, వీటిపై భారత్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సైతం కేవలం కొన్ని గ్రూపులే కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
AP: ‘బండ’ మోసం.. అరకోటి కుటుంబాలకు ‘గ్యాస్’ ఎగ్గొట్టిన బాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 1.80 కోట్లకుపైనే! వీరిలో 1.54 కోట్ల మందికి యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు కోటిన్నరకుపైగా కుటుంబాలు! ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ ఇస్తామన్న టీడీపీ కూటమి పార్టీల ఎన్నికల హామీని నెరవేర్చాలంటే ఏటా దాదాపు రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల కోసం రూ.2,684.75 కోట్లు మాత్రమే ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దాదాపు పది లక్షల వరకు ఉన్న ప్రధాని ఉజ్వల యోజన కనెక్షన్లకు పాక్షిక రాయితీతోపాటు మిగతా గ్యాస్ వినియోగదారులకు ఎన్నిల హామీ ప్రకారం పూర్తి ఉచితంగా సిలిండర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం లబ్ధిదారులకు ఒక్క ఉచిత సిలిండర్ పంపిణీ కోసం రూ.1,345 కోట్లు అవసరం. కానీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చిందెంతో తెలుసా? దీపావళికి తొలి సిలిండర్ పంపిణీ కోసం ఇచ్చింది కేవలం.. రూ.894.92 కోట్లు మాత్రమే!! అంటే పథకాన్ని కేవలం కోటి కుటుంబాలకు లోపే పరిమితం చేసి మిగతా 54 లక్షల కుటుంబాలకు ఎగ్గొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతి ఇంటికీ ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్నికల వేళ బుకాయించిన కూటమి పార్టీల నేతలు ఈ ఏడాది ఇవ్వాల్సిన రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టేయడంతోపాటు అర కోటికిపైగా కుటుంబాలను పథకానికి దూరం చేయడం గమనార్హం.అంతా ఉత్త గ్యాసేనా!రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘ఉత్త గ్యాస్’గా మారిపోతోందా? అర్హత ఉన్నా ఉచిత గ్యాస్ అందుతుందన్న గ్యారంటీ పోయిందా? రేషన్ కార్డు ఉండీ.. దశాబ్దాలుగా గ్యాస్ కనెక్షన్ వినియోగిస్తున్న కుటుంబాలు ప్రభుత్వం దృష్టిలో అనర్హులైపోతున్నాయా? కూటమి పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పిన ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ వాగ్దానంలో మోసం బట్టబయలైందా? అంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అవుననే అంటున్నాయి. దీపం–2 కింద దీపావళి కానుకగా తీసుకొచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అందరికీ కాదనేది తేటతెల్లమవుతోంది. గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి అర్హుడికీ రాయితీ మొత్తం ఖాతాల్లో పడుతుందనేది భ్రమగా తేలిపోయింది.ఇంటింటికీ అని నమ్మించి..ఎన్నికల్లో ఓట్లే పరమావధిగా చంద్రబాబు బృందం ప్రతి ఇంటికీ ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బూటకపు హామీని గుప్పించింది. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు తర్వాత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేసింది. ఓట్లు వేయించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు విధించని కూటమి నాయకత్వం ఉచిత గ్యాస్ పథకం పొందాలంటే మాత్రం అర్హత ఉండాలనే మెలిక పెట్టింది. నిజానికి కూటమి పార్టీల ఎన్నికల హామీ ప్రకారం చూస్తే రాష్ట్రంలో 1.80 కోట్ల కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున (ప్రభుత్వ జీవో ప్రకారం సిలిండర్కు రూ.894) ఇవ్వడానికి రూ.4,827.60 కోట్లు ఖర్చవుతుంది. దీంతో ఉచిత గ్యాస్ పథకాన్ని కుదించేందుకు సిద్ధమయ్యారు. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత గ్యాస్ రాయితీ వర్తిస్తుందంటూ షరతులు విధించారు.పొంతన లేని సర్కారు లెక్కలు..రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ ఉంటే ఉచిత గ్యాస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 1,48,43,671 మంది కార్డుదారులు తమకు పూర్తిగా గ్యాస్ రాయితీ వస్తుందని ఆశపడ్డారు. వీరంతా బీపీఎల్ కిందే నమోదైన వారే. అయితే పథకాన్ని ప్రారంభించిన తొలి రోజే లక్షల కుటుంబాలకు నిరాశ ఎదురైంది. ఏళ్ల తరబడి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా పథకానికి అనర్హులుగా తేల్చడంతో నివ్వెరపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.54 లక్షల కుటుంబాలకు అర్హత లేదా?రేషన్ కార్డులున్నప్పటికీ సుమారు 54 లక్షల కుటుంబాలను ఉచిత గ్యాస్ పథకం నుంచి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. వీరిని వడపోసిన తర్వాతే పథకానికి బడ్జెట్ ప్రకటించినట్లు సమాచారం. ఏ ప్రమాణాల ప్రకారం వీరిని అనర్హులుగా ప్రకటించారో చెప్పకుండా అర్హులందరికీ ఉచిత గ్యాస్ ఇస్తున్నట్లు మభ్యపెడుతోంది. అర్హుల కుదింపుతోపాటు మరోవైపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునేలా మూడు బ్లాక్ పీరియడ్స్ను తెచ్చింది. ఆయా సమయాల్లో గ్యాస్ సిలిండర్ఖాళీగా లేకుంటే లబ్ధిదారుడు నష్టపోవాల్సి వస్తుంది. తద్వారా ప్రభుత్వం ఖర్చును తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు ఒక్క సిలిండర్తోనే సరిపెడుతూ రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టింది.ఇదీ గ్యాస్ ‘‘పథకం’’!రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1.80 కోట్లుయాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.54 కోట్లురేషన్ కార్డులు 1,48,43,671» ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఖర్చు రూ.4 వేల కోట్లు(ఒక్కోటి రూ.894 చొప్పున 1.54 కోట్ల మందికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు)కానీ మూడు సిలిండర్లకు ప్రభుత్వం ఎంత ఇస్తోంది?: రూ.2,684.75 కోట్లు(ఈ బడ్జెట్ కోటి కుటుంబాలకు కూడా సరిపోదు.. మరో అర కోటికిపైగా అర్హులైన కుటుంబాలకు మొండి చెయ్యే)» కార్డుదారులకు ఒక్క సిలిండర్ ఇవ్వటానికయ్యే ఖర్చు రూ.1,345 కోట్లు»తొలి సిలిండర్ కోసం విడుదల చేసిన మొత్తం రూ.894.92 కోట్లు » ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం చూస్తే లబ్ధి పొందే కుటుంబాలు సుమారు కోటి» అర్హత ఉన్నప్పటికీ పథకానికి దూరమైన కుటుంబాలు సుమారు అర కోటినోట్: ఏపీలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద సుమారు 9.68 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీరికి కేంద్రం గ్యాస్ సిలిండర్కు రూ.300 రాయితీ ఇస్తోంది. అది పోనూ ఇటువంటి కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.594 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన మాత్రం పూర్తిగా రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. -
Diwali 2024: ఆర్సీబీ ‘క్వీన్’ అలా.. అందమైన అలంకరణతో స్మృతి ఇలా(ఫొటోలు)
-
దీపావళి వీడియో కాదు.. సర్వీస్ స్టేషన్ ఫుటేజ్ చూపండి: కునాల్ కమ్రా
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కంపెనీలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపైన స్పందించిన కునాల్ కమ్రా.. ఓలా సర్వీస్ స్టేషన్ ఫుటేజీని షేర్ చేయమని భవిష్ అగర్వాల్ను కోరారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.సేల్స్ తరువాత నాణ్యమైన సర్వీస్ అందించడం లేదనే సమస్యతో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్తో రగడ మొదలైంది. అప్పటి నుంచి ఓలా కస్టమర్లు లేవనెత్తే అనేక సమస్యలను కునాల్ హైలైట్ చేస్తూ వస్తున్నారు.నెలకు 80,000 కస్టమర్ ఫిర్యాదులను కంపెనీ ఎందుకు పరిష్కరించడం లేదనికునాల్ కమ్రా.. ఓలా సీఈఓను అడిగారు. దీనిపై స్పందించిన భవిష్ అగర్వాల్, ఓలా పరువు తీసేందుకు కమ్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా భవిష్ అగర్వాల్ కూడా కమ్రాను ఒక సర్వీస్ సెంటర్లో ఒక రోజు పని చేయాలని కోరారు.ఇదీ చదవండి: ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనికి కమ్రా అంగీకరిస్తూ కొన్ని షరతులను కూడా వెల్లడించారు. కాగా ఇప్పుడు మళ్ళీ భవిష్ అగర్వాల్ చేసిన పోస్టుకు.. కామెంట్ చేశారు. దీనిపైనా నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.Service station ka footage dikhao… https://t.co/Zmp1Yzoh3i— Kunal Kamra (@kunalkamra88) October 31, 2024 -
దీపావళి వేడుకల్లో అపశ్రుతి..ఆస్పత్రికి క్యూ
-
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. బాణసంచా పేల్చడానికి 10 గంటల వరకే అనుమతి
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడంపై నిషేధం విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని.. ఎవరు నిబంధనలు అతిక్రమించినా హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయన్నారు.In view of maintaining public order, peace & tranquility in the limits of Cyberabad @CPCyberabad hereby notify for the information of the general public that Bursting of Fireworks/Crackers on Public roads & public places is strictly prohibited during the celebration of Deepavali. pic.twitter.com/miNJERiaOW— Cyberabad Police (@cyberabadpolice) October 31, 2024 -
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి.. పాక్కు వార్నింగ్
ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో గడిపే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ సారి కూడా కొనసాగించారు. సరిహద్దుల్లో గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు.. ‘‘కచ్వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘సర్ క్రిక్పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.’’ అని మోదీ అన్నారు.దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనూ కూడా రాజీపడలేని ప్రభుత్వం ఇప్పుడు ఉంది. దౌత్యం పేరుతో సర్ క్రీక్ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దానిని వ్యతిరేకించాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని చెప్పారు.2014 నుంచి ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్లోని హర్సిల్, 2019లో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, 2019లో రాజస్థాన్, 2019లో కాశ్మీర్లోని నౌషేరా, 2019లో నౌషేరా, 2022లో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్, 2023లో హిమాచల్లోని లెప్చాలో పర్యటించారు. Celebrating Diwali with our brave Jawans in Kutch, Gujarat.https://t.co/kr3dChLxKB— Narendra Modi (@narendramodi) October 31, 2024 -
బండిపై పేలిన టపాసులు.. ముక్కలు ముక్కలుగా
-
టపాసులపై దేవతల బొమ్మలు ఉంటే కాల్చొద్దు
-
సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్లో దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు షేర్ చేసిన సారా
-
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జగన్
-
సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..!
ప్రతి దీపకాంతి పసిడి వర్ణంలో వెలుగులు విరజిమ్ముతుంది. అయితే, కొన్ని దీపాల నుంచి వచ్చే పరిమళాలు మాత్రం విభిన్నంగా మదిని కట్టిపడేస్తున్నాయి. మట్టి ప్రమిదల్లో నూనెతో దీపాలను వెలిగించడంతోనే సంతృప్తి పడటం లేదు నేటితరం అందుకే, భిన్న ఆస్వాదనల వెలుగులను పరిచయం చేస్తున్నారు క్రియేటర్స్. ఈ దీపావళిని సుంగంధ భరితం చేస్తున్న వెలుగులు ఇవి..స్వీట్ ట్రీట్లను పోలి ఉండేలా నోరూరించే దియా డిజైన్ల శ్రేణి ఆన్లైన్ మార్కెట్లో సందడి చేస్తోంది. తియ్యని కప్ కేక్ల నుంచి ఐస్క్రీమ్ల వరకు ప్రతి కొవ్వొత్తి డిజైన్ అబ్బుర పరుస్తోంది. క్రీముతో కూడిన పంచదార పాకం సువాసనలను ఈ కొవ్వొత్తుల ద్వారా ఆస్వాదించవచ్చు. వీటి ధరలు కూడా వందల రూపాయల నుంచి వేలలో ఉన్నాయి. వీగన్ కాంతి..జంతు ఆధారిత ఉత్పత్తులు ఏవీ ఉపయోగించకుండా వీగన్ కొవ్వొత్తుల డిజైన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్వీట్ డిజర్ట్ క్యాండిల్స్లో కుకీస్, బ్లాక్బెర్రీ, డార్క్ చాకొలెట్, లెమన్ డిజర్ట్, స్ట్రాబెర్రీ డిజర్ట్ క్యాండిల్స్ చూపులకు, సువాసనలకు నోరూరిస్తున్నాయి కూడా.ఆకారానికో అందం..మనుషులు, జంతు ఆకారాలను పోలిన క్యాండిల్స్తోపాటు సెంటెడ్ మట్కీ దియా సెట్, టెర్రకోట క్యాండిల్ దియాస్, ఘీ బ్లెండెడ్ ఫిల్డ్ క్లే దియా, మిర్రర్ డెకొరేషన్ దియాస్, షాడో దియాస్, వాటర్ లైట్ దియాస్ లభిస్తున్నాయి. భిన్న ఆకృతిలో డిజైన్లలో కనిపిస్తున్న వెలుగులు ఈ దీపావళికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. (చదవండి: -
సెలబ్రిటీల దీపావళి ముచ్చట్లు.. భయం లేకపోవడమే వెలుగు..!
జీవితం వెలుగుతుంది. జీవితం వెలుతురు సందర్భాలను తీసుకొస్తుంది. జీవితం ఎప్పుడూ నిరాశ, నిçస్పృహలనే చీకట్ల మీదకు ఆశ, ఆవేశం అనే వెలుతురు కిరణాలు పంపుతూనే ఉంటుంది. చీకటి వెలుగుల ఈ రంగేళిని సరి సమంగా స్వీకరించి ముందుకు సాగమని చెబుతుంది దీపావళి. వెలుతురును వరస కట్టుకోమని పెద్ద పెద్ద చప్పుళ్లతో అరిచి చెప్పే పండుగ ఇది. ఈ సందర్భంగా సెలబ్రిటీల వెలుతురు ముచ్చట్లు...నా జీవితంలో వెలుగులు నింపిన సంఘటన నేను మిస్ ఇండియా కిరీటం గెలవడం. మా నాన్నగారు మాకు దూరమైన తర్వాత ఇది జరిగింది. నా కంటే ఎక్కువగా మా కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురైన క్షణాలు అవి. ఇలా మా జీవితాల్లో వెలుగులు నిండిన ఈ సమ యాన్ని నేను మర్చిపోలేను. నాన్నగారు ఆర్మీలో పని చేసేవారు. దీపావళి పండక్కి ఆయన ఇంటికి వచ్చేవారు. అందువల్ల ఇంట్లో పండగ సందడి భలేగా ఉండేది. ఫ్రెండ్స్, బంధువులు అందరూ వచ్చేవారు. ఆయన లేకపోయినా ఆ ఆనవాయితీని కొనసాగేలా చూస్తున్నాను. మా హర్యాణలో దీపావళికి గాలిపటాలు ఎగరేస్తాం. వీధుల్లో పిల్లల ఆటపాటలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అందరూ కలుస్తారు నియమంగా. ఇక షాపింగ్ చేయడం, నచ్చిన ఫుడ్ తినడం, దీపావళి వెలుగుల్లో సరదాగా గడపడం... ప్రతిసారి లాగే ఈసారి కూడా దీపాళికి ప్లాన్ చేశాను.ఇప్పుడే కాదు.. నా చిన్నప్పటి నుంచీ నేను క్రాకర్స్ కాల్చను. కానీ ఎవరైనా క్రాకర్స్ కాల్చుతుంటే దూరంగా నిల్చుని చూస్తూ ఆనందిస్తుంటాను. చీకటి, వెలుగులు ఉన్నట్లే... మన జీవితాల్లో కూడా ఎత్తుపల్లాలు, మంచి చెడులు ఉంటూనే ఉంటాయి. అయితే మనం కంట్రోల్ చేయలేని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది ముఖ్యం. మన బౌండరీస్పై మనకు ఓ అవగాహన ఉండాలి. ప్రతి విషయంలోనూ సానుకూలంగానే ఆలోచించాలి. ఇలా ఉండటం సులభమని నేను చెప్పడం లేదు. కానీ ఉండగలగాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా బాల్యంలో ప్రతి ఏడాది దీపాళికి మా అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్ళం. దాదాపు ఇరవైమంది కుటుంబ సభ్యులం కలిసి ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అందుకే దీపావళి అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నతనంలో క్రాకర్స్ కాల్చడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. మా తాతగారు దీపాళికి పెద్దస్థాయిలో లక్ష్మీపూజ ఘనంగా జరిపేవారు. అప్పట్లో క్రాకర్స్ కొనిచ్చేవారు. పిల్లలు క్రాకర్స్ బాక్స్లను కలిసి కాల్చేవారు. ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్ళు. బాగుండేది. కానీ పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని ఇప్పుడు కాల్చడం లేదు. అయితే ఒకసారి పండక్కు వెళ్లి కాలని లక్ష్మీబాంబులను ఏరుకుని, వాటిని విప్పి అందులోని పొడిని ఓ పేపర్లో ఉంచి, ఆ పేపర్ చివరన వెలిగించాను. నా అంతట నేనే ఓ లక్ష్మీబాంబును తయారు చేసుకుంటున్నానని ఫీలైపోయాను. కానీ దురదృష్టవశాత్తు నా రెండు వేళ్లు కాలిపోయాయి. మా అమ్మకు తెలిస్తే కోప్పడుతుందని తెలియకుండా దాచాను. కానీ అమ్మ గమనించి మందలించింది. ఈ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే పిల్లలందరికీ చెబుతున్నా... క్రాకర్స్ కాల్చేప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీరు కాల్చే క్రాకర్స్పై మీకు అవగాహన లేకపోతే దూరంగా ఉండండి. అత్యుత్సాహం చూపకండి. నేను సరదాగా చేసిన పిచ్చిపనిలాంటివి చేయకండి. కొన్ని కారణాల వల్ల గడిచిన రెండు సంవత్సరాలు నేను దీపాళిని మా అమ్మమ్మ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. అందుకే ఈ ఏడాది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇంటి వాతావరణంలో నేను పెరిగింది తక్కువ. బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. కాలేజీ కూడా అంతే. ఒంటరిగా ట్రావెల్ చేస్తుంటాను. సమాజంలో ఎలా మెలగాలో నాకు నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మీపై మీరు భరోసా ఉంచండి. ధైర్యంగా ఉండండి. నైతిక బాధ్యతతో ఉండండి. అప్పుడు క్లిష్టపరిస్థితులను నెగ్గుకు రావొచ్చు మీరు. నమ్మిన దానిపట్ల ధైర్యంగా నిలబడుతూ తలెత్తుకు జీవించండి. నా అనుభవాల నుంచి నేను నేర్చుకున్న సంగతులు ఇవి. భయం లేకపోవడమే వెలుగని నేను భావిస్తుంటాను. (చదవండి: మన ముంగిళ్లలో వెలుగు పూలు) -
దర్శన్కు దీపావళి!
సాక్షి, బళ్లారి, బనశంకరి: దీపావళి సంబరాల సమయంలో ప్రముఖ నటుడు దర్శన్కు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. ఆయనకు బెంగళూరులోని హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ సహా మరికొందరు నిందితులు 140 రోజుల నుంచి జైలులో ఉన్నారు. దర్శన్కు 6 వారాలు పాటు బెయిలు అమల్లో ఉంటుంది.కోర్టులో వాదనలు..తీవ్రమైన వెన్నునొప్పి సమస్యను చూపుతూ బెయిలు పిటిషన్ వేయగా కొన్నిరోజులుగా విచారణ సాగుతోంది. న్యాయమూర్తి విశ్వజిత్శెట్టి ధర్మాసనం చివరకు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. దర్శన్కు వెన్నులో ఎల్–5, ఎస్–1 డిస్క్లలో సమస్య ఉంది. మైసూరులో చికిత్స తీసుకోవాలని దర్శన్ న్యాయవాది నాగేశ్ వాదించారు. సర్కారు వకీలు ప్రసన్నకుమార్ బెయిలు ఇవ్వరాదని వాదించారు. కాలిలో శక్తి కోల్పోయినట్లు ఉందని, చికిత్స తీసుకోకపోతే మూత్ర నియంత్రణ కోల్పోవడంతో పాటు మునుముందు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రి నరాలరోగ నిపుణుడు విశ్వనాథ్ నివేదిక ఇచ్చారని నాగేశ్ తెలిపారు. దర్శన్ ఇప్పటికే రెండుసార్లు మైసూరు ప్రైవేటు ఆసుపత్రి శస్త్రచికిత్స చేసుకున్నారని చెప్పారు.జైలువద్దకు భార్యాపిల్లలుబెయిల్ లభించగానే దర్శన్ సతీమణి విజయలక్ష్మి, కుమారుడు, బంధువులు బళ్లారి సెంట్రల్ జైలుకు వచ్చారు. కోర్టు నుంచి పత్రాలు అందిన తరువాతే జైలు నుంచి దర్శన్ను విడుదల చేస్తారని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. జైలు వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు.తప్పుచేసిన వారికి శిక్షపడాలిరేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య హరిహరలో విలేకరులతో మాట్లాడుతూ కొడుకు హత్యతో చాలా బాధలో ఉన్నాము. కోడలు కాన్పు కోసం ఇక్కడ పుట్టింటికి వచ్చింది. కొడుకు పుట్టిన సంతోషం కూడా లేకుండా పోయింది. ఎవరు తప్పుచేసినా శిక్షపడాలనేది మా డిమాండ్. నిందితులకు శిక్ష పడేవరకు పోరాటం ఆపేది లేదని చెప్పారు. -
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్హౌజ్లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో) -
భయంకరంగా టపాసుల రేట్లు.. ఖాళీగా షాపులు
-
అయోధ్య దీపోత్సవం.. కన్నడ స్టార్ కు బిగ్ రిలీఫ్
-
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.‘‘చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలి. ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలి. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలి’’అలాగే.. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ దీపావళి మీ ఇంట మరిన్ని వెలుగులు నింపాలని, మీకు మరిన్ని విజయాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2024క్లిక్ చేయండి: పులివెందులలో.. జనంతో జగన్ -
500 ఏళ్ల తరువాత అయోధ్యలో వైభవంగా దీపావళి
-
పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్, సాక్షి: ఉద్యోగులకు జీహెచ్ఎంసీ దీపావళి శుభవార్త చెప్పంది. ఈరోజు సాయంత్రం వరకు జీతాలు విడుదల చేయనున్నట్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. జీహెచ్ఎంసీ రూ.120 కోట్ల నిధులను విడుదల చేయనుంది. అయితే.. జీహెచ్ఎంసీ గత నెల వారం రోజుల ఆలస్యంగా జీతాలు ఇచ్చింది. దసరాకు ఐదు రోజులు ఆలస్యంగా జీతాలు ఇవ్వడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రెండు రోజులు ముందుగానే జీహెచ్ఎంసీ జీతాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. -
దివి నుండి భువికి దీపావళి
దీపావళి తారాజువ్వ ఒకటి అంతరిక్షంలోకి దూసుకుని వెళ్లి, అక్కడున్న సునీతా విలియమ్స్ని ఎక్కించుకుని తిరిగి భూమి మీదకు చేరుకుంటే ఎంత బాగుంటుంది! వారంలో తిరిగొచ్చేందుకు వెళ్లి, అవాంతరం వల్ల అక్కడే చిక్కుకుపోయారు సునీత, ఆమె సహవ్యోమగామి విల్మోర్. వారిని స్పేస్లోకి మోసుకెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి, భూమి పైకి తిరిగొచ్చి కూడా రెండు నెలలు అవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో గానీ మరో కొత్త వ్యోమనౌకలో సునీత భూమి పైకి వచ్చే అవకాశాలు లేవు. సునీత ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ‘నాసా’కు సంకేతాలు అందుతున్నాయి. కానీ అవి సునీత పంపుతున్న సంకేతాలు కావు. నాసా అంచనాలు మాత్రమే. నిజానికి ఆమె ధైర్యంగా ఉన్నారు. భూమిపైకి సందేశాలు పంపుతున్నారు. సోమవారం వైట్హౌస్లో దీపావళి సంబరాలు జరుగుతున్నప్పుడు.. ‘‘అంతరిక్ష కేంద్ర నుండి మీ అందరికీ హ్యాపీ దీపావళి’ అంటూ వీడియోలో శుభాకాంక్షలు పంపారు! ఇది కదా ఈ ఏడాది అసలైన దీపావళి. భూమికి 260 మైళ్ల ఎత్తులో, నక్షత్రంలా మెరుస్తున్న మన సునీతను కళ్లారా చూడ్డం, ఆమె స్వరాన్ని చెవులారా వినటం.. ఇది కదా నిండైన దీపావళి.‘‘ఇంత ఎత్తు నుండి దీపావళిని జరుపుకునే అవకాశం నాకు మాత్రమే లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గొప్పతనం గురించి చిన్నప్పుడు నాన్న మాకు చెప్పేవారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన దీపావళి ఉత్సవాలలో పాల్గొన్నందుకు అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్కు సునీతా విలియమ్స్ కృతజ్ఞతలు’’ అని సునీత తన సందేశాన్ని వినిపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ధీరులు మాత్రమే ఇతరుల సంతోషాలలో పాల్పంచుకోగలరు. తమ కష్టాన్ని దాచి పెట్టి చిరునవ్వుల మతాబులను వెలిగించగలరు. -
రిలయన్స్ దీపావళి గిఫ్ట్ చూశారా?
