ASSOCIATION
-
ఆత్మాభిమానం కోసం మా పోరాటం
-
బాధితురాలు లక్ష్మికి మహిళా సంఘాల మద్దతు
-
ఏఏఏఐ అధ్యక్ష నియామకం
హైదరాబాద్: సౌత్ ఏషియా ఆఫ్ గ్రూప్ ఎం మీడియా (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ సీఈవో అయిన ప్రశాంత్ కుమార్, అడ్వరై్టజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) ప్రెసిడెంట్గా మరోసారి ఎన్నికయ్యారు. ముంబైలో సమావేశమైన ఏఏఏఐ వార్షిక జనరల్ బాడీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి కొత్త పాలకమండలిని ఎన్నుకుంది. హవాస్ ఇండియా గ్రూప్ సీఈవో అయిన రాణా బారువా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. మోహిత్ జోషి, సంతోష్ కుమార్, కె.శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, నూతన అవకాశాలను సొంతం చేసుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని కొత్త ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. -
ధ్యానంతోనే విశ్వశాంతి
నందిగామ/శంషాబాద్ (హైదరాబాద్): ప్రపంచ శాంతికి ధ్యానం ఒక్కటే మార్గమని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ కమ్లేష్ పటేల్ (దాజీ)కు కామన్వెల్త్ ఆధ్వర్యంలో గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ అవార్డు రావడం ఆనందకరమన్నారు. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ మాట్లాడుతూ.. దాజీ 160 దేశాల్లో 16 వేల మంది వలంటీర్లు, 5 వేల కేంద్రాల్లో 5 మిలియన్లకు పైగా అభ్యాసీలను కలిగి ఉండటం ప్రపంచ స్థాయిలోనే గొప్ప విషయమని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తించి ‘గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్’ అవార్డు అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. కమ్లేష్ పటేల్ (దాజీ) మాట్లాడుతూ.. తనకు కామన్వెల్త్ ఆధ్వర్యంలో అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు అధ్యాత్మికవేత్తలు ధ్యానం చేశారు. కార్యక్రమంలో ప్రపంచ మత పెద్దల మండలి సెక్రటరీ జనరల్ భావాజైన్, సైంటిస్ట్ డాక్టర్ రోలీన్ మెక్క్రాటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్సియె ఎస్ బీయింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ జోసెఫ్ బెంటన్ హోవెల్ పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి దంపతులు జగదీప్ ధన్ఖడ్, సుధేష్ ధన్ఖడ్లు తమ పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరికీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ తమిళి సై, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఘనంగా వీడ్కోలు పలికారు. -
‘మార్గదర్శి’ మోసాలపై సంఘటిత పోరు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలపై పోరాడేందుకు ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం’ ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. మార్గదర్శి బాధితుల సమస్యలను వివరించడానికి ఈ నెల 28వ తేదీ బుధవారం 11 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్ తెలిపారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని.. రామోజీరావు, మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని శ్రీనివాస్ అన్నారు. వివరాలకు 99481 14455 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అక్రమ ఆర్థిక సామ్రాజ్యం.. ఆధారాలతో సహా బట్టబయలు కాగా, మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆర్థిక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆరి్థక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతోసహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. మార్గదర్శిలో ఏ ఏ అవకతవకలు..? ►ఆదాయపు పన్ను శాఖ చట్టానికి వ్యతిరేకంగా అక్రమ నగదు లావాదేవీలు ►మార్గదర్శి పేరిట చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు ►ఖాతాదారులకు రూ.కోట్లలో బకాయిలు ►బ్యాంకు అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు ►చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు (డిపాజిట్లకు అనుమతి లేదు) ►ఖాతాదారులకు తెలియకుండానే చిట్ నుంచి డిపాజిట్లుగా మార్పు ఇదీ చదవండి: ‘బ్లాక్’ కోబ్రా -
‘మార్గదర్శి’ మోసాలపై కలిసికట్టుగా పోరాటం: బాధితుల సంఘం
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్స్ మోసాలపై కలిసికట్టుగా పోరాడేందుకు బాధితులు సిద్ధమయ్యారు. మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం పేరుతో రిజిస్ట్రేషన్ అవ్వగా, విజయవాడ కేంద్రంగా ఈ సంఘం పనిచేయనుంది. అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బాధితుల సంఘం పేర్కొంది. మోసపోయిన వారు తమను సంప్రదించాలని, తమ సమస్యలను 9849055267 నెంబర్కు పంపించాలని బాధితుల సంఘం తెలిపింది. ఇదీ మార్గదర్శి బాగోతం హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది. ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా, జీవోలపై స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏ మాత్రం సహకరించలేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు. ఇదీ చదవండి: ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే -
ఆయన దయ వల్లే ఈ హోదా – జానీ మాస్టర్
‘‘ఈ రోజు మాకు (డ్యాన్స్ మాస్టర్స్) ఇంత పేరు, హోదా వచ్చి కార్లలో తిరుగుతున్నామంటే ముక్కురాజు మాస్టర్ దయే. ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే కారణం కూడా ఆయనే. యూనియన్ తరఫున ఆయన వారసురాలికి చిరు కానుకగా రెండు లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అని ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ నూతన అధ్యక్షుడు జానీ మాస్టర్ అన్నారు. ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఆయన ప్రమాణ స్వీకారానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కేఎల్ దామోదర ప్రసాద్ విశిష్ఠ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘నూతన కార్యవర్గం యూనియన్ సభ్యుల మంచి కోసం పని చేయాలి. జానీ ప్రమాణ స్వీకారానికి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి డ్యాన్స్ మాస్టర్లు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా యూనియన్ సొంత స్థలం, భవనం కోసం కృషి చేస్తా’’ అన్నారు జానీ మాస్టర్. ఈ కార్యక్రమంలో మద్రాస్ డ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ దినేష్ మాస్టర్, పలువురు డ్యాన్స్ మాస్టర్స్ పాల్గొన్నారు. -
కేసీఆర్ పాలన స్వర్ణయుగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్పాలన స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్నిరంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని అసోసియేషన్ –యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు. మహిళారిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సకలజనుల సర్వే నిర్వహించి, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించడం ద్వారా, వారి జీవితాల్లో మార్పు తెచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారిని ప్రోత్సహించేందుకు కృషి చేసిన వివరాలు వెల్లడించారు. మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొల్పడంతో వారిలో విద్య పట్ల ఆసక్తి పెరిగిందని, గతంలో ఎన్నడూ లేనంతగా పాఠశాలలకు హాజరుశాతం పెరిగిందన్నారు. సీఎం కృషి వల్ల తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును డీలిమిటేషన్కు ముడిపెట్టడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని.. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55–57 శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నా, సమావేశాలు నిర్వహిస్తే ఎక్కువ పురుషులు కనిపిస్తారని, ఆ పరిస్థితి మారాలని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే రాజకీయాల్లోకి.. తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ పోటీ చేసినప్పుడు మొదటిసారి రాజకీయ ప్రచారం చేశానని కవిత గుర్తు చేశారు. ఓ గ్రామీణ మహిళ తనకు రూ. వెయ్యి ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. -
త్వరలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పేరు మార్పు
సాక్షి, అమరావతి: ఇప్పటివరకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్గా ఉన్న తమ సంఘం పేరును త్వరలో ఏపీ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీజీవో) అసోసియేషన్గా మార్పు చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. సంఘం రాష్ట్ర 21వ కౌన్సిల్ సమావేశాల్లో రెండో రోజు ఆయన మాట్లాడారు. సంఘం పేరు మార్చేందుకు తీర్మానం చేసినట్లు చెప్పారు. గెజిటెడ్ అధికారులకు సంఘంలో సభ్యత్వం ఇచ్చేందుకు అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. గతంలో తమ సంఘంలో ఉన్న ఉద్యోగులు కొందరు గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులోకి వెళ్లారని, దీంతో వారిని కూడా సంఘంలో చేర్చుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచామని, వీలైనంత వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ప్రభుత్వంతో సామరస్యంగా ఉండి డిమాండ్లను సాధించుకుంటామన్నారు.సంఘం నిర్వహించే మహాసభలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించడం 7 దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగానే సీఎం జగన్ను ఆహ్వానించామని చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం అంగీకరించడం శుభ పరిణామమన్నారు. కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా జిల్లాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవాలని, మరింత మంది మహిళలకు నూతన కార్యవర్గంలో చోటు కల్పించాలని తీర్మానించారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్రెడ్డి, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సురేష్ లాంబ, 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
NATA : డాలస్ నాటా కన్వెన్షన్లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్
అటు తమన్ నుండి తమన్నా వరకు, ఇటు దేవిశ్రీ నుండి దిల్ రాజు వరకు, మరెందరో పెద్దలు మరియు ప్రముఖులతో డాలస్ మహానగరం దద్దరిల్లిన వేళావిశేషాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంలో నాటా ట్రాన్స్పోర్ట్ పాత్ర కీలకమని అసొసియేషన్ తెలిపింది. ఈ మేరకు ట్రాన్స్పోర్ట్ బృందాన్ని ప్రశంసించింది. ఘనంగా నాటా వేడుకలు భారీ జన పరివారం, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సంగీతం.. ఇలా చెప్పుకుంటూ పోతో నాటా వేడుకల్లో ఎన్నో విశేషాలు. ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరగడానికి తెర వెనక ఎందరో అసామాన్యుల కష్టం ఉంది. వారిలో ఒకటి ట్రాన్స్పోర్ట్ బృందం. డాక్టర్ రాజేంద్ర కుమార్ రెడ్డి పోలు చైర్ పర్సన్గా ఏర్పాటయిన నాటా రవాణా బృందం తక్కువ వ్యవధిలో అద్బుతమైన సేవలందించింది. నాటా రవాణా బృందంలో కీలకం ప్రణాళికా బృందం. దీన్ని కార్తిక్ రెడ్డి మేడపాటి, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, మరియు ప్రసాద్ రెడ్డి నాగారపు పక్కగా నిర్వహించారు. అందరికి అనుసంధానం వీరే నాలుగు వేల మందికి విమాన టిక్కెట్లు, ఐటినరీలు, ఎయిర్పోర్టులకు వచ్చిన అతిధులకు ఆహ్వానం, ఇలా ఎన్నో పనులను ఒక ప్లాన్తో ట్రాన్స్పోర్ట్ బృందం నిర్వహించింది. అతిధులను దగ్గరుండి వ్యాన్లలో, కార్లలో తీసుకొని హోటళ్ళకి, కన్వెన్షన్ హాలుకి తరలించి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేశారు. ఒక్క బస్సు రోడ్డుపై వెళ్తే మామూలే కానీ 16 పెద్ద పెద్ద బస్సులు, మెర్సిడీస్ స్ప్రింటర్ వ్యాన్లు, సబ్-అర్బన్ కార్లు, లగ్జరీ లిమోసిన్లు ఇలా డాలస్ హైవే రోడ్లపై సందడి చేశాయి. "డాలస్ ఫోర్ట్వర్థ్ ఎయిర్పోర్ట్" వద్ద ఐదు టెర్మినళ్లకి మరియు లవ్-ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఒక్క టెర్మినల్ కి వెళ్లి అందరిని నాటా కన్వెన్షన్ హాలుకి తీసుకొచ్చారు. పేరుపేరునా ధన్యవాదాలు ఈ మొత్తం యజ్ఞంలో సహకరించిన ప్రతీ సభ్యులకు నాటా ధన్యవాదాలు తెలిపింది. కార్తిక్ రెడ్డి మేడపాటి, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ రెడ్డి మోపూరు, సుధాకర్ రెడ్డి మేనకూరు, వరదరాజులు రెడ్డి కంచం, అనిల్ కుమార్ రెడ్డి కుండా, హరినాథ్ రెడ్డి పొగాకు, ప్రసాద్ రెడ్డి నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవన్ రెడ్డి మిట్ట, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎద్దుల, పురుషోత్తం రెడ్డి బోరెడ్డి, శ్రీనివాస రెడ్డి ముక్క, శ్రీనివాసుల రెడ్డి కొత్త, ఎల్లారెడ్డి చలమల, మరియు గౌతమ్ రెడ్డి కత్తెరగండ్ల ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బృందానికి ప్రత్యేక సౌకర్యాలతో ఎల్లారెడ్డి చలమల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాటా అధ్యక్షులు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కో-ఆర్డినేటర్ డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి, నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్ శ్రీనివాసుల రెడ్డి కొట్లూరు, కన్వీనర్ ఎన్.యమ్.ఎస్ రెడ్డి , మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ హరినాధ రెడ్డి వెల్కూరు , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆళ్ల రామి రెడ్డి , సెక్రటరీ గండ్ర నారాయణ రెడ్డి , ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దర్గా నాగి రెడ్డిలకు ట్రాన్స్పోర్ట్ టీం ప్రత్యేక ధన్యవాదములు తెలిపింది. -
సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన రవీంద్రరాజు
అమరావతి: ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు, జనరల్ సెక్రటరీ అప్పలనాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కొత్త కార్యవర్గంతో కలిసి ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో కలిశారు. కార్యక్రమంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వి ఎస్ దివాకర్, సీఆర్పి రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Jagananna Suraksha: జగనన్న సురక్ష సూపర్ సక్సెస్ -
చిన్నబోయిన ఈక్విటీ ఫండ్స్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు ఏప్రిల్లో ఆదరణ తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే పెట్టుబడులు 68 శాతం తగ్గిపోయి రూ.6,480 కోట్లకు పరిమితమయ్యాయి. అయినా, ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా 26వ నెలలోనూ నమోదైంది. వచ్చిన కొద్ది పెట్టుబడుల్లోనూ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ పథకాలు ఎక్కువ మొత్తం ఆకర్షించాయి. ఏప్రిల్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గురువారం విడుదల చేసింది. మొత్తం మీద 42 సంస్థలతో కూడిన మ్యూచువల్ పండ్స్ పరిశ్రమ ఏప్రిల్ నెలలో రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ప్రధానంగా డెట్ విభాగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ఇందుకు దోహదం చేసింది. అంతకుముందు మార్చి నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు నికరంగా రూ.56,884 కోట్ల పెట్టుబడులను నష్టపోవడం గమనార్హం. కానీ, ఏప్రిల్లో రూ.1.06 లక్షల కోట్లను రాబట్టాయి. దీంతో మ్యచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ మార్చి చివరికి ఉన్న రూ.39.42 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్ చివరికి రూ.41.62 లక్షల కోట్లకు ఎగిసింది. ► ఈక్విటీల్లో ఫోకస్డ్ మినహా అన్ని విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. స్మాల్ క్యాప్ పథకాల్లోకి రూ.2,182 కోట్లు, మిడ్క్యాప్ పథకాల్లోకి రూ.1,791 కోట్లు వచ్చాయి. ► మల్టీక్యాప్ ఫండ్స్ రూ.206 కోట్లు, లార్జ్క్యాప్ ఫండ్స్ రూ.52 కోట్లు, లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ రూ.738 కోట్లు చొప్పున ఆకర్షించాయి. ► డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్లోకి రూ.122 కోట్లు రాగా, సెక్టోరల్ (థీమ్యాటిక్) ఫండ్స్లోకి రూ. 614 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ విభాగంలోకి రూ.61 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లోకి రూ.550 కోట్లు, వ్యాల్యూ ఫండ్స్లోకి రూ.291 కోట్ల చొప్పున వచ్చాయి. ► ఫోకస్డ్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.131 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా రూ.63,219 కోట్లను ఆకర్షించాయి. ► మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ.13,961 కోట్లు, అల్ట్రాషార్ట్ డ్యురేషన్ ఫండ్స్లోకి రూ.10,663 కోట్ల చొప్పున వచ్చాయి. ► ఇక గోల్డ్ ఈటీఎఫ్లు సైతం రూ.125 కోట్లను ఆకర్షించాయి. ఇండెక్స్ ఫండ్స్లోకి రూ.147 కోట్లు, ఇతర ఈటీఎఫ్ల్లోకి రూ.6,790 కోట్ల చొప్పున వచ్చాయి. సిప్ ద్వారా రూ.13,728 కోట్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.13,728 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెలలో వచ్చిన మొత్తం రూ.14,276 కోట్లతో పోలిస్తే తగ్గాయి. ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి కాస్త అధిక మొత్తంలోనే పెట్టుబడులు వస్తుంటాయి. ఇన్వెస్టర్లు సిప్ ద్వారా ప్రస్తుత పెట్టుబడులు కొనసాగిస్తూనే.. ఈక్విటీ పథకాలకు అదనపు పెట్టుబడులను కేటాయించే విషయమై కాస్త వేచి చూసే ధోరణితో ఉన్నట్టు తెలుస్తోందని కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన మనీష్ మెహతా పేర్కొన్నారు. -
మళ్లీ ఆఫీసులు కళకళ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో కార్యాలయాలు తిరిగి ఉద్యోగులతో సందడిగా మారుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కంపెనీలు తమ ఉద్యోగులను కోరుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లోగడ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో మెజారిటీ ఉద్యోగులు పనిచేయడం తెలిసిందే. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత నుంచి ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. వారంలో కొన్ని రోజుల పాటు ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే వర్క్ఫ్రమ్ హోమ్కు మంగళం కూడా పలికాయి. కంపెనీలు తమ పని విధానాలను సమీక్షించుకుంటున్నాయి. ఐటీ పరిశ్రమలో పని విధానాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిపై ప్రభావం చూపుతాయి. కనుక కంపెనీల్లో ప్రస్తుతం అమలవుతున్న పని విధానాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు విధానాల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఓ సర్వే నిర్వహించింది. ఈ సంఘంలో 300కు పైగా కంపెనీలు భాగస్వాములుగా ఉంటే, మూడింట ఒక వంతు కంపెనీలు సర్వేలో పాల్గొని వివరాలు తెలిపాయి. సర్వేలోని అంశాలు.. ► ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు కంపెనీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కంపెనీలు తీసుకుంటున్న చర్యలు ఫలితంగా మూడింట ఒక వంతుకు పైగా కంపెనీల్లో 60 శాతానికి పైగా ఉద్యోగులు ఇప్పుడు వారంలో కనీసం రెండు రోజులు ఆఫీసులకు వచ్చే పనిచేస్తున్నారు. పెద్ద కంపెనీల్లో కార్యాలయాలకు వచ్చే వారు 22 శాతంగా ఉంటే, చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో 38 శాతంగా ఉన్నారు. ► 62 శాతం కంపెనీల్లో 19 శాతం మంది ఉద్యోగులు హైదరాబాద్కు వెలుపల ఉన్న చోట నుంచే పనిచేస్తున్నారు. ఈ మేర ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా పనిచేయడం అన్నది 2023లోనూ, ఆ తర్వాత కూడా కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 21 శాతం కంపెనీల్లో అయితే 20–39 శాతం మేర ఉద్యోగులు, 13 శాతం కంపెనీల్లో 40–59 శాతం మేర ఉద్యోగులు హైదరాబాద్ బయటి నుంచే సేవలు అందిస్తున్నారు. ► 26 శాతం కంపెనీల్లో నూరు శాతం ఉద్యోగులు వారంలో అన్ని రోజులూ (సెలవులు మినహా) కార్యాలయాలకు వచ్చి పనిచేస్తున్నారు. 28 శాతం కంపెనీల్లో మూడు రోజుల కార్యాలయ పనివిధానం నడుస్తోంది. 14 శాతం కంపెనీల్లో వారంలో రెండు రోజులు కార్యాలయాలకు వస్తుంటే, 15 శాతం కంపెనీలు ఫ్లెక్సీ (వీలునుబట్టి ఎక్కడి నుంచి అయినా) పని విధానాన్ని ఆచరిస్తున్నాయి. ► భవిష్యత్తులో అవసరమైతే 2–5 రోజుల పాటు ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా కంపెనీలు విధానాలను రూపొందించుకున్నాయి. వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని భావిస్తున్నాయి. ► భవిష్యత్తులో పూర్తిగా ఆఫీసుకే వచ్చి పనిచేసే విధానాన్ని అమలు చేస్తామని 35 శాతం కంపెనీలు చెప్పాయి. వారంలో మూడు రోజులు అయినా ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని 26 శాతం కంపెనీలు తెలిపాయి. 12 శాతం కంపెనీలు వారంలో రెండు రోజుల విధానాన్ని అనుసరిస్తామని పేర్కొన్నాయి. ► టీమ్ వర్క్, సహకారం, సంస్థలో పని సంస్కృతి, గుర్తింపు, విధేయత, వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధి అంశాలు ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావడంపై ప్రభావం చూపించనున్నాయి. ► సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో మెజారిటీ ఐటీ రంగం నుంచే ఉన్నాయి. 27 శాతం ప్రొడక్ట్ కంపెనీలు కాగా, 24 శాతం ఇంటెగ్రేటెడ్ ఐటీ, ఐటీఈఎస్ సేవల రంగానికి చెందినవి ఉన్నాయి. -
భారీగా మొబైల్ ఫోన్ల ఎగుమతులు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ ఎగుమతులు భారీ వృద్ధిని చూస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి 9.5 బిలియన్ డాలర్లకు ఎగుమతులు పెరిగాయి. ఇందులో యాపిల్ ఫోన్ల ఎగుమతులే సగం విలువను ఆక్రమించగా, 40 శాతం శామ్సంగ్ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ వివరాలను మొబైల్ తయారీ పరిశ్రమ సంఘం ఐసీఈఏ తెలిపింది. జనవరి నాటికి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 8.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఫిబ్రవరి చివరికి 9.5 బిలియన్ డాలర్లకు చేరినట్టు అంచనా వేస్తున్నామని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రా నిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 10 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో దేశం నుంచి 5.5 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతులు నమోదయ్యాయి. -
2024లో ఆటో విడిభాగాల జోరు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆటో విడిభాగాల పరిశ్రమ 10–15 శాతం స్థాయిలో వృద్ధి చెందే వీలున్నట్లు తాజాగా అంచనాలు వెలువడ్డాయి. ఇందుకు దేశ, విదేశీ మార్కెట్ల నుంచి ఊపందుకోనున్న డిమాండు దోహదపడనున్నట్లు ఆటోమోటివ్ విడిభాగాల తయారీ అసోసియేషన్(ఏసీఎంఏ) పేర్కొంది. యూఎస్, యూరప్ తదితర ప్రధాన మార్కెట్లలో ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న ఆందోళనలున్నప్పటికీ దేశీ ఆటో విడిభాగాలకు గిరాకీ కొనసాగనున్నట్లు అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆటో విడిభాగాల పరిశ్రమ 23 శాతం ఎగసింది. 56.5 బిలియన్ డాలర్ల టర్నోవర్ను సాధించింది. ఈ బాటలో మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ 15 శాతం పుంజుకోగలదని ఏసీఎంఏ అంచనా వేసింది. ఐసీఈ ఎఫెక్ట్ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్స్(ఐసీఈ) తయారీలో వినియోగించే ఆటో విడిభాగాల కోసం ప్రపంచ దేశాలు భారత్వైపు చూస్తున్నాయి. యూఎస్, యూరప్ తదితర పశ్చిమ దేశాల మార్కెట్లు ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లుతుండటం ప్రభావం చూపుతోంది. దీంతో దేశీ విడిభాగాల పరిశ్రమ లబ్ది పొందనుంది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(2022 మార్చి– డిసెంబర్) ఎగుమతులు, దిగుమతులు బ్యాలన్స్డ్గా 15.1 బిలియన్ డాలర్ల చొప్పున నమోదైనట్లు పారిశ్రామిక సమాఖ్య ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఏసీఎంఏ డైరెక్టర్ విన్నీ మెహతా వెల్లడించారు. పశ్చిమ దేశాలలో ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీ ఆటో విడిభాగాల ఎగుమతులు అంచనాలకు అనుగుణంగా పుంజుకోనున్నట్లు అంచనా వేశారు. ఎగుమతుల్లో ఎలాంటి మందగమన పరిస్థితులనూ గమనించలేదని తెలియజేశారు. దేశీ ఆటో మార్కెట్ అత్యంత పటిష్టంగా ఉన్న కారణంగా దిగుమతుల్లో సైతం వృద్ధి నమోదైనట్లు తెలియజేశారు. వృద్ధి కొనసాగుతుంది ఏడాది కాలంగా పలువురు ప్రస్తావిస్తున్నట్లు యూఎస్ తదితర ప్రధాన మార్కెట్లలో ఎలాంటి మాంద్య పరిస్థితుల సంకేతాలూ కనిపించలేదని ఏసీఎంఏ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ పేర్కొన్నా రు. నిజానికి ఆటో విడిభాగాల పరిశ్రమ వృద్ధి బాటలోనే పయనిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమ నుంచి లభించిన వివరాల ప్రకారం జనవరిలోనూ పటిష్ట అమ్మకాలు నమోదుకాగా.. ఇకపైన కూడా ఈ జోరు కొనసాగే వీలున్నదని అభిప్రాయపడ్డారు. వృద్ధిరీత్యా దేశీ మార్కెట్ అత్యంత సానుకూలంగా కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతు ల్లో బలహీనతలున్నప్పటికీ దేశీ డిమాండ్ ఆదుకోగలదని అంచనా వేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఈవీలవైపు ప్రయాణించడంలో స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ లబ్ది పొందనున్నట్లు వివరించారు. ఈవీల కారణంగా ఐసీఈ విభాగంలో డిజైన్, డెవలప్మెంట్ కార్యకలాపాలు నిలిచిపోతుండటంతో దేశీ విడిభాగాలకు గిరాకీ కొనసాగనున్నట్లు తెలియజేశారు. -
ఏపీ సీఎస్పై కథనాలు అవాస్తవం: ఐఏఎస్ అసోసియేషన్
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎస్ జవహర్రెడ్డిపై వచ్చిన కథనాలు పూర్తి అవాస్తమని, తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఐఏఎస్ అసోసియేషన్ తెలిపింది. సీఎస్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరికాదన్నారు. తప్పుడు కథనాలపై ఐఏఎస్ అసోసియేషన్లో చర్చించాం. ఇలాంటి కథనాలపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎస్ జవహర్రెడ్డి కడపలో పర్యటించారని ప్రవీణ్ వివరణ ఇచ్చారు. సీనియర్ అధికారిపై తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ -
2022లో డెట్ ఫండ్స్కు అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు 2022లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంపై పెద్ద ప్రభావమే చూపించింది. ఏకంగా రూ.2.3 లక్షల కోట్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు వెళ్లిపోయాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ ఏడాది నిదానిస్తుందన్న అంచనాలతో డెట్ ఫండ్స్ తిరిగి పెట్టుబడులను ఆకర్షించొచ్చన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 2021లోనూ డెట్ విభాగం రూ.34,545 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. డెట్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం రెండో ఏడాది నమోదైంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. వడ్డీ రేట్ల పెంపు క్రమంతోపాటు ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం నికర పెట్టుబడుల ఉపసంహరణకు దారితీసింది. తగ్గిన డెట్ ఫండ్స్ ఆస్తులు ► 2022లో మొత్తం మీద 5 నెలల్లో డెట్ పథకాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా మా ర్చిలో రూ.1,14,824 కోట్లు, జూన్లో రూ. 92, 248 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ► షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.49,200 కోట్లను, కార్పొరేట్ బాండ్స్ నుంచి రూ. 40,500 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ► లిక్విడ్ ఫండ్స్లోకి గతేడాది నికరంగా రూ.17,940 కోట్లు వచ్చాయి. ► మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ.9,250 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లోకి రూ.1,021 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ మార్కెట్లో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్నైట్ ఫండ్స్ పెట్టుబడులే 50 శాతానికి పైగా ఉన్నాయి. ► గతేడాది అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని డెట్ ఫండ్స్ ఆస్తులు 11 శాతం తగ్గి రూ.12.41 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. 2021 డిసెంబర్ నాటికి ఇవి రూ.14.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. ► డెట్ ఫండ్స్కు సంబంధించి మొత్తం ఫోలియోలు 5 లక్షలు తగ్గి 73.38 లక్షలుగా ఉన్నాయి. మార్కెట్ పరిస్థితుల్లో మార్పులు ‘‘ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, సమీప కాలంలో వడ్డీ రేట్ల పెంపు ఎలా ఉంటుందోనన్న అస్పష్టత, రూపాయి పతనం ఇన్వెస్టర్లలో అప్రమత్తతకు దారితీసింది. దీని ఫలితమే డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం’’అని ఫెల్లో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మనీష్ మర్యాద తెలిపారు. ‘‘ఈక్విటీ మార్కెట్ల వ్యాల్యూషన్లు కాస్త విస్తరించి ఉన్నాయి. రిస్క్ రాబడుల దృష్ట్యా మెరుగైన రాబడులను ఇచ్చే మీడియం టర్మ్ డెట్ కేటగిరీల్లోకి ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించొచ్చు. జీసెక్లు, కార్పొరేట్ బాండ్ల మధ్య అంతరం పెరగడంతో క్రెడిట్ ఫండ్స్ కూడా పెట్టుబడులకు మంచి అవకాశం’’అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ (పరిశోధన) కవితా కృష్ణన్ తెలిపారు. -
అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు
సాక్షి, అమరావతి: అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.వి.విజయబాబును ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రంలో అధికారిక, పరిపాలన కార్యకలాపాలు తెలుగు భాషలో కొనసాగే విధంగా పర్యవేక్షించడంతో పాటు తెలుగు భాషా ప్రగతికి సిఫారసులు, సూచనలు చేయాల్సి ఉంటుంది. చదవండి: పంజాబ్కు ఆదర్శంగా ఏపీ -
దేశంలో రిటైల్ జోరు..కోవిడ్ ముందస్తు స్థాయిల కంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారాలు కోవిడ్ ముందస్తు స్థాయిల కంటే ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగించాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది జూలై అమ్మకాలు 18 శాతం పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బుధవారం తెలి పింది. ‘రిటైల్ వ్యాపారం తూర్పు భారత్లో అత్యధికంగా 25% వృద్ధి సాధించింది. దక్షిణాదిలో 21, ఉత్తరాది 16, పశ్చిమ భారత్లో 10% అధికమైంది. అత్యధికంగా 32 శాతం వృద్ధితో క్రీడా సామాగ్రి అమ్ముడైంది. పాదరక్షలు, ఫర్నీ చర్, గృహాలంకరణ వస్తువుల విభాగాలు ఒక్కొక్కటి 23 శాతం, దుస్తులు, వస్త్రాలు 22, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, గృహాపకరణాలు, ఎలక్ట్రానిక్స్ 17% దూసుకెళ్లాయి. ఆభరణాలు 15 శాతం, ఆహారం, సరుకులు 11, సౌందర్య సాధనాలు, వెల్నెస్, వ్యక్తిగత సంరక్షణ 3% పెరిగాయి. పండుగల సీజన్లో మెరుగైన విక్ర యాలు ఉంటాయని రిటైలర్లు ఆభాభావం వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ వ్యాపారాలు 2019తో పోలిస్తే జూన్లో 13 శాతం ఎగశాయి. -
సీఎం జగన్కు ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ అసోసియేషన్ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్ 2 సర్వీసెస్లో జీఎస్టీ ఆఫీసర్లకు గెజిటెడ్ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఆర్ సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ జీఎం రమేష్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.విద్యాసాగర్, ట్రెజరర్ జీఆర్వీ ప్రసాద్ తదితరులు ఉన్నారు. చదవండి: ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’ -
‘అయ్యన్న పోలీసులకు క్షమాపణ చెప్పాలి’
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసుల పట్ల అయ్యన్న పాత్రుడు విజ్ఞతతో మాట్లాడాలని జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షడు సత్యమూర్తి, కార్యదర్శి వైఆర్కే శ్రీనివాస్ అన్నారు. వారిద్దరూ గురువారం మీడియతో మాట్లాడుతూ.. అయ్యన్న మాటలు వీధి రౌడీలు ఉపయోగించే భాష కంటే నీచంగా ఉన్నాయని మండిపడ్డారు. ఆయన పిల్లలకు మాత్రమే అయ్యన్న తండ్రి అని.. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారని తెలిపారు. అయ్యన్న పాత్రుడు అధికారంలో ఉండగా పోలీసు సేవలను ఎంతగానో ఉపయోగించుకున్నారని గుర్తుచేశారు. తన రాజకీయ ఉనికి కోసం పోలీసుల పట్ల అయ్యన్న పాత్రుడు దుర్భషలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని.. అరాచకవాదిలా మాట్లాడొద్దని హితవు పలికారు. సరైన భాషలో మాట్లాడకపోతే ప్రజలే అయ్యన్నను పరుగెత్తించి కొడతారని హెచ్చరించారు. అయ్యన్నను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తాము కోరుతున్నామని తెలిపారు. పోలీసులకు అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసరమైతే అయ్యన్న పాత్రుడుపై ప్రైవేటు కేసులు కూడా వేస్తామని తెలిపారు. -
కొత్త కుంపటిపై ప్రకాశ్రాజ్ క్లారిటీ
Prakash Raj Clarity On New Association : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన ప్యానల్ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం' అని ప్రకాశ్రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్కు పోటీగా మరో అసోసియేషన్ పెడుతున్నారంటూ ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. చదవండి: మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్రాజ్ ప్యానల్ 'ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(ATMAA)'పేరుతో కొత్త అసోసియేషన్ ప్రకటించనున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ రూమర్స్పై ప్రకాశ్ రాజ్ స్పందించారు. కొత్త కుంపటి పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన స్పష్టం చేశారు. చదవండి: ప్రకాశ్రాజ్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!... -
MAA Elections 2021: ‘మా’ గొడవ మాదే
దాదాపు నాలుగైదు నెలలుగా ఎక్కడ చూసినా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల గురించి జరుగుతున్న చర్చల్లో ప్రధాన అంశాలివి. ‘మా గొడవ మాదే.. మేమంతా ఒక్కటే’ అంటూనే రాజకీయ ఎన్నికలను తలపించే రీతిలో ‘మా’ ఎన్నికల తీరు కనిపిస్తోంది. గత 28 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వివాదాలు, విమర్శలకు తోడు ఒకదశలో అభ్యంతరకర పదజాలంతో దూషణలూ వినిపించాయి. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అంశంపై ఓ రౌండప్.. లోకల్.. నాన్లోకల్.. ‘సినిమా బిడ్డలం’ ప్యానల్ అంటూ ప్రకాశ్రాజ్, ‘మాకోసం మనమందరం’ అంటూ మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా రెండు పక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఘాటుగా సాగుతున్నాయి. మొదట్లో ‘‘ప్రకాష్రాజ్ నాన్లోకల్. షూటింగ్లకే సరిగా రాడు. ఇక ‘మా’ సమస్యలు పట్టించుకునే తీరిక ఎక్కడుంటుంది?’’ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే.. ‘‘మూడు దశాబ్దాలుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నాను. తెలంగాణలో గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఎవరూ నన్ను నాన్ లోకల్ అనలేదు. ఇప్పుడు ఎందుకు నాన్ లోకల్ అవుతాను’’ అని ప్రకాశ్రాజ్ తన వాదన వినిపించుకున్నారు. ఆయనకు మద్దతుగా నాగబాబు మూడు రోజుల కింద ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకాశ్రాజ్కే. ఆయన ఉంటే ‘మా’ అసోసియేషన్ బాగుపడుతుంది. మన తెలుగువాళ్లు వేరే భాషల్లో నటించడం లేదా?’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ‘మీకు ఏ సమస్య వచ్చినా నేనిక్కడే ఉంటా.. ఈ ఊళ్లోనే ఉంటా’ అని మంచు విష్ణు ప్రకటించారు. ఆయన తండ్రి మోహన్బాబు కూడా.. ‘‘ఈ ఊళ్లోనే ఉండే నా కుమారుడు ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని నేను మాట ఇస్తున్నాను. మీ ఓటును మంచు విష్ణుకు, అతడి పూర్తి ప్యానల్కు వేసి సమర్థవంతమైన పాలనకు సహకరించాలని కోరుకుంటున్నాను’’ అని శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మెగా వర్సెస్ మంచు! మోహన్బాబు ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును నిలబెట్టాలనుకున్నప్పుడు చిరంజీవిని మద్దతు అడిగారని.. కానీ అప్పటికే ప్రకాశ్రాజ్కు సపోర్టు చేస్తానని మాటిచ్చానని చిరంజీవి చెప్పారనే వార్తలు వెలువడ్డాయి. దానిపై స్పందించిన మోహన్బాబు.. మెగాస్టార్ కుటుంబానికి చెందిన రామ్చరణ్, నాగబాబు వంటి వారు ఎన్నికల్లో నిలబడితే తాను మరో ఆలోచన లేకుండా మద్దతు తెలిపేవాడినని పేర్కొన్నారు. ఇలా ‘మా’ ఎన్నికలు ‘మెగా వర్సెస్ మంచు’లా మారాయి. పోస్టల్ బ్యాలెట్ వర్సెస్ ఈవీఎం తాము గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వచ్చే అవకాశముందని, పేపర్ బ్యాలెట్ పెట్టాలని మంచు విష్ణు కోరగా.. ఎన్నికల అధికారి పేపర్ బ్యాలెట్ను ఆమోదించారు. అయితే విష్ణు 60 మంది సీనియర్ నటులతో తనకు అనుకూలంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయించుకున్నారని ప్రకాశ్రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ‘మా’ ఎప్పుడు మొదలైంది? తెలుగు సినిమా నటీనటుల సంక్షేమం కోసం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ని 1993లో ఏర్పాటు చేశారు. చిరంజీవి వ్యవస్థాపక అ«ధ్యక్షుడిగా, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి వారు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. అసోసియేషన్ ప్రారంభంలో 150 మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు దాదాపు 900 మందికిపైగా ఉన్నారు. పెద్దదిక్కు ఎవరు? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరువర్గాల సభ్యులు పరుషంగానే మాటల తూటాలు విసురుకున్నారు. ఈ సందర్భంలో చాలామంది ‘దాసరి నారాయణరావు’ను గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాసరి సామరస్యంగా పరిష్కరించేవారని.. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకపోవడం వల్లే ఇంత రచ్చ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాగా.. సినిమా అంటే వినోదం అని.. ఇప్పుడు నటీనటులు ‘మా’ ఎన్నికల రూపంలో బయట వినోదం పంచుతున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇంతా చేసి ‘మా’ ఎన్నిక కాగానే మేమంతా ఒక్కటే అన్నట్టు కలసిపోతారని ఇండస్ట్రీ అంటున్న మాట. చదవండి: MAA Elections 2021: రెండు రోజుల్లో ఎన్నికలు.. ‘మా’కు సీవీఎల్ షాక్ -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన సిక్మా ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) ప్రతినిధులు కలిశారు. కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల విలువైన 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశారు. ఒక్కొక్కటి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ను కలిసి వివరాలు అందజేసిన వారిలో ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్, మార్కెటింగ్, భారతీ సిమెంట్స్), డాక్టర్ ఎస్.ఆనంద్ రెడ్డి (ఎండీ, సాగర్ సిమెంట్స్), ఇంజేటి గోపినాథ్ (సీఈవో, సిక్మా) ఉన్నారు. చదవండి: ‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’ థర్డ్వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక -
లాక్డౌన్: లిక్కర్ హోం డెలివరీకి అవకాశం ఇవ్వండి
-
సీటీ స్కాన్: ఎయిమ్స్ డైరెక్టర్ వాదనలను ఖండించిన ఐఆర్ఐఏ
సాక్షి, న్యూఢిల్లీ : కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ లేదా సీటీ స్కాన్లు చాలా హానికరం అన్న ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా వ్యాఖ్యలపై ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ స్పందించింది. ఒక్క సీటీ స్కాన్ 300-400ఎక్స్-రేలకు సమానమని, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్న వాదనలు చాలా ఔట్ డేటెడ్ సిద్ధాంతమని అసోసియేషన్ కొట్టి పారేసింది. ఈ వాదన 30-40 సంవత్సరాల క్రితం నాటిదని ఐఆర్ఐఏ పేర్కొంది 5-10 ఎక్స్-కిరణాలతో పోల్చదగిన రేడియేషన్ను విడుదల చేసే అత్యాధునిక స్కానర్లు ఇపుడు అందుబాటులోకి వచ్చాయంటూ గులేరియా వ్యాఖ్యలను అసోసియేషన్ ఖండించింది. గులేరియా వ్యాఖ్యలు అశాస్త్రీయమైనవి, బాధ్యతా రహితమైనంటూ అసోసియన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సి. అమర్నాథ్ సంతకంతో ఒక ప్రకటన విడుదల చేసింది. సిటీ ఛాతీ స్కాన్ క్యాన్సర్కు కారణమవుతుందనే ప్రకటన ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా రేడియాలజిస్టులు అలారా (ఏఎల్ఏఆర్ఏ: సహేతుకంగా సాధించగలిగినంత తక్కువ) సూత్రాన్ని ఉపయోగిస్తున్నారన్నారు. దీన్నుంచి వచ్చే రేడియేషన్ ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి గురయ్యే రేడియేషన్కు సమానమని కూడా తెలిపింది. (అలర్ట్: సీటీ స్కాన్తో క్యాన్సర్ వచ్చే అవకాశం..) కోవిడ్ సోకిన వారు వివిధ రకాల లక్షణాలతో బాధపడుతున్నారనీ, తక్కువ వైరల్ లోడ్ కారణంగా, ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ వచ్చినా, ఊపిరితిత్తులు కొందరిలో పాడైపోతున్నాయని, ఇలాంటి సమయంలో సిటీ స్కాన్ అవసరం చాలా ఉందని పేర్కొంది. అంతేకాదు ప్రారంభ దశలో ఊపిరితిత్తుల పనితీరును గుర్తించే పల్స్ ఆక్సీమీటర్ కంటే సీటీ స్కాన్లు అత్యంత సున్నితమైనవి ఐఆర్ఐఎ తెలిపింది. ముఖ్యంగా కరోనా సెకండ్వేవ్లో యువకులు హ్యాపీ హైపోక్సియా (ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించకుండా, ఆక్సిజన్ స్థాయి పడిపోవడం) తోబాధపడుతున్నారని ఈక్రమంలో ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే, రోగిని కాపాడటం అంత సులభమని వెల్లడించింది. తద్వారా వ్యాధి తీవ్రతను ముందస్తుగా గుర్తించడంతోపాటు, తొందరగా చికిత్సను ప్రారంభించడానికి సహాయపడుతుందని తెలిపింది.అలాగే వారు సూపర్-స్ప్రెడర్లు కాకుండా నిరోధించగల. సిటీ స్కాన్ ద్వారా బాధితులు ఆసుపత్రిలో చేరాలా, లేదా ఇంట్లో ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందితే సరిపోతుందా అనేది తెలుసుకోవచ్చు. వైరస్ తీవ్రతను, అతి విస్తరిస్తున్న తీరును పర్యవేక్షించవచ్చు, ముఖ్యంగా తీవ్ర లక్షణాలున్నవారిలో సిటీ స్కాన్ పాత్ర అనూహ్యం. సరైన సమయంలో స్టెరాయిడ్లను ప్రారంభించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపింది. అలాగే ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత లాంటి సంక్షోభంనుంచి బయటపడవచ్చని స్పష్టం చేసింది. (కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు) కాగా ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్స్రేలతో సమానమని, దానితో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా ఇటీవల వ్యాఖ్యానించారు. అవసరమైతే తప్ప సీటీ స్కాన్ల జోలికి వెళ్లొద్దని సూచించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ: సాయంత్రం 6.30 వరకే ఆ దుకాణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్(టూ, త్రీ వీలర్) దుకాణాలు సాయంత్రం గం.6:30లకే మూసివేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్గుప్తా తెలిపారు. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. వీటిని అందరూ పాటించాలని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
అనుచిత వ్యాఖ్యలు : హీరోయిన్ గుడ్బై
ప్రముఖ మలయాళ నటి పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మా)కు సోమవారం రాజీనామా చేశారు. అమ్మా ప్రధాన కార్యదర్శి ఎడావెలా బాబు నటి భావనపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు నిరసనగా తాను సంస్థనుంచి వైదొలగుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఎడవెలా బాబు తక్షణమే రాజీనామా చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. మనస్సాక్షి గల ఇతర సభ్యులు కూడా ఇదే డిమాండ్ చేస్తారని ఆశిస్తున్నానన్నారు. 2018లో తన స్నేహితులు అమ్మాకి రాజీనామా చేసినప్పుడు, కనీసం కొంతమందైనా పనిచేయడం కొనసాగించాలని, సంస్కరణ జరగాలని తాను భావించానన్నారు. ఆ వైపుగా కృషి చేస్తూనే ఉన్నానని పార్వతి చెప్పారు. కానీ అమ్మా సెక్రటరీ తాజా వ్యాఖ్యలతో ఆ ఆశ తుడిచి పెట్టుకుపోయిందని పార్వతి వ్యాఖ్యానించారు. భావనపై బాబు అసహ్యకరమైన వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశకు గురి చేశాయన్నారు. అందుకే సంఘానికి రాజీనామా చేస్తున్నట్టు ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. కాగా సంక్షోభంలో ఉన్నమలయాళం సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు ఓవర్ టాప్(ఓటీటీ)ప్లాట్ఫాంను ప్రారంభించాలని అమ్మా భావిస్తోంది. అలాగే భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించేందుకు ప్రముఖ నటులతో మూవీ తీయాలని ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలపై ఇచ్చిన ఇంటర్య్వూలో బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో భావన నటిస్తున్నారా అని ప్రశ్నించినపుడు భావన అమ్మలో లేదు. చచ్చిపోయిన వాళ్లను మళ్లీ తిరిగి తీసుకురాలేమంటూ సమాధానం ఇవ్వడం వివాదం రేపుతోంది. 2018లో 20 పేరుతో నిర్మించిన చిత్రంలో భావన ప్రముఖ పాత్ర పోషించారు. నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సూపర్స్టార్ దిలీప్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనే అంశంలో పలు ఊహాగానాలున్నాయి. -
‘ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: త్వరలో రాబోయే కొత్త రెవెన్యూ చట్టంలో తమ పాత్ర ఏమిటో ప్రభుత్వం సృష్టం చేయాలని తెలంగాణ వీఆర్వోల సంఘం ప్రెసిడెంట్ గోల్కొండ సతీష్ కోరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా మీడియాలో వీఆర్వోల విషయంలో అనేక కథనాలు వస్తున్నాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కూడా మాట్లాడారు. అందులో వీఆర్వో ల పాత్ర ఎలా ఉంటుందో తెలియదు. కొత్త చట్టాన్ని తాము స్వాగతిస్తామని, కానీ అందులో తమ పాత్ర ఏమిటో చెప్పాలన్నారు. ‘‘వీఆర్వోలుగా అనేక మంచి పనులు చేసాం.. కానీ మా ఉద్యోగాలు ఉంటాయో లేదో లేదో తెలియదు. రెవెన్యూ విషయంలో మా పరిధిలోకి వచ్చిన సమస్యపై ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తున్నాం. ఇంత చేస్తున్నా చాలి చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. కొత్తగా వచ్చే చట్టం పై ఆందోళన చెందుతున్నాం. మా కష్టాన్ని గుర్తించకుండా మమ్మల్ని ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని’’ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వో అధికారాలు తీయొద్దని, తమపై అవినీతి ఆరోపణలు వేసి ఇతర శాఖలకు పంపటం సమంజసం కాదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో చేశాం కాబట్టే రైతులు సమర్థంగా రైతుబంధు పొందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. కొత్త చట్టం రావడాన్ని స్వాగతిస్తాం కానీ మమ్మల్ని రెవెన్యూ శాఖలోనే ఉంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అందరిపై అవినీతి ఆరోపణలు వేసి ఇతర శాఖలకు పంపవద్దన్నారు. గ్రామ స్థాయి నుండి అధ్యయనం చేసి ఈ చట్టం తేవాలని, అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టేముందు తమ సలహాలు తీసుకోవాలని గోల్కొండ సతీష్ విజ్ఞప్తి చేశారు. -
ఏపీ సీఎం సహాయనిధికి విరాళం
సాక్షి, అమరావతి: కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్ నవ్యాంధ్రప్రదేశ్ తరపున 1 కోటి 13 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. 285 నెట్వర్క్ హాస్పిటల్స్ తరపున విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి అసోసియేషన్ ప్రతినిథులు అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ కె మోహన్ రెడ్డి, డాక్టర్ త్రినాథ్ తదితరులు ఉన్నారు.(చదవండి: కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు) -
హీరోయిన్ కొత్త ప్రతిపాదన
తమిళ సినీ నటీమణుల సమస్యలను పరిష్కరించడానికి ఒక సంఘం కావాలని నటి ఐశ్వర్యారాజేశ్ పేర్కొన్నారు. నటనకు అవకాశం ఉంటే ఏ తరహా పాత్రనైనా నటించడానికి సై అనే ఈమె ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే శివకార్తికేయన్కు చెల్లెలిగా నటించిన నమ్మ వీట్టుపిళై చిత్రం తెరపైకి వచ్చింది. నటిగా బిజీగానే ఉన్న ఈ అమ్మడు తమిళ నటీమణులకు ఇప్పడం లేదంటూ ఫైర్ అయ్యారు. తమిళ నటీమణుల పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ హిందీ చిత్రాల్లో హిందీ నటీమణులే నటిస్తున్నారు. మలయాళం చిత్రాల్లో మలయాళీ నటీమణులే నటిస్తున్నారు. కానీ తమిళ చిత్రాల్లో మాత్రం తమిళ నటీమణులు నటించడం లేదు అని దుయ్యబట్టా రు. నటి రెజీనా, సమంత ఇద్దరు తమిళ నటీమణులే. అయినా ప్రారంభదశలో తమిళ సినిమాల్లో అవకాశాలు రాలేదన్నారు. తెలుగులో మాస్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న తరువాత వారిని కోలీవుడ్ రెడ్ కార్పెట్ పరచి ఆహ్వానించింది. నటి ధన్సిక చక్కగా తమిళ భాషను మాట్లాడే నటి అని, ఆమెకు సరైన అవకాశాలు లేవని అన్నారు. నటి జననీ అయ్యర్, వరలక్ష్మీశరత్కుమార్ తమిళ భాషను చక్కగా మాట్లాడే వారేనని, అయినా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం లేదని అన్నారు. ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న అనూకీర్తి తిరుచ్చిరాప్పల్లికి చెందిన అచ్చ తమిళ అమ్మాయి అని, ఆమె మిస్ ఇండియా పట్టం గెలుచుకున్న తరువాతనే తను ఎవరన్నది తెలిసిందన్నారు. ఇలాంటి అనుకీర్తీలు తమిళనాడులో చాలా మంది ఉన్నారని, మనమే వారిని గుర్తించలేకపోతున్నామని అన్నారు. తమిళ యువతిలు నటించడానికి వస్తే వారిని గౌరవించడం లేదన్నారు. సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదన్నారు. ముంబై నుంచి వస్తున్న నటీమణులకు ఇస్తున్న గౌరవంలో ఒక వంతు కూడా మనవారికి దక్కడం లేదని వాపోయారు. ఉత్తరాది నుంచి వచ్చే నటీమణులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్న తమిళ సినిమా మన ఊరు నటీమణులను ఎందుకు సరిగ్గా చూడడం లేదన్న బాధ తనకు కలుగుతోందన్నారు. తనకు ఎదురైన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడడంలేదని, తమిళ నటీమణులందరికీ ఇదే పరిస్థితి అని అన్నారు. తమిళ అమ్మాయిలు అంటే అంత చులకనా అని ప్రశ్నించారు. కథలోని పాత్రలకు అనుగుణంగా మనం యథార్థంగా ఉంటే చాలని, అందం ప్రధానం కాదని అన్నారు. అయితే కమర్శియల్ చిత్రాల్లో మనం గ్లామర్గా కనిపించాలన్నారు. లేకపోతే మన ఊరు ప్రజలే ఎగతాళి చేస్తారని అన్నారు. అందుకే మన ఊరి అమ్మాయిలు సినిమాల్లోకి ఎక్కువగా రావడానికి ఒక సంఘాన్ని ప్రారంభించి వారి సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందన్నారు. అందుకు కావలసిన అన్ని విధాల సహకారాన్ని తాను అందిస్తానని నటి ఐశ్వర్యారాజేశ్ పేర్కొన్నారు. -
ఈకామర్స్ సంస్థలకూ అసోసియేషన్
న్యూఢిల్లీ: దేశీ ఈకామర్స్ సంస్థలు తాజాగా ది ఈ–కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టీఈసీఐ) ఏర్పాటు చేసుకున్నాయి. స్నాప్డీల్, షాప్క్లూస్, అర్బన్క్లాప్ తదితర సంస్థలు కలిసి దీన్ని నెలకొల్పాయి. అంతర్జాతీయ సంస్థలకు దీటుగా దేశీ సంస్థలు కూడా రాణించేందుకు, దేశీ ఈకామర్స్ రంగం వృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి తోడ్పడే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్నాప్డీల్ సీఈవో కునాల్ బెహల్ తెలిపారు. డేటా ప్రైవసీ, లాజిస్టిక్స్, పేమెంట్స్ తదితర అంశాలకు సంబంధించి భారతీయ ఈ–కామర్స్ రంగంలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు టీఈసీఐ ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. 2017లో ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్, ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తదితరులు కలిసి ఇండియాటెక్ పేరుతో ఇటువంటిదే లాబీ గ్రూప్ను ఏర్పాటు చేశారు. దేశీ స్టార్టప్స్కు సమాన అవకాశాలు కల్పించడం, ఐపీవో నిబంధనలను సరళతరం చేయడం, శక్తిమంతులైన ఇన్వెస్టర్ల నుంచి ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రయోజనాలు పరిరక్షించేలా డిఫరెన్షియల్ ఓటింగ్ విధానంలో మార్పులు తేవడం తదితర లక్ష్యాలతో ఇది ఏర్పాటైంది. అయితే, ఫ్లిప్కార్ట్ నుంచి బన్సాల్ నిష్క్రమణ అనంతరం దీని కార్యకలాపాలు నిల్చిపోయాయి. తాజాగా టీఈసీఐ ఆ లోటు భర్తీ చేయనుంది. -
అన్ని ఫండ్లకూ పన్ను లాభాలు!
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు మరింత పెద్ద మొత్తంలో వచ్చే దిశగా చేపట్టాల్సిన చర్యలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ ‘యాంఫీ’ కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. ఇవన్నీ దాదాపుగా గతేడాది పంపిన ప్రతిపాదనలేనని, ఈ సారి బడ్జెట్లోనైనా వీటి అమలుకు చర్యలు తీసుకోవాలని కోరామని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. యాంఫీ ప్రతిపాదనలు ఇవీ.. డెట్లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ సెక్షన్ 80సీ కింద ప్రస్తుతం ఈక్విటీ ఆధారిత పెట్టుబడి పథకాల్లో(ఈఎల్ఎస్ఎస్) రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. డెట్ ఫండ్స్లో పెట్టుబడులకు సైతం సెక్షన్ 80సీసీసీ కింద అర్హత కల్పించాలి. డెట్ పథకాలకు పన్ను మినహాయింపు వల్ల సంప్రదాయ ఇన్వెస్టర్లు(రిస్క్ తీసుకోని వారు) సైతం పన్ను ప్రయోజనాలు పొందగలరు. దీనివల్ల బాండ్ మార్కెట్ విస్తృతి కూడా పెరుగుతుంది. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఈక్విటీల్లో 65 శాతం పెట్టుబడులు పెట్టే ఫండ్ ఆఫ్ ఫండ్స్ను ఈక్విటీ ఫండ్స్గా పరిగణించాలి. ప్రస్తుతం దీన్ని డెట్ స్కీమ్గానే పరిగణిస్తున్నారు. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్లో కనీసం 65 శాతం పెట్టుబడులు పెట్టే పథకాలను ఈక్విటీగా ప్రస్తుతం గుర్తిస్తున్నారు. కానీ, ఫండ్ ఆఫ్ ఫండ్స్ను మాత్రం అవి ఎందులో ఇన్వెస్ట్ చేశాయన్న అంశంతో సంబంధం లేకుండా డెట్ ఫండ్స్గానే చూస్తున్నారు. అందుకే యాంఫీ ఈ ప్రతిపాదన చేసింది. పథకాల మధ్య సమానత్వం పన్ను పరంగా మ్యూచువల్ ఫండ్స్, యులిప్లను ఒకే విధంగా చూడాలి. ఒకే పథకం పరిధిలో పెట్టుబడులను మార్చుకోవడం, ఒకే ఫండ్ హౌస్ పరిధిలో పథకాల మధ్య పెట్టుబడులను మార్చుకోవడాలను మూలధన లాభాల పన్ను నుంచి మినహాయించాలి. ప్రస్తుతం యులిప్ పాలసీల్లో ఇన్వెస్టర్లు వివిధ ఫండ్స్ మధ్య పెట్టుబడులను స్విచ్ చేసుకుంటున్నప్పటికీ పన్ను భారం ఉండటం లేదు. ఫండ్ ఆధారిత రిటైర్మెంట్ ప్లాన్ అమెరికాలో ఉన్న 401 (కె) ప్లాన్ మాదిరే... మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ప్లాన్ను (ఎంఎఫ్ఎల్ఆర్పీ) యాంఫీ ప్రతిపాదించింది. ఉద్యోగ సంస్థ ఉద్యోగి తరఫున చేసే రిటైర్మెంట్ పొదుపులను వారి వేతనం నుంచి మినహాయించి చూపే అవకాశం ఈ ప్లాన్ కింద ఉంటుంది. దీనివల్ల మరింత పొదుపు నిధులు క్యాపిటల్ మార్కెట్లోకి తరలివస్తాయి. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ప్లాన్లు ‘సెక్షన్ 54ఈసీ’ని 3–5 ఏళ్ల లాకిన్తో పండ్ పథకాలకు కూడా వర్తింపచేయాలి. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ బాండ్, ఆర్ఈసీ బాండ్లలో చేసే పెట్టుబడులకు లాకిన్ పీరియడ్తో ఈ సెక్షన్ కింద మూలధన లాభాల పన్ను మినహాయింపు కల్పిస్తున్నారు. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలం పాటు ఉంచుకున్న ఆస్తులను విక్రయించినప్పుడు వచ్చిన లాభాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా ఇదే ప్రయోజనాన్ని 3–5 ఏళ్ల లాకిన్ పీరియడ్తో అనుమతించాలి. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పునఃపరిశీలన స్టాక్స్లో పెట్టుబడులను ఏడాది కాలం తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాలపై పన్నును (ఎల్టీసీజీ) కేంద్ర ం గతేడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీన్ని పునరాలోచించాలన్నది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, బ్రోకరేజీ సంస్థలు, ఫండ్ మేనేజర్ల డిమాండ్ . ఎల్టీసీజీని రద్దు చేస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పుంజుకుంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్కు పన్ను మినహాయింపులు కల్పిస్తే బాండ్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు భారీగా పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది దాటిన తర్వాత విక్రయించిన స్టాక్స్పై లాభం రూ.లక్ష దాటితే 10% పన్నును కేంద్రం గత బడ్జెట్లో ప్రవేశపెట్టడం గమనార్హం. -
నెలాఖరులో వరుస బ్యాంకు సెలవులు
సాక్షి, ముంబై: నవంబరు నెలాఖరులో బ్యాంకులు నాలుగు రోజులు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారంలో వీలైనంత త్వరగా ముఖ్యమైన బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నవంబరులో దీపావళి, ఈద్ (నేడు) రెండే పండుగ సెలవులు. అసోసియేషన కార్యదర్శి వికె శెంగర్ అందించిన సమాచారం ప్రకారం ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా ఈ రోజు బ్యాంకులు కొన్ని రాష్ట్రాల్లో పని చేయలేదు. నవంబరు 21 (ఈద్)న అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లో బ్యాంకులకు సెలవు లేదు. అలాగే గురునానక్ జయంతిని పురస్కరించుకొని నవంబరు 23న కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. అయితే తెలుగు రాష్ట్రాలు, బిహార్, డామన్ అండ్ డయ్యు, గోవా, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, పాండిచ్చేరి, సిక్కిం, తమిళనాడు, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి. 24, నవంబర్ - నాలుగో శనివారం పంజాబ్లో మాత్రమే సెలవు 25, నవంబర్ - ఆదివారం 26, నవంబర్ - కనకదాస్ జయంతి సందర్భంగా కర్ణాటకలో మాత్రమే సెలవు. అయితే సెలవు రోజుల్లో ఏటీఎంలలో నగదుకు ఎలాంటి కొరత ఉండదని బ్యాంకులు స్పష్టం చేశాయి. -
లారీల సమ్మె ఉధృతం
ఖిలా వరంగల్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యనమానులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఆలిండియా, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా, వరంగల్ లోకల్, ఓరుగల్లు లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమ్మె ఉధృతం చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నిత్యావసరాల సరుకుల తప్పా సిమెంట్, ఐరన్, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా నిలిచిపోయింది. జిల్లాలో 3వేల లారీలు నిలిచిపోగా ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 4 వేల లారీలు సరుకులతోనే రహదారులపై నిలిచిపోయాయి. తరచూ పన్నులను పెంచుతున్న కారణంగా వాహనాలను నడపలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల రాస్తారోకోలు.. వరంగల్ లోకల్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల భూపాల్ ఆధ్వర్యంలో ఆదివారం పలు చోట్ల «రాస్తారోకోలు, ధర్నాలు, భిక్షాటన కార్యక్రమాలు చేపట్టారు. నర్సంపేట, ములుగురోడ్డు, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ప్రధాన రహదారుల్లో జిల్లా మీదుగా వెళ్తున్న వివి«ధ రాష్ట్రాల లారీలను అడ్డుకుని ఖాళీ స్థలాలకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు లారీల పార్కింగ్ స్థలానికి చేరుకుని నిలిచిపోయిన లారీలను పంపించి వేముల భూపాల్తోపాటు మధుసూదన్రావును అరెస్టు చేసి, సొంతపూచి కత్తుపై విడుదల చేశారు. కాగా ఆందోళనలను తీవ్ర తరం చేస్తామని రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ జె. మధుసూదన్రావు తెలిపారు. వరంగల్ లోకల్ లారీ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు వేముల భూపాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ స్పందించి అసోసియేషన్ బాధ్యులను చర్చలకు ఆహ్వానించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ని త్యావసర సరుకులను సైతం అడ్డుకుంటామన్నారు. సమస్యలుపరిష్కరించే వరకు కొనసాగిస్తా మని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్లు మోహన్, శ్రీహరి, సతీష్, రాజు, ముంతా జ్, ఉస్సేన్, రాజీరెడ్డి పాల్గొన్నారు. -
లారీ యజమానుల ధర్నా
భూపాలపల్లి వరంగల్: దేశ వ్యాప్త లారీల బంద్లో భాగంగా భూపాలపల్లి లారీ ఓనర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం లారీల యజమానులు ధర్నా నిర్వహించారు. రెండు రోజులపాటు లారీల ను నడిపించిన స్థానిక యజమానులు మూడో రోజు సమ్మెలో పాల్గొన్నారు. కాళేశ్వరం నుంచి హైదరాబాద్కు వెళ్లుతున్న ఇసుక లారీలను ప్రధా న రహదారిపై అడ్డుకొని ధర్నా చేపట్టారు. అసోసియేషన్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షకు భుత్వ మాజీ చీఫ్విప్ గండ్ర వెంకటరమణరెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజీల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడంతో వాహనదారులపై అధిక భా రం పడుతోందన్నారు. లారీ యజమానుల సమ్మెతో సరుకుల రవాణా నిలిచి పోయిందని వారు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్యక్షుడు కంకణాల రవీం దర్రెడ్డి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగి స్తామని స్ప ష్టం చేశారు. బాలచంద్నాయక్, రమేష్, రాజేష్, హరిష్రెడ్డి, నర్సింగరావు, రవి, తిరుపతి, సేనప తి, వేణు, అయిలయ్య, రాజయ్య పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో కొత్త అనుబంధ సంఘం ఏర్పాటు
న్యూఢిల్లీ : ఆలిండియా ఆదివాసీ కాంగ్రెస్ పేరుతో కొత్త అనుబంధ సంఘంను ఏఐసీసీ ఏర్పాటు చేసింది. దీనికి జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ను రాహుల్ గాంధీ నియమించారు. 58 మందితో జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఈ కొత్త అనుబంధ సంఘంలో ఐదుగురు వైస్ ఛైర్మెన్లను నియమించారు. వైస్ ఛైర్మెన్గా తెలుగు రాష్ట్రానికి చెందిన బెల్లయ్య నాయక్ అవకాశం దక్కింది. సభ్యులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పి.బాలరాజు, సీతక్క, బలరాం నాయక్, పొద్దం వీరయ్య, రవీంద్ర నాయక్, రేగా కాంతారావ్, ఆత్రం సక్రులు చోటు చేజిక్కించుకున్నారు. -
‘భాషా పత్రికల సమస్యలు పరిష్కరించాలి’
పూరి: వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధి నుంచి చిన్న భాషా పత్రికలకు మినహానింపునివ్వాలని ఇండియన్ లాంగ్వేజెస్ న్యూస్పేపర్స్ అసోసియేషన్(ఐఎల్ఎన్ఏ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పూరీలో నిర్వహించిన ఐఎల్ఎన్ఏ 76వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో సభ్యులు తీర్మానం చేశారు. అసంబద్ధ కారణాలు చూపి చిన్నభాషా పత్రికలకు ప్రకటనలు ఇవ్వొద్దని డైరెర్టరేట్ ఆఫ్ అడ్వరై్టజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ)కి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ప్రతిపాదనలు పంపడం దారుణమన్నారు. ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం పీసీఐకి ఆ అధికారాలు లేవని స్పష్టంచేశారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖకు సైతం పీసీఐ రాసిన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.మరోవైపు, ఐఎల్ఎన్ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కాబోయే అధ్యక్షులుగా పరేశ్నాథ్ను ఎన్నుకున్నారు. -
చేనేతలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
చేనేత సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ కోదండరాం అనంతపురం సప్తగిరి సర్కిల్: చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని చేనేత సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ కోదండరాం ఆరోపించారు. స్థానిక చేనేత కార్యాలయం ఎదుట బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చేనేతలను ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటున్నారన్నారు. చేనేతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే చేనేతలు లబ్ధిపొందుతున్నారన్నారు. చేనేతలకు భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. సిండికేట్ నగర్, ధర్మవరం, చిగిచెర్ల గ్రామస్థులు, నాగేంద్ర, సుధాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
సాంగత్య బలం
ఆత్మీయం జనన మరణ చక్రంనుండి విడుదల పొందడం అనేది వాసనాబలం ఉన్న మనుష్యజన్మలో మాత్రమే సాధ్యం. వాసనలలో అన్నివేళలా