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్లు ఇస్తూంటాయి. భారత్లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్బాక్స్ అన్బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్ను అన్బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్మిస్) ఉన్నాయి. View this post on Instagram A post shared by sumanasri😍 (@itlu_me_suma)ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది. -
పండుగ కళ వచ్చేసింది: పింక్ సారీలో నటి లయ
-
ఈ దేశాల్లోనూ దీపావళి సెలవులు
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు బంగారం, వెండి, కార్లు, పాత్రలు, కొత్త బట్టలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. అన్ని విద్యా సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలకు దీపావళి రోజున సెలవు ఉంటుంది.విదేశాల్లో దీపావళి వేడుకల విషయానికొస్తే నేపాల్, బాలి, సింగపూర్ సహా పలు దేశాల్లో దీపావళి సందడి కనిపిస్తుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తారు. అమెరికాలో అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు దీపావళి సందర్భంగా వైట్ హౌస్లో దీపం వెలిగిస్తారు. అమెరికాలోని పెన్సిల్వేనియా, న్యూయార్క్లలో దీపావళినాడు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.ఫిజీ: 1879 నుంచి ఫిజీలో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.మలేషియా: మలేషియాలో ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి కూడా చేరింది. మారిషస్: మారిషస్లో హిందువుల జనాభాను పరిగణనలోకి తీసుకుని దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఈ ద్వీపంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు.నేపాల్: నేపాల్లో దీపావళిని తిహార్ లేదా స్వాంతి అంటారు. అక్కడ ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు.శ్రీలంక: శ్రీలంకలో తమిళనాడు చెందినవారు దీపావళిని జరుపుకుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఇస్తారు.సింగపూర్: దీపావళి సందర్భంగా సింగపూర్లో ప్రభుత్వ సెలవుదినం. లిటిల్ ఇండియాలో దీపావళి నాడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగోలో కూడా దీపావళి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇస్తారు. ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
ఢిల్లీ.. 72 గంటలు డేంజర్
న్యూఢిల్లీ: రాబోయే 72 గంటలు దేశ రాజధాని ఢిల్లీకి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పొగమంచు కమ్ముకుంటోంది. వాయు నాణ్యత సూచిక ప్రతిరోజూ 300 దాటుతోంది. ఈరోజు (అక్టోబరు 29) ఉదయం ఏక్యూఐ 274గా నమోదయ్యింది. ఢిల్లీలో గాలి నాణ్యత రానున్న మూడు రోజుల్లో మరింత విషపూరితం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. #WATCH | Delhi: A thin layer of smog engulfs the National Capital as the air quality continues to deteriorate.(Visuals from India Gate) pic.twitter.com/XeCku3Hu1k— ANI (@ANI) October 29, 2024ఇప్పటి వరకు వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల వాయుకాలుష్యం పెరిగిందని, అయితే రానున్న రోజుల్లో పటాకులు పేల్చడం వల్ల వాయుకాలుష్యం పెరగనుందని చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం పటాకులను నిషేధించినప్పటికీ కాలుష్యం పెరిగే అవకాశాలున్నాయి. రాజధానిలో గ్రేప్-1, గ్రేప్-2 నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు.#WATCH | Delhi | AQI around Lodhi Road and surrounding areas recorded 255, categorised as 'Poor' according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/rYZboXTtYN— ANI (@ANI) October 29, 2024సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటాలోని వివరాల ప్రకారం సోమవారం ఆగ్నేయ గాలుల కారణంగా ఢిల్లీ కాలుష్య స్థాయి కాస్త మెరుగుపడింది. అయితే దీపావళి నాటికి ఢిల్లీలో రెట్టింపు కాలుష్యం ఏర్పడే అవకాశాలున్నాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 304 (చాలా పేలవంగా ఉంది). సాయంత్రం 6 గంటలకు 299గా ఉండగా, రాత్రి 10 గంటలకు 288కి చేరుకుంది. #WATCH | Delhi | AQI around ITO and surrounding areas recorded 261, categorised as 'Poor' according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/FvG2oZGgJB— ANI (@ANI) October 29, 2024ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
మనుమలకు టపాసులు కొనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ
నాగ్పూర్: దేశంలో దీపావళి సందడి నెలకొంది. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీపావళి షాపింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది.ఈ వీడియోలో నితిన్ గడ్కరి తన మనుమడు, మనుమరాలితో దీపావళి షాపింగ్ చేయడాన్ని చూడవచ్చు. గడ్కరీ ఒక బాణసంచా దుకాణంలో తన మనుమలకు బాణసంచా కొనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నితిన్ గడ్కరీ కార్యాలయం విడుదల చేసింది.ఇదిలావుండగా పాన్ మసాలా, గుట్కా తిని రోడ్డుపై ఉమ్మివేసే వారికి బుద్ధి చెప్పేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక వినూత్న ఆలోచన వెలిబుచ్చారు. అటువంటివారి ఫొటోలు తీసి పత్రికల్లో ప్రచురించాలని, అప్పుడే వారికి బుద్ధి వస్తుందన్నారు. దేశ ప్రజలు రోడ్లు మురికిగా మారకుండా కాపాడుకోవాలని మంత్రి సూచించారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
దీపావళి ఔట్ ఫిట్: రాశీఖన్నా రీగల్ లుక్ (ఫొటోలు)
-
ఏక్తా కపూర్ దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు
అయోధ్య: దీపావళి సందర్భంగా జరిగే దీపోత్సవ్ వేడుకలకు యూపీలోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్టోబర్ 30న జరిగే దీపోత్సవ్ కోసం రామనగరిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తివిశ్వాసాల కలబోతతో అయోధ్య వెలుగులమయం కానుంది.అయోధ్యలో జరిగే 8వ దీపోత్సవంలో అవధ్ యూనివర్సిటీకి చెందిన 30 వేల మంది వాలంటీర్లు దీపోత్సవ్ స్థలంలో 28 లక్షల దీపాలను అమర్చేందుకు కృషి చేస్తున్నారు. రామ్ కీ పైడిలోని 55 ఘాట్ల వద్ద జై శ్రీరామ్ నినాదాలతో వెలుగుల పండుగలో వాలంటీర్లు పాల్గొననున్నారు.శ్రీరాముడు కొలువైన అయోధ్య ఈ సంవత్సరం దీపోత్సవం సందర్భంగా డిజిటల్ సిటీగా కనిపించబోతోంది. వెలుగుల సంగమం ఆవిష్కృతం కానుంది. ధరంపథ్ నుండి లతా మంగేష్కర్ చౌక్ వరకు, రంగురంగుల లైట్లు ఆకర్షణీయంగా కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా లతా మంగేష్కర్ చౌక్ వెలుగు జిలుగులతో అత్యంత సుందరంగా కనిపించనుంది.దీపోత్సవ వేడుకలకు నగరమంతా త్రేతాయుగంలా ముస్తాబైంది. త్రేతాయుగంలో రాముడు లంకను జయించి అయోధ్యకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసేలా అయోధ్యను రంగురంగుల దీపాలతో అలంకరించారు.లతా మంగేష్కర్ చౌక్ నుండి వివిధ కూడళ్లలో రామభక్తుల కోసం డిజిటల్ డిస్ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రామభక్తులు దీపోత్సవ్ ప్రదేశానికి వెళ్లలేకపోయినా, డిజిటల్ తెరలపై దీపోత్సవాన్ని చూసి ఆస్వాదించవచ్చు.రంగురంగుల దీపాలు అయోధ్య అందాన్ని మరింత పెంచుతున్నాయి. రామభక్తులు రాత్రిపూట అయోధ్య వీధుల్లోకి వెళ్లినప్పుడు తమను తాము మైమరచిపోయేలా దీపోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.ఇది కూడా చదవండి: అత్యంత వృద్ధ మహిళ అస్తమయం -
కరెంట్ చార్జీల పెంచడమే దీపావళి కానుకా?.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
మల్టీ-అసెట్ ఫండ్స్తో దీపావళి కాంతులు
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా ఒక్క చోట చేరి సంతోషంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళి. సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీ దేవి పూజ ఈ వేడుకల్లో కీలకమైనది. లక్ష్మీదేవి కటాక్షం పొందాలన్నా, సంపదను సాధించాలన్నా మనం కూడా కష్టపడి పనిచేయాలి. తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. లక్ష్మీ దేవి పూజలో ఉపయోగించే దీపాలు, పూలు, నగదు మొదలైన వాటిని ఒకసారి పరిశీలిస్తే మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ప్రేరణనిచ్చే అంశాలెన్నింటినో తెలుసుకోవచ్చు. వివిధ పూజాద్రవ్యాల సమాహారంలాగా ఈక్విటీ, డెట్, గోల్డ్ మొదలైన వాటితో కూడు కున్న మల్టీ అసెట్ ఫండ్ అనేది మెరుగైన రాబడులను పొందడంలో ఇన్వెస్టర్లకు ఎంతగానో తోడ్పడుతుంది.దీపాలు: ఈక్విటీల కాంతులు చీకటిని పారద్రోలి, ఆశల కాంతులనిస్తాయి దీపాలు. మొత్తం పూజా కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించేలా వెలుగు పంచుతాయి. మల్టీ–అసెట్ ఫండ్ను పరిగణనలోకి తీసుకుంటే, ఈక్విటీ పెట్టుబడులు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. సాధారణంగా పోర్ట్ఫోలియోకు వృద్ధి చోదకాలుగా ఈక్విటీలు పనిచేస్తాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడతాయి. దీపాలు ఏ విధంగానైతే గదిని కాంతివంతం చేస్తాయో దీర్ఘకాలంలో అధిక రాబడులను అందించి వృద్ధి దిశగా సాగే బాటను ప్రకాశింపచేస్తాయి ఈక్విటీలు. మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా వీటితో కొన్ని రిస్కులు ఉన్నప్పటికీ సంపద సృష్టి విషయంలో వీటికున్న సామర్థ్యాల కారణంగా సమతుల్యమైన పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా చోటు కల్పించాల్సిన ఆర్థిక సాధనంగా ఈక్విటీలు ఉంటాయి. పుష్పాలు: డెట్ సాధనాల సౌరభాలు లక్ష్మీ పూజలో స్వచ్ఛత, అందానికి చిహ్నమైన పుష్పాలు కూడా కీలకమే. పరిమళాలు వెదజల్లే పుష్పాలు పూజా కార్యక్రమానికి ఒకవైపు రంగుల హంగులను జోడిస్తూ మరోవైపు ఆధ్యాత్మిక శోభను తెస్తాయి. మల్టీ అసెట్ ఫండ్లో బాండ్లు, డిబెంచర్లు, గవర్నమెంట్ సెక్యూరిటీల్లాంటి డెట్ సాధనాలు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. మల్టీ అసెట్ ఫండ్లో డెట్ సాధనాలు స్థిరత్వాన్ని, క్రమానుగత ఆదాయాన్ని అందిస్తాయి. ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనైనా పోర్ట్ఫోలియో తీవ్ర ఒడిదుడుకులకు లోను కాకుండా సమతూకంగా ఉండేలా డెట్ సాధనాలు కాస్త బఫర్గా పనిచేస్తాయి. ఇవి మరో అంచె భద్రతను కల్పిస్తాయి. మార్కెట్ అనిశ్చితిని అధిగమించే ధీమాను అందిస్తాయి. తిలకం: రక్షణ కవచం నుదుటిపైన బొట్టు/తిలకం శుభాన్ని, రక్షణను సూచిస్తుంది. ప్రతికూల శక్తుల నుంచి భక్తులకు ఇది రక్షణ కల్పిస్తుంది. మల్టీ–అసెట్ ఫండ్లో ఈ పాత్రను పసిడి పోషిస్తుంది. సాధారణంగా ద్రవ్యోల్బణం, మార్కెట్ పతనాలకు హెడ్జింగ్గా ఉపయోగపడే సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. రక్షణ కల్పించే తిలకంలాగే బంగారం కూడా ఆర్థిక సంక్షోభాల సమయంలో మీ పోర్ట్ఫోలియోను సురక్షితంగా ఉంచుతుంది. తమ సంపదను కాపాడుకోవాలనుకునే ఇన్వెస్టర్లు .. కాలం గడిచినా విలువను కోల్పోని బంగారాన్ని తమ పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా చేర్చుకోతగిన సాధనం కాగలదు. ఇటీవలి కాలంలో చూస్తే బంగారం కూడా గణనీయంగా రాబడులు అందించింది. వివిధ అంశాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో పసిడికి డిమాండ్ మరింతగా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. నాణేలు/డబ్బు: నగదు తత్సమానాలు నాణేలు, నోట్ల రూపంలో సంపద, సమృద్ధి, శ్రేయస్సు, ఆర్థిక సమృద్ధిని సూచించే నగదుకు కూడా లక్ష్మీ పూజలో ప్రాధాన్యం ఉంటుంది. లక్ష్మీ దేవి ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని, ఆశీర్వదిస్తుందని నమ్మకం. ఇన్వెస్టింగ్ ప్రపంచంలో టీఆర్ఈపీఎస్ (ట్రెజరీ బిల్స్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్), ట్రెజరీ బిల్లుల్లాంటివి నగదు తత్సమానమైనవి. ఇవి పోర్ట్ఫోలియోలో అంతర్గతంగా భద్రతా కవచంగా ఉపయోగపడతాయి. మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పుడు స్థిరత్వాన్ని ఇస్తాయి. వివిధ పూజాద్రవ్యాలతో లక్ష్మీ పూజ ఎలాగైతే సంపూర్ణమవుతుందో వివిధ సాధనాలను తగు పాళ్లలో జోడించుకుంటే పోర్ట్ఫోలియో కూడా సంపూర్ణంగా, సమతూకంగా ఉంటుంది. ఈక్విటీ, డెట్, బంగారం, నగదు మేళవింపుగా ఉండే మల్టీ అసెట్ ఫండ్స్ అటువంటి ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు కల్పిస్తాయి. -
వ్యాపారం.. వెలగని భూచక్రం
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి నెట్వర్క్: దీపావళి పర్వదినం సమీపిస్తోంది. ఈ పండుగ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది టపాసులే. కానీ.. ఈ ఏడాది బాణసంచా మార్కెట్లో పండుగ సందడి అసలు కనిపించడం లేదు. ఏటా ఈ సమయానికి హోల్సేల్ మార్కెట్లో 90 శాతం టపాసులు అమ్ముడయ్యేవి. దీపావళికి మూడు రోజులే సమయం ఉండగా.. కనీసం 25 శాతం బాణసంచా కూడా అమ్ముడుపోలేదని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడ నగరంలో ఐదుగురు హోల్సేల్ వ్యాపారులు అనేక దశాబ్దాలుగా టపాసుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరినుంచి 150 మంది రిటైల్ వ్యాపారులు బాణసంచా కొనుగోలు చేస్తారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి మూడు, నాలుగు రోజులపాటు విక్రయాలు జరుపుతుంటారు. కానీ.. ఈ ఏడాది రిటైలర్లు హోల్సేలర్ల వద్ద బాణసంచా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.దీపావళిని కమ్మేసిన వరద, భారీ వర్షాలుసెప్టెంబర్ మొదటి వారంలో ఎన్టీఆర్ జిల్లాను బుడమేరు వరద ముంచెత్తింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి పలు ప్రాంతాల్లో వరద చేరింది. లక్షలాది మంది ముంపునకు గురై ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంట్లో రూ.లక్షల మేర నష్టం వాటిల్లింది. బాధితుల్లో అత్యధికులు ప్రభుత్వ సాయం అందక లబోదిబోమంటున్నారు. వరద ప్రభావం బాణాసంచా విక్రయాలపై తీవ్రంగా పడిందని, అందువల్లే హోల్సేల్ వ్యాపారానికి గండిపడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో..భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజల ఆర్థిక పరిస్థితులను దిగజార్చాయి. ఈ ప్రభావం బాణాసంచా విక్రయాలపై అధికంగా కనిపిస్తోంది. వంటనూనె, ఇతర నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకే ప్రజల దగ్గర డబ్బులు లేవని.. ఈ పరిస్థితుల్లో బాణసంచా కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.సంక్షేమం లేదు.. సంక్షోభమేగత ప్రభుత్వ హయాంలో తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెన, రైతుభరోసా వంటి పథకాల ద్వారా ఎన్నో కుటుంబాలకు సాయం అందేది. కూటమి ప్రభుత్వం రాకతో సంక్షేమ పథకాల సాయం అందటం లేదు. మరోవైపు ఖర్చులు భారీగా పెరిగిపోవడం పండుగపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ టపాసుల కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయని, ఈ ఏడాది సరైన వ్యాపారమే జరగలేదని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఏటా దసరా నుంచి మొదలై.. ఈ సమయానికి 90%వ్యాపారం పూర్తయ్యేదని.. ఈ ఏడాది దానికి భిన్నమైన పరిస్థితులు వల్ల 75% అమ్మకాలు తగ్గాయని వ్యాపార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.విక్రయాలు భారీగా తగ్గాయిఈ ఏడాది బాణాసంచా విక్రయాలు భారీగా తగ్గాయి. వర్షాలు, వరదలు దీపావళి సీజన్పై తీవ్ర ప్రభావం చూపాయి. ఏటా దీపావళికి నెల ముందే బాణసంచా తీసుకెళ్లే రిటైల్ వ్యాపారులు ఈ ఏడాది కొనుగోళ్లకు ముందుకు రాలేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు కొనుగోలుదారులపై ప్రభావం చూపుతున్నాయి. పండుగకు ముందు జరిగే వ్యాపారంలో 50 శాతం కూడా జరగలేదు. – గర్రె బాబూరావు, బాణసంచా వ్యాపారి, చిలకలూరిపేటఎక్కడా కనిపించట్లేదుఈసారి దీపావళికి టపాసులు పేలేలా కనిపించడం లేదు. టపాసుల విక్రయాలు ఎక్కడా జరగటం లేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏటా ముందుగానే టపాసులు కొనేవారు. ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. షాపులు నెలకొల్పేందుకు కూడా వ్యాపారులు ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. – ఎస్.రాజారావు, బైరివానిపేట, శ్రీకాకుళం జిల్లా -
సువర్ణ వాకిలి
‘చూశావా... ఏం తెచ్చానో’ అన్నాడతను స్కూటర్ ఇంటి ముందు ఆపి. వెనుక ట్రాలీ వచ్చి ఆగింది. అన్నీ మొక్కలే. నర్సరీ నుంచి తాజాగా దిగినవి. ‘అడిగావుగా... మల్లెతీగ తెచ్చాను’... ‘ఇదిగో... నీకు ఇష్టమైన బంతి. కుండీలోనే ఎన్ని పూసేసిందో చూడు’... ‘చిట్టి రోజాలు... రెక్క చామంతులు... ఈ మందారం కొమ్మలేసేంతగా పెరిగితే చాలా బాగుంటుంది’... వరుసగా చూపుతున్నాడు. ఎన్నాళ్లుగానో అడుగుతోంది. ఇవాళ ఉదయాన్నే లేచి, చెప్పా పెట్టకుండా వెళ్లి తెచ్చాడు. సంతోషంగా, సంబరంగా, ప్రేమగా చూస్తోంది వాటన్నింటిని! ‘నన్నూ తీసుకెళ్లుంటే బాగుండేదిగా’... ‘ఇంట్లోకి మొక్కలు వస్తున్నప్పుడు నువ్వు ఎదురు రావాలనీ’... ఆమె చేతిలో చాలా పూలున్న చిన్న కుండీని పెట్టి సెల్ఫీ దిగాడు. ఇద్దరూ హాయిగా నవ్వారు ఫొటోలో. ‘దీని పేరు బెగోనియా అట. బాగుంది కదూ’...మరోచోట మరో ఇంటతను రెండు రోజులుగా ఇల్లు సర్దుతున్నాడు. భార్యను పిలిచి ‘అనవసరమైన సామాను చాలా పేర్చిపెట్టావు చూడు’ అని బుజ్జగించి పారవేయించాడు. మాసిన కర్టెన్లు తీసి, ఉతికిన కర్టెన్లు మార్చాడు. దుమ్ము పట్టిన లైట్లను తుడిచాడు. అన్నీ చక్కగా అమర్చి హాల్లో రెండు ర్యాకులను ఖాళీగా సంపాదించగలిగాడు. ‘ఇప్పుడు ఏం చేద్దామని ఈ ర్యాకులను’ అందామె. ‘చెప్తా’ అని సాయంత్రం పిల్లల్ని తీసుకొని ఆటో ఎక్కి పుస్తకాల షాపుకు చేరాడు. ‘పిల్లలూ... ఒక ర్యాకుకు సరిపడా పుస్తకాలు మీరు కొనుక్కోండి. ఒక ర్యాకుకు సరిపడా మేము కొనుక్కుంటాం’.... పెళ్లికి ముందు వారిద్దరూ పుస్తకాలు చదివేవారు. సంసారంలో పడి వదిలేశారు. ‘ఇష్టమైన అలవాటు. తిరిగి మొదలెడదాం’ అన్నాడు భార్యతో. అప్పటికే ఆమె పుస్తకాలు ఎంచి ఒకవైపు పెట్టేస్తోందిగా!ఇంకో నగరం. ఉదయపు ఎండ ఎక్కువగా లేదు. అలాగని తక్కువగా లేదు. మంచి గాలి వీస్తున్నందు వల్ల బాల్కనీలో ఎదురూ బొదురూ సమయం ఆహ్లాదంగా ఉంది. ‘నీ ఫోను ఇవ్వు’ అన్నాడామెతో భర్త. తీసుకుని స్విగ్గి, జొమాటో లాంటి యాప్స్ డిలీట్ చేశాడు. తన ఫోన్ ఆమెకు ఇచ్చాడు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్ తీసెయ్’ అన్నాడు. తీసేసింది. ‘ఇవాళ్టి నుంచి బయటి తిండి వద్దు. ఈ ఇంట్లోకి ఏది వచ్చినా ఇకపై హెల్దీదే వస్తుంది. నేను వారంలో మూడు బ్రేక్ఫాస్ట్లు, కనీసం రెండు డిన్నర్లు నువ్వు కిచెన్ లోకి రానవసరం లేకుండా చేయగలను. మిగిలింది నువ్వు చేయి. అసలు పొయ్యి ఎక్కవలసిన అవసరం లేని మంచి తిండి కూడా పిల్లలతో కూచుని డిజైన్ చేద్దాం. ఫేస్బుక్, యూట్యూబ్లకు వెచ్చించే సమయం మన ఉదరం కోసం వెచ్చిస్తే తెలిసి తెలిసీ ద్రోహం చేసుకోని వాళ్లం అవుతాం. మన తాత ముత్తాతలు వండుకోవడానికి తిండిలేక ఏడ్చేవాళ్లు. మనకు అన్నీ ఉన్నా వండుకోవడానికి ఏడిస్తే ఎలా? పరుగు పెట్టి సంపాదించి పట్టెడు మెతుకులు తినలేని స్థితికి చేరితే సంతోషమా మనకు?’అబ్బో! ఆ ఇంటిలో సందడి వేరేగా ఉంది. కోడలు మాటిమాటికీ ఊరికి ఫోన్లు మాట్లాడుతూ ఉంది. టికెట్ల ఏర్పాటు చూస్తూ ఉంది. అంత వరకూ ఖాళీగా ఉన్న మూడో బెడ్రూమును సిద్ధం చేస్తూ ఉంది. కొడుకు ఉద్వేగంగా ఉన్నాడు. కలా నిజమా తేల్చుకోలేక ఉన్నాడు. సాకులు వెతుక్కున్నారు తనూ తన భార్య. లేనిపోని తప్పులు వెతికారు తనూ తన భార్య. మా జోలికి రావద్దని తేల్చి చెప్పారు ఇద్దరూ కలిసి. బాగానే ఉంది. హాయిగా ఉంది. కాని బాగానే ఉందా... హాయిగా ఉందా... తల్లితండ్రులు అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతున్న ఈ ఇల్లు. వారి ఆశీర్వాదం తాకని ఇల్లు. వారి మాటలు వినపడని, వారి గదమాయింపులూ ఆత్మీయ హెచ్చరికలూ లేని ఇల్లు. పశ్చాత్తాపం పిల్లలకు మరో పుట్టుక ఇస్తుంది. ఈ పుట్టుక తల్లితండ్రులను కోరింది. మనవలు వెళ్లి రిసీవ్ చేసుకొని తీసుకువస్తే కొడుకూ కోడల్ని కన్నీటి కళ్లతో చూస్తూ లోపలికి అడుగు పెట్టారు తల్లితండ్రులు. విశేషం చూడండి. ఆ రోజు ‘ధన్ తేరస్’.సాధారణంగా ధన్ తేరస్కి ఇంటికి బంగారం వస్తే మంచిది అనంటారు. కాని పై నాలుగు ఇళ్లలో బంగారం వంటి నిర్ణయాలు జరిగాయి. సిసలైన ‘ధన్ తేరస్’ అదే కావచ్చు.ధనం వల్ల ధన్యత రాదు. ధన్యత నొసగే జీవితం గడపడమే నిజమైన ధనం కలిగి ఉండటం. గాలినిచ్చే మంచి చెట్టు, పుష్టినిచ్చే తాజా ఆహారం, కష్టసుఖాలు పంచుకునే నిజమైన మిత్రులు, బుద్ధీ వికాసాలు కలిగించి ఈర్షా్య వైషమ్యం పోగొట్టే పుస్తకాలు, సదా అమ్మా నాన్నల సాంగత్యం, కుటుంబ సభ్యులంతా కలిసి భోం చేయగల సమయాలు, కనీస వ్యాయామం... ఇవి ఏ ఇంట ప్రతిరోజూ ఉంటాయో, అడుగు పెడతాయో, అంటిపెట్టుకుని ఉన్నాయన్న భరోసా కల్పిస్తాయో ఆ ఇల్లు సదా సమృద్ధితో అలరారుతుంది. అక్కడ అనివార్యంగా సంపద పోగవుతుంది. ఉత్తమమైన లోహం బంగారం. అది ఉత్తమమైన నివాసాన్నే ఎంచుకుంటుంది. శీతగాలులు ముమ్మరమయ్యే ముందు ఉల్లాస, ఉత్సాహాల కోసం దీపావళి. పనికి మనసొప్పని ఈ మందకొడి రోజులలో జీవనోపాధి దొరకకపోతే గనక జరుగుబాటుకు దాచిన ధన్తేరస్ పసిడి. పెద్దలు ఏం చేసినా ఆచితూచి, ఆలోచించి చేస్తారు. ధన్తేరస్కు తప్పక బంగారం, వెండి, వస్తువులు కొనదలుచుకుంటే కొనండి. కాని ప్రతి ఇల్లూ ఒక సువర్ణ వాకిలి కావాలంటే మాత్రం అహం, అసూయ, అజ్ఞానాలను చిమ్మి బయట పారబోయండి! ‘వాడికేం... బంగారంలా బతికాడు’ అంటారు. అలా బతికి అనిపించుకోండి! ధన త్రయోదశి శుభాకాంక్షలు. ప్రతి ఇంటా వికసిత కాంతులు కురియుగాక! -
దివాళీ బాష్లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
క్రెడిట్ కార్డులపై దీపావళి ఆఫర్లు
దేశీయ కన్స్యూమర్ క్రెడిట్ మార్కెట్ప్లేస్ పైసాబజార్ పలు క్రెడిట్ కార్డ్లపై ప్రత్యేక పండుగ ఆఫర్లను వెల్లడించింది. పైసాబజార్ ద్వారా కొత్త క్రెడిట్ కార్డ్లను తీసుకునేవారికి గిఫ్ట్ కార్డ్లను అందిస్తోంది.నిర్దిష్ట అమెరికన్ ఎక్స్ప్రెస్, హెచ్ఎస్బీసీ కార్డ్ల కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లు రూ.1,500 విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని అందుకుంటారు. హచ్ఎస్బీసీ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్లాటినం ట్రావెల్ క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ మెంబర్షిప్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్, హెచ్ఎస్బీసీ లైవ్+ క్రెడిట్ కార్డ్ వంటివి వాటిలో ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ బిజినెస్ రెగాలియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డ్, మర్రియోట్ బన్వాయ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్, అట్లాస్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ వంటివాటిపై పైసాబజార్ అదనంగా రూ. 1,000 అమెజాన్ గిఫ్ట్ కార్డ్ను అందిస్తోంది.అమెజాన్లో వివిధ రకాల కొనుగోళ్ల కోసం ఉపయోగించగల ఈ వోచర్లను క్రెడిట్ కార్డ్లు యాక్టివేట్ అయినప్పుడు అందుకోవచ్చు.పైసాబజార్ ప్రకారం.. ఈ ఆఫర్లు పండుగ సీజన్లో కొద్దికాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. పైసాబజార్ ప్రస్తుతం పదికిపైగా బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా 60కిపైగా క్రెడిట్ కార్డులను అందిస్తోంది. -
దీపావళి టపాసులు.. వివిధ రాష్ట్రాల నిబంధనలివే..
న్యూఢిల్లీ: చలికాలం సమీపిస్తున్న కొద్దీ దేశంలోని పలు నగరాల్లో గాలి విషపూరితంగా మారుతుంటుంది. ఇదే కాకుండా దీపావళి సందర్భంగా పటాకులు కాల్చినప్పుడు వాయు కాలుష్యం మరింత విజృంభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాలు పటాకులు కాల్పడంపై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో కేవలం రెండు గంటలపాటు మాత్రమే టపాసులు వెలిగించేందుకు అనుమతినిచ్చారు.ఢిల్లీఢిల్లీ- ఎన్సీఆర్లలో అక్టోబరు 31న అంటే దీపావళి నాడు సాయంత్రం 8 నుంచి 10 గంటల మధ్యలో మాత్రమే గ్రీన్ టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.మహారాష్ట్రమహారాష్ట్ర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సూచనల మేరకు మహారాష్ట్రలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. అయితే గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఉంది. గ్రీన్ క్రాకర్స్ సాధారణ క్రాకర్స్ కంటే 30శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా తయారు చేస్తారు.పశ్చిమ బెంగాల్పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో దీపావళి సందర్భంగా కాలుష్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ కారణంగా గత కొన్నేళ్లుగా ఇక్కడ సాధారణ పటాకులు పేల్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే కోల్కతాలో గ్రీన్ క్రాకర్లు కాల్చవచ్చు. కోల్కతాలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి అనుమతి ఉంది.పంజాబ్పంజాబ్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. పంజాబ్లో దీపావళి రోజున (అక్టోబర్ 31) ఉదయం 4 నుండి 5 గంటల వరకు, రాత్రి 9 నుండి 10 గంటల వరకు టపాసులు కాల్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.బీహార్ పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో బాణాసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని పాట్నా, ముజఫర్పూర్, హాజీపూర్, గయలో ఈ ఏడాది బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదు. ఈ నగరాల్లో పటాకుల అమ్మకానికి లైసెన్స్ కూడా ఇవ్వలేదు. ఎవరైనా రహస్యంగా పటాకులు విక్రయిస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.హర్యానాదీపావళి నాడు హర్యానాలో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలంటూ ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. దీపావళి నాడు రాత్రి 8 నుండి 10 గంటల వరకు, క్రిస్మస్ రోజున 11.55 నుండి 12.30 గంటల వరకు గ్రీన్ క్రాకర్లు కాల్చేందుకు అనుమతినిచ్చారు.తమిళనాడుతమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి దీపావళి రోజున పటాకులు కాల్చేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. తమిళనాడులో దీపావళి రోజున ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు పటాకులు కాల్చేందుకు ప్రభుత్వం సమయం నిర్ణయించింది.ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు -
అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే..
దీపావళి వేడుకలను భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గురువారం(అక్టోబర్ 31) ఘనంగా చేసుకోనున్నారు. దీపావళి కోసం షాపింగ్ చేయడంతో సహా అన్ని సన్నాహాలు చాలా ముందుగానే ప్రారంభిస్తారు.దీపావళినాడు లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. అయితే మన దేశంలో దీపావళి జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆ ప్రదేశాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగను దక్షిణ రాష్ట్రమైన కేరళలో జరుపుకోరు. కేరళలో కొచ్చిలో మాత్రమే దీపావళి జరుపుకుంటారు. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి అనేక కారణాలున్నాయి.మహాబలి అనే రాక్షసుడు కేరళను పరిపాలించేవాడు. అతన్ని ఇక్కడి ప్రజలు పూజిస్తారు. దీపావళి ఒక రాక్షసుని ఓటమిని గుర్తు చేస్తూ చేసుకునే పండుగ కావడంతో దీనిని ఇక్కడి ప్రజలు జరుపుకోరు. రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి చేసుకుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి రెండవ కారణం అక్కడ హిందువుల సంఖ్య తక్కువగా ఉండటం. అందుకే రాష్ట్రంలో దీపావళి సందడి కనిపించదు. కేరళతో పాటు తమిళనాడులో కూడా దీపావళి జరుపుకోరు. అక్కడ ప్రజలు నరక చతుర్దర్శిని వేడుకగా జరుపుకుంటారు. ఇది కూడా చదవండి: ‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’ -
బంగారంపై పండుగ ఆఫర్లు
బంగారం అంటే అందరికీ మక్కువే ముఖ్యంగా మహిళలు అమితంగా ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం పసిడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అయినా పండుగ వేళ రవ్వంత బంగారమైనా కొనుగోలుచేయాలని ఆశపడతారు. ఈ నేపథ్యంలో దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా వివిధ జువెలరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ ఆఫర్లు హైదరాబాద్: దీపావళి సందర్భంగా జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు రూ.60 వేల కొనుగోలుపై బంగారు ఆభరణాలకు ఉచితంగా వెండి, వజ్రాల కొనుగోలుపై ఒక బంగారు నాణేన్ని ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై 20% తగ్గింపు, ప్లాటినం ఆభరణాలపై 7% తగ్గింపు అందిస్తుంది. పాత బంగారాన్ని హెచ్యూఐడీ హాల్మార్క్ బంగారు ఆభరణాలతో మార్పిడి చేసుకునే సదుపాయం ఉంది.దీపావళి బహుమతిగా ఒక కారు ఈ ఆఫర్లో భాగంగా ఉంటుంది. ధన త్రయోదశి కోసం ముందస్తు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ‘ఆహా దీపావళి’ ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్ జోస్ ఆలుక్కా కోరారు.తనిష్క్ పండుగ ఆఫర్లు ముంబై: ఆభరణాల సంస్థ తనిష్క్ పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు బంగారు ఆభరణాలు, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 20% వరకు తగ్గింపు పొందవచ్చు. పాత బంగారు విలువకు సమానమైన బంగారు ఆభరణాలకు ఎలాంటి చెల్లింపు లేకుండా ఉచితంగా పొందవచ్చు. ఈ నవంబర్ 3 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని ఆఫర్ల కోసం తనిష్క్ షోరూం లేదా, అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
జియో దీపావళి ఆఫర్స్: రూ.3,350 విలువైన బెనిఫిట్స్
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో 'దీపావళి ధమాకా' పేరుతో కొత్త ఆఫర్స్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ ఈ వినియోగదారుల కోసం ఈ ఆఫర్స్ తీసుకువచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..రిలయన్స్ జియో ప్రకటించిన ఈ ఆఫర్స్ ద్వారా సుమారు రూ. 3,350 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. నవంబర్ 5లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ బెనిఫీట్స్ లభిస్తాయి. రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ.899 రీఛార్జ్ ప్లాన్ మీద, రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ మీద అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.రూ.899 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్స్ 90 రోజుల వరకు అన్లిమిటెడ్ 5జీ సేవలను పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. రూ. 3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ (365 రోజులు) ద్వారా రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు.ప్రయోజనాలుఈజీ మై ట్రిప్ వోచర్: రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 3,000 విలువైన ఈజీ మై ట్రిప్ వోచర్ పొందవచ్చు. దీనిని విమాన ప్రయాణాలను, హోటల్ బుకింగ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.అజియో కూపన్: రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్ళపైన రూ. 200 అజియో డిస్కౌంట్ లభిస్తుంది.స్విగ్గీ వోచర్: ఫుడ్ డెలివరీ కోసం రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్ లభిస్తుంది.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంకూపన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..రిలయన్స్ జియా దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా పొందిన కూపన్లను మై జియో యాప్ సాయంతో క్లెయిమ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.➜మై జియో యాప్ ఓపెన్ చేసి ఆఫర్స్ విభాగంలోకి వెళ్ళాలి➜అక్కడ కనిపించే మై విన్నింగ్స్ మీద క్లిక్ చేసి కూపన్ ఎంచుకోవాలి➜కూపన్ కోడ్ కాపీ చేసి.. ఎక్కడ ఉపయోగించాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్కు వెళ్లి కూపన్ కోడ్ అప్లై చేసుకోవచ్చు. -
స్వీట్ క్రాకర్స్.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ
ఈ ఫొటోలో ఉన్నవి ఏంటో చెప్పండి చూద్దాం.. చాలా కాన్ఫిడెంట్గా టపాసులు అనుకుంటున్నారు కదా! అయితే మీరు..తప్పులో కాలేసినట్లే..! అవి టపాసుల్లాంటి టపాసులు..కానీ టపాసులు కాదు.. ఎందుకంటే ఈ పటాసులతో పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు.. పొగ రాదు. నిప్పు రవ్వలు అసలే ఎగసి పడవు. మరి అవన్నీ రాకపోతే అవి పటాసులు ఎందుకు అవుతాయి? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును అక్కడికే వస్తున్నాం.. మీకొచ్చిన డౌటనుమానం కరెక్టే. ఎందుకంటే అవి నిజమైన టపాసులు కావు. అవి చాక్లెట్స్.. అరరే.. చూస్తే టపాసుల్లా భలే ముద్దుగా ఉన్నాయే అనుకుంటున్నారా..? స్వీట్స్ను టపాసుల్లాగా చేయాలన్న ఆలోచనతో ఇలా వినూత్నంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు వీటిని తయారు చేస్తున్నారు. దీపావళి సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. స్వీట్లు, టపాసులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. స్నేహితులు, బంధువులకు స్వీట్లు పంచుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెప్పుకొంటుంటారు. టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ రెండింటినీ మిళితం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు గజ్జల హరితారెడ్డి, లిఖితారెడ్డి. ఇద్దరు అక్కా చెల్లెళ్లూ అనుకున్నదే తడవుగా ఇలా టపాసులను తయారు చేశారు. అదేనండీ టపాసుల్లాంటి చాక్లెట్లు.కాస్త భిన్నంగా ఉండాలని.. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వీరిద్దరూ ప్రిపరేషన్ సమయంలో వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు ఇలా ఇంట్లోనే చాక్లెట్లు తయారుచేయడం అలవాటుగా మార్చుకున్నారు. అలా అలా.. వీరు చేస్తున్న చాక్లెట్లు, కుకీలకు మంచి ప్రశంసలు వస్తుండటంతో డీమెల్ట్ పేరుతో చిన్నపాటి క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దీపావళికి ఏదైనా వినూత్నంగా తయారుచేయాలని ఆలోచించగా.. ఈ ఐడియా వచి్చందని, ఈ స్వీట్స్ చూసి ముందు టపాసులు అనుకుంటున్నారని, అసలు విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని హరితారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తోంది. -
దీపావళి ఆఫర్: కొత్త కారు కొనడానికే ఇదే మంచి సమయం!
అసలే పండుగ సీజన్.. కొత్త కారు కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఇందులో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ రూ.10 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.కార్లు, వాటిపై లభించే డిస్కౌంట్స్ఆడి క్యూ3: రూ. 5 లక్షలుమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: రూ. 5 లక్షలుఆడి క్యూ5: రూ. 5.5 లక్షలుబీఎండబ్ల్యూ ఐ4: రూ. 8 లక్షలుమెర్సిడెస్ బెంజ్ సీ200: రూ. 9 లక్షలుఆడి క్యూ8 ఈ ట్రాన్: రూ. 10 లక్షలుఆడి ఏ6: రూ. 10 లక్షలుబీఎండబ్ల్యూ ఎక్స్5: రూ. 10 లక్షలుకియా ఈవీ6 ఆల్ వీల్ డ్రైవ్: రూ. 12 లక్షలుకార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. రూ. 358 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్ను ప్రకటించింది. దీపావళి బోనస్ కానుకగా రూ. 358 కోట్లు విడుదల చేసింది. గతేడాది కన్నా ఇది రూ.50 కోట్లు అధికం. ఒక్కో కార్మికునికి రూ. 93,750 జమకానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి కార్మికుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కానున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -
ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు
న్యూఢిల్లీ: దీపావళిని 'దీపాల పండుగ' అని కూడా అంటారు. దీపావళి నాడు దేశంలోని ప్రతి ఇంటా దీపాలు వెలిగిస్తారు. బాణసంచా కాలుస్తారు. ఇరుగుపొరుగువారికి స్వీట్లు పంచుతారు. దీపావళిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నప్పటికీ, కొన్ని నగరాల్లో జరిగే దీపావళి వేడుకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అటువంటి ఐదు నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అయోధ్య (ఉత్తరప్రదేశ్)శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య దీపావళి ప్రత్యేక వేడుకలకు కేంద్రంగా మారింది. ఇక్కడ దీపోత్సవ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు. సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగిస్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ప్రేక్షకులను ఇవి మంత్ర ముగ్ధులను చేస్తాయి.వారణాసి (ఉత్తరప్రదేశ్)వారణాసిలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షల దీపాలతో అలంకృతమైన గంగా ఘాట్లపై హారతి నిర్వహిస్తారు. వారణాసిలోని అన్ని ఘాట్లు, దేవాలయాలు కాంతులతో నిండిపోతాయి. బాణాసంచా వెలుగులు అందరినీ అలరింపజేస్తాయి.కోల్కతా (పశ్చిమ బెంగాల్)కోల్కతాలో దీపావళితో పాటు కాళీ పూజలను కూడా నిర్వహిస్తారు. కాళీ పూజల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పందిళ్లను వేస్తారు. వీధులు, ఇళ్లు, దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. కోల్కతాలో జరిగే దీపావళి వేడుకల్లో ఆధ్యాత్మికత కూడా కనిపిస్తుంది.గోవాగోవాలో దీపావళిని ప్రత్యేక శైలిలో జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని నరకాసురుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇందు కోసం ముందుగా భారీ దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. వీటిని దీపావళి రాత్రి వేళ దహనం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో సాంప్రదాయ సంగీతం, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బాణసంచా వెలిగిస్తారు.ముంబై (మహారాష్ట్ర)ముంబైలో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మెరైన్ డ్రైవ్లో దీపాల వెలుగులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆకాశంలోకి పేలుతున్న పటాకులు చూపరుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ముంబైలో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా దీపావళి వేడుకలు జరగడం విశేషం. ఇది కూడా చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం! -
దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు?
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ చీకటి నుండి వెలుగులోకి మారే పయనాన్ని సూచిస్తుంది. దీపావళి సందర్భంగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. అయితే ఈసారి దీపావళిని అక్టోబర్ 31న లేక నవంబర్ 1 న జరుపుకోవాలా అనే గందరగోళం చాలామందిలో నెలకొంది. మరి.. ఈసారి దీపావళికి ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు ప్రకటించారో తెలుసుకుందాం.యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో దీపావళికి అక్టోబర్ 31 న సెలవు ఇచ్చారు. నవంబర్ 2 న గోవర్ధన పూజకు సెలవు ఉంటుంది. నవంబర్ 3 న భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఈ రోజుల్లో మాత్రమే సెలవు దినంగా ప్రకటించారు. అయితే నవంబర్ ఒకటి గురించి స్పష్టంగా తెలియజేయలేదు. మహారాష్ట్రలో సాధారణంగా దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు దీపావళి సెలవు ప్రకటించారు. దీపావళికి ముందు, తరువాత పాఠశాలలకు ఏడు నుండి 10 రోజుల వరకూ సెలవులు ఉండవచ్చు. నవంబర్ 1న ఢిల్లీలో దీపావళి సెలవు ఉంటుంది. అయితే కుటుంబ సమేతంగా ఈ పండుగను జరుపుకునేందుకు వీలుగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు పాఠశాలకు సెలవు ప్రకటించారు.తమిళనాడులో ఈసారి దీపావళి అక్టోబర్ 31, నవంబర్ ఒకటి తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించారు. గుజరాత్లో దీపావళితో పాటు నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి సందర్భంగా ఇక్కడ మూడు రోజుల సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో కాళీ పూజ, దీపావళిని కలిసి జరుపుకుంటారు. నవంబర్ 1, 2 తేదీలలో ఇక్కడ దీపావళి సెలవు ఉంటుంది. కాళీ పూజ సందర్భంగా అక్టోబర్ 31న కూడా సెలవు ప్రకటించారు.దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్లో రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నవంబర్ 1, 2 తేదీలలో మూసివేయనున్నారు. బీహార్లో ఈసారి దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, నవంబర్ 2 న ఇక్కడ సెలవు ఉంటుంది. దీనితో పాటు ఛత్ పూజకు సెలవులను కూడా పొడిగించవచ్చు. రాజస్థాన్లో ఈ ఏడాది దీపావళికి మూడు రోజుల సెలవులు ఉంటాయి. అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు.కర్ణాటకలో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో ప్రజలు ఈ పండుగను సాంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. కేరళలో దీపావళికి నవంబర్ 1న సెలవు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు.ఇది కూడా చదవండి: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్రెడ్డి? -
జొమాటో కస్టమర్లకు భారీ షాక్!
బెంగళూరు : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీపై ప్లాట్ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్ఫామ్ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని పది రూపాయలకు పెంచింది. దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ సందర్భంగా కస్టమర్లకు తమసర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ప్లాట్ఫామ్ ఫీజును పెంచినట్లు యాప్లో పేర్కొంది. కాగా, జొమాటో కంపెనీ 2023 ఆగస్టులో తొలిసారి ప్లాట్ఫామ్ ఫీజును తీసుకొచ్చింది. మొదటి ఆర్డర్కు రూ.2 చొప్పున వసూలు చేసింది. ఆ తర్వాత జొమాటో క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ ఫీజును రూ.10కు తీసుకొచ్చింది. -
దివాలీ వైబ్స్: నటి జెనీలియా స్పెషల్ లుక్
-
ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవు
జమ్ము: ఈనెల 31న దీపావళి పండుగను వేడుకగా జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి సెలవులను ప్రకటించాయి. తాజాగా జమ్ము పాఠశాల విద్యా డైరెక్టర్ దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించించారు.దీపావళి సందర్భంగా అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకూ సెలవులను ప్రకటించారు. నవంబర్ 3 ఆదివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. నవంబర్ 4న విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ తన అధికారిక వెబ్సైట్లో నోటీసు జారీ చేశారు.దీపావళికి ఆదివారంతో కలుపుకుని ఆరు రోజుల పాటు సెలవు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ ఒకటిన కూడా సెలవు ప్రకటించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తిరిగి తమ స్వస్థలానికి వచ్చేందుకు వీలుగా నవంబర్ ఒకటిన సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: ఐదుపదుల వయసులోనూ స్లిమ్గా మలైకా..శరీరాకృతి కోసం..! -
‘జామియా’లో దీపావళి ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. దీపావళి వేడుకల సందర్భంగా రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం యూనివర్శిటీకి చెందిన కొందరు హిందూ విద్యార్థులు దీపావళి వేడుకలకు ముందుగా దీపాలు వెలిగించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మరోవర్గానికి చెందినవారు నిరసనకు దిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ నేపధ్యంలో యూనివర్సిటీ క్యాంపస్లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. జామియా యూనివర్సిటీలో దీపావళి వేడుకల సందర్భంగా వెలిగించిన దీపాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్శిటీలో మతపరమైన నినాదాలు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. BIG BREAKING NEWS 🚨 Clash breaks out at Jamia Millia Islamia University during Diwali celebrations of Hindus.Conflict began when some individuals allegedly tried to erase off Rangoli with their feet & extinguish Diyas.Viral Video claims some students were raising… pic.twitter.com/Kg4tf9eA2k— Times Algebra (@TimesAlgebraIND) October 22, 2024ఇది కూడా చదవండి: కొనసాగుతున్న బాంబు బెదిరింపులు -
‘టీచ్ ఫర్ చేంజ్’ విద్యార్థులతో మంచు లక్ష్మి దీపావళి సంబరాలు (ఫొటోలు)
-
అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు
దసరా, దీపావళి వస్తున్నాయంటే.. ఉద్యోగులకు సంబరపడిపోతుంటారు. ఎందుకంటే తాము పనిచేస్తున్న కంపెనీలు బోనస్లు లేదా గిఫ్ట్స్ వంటివి ఇస్తాయని. కొన్ని కంపెనీలు బోనస్ ఇచ్చి సరిపెట్టుకుంటే.. మరికొన్ని కంపెనీలు ఏకంగా ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.ఇటీవల హర్యానాలోని పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ 15 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. పంచకుల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిట్స్కైండ్ హెల్త్కేర్ సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి 13 టాటా పంచ్ వాహనాలు, రెండు మారుతి గ్రాండ్ విటారా కార్లను గిఫ్ట్ ఇచ్చింది.కంపెనీ యజమాని ఎంకే భాటియా స్వయంగా కార్ల తాళాలు ఉద్యోగులకు అందజేశారు. ఉద్యోగులు ఎంతో అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఉత్తమ పనితీరు కనపరిచిన అందరూ నాకు సెలబ్రిటీల వంటివారని, కంపెనీ విజయానికి వారి సహకారం చాలా ప్రశంసనీయమని భాటియా అన్నారు.ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటాఎంకే భాటియా తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా 12 మంది ఉద్యోగులకు కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఏటా 15 మందికి కార్లను బహూకరించారు. ఇప్పటికి కంపెనీ మొత్తం 27 కార్లను ఉద్యోగులకు అందించింది. ఈ పద్దతిని మిట్స్కైండ్ హెల్త్కేర్ భవిష్యత్తులో కొనసాగించాలని యోచిస్తోంది. -
పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్ అండ్ టిప్స్
వినాయక చవితి, దసరా, బతుకమ్మ సంబరాలు ముగిసాయి. ఇక దీపావళి సందడి షురూ కానుంది. ఏ పండగఅయినా భక్తి, ముక్తితోపాటు కొత్తబట్టలు, అందంగా ముస్తాబు కావడం ఈ హడావిడి ఉండనే ఉంటుంది. ముఖ్యంగా వెలుగుల పండుగ దీపావళికి ఆరడుగల అందగాళ్లు, చందమామ లాంటి ముద్దుగుమ్మలు ట్రెండీగా, ఫ్యాషన్గా మెరిసిపోవాలని ఆరాటపడతారు. ఆరడుగులు అంటే గుర్తొచ్చింది.. పొట్టిగా ఉన్నామని..లావుగా ఉన్నామని తమకు ఏ డ్రెస్ సూట్ కాదు అని చాలామంది అమ్మాయిలు దిగులు పడుతూ ఉంటారు. పొట్టిగా ఉండటం మన తప్పు కాదు. కానీ మన శరీరారినిక తగ్గట్టు దుస్తులను ఎంచుకుంటే స్పెషల్ బ్యూటీగా మెరిసిపోవడం ఖాయం. అదెలాగో చూసేద్దామా! ఫ్యాషన్ ట్రిక్స్పొడవుగా మారడానికి మ్యాజిక్ సొల్యూషన్ ఏమీ లేదు, కానీ పొడుగ్గా కనిపించేలా కొన్ని ఫ్యాషన్ ట్రిక్స్ ఉన్నాయి. ఫ్యాషన్కి స్లైల్కి ఖచ్చితమైన నియమాలేవీ లేవు. శరీర రంగును బట్టి, బాడీకి తగ్గట్టుగా కలర్ను ఎంచుకుంటే చాలు. చక్కని ఫిట్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్లో ఒక చిన్న మార్పు ఎలిగెంట్ లుక్ను ఇస్తుంది.జీన్స్, టీషర్ట్ ఎలాంటి వారికైనా ఇట్టే నప్పుతాయి. మ్యాచింగ్ కలర్స్ చాలా ముఖ్యం. మాక్సీ స్కర్ట్స్ లేదా డ్రెస్లు పొడవాటి అమ్మాయిలకు మాత్రమే బాగుంటాయి అనే అపోహను నమ్మవద్దు. మల్టిపుల్ లేయర్డ్ స్కర్ట్స్ కాకుండా మంచి కట్ స్కర్టులు ఎంచుకోండి. పొడవు స్కర్ అయితే టక్-ఇన్ టీ-షర్టుతో, కట్ జాకెట్తో ,హై హీల్డ్ షూ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.నిలువుగీతలు ఉన్న డ్రెస్లు పొడవుగా కనిపించేలా చేస్తాయి.కుర్తా లేదా చీర ధరించినపుడు సౌకర్యవంతమైన హైహీల్స్ వాడండి. అంతేకాదు డ్రెస్కు తగ్గట్టు , స్టైలింగ్ టిప్స్ పాటించాలి. ఉదాహరణకు క్లచ్లు, క్రాస్ బాడీ పర్సులు , చిన్న బ్యాగ్లు బెస్ట్ ఆప్షన్. మరీ పెద్దబ్యాగుల జోలికి అస్సలు వెళ్లవద్దుకుర్తీలకు, లేదా చీరల బ్లౌజ్లకు హైనెక్, రౌండ్ నెక్ కాకుండా, వీ నెక్, డీప్ నెక్, డీప్ రౌండ్ నెక్ లాంటివి ఎంచుకోండి. వర్టికల్ అప్పీల్కోసం ప్లంగింగ్ v-నెక్లైన్ టాప్లను ధరించండి. దీంతో పొడవుగా కనిపించడమే కాదు, సన్నగా కూడా కనిపిస్తారు.చిన్న ప్రింట్లు, సింపుల్ ఎంబ్రాయిడరీ ఔట్ ఫిట్ చూడడానికి బావుంటాయి. భారీ ఎంబ్రాయిడరీ, చీర పెద్ద పెద్ద అంచులున్న చీరలు అన్ని అకేషన్స్కు నప్పవు.ఎథ్నిక్ వేర్ కోసం పొడవాటి జాకెట్ స్టైల్ లెహెంగా లేదా సల్వార్ సూట్లకు దూరంగా ఉండండి. ఇదీ చదవండి : ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్కార్లు, అంతేనా?! -
రూ.9 చెల్లిస్తే.. రూ.25000 ప్రయోజనం: ఫోన్పేలో కొత్త ప్లాన్
దీపావళి సమీపిస్తోంది. ఈ పండుగ ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఆదమరిస్తో అంత విషాదాన్ని నింపేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్పే' బాణసంచా సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు ఉపశమనం కల్పించడానికి ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ తీసుకువచ్చింది.ఫోన్పే పరిచయం చేసిన ఈ కొత్త ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ కేవలం తొమ్మిది రూపాయలకే అందుబాటులో ఉంది. దీని ద్వారా 10 రోజుల పాటు రూ. 25,000 వరకు కవరేజి లభిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు.. బాధితులు ఆసుపత్రిలో చేరడం లేదా మరణం సంభవిస్తే దానికయ్యే ఖర్చుల నుంచి ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఈ బీమా ఉపయోగపడుతుంది.ఫైర్క్రాకర్ బీమా ప్లాన్ కవరేజ్ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బీమా కోసం ఫోన్పే యాప్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం వినియోగదారుకు మాత్రమే కాకుండా.. జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులకు కవరేజి లభిస్తుంది.ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'ఫైర్క్రాకర్ బీమా కోసం ఎలా అప్లై చేయాలంటే➤ఫోన్పే యాప్లోని బీమా విభాగాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత, అక్కడే ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ కనిపిస్తుంది.➤ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంచుకున్న తరువాత ప్లాన్ వివరాలు చూడవచ్చు. ఇక్కడే బీమా మొత్తం రూ. 25000, ప్రీమియం రూ. 9 ఉండటం చూడవచ్చు.➤కింద కనిపించే కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తరువాత పాలసీ పీరియడ్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఉన్నట్లు కనిపిస్తుంది. దాని కిందనే పాలసీదారు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. అన్నీ పూర్తయిన తరువాత తొమ్మిది రూపాయలు చెల్లించాలి. ఇలా సులభంగా ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు. -
ఈసారి విమానం ఎక్కేవారిదే ఆనందం!
సాధారణంగా దీపావళి పండుగ సీజన్లో విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక విశ్లేషణ ప్రకారం.. ఈ దీపావళి సీజన్ విమాన ప్రయాణికులకు మరింత ఆనందం కలిగిస్తోంది. కారణం.. అనేక దేశీయ రూట్లలో సగటు విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే 20-25 శాతం తగ్గాయి.ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం.. దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు 20-25 శాతం శ్రేణిలో క్షీణించాయి. ఇవి 30 రోజుల ఏపీడీ (ముందస్తు కొనుగోలు తేదీ) వన్-వే సగటు ఛార్జీల ధరలు. దీపావళి సీజన్ విమాన టికెట్ల కొనుగోలు సమయాన్ని గతేడాది నవంబర్ 10-16 తేదీల మధ్య పరిగణించగా ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్య జరిగిన కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకున్నారు.విశ్లేషణ ప్రకారం బెంగళూరు-కోల్కతా విమానానికి సగటు విమాన ఛార్జీలు గరిష్టంగా 38 శాతం క్షీణించాయి. గత ఏడాది రూ.10,195 నుండి ఈ ఏడాది రూ.6,319కి తగ్గాయి. చెన్నై-కోల్కతా మార్గంలో టిక్కెట్ ధర రూ.8,725 నుంచి రూ.5,604కి 36 శాతం తగ్గింది.ఇదీ చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!ముంబై-ఢిల్లీ విమానాల సగటు విమాన ఛార్జీలు రూ.8,788 నుంచి రూ.5,762కి 34 శాతం తగ్గాయి. అదేవిధంగా ఢిల్లీ-ఉదయ్పూర్ రూట్లో టికెట్ ధరలు రూ.11,296 నుంచి రూ.7,469కి 34 శాతం క్షీణించాయి. ఢిల్లీ-కోల్కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం క్షీణత ఉంది. -
22న దీపకాంతులలో ఢిల్లీ ఆలయాలు
జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని దేవాలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించనున్నారు. అంతే కాకుండా ఆలయాల్లో రామచరిత మానసను పారాయణం చేయడంతోపాటు రామచరిత మానస ప్రతులను పంపిణీ చేయనున్నారు. శ్రీ రాంలీలా మహాసంఘ్ నేతృత్వంలో ఢిల్లీలో 22న ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 550 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరాముని ఆరాధించే అవకాశం మనకు లభించబోతోందని అన్నారు. అందుకే ఆ రోజును చారిత్రాత్మకంగా మార్చేందుకు రామ్లీలా కమిటీలన్నీ తమ ప్రాంతాల్లోని ఆలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించాలని నిర్ణయించాయన్నారు. ఆలయాల వెలుపల పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా అయోధ్యలోని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నామన్నారు. అలాగే రామ్చరిత మానస కాపీలను రామ్లీలా కమిటీలు పంపిణీ చేస్తాయని తెలిపారు. ఆలయాల్లో 501 నెయ్యి దీపాలు వెలిగించనున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీని దీపావళిలా జరుపుకోవాలని రాజధానివాసులకు శ్రీ రాంలీలా మహాసంఘ్ పిలుపునిచ్చింది. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానున్న సందర్భంగా సంపూర్ణ అనే సంస్థ ఆదివారం లోధీ గార్డెన్లో రాముని పెయింటింగ్ పోటీని నిర్వహించింది. దీనిలో పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. సుమారు వంద మంది చిన్నారులు శ్రీరాముడు, ఇతర దేవతల వేషధారణలతో కార్యక్రమానికి హాజరయ్యారు. -
జపాన్లో దీపావళిని పోలిన పండగ ఉంది తెలుసా!
మన దీపావళి ఇటీవలే జరిగింది. అచ్చం మన దీపావళిని పోలిన పండుగనే జపానీయులు కూడా ఏటేటా జరుపుకొంటారు. ఈ పండుగ పేరు ‘చిచిబు యమాత్సురి’– అంటే రాత్రి వేడుక అని అర్థం. దాదాపు మూడు శతాబ్దాలుగా జపానీయులు ఈ పండుగను జరుపుకొంటూ వస్తున్నారు. ఇది రెండు రోజుల పండుగ. ప్రతి ఏటా డిసెంబర్ 2, 3 తేదీల్లో జపాన్ ప్రజలు ఘనంగా ఈ పండుగను జరుపుకొంటారు. ఒకుచిచిబు పర్వతసానువుల దిగువన ఉండే చిచిబు పట్టణంలో ఈ వేడుకలు జరుగుతాయి. రాజధాని టోక్యో సహా వివిధ నగరాలు, పట్టణాలకు చెందిన ప్రజలు ఇక్కడకు చేరుకుని, ఘనంగా పండుగ చేసుకుంటారు. సాయంత్రం చీకటి పడుతూనే ప్రార్థన మందిరాలను, ఇళ్లను సంప్రదాయబద్ధమైన లాంతరు దీపాలతో అలంకరిస్తారు. వీథుల్లో ఊరేగింపులు జరుపుతారు. ప్రార్థన మందిరాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పండుగ మొదటి రోజున ప్రార్థనలు, విందు వినోదాలతో గడుపుతారు. రెండోరోజైన డిసెంబర్ 3న రాత్రి వేళ ఇళ్లను, ప్రార్థన మందిరాలను లాంతరు దీపాలతో అలంకరించి, భారీ ఎత్తున బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకల్లో చిచిబు పట్టణం బాణసంచా కాల్పులతో హోరెత్తుతుంది. ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే బాణసంచా మెరుపులు కనిపిస్తాయి. రంగు రంగుల తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వంటి బాణసంచా కాల్పుల్లో పిల్లలూ పెద్దలూ అంతా ఉత్సాహంగా పాల్గొంటారు. చిచిబు పట్టణంలోని ప్రధాన ప్రార్థన మందిరమైన చిచిబు మందిరంలో ఈ వేడుకలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. ఈ మందిరం రాత్రివేళ దీపకాంతులతో ధగధగలాడిపోతుంది. వేలాది మంది జనాలు ఇక్కడకు చేరుకుని, బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ మందిరం నుంచి కలపతో తయారు చేసిన రథాల వంటి ‘యతాయి’ వాహనాలను దీపాలతో అలంకరించి వీథుల్లో ఊరేగిస్తూ బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. (చదవండి: అక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమే! అణు రియాక్టర్ పేలుడు ఏదీ సంభవించలేదు కానీ..!) -
Dev Diwali 2023: కాశీలో వైభవంగా దేవ్ దీపావళి.. (ఫొటోలు)
-
మళ్లీ పెరుగుతున్న టమాటా రేట్లు
దీపావళి అనంతరం మార్కెట్లో టమాటా ధర ప్రతి ఏటా రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, ఈ ఏడాది వర్షాభావంతో టమోటా పంట దెబ్బతింది. ఫలితంగా మహారాష్ట్రలోని నాగ్పూర్తో సహా విదర్భలోని రిటైల్ మార్కెట్లో టమోటాలు కిలోకు రూ.55 నుండి 60 వరకు అమ్ముడవుతున్నాయి. పెరుగుతున్న టమాట ధరలు ఉల్లి ధరలతో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి టమాటాలను విక్రయించేందుకు నాగ్పూర్లోని కలమన మండీకి తీసుకువస్తుంటారు. అయితే ఈసారి చాలా తక్కువగా టమాటాలు వస్తుండటంతో వీటి ధరలు మళ్లీ పెరిగాయి. టమాటా వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద ఎత్తున టమోటాలు కలమన మండీకి వస్తుంటాయి. ఫలితంగా ధరలు తక్కువగా ఉంటాయి. కాగా పొలంలో టమోటాలు పండించిన రైతులు వాటిని మార్కెట్కు తీసుకురావాలంటే రవాణా ఖర్చులు భారీగా అవుతుంటాయి. ఈ కారణంగా రైతులు టమోటాలను రోడ్లపై పారవేస్తుంటారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదు. టమాటాలు డిమాండ్కు తగ్గట్టుగానే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర, బెంగళూరు నుంచి టమోటాలు నాగపూర్కు విక్రయానికి వస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర నాణ్యతను బట్టి రూ. 40 నుండి 45 వరకు ఉంటుంది. నాగపూర్ పట్టణానికి ప్రతీరోజు 15 నుండి 16 ట్రక్కుల టమాటాలు వస్తున్నాయి. పెరుగుతున్న టమాటా ధరలు ఉల్లికి గట్టి పోటీనిస్తున్నాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.65 నుంచి రూ.70 పలుకుతోంది. మార్కెట్లో ఉల్లి రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు! -
లగ్జరీ కార్లకు పండుగ జోష్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అత్యుత్తమ పనితీరును సాధించగలమని లగ్జరీ కార్ల పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఓనం నుండి దీపావళి వరకు ఈ పండుగ సీజన్ గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉంది. అనేక కొత్త మోడళ్లు, ఆకర్షణీయమైన పోర్ట్ఫోలియో, బలమైన కస్టమర్ సెంటిమెంట్ ఈ జోష్కు కారణమని మెర్సిడెస్–బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. దసరా, ధన్తేరస్, దీపావళి సందర్భంగా రికార్డు స్థాయిలో డెలివరీలు జరగడం కస్టమర్ల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. సానుకూల పరిశ్రమ దృక్పథంతో కొనసాగుతున్నామని, ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్యూవీల ఉత్పత్తి, లభ్యతను ప్రభావితం చేస్తూ సరఫరా సంబంధిత ఆటంకాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారు. భారత్లో 2023 ఆగస్టు 17 నుంచి నవంబర్ 14 మధ్య మొత్తం ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 10 లక్షల మార్కును దాటాయి. ఏడేళ్లలో గరిష్టం.. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్లో 5,530 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 88 శాతం వృద్ధిని సాధించిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఇటీవలి కాలంలో అత్యధిక ఆర్డర్ బుక్తో కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ఈ పండుగ సీజన్ ఆడి ఇండియాకు పెద్ద వేడుకగా నిలిచిందన్నారు. గత ఏడు సంవత్సరాలతో పోలిస్తే అత్యధిక అమ్మకాలను ఈ సీజన్లో నమోదు చేశామన్నారు. ఏ4, క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్, క్యూ5, ఎస్5 స్పోర్ట్బ్యాక్లతో సహా ఉత్తమ విక్రయాలతో నిరంతర డిమాండ్ కారణంగా వృద్ధి నమోదైందని ధిల్లాన్ చెప్పారు. పండుగల సీజన్లో కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్లో ఢిల్లీ, ముంబై ముందంజలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్, కోల్కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ల నుండి కూడా మంచి డిమాండ్ను చూస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది భారత్లో లగ్జరీ కార్ల పరిశ్రమ 2018 స్థాయి అమ్మకాలను అధిగమిస్తుందని, 46,000–47,000 యూనిట్ల మార్కును చేరుకుంటుందని జోస్యం చెప్పారు. ఆడి ఇండియా అధిక రెండంకెల వృద్ధితో 2023ను ముగించాలని చూస్తోందని వివరించారు. 2027 నాటికి 1.54 బిలియన్ డాలర్లు.. పండుగ సందర్భంగా కొన్ని శక్తివంతమైన కార్లు, మోటార్సైకిళ్లను విడుదల చేశామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. ఈ వేగాన్ని కంపెనీ కొనసాగిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటి. అలాగే మిలియనీర్ల సంఖ్య పరంగా 3వ అతిపెద్ద దేశమని లంబోర్గీని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. ‘2021లో భారతీయ లగ్జరీ కార్ మార్కెట్ విలువ 1.06 బిలియన్ డాలర్లు. 2027 నాటికి 1.54 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2022–2027 అంచనా కాలంలో 6.4 శాతం కంటే ఎక్కువ సగటు వార్షిక వృద్ధి నమోదవుతుంది’ అని పేర్కొన్నారు. కస్టమర్ అభిరుచి, ప్రాధాన్యతలు ఈ వృద్ధిని నడిపిస్తాయని చెప్పారు. దీంతో అధునాతన సాంకేతికత, భద్రతా ఫీచర్లతో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్తో ఆటోమొబైల్ రంగం గణనీయంగా విస్తరణను చూస్తోంది’ అని అగర్వాల్ తెలిపారు. మెరుగైన రోడ్లు వృద్ధికి మరింత మద్దతునిస్తోంది. నగరాలు ఎక్స్ప్రెస్వేల ద్వారా అనుసంధానం అవుతున్నాయి. దీంతో అధిక ఆకాంక్షలతో పాటు ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల్లో డిమాండ్ను పెంచుతున్నాయని చెప్పారు. లంబోర్గీని మొత్తం అమ్మకాల్లో 25 శాతానికి పైగా మెట్రోయేతర నగరాల నుండి జరుగుతున్నాయని అన్నారు. -
ఎయిర్లైన్స్కు కలిసొచ్చిన వరల్డ్కప్ ఫైనల్ - కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డ్..
పండుగ సీజన్లో వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతాయని అందరూ నమ్ముతారు. అయితే ఆ పండుగ సీజన్ కంటే వరల్డ్కప్ బాగా కలిసొచ్చిందని ఎయిర్లైన్స్ తాజాగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ రోజు దేశంలో సుమారు 4.6 లక్షలమంది విమాన ప్రయాణం చేశారని, దీపావళికి కూడా చేయలేని పనిని క్రికెట్ వరల్డ్ కప్ చేసిందని ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది. గత దీపావళి కంటే కూడా ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. దీపావళి సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది, కానీ అంత కంటే ఎక్కువ వరల్డ్కప్ ఫైనల్ రోజు ప్రయాణించారు. భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ చేరుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో కనిపించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెరిగిన చార్జీలను కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్రయాణికులు రావడంతో విమానయాన సంస్థల ఆదాయం భారీగా పెరిగింది. ప్రపంచకప్ ఫైనల్ రోజు కొందరు రూ. 20,000 నుంచి రూ. 40,000 వెచ్చించి కూడా టికెట్స్ కొనుగోలు చేశారు. ఫ్లైట్ చార్జీలు ఎక్కువని కొందరు ట్రైన్ ఏసీ క్లాసులు బుక్ చేసుకుని ప్రయాణించారు. అటు విమానయాన సంస్థలు, ఇటు రైల్వే సంస్థలు బాగా సంపాదించుకోగలిగాను. ఒకే రోజులో 4 లక్షల మంది విమాన ప్రయాణం చేయడం ఓ అరుదైన రికార్డ్. ఇది మాకు చారిత్రాత్మకమైన అవకాశం అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్ అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పండుగ సీజన్ సద్వినియోగం చేసుకోవడానికి విమానయాన సంస్థలు గత సెప్టెంబర్ చివరి వారంలో అడ్వాన్స్ బుకింగ్ చార్జీలను పెంచడం ప్రారంభించాయి. కొందరు పెరిగిన చార్జీలను దృష్టిలో ఉంచుకుని ట్రైన్ జర్నీ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద ఇండియా వరల్డ్కప్ కోల్పోయినప్పటికీ.. విమానయాన సంస్థలు మాత్రం లాభాలను గడించాయి. -
Hansika Motwani First Diwali Celebrations: భర్తతో పండగ చేసుకున్న హన్సిక.. ఎంత పద్ధతిగా ఉందో (ఫోటోలు)
-
బుల్ రన్, దీపావళి కానుకగా రూ.3.3 లక్షల కోట్ల బోనస్
ముంబై: అమెరికా, భారత్లో ద్రవ్యోల్బణం దిగిరావడంతో బుధవారం దేశీయ స్టాక్ సూచీలు నెల గరిష్టంపైన ముగిశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు, బాండ్లపై రాబడులు తగ్గడంతో పాటు 14 ట్రేడింగ్ సెషన్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడం కలిసొచ్చాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు రాణించడంతో బుధవారం సెన్సెక్స్ 742 పాయింట్లు పెరిగి 65,676 వద్ద ముగిసింది. నిఫ్టీ 232 పాయింట్లు బలపడి 19,675 వద్ద నిలిచింది. బలిప్రతిపద సెలవు తర్వాత ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ను ప్రారంభించిన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ట్రేడింగ్లో అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 814 పాయింట్లు ఎగసి 65,748 వద్ద, నిఫ్టీ 249 పాయింట్లు బలపడి 19,693 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లకు భారీగా డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ సూచీలు వరుసగా 1.13%, 0.91% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.550 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.610 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ సూచీ (హాంగ్సెంగ్) అత్యధికంగా 4% ర్యాలీ చేసింది. జపాన్ నికాయ్ 2.50%, కొరియా, థాయిలాండ్ సూచీలు 2%, ఇండోనేషియా, సింగపూర్ సూచీలు 1% చొప్పున లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1% మేర పెరిగాయి. అమెరికా మార్కెట్లు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ‘అమెరికా, బ్రిటన్, భారత్ల్లో ద్రవ్యోల్బణం దిగిరావడంతో ఫెడరల్ రిజర్వ్తో సహా ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుపై వెనకడుగు వేయొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు సంకేతంగా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టాయి. పండుగ సీజన్, మెరుగైన కార్పొరేట్ ఫలితాలతో ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే విదేశీ ఇన్వెస్టర్లు భారత్లో పెట్టుబడులకు మొగ్గుచూపొచ్చు. ఈ ఏడాది చివరికల్లా నిఫ్టీ తిరిగి 20,000 స్థాయిని అందుకోవచ్చు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దీపావళి బోనస్ : రూ.3.29 లక్షల కోట్లు దలాల్ స్ట్రీట్ ఒక శాతం ర్యాలీ చేసి ఇన్వెస్టర్లకు దీపావళి కానుకగా రూ.3.3 లక్షల కోట్ల బోనస్ ఇచ్చింది. సెన్సెక్స్ 742 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.3.29 లక్షల కోట్లు పెరిగి రూ.325.41 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో బజాజ్ ఫైనాన్స్ 2%, ఇండస్ఇండ్ 1%, పవర్గ్రిడ్ 1% మాత్రమే నష్టపోయాయి. అదరగొట్టిన ఆస్క్ ఆటోమోటివ్ లిస్టింగ్ ఆస్క్ ఆటోమోటివ్ లిస్టింగ్లో అదరగొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.282)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.305 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 12 శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.317 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 10% లాభపడి రూ.310 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.6,115 కోట్లుగా నమోదైంది. రూపాయి రికవరీ జీవితకాల కనిష్ట స్థాయిల నుంచి రూపాయి రికవరీ అయ్యింది. డాలర్ మారకంలో 24 పైసలు బలపడి 83.09 స్థిరపడింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ రెండేళ్ల కనిష్టాన్ని తాకడం దేశీయ కరెన్సీకి కలిసొచ్చింది. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో రిస్క్ సామర్థ్యం పెరిగిందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. ఈ సోమవారం 83.33 వద్ద జీవితకాల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. కాగా బలప్రతిపద సందర్భంగా మంగళవారం ఫారెక్స్ మార్కెట్ పనిచేయలేదు. -
Divi Vadthya Diwali Celebrations: దీపావళి సెలబ్రేషన్స్.. చీరకట్టులో మైమరిపిస్తోన్న దివి (ఫొటోలు)
-
Manchu Lakshmi Prasanna: మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు, పార్టీలో పూనకాలే (ఫోటోలు)
-
‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం!
ఏటా దీపావళి సీజన్లో మద్యం విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచే మద్యం విక్రయాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. దీపావళి సీజన్లో అత్యధిక మద్యం విక్రయాల కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి సందర్భంగా గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు రూ.121 కోట్ల విలువైన 64 లక్షల మద్యం బాటిళ్లను వినియోగదారులు కొనుగోలు చేశారని సమాచారం. అదే సమయంలో దీపావళి పండుగకు వారం రోజుల ముందు కోటికి పైగా మద్యం బాటిళ్లు విక్రయించగా, ప్రభుత్వానికి రూ.234.15 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే దీపావళికి ముందు 17 రోజుల్లో మొత్తం 3 కోట్లకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోవడంతో ప్రభుత్వానికి రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి, హోలీ తదితర పండుగల సమయంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మద్యం దుకాణాల్లో గురువారం రూ. 17.33 లక్షలు, శుక్రవారం రూ. 18.89 లక్షలు, శనివారం 27.89 లక్షల రూపాయాల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే 64 లక్షలకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోయి, ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.120.92 కోట్ల ఆదాయం అందింది. అయితే దీపావళి నాడు కొన్ని చోట్ల మద్యం దుకాణాలను మూసివేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది దీపావళి సందర్భంగా 42 శాతం అధికంగా మద్యం బాటిళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దీపావళికి మూడు రోజుల ముందు వరుసగా 13.46 లక్షలు, 15 లక్షలు, 19.39 లక్షల మద్యం బాటిళ్లు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి! -
భారత్లో దీపావళి సంబరాలు.. చైనాకు లక్ష కోట్లు నష్టం!
భారత్లో దీపావళి సంబరాలతో చైనాకు లక్ష కోట్ల ఆదాయం తగ్గింది. అదెలా అంటారా? మన దేశంలో ప్రతి ఏడాది రక్షా బంధన్తో ప్రారంభమైన ఫెస్టివల్ సీజన్ న్యూ ఇయర్ వరకు.. ఇలా ఐదు నెలల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో వ్యాపారస్థులు, ఎగుమతిదారులు పండగ సమయాల్లో ప్రజలకు అవసరమయ్యే నిత్యవసర వస్తువుల్ని చైనా నుంచి భారత్కు తెస్తుంటారు. ఆ మొత్తం విలువ సుమారు రూ.80 వేల కోట్లు. అయితే 2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్ వద్ద గల్వాన్ నది లోయలో భారత సైనికులు వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్న ఓ తాత్కాలిక వంతెనను డ్రాగన్ సైన్యం (పీఎల్ఏ) తొలగించేందుకు ప్రయత్నించింది. ఇది రెండు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది.నాటి ఘటనలో భారత్కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. అప్పటికి వంతెనపై ఉన్న కనీసం 38 మంది చైనా సైనికులను చైనా కోల్పోయింది. ఈ హింసాత్మక ఘటన తర్వాత భారత్.. చైనాను అన్ని విధులుగా నిలువరించే ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పుడే ప్రధాని మోదీ ‘వోకల్ ఫర్ లోకల్’ పేరుతో ప్రజలు దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. అలా దేశంలో చైనా ఉత్పత్తులపై మొదలైన బాయ్కాట్ ఉద్యమం ప్రతిఏడు చైనాను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఫలితంగా ఈ ఏడాదిలో దీపావళి వరకు జరిగిన పండుగుల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.3.75 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరిగాయని వ్యాపార సంస్థల సంఘం.. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) పేర్కొంది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే గోవర్ధన్ పూజ, భాయా దూజ్, నవంబర్ 19 ఛాత్ పూజ, నవంబర్ 24న జరిగే తులసీ వివాహ్ వంటి పర్వదినాల నేపథ్యంలో మరో రూ.50 వేల కోట్ల విలువైన వ్యాపారం జరిగే అవకాశం ఉందని కెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఇక, నాలుగు రోజుల పాటు జరిగిన దీపావళి ఫెస్టివల్ సీజన్లో దేశ వ్యాప్తంగా స్థానిక ఉత్పత్తుల అమ్మకాలతో చైనాకు రూ.1 లక్ష కోట్ల ఆదాయం తగ్గిందని వెల్లడించారు. ‘ఇంతకుముందు దేశవ్యాప్తంగా దీపావళి సందర్భంగా దాదాపు 70 శాతం చైనా ఉత్పత్తులే అమ్ముడయ్యేవి. కానీ ప్రధాని నరేంద్రమోదీ అభ్యర్థన మేరకు వ్యాపారులు స్థానిక ఉత్పత్తులనే విక్రయించారు. వినియోగదారులు కూడా దేశీయ ఉత్పత్తులను ఆదరించారు’ అని కెయిట్ సెక్రటరీ జెనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. చదవండి👉 పండగ సీజన్లో దినదిన గండం..టెక్కీల నెత్తిపై మరో పిడుగు! -
అగ్రరాజ్యంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తర కాలిఫోర్నియా, మిల్పిటాస్ నగరంలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రవాసులు సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అందరూ కలిసి బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. చిన్నారులు, యువత.. టపాసులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వెలిగించి ఆనందాలు పంచుకున్నారు. అన్ని రకాల టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీపాలు, టపాసుల కాంతులతో సిలికానాంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం వెలిగిపోయింది. ప్రవాసులు బారీగా తరలివచ్చి.. వెలుగుల పండుగ దీపావళిని ఆనందోత్సాహాల మధ్య సెలబ్రేట్ చేసుకున్నారు. దీపావళి ఉత్సవంలో భాగంగా భక్తి గీతాలు, భజనలతో పాటు వైవిధ్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరింపజేశాయి. దీపావళి వేడుకలు గ్రాండ్గా జరగటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: న్యూయార్క్లో ఘనంగా దీపావళి వేడుకలు) -
పండగ పోస్టర్ గురూ
దీపావళి పండక్కి ఇండస్ట్రీలో సినీ టపాసులు బాగానే పేలాయి. టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, కొత్త పోస్టర్.. ఇలా సినీ ప్రేమికులకు కావాల్సిన మతాబులు అందాయి. ఈ విశేషాల్లోకి... రజనీకాంత్, కపిల్దేవ్ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా జీవితా రాజశేఖర్ ఓ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. క్రికెట్ను ప్రేమించే కొందరు హిందు, ముస్లిం యువకుల మధ్య రాజకీయ జోక్యంతో తలెత్తిన వివాదాలను మొయిద్దీన్ భాయ్ (రజనీ పాత్ర పేరు) ఎలా సరిదిద్దుతాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్ చెబుతోంది. ‘రాంగ్ యూసేజ్’ అంటూ ‘సైంధవ్’ సినిమా కోసం పాట పాడారు వెంకటేశ్. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘రాంగ్ యూసేజ్’ పాట లిరికల్ వీడియోను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, ఈ సాంగ్ పోస్టర్ను రిలీజ్ చేశారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘ఈగల్’. ఇందులో కావ్యాథాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదల కానుంది. తొలి భాగం ట్రైలర్ను డిసెంబరు 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ప్రభాస్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మాస్ పోలీసాఫీసర్ పాత్రలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘భీమా’. ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ మాస్ పోస్టర్ను రిలీజ్ చేశారు. సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్. దీపావళి సందర్భంగా ‘కంగువా’ పోస్టర్ను రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్తో కలిసి స్టూడియో గ్రీన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రెండు విభిన్న కాలాల్లో సాగనున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఏప్రిల్ 11న విడుదల కానుందని టాక్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ను బ్యాంకాక్లో ప్లాన్ చేశారు. సంక్రాంతికి ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల కానుంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బ్రీత్’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చోటు చేసుకునే ఘటనల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని యూనిట్ చెబుతోంది. ప్రముఖ నటుడు ఉపేంద్ర భార్య, నటి ప్రియాంకా ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్’. ఈ సినిమాకు లోహిత్ దర్శకుడు. రాధికా కుమారస్వామి సమర్పణలో రవిరాజ్ నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ‘‘ఇప్పటి వరకూ సినీ ప్రపంచంలో రాని ఓ ప్రయోగాత్మక చిత్రం ఇది. సింగిల్ లెన్స్తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. 30 రోజులు గోవాలో ఏకధాటిగా షూటింగ్ జరిపాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సతీమణి, నటి రాధికా కుమారస్వామి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘అజాగ్రత్త’. శశిధర్ దర్శకత్వంలో రవిరాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏడు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రాధికా కుమారస్వామి నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘భైరా దేవీ’. శ్రీ జై దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే అఘోరా భైరాదేవిగా రాధిక నటిస్తున్నారు. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న సినిమా ‘చే’. ‘లాంగ్ లివ్’ అనేది ఉపశీర్షిక. లావణ్య సమీరా, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్ కీలక పాత్రల్లో నటించారు. బి.ఆర్ సభావత్ నాయక్ దర్శకత్వంలో సూర్య, బాబు, దేవేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘‘చేగువేరా బయోపిక్ తీయాలన్నది నా 20 ఏళ్ల కల. విప్లవ వీరుడు చేగువేరా లైఫ్లో జరిగిన ఎన్నో అరుదైన విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. డిసెంబరులో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు బి.ఆర్ సభావత్ నాయక్. -
మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే..
ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన దీపావళివేళ భక్తులు పూజించే లక్ష్మీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో తన భార్యను పూజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్గా మారిన ఈ ఫొటోలపై మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఎస్పీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో దీపావళి సందర్భంగా తన తన భార్యను పూజిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రపంచంలోని ఏ మతం, కులం, జాతి, వర్ణం, వ్యవస్థలో పుట్టిన ఏ బిడ్డకైనా రెండు చేతులే ఉంటాయన్నారు. రెండు కాళ్లు, రెండు చెవులు, రెండు కళ్లు ఉన్న మహిళకు.. నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, పది చేతులు, ఇరవై చేతులు, వెయ్యి చేతులు కలిగిన శిశువు ఇప్పటి వరకు పుట్టలేదన్నారు. నాలుగు చేతులతో లక్ష్మీదేవి ఎలా పుట్టింది? ఎవరైనా లక్ష్మీ దేవిని ఆరాధించాలనుకుంటే, దేవతలాంటి భార్యను పూజించండి. గౌరవించండి.. ఎందుకంటే ఆమె మీ కుటుంబ పోషణ కోసం పనిచేస్తూ, ఆనందం, శ్రేయస్సు అందిస్తూ, ఆహారం సంరక్షణ బాధ్యతలను ఎంతో శ్రద్ధతో నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే! दीपोत्सव के अवसर पर अपनी पत्नी का पूजा व सम्मान करते हुए कहा कि पूरे विश्व के प्रत्येक धर्म, जाति, नस्ल, रंग व देश में पैदा होने वाले बच्चे के दो हाथ, दो पैर, दो कान, दो आंख, दो छिद्रों वाली नाक के साथ एक सिर, पेट व पीठ ही होती है, चार हाथ,आठ हाथ, दस हाथ, बीस हाथ व हजार हाथ वाला… pic.twitter.com/CP5AjKODfq — Swami Prasad Maurya (@SwamiPMaurya) November 12, 2023 -
దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే!
దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి. దీపావళి అంటే వెలుగుల పండుగ. దీపావళి రోజున ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు. అయితే దీపావళి వేళ ఒక మహిళ వినూత్నంగా అలంకరించుకుంది. ఇళ్లను అలంకరించేందుకు వినియోగించే చిరు దీపాలను తన దుస్తులకు అల్లుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు దీపావళికి ఇటువంటి దుస్తులు పర్ఫెక్ట్ అని కితాబిస్తున్నారు. వర్షా. యాదవ్ పేరిట ఉన్న ఇన్స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో ఒక మహిళ ఘాగ్రా చోళీని ధరించి కనిపిస్తుంది. ఘాగ్రాతో పాటు వేసుకున్న చున్నీకి రంగురంగుల దీపాలు అతికించి ఉన్నాయి. కాంతులీనుతున్న ఈ దుస్తులను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు దాదాపు 5 లక్షల లైక్స్ వచ్చాయి. లెక్కకు మించిన కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. ఢిల్లీలో 200కుపైగా అగ్నిప్రమాదాలు! View this post on Instagram A post shared by Varsha Bai (@varsha.yadav777) -
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు (ఫోటోలు)
-
దీపావళి పండుగ కారణంగా ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
-
టపాసుల కాలుస్తుండగా పలువురికి తీవ్రగాయాలు
-
దీపావళి వేడుకల్లో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
-
తానేటి వనిత ఇంట్లో దీపావళి సంబరాలు
-
చిత్రకూట్ దీపావళి వేడుకల్లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు!
అయోధ్య తర్వాత అంతటి ఘన చరిత్ర కలిగిన మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో దీపావళి మేళా ప్రారంభమయ్యింది. ఇది ఐదు రోజుల పాటు జరగనుంది. దీపావళి సందర్భంగా లక్షలాది మంది భక్తులు చిత్రకూట్కు చేరుకున్నారు. భక్తులు మందాకినీ నదిలో స్నానం చేసి, మాతగజేంద్ర నాథ్ ఆలయంలో జలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే కామతానాథ్ స్వామిని దర్శించుకుని, పంచకోసి పర్వతం కమదగిరికి ప్రదక్షిణలు చేస్తున్నారు. లంకా విజయం తర్వాత శ్రీరాముడు చిత్రకూట్లో దీపాలను దానం చేశాడని స్థానికులు చెబుతారు. ఈ నేపధ్యాన్ని పురస్కరించుకుని చిత్రకూట్లో దీపావళి మేళా నిర్వహిస్తుంటారు. ఈసారి చిత్రకూట్ దీపావళి మేళాకు అత్యధికంగా భక్తులు తరలివచ్చారు. 25 కిలోమీటర్ల పరిధిలో ఈ మేళాను ఏర్పాటు చేశారు. కామదగిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతో తోపులాట చోటుచేసుకుని పలువురు గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయపడిన భక్తులకు వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు చిత్రకూట్లో దీపదానాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసింది. మేళా ప్రాంతంలో పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇది కూడా చదవండి: దీపావళి వేళ... అమ్మవారికి రోబోటిక్ హారతులు! -
దీపావళి వేళ... అమ్మవారికి రోబోటిక్ హారతులు!
దేశవ్యాప్తంగా ఆదివారం దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పిల్లాపెద్దా అంతా ఉత్సాహంగా వేడుకల్లో మునిగితేలారు. పటాకుల మోతతో దేశంలోని వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఆకాశం అద్భుత కాంతులతో వెలిగిపోయింది. ఇదిలావుండగా దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం పలు ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన దీపావళినాడు ప్రతి ఇంటా తప్పనిసరిగా లక్ష్మీ పూజలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి చెందిన ఒక రొబోటిక్ కంపెనీ విచిత్ర రీతిలో దీపావళి వేడుకలు నిర్వహించింది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి రోబో చేతులు మీదుగా హారతులిప్పించింది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా’ సోషల్మీడియా ప్లాట్ ఫారం ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ వీడియోను నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నారు. ఇది కూడా చదవండి: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి! Delhi based robotics company Orangewood's unique Diwali celebration. pic.twitter.com/eW6vafKOqH — Indian Tech & Infra (@IndianTechGuide) November 12, 2023 -
దీపావళి విషాదం: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి!
దీపావళి రోజున ఉత్తరప్రదేశ్(యూపీ)లోని కాన్పూర్ దేహత్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్ధంతో బాంబు పేలడంతో రసూలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం చెలరేగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని కొంతమంది 20 అడుగుల మేర గాలిలో ఎగిరిపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీపావళి రోజు సాయంత్రం రసూలాబాద్ నుంచి కాన్పూర్ నగర్ వెళ్లే రోడ్డులో పలువురు పటాకులు, మిఠాయిలు కొంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సుఫియాన్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని కాన్పూర్కు తరలించారు. సాధారణ పటాకుల వల్ల పేలుడు సంభవించలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు? -
అయోధ్యలో కన్నుల పండుగగా దీపోత్సవం (ఫొటోలు)
-
దీపావళి కాంతుల వేడుకల్లో సినీ తారలు (ఫొటోలు)
-
కంటి ఆస్పత్రికి పేషంట్ల క్యూ.... అంతా దీపావళి టపాసుల బాధితులే!
హైదరాబాద్: నగరంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పేషంట్లు క్యూకట్టారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 60 మంది కంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. వీరంతా దీపావళి సందర్భంగా టపాసులు పేలుస్తూ గాయపడిన వారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది పెద్దవారే కావడం గమనార్హం. దీపావళి సందర్భంగా టపాసులు పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంత చెబుతున్నా మార్పు రావడం లేదు. ఏటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా బాణాసంచా కాలుస్తూ గాయాల బారిన పడుతున్నారు. టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు అవసరమని, ముఖ్యంగా కళ్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల పట్ల మరింత జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. -
బ్రిటీష్ ప్రధానికి భారత్ దీపావళి కానుక
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్, అతని భార్య అక్షతా మూర్తిని కలుసుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రిషి సునాక్కు వినాయకుని విగ్రహాన్ని, భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ను బహూకరించారు. జై శంకర్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఖాతాలో .. ‘భారతదేశం- యూకేలు ప్రస్తుతం సంబంధాలను బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. అందుకు ఇందుకు సహకారం అందిస్తున్న సునాక్కు ధన్యవాదాలు. వారి సాదర స్వాగతం, ఆతిథ్యం అద్భుతం" అని పేర్కొన్నారు. బ్రిటిష్ పీఎం రిషి సునక్ కూడా తన భావాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలలోని వివిధ అంశాలను సమీక్షించడం, స్నేహపూర్వక సంబంధాలలో కొత్త ఉత్సాహాన్ని కల్పించే లక్ష్యంతో జైశంకర్ ఐదు రోజుల బ్రిటన్ పర్యటన కోసం లండన్ చేరుకున్నారు. నవంబర్ 15న జైశంకర్ విదేశీ ప్రయాణం ముగియనుంది. జైశంకర్ తన పర్యటనలో పలువురు ప్రముఖులను కలుసుకోనున్నారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. దీనితోపాలు భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన దీపావళి ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: నీరుగారిన నిషేధం: పేలిన టపాసులు, ఎగిరిన తారాజువ్వలు! The Prime Minister @RishiSunak welcomed @DrSJaishankar to Downing Street this evening. Together they expressed their very best wishes as Indian communities around the world begin #Diwali celebrations. 🇬🇧🇮🇳 pic.twitter.com/gjCxQ0vr8d — UK Prime Minister (@10DowningStreet) November 12, 2023 -
దేదీప్యమానం.. అయోధ్యా నగరం! ఫొటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో సరయూ నదీతీరంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవం అమోఘమని, దైవీకమని, కళ్లలో చెరిగిపోనిదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేత్రపర్వమైన ఆ దీపోత్సవ దృశ్యాలను తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పంచుకున్నారు. అయోధ్యలో వెలిగించిన లక్షలాది దీపాల వెలుగులో దేశమంతా కాంతులీనుతోందన్నారు. ‘ఈ దీప కాంతుల నుంచి వెలువడే శక్తి దేశమంతటా కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ శ్రీ రాముడు దేశ ప్రజలందరికీ సుభిక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్’ అని ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు. అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం 22 లక్షల దీపాలతో అత్యంత వైభవంగా జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా తన గిన్నిస్ రికార్డును తానే బద్దలుకొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. अद्भुत, अलौकिक और अविस्मरणीय! लाखों दीयों से जगमग अयोध्या नगरी के भव्य दीपोत्सव से सारा देश प्रकाशमान हो रहा है। इससे निकली ऊर्जा संपूर्ण भारतवर्ष में नई उमंग और नए उत्साह का संचार कर रही है। मेरी कामना है कि भगवान श्री राम समस्त देशवासियों का कल्याण करें और मेरे सभी… pic.twitter.com/3dehLH45Tp — Narendra Modi (@narendramodi) November 12, 2023 -
పండగ వేళ రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట
ఢిల్లీ: దీపావళి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. కొన్ని మార్గాల్లో రైళ్లు కిక్కిరిసిపోయాయి. టికెట్ ముందే బుక్ చేసుకున్నప్పటికీ రైలులో కాలుపెట్టే పరిస్థితి లేదని కొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే యాజమాన్యంపై విమర్శలు కురిపిస్తున్నారు. అధికారుల నిర్వహణ లోపం వల్ల తాము దీపావళికి ఇంటికి చేరుకోలేకపోయామని సోషల్ మీడియా వేదికగా వాపోయారు. "ఇండియన్ రైల్వే నిర్వహణలోపం నా దీపావళిని నాశనం చేసింది. ఏసీ టిక్కెట్ను కొన్నప్పటికీ రైలు ఎక్కే పరిస్థితి లేదు. పోలీసుల నుండి ఎటువంటి సహాయం లేదు. నాలాంటి చాలా మంది రైలు ఎక్కలేకపోయారు," అని ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి పంచుకున్నాడు. PNR 8900276502 Indian Railways Worst management Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnaw I want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq — Anshul Sharma (@whoisanshul) November 11, 2023 దేశ రాజధానిలోనూ దీపావళి వేడుకల సందర్భంగా ప్రయాణికులతో బస్సు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఢిల్లీలో ఆనంద్ విహారీ కౌశాంబి ప్రాంతంలో ఇంటర్ స్టేట్ బస్సు టర్మినల్లో నడవడానికి కూడా వీలులేని దుస్థితి ఏర్పడింది. పండగ సందర్భంగా జనం సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు జనంతో నిండిపోయాయి. #WATCH | Huge rush of people at Anand Vihar- Kaushambi on Delhi-UP border near the Anand Vihar railway station and inter-state bus terminal pic.twitter.com/DkDXSgganz — ANI (@ANI) November 11, 2023 న్యూఢిల్లీలోని స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. శనివారం సూరత్లో బీహార్కు వెళ్లే ప్రత్యేక రైలు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మరికొందరు స్పృహతప్పి పడిపోయారని పోలీసులు తెలిపారు. #WATCH | Gujarat | A stampede situation ensued at Surat railway station due to heavy crowd; one person died while three others were injured. The injured were shifted to the hospital: Sarojini Kumari Superintendent of Police Western Railway Vadodara Division (11.11) pic.twitter.com/uAEeG72ZMk — ANI (@ANI) November 11, 2023 ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
సైనికులతో మోదీ దీపావళి వేడుకలు
లఢక్: దీపావళి సంబరాలను ప్రధాని మోదీ సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ప్రదేశ్లోని లేప్చా సైనిక శిబిరాన్ని మోదీ సందర్శించారు. సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంపదలు చేకూరాలని ఆకాంక్షించారు. సైనికులకు స్వీట్లు తినిపిస్తున్న ఫొటోలను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. "సైన్యం సరిహద్దుల్లో హిమాలయంగా స్థిరంగా ఉన్నంతకాలం దేశం భద్రంగా ఉంటుంది. ప్రపంచంలో భారత్పై నమ్మకం పెరిగింది. దేశ సరిహద్దులు క్షేమంగా ఉన్నాయి. అందుకే దేశంలో శాంతి నెలకొంది. ఇందుకు సైన్యం పాత్ర ఎనలేనిది" అని ప్రధాని మోదీ అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi celebrates #Diwali with Army personnel in Himachal Pradesh's Lepcha pic.twitter.com/ff23aUxgqe — ANI (@ANI) November 12, 2023 ప్రధాని మోదీ ప్రతి ఏడాది దీపావళి వేడుకలను సైనికులతోనే జరుపుకుంటారు. 2014లో అధికారంలోకి వచ్చిననాటి నుంచి దీపావళి వేడుకలతో సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. గత ఏడాది కార్గిల్లో జరుపుకున్నారు. Reached Lepcha in Himachal Pradesh to celebrate Diwali with our brave security forces. pic.twitter.com/7vcFlq2izL — Narendra Modi (@narendramodi) November 12, 2023 ఇదీ చదవండి: కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది -
పిల్లలు బాణాసంచా కాల్చేటప్పడూ జరభద్రం..ఈ జాగ్రత్తలు తప్పనసరి..
మనకు ఎన్నో పండుగలు ఉన్నాయి. ఎన్ని పండుగలు ఉన్నా, పిల్లలకు అమితానందం కలిగించేది దీపావళి పండుగే! మిగిలిన పండుగల్లో పిల్లలకు మిఠాయిలు, పిండివంటలు మాత్రమే ఉంటాయి. దీపావళి నాడైతే మిఠాయిలు, పిండివంటలకు అదనంగా టపాకాయలు కూడా ఉంటాయి. సరదాగా టపాకాయలు కాల్చడానికే పిల్లలు దీపావళి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. టపాకాయలు కాల్చుకోవడం సరదానే అయినా, వాటితో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల జాగ్రత్తలు తీసుకుని మరీ వాటిని కాల్చాలి. ఏమాత్రం అజాగ్రత్తపడినా ఇళ్లూ ఒళ్లూ కాలే ప్రమాదాలు ఉంటాయి. ఈసారి బాలల దినోత్సవానికి రెండురోజుల ముందు దీపావళి పండుగ వస్తోంది. పిల్లలకు ఈసారి రెట్టింపు ఉత్సాహం ఉంటుంది. పిల్లల్లారా! దీపావళి గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఒకసారి భూమండలాన్ని తీసుకుపోయి సముద్రంలో దాచేశాడు. దేవతలందరూ మొరపెట్టుకోవడంతో మహావిష్ణువు వరాహావతారం దాల్చాడు. హిరణ్యాక్షుడితో యుద్ధంచేశాడు. వాణ్ణి తన పదునైన కోరలతో పొడిచి చంపేశాడు. సముద్రంలో మునిగిన భూమిని తన కోరలతో పైకెత్తి బయటకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో వారికి నరకాసురుడు పుట్టాడు. వాడికి అసురలక్షణాలు ఉన్నాయని, ఎప్పటికైనా తల్లి చేతుల్లోనే మరణిస్తాడని మహావిష్ణువు భూదేవికి చెప్పాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్లిపోయాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకాసురుడు కామరూప దేశానికి రాజయ్యాడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించసాగాడు. ద్వాపరయుగంలో నరకాసురుడికి శోణితపురం రాజైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. దుర్మార్గుడైన బాణాసురుడి సావాసంలో నరకాసురుడికి అన్ని చెడ్డ గుణాలూ అలవాటయ్యాయి. బాణుడు రెచ్చగొట్టడంతో ఇతర రాజ్యాల మీద దండయాత్రలు చేసేవాడు. దొరికిన స్త్రీలనందరినీ తీసుకొచ్చి, బంధించేవాడు. ఇలా పదహారువేల మంది స్త్రీలను చెరపట్టాడు. స్వర్గం మీద దండెత్తి, దేవేంద్రుడిని తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ కాలంలోనే శ్రీకృష్ణుడు నరకాసురుడి మిత్రుడైన మురాసరుడిని, అతడి కొడుకులను యుద్ధంలో హతమార్చాడు. తన మిత్రుడైన మురాసురుడిని చంపడంతో నరకాసురుడికి శ్రీకృష్ణుడి మీద కోపం వచ్చింది. వెంటనే శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరుతుంటే, తాను కూడా వస్తానని పట్టుబట్టింది సత్యభామ. సరేనంటూ, ఆమెను తనతో పాటే గరుడ వాహనం మీద యుద్ధరంగానికి తీసుకుపోయాడు శ్రీకృష్ణుడు. నరకాసురుడికి, శ్రీకృష్ణుడికి హోరాహోరీ యుద్ధం జరిగింది. యుద్ధంలో నరకాసురుడు విడిచిన బాణం తాకడంతో శ్రీకృష్ణుడు మూర్ఛపోయాడు. ఇది చూసి సత్యభామకు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే విల్లూ బాణాలూ అందుకుంది. నరకాసురుడి మీద, అతడి సైనికుల మీద వరుసగా బాణాలు కురిపించింది. కాసేపటికి శ్రీకృష్ణుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. యుద్ధంలో సత్యభామ అలసిపోతుండటం చూశాడు. తాను కూడా యుద్ధంలో విజృంభించాడు. అదను చూసి, చక్రాయుధం విసిరి నరకాసురుడి తల తెగనరికాడు. ఆ రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. అందుకే ఆ రోజును మనం నరక చతుర్దశి అంటున్నాం. మర్నాడు అమావాస్య రోజున జనాలందరూ నరకాసురుడి పీడ విరగడైనందుకు సంతోషంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, పండుగ చేసుకున్నారు. ఇప్పుడు మనం జరుపుకుంటున్న దీపావళి పండుగ అలా పుట్టిందన్నమాట. బాణసంచా చరిత్ర చాలాకాలం పాటు జనాలు దీపావళి రోజున సాయంత్రం ఇళ్ల ముందు దీపాలు వెలిగించుకోవడం, లక్ష్మీపూజలు జరుపుకోవడం మాత్రమే చేసేవారు. అప్పట్లో టపాకాయలు కాల్చేవారు కాదు. తర్వాతి కాలంలో సురేకారంగా పిలుచుకునే పొటాషియం నైట్రేట్ కనుగొన్న తర్వాత దానికి గంధకం, బొగ్గుపొడి కలిపి పేలుడు పదార్థాలను, ఆ తర్వాత రకరకాల రంగు రంగుల కాంతులు వెదజల్లే బాణసంచా సామగ్రి తయారు చేయడం మొదలైంది. బాణసంచాను మొదటగా తయారు చేసినది చైనావాళ్లు. వాళ్ల నుంచి ఇది దేశ దేశాలకు పాకింది. అలాగే క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దం నాటికి మన దేశానికి కూడా చేరుకుంది. అప్పటి నుంచి దీపావళి పండుగ రోజు టపాకాయలు కాల్చడం అలవాటుగా మారింది. కాకరపూవొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, తాటాకు టపాకాయలు, తారాజువ్వలు వంటి బాణసంచా కాల్చడం, వాటి నుంచి వచ్చే రంగురంగుల వెలుగులను చూడటం ఎంతో సరదాగా ఉంటుంది కదూ! అయితే బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. జాగ్రత్తగా టపాకాయలు కాల్చండి టపాకాయలు కాల్చడం ఎంత సరదా అయినా, టపాకాయలు కాల్చడమంటే ఒకరకంగా నిప్పుతో చెలగాటమే! అందువల్ల టపాకాయలు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి: టపాకాయలు కాల్చేటప్పుడు వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి. టపాకాయలను చేత్తో పట్టుకుని నేరుగా కాల్చవద్దు. రేకు డబ్బాలు, సీసాలు, కుండలు బోర్లించి, వాటిలో టపాకాయలు అసలే కాల్చవద్దు. ఇలా చేయడం వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. బాణసంచా కాల్చేటప్పుడు చిన్నారులను ఒంటరిగా వదిలేయవద్దు. తల్లిదండ్రులు దగ్గరుండి, జాగ్రత్తగా కాల్పించండి. టపాకాయలు కాల్చేచోట బాగా నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అనుకోకుండా కాలిన గాయాలైతే, గాయమైన చోట బాగా నీరుపోసి, గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీపావళి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవచ్చు. (చదవండి: అతిపెద్ద బాలల మ్యూజియం!) -
విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!
మెరిసే కళ్ళు, సొట్ట బుగ్గలతో ముద్దొస్తున్న ఈ క్యూట్ గర్ల్ పేరు ఐరా! మంచు విష్ణు, విరానికాల చిన్న కూతురు. ఐరా.. బుజ్జి మోడల్గా .. అమ్మ విరానికా స్టార్ట్ చేసిన ఫ్యాషన్ బ్రాండ్ని ప్రమోట్ చేస్తోంది. ఆ ఫ్యాషన్ బ్రాండ్ గురించి కొన్ని విషయాలు..అమ్మ విరానికా .. ఐరాను ప్రేమగా ‘చిన్న పుప్పిటా’ అని పిలిచుకుంటే .. నాన్న విష్ణు ‘బిగ్గెస్ట్ బ్లాక్మెయిలర్’ అంటూ ముద్దు చేస్తాడట. ఇల్లు.. పిల్లలు.. వ్యాపారం.. ఈ మల్టీటాస్క్ని తనకు ఫింగర్ టిప్తో సమానమని నిరూపిస్తోంది విరానికా మంచు. న్యూయార్క్లో పుట్టి, పెరిగిన ఆమె.. జెమాలజీ, జ్యూలరీ డిజైన్, ఫ్యాషన్ మార్కెటింగ్లో డిగ్రీ చేసింది. సినీ హీరో మంచు విష్ణుని పెళ్లి చేసుకున్నాక ఇండియా వచ్చేసింది. ఇంట్లో వాళ్లకి కావలసిన డ్రెస్లు, నగలను తనే డిజైన్ చేస్తుంది. ‘విరానికా’ అని తన పేరు మీదే ఒక బొటిక్నీ నడుపుతోంది. అయితే అమ్మ విరానికా కల మాత్రం లండన్లో ఫ్యాషన్ స్టోర్ పెట్టాలనే! దాని కోసం వర్క్ చేసింది.. చివరకు సాధించింది. తాజాగా చిన్న పిల్లల కోసం ‘మేసన్ అవా’ అనే బ్రాండ్ని క్రియేట్ చేసింది. దాని స్టోర్ని.. వరల్డ్ ఫేమస్ లగ్జరీ డిపార్మెంట్ స్టోర్ అయిన హారోడ్స్ (లండన్)లో ఓపెన్ చేసింది. ఇక్కడ 2–14 సంవత్సరాల పిల్లల కోసం సరికొత్త డిజైన్స్లో అన్ని రకాల దుస్తులు ఉంటాయి. చాలా వరకు హ్యాండ్ మేడ్ డ్రెసెసే ఉంటాయి. ఈ బ్రాండ్కి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు డిమాండ్ ఉంది. ఈ బ్రాండ్ డిజైన్ చేసిన గౌనును 2021లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల కూతురు ఆరాధ్య బచ్చన్.. తన పుట్టినరోజు నాడు వేసుకుంది. అమెరికన్ మోడల్ ప్యారిస్ హిల్టన్ సైతం ‘మేసన్ అవా’ డ్రెస్ వేసుకుంది. ధరలు హై రేంజ్లోనే ఉంటాయి. ఆన్లైన్లోనూ లభ్యం. ఇక విరానిక కూతురు ఐరా ధరించిన మేసన్ అవా డ్రస్ ధర ఏకంగా డ్రెస్ రూ. 99,520/- (చదవండి: దీపాలతోనే కాదు..సంప్రదాయ దుస్తులతో కూడా కాంతిని నింపొచ్చు!) -
సిండా తరపున దీపావళి కానుకలను పంపిణీ చేసిన సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (సిండా) తరపున దీపావళి గూడీ బ్యాగ్లను సింగపూర్లో పంపిణీ చేయడం జరిగింది. భారత దేశ మూలాలు ఉన్న ఆర్థికంగా వెనుకబడిన సింగపూర్ పౌరులకు సిండా వారు ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవడానికి సహాయం చేస్తుంది. ఇందులో బాగంగా ఈ ఏడాది దీపావళి అలంకరణకు సంబందించిన సామాగ్రి తో పాటు కొన్ని తినుబండారాలు 120 డాలర్లు పండుగ ఖర్చుల నిమిత్తం అందజేసింది. అయితే సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (సిండా) పిలుపు మేరకు ఈ సంవత్సరం ఒక వారం రోజుల పాటు, 05 నవంబర్ నుండి 11 నవంబర్ వరకు దీపావళి సామాగ్రిని పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులను సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు అభినందించారు. ఈ కార్యక్రమం లో స్వచ్ఛదంగా పాల్గొన్న సొసైటీ అధ్యక్షులు గడప రమేశ్ బాబు, ఇతర సభ్యులు రావుల సుగుణాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంగళ విజయ మోహన్, పలిక ప్రణీష్, పెరుకు శివ రామ్ ప్రసాద్ మరియు ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ మొదలగు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలుడు గడప కౌశల్ చంద్ర ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో అభినందించదగిన విషయం అని సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు అన్నారు. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
దీపావళిని హిందువుల తోపాటు ఎవరెవరూ జరుపుకుంటారంటే..?
దీపావళిని కేవలం హిందువులు మాత్రమే కాదు వివిధ రకాల మతస్తులు కూడా జరుపుకుంటారు. అందులో కూడా చాలా విభిన్న రకాలుగా ఉంటాయి. ఇక దీపాలు వెలిగించి బాణాసంచాలు కాలుస్తూ దేశవిదేశాల్లో ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఏయే మతస్తులు ఏవిధంగా జరుపుకుంటారో చూద్దాం!. ఈ పండగను హిందువులతో పాటుగా బౌద్ధులు, జైనులు,సిక్కులు కూడా వారి వారి మత సంప్రదాయాలను అనుసరించి పాటిస్తారు! కొందరు ఈ పండుగ నుంచి కొత్త సంవత్సరాన్ని కూడా ప్రారంభిస్తారు! ఈ పండగని ఉత్తర భారత దేశంలో ఐదు రోజుల పండుగగా చేస్తారు. దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశిగా వ్యవహరిస్తూ ..ఆ రోజు లక్ష్మీ పూజ చేసే అలవాటు కూడా ఉంది. మనం మూడు రోజుల పండుగగా దీన్ని జరుపుకుంటాం !నరక చతుర్దశి,దీపావళి అమావాస్య,బలి పాడ్యమి అని ఆ మూడు రోజులను వ్యవహరిస్తారు!మొదటి రెండు రోజులు ఆశ్వయుజ మాసంలో చివరన వస్తాయి.మూడవది అయిన బలి పాడ్యమి మాత్రం కార్తీకమాసం మొదటి రోజున జరుపుకుంటారు!నరక చతుర్దశి రోజున తెల్లవారు జామునే నిద్రలేచి,నరకుని సంహరించి ,అభ్యంగన స్నానాలు ఆచరిస్తారు!సత్యభామ సమేతుడై శ్రీ కృష్ణుడు నరక సంహారం కోసం సమాయత్తమయ్యాడు!ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి రెండు జాములకు నరకాసుర సంహారం జరిగింది!ఆ పౌరాణిక గాధ మీకందరికీ తెలిసిందే! ఈ కధ బహుళ ప్రచారంలో ఉన్నప్పటికీ,ఈ పండుగకు ,దీనికీ సంబంధించిన సరైన నిర్ధారణ ఏ వ్రత గ్రంధాలలోనూ లేదు! నిజానికి దీని అర్ధం 'నరకం'నుండి విముక్తి పొందాలని!అయితే ,దానికి నరకాసురిడి పేరుని అన్వయించి నరక చతుర్దశిగా పండుగను చేసుకుంటున్నారు!ఈ పండుగను దేశమంతా ఎంతో ఘనంగా చేసుకుంటారు! కొత్త బట్టలు ధరించి,మిఠాయిలు పంచి, దీపాలతో గృహాలను అలంకరించి--ఎంతో దేదీప్యమానంగా ఈ పండుగను జరుపుకుంటారు. వ్యాపారులు ,లక్ష్మీపూజ చేసి వ్యాపార స్థలాలను కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు అత్తవారింటికి రావటం కూడా ఆనవాయతీ ఉంది! ఈ పండుగకు దేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తారు!. ఈ దీపాలు వెలిగించటం వెనక ఒక ఆధ్యాత్మిక ఉద్దేశ్యం కూడా లేకపోలేదు!. దుర్గా దీపావళి..! మనలో ఉన్న అజ్ఞాన తిమిరాన్ని బయటికి త్రోలి,జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలని దీని ఉద్దేశ్యం. దీపావళి అంటే దీపముల వరుస అని అర్ధం. శ్రీరామచంద్రుడు 14 ఏండ్ల అరణ్యవాసం తర్వాత ఈ రోజున మళ్ళీ అయోధ్యలో కాలు పెట్టాడు. విజయదశమి రోజున రావణ సంహారం జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ రోజు దీపావళి పండుగతో పాటుగా కాళీపూజను కూడా జరుపుకుంటారు. వారు ఈ పండుగను దుర్గా దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ దీపావళి పండుగ రోజుల్లోనే అశోక చక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించటం చేత బౌద్ధులు కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. జైన మత స్థాపకుడైన మహావీరుడు నిర్యాణం చెందిన రోజు కూడా ఈ దీపావళి పండుగ రోజుల్లోనే రావటం వల్ల, జైనులు కూడా ఆయనకు స్మ్రుతి చిహ్నంగా దీపాలను వెలిగించి ఈ పండుగను చేసుకుంటారు! సిక్కుల తొమ్మిదవ గురువైన గురు హర్ గోవింద్ ఈ రోజునే గ్వాలియర్ చెరసాల నుంచి విడుదలయిన రోజు కావటం చేత, సిక్కు మతస్తులు కూడా దీపాలు వెలిగించి ఈ పండుగను జరుపుకుంటారు. దీపాలను వెలిగించటం భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికతను కూడా సంతరించుకుంది. దురదృష్టం ఏమిటంటే,కొందరికి మాత్రమే ఇది దీపావళి,చాలామంది పేదలకు ఇది అమావాస్య !అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూసే అసలు దీపావళి త్వరలోనే రావాలని భగవంతుని వేడుకుందాం! --కూర్పరి - శారదాప్రసాద్ (చదవండి: దీపావళి లక్ష్మీ పూజా విధానం, వ్రత నియమాలు.!) -
దీపావళి లక్ష్మీ పూజా విధానం, వ్రత నియమాలు.!
విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి, భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు. ఋగ్వేదకాలంలో అదితి,రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు. లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదనిm, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీదేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు. లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి , భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది. ఇక ఈ దీపావళి పర్వదినాన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేలా ఆచరించాల్సిన పూజా విధానం ఏంటంటే.. లక్ష్మీ దేవిని వినాయకుడిని.. దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి. ప్రాణ ప్రతిష్ఠ ‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే బెల్లం ముక్కను నివేదన చేస్తూ ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్ బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. కలశ స్థాపన వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి. ‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’ లక్ష్మీదేవి అధాంగ పూజ చంచలాయై నమః పాదౌ పూజయామి చపలాయై నమః జానునీ పూజయామి పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి కమలవాసిన్యై నమః కటిం పూజయామి పద్మాలయాయై నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః స్తనౌ పుజయామి లలితాయై నమః -భుజద్వయం పూజయామి కంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామి సుముఖాయై నమః- ముఖం పూజయామి శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి సునాసికాయై నమః నాసికం పూజయామి సునేత్రాయై నమః ణెత్రే పూజయామి రమాయై నమః కర్ణౌ పూజయామి కమలాలయాయై నమః శిరః పూజయామి ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి. లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం మీ శక్తి కొద్ది స్తోత్రాలను చదివి, దీపం , దూపంలను సమర్పించిన అనంతరమే నైవైద్యం సమర్పించాలి. ఈ క్రింది మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి. యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. చివరిగా సాష్టాంగ నమస్కారం నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి సంధ్యాసమయంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనె/కొబ్బరి నూనెతో దీపాలను ఇంటిముందర ఓ వరస క్రమంలో వెలిగించాలి. (చదవండి: వెలుగుల ఉషస్సు) -
ఒకే నెలలో ఐదు సార్లు రాష్ట్రానికి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నెల ఏడో తేదీన, తాజాగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లోనూ బహిరంగసభలు, రోడ్షోలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. ఈనెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. బీజేపీకి ఊపు తెచ్చేందుకు 25న కరీంనగర్, 26న నిర్మల్ బహిరంగ సభల్లో, 27న హైదరాబాద్లో నిర్వహించే రోడ్షోలో మోదీ పాల్గొననున్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ పర్యటన షెడ్యూల్ ఖరారైతే.. ప్రధాని మోదీ నెల రోజుల్లోనే ఐదుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. అయితే ప్రధాని గత నెల 1, 3వ తేదీల్లో మహబూబ్నగర్, నిజామాబాద్లలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అవి కూడా కలిపితే రెండు నెలల్లో ఏడుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. దీపావళి దాటగానే జోరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపావళి పండుగ దాటగానే జోరు పెంచాలని బీజేపీ నిర్ణయించింది. దీపావళి తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆరోజు నుంచి ప్రచార గడువు ముగిసే 28వ తేదీ వరకు ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్, యూపీ, మహారాష్ట్ర, అస్సాం, గోవా సీఎంలు యోగి ఆదిత్యనాథ్, ఏక్నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్లతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
ప్రజలందరికీ సీఎం వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి : దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దీపావళి అంటేనే కాంతి-వెలుగు. చీకటిపై వెలుగు..చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం..దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని కోరుకుంటున్నా’ అని సీఎం జగన్ ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు.. చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం.. దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకొనే పండుగ దీపావళి. ఈ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 12, 2023 -
బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారా?బీపీ నుంచి హార్ట్ఎటాక్ వరకు..
ఇవాళ ధనత్రయోదశి. దీనినే ధన్ తేరస్ అని కూడా అంటారు. ఈ పర్వదినాన సాధారణంగా అందరికీ బంగారం, వెండి, గృహోపకరణాలు, వస్తు వాహనాల వంటి వాటి మీదికే దృష్టి మళ్లుతుంది. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి జయంతి కూడా ఇదే రోజు అని గుర్తు రాదు. అయితే ఆరోగ్యం కూడా ధనమే కాబట్టి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుని అందుకు తగినట్లు నడుచుకుంటే ఆరోగ్య ధనం, ఆరోగ్య మహాభాగ్యం సమకూరుతుంది. ధన త్రయోదశి సందర్భంగా ఆరోగ్య సంపదను ఏవిధంగా పెంపొందించుకోవాలో చూద్దాం... సంపూర్ణ ఆరోగ్యానికి ఆహార విహారాలు ఎంత అవసరమో, నిత్యం నడక, వ్యాయామం, యోగా కూడా అంతే అవసరం. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటిస్ వరకు.. బీపీ నుంచి హార్ట్ ఎటాక్ వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం కావాలంటే రోజూ వ్యాయామం, యోగా చేస్తుండాలి. సమయానికి తగు... మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో ఆ ఆహారాన్ని తగిన సమయానికి తీసుకోవడం కూడా అంతే అవసరం. వేళ తప్పి భోజనం చేస్తే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సరైన సమయాలకు భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి రోజూ ఉదయాన్నే టిఫిన్ చేయడం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కొందరికి అలా బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటు ఉండదు. అలాంటి వారు అల్పాహారంగా నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, మొలకెత్తిన గింజలు, అవిసెలు, తాజాపండ్లు, కూరగాయల ముక్కలు లాంటివి అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. లంచ్గా ఇవి... మధ్యాహ్నపు భోజనంగా సగం కంచంలో తాజా కూరగాయలు, మిగతా సగంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెర నిల్వల్ని అదుపులో ఉంచుకోవడానికి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి చిరు ధాన్యాన్ని ప్రయత్నించవచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి. ఎందుకంటే, మనం వాడే ప్లాస్టిక్ వస్తువుల నుండి, రోజుకి కొన్ని లక్షల సూక్ష్మరేణువులు విడుదలవుతాయి. వాటిలో ఉండే రసాయనం హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుంది. మానసిక దృఢత్వం మానసిక ఆరోగ్యం బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. ఇందుకోసం నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. కంటినిండా నిద్ర కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోతే ఏ జబ్బూ ఉండదని పెద్దవాళ్లనేవారు. వేళకు తగినంత రాత్రి నిద్ర ఉంటే పొద్దున లేవగానే ఉత్సాహంగా ఉంటుంది. లేదంటే నిస్సత్తువగా... ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. నిద్ర లేమి వల్ల రకరకాల ఇతర జబ్బులు వస్తాయి. అందువల్ల వీలయినంత వరకు వయసును బట్టి, చేసే శారీరక శ్రమను అనుసరించి తగినంత నిద్ర పోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ ధన త్రయోదశి నాడు అందరూ ఆరోగ్య ధనాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తారని, వేయారనీ ఆశిద్దాం. -
దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి ఇలా..
దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంటిని డెకరేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి. ►గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది. ► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది. ► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్ విండో, డోర్లకు కర్టెన్స్లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది. ► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ పెట్టి వెలిగించాలి. ► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి. ► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది. ► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్ఫుల్ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. ► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్లో దొరికే చెక్క, యాక్రాలిక్ ల్యాంప్స్ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్ డెకరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టండి. -
నేడు అయోధ్యలో 51 ఘాట్లలో 24 లక్షల దీప కాంతులు!
అయోధ్యలో దీపావళిని మరింత దేదీప్యమానం చేసేందుకు ఈసారి కూడా రామనగరిని అందంగా ముస్తాబు చేస్తున్నారు. అయోధ్యలోని 51 ఘాట్లలో నవంబరు 11న(నేడు) 24 లక్షల దీపాలు వెలిగించి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 6 సంవత్సరాలుగా అయోధ్యలో జరుగుతున్న దీపోత్సవం ప్రపంచ రికార్డులను సృష్టిస్తోంది. ఈ సంప్రదాయం ఈసారి కూడా కొనసాగనుంది. దీపావళి సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున లేజర్ షో ద్వారా శ్రీరాముని జీవిత సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించనున్నారు. మనదేశానికి చెందిన కళాకారులతో పాటు రష్యా, శ్రీలంక, సింగపూర్, నేపాల్కు చెందిన కళాకారులు కూడా ఈ దీపోత్సవ్లో రామలీలను ప్రదర్శించనున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దీపావళి నాడు అయోధ్యలో త్రేతాయుగం కళ్లకు కట్టినట్లు చూపేందుకు కళాకారులు సన్నద్ధమవుతున్నారు. రామ మందిర నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈసారి యూపీతో పాటు పలు రాష్ట్రాల సంస్కృతులను ప్రదర్శనల్లో చూపనున్నారు. ఇప్పటికే అయోధ్యానగరి దీప కాంతులతో మెరిసిపోతోంది. రోడ్లు, ఇళ్లు, వీధులు జనాలతో రద్దీగా మారిపోయాయి. కాగా అయోధ్యలో జనవరి 22న రామాలయంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది? #WATCH | Ayodhya is all set to hold a grand Deeptosav on the eve of Diwali with over 24 lakh diyas at 51 ghats set to illuminate the city pic.twitter.com/p4cEjJQiCd — ANI (@ANI) November 11, 2023 -
బంతిపూలకు మాత్రమే ఆ ప్రత్యేకత.. అందుకే పూజల్లో వాడుతారు
వేడుక వచ్చిందంటే చాలు బంతిపూల తోరణాలతో ఇళ్లూ వాకిళ్లు కళకళలాడుతూ ఉంటాయి. బంతిపూలకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే బంతిని మనకు ప్రకృతి ఇచ్చిన బహుమతిగా చెప్పచ్చు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే భూమిలోని చీకట్లు తొలగి వెలుగు రేకలు అంతటా వ్యాపిస్తాయి. అదేవిధంగా, బంతిపువ్వును చూడగానే, మన మనస్సు తన బాధలను మరచిపోయి సంతోషిస్తుంది. ఈ సారూప్యత వల్ల బంతిపువ్వును సూర్యభగవానుడికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. గణేష్ చతుర్థి, నవరాత్రుల నుండి దీపావళి వరకు ఈ పూలకు చాలా డిమాండ్ ఉంది. మ్యారిగోల్డ్ శాస్త్రీయ నామం టాగెట్స్. భారతదేశానికి 350 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వారి రాకతో మెక్సికో నుండి చేరుకుంది బంతి. చాలా అందంగా కనిపించే పసుపు, కుంకుమ రంగులో ఉండే ఈ పువ్వులను అందరూ ఇష్టపడతారు. విస్తారంగా సాగు.. మన దేశంలో బంతిపూల సాగు పెద్ద ఎత్తున చేస్తుంటారు రైతులు. ఇది మతపరమైన ఆచారాలతో పాటు, అనేక ఉత్పత్తుల తయారీలలో కూడా ఉపయోగపడుతుంది. సీజన్ను బట్టి బంతి పువ్వులను సాగు చేస్తారు. ఇది ఏప్రిల్, మే నెలల్లో సాగును ప్రారంభిస్తే ఆగస్టు–సెప్టెంబర్లలో చలికాలం ప్రారంభమవడానికి ముందు పంట చేతికొస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 50 రకాల బంతి పువ్వులు ఉన్నాయి, వాటిలో మూడు జాతులు వాణిజ్య, వ్యవసాయం కోసం పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల పొలాలు బంతి పువ్వులతో వెలిగిపోతుంటాయి. త్యాగానికి పేరు బంతి పువ్వు బృహస్పతికి ఇష్టమైనదిగా జ్యోతిష్యులు చెబుతుంటారు. దేవతల గురువు బృహస్పతిని బంతి పువ్వులతో పూజిస్తే జ్ఞానం పెంపొందుతుందని నమ్మకం. పసుపు–కుంకుమపువ్వును కలిపినట్టుగా ఉండే ఈ రంగు త్యాగానికి ప్రసిద్ధి చెందింది, మరోవైపు ఇది అగ్ని వంటి ఉగ్రమైన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రజల మొదటి ఎంపిక ప్రజలు తమ ఇళ్లను బంతి పువ్వులతో అలంకరిస్తారు. కోల్కతా నుంచి వచ్చే బంతిపూలలో ఒకటి ఎరుపు, మరొకటి పసుపు. ఈ రంగు పువ్వులను బసంతి మేరిగోల్డ్ అంటారు. ఇదే అన్ని చోట్ల జనం మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారు. బంతిపూలతో అందంగా మెరిసిపోవచ్చు బొబ్బలు, కాలిన గాయాలు, దురదలు, చర్మవ్యాధుల నివారణలో బంతి పువ్వులను ఉపయోగిస్తారని ఆయుర్వేదంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రక్తకణాలను ఉత్పత్తి చేసి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మార్చగలవు. బంతి పువ్వులు వాపునే కాదు అలసటను తగ్గించడానికి కషాయంలా కూడా ఉపయోగిస్తారు. బంతి పువ్వు పొడి ముడతలు పడిన చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. బంతి పువ్వులు సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడతాయి. అందమైన ప్రయోజనాలు బంతిపూలు యాంటీ బయొటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. మేరిగోల్డ్ ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు చర్మకాంతిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమలు, ముఖంపై మచ్చలు ఉన్నవారు బంతి పువ్వు ఫేస్ ప్యాక్ని ఉపయోగించవచ్చు. అందుకే, సౌందర్య ఉత్పత్తులు, మసాజ్ నూనెలు, లోషన్లు, సబ్బులు.. మొదలైన ఉత్పత్తులలో బంతిపువ్వులను ఉపయోగిస్తారు. దీని ఉపయోగం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని నొప్పి, వాపును తగ్గించడానికి, పేగు, కడుపు రుగ్మతల నుండి ఉపశమనానికి, అల్సర్లను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. -
ప్రేమలో గీతాశంకరం
ముఖేష్ గౌడ, ప్రియాంకా శర్మ జంటగా కె.దేవానంద్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘గీతా శంకరం’. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ గౌడ మాట్లాడుతూ– ‘‘సీరియల్స్లో పేరు సంపాదించుకున్నట్లే ఈ సినిమాతో వెండితెరపై కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించడం నా లక్గా భావిస్తున్నా’’ అన్నారు ప్రియాంకా శర్మ. ‘‘ఇరవై కథలు విన్నాం. కానీ రుద్ర చెప్పిన ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ నెల 14న కొత్త షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అన్నారు దేవానంద్. ‘‘ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు రుద్ర. ఈ చిత్రానికి సంగీతం: అబు, కెమెరా: ఉదయ్ ఆకుల. -
Sara Ali Khan: బాలీవుడ్ హీరోయిన్ ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
దీపాలతోనే కాదు..సంప్రదాయ దుస్తులతో కూడా కాంతిని నింపొచ్చు!
పట్టుబట్టలతోనే కాదు మనవైన సంప్రదాయ దుస్తులతోనూ వెలిగిపోవచ్చు. మోడ్రన్ షేర్వాణీలను ధోతీ ప్యాంట్లతో మ్యాచ్ చేయచ్చు. పర్యావరణ అనుకూలమైన డ్రెస్సులను ఎంచుకోవచ్చు. పాత కాలం నాటి ప్రింట్లు, హ్యాండ్మేడ్ డిజైన్స్కి ప్రాధాన్యం ఇవ్వచ్చు. ఎవర్గ్రీన్ లుక్తో రాబోయే రోజులను ప్రకాశవంతంగా మార్చడానికి ఈ దీపావళి నుంచే మొదలుపెట్టవచ్చు. పండగ రోజున దీపాలనే కాదు సరికొత్త ట్రెండ్తో వార్డ్ రోబ్లను కూడా వెలిగించవచ్చు. ప్రతి వేడుకలోనూ మెరిసిపోవచ్చు. నియో–సంప్రదాయం పాతకాలం నాటి కుర్తాలు, షేర్వాణీలు ఇప్పుడు కొత్తగా రూపాంతరం చెందాయి. ఈ దీపావళికి ఇవి ఎంతో అందంగా ఉంటాయి. అలాగే, లేయర్డ్ షేర్వాణీలు, ధోతీ ప్యాంట్లను ధరించవచ్చు. వీటిని మోడర్న్ డిజైన్, ఓల్డ్ ట్రెడిన్ తో మిళితం చేయచ్చు. ఈ మిక్స్ అండ్ మ్యాచ్ వల్ల సొగసైన రూపాన్ని పొందవచ్చు. ఇక నియాన్ కలర్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. వీటిలో బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్ చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి సాధారణ రంగుల నుండి కాంతివంతంగా కనిపిస్తాయి. పర్యావరణ అనుకూలం సరైన అవగాహనతో ఫ్యాష పర్యావరణ అనుకూల బట్టల వైపు మొగ్గు చూపుతోంది. సేంద్రియ పత్తి, వెదురు, జనపనార బట్టలు స్థిరంగా ఉండటమే కాకుండా మట్టి సొబగులను కూడా వెదజల్లుతాయి. సురయ్యా, ఇతర ప్రముఖ బ్రాండ్లు ఈ ట్రెండ్లో ముందంజలో ఉన్నాయి. చేతితో తయారు చేసిన పాదరక్షలు పాదరక్షల్లో మన దేశీయ హస్తకళా నైపుణ్యం తనదైన ముద్ర వేస్తోంది. జూతీలు, కొల్హాపురీ, ఎంబ్రాయిడరీ ఇతర అలంకారాలతో చేతితో తయారు చేసిన పాదరక్షలలో దేనిని ఎంపిక చేసుకున్నా పండగ కళ కనిపిస్తుంది. ఇవి కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా ఉండటమే కాకుండా, వేడుకలో ప్రత్యేకమైన టచ్ను అందిస్తాయి.పేస్టల్స్ పెరుగుదల దీపావళి ప్రకాశవంతమైన రంగులకు పర్యాయపదంగా ఉన్నప్పటికీ, లావెండర్, మింట్, బేబీ పింక్ పేస్టెల్ కలర్స్ పండుగ కళను పెంచుతాయి. ఈ రంగులు ప్రశాంతతతోపాటు రిచ్నెస్ను కళ్లకు కడతాయి. డిజిటల్ ప్రింట్లు సాంప్రదాయ మూలాంశాలు సాంకేతికత మన జీవితంలోని ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తున్నప్పుడు ఫ్యాషన్ను మాత్రం ఎందుకు వదిలివేయాలి... అందుకే, లోటస్ లేదా పీకాక్ ఫెదర్స్తో కూడిన భారతీయ సంప్రదాయ మూలాంశాలను ప్రదర్శించే డిజిటల్ ప్రింట్లు గొప్పగా కనిపిస్తున్నాయి. ఈ ప్రింట్లు, డిజైన్లు సంప్రదాయానికి ఆధునిక టచ్ను అందిస్తున్నాయి. పాతకాలపు డిజైన్ల పునరుద్ధరణ బనారసీ సిల్క్స్, చికంకారి ఎంబ్రాయిడరీ, బంధని వంటి పాతకాలపు వస్త్రాల ఆకర్షణ మళ్లీ మళ్లీ ఆకట్టుకుంటుంది. డిజైనర్లు ఈ సంప్రదాయ వస్త్రాలను ఆధునిక దుస్తులలో డిజైన్ చేస్తున్నారు. మనదైన గొప్ప వారసత్వాన్ని దేశీయ కళాకారులు కాపాడుతున్నారు. (చదవండి: అందాల చందమామ కాజల్ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!) -
అంతా జనంలోనే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే 20రోజుల పాటు పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ప్రజాక్షేత్రంలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావులతో రోడ్షోలు, సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ప్రచార గడువు ముగిసేవరకు కూడా పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులు, ఇతర ముఖ్య నేతలెవరూ తమకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించిన చోటి నుంచి కదలవద్దని పార్టీ అధినేత ఆదేశించారు. పార్టీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సెగ్మెంట్లతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట ఇప్పటికే సుమారు 60కి మందికిపైగా నాయకులకు ఇన్చార్జులుగా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీ యంత్రాంగాన్ని కదిలించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మండల స్థాయిలోనూ ఇన్చార్జులను నియమిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో సొంత నియోజకవర్గం వదిలి ఇతర నియోజకవర్గాలకు వెళ్లేందుకు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్న నేతలను గుర్తించి వారికి ఇతర నియోజకవర్గాల్లో మండల స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనితో ఇటు ఆయా సెగ్మెంట్లలో పారీ్టకి నష్టం జరగకుండా చూసుకోవడంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో బాధ్యతల అప్పగింత ద్వారా వారిని విశ్వాసంలోకి తీసుకుంటున్నామనే భరోసా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. దీపావళి తర్వాత మళ్లీ కేసీఆర్ సభలు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల జారీతోపాటు బహిరంగ సభల నిర్వహణలోనూ బీఆర్ఎస్ విపక్షాలతో పోలిస్తే దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 15న బీఫారాల జారీని ప్రారంభించడంతోపాటు హుస్నాబాద్లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత నెల 15 నుంచి ఈ నెల 9 వరకు 17 రోజుల వ్యవధిలో 43 చోట్ల కేసీఆర్ సభలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 97 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పోటీచేస్తున్న జనగామలో ఇప్పటికే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఆ నియోజకవర్గంలోని చేర్యాలలో ఈ నెల 18న రోడ్షో నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచారంలో ఇదొక్కటి మాత్రమే రోడ్షో. మిగతావన్నీ సభలే. ఈ నెల 28న గజ్వేల్లో ప్రచారంతో కేసీఆర్ పర్యటనలు ముగుస్తాయి. ఇక తొలి విడతలో సీఎం కేసీఆర్ సభలు జరిగిన నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్రావుల రోడ్షోలు, బహిరంగ సభలు ఉండే అవకాశముంది. మరోవైపు 38 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను బీఆర్ఎస్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచినట్టు తెలిసింది. అఫిడవిట్లను జల్లెడ పడుతున్న లీగల్ సెల్ నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగుస్తుండగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్ జల్లెడ పడుతోంది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తిన నేపథ్యంలో.. వీలైనంత మేర నామినేషన్ల పత్రాల్లో లోపాలు దొర్లకుండా లోతుగా పరిశీలించి గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. వార్రూమ్లతో సమన్వయం నియోజకవర్గాల స్థాయిలో వార్రూమ్లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. వాటిని హైదరాబాద్లోని సెంట్రల్ వార్రూమ్తో అనుసంధానం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావుల దిశానిర్దేశం మేరకు సెంట్రల్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వార్రూమ్లతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచార తీరుతెన్నులు తదితరాలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు పంపుతోంది. వాట్సాప్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా పార్టీ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వే నివేదికలు, ఫీడ్బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులు, ప్రచార తీరుతెన్నులను బీఆర్ఎస్ పెద్దలు మదింపు చేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. -
Rishi Sunak : డౌనింగ్ స్ట్రీట్లో ఘనంగా దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
దీపావళికి వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య జంటగా నటించిన ఫుల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రైడ్. దర్శకుడు ముత్తయ్య మాటలను అందించిన ఈ చిత్రం ద్వారా.. ఆయన శిష్యుడు కార్తీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎం.స్డూడియోస్, ఓపెన్ స్క్రీన్ పిక్చర్స్, జీ.పిక్చర్స్ సంస్థల అధినేతలు కే.కనిష్క్, జీకే, జీ.మణికన్నన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి పండగ సందర్భంగా ఈనెల 10న థియేటర్లలో థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ చిత్రం గురించి నటుడు విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. 'దర్శకుడు కార్తీ రైడ్ చిత్ర కథ చెప్పినప్పుడే అందులో యాక్షన్, ఎమోషనల్, లవ్, డాన్స్ అంటూ ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేసే అన్ని అంశాలు ఉన్న విషయాన్ని గ్రహించా. తాను కమర్షియల్ కథా చిత్రాల గురించి ఎక్కువగా ఆలోచిస్తా. మూవీ ఫైనల్ కాపీ చూసిన తరువాత దర్శకుడు నన్ను కమర్షియల్ హీరోగా చూపించడం సంతోషంగా అనిపించిందని' అన్నారు. రైడ్ సామాజిక సమస్యతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు కార్తీ చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే రాసుకున్నప్పుడే కథానాయకుడి పాత్ర పక్కింటి కుర్రాడిలా ఉండాలని భావించానన్నారు. అదే సమయంలో మాస్ హీరోగానూ కనిపించాలని అనుకున్నానని అన్నారు. ఇక ఈ చిత్రంలో హీరోగా విక్రమ్ప్రభు కరెక్ట్ అని యూనిట్ అంతా ముక్తకంఠంతో చెప్పారన్నారు. ఈ పాత్రకు విక్రమ్ప్రభు పూర్తి న్యాయం చేశారన్నారు. దర్శకుడు ముత్తయ్య సంభాషణలు ఈ చిత్రానికి వాణిజ్యపరంగా పక్కా బలంగా నిలిచాయన్నారు. -
ఇలా దీపాలు వెలిగిస్తే నరకం నుంచి విముక్తి లభిస్తుందట!
చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపాలు లేకుండా దీపావళి పండుగ అసంపూర్ణమనే చెప్పాలి. దీపావళి నాడు దీపాలను వెలిగించడమనేది సాంప్రదాయంగా వస్తోంది. దీపాలు ఇంటికి వెలుగులు ఇవ్వటమే కాదు మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగ ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగకి వెలిగించే దీపాల వల్ల నరకం వల్ల విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ దీపాల ప్రత్యేకత ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. నరక చతుర్దశి రోజున వస్తువులను దానం చేయడం సాంప్రదాయంగా వస్తోంది. చాలామంది ఆరోజు యమధర్మరాజు పూజలు కూడా చేస్తారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఇంటి ప్రధాన ద్వారాల వద్ద పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు అనుగ్రహం లభించి అకాల మరణాలు సంభవించకుండా కాపాడుతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. అందుకే ఈ పూజలో భాగంగా పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. దక్షిణం దిక్కున అభిముఖంగా ఈ పిండి దీపాలను వెలిగించి యమునికి ప్రీతికరమైన శ్లోకాలను పాటిస్తే మంచి జరుగుతుందని అంటారు. ఇలా చేయడం వల్ల అనుగ్రహంతో పాటు యమధర్మరాజు అనుగ్రహం కూడా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ముందుగా ఈ దీపాలను తయారు చేసుకోవడానికి ఒక కప్పులు గోధుమ పిండిని తీసుకుని అందులో తగినంత నీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని తీసుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని దీపాల ఆకారంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన దీపాలలో నూనె వేసి వెలిగించుకోవాలి. ఈ దీపాలను వెలిగించడం వల్ల చనిపోయిన తర్వాత నరకం నుంచి కూడా విముక్తి లభిస్తుందని అంటారు. దీపంతో దోషం పరిహారం జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. పిండి దీపం వెలిగించడం ద్వారా మీ కోరిక నెరవేరుందట. పిండి దీపాల వల్ల ఈ సమస్యలు తొలిగిపోతాయట ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే ప్రతిరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయట. బియ్యపు పిండితో చేసిన దీపారాధన వల్ల అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. -
Diwali Bash: దీపావళి వేడుకల్లో మెరిసిపోయిన బాలీవుడ్ తారలు ఫోటోలు
-
బ్రిటన్ ప్రధాని ఇంట.. దీపావళి సంబరాలు
లండన్: లండన్ వేదికగా దీపావళి సంబరాలు ఊపందుకున్నాయి. సాక్షాత్తు ప్రధాని నివాసం అధికారిక భవనంలో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగాయి. దీపావళి వేడుకలకు హిందూ బంధువులను ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఆహ్వానించారు. చీకటిపై వెలుతురు విజయ సూచకంగా దీపాలను వెలిగిస్తున్న ఫొటోలను ప్రధాని రిషి సునాక్ అధికారిక ఖాతాలో పంచుకున్నారు. అక్షతా మూర్తి దీపాలను వెలిగిస్తుండగా.. ఆమె చుట్టూ జనం గుమిగూడి ఉన్న ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. యూకే, ప్రపంచమంతటా దీపావళి వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. Tonight Prime Minister @RishiSunak welcomed guests from the Hindu community to Downing Street ahead of #Diwali – a celebration of the triumph of light over darkness. Shubh Diwali to everyone across the UK and around the world celebrating from this weekend! pic.twitter.com/JqSjX8f85F — UK Prime Minister (@10DowningStreet) November 8, 2023 చీకటిపై వెలుతురు, చెడుపై మంచి విజయసూచకంగా దీపావళి పండుగను హిందువులు ఈ ఏడాది నవంబర్ 12న జరుపుకుంటారు. ఇరు దేశాల నాయకులు రిషి సునాక్, ప్రధాని మోదీ ఇటీవల టెలిఫొన్లో సంభాషించుకున్నారు. స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందంపై పురోగతి దిశగా అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. వరల్డ్ కప్ సందర్భంగా భారత్కు రిషి సునాక్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: నేను భారతీయురాలినైతేనా..? నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ఫైర్ -
దీపావళికి దీన్ని గిఫ్ట్గా ఇస్తున్నారా? అలాంటివి కొనేటప్పుడూ..
ఇటీవల కాలంలో ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడంలో ట్రెండ్ మారిందనే చెప్పాలి. చాలా విభిన్నంగా ఇవ్వాలనే చూస్తున్నారు. అందులోనూ ఆరోగ్య దృష్ట్యా మంచివి ఖరీదైన వాటిని ఇచ్చేందుకు చూస్తుంటారు కొందరూ. ఇటీవల పండుగకి స్వీట్స్ బదులు ఆరోగ్యానికి ఎంతో మంచివైన డ్రై ఫ్రూట్స్ వంటివి గిఫ్ట్గా ఇచ్చే ట్రెండ్ బాగా వచ్చింది. ఈసారి దీపావళి పండుగకి డ్రై ఫ్రూట్స్ని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే కచ్చితంగా ఇవి గుర్తుంచుకోండి. డ్రైఫ్రూట్స్ను కొనేటప్పుడు కచ్చితంగా ఇవి గమనించాలి.. నట్స్ రంగు ఎలా ఉందో చూడాలి. సహజంగా ఉండాల్సిన దానికంటే మరింత ముదురు రంగులో ఉంటే అవి పాడైనట్టు. రుచిగా కూడా ఉండవు కాబట్టి కొనకపోవడమే మంచిది. వీలైతే ఒకటి రెండు నట్స్ను నీటిలో వేసి, పదినిమిషాల తరువాత కొరికి చూడాలి. నానిన తరువాత కూడా గట్టిగా ఉంటే అవి చాలా పాతవి. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి తీసుకోకూడదు. చాలా షాపులు తినడానికి శాంపిల్స్ ఇవ్వవు. ఇలాంటప్పుడు ఆ డ్రైఫ్రూట్స్ను తక్కువ పరిమాణంలో కొనుక్కుని పరిశీలించాలి నట్స్ని వాసన చూడాలి. ఘాటైన వాసన వస్తే అవి చాలా పాతవి. వీటికి కొద్దిగా తేమ తగిలితే వెంటనే బూజు పట్టి త్వరగా పాడవుతాయి. ఇవి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు నట్స్ ప్యాకెట్ మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ ముద్ర, నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో చూడాలి. ఎప్పుడు ప్యాకింగ్ అయ్యింది? ఎప్పటిలోగా తినాలో సూచించే డేట్స్ను సరిగా చూసుకోవాలి. ఈ డేట్స్ ముద్రించని ప్యాకెట్స్ను కొనకూడదు ప్యాకెట్ మీద ముద్రించిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. ప్రిజర్వేటివ్లు కలిపిన నట్స్ను కొనకపోవడమే మంచిది. (చదవండి: ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!) -
దుబాయ్లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్ ఖలీఫాలో ఏం జరుగుతుంది?
దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా జరుపుకునే పండుగ ఇది. దీపావళి పండుగ ఆనందం, ఐక్యతలకు చిహ్నం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్లో దీపావళి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి ఉత్సవ సమయాన ప్రజలు నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. ముగ్గులతో గృహాలను, బహిరంగ ప్రదేశాలను అలంకరిస్తారు. ఈ సంప్రదాయం దుబాయ్లో కూడా కనిపిస్తుంది. దుబాయ్వాసులు దీపావళి రోజున తమ ఇళ్లను దీపాల వెలుగులతో నింపేస్తారు. వ్యాపార సంస్థలను విద్యుత్ లాంతర్లతో అలంకరిస్తారు. ఈ దీపాల వెలుగులు దుబాయ్ అంతటా కనిపిస్తాయి. దుబాయ్లో దీపావళి షాపింగ్ ఉత్సాహం కొన్ని వారాల ముందుగానే ప్రారంభమవుతుంది. దుబాయ్లోని మార్కెట్లు, మాల్స్ కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తాయి. భారతీయ సంప్రదాయ దుస్తులైన చీరలు, కుర్తా-పైజామాలు మార్కెట్లలో విరివిగా కనిపిస్తాయి. దీపావళి వేడుకలలో అంతర్భాగమైన తీపి వంటకాలను, రుచికరమైన స్నాక్స్ను విరివిగా విక్రయిస్తుంటారు. దీపావళి నాడు దుబాయ్లో బాణాసంచా వెలుగులు అద్భుతంగా కనిపిస్తాయి. బుర్జ్ ఖలీఫా, పామ్ జుమేరా లాంటి ముఖ్యమైన ప్రాంతాలలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటుతాయి. దీపావళి సందర్భంగా దుబాయ్లోని పలు రెస్టారెంట్లు ప్రత్యేక దీపావళి వంటకాల మెనూలను అందిస్తాయి. అక్కడి భారతీయులు, పర్యాటకులు ఈ సాంప్రదాయ వంటకాల రుచులను ఆనందంగా ఆస్వాదిస్తారు. ఇది కూడా చదవండి: చైనా దురహంకారంపై అమెరికా, భారత్ ఉక్కుపాదం! -
గ్రీన్ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది?
కోర్టులు, ప్రభుత్వాలు పర్యావరణ అనుకూల గ్రీన్ క్రాకర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. అయితే తాజా అధ్యయనాల్లో గ్రీన్ క్రాకర్స్కు సంబంధించిన 63 శాతం నమూనాలలో బేరియంతో పాటు ఇతర ప్రమాదకరమైన రసాయన మూలకాలు ఉన్నాయని తేలింది. ఇవి మన ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీపావళి వేడుకలు సమీపిస్తున్న సమయంలో వెల్లడైన ఈ అధ్యయనం టపాసుల విక్రేతల ఉత్సాహాన్ని చల్లార్చేలా ఉంది. ఈ తరహా గ్రీన్ క్రాకర్స్ విక్రయాలను నిలిపివేయాలని ఈ అధ్యయనం చేపట్టిన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎస్ఐఆర్ నీరి అధికారిక గ్రీన్ లోగోతో మార్కెట్లోకి విడుదల చేసిన టపాసులు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతాయని ఆ సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వేతర సంస్థలు, ఆవాజ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో గ్రీన్ టపాసులలో బేరియం, ఇతర ప్రమాదకరమైన రసాయన మూలకాలు ఉన్నట్లు తేలింది. ఇవి మనిషి ఆరోగ్యాన్ని హరింపజేస్తాయి. దేశవ్యాప్తంగా బేరియం వ్యాపింపజేసే పటాకులను నిషేధించారు. సాంప్రదాయ బాణసంచాలో వెలువడే మెటల్ ఆక్సైడ్ బేరియం అనేది శబ్ద కాలుష్యంతోపాటు కళ్ళు, ముక్కు, గొంతు, చర్మం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. ఇది కూడా చదవండి: ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి.. -
కిలో స్వీట్ రూ.21,000.. ఇదే ప్రత్యేకత..
దీపావళి సమీపిస్తున్న తరుణంలో మార్కెట్లో వివిధ రకాల స్వీట్లు ఆదరణ పొందుతున్నాయి. వాటిలో అహ్మదాబాద్లోని గ్వాలియాలో విక్రయిస్తున్న 'స్వర్ణ ముద్ర' అనే స్వీట్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఏకంగా ఆ స్వీట్ ఖరీదు కేజీ రూ.21వేలు. స్వర్ణ ముద్ర ఒక్క ముక్క రూ.1,400 రూపాయలు. ఒక కిలో స్వీట్లో దాదాపు 15 ముక్కలు ఉంటాయి. ఇంతకీ దాని ప్రత్యేకత ఎంటో తెలుసుకుందాం. ఆ స్వీట్ తయారీలో 24 క్యారెట్ల బంగారు పొరను ఉపయోగిస్తారు. దీన్ని బ్లూబెర్రీస్, బాదం, పిస్తా, క్రాన్బెర్రీస్ వంటి వాటితో తయారుచేస్తారు. పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది ఆర్డర్ చేసి మరీ ఈ స్వీట్ను తీసుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు. పండగలులేని సమయంలో పెళ్లివేడుకలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో బహుమతులు ఇవ్వడానికి ఈ స్వర్ణముద్రను ఉపయోగిస్తారని తెలిపారు. -
ఆనంద్ మహీంద్ర: వారందరికీ సలాం..! హార్ట్ టచింగ్ వీడియో వైరల్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. మహీంద్ర అండ్ మహీంద్ర అధిపతిగా కేవలం కార్లు గురించి మాత్రమే మాట్లాడుతారనుకుంటే పొరపాటే ఆధునిక టెక్నాలజీనుంచి, క్రీడలు, మోటివేషనల్ వీడియోల దాకా ప్రతీ అంశాన్నీ ఆయన తన ఫాలోవర్లతో పంచుకుంటారు. అంతేకాదు అవసరం అనుకున్న వారికి తన వంతు సాయం చేయడంలో ఎపుడూ ముందే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఎమోషనల్ వీడియోను ఎక్స్ ( ట్విటర్) లో షేర్ చేశారు. సానుకూల మార్పు వైపు పయనం అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. అలాగే ముందుగానే అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇపుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. షేర్ చేసిన గంటలోనే ఇది 72వేలకు పైగా వ్యూస్ని సాధించింది. భర్తకు యాక్సిడెంట్ కారణంగా కుటుంబాన్ని నడపటం భారమైన క్షణంలో భార్య తీసుకున్న నిర్ణయం విశేషంగా నిలిచింది. ఫీజుకు డబ్బులు కట్టాలి అడగడంతో ఈ వీడియో మొదలవుతుంది. నడవడం కష్టంగా ఉన్న తాను, ఇక ట్రక్ ఎలా నడుపుతాను, ఇప్పటికే వైద్యానికి చాలా ఖర్చయింది.. ఇక కుటుంబాన్ని ఎలా నడిపిస్తాను.. ఫీజులకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలి అంటూ భర్త ఆవేదన చెందుతూ వుంటాడు. భర్తను ఆ స్థితిలో చూసిన భార్య కుటుంబానికి నడిపించేందుకు డ్రైవర్గా ముందుకు వస్తుంది. భరోసాతోనే ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలు నాకు అప్పగించావు కదా. అదే భరోసాతో ట్రక్ నడుపుతాను అంటుంది. దీంతో అదే కొండంత భరోసాతో భార్యకు అండగా నిలుస్తాడు. చివరికి కాస్త ఒడ్డున పడతారు. భర్త మెల్లిగా నడవడం కూడా మొదలు పెడతాడు. ఇంతలో దీపావళి పండుగ. దీపావళికి ఇంటికి వస్తున్నావుగా అన్నీ చూస్తావు కదా అని కూతురు దీపతో చెబుతుంది. ఈ సందర్భంగా లక్ష్మీ కళతో ఉట్టిపడుతున్న తన గృహ లక్ష్మిని చూసి మురిసిపోతాడు భర్త. ప్రతీ గృహలక్ష్మికి మహీంద్ర ట్రక్ అండ్ బస్ సలాం అంటూ దివాలీ శుభాకాంక్షలతో ఈ వీడియో ముగుస్తుంది. ఇది చూసిన నెటిజనులు సూపర్ సార్ అంటూ ప్రశంసలందిస్తున్నారు. పాజిటివ్ మెసేజ్ సార్.. హ్యాపీ దివాలీ అంటూ మరికొందరు యూజర్లు స్పందించారు. ముఖ్యంగా మహీంద్ర ట్రక్ అండ్ బస్ ప్రమోషనల్ వీడియోలాగా ఇది అనిపించినా, మహిళలు ఏదైనా సాధించగలరనే సానుకూల వైఖరి, అవసరమైతే వారు డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటారనే సందేశంతోపాటు, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని కూడా ఇది హైలైట్ చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి! DRIVING positive change. Literally. Diwali greetings in advance from @MahindraTrukBus When every family member Rises to the occasion. pic.twitter.com/yYJcvKOwtP — anand mahindra (@anandmahindra) November 8, 2023 -
Diwali 2023: ఈసారి దీపావళి పండుగ 12,13.. ఎప్పుడు జరుపుకోవాలి?
హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో దీపావళి కూడా ఒకటి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిచేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కుల, మత భేదం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు. అయితే ఈసారి దీపావళి వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై ఆయోమయం నెలకొంది. మరి అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ధనత్రయోదశి ఎప్పుడు నిర్వహించాలి? అన్న విషయాలపై పండితులు ఏమంటున్నారంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన దీపావళి పండగను జరుపుకుంటారు.అయితే అధికమాసం కారణంగా దాదాపుగా అన్ని పండుగలు రెండు రోజులు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీపావళి కూడా రెండు రోజులు రావడంతో ఏరోజు పండగను జరుపుకోవాలి అన్న సందిగ్ధత నెలకొంది. ఈ సంవత్సరం కార్తీక మాస అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. కాబట్టి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు. అయితే సోమవారం(నవంబర్13)న మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆరోజు వైధిక క్రతువులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీపదానాలు, యమ తర్పణాలు ఇతరత్ర దీనం చేయడానికి సోమవారం వీలుంటుందని, ఆరోజు వైధిక దీపావళిగా పండగను జరుపుకోవచ్చని పేర్కొన్నారు. -
దీపావళి వేడుకలు.. అమెరికాలో స్కూళ్లకు సెలవు
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్లో దీపావళి ఫెస్టివల్ గ్రాండ్గా జరిగింది. పాపాయిని పార్క్లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ వేడకల్లో పాల్గొన్నారు. తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ ఈ వేడుకలు నిర్వహించారు. తెలుగు పాట,ఆట కనువిందు చేశాయి. తెలుగు సంస్క్రృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి తీసుకువచ్చారు. ఇక వేదికపై బతుకమ్మలను పెట్టి ఆడపడుచులు ఆడి పాడారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక పలువురు కళాకారులు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలు నిర్వహించారు. జే సీన్ స్ఫెషల్ మ్యూజికల్ ఫెర్మామెన్స్.. అహుతులను అలరించింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్స్ స్టాల్స్, కిడ్స్ జోన్, ఫైర్ వర్క్, Raffles బహుమతులు, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనటం ఒక అద్భుతమైన అనుభవం అంటూ ప్రవాసులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న ఎడిసన్ మేయర్ సామ్ జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు
శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించే దీపావళికి ఇంకా కొద్దిరోజులే ఉంది. ఈ నేపధ్యంలో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు యూపీలోని అయోధ్య నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. దీపావళి రోజున అయోధ్యలో దీపాల పండుగతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రామాయణంలోని పలు సంఘటనల ఆధారంగా వివిధ నృత్య , సంగీత కార్యక్రమాలను కళాకారులు ప్రదర్శించనున్నారు. రామాయణంలోని వివిధ పాత్రలతో కూడిన శకటాలు రామకథా పార్కుకు చేరుకుంటాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీటికి సారధ్యం వహిస్తారు. దీపావళి రోజున సరయూ నది ఒడ్డున నిర్వహించే దీపోత్సవం కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజున ఇక్కడికి తరలివచ్చే భక్తుల కోసం అధికారులు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: యోగి సర్కార్ దీపావళి కానుక.. వీధి వ్యాపారులకు పండుగే పండుగ! -
యోగి సర్కార్ దీపావళి కానుక.. వీధి వ్యాపారులకు పండుగే పండుగ!
ఉత్తరప్రదేశ్లోని వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయాన్ని అందించేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని 75 జిల్లాల్లో నవంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు దీపావళి మేళా నిర్వహించనున్నారు. పీఎం స్వనిధి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ మేళా జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర పట్టణ జీవనోపాధి మిషన్ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణ పౌరులకు అవసరమయ్యే ఉత్పత్తులను ఒకే చోట అందించేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎకె శర్మ తెలిపారు. ఈ మేళాతో వీధి వ్యాపారులకు, స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయం అందుతుందని అన్నారు. ఈ మేళాకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. మేళా జరిగే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా యోగి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, బోనస్ను కానుకగా ఇచ్చింది. అలాగే గృహిణులకు పీఎం ఉజ్వల పథకం కింద రెండు ఉచిత సిలిండర్లను బహుమతిగా అందించింది. ఈ కోవలోనే వీధి వ్యాపారులకు దీపావళి మేళా ద్వారా అదనపు ఆదాయానికి మార్గం చూపింది. ఇది కూడా చదవండి: అయోధ్య భద్రత ఒక సవాలు: సీఆర్పీఎఫ్ -
బాబోయ్.. బాణసంచా
సాక్షి, హైదరాబాద్: వరుస ప్రమాదాలతో సతమత మవుతున్న రైల్వే శాఖ ఇప్పుడు దీపావళి పండుగ అనగానే తీవ్ర ఆందోళనకు గురవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా బ్యాగుల్లో బాణసంచా పెట్టు కుని కొందరు ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రతీ దీపావళి సంద ర్భంలో రైల్వే ఉద్యోగులు తనిఖీలు చేస్తుంటారు. అయినా వాటిని పూర్తిగా నియంత్రించ లేకపోతు న్నారు. కొంతకాలంగా రైల్వే భద్రతపై మళ్లీ విమ ర్శలు వస్తున్నాయి. ఇటీవల తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రయా ణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. పరస్పరం రెండు రైళ్లు ఢీకొంటుండటంతో పాటు అగ్ని ప్రమా దాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈసారి దీపావళి సందర్భంగా రైళ్లలో బాణసంచా తరలించకుండా మరింత పకడ్బందీగా వ్యవహరించాలని రైల్వే శాఖ జోన్లను ఆదేశించింది. రంగంలోకి స్నిఫర్ డాగ్స్.. నిత్యం కిటకిటలాడే ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయా ణికుల తనిఖీ రైల్వే సిబ్బందికి సవాల్గా ఉంటోంది. వందలాది మంది ఒకేసారి వస్తుండటంతో వారి ని క్రమపద్ధతిన లోనికి పంపుతూ చెక్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటం కుదరటం లేదు. స్టేషన్కు వెళ్లేందుకు నాలుగైదు దారులు ఉండటంతో, ఏదో ఓ దారి నుంచి లోనికి చేరుతున్నారు. వారి లగేజీలో బాణాసంచా ఉందో లేదో తనిఖీ చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు)తో కూడిన క్విక్ రియాక్షన్ బృందాల ను రైల్వే రంగంలోకి దింపుతోంది. ఈ సిబ్బంది సాధారణ దుస్తుల్లో ఉండి తనిఖీ చేస్తారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో.. రెండు చోట్ల జాగిలాలతో తనిఖీ చేసి బాణాసంచాను సులభంగా గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. బాణ సంచా తరలిస్తే మూడేళ్ల జైలు శిక్ష ప్రస్తుతం ఉన్న సీసీటీవీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్నింటిని ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. వాటి ద్వారా పర్యవేక్షించేందుకు ప్రత్యే కంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. రైళ్లలో బాణసంచా తరలిస్తే రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.వేయి జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందంటూ రైల్వే సిబ్బంది ప్రచారం ప్రారంభించారు. ఎవరైనా బాణ సంచా సహా మండే స్వభావం ఉన్న ఇతర వస్తు వులను రైళ్లలో తరలిస్తున్నట్టు దృష్టికొస్తే 139కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. రైళ్లలో బాణసంచా తరలిస్తే కఠిన చర్యలు రైళ్లలో బాణసంచా తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఇలాంటి పేలుడు పదార్థాల వల్ల ప్రయాణికుల భద్రత, రైళ్లు, రైల్వేస్టేషన్లు, రైల్వే ఆస్తుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందన్నారు. -
దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?
దీపావళి అనగానే పిల్లలు, పెద్దలు తారతమ్యం లేకుండా ఉత్సాహంగా టపాసులు పేల్చుతూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఎక్కడలేని సరదా ఈ పండుగలోనే ఉంటుంది. అందువల్లే ఈ పండుగంటే అందరికి ఎంతో ఇష్టం. కానీ ఇప్పుడూ ఆ పండుగ వెలవెలబోక తప్పదన్నట్లుంది. ఓపక్క కాలుష్యం కన్నెర్రజేస్తుంది. 'కామ్'గా ఉంటే బెటర్ లేదంటే అంతే సంగతులంటూ తనదైన శైలిలో హెచ్చరిస్తోంది మనిషిని. ఏదైతే అదైంది అని టపాసులు కాల్చుదామన్నా..కళ్లముందు కనిపిస్తున్న వాతావరణం సైతం మానవుడా వద్దు..! అని మూగగా చెబుతోంది. ఇంకోవైపు పండుగ జరుపుకునేవాళ్లు, చేసుకోని వాళ్లు ఎంతమంది అంటూ సర్వేలు మొదలైపోయాయి. ఇలాంటి సందిగ్ధానికి దారితీసిన పరిస్థితులు? ప్రస్తుతం మన దేశ రాజధాని పరిస్థితి తదితరాల గురించే ఈ కథనం!. దీప కాంతుల మిరమిట్లుతో ఆనందహేలిని నింపే పండుగను కాస్తా.జరుపుకుందామా? వద్దా..! అనే స్థితికి వచ్చేశాం. ఎంతలా పర్యావరణ ప్రేమికులు భూమి, గాలి, నీరు కలుషితమవుతున్నాయి అని నెత్తి, నోరు కొట్టుకుని చెబుతున్నా వినిపించుకోలేదు. అందుకు మూల్యం చెల్లించుకునే స్థితికి మనకు తెలియకుండానే వచ్చేశాం. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుందాం, ప్రకృతి సంరక్షణను గుర్తిందాం అన్నా.. వినలేదు. ఇప్పుడు ఏ పండుగైన, సంబరమైన జరుపుకుంటున్నాం అని సంకేతం ఇచ్చేలా.. కాల్చే టపాసులు కూడా కాల్చలేని విధంగా గాలిని కలుషితం చేశాం. ఇప్పటి వరకు ప్రకృతి సిద్ధంగా లభించే నీటిని సైతం కొనుక్కునేంత స్థాయికి దిగజారిపోయాం. మళ్లీ పీల్చుకునే గాలి విషయంలో కూడా ఆ పరిస్థితి అంటే..వామ్మో ఊహించుకుంటేనే ఏంటోలా ఉంది. అంతెందుకు కరోనా మహమ్మారి టైంలో మాస్క్ ముక్కుకి పెట్టుకోమంటేనే..ఊపిరి సలపక అల్లాడిపోయాం. అలాంటిది ఆక్సిజన్ బాటిల్ వీపుకు పెట్టుకుని తిరగడమంటే.. అమ్మ బాబోయ్! ఆ ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది కదూ!. కానీ ప్రస్తుతం అంతలా మన దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. శీతకాలం వచ్చినా.. కాస్త పొగమంచు ఏర్పడినా.. అక్కడ పాఠశాలలకు సెలవులు ఇచ్చేస్తున్నారు అధికారులు. ఇంకా విచిత్ర ఏంటంటే.. కరోనా రాక మునుపు నుంచే గాలి కాలుష్యం కారణంగా అక్కడ విద్యార్థులు ముక్కులకు మాస్క్లు పెట్టుకుని తిరిగారంటే అక్కడ పరిస్థితి ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగకై కొందరు సర్వేలు మొదలు పెట్టారు. సుమారు 32% మంది దీపావళి పండుగ జరుకుంటామని చెప్పాగా, దాదాపు 43% మంది టపాసులు కాల్చమని చెప్పడం విశేషం. అంతేగాదు వాయు కాలుష్యం దృష్ట్యా ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో టపాసుల అమ్మకం, వినియోగాన్ని కూడా అక్కడి ప్రభుత్వాలు నిషేధించడం గమనార్హం. Air pollution is an important and under recognised risk factor for cardiovascular events. #HeartAttack Higher levels of fine particulate matter (PM2.5) lead to endothelial dysfunction and slow flow in coronaries and systemic inflammation, leading to accelerated atherosclerosis… pic.twitter.com/2YW4lRX5x3 — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) November 5, 2023 వైద్యులు ఏమంటున్నారంటే.. వాయు కాలుష్యం కారణంగా గుండెజబ్బులతో మరణించే వారి సంఖ్య పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఈ గాలి కాలుష్యం కారణంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో సంభవించే మరణాలే ఎక్కువ అవుతయాన్నారు. అంతేగాక ధూమపానం, మద్యం, ఎయిడ్స్, క్యాన్సర్ తదితర భయానక రోగాల కంటే ఈ గాలి కాలుష్యం కారణంగా పెరిగే మరణాల సంఖ్యే అధికమవుతుందంటూ..గ్రాఫ్ ఆధారంగా సవివరంగా తెలియజేశారు. ఈ కాలుష్యం కారణంగా గుండె, శ్వాశకోశానికి సంబంధించిన కొత్త జబ్బులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్, వివిధ రకాల క్యాన్సర్లు, ఆర్థరైటిస్ తదితర వ్యాధులకు కారణం గాలి కాలుష్యం అని పరిశోధనల్లో తేలిదన్నారు. The Contribution of Air Pollution Versus Other Risk Factors to Global Mortality pic.twitter.com/VnMTdqddF5 — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) November 5, 2023 ఇప్పడు ప్రభుత్వం సత్వరమే దీనిపై చర్యలు తీసుకోక తప్పదని నొక్కి చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో గాలి నాణ్యత దారుణం పడిపోయిన దృష్యా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడూ మాస్క్ ధరించాల్సిందేనని అన్నారు. అలాగే ఇంట్లో ఎయిర్ ఫ్యూర్ ఫెయిర్లను ఉపయోగించాల్సిదేనని చెప్పారు. ఇక ఏ ఆరోగ్యవంతమైన వ్యక్తికి అయినా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 50 కంటే తక్కువుగానే ఉండాలి. కానీ ఇవాళ గాలి ఏక్యూఐ ఏకంగా 400కి పైనే ఉండటమే తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితి ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి అత్యంత ప్రాణాంతకం. పైగా ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు అధికమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు దీపక్ కృష్ణమూర్తి. (చదవండి: మార్క్ జుకర్బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?) -
దీపావళిని ఏ ప్రాంతంలో ఎలా చేసుకుంటారు? బెంగాల్ ప్రత్యేకత ఏమిటి?
దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలోని అన్నిప్రాంతాలవారు జరుపుకునే పండుగలలో ఇదొకటి. ఇతర దేశాలలోని ప్రవాసులు కూడా దీపావళిని చేసుకుంటారు. ఈ పండుగను హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు తమ సంప్రదాయాల ప్రకారం జరుపుకోవడం విశేషం. దీపావళిని దేశంలో వివిధ ప్రాంతాలలో అక్కడి సంస్కృతి, నమ్మకాల ఆధారంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రాక్షస రాజు రావణుడిని ఓడించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళిని జరుపుకుంటారు. శ్రీరాముడు, సీతామాతలను స్వాగతించడానికి నాటి ప్రజలు నూనె దీపాలను వెలిగించారట. ఆ దీపాలను తమ ఇళ్లు, వీధుల చుట్టూ అలంకరించారట. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, తీపి వంటకాలు ఆరగిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారట. అందుకే నేటికీ దీపావళినాడు ఉత్తరాదిన అందరూ పరస్పరం స్వీట్లు పంచుకుంటారు. పశ్చిమ భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర,గుజరాత్లలో దీపావళిని ఎంతో ఘనంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంపద, శ్రేయస్సులకు దేవతగా భావించే లక్ష్మదేవిని పూజిస్తారు. దీపాల పండుగను పురస్కరించుకుని తమ ఇళ్ల ముంగిట వివిధ రంగులతో అలంకరిస్తూ ముగ్గులు వేస్తారు. పలు సంప్రదాయ వంటలను తయారు చేసి, ఆరగిస్తారు. అలాగే తీపి వంటకాలను తమ స్నేహితులకు, బంధువులకు పంచిపెడతారు. దక్షిణ భారతదేశంలో దీపావళిని నాడు ప్రజలంతా తెల్లవారుజామునే నిద్ర లేచి, తలకు నూనె రాసుకుని స్నానం చేస్తారు. తరువాత కొత్త దుస్తులు ధరిస్తారు. తమ ఇళ్లలో నూనె దీపాలను వెలిగించి, గణేశుడు, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. పలు రకాల వంటకాలను తయారు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆనందంగా దీపావాళి వేడుకలు చేసుకుంటారు. తూర్పు భారతదేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో దీపావళినాడు కాళీమాత పూజలు చేస్తారు. ఆ రోజు కాళికామాతను పూజించడం వలన శక్తియుక్తులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. దేవాలయాలు, ఇళ్లలో కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేసి, వాటికి పూజలు నిర్వహిస్తారు. అలాగే మట్టి ప్రమిదిలలో దీపాలను వెలిగిస్తారు. కాళీమాత విగ్రహాలను ఊరేగిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగ దీపావళి అనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: ప్రియాంకకు చేదు అనుభవం: పుష్ఫగుచ్ఛం ఇచ్చారు.. పూలు మరచారు! -
ఏపీలో దీపావళి సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: . ఆంధ్రప్రదేశ్లో దీపావళి సెలవు తేదీని ప్రభుత్వం మార్చింది. ఈ నెల 13వ తేదీ(సోమవారం) దీపావళి సెలవు ప్రకటిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో నవంబర్ 12న (ఆదివారం) దీపావళిగా ఉంది. ఈ నేపథ్యంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలువుల జాబితాలో స్పల్ప మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ 13వ తేదీన (సోమవారం) ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక 13వ తేదీన ఉద్యోగులతో పాటు ఆఫీసులు, వ్యాపార సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి. -
దీపావళి ఆఫర్స్.. ఇప్పుడు కొంటే మంచి బెనిఫిట్స్!
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించడానికి మంచి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయి. ఈ సమయం కోసం ఎదురు చూసే చాలామంది కస్టమర్లు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు. మహీంద్రా, సిట్రోయెన్, స్కోడా కంపెనీలు ఇప్పటికే ఆఫర్స్ ప్రకటించేసాయి. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా వంటి కార్ డీలర్లు తమ లైనప్లో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్లు, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం ఏ కారుపై ఎంత వరకు బెనిఫిట్ హ్యుందాయ్ వెర్నా - రూ. 30,000 మారుతి సుజుకి డిజైర్ - రూ. 40,000 హోండా అమేజ్ - రూ. 70,000 స్కోడా స్లావియా - రూ. 75,000 ఫోక్స్వ్యాగన్ వర్టస్ - రూ. 80,000 హోండా సిటీ - రూ. రూ. 90,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవాలి. -
దీపావళి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా హైదరాబాద్–కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్–కటక్ (07165/07166) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు కటక్ నుంచి బయల్దేరి మర్నాడు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
కాలుష్యం కాదు.. కాంతులు కావాలి
కడప కల్చరర్ : దీపావళి పండుగ అన్ని వయస్సులు, అన్ని వర్గాల వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ సంతోషాల పండుగ నిర్వహణ వెనుక ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అలాగాక పండుగ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలన్నది పెద్దల ఆలోచన. పండుగ కాలుష్య కారకం కాకూడదని దీపావళి కాంతులు మాత్రమే చాలునని పేర్కొంటున్నారు. ఈ మేరకు పర్యావరణ నిపుణులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. గ్రీన్ దీపావళిని నిర్వహించాలని కోర్టు సూచించింది. పండుగ రోజున కాల్చే టపాసుల ద్వారా వచ్చే కాలుష్యం ప్రమాదకరమైందని.. ఇకపై కాలుష్యాన్ని కలిగించే టపాసులను వినియోగించకూడదని.. భారీ శబ్దాలు చేసే వాటిని కూడా దూరంగా ఉంచాలని కోర్టు సూచించింది. ప్రత్యేకించి ఈ పండుగ రోజులలో రాత్రి 8 గంటలనుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని కూడా తీర్పులో ఆదేశించింది. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులు గమనించి కోర్టు రోజులో ఏవైనా రెండు గంటలపాటు కాల్చుకోవచ్చని సడలింపు ఇచ్చింది. ఈ దీపావళికి పర్యావరణ హితమైన టపాసులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ ఏకో ఫ్రెండ్లీ గ్రీన్ టపాసులను అందుబాటులోకి తెచ్చింది. భారీ శబ్దాల స్థానంలో ఫ్లవర్ పార్ట్స్, పెన్సిల్స్, భూ చక్రాలు, స్పార్కులర్ల స్థానాలలో కాకరొత్తులు, చిచ్చుబుడ్లు మాత్రమే కాల్చుకోవాలని సూచించింది. వీటిని వాడటంతో శబ్ద కాలుష్యాన్ని చాలా మేరకు తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రమాదాలకు అవకాశం పండుగ సంప్రదాయంలో భాగంగా టపాసులు కాల్చుకుంటాం. కానీ ఆదమరిస్తే ఆ సరదా మనకే శాపంగా మారే ప్రమాదం ఉంది. టపాసులలో కొన్ని రకాలు ప్రమాదకరమైనవి. పూర్తిగా విషపూరితమైనవి ఉన్నాయి. ఇలాంటి వాటిని కాల్చితే మన ప్రమాదాన్ని మనమే సృష్టించుకున్నట్లు అవుతుంది. ఇలాంటి టపాసుల తయారీలో వాడే రసాయనాలు, లోహాలు విషపూరితమైనవి. పలు రసాయనాల సమ్మేళనంతో చేసిన వీటిని కాల్చితే గాలి, శబ్దం కాలుష్యమవుతుంది. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఈ ఏడాది పెద్ద నగరాలలో శబ్ద కాలుష్యంతోపాటు వాయు కాలుష్యాన్ని కూడా లెక్కకట్టనున్నారు. పండుగకు ముందు, తర్వాత కాలుష్యాన్ని నమోదు చేయనున్నారు. పర్యావరణ హిత దీపావళిని జరుపుకోవాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. రసాయన సమ్మేళనాలు బొగ్గు, పొటాషియం, నైట్రేట్, సల్ఫర్ ఇలాంటి రసాయనాల సమ్మేళనంతో జరిగే చర్యలవల్ల గాలి, విషపూరితమై క్యాన్సర్ను కలిగిస్తుంది. అల్యూమినియం ద్వారా స్పార్కులర్స్ వస్తాయి కనుక వాటిని ఎక్కువగా వాడతారు. అవి చర్మానికి తాకితే దద్దుర్లు వచ్చి నొప్పిని కలిగిస్తాయి. అనారోగ్యం కలుగుతుంది. స్ట్రోమియం శరీరంలోని కాల్షియం స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది కూడా విషపూరితమైనది.. ఇథీయం ఎరుపు రంగు వచ్చేందుకు వాడుతారు. ఇది మండినప్పుడు విష వాయువులు వెలువడతాయి. బేరియంను ఆకుపచ్చ రంగు కనిపించడానికి వాడతారు. ఇది శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుంది. సల్ఫర్ ద్వారా సల్ఫిరిక్ ఆమ్లం దానివల్ల వాతావరణ కాలుష్యం, జలవనరుల కాలుష్యం కలుగుతాయి. జిగురు, పేపర్లతో చేసిన టపాసులను కాల్చితే కళ్లు, ముక్కులలో మంట, గొంతు, తలనొప్పి, వికారం కలుగుతాయి. కాలేయం, మూత్ర పిండాలు, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. సీసంతో చేసిన టపాసులతో చిన్నారులు మానసిక వికలాంగులయ్యే ప్రమాదం ఉంది. మెగ్నీషియం టపాసులు పొగ వెదజల్లడంవల్ల శ్వాస సమస్యలు ఎదురవుతాయి. జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. జింక్ ద్వారా వచ్చే కాంతి కళ్లకు ప్రమాదం, మాంగనీస్ కలిపిన టపాసుల పొగ నేరుగా శరీరంలోకి చేరి నరాల బలహీనత, నిద్రలేమి, భావోద్వేగం, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. కాడ్మియం మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. రక్తహీనత, రక్తపోటు పెరుగుతాయి. ఎముకలు గట్టిదనం తగ్గుతాయి. భాస్వరం వాడిన టపాసులతో కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. కాలేయం పనితీరు కుంటుపడుతుంది. కంటికి నష్టం కలుగుతుంది. సల్ఫర్ ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులు కలుగుతాయి. నైట్రేట్ ద్వారా మత్తు కలగడం, తిమ్మిర్లు రావడం, వాంతులు, విరేచనాలు, మూర్ఛ సమస్యలు తలెత్తుతాయి. నోటి ద్వారా గాలి ఊపిరితిత్తులకు వెళ్లి అనారోగ్యం పాలు చేస్తుంది. రక్తపోటు పెరుగుతుంది. తలనొప్పి కూడా వస్తుంది. ఇవేకాక పొగలు రావడానికి వాడే రూబిడియం, సల్ఫర్, యాంటీమిని, స్ట్రాంటియం, టైటానియం, మెటల్, జింక్ల వినియోగం కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాగైతే సురక్షితం మట్టి దీపాలు, కొవ్వొత్తులు, విద్యుత్ దీపాలను వెలిగించడం మంచిదని.. నెయ్యి దీపాలు వెలిగిస్తే ఆక్సిజన్ కూడా ఎక్కువగా వెలువడుతుందని.. కనుక ఇలాంటి దీపాలు వెలిగించడమే మంచిదని పెద్దలు సూచిస్తున్నారు. టపాసులు ఇళ్ల లోపల కాల్చకూడదని.. దీంతో విష వాయువులు ఇళ్ల మూలల్లో నిలిచిపోయి చాలా రోజులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. సరిగా కాలనివి, సగం కాలిన టపాసులను వదిలేయాలి. మరోసారి కాల్చుదామని దగ్గరికి వెళితే అకస్మాత్తుగా పేలే ప్రమాదం ఉందంటున్నారు. కాటన్ దుస్తులు, కళ్లజోడులు, బూట్లు వేసుకోవడం మంచిదని చెబుతున్నారు. -
కుండల తయారీలో కామర్స్ గ్రాడ్యుయేట్.. దీపావళి ప్రమిదలు చేయడంలో బిజీ!
దీపావళి సమీపిస్తున్న కొద్దీ ఆ కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ఆ కుటుంబం కొన్ని వారాలుగా మట్టి ప్రమిదలను తయారు చేయడంలో బిజీగా ఉంది. శ్రీనగర్లోని నిషాత్ ప్రాంతానికి చెందిన ఉమర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రమిదలను తయారు చేస్తున్నారు. ఈ దీపాలను విభిన్నమైన, ప్రత్యేకమైన శైలిలో ఉమర్ తయారు చేస్తున్నారు. ఉమర్ కుటుంబ సభ్యులు కశ్మీర్ లోయలోని సాంప్రదాయ మట్టి కళను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. గత ఏడాది దీపావళికి ఉమర్ 15 వేల దీపాలను తయారు చేశారు. ఈసారి ఉమర్ తమకు 20 వేలకు పైగా దీపాలకు ఆర్డర్లు వస్తాయని భావిస్తున్నారు. ఉమర్ ఇప్పటికే 4 వేలకు పైగా దీపాలను సిద్ధం చేశారు. ఇవి వివిధ రకాలు, వివిధ పరిమాణాలలో ఉన్నాయి. ఉమర్ కామర్స్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో కలిసి కుండలు తయారు చేయడం ప్రారంభించాడు. ఉమర్ మీడియాతో మాట్లాడుతూ దీపావళి సందర్భంగా తమకు ఉపాధి రూపంలో భారీ కానుక లభిస్తుందని తెలిపారు. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: కాలుష్యం బారిన జూ జంతువులు.. ఉపశమనం కోసం ఏం చేస్తున్నారంటే.. -
సమ్మర్లో సత్యభామ
కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో, నవీన్ చంద్ర, ప్రకాశ్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ను దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత బాబీ తిక్క మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. ఈ నెల రెండో వారంలో కొత్త షెడ్యూల్ను ఆరంభిస్తాం. సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సహనిర్మాత: బాలాజీ. -
పండుగ సీజన్లో కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్!
పండుగ సీజన్లో కేవలం కార్లు, బైకులు మాత్రమే కాదు, మంచి స్మార్ట్ఫోన్లను కొనటానికి కూడా వినియోగదారులు ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ ఫోన్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో మోటరోలా కంపెనీకి చెందిన 'ఎడ్జ్ 40 నియో' ఒకటి. ఇది 6.55 ఇంచెస్ కర్వ్డ్ పోలెడ్ డిస్ప్లే, చిక్ వేగన్-లెదర్ బ్యాక్ డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 64 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030, 6nm ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ వినియోగదారులకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐకూ జెడ్7 ప్రో (iQOO Z7 Pro) ఐకూ జెడ్7 ప్రో మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో స్మార్ట్ఫోన్. దీని ధర కూడా రూ. 25000 కంటే తక్కువే. 125జీబీ, 256జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ పొందుతుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా వివిధ లైటింగ్ పరిస్థితులలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. 4,600mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ బ్లూ లాగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. లావా అగ్ని 2 (Lava Agni 2) మన జాబితాలో మూడవ మొబైల్ లావా అగ్ని 2. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కలిగి, 8జీబీ ర్యామ్ పొందుతుంది. వైబ్రెంట్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే వీడియోలు చూడటానికి లేదా గేమ్స్ ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. కెమెరా అద్భుతంగా ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్ పోకో ఎక్స్5 ప్రో (Poco X5 Pro) పోకో ఎక్స్5 ప్రో మంచి డిజైన్, క్వాలిటీ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ఫోన్. ఇది 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, 3.5 మిమీ హెడ్ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్స్ పొందుతుంది. -
కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్
రానున్న దీపావళిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి, మహీంద్రా, స్కోడా, జీప్, సిట్రోయెన్ కంపెనీలు రూ. 50000 నుంచి రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ ఆఫర్స్ కేవలం కొన్ని ఎంపిక చేసిన మోడల్స్కి మాత్రమే వర్తిస్తాయి. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా డిస్కౌంట్స్ మహీంద్రా ఎక్స్యూవీ400 - రూ. 3.5 లక్షలు మహీంద్రా ఎక్స్యూవీ300 - రూ. 1.2 లక్షలు మహీంద్రా బొలెరో - రూ. 70,000 మహీంద్రా బొలెరో నియో - రూ. 50,000 మహీంద్రా మొరాజో - రూ. 73.300 సిట్రోయెన్ డిస్కౌంట్స్ సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్ - రూ. 99,000 సిట్రోయెన్ సీ5 ఎయిర్క్రాస్ - రూ. 2,00,000 సిట్రోయెన్ సీ3 - రూ. 99,000 మారుతి సుజుకి డిస్కౌంట్స్ మారుతి జిమ్నీ - రూ. 1,00,000 స్కోడా డిస్కౌంట్స్ స్కోడా కుషాక్ - రూ. 1.5 లక్షలు జీప్ డిస్కౌంట్స్ జీప్ మెరిడియన్ - 1.30 లక్షలు జీప్ కంపాస్ - రూ. 1.45 లక్షలు ఫోక్స్వ్యాగన్ డిస్కౌంట్ ఫోక్స్వ్యాగన్ టైగన్ - రూ. 1,00,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవాలి. -
హైదరాబాద్: ‘దిమార్వెల్స్’ యూనిట్తో కలసి సమంత సందడి (ఫొటోలు)
-
ఆ విషయంలో థ్రిల్లింగ్గా ఫీలవుతున్నా: సమంత
స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్లో సందడి చేసింది. ఈ దీపావళికి ఫ్యాన్స్కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. తన అభిమానుల కోసం మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తోన్న ‘దిమార్వెల్స్ యూనిట్తో జతకట్టింది. అమెరికన్ సూపర్ హీరోస్కు తానెప్పుడూ అభిమానినని చెప్పే సమంత.. ది మార్వెల్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తాజాగా భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక ప్రోమోను లాంఛ్ చేశారు. తాజాగా మూవీ ప్రమోషన్స్లో సమంత స్పెషల్గా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ది మార్వెల్స్ నవంబర్ 10న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత మాట్లాడుతూ..'కెప్టెన్ మార్వెల్ ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో. అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్టైనర్ కోసం మరోసారి మార్వెల్ ఇండియా తో జతకట్టడం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నా. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నారు. మార్వెల్స్ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమా కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.' అని అన్నారు. కాగా.. 2019లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘కెప్టెన్ మార్వెల్’ ప్రమోషన్స్లోనూ సమంత భాగమైన సంగతి తెలిసిందే. Smile, Slay & Pose done ✅ As ever #Samantha stuns us with her stylish looks at an event!!❤️🔥 @Samanthaprabhu2 #TheMarvels #TeluguFilmNagar pic.twitter.com/GU777LnnIU — Telugu FilmNagar (@telugufilmnagar) November 3, 2023 -
దీపావళికి కొత్త స్కూటర్ కొనాలా? బెస్ట్ మోడల్స్ ఇక్కడ చూడండి!
భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే మొదలైపోయింది. ఈ తరుణంలో చాలా మంది కొత్త కార్లు లేదా బైకులను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో దేశీయ విఫణిలో కొనుగోలు చేయడానికి ఉత్తమమైన ఐదు స్పోర్టీ స్కూటర్లను గురించి తెలుసుకుందాం. టీవీఎస్ ఎన్టార్క్ 125 (TVS Ntorq 125) ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణపొందిన 'టీవీఎస్ మోటార్' కంపెనీకి చెందిన 'ఎన్టార్క్ 125' పండుగ సీజన్లో కొత్త స్కూటర్ కొనాలనుకునే వారికి మంచి ఎంపిక. ఈ స్కూటర్ బేస్ మోడల్ ధర రూ.84636, టాప్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్ కలిగి 7000 ఆర్పీఎమ్ వద్ద 9.25 బీహెచ్పీ పవర్, 5500 ఆర్పీఎమ్ వద్ద 10 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సీవీటీ యూనిట్తో లభించే ఈ స్కూటర్ మంచి పనితీరుని అందిస్తుంది. సుజుకి అవెనిస్ 125 (Suzuki Avenis 125) సుజుకి మోటార్సైకిల్ కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఉత్తమ స్కూటర్లలో ఒకటి అవెనిస్ 125. రూ. 89900 ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్ 124.3 సీసీ ఇంజిన్ కలిగి 6750 ఆర్పీఎమ్ వద్ద 8.58 బీహెచ్పీ పవర్, 5500 ఆర్పీఎమ్ వద్ద 10 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా గ్రాజియా 125 (Honda Grazia 125) హోండా గ్రాజియా 125 మంచి డిజైన్ కలిగి రూ. 82520 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఉత్తమ స్కూటర్లలో ఒకటి. ఇందులో 6000 ఆర్పీఎమ్ వద్ద 8.14 బీహెచ్పీ పవర్, 5000 ఆర్పీఎమ్ వద్ద 10.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సీవీటీ యూనిట్తో లభించే ఈ స్కూటర్ పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha Ray ZR 125) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన యమహా అనేక స్టైలిష్ బైకులు విడుదల చేసి మంచి అమ్మకాలు పొందుతోంది. కంపెనీకి చెందిన 'రే జెడ్ఆర్ 125' మన జాబితాలోని ఉత్తమ స్కూటర్లలో ఒకటి. రూ. 84730 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ వెహికల్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి 8.04 బీహెచ్పీ పవర్, 10.3 టార్క్ అందిస్తుంది. ఇదీ చదవండి: అందుకే 'రోహన్ మూర్తి' ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసాడు! ఏప్రిలియా ఎస్ఆర్ 125 (Aprilia SR 125) మన జాబితాలో ఖరీదైన స్కూటర్ ఏప్రిలియా ఎస్ఆర్ 125. దీని ధర రూ. 1.23 లక్షలు (ఎక్స్ షోరూమ్). 124.45 సీసీ ఇంజిన్ కలిగిన ఈ స్కూటర్ 7300 ఆర్పీఎమ్ వద్ద 9.97 బీహెచ్పీ పవర్, 5500 ఆర్పీఎమ్ వద్ద 10.33 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ స్కూటర్ రైడర్లకు అవసరమైన లేటెస్ట్ ఫీచర్స్ ఎన్నో కలిగి ఉంటుంది. -
ప్రభుత్వ బ్యాంక్ ‘స్వీట్’ ఐడియా! మిఠాయిలిచ్చి ప్రేమగా అడుగుదాం..
మొండి బకాయిలను రికవరీ చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ (UCO Bank) సరికొత్త ఆలోచన చేసింది. ప్రతి శాఖలోని టాప్ 10 డిఫాల్టర్లకు 'స్వీట్ ప్యాకెట్లు' పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. వాళ్లూ ఒకప్పుడు విలువైన కస్టమర్లే ప్రస్తుతం డిఫాల్టర్గా మారినవాళ్లు ఒకప్పుడు విలువైన కస్టమర్ అనే విషయాన్ని బ్యాంకు మరచిపోదని యూకో బ్యాంక్ జనరల్ మేనేజర్ (రికవరీ) ధీరజ్ పట్వర్ధన్ అన్ని జోనల్ హెడ్లకు జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ.2వేల నోట్లు మార్చడానికి కిరాయి మనుషులు.. ఆర్బీఐ ఆఫీస్ వద్ద హల్చల్! కాబట్టి, అటువంటి కస్టమర్లతో "సరైన అనుసంధానం"తో వారికి, బ్యాంకుకు మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించవచ్చని ఆయన అన్నారు. దీనివల్ల బ్యాంక్ పట్ల సానుభూతి, సామరస్యం పెరుగుతాయని, కొంత మంది రుణగ్రహీతలు తమ బకాయిలు సెటిల్ చేయడానికి ముందుకు వస్తారని వివరించారు. స్వీట్లిచ్చి దీపావళి శుభాకాంక్షలు దీనికి సంబంధించి యూకో బ్యాంక్ జారీ సర్కులర్ను ప్రముఖ బ్యాంకింగ్ కాలమిస్ట్ తమల్ బందోపాధ్యాయ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రతి బ్రాంచ్లోని టాప్ 10 ఎన్పీఏ రుణగ్రహీతలకు స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని, బ్రాంచ్ హెడ్లు వారిని వ్యక్తిగతంగా కలుసుకుని, దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలని సర్క్యులర్లో బ్యాంక్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉద్యోగ వలసలు.. ఆర్బీఐ డేగకన్ను! గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 124 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 223 కోట్లకు పెరిగి 80.80 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,650 కోట్ల నుంచి 21.78 శాతం పెరిగి రూ. 2,009 కోట్లకు చేరుకున్నట్లు యూకో బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ ఎన్పీఏ రుణాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 4.48 శాతంగా ఉన్నాయి. ఇవి మార్చిలో 4.78 శాతం కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో 7.42 శాతంగా ఉన్నాయి. Wonderful idea. UCO Bank plans to celebrate Diwali, greeting top ten #NPA borrowers of every branch with sweets. @UCOBankOfficial @ChairmanIba @ChiefIba pic.twitter.com/HZJMenPnz5 — Tamal Bandyopadhyay (@TamalBandyo) November 2, 2023 -
టపాకాయలు కాల్చేందుకు.. రెండు గంటలే!
సాక్షి, చైన్నె: దీపావళి రోజున కేవలం రెండు గంటల పాటు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికితోడు ఉత్తరాది రాష్ట్రాలలో బాణసంచాలకు నిషేధం ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది శివకాశిలోని పరిశ్రమలకు రూ. 700 కోట్ల మేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. వివరాలు.. వెలుగులు చిమ్మే దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టం. బాణసంచా పేల్చడం అంటే, మరెంతో ఆనందం. దీపావళిని పురస్కరించుకుని రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా నుంచి పెద్దసంఖ్యలో బాణసంచాలు మార్కెట్లోకి వస్తోంది. ఇక టపాకాయల తయారీకి పేరుగాంచిన విరుదునగర్ జిల్లాలోని శివకాశిలో ప్రస్తుతం నిరాశాజన వాతావరణ నెలకొంది. ఒకప్పుడు ఇక్కడ దీపావళికి రూ. 5 వేల కోట్ల మేరకు టపాకాయల ఉత్పత్తి జరిగేది. అయితే గత కొన్నేళ్లుగా ఇక్కడి ఉత్పత్తి దారులకు షాక్ల మీద షాక్లు తప్పడం లేదు. ఇక కోర్టులు ఇచ్చిన కొత్త నిబంధనలు, పలు రాష్ట్రాల్లో బాణసంచాలకు నిషేధం వెరసి ఇక్కడి వ్యాపారులు ఏటా నష్టాలను ఎదుర్కొకుంటున్నారు. గత ఏడాది వెయ్యి కోట్ల స్టాక్ శివకాశికే పరిమితమైంది. ఈ ఏడాది 50 శాతం మేరకు ఉత్పత్తిని తగ్గించినా, రూ.700 కోట్ల వరకు నష్టాన్ని తాము ఎదుర్కొక తప్పదని పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా పర్యావరణానికి ఆటంకం కలిగించకుండా ఉండే బాణసంచాలను పేల్చాలని, ఉదయం 6 నుంచి 7 వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకే రెండు గంటల సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారికి జరిమానా విధిస్తామన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక పండుగకు పది రోజులు సమయం ఉండడంతో ఆయా ప్రాంతాలలో బాణా సంచాల విక్రయాల దుకాణాల ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. -
బాణాసంచాకు బోలెడు కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: దీపావళి బాణాసంచాపై ఈసారి ఎన్నికల ప్రభావం స్పష్టంగా కని్పస్తోంది. ఎన్నికలు కూడా కలిసి రావడంతో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే అడుగడుగునా నిఘా నేపథ్యంలో వాటిని తీసుకురావడమూ కష్టంగానే ఉందని దుకాణాల యజమానులు అంటున్నారు. నగదు లావాదేవీలకు అడ్డంకులతో వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. ఈ సంవత్సరం బాణాసంచా ధరలు పెరగడానికి ఇది కూడా కారణమయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. దసరాకు ముందు నుంచే వ్యాపారులు బాణాసంచాను తమిళనాడులోని శివకాశి నుంచి భారీగా తెచ్చి, నిల్వ చేస్తుంటారు. దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచి అమ్మకాలు మొదలు పెడతారు. పండుగకు నాలుగు రోజుల ముందు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏటా రూ. 250–360 కోట్ల వ్యాపారం నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 500–700 కోట్ల వ్యాపారం ఉంటుందని అంచనా. ఇందులో పన్నులు చెల్లించకుండా జరిగే వ్యాపారమే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ ఏడాది టపాసుల జోరు.. రాష్ట్రంలో ఎన్నికల కోలాహాలం నెలకొంది. పోటీ చేసే అభ్యర్థులు వివిధ వర్గాలతో కలిసి వేడుకల్లోనూ పాల్గొంటారు. పారీ్టలన్నీ మండల, నియోజకవర్గ స్థాయిలో ఆఫీసులను తెరుస్తాయి. దీంతో కార్యకర్తలు పోటీపోటీగా బాణాసంచా కాల్చడం రివాజు. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తారు. విజయం సాధించిన అభ్యర్థులు బాణాసంచాతో పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుంటారు. దీపావళికి ఎన్నికలు కూడా తోడవ్వడంతో ఈసారి బాణాసంచా అమ్మకాలు జోరుగానే ఉంటాయని వ్యాపారులు విశ్లేíÙస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో శివకాశిలో ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు హైదరాబాద్ మలక్పేటకు చెందిన ఓ బాణాసంచా వ్యాపారి ఖండేవాల్ తెలిపారు. బాణాసంచాలో దాదాపు 50 శాతానికి పైగా లాభాలుంటాయి. అధికారిక లెక్కల్లో చూపించే వాటికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నులు కడతారు. అంతకు రెండు రెట్లు ఎలాంటి పన్నులు కట్టకుండా తేవడం సాధారణంగా జరుగుతున్న వ్యవహారమే. నగదుతో చిక్కు.. వ్యాపారులు ప్రతి ఏటా ఆన్లైన్ లావాదేవీలకన్నా, ప్రత్యక్షంగా నగదు ఇచ్చి బాణాసంచా కొనుగోలు చేస్తుంటారు. ఎన్నికల నేపథ్యంలో సరిహద్దులు దాటి నగదు తీసుకెళ్లడం కష్టంగానే ఉందని హైదరాబాద్ బాణాసంచా వ్యాపారి సంజయ్ తెలిపారు. రూ. 50 వేలకు మించి నగదు పట్టుబడితే స్వా«దీనం చేసుకుంటున్నారు. ఇదే సమస్యగా మారిందని ఆయన చెప్పారు. ఆన్లైన్ లావాదేవీలపైనా నిఘా ఉందనేది వ్యాపారులను వణికిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు సరిహద్దుల్లోనే కాకుండా, అన్ని ప్రాంతాల్లో ఉండటం వల్ల పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు. శివకాశిలోని వ్యాపారులకు ఫోన్పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులను తెలిసిన వాళ్ల ద్వారా చేయాల్సి వస్తోందని వారు తెలిపారు. అయితే, అక్కడా సమస్యలు తప్పడం లేదంటున్నారు. డిజిటల్ లావాదేవీల వల్ల పన్నులు అధికంగా చెల్లించాల్సి వస్తోందన్న నెపంతో శివకాశిలోని వ్యాపారులు అభ్యంతరాలు తెలుపుతున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, పట్టణ ప్రాంతాల్లో వ్యాపారులు నిఘాలేని పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. కొన్ని చోట్ల తెలిసిన అధికారులను పట్టుకుని నగదు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది బాణాసంచా ధరలు 30 శాతం మేర పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. నిఘా కారణంగా అయ్యే ప్రత్యేక ఖర్చు వల్ల ఈ సంవత్సరం స్థానికంగా ధరలు 50 శాతం పెరగవచ్చనేది వారు అంచనా వేస్తున్నారు. -
దీపావళికి కలర్పుల్ దీపాలు కావాలా? ఈ వీడియో చూస్తే మీరు ఫిదానే!
Diwali Special Magic Candle lights: దీపాల పండుగ దీపావళి వచ్చేస్తోంది. దీపావళి సందర్భంగా నూనె దీపాలతోపాటు, రంగు రంగుల కొవ్వొత్తులతో ఇంటిని అందంగా అలంకరించుకోవడం అలవాటు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో, కలర్ఫుల్ క్యాండిల్ లైట్స్ను తయారు చేసుకోవాలని భావిస్తున్నారా.మీలాంటి వారికోసమే అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇది ట్విటర్లో 40 లక్షలకుపైగా వ్యూస్ను సొంతం చేసుకుంది మరింకెందుకు ఆలస్యం.. మీరు మెచ్చే, మీకు నచ్చే అందమైన కాండిల్ లైట్స్ ఎలా తయారు చేసుకోవాలా చూసేయండి మరి. Very cool idea!pic.twitter.com/WjGQL49hTq — Figen (@TheFigen_) October 29, 2023 -
రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు
దీపావళి సందర్భంగా చాలామంది కొత్త కారు కొనాలనుకుంటారు. ఈ కథనంలో రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 డీజిల్ కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహీంద్రా XUV700 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మహీంద్రా XUV700 దీపావళి సందర్భంగా కొనుగోలు చేయదగిన ఉత్తమ SUV. దీని ప్రారంభ ధర రూ. 14.47 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ 185 పీఎస్ పవర్, 450 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా హారియర్ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కంపెనీకి చెందిన హారియర్ కూడా మన జాబితాలో రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారునిలోని 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 170 పీఎస్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. హ్యుందాయ్ ఆల్కజార్ రూ.17.73 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభిస్తున్న హ్యుందాయ్ ఆల్కజార్ కూడా ఈ పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన ఉత్తమ మోడల్. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 Bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఎంజి హెక్టర్ మోరిస్ గ్యారేజ్ కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ హెక్టర్ రూ. 17.99 లక్షల ధర వద్ద లభిస్తుంది. ఇందులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! కియా సెల్టోస్ సౌత్ కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్కి చెందిన సెల్టోస్ దేశీయ మార్కెట్లో రూ. 13.60 లక్షల ధర వద్ద లభించే ఉత్తమ మోడల్. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 115 పీఎస్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. -
ఇకపై అన్నీ ఆనంద క్షణాలే..: రాశీ ఖన్నా
తమిళ సినిమా: మంచి ఫిజిక్. అంతకు మించిన యాక్టివ్. యువతను గిలిగింతలు పెట్టగల యాక్టింగ్ ఇవన్నీ నటి రాశి ఖన్నాలోని లక్షణాలు. అంతేకాకుండా తనదైన అందాలతో కనువిందు చేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ పాపులర్ అయిన రాశీ ఖన్నాకు కథానాయకిగా ఇంకా తాను ఆశించిన స్థాయి రాలేదనే చెప్పాలి. అలాంటి స్థాయికి చేరుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవల నటిగా కాస్త వెనుకపడిందనే చెప్పాలి. తమిళంలో ఈమె నటించిన చివరి చిత్రం సర్దార్. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం హిందీలో యోధా అనే ఒక చిత్రం, తమిళంలో అరణ్మణై 4, మేథావి చిత్రాల్లో నటిస్తోంది. కాగా తరచూ తన గ్రామ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ నెటిజన్లను కవ్విస్తున్న రాశీఖన్నా ఇకపై రానున్నవన్నీ ఆనంద క్షణాలే అని పేర్కొంది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను ఇప్పుడు పండగల ఖుషిలో ఉన్నట్లు పేర్కొంది. నవరాత్రి వేడుకలు మొదలయ్యాయని.. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తానని చెప్పింది. నవరాత్రి వేడుకలు పూర్తికాగానే దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటానని, తనకు దీపావళి చాలా పెద్ద పండుగ అని పేర్కొంది. ఆ సమయంలో పటాసులు కాల్చడం చాలా సరదా చెప్పింది. అదేవిధంగా నూతన దుస్తులు ధరించి తీపి పదార్థాలను తింటానని తెలిపింది. ఆ తర్వాత నవంబర్ 30వ తేదీ తన పుట్టినరోజు అని ఆ వేడుకను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత క్రిస్మస్, ఆంగ్ల ఉగాది పర్వదినాలు వస్తాయని అలా ఈ మూడు నెలలు తనకు ఆనంద క్షణాలే అని నటి రాశి ఖన్నా సంతోషం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
Gold prices: దీపావళికి మోతే! బంగారం, వెండి ధరలు ఆకాశానికి..
ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. నవంబర్ నెలలో రానున్న దీపావళి నాటికి ఇవి రికార్డ్ స్థాయికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. 10 గ్రాముల పసిడి రూ.61,000 లను తాకుతుందని, కేజీ వెండి రూ. 75,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా, దేశీయంగా బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనుకూల వాతావరణం కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయని అంచనాకు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కారణాలివే.. ప్రపంచంలోని పలు దేశాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి సానుకూల ప్రకటన, సెంట్రల్ బ్యాంక్ల కొనుగోలు, ఫిజికల్ డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలు పెరగడానికి దారితీస్తాయని కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా అన్నారు. కెడియా ప్రకారం, ఈ దీపావళికి బంగారం ధరలు రూ. 61,000 నుంచి రూ. 61,500, వెండి ధరలు రూ. 75,000 నుంచి రూ. 76,000 స్థాయిలను తాకవచ్చు. గత సంవత్సరం దీపావళి నుంచి బంగారం ధరలు 17 శాతానికిపైగా పెరిగాయి. అలాగే వెండి ధరలు 23 శాతానికి మించి పెరిగాయి. -
13 బిలియన్ డాలర్ల దీపావళి పండుగ..చిన్న సంస్థలకు మరింత లాభసాటిగా
ముంబై: దేశీ చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఈసారి దీపావళి పండుగ మరింత లాభసాటిగా ఉండనుంది. ఈ–కామర్స్ ద్వారా 13 బిలియన్ డాలర్ల మేర వ్యాపారాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని ఎంఎస్ఎంఈలు మరింత ఎక్కువగా ఆర్డర్లు దక్కించుకుంటున్నాయి. టెక్ ఆధారిత లాజిస్టిక్స్ సంస్థ షిప్రాకెట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం ఆర్డర్లలో 10–15 శాతం ఆర్డర్లు తొలిసారిగా ఆన్లైన్లో కొనుగోలు చేసే వారి నుంచే ఉండనున్నాయి. పండుగ అమ్మకాల్లో ఢిల్లీ ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) 28 శాతం వాటాతో అగ్రస్థానంలో, 13 శాతం వాటాతో ముంబై, 7 శాతం వాటాతో బెంగళూరు ఆ తర్వాత స్థానాల్లో ఉంటాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ షాపింగ్ వినియోగం పెరిగింది. షిప్రాకెట్కి వచ్చే ఆర్డర్లలో 56 శాతం వాటా మెట్రోయేతర నగరాల నుంచే ఉంటోంది. ఎగుమతులు అప్.. పండుగ సీజన్లో ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువగా కృత్రిమ జ్యుయలరీ, సౌందర్య సంరక్షణ, దుస్తులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, పుస్తకాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, హోమ్ ఫర్నిషింగ్స్ మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూఏఈలో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్ పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ అదనంగా మూడు గిడ్డంగులను సమకూర్చుకుంది. ఆర్డర్లను సత్వరం ప్రాసెస్ చేసేందుకు సిబ్బంది సంఖ్యను 50 శాతం మేర పెంచుకుంది. -
సౌదీలో దీపావళి వేడుకలకు సన్నాహాలు!
సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో కాన్సులేట్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా దీపావళ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) వ్యవస్థాపక అధ్యక్షులు మల్లేష్ నవంబర్ 10న శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి వేడుకలలో జిద్దా భారత రాయబార కార్యాలయం కాన్సుల్ జనరల్ మహ్మద్ షాహిద్ ఆలం ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సౌదీ అరేబియాలోని సుమారు వెయ్యి మంది ప్రవాస భారతీయులు పెద్దలు, పిల్లలు పాల్గొంటారని 'సాటా' వెస్ట్రన్ రీజియన్ ప్రధాన కార్యదర్శి కుద్రత్ మీర్జా తెలిపారు. సభా ప్రాంగణంలో దీపావళి నేపథ్య అలంకరణ చేస్తామని భరత నాట్యం, కూచిపూడి, కథాకళి లాంటి సంప్రదాయ నృత్యాల తోపాటు దాండియా, పాటలు, ప్రత్యక్ష్య సంగీతం ఉంటాయని 'సాటా' వెస్ట్రన్ రీజియన్ సాంస్కృతిక ఉపాధ్యక్షురాలు లక్ష్మీ నాగరాజ్ తెలిపారు. భారతీయ కుటుంబాలు సాంప్రదాయ వస్త్రధారణతో వచ్చి దీపావళి పండుగను జరుపుకోనున్నారని 'సాటా' వెస్ట్రన్ రీజియన్ అధ్యక్షుడు నరేష్ తెలిపారు. సంఘసేవ వాలంటీర్లకు సన్మానం, రాత్రి 9 గంటలకు భోజనాలతో కార్యక్రమం ముగుస్తుందని ఆయన తెలిపారు. (చదవండి: భారత సంతతి విద్యార్థికి.. ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోడమా!..) -
విస్తరణ బాటలో కల్యాణ్ జ్యుయలర్స్
న్యూఢిల్లీ: దక్షిణాదియేతర మార్కెట్లలో కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తున్నట్లు కల్యాణ్ జ్యుయలర్స్ వెల్లడించింది. దీపావళిలోగా కొత్తగా 20 షోరూమ్లను ప్రారంభించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. అలాగే తమ తొలి ఎఫ్వోసీవో (ఫ్రాంచైజీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్) షోరూమ్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మధ్యప్రాచ్యంలో ప్రారంభించనున్నట్లు సంస్థ వివరించింది. అలాగే వచ్చే ఆరు నెలల్లో తమ ఆన్లైన్ జ్యుయలరీ ప్లాట్ఫాం క్యాండియర్కి సంబంధించి 20 ఫిజికల్ షోరూమ్లను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి దేశ విదేశాల్లో కంపెనీ మొత్తం షోరూమ్ల సంఖ్య 194కి చేరింది. -
అమెరికాలో దీపావళికి సెలవు.. ప్రత్యేక బిల్లు!
వాషింగ్టన్: అమెరికాలో దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్టసభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లు (Diwali Day Act )ప్రవేశపెట్టారు. గ్రేస్ మెంగ్ శుక్రవారం ప్రతినిధుల సభ( House of Representatives)లో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై పలువురు చట్టసభ్యులతో పాటు భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గ్రేస్ మెంగ్ వర్చువల్గా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యమైంది. క్వీన్స్, న్యూయార్క్ లాంటి అమెరికా ప్రధాన నగరాల్లోనూ లెక్కలేనన్ని కుటుంబాలు, కమ్యూనిటీలు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటాయి. అమెరికన్ పౌరులు సైతం హుషారుగా పాల్గొనడమూ చూస్తున్నాం. ఆ వెలుగులు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. కాబట్టి, ఈ పండుగను ఫెడరల్ హాలీడేగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని ఆమె వివరించారు. మరో ఈ ప్రతిపాదనపై సౌత్ ఏషియా కమ్యూనిటీతో పాటు పలువురు అక్కడి చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. న్యూయార్క్కు చెందిన మరో చట్టసభ్యురాలు జెన్నిఫర్.. దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అంటున్నారు. అమెరికాలో 40 లక్షల మంది దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారామె. న్యూయార్క్ సెనెటర్ జెర్మీ కూనీ, న్యూయార్క్ సిటీ కౌన్సిల్మ్యాన్ శేఖర్ కృష్ణన్ సైతం ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. శేఖర్ కృష్ణన్ న్యూయార్క్ ప్రభుత్వానికి ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్. ఇక అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్లోనూ దీపావళి వేడుకలు జరుగుతుండడం చూస్తున్నదే. ఈ బిల్లు తొలుత పార్లమెంట్లో పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకంతో చట్టం అవుతుంది. ఒకవేళ దీపావళి పండుగకు గనుక సెలవు దినంగా ఆమోద ముద్ర పడితే.. అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఫెడరల్ హాలీడేస్ జాబితాలో 12వదిగా నిలుస్తుంది. అమెరికాలో పబ్లిక్ హాలీడేస్(నేషనల్ హాలీడేస్)తో పాటు ఫెడరల్ హాలీడేస్(ప్రత్యేక సెలవులు) ఉంటాయి. ఈ లిస్ట్లో న్యూఇయర్, మార్టిన్ లూథర్ కింగ్ జయంతోత్సవాలు, వాషింగ్టన్ బర్త్డే, మెమొరియల్ డే, జూన్టీన్త్ నేషనల్ ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే, లేబర్ డే, కొలంబస్ డే, వెటరన్స్ డే, థాంక్స్గివింగ్ డే, క్రిస్మస్ డేలు ఉన్నాయి. -
ఆస్టిన్లో ఉత్సాహంగా దసరా - దీపావళి వేడుకలు
టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్లో తెలుగు కల్చర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి పండుగల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సినీ గాయకులు గీత మాధురి ,అఖిల మమందుర్, ఆదిత్య ఐయాంగర్లు తమ పాటలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో టీసీఏ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బత్తుల ప్రెసిడెంట్ ఎలెక్ట్ అర్జున్ అనంతుల ,సెక్రెటరీ శ్రీనివాస్ బైరపనేని ,ట్రెజరర్ వెంకట్ సాదినేని , స్పోర్ట్స్ కమిటీ చైర్ పరమేశ్వర్ రెడ్డి నంగి, ఫైనాన్స్ సెక్రటరీ మధుకర్ , ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ సెక్రటరీ చిన్నపరెడ్డి, మెంబర్షిప్ సెక్రటరీ భరత్ పిస్సాయ్ , కల్చరల్ సెక్రటరీ శైలజ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ వెంకటరామి రెడ్డి ఉమ్మ, రామ్ హనుమంత్ మల్లిరెడ్డి, మురళీధర్ రెడ్డి వేలూరు ధన్యవాదాలు తెలిపారు. -
హాంగ్ కాంగ్లో దీపావళి ధమాల్!
హాంగ్ కాంగ్లో ప్రవాస తెలుగు వారందరు ఎంతో ఆనందోత్సాహాలతో దీపావళి వెలుగులను తమ నవ్వుల జిలుగులతో వెలిగించారు. ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ వారు స్థానిక కోవిడ్ నియమాలను పాటిస్తూ ఘనంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇండియా క్లబ్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మన తెలుగు సంస్కృతిని ప్రదర్శిస్తూ, పిల్లలు - పెద్దలు తమ నాట్య గానాలతో అందరిని అలరించారు. ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రముఖ సమాజ సేవిక షీలా సమతాని, మిస్ కోని వాంగ్, NAAC (The Neighbourhood Advice Action Council)-అల్పసంఖ్యాక వర్గాలకున్న, మద్దతు సేవా కేంద్రానికి అధ్యక్షురాలిగా, హాంగ్ కాంగ్లో నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గాలకు తమ సంస్థల ద్వారా అనేక సేవలను అందజేస్తున్నారు. ముఖ్య అతిధులిద్దరు తెలుగు వారి సంప్రదాయాలని, వేడుకల్ని, సేవా భావాన్ని, స్ఫూర్తిగా కొనియాడుతూ ప్రశంసించారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలు తెలియజేస్తూ, తాము ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న తమ కార్యవర్గ సభ్యులు రమాదేవి సారంగా, రాధిక విశ్వనాథ్, కొండ మాధురి, హర్షిణి పచ్చoటి, రాజశేఖర్ మన్నే, వేమూరి విశ్వనాథ్, హరీన్ తుమ్మల, గరదాస్ గ్యానేశ్వర్ తదితరులు ఎంతో నేర్పుగా దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారని తమ ఆనందాన్ని వెల్లడించారు. -
బీఎస్ఈలో ఎలక్ట్రానిక్ గోల్డ్ షురూ
న్యూఢిల్లీ: బంగారం ట్రేడింగ్లో పారదర్శకతకు తెరతీస్తూ దిగ్గజ స్టాక్ ఎక్స్ఛేంజీ బీఎస్ఈ.. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్(ఈజీఆర్) ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టింది. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్ ద్వారా 995, 999 స్వచ్ఛత పేరుతో రెండు ప్రొడక్టులను ప్రారంభించింది. వీటిని 1 గ్రాము పరిమాణంతో ప్రారంభించడంతోపాటు 10 గ్రాములు, 100 గ్రాములలోనూ డెలివరీలకు వీలు కల్పించింది. ఈజీఆర్ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గత నెలలో బీఎస్ఈకి తుది అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సూచనప్రాయ అనుమతి లభించాక సభ్యులు ట్రేడింగ్ చేసేందుకు వీలుగా బీఎస్ఈ పరీక్షార్థం పలుమార్లు మాక్ ట్రేడింగ్ను నిర్వహించింది. కాగా.. ఈజీఆర్లో వ్యక్తిగత ఇన్వెస్టర్లతోపాటు..బులియన్ ట్రేడర్లు, వాణిజ్య క్లయింట్లు తదితర సంస్థలు సైతం ట్రేడింగ్ను చేపట్టేందుకు వీలుంటుంది. దిగుమతిదారులు, బ్యాంకులు, రిఫైనరీలు, ఆభరణ తయారీదారులు, రిటైలర్లు ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవచ్చు. దీంతో స్పాట్ ధరల్లో మరింత పారదర్శకత వస్తుందని బులియన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
ఆపద్బాంధవుడు అవుతారా?
రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. తాజా ఉదాహరణ – బ్రిటన్ ప్రధానమంత్రి పగ్గాలను రిషీ సునాక్ చేపట్టడం. సొంత పార్టీ సారథ్యానికి జరిగిన పోటీలో ఓటమి పాలై నిండా నెలన్నరైనా గడవక ముందే ఆ పదవి ఆయనను వరిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కనీసం రిషి సైతం కలగని ఉండరు. కానీ అదే జరిగింది. బ్రిటన్ పీఠంపై భారతీయ మూలాలున్న తొలి ప్రధానిగా, 200 ఏళ్ళ బ్రిటన్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా 42 ఏళ్ళ రిషి అవతరించారు. కానీ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్కూ, అంతర్గత విభేదాలతో ఉన్న అధికార కన్జర్వేటివ్ పార్టీకీ ఆయన ఆపద్బాంధవుడు కాగలరా? ఇటీవలి ప్రధానులు డేవిడ్ కామెరాన్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్లు నలుగురిలో ముగ్గురి కన్నా తక్కువ అనుభవం ఉన్న ఆయన నెగ్గుకు రాగలరా? రెండేళ్ళ క్రితం భగవద్గీతపై ప్రమాణం చేసి మంత్రి పదవి చేపట్టి, దీపావళికి ఇంటి ముందు దీపాలు వెలిగించి సనాతన సంప్రదాయాన్ని పాటించినందుకు బ్రిటన్లో విమర్శల పాలైన పంజాబీ హిందూ రిషి తీరా ఈ దీపావళి నాడు అదే దేశానికి ప్రధాని కావడం కాకతాళీయం. మాజీ బాస్ బోరిస్ జాన్సన్, మరో పోటీదారు పెన్నీ మార్డాంట్లు బరిలో నిలిచేందుకు కావాల్సిన 100 మంది ఎంపీల మద్దతును కూడగట్టుకోలేకపోవడంతో, ఈసారి ప్రధాని పీఠానికి రిషి పయనం నల్లేరు మీద బండి నడక అయింది. కానీ, 45 రోజుల్లోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన బ్రిటన్ తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ అందుకు తనను తాను తప్ప వేరెవరినీ నిందించలేరు. అనాలోచిత చర్యలతో కూడిన ‘మినీ బడ్జెట్’ను ప్రవేశపెట్టి, పౌండ్ విలువ భారీగా తగ్గడానికీ, మార్కెట్ పతనానికీ కారణమయ్యారనే అపకీర్తిని ఆమె మూటగట్టుకున్నారు. కరోనా కాలంలో చేపట్టిన చర్యలకు మంచి పేరు తెచ్చుకున్న రిషి తాజా గందరగోళాన్ని ఎలా చక్కదిద్దుతారో చూడాలి. తప్పులను సరిదిద్దడానికే తనకు బాధ్యత అప్పగించారనీ, తక్షణమే ఆ పని మొదలుపెడుతు న్నాననీ రిషి మాట. కేవలం ఏడేళ్ళ పార్లమెంటరీ అనుభవమే ఉన్న రిషి అయిదేళ్ళకే ఆర్థిక మంత్రి, ఆ పైన రెండేళ్ళకే ప్రధానీ అయ్యారు. విశ్వసనీయత, ప్రొఫెషనలిజమ్, జవాబుదారీతనం ముఖ్యమైన వేళ కోరి తలపై పెట్టుకున్న ప్రధాని పట్టం అన్ని విధాలా ముళ్ళకిరీటమని రిషికి తెలుసు. ఒకపక్క అంతర్గత కుమ్ములాటల్లో పడిపోయిన స్వపక్షీయులైన కన్జర్వేటివ్ల మధ్య ఐక్యత తేవడానికి ఆయన శ్రమించాలి. మరోపక్క కట్టుదిట్టమైన చర్యలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. ఈ శ్వేతేతర జాతి నేత పదవి చేపట్టిన మంగళవారమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. లిజ్ సారథ్యంలో పనిచేసిన పలువురు మంత్రులకు ఉద్వాసన పలికారు. మునుపటి లిజ్ మంత్రివర్గంలోకి ఆఖరి రోజుల్లో వచ్చిన ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ను అదే పదవిలో పునర్నియమించారు. పార్టీకి కొత్త ఛీఫ్ విప్ను పెట్టారు. అన్నట్టుగానే వెంటనే పనిలోకి దిగారు. కారణాలు ఏమైనా, ఒకే ఏడాదిలో బ్రిటన్ ముచ్చటగా మూడో ప్రధానమంత్రిని చూసేలా చేసింది అధికార పార్టీ. గడచిన 12 ఏళ్ళ పాలన దేశాన్ని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టిందనే ఆరోపణ ఉంది. ఇప్పుడు 700 మిలియన్ పౌండ్లకు పైగా ఆస్తులతో ఆ పార్టీలోని రిషీ సునాక్ దంపతులు సాక్షాత్తూ బ్రిటన్ రాజు కన్నా అధిక ధనవంతులనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కనీసం కొత్త ప్రభుత్వమైనా సుస్థిర ఆర్థిక విధానాలను అనుసరించాలనీ, ఘడియకో మార్పు చేయరాదనీ బ్రిటన్ ఆర్థిక విపణి భావిస్తోంది. రిషి ఆ ఆకాంక్షకు తగ్గట్టు వ్యవహరిస్తే మునుపటిలా మార్కెట్ పతనం కాకపోవచ్చు. దేశానికి ఓ దిశ, దశ కల్పించడం క్లిష్టమే. ‘ఆర్థిక సుస్థిరత, సమర్థత ప్రభుత్వ అజెండా’ అంటున్న రిషి అదుపు తప్పి పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభాలకు కళ్ళెం వేయాలి. కఠిన నిర్ణయాలు తప్పవంటూ పగ్గాలు చేపడుతూనే ప్రకటించినా, అందుకు చిక్కులు లేకపోలేదు. కన్జర్వేటివ్ల సర్వసాధారణ సిద్ధాంతమే పన్నుల తగ్గింపు. తీరా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పన్నులు విధిస్తే, సొంత పార్టీలోనే ఆయనకు నిరసన ఎదురు కావచ్చు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆశ కూడా అదే. రిషి మాత్రం సంక్షోభ పరిష్కారానికి మంత్ర దండమేదీ లేదనీ, కాకమ్మ కథల్లో తనకు నమ్మకం లేదనీ అంటున్నారు. అందుకే, రాబోయే రోజుల్లో ఆయన ఏం చేస్తారు, ఎలా దేశాన్ని గట్టెక్కిస్తారన్నది ఆసక్తికరం. ఏళ్ళ తరబడి మనల్ని బానిసలను చేసుకొని పాలించి, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడానికి అనేక అభ్యంతరాలు పెట్టిన రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం... తీరా మనకు స్వాతంత్య్రం దక్కిన సరిగ్గా 75 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విచిత్రంగా భారతీయ మూలాలున్న వ్యక్తి ఏలుబడిలోకి రావడం విధి చేసిన వింత. నిజానికి, అప్పటి బ్రిటన్, ఇప్పటి బ్రిటన్ అనేక రీతుల్లో వేరు. అయితేనేం, మన భారతీయుల వరకు ఇది అహాన్ని సంతృప్తిపరచే అంశమే. మన దేశాన్ని మరొకరు పాలించడానికి ఇచ్చగించకపోయినా, మరో దేశంలో మనవాడు జెండా ఎగరేశాడంటూ సహజమైన సంతోషాన్నీ వ్యక్తం చేస్తాం. బ్రిటన్తో మన బంధం బలపడుతుందనీ ఆశిస్తాం. సంక్లిష్టమైన, ఈ సరికొత్త బాధ్యతల్లో రిషి విజయం సాధించి, రాజకీయ, ఆర్థిక సుస్థిరత అందించాలనే కోరుకుందాం. తప్పేమీ కాదు. కానీ, అది అనుకున్నంత తేలిక కాదు. చిన్న తేడా జరిగినా, ఆపైన దేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీకి అప్పనంగా అందించారనే అపకీర్తి రిషి మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంటుంది. -
అంగరంగ వైభవంగా వైట్ హౌస్లో దీపావళి వేడుకలు (ఫొటోలు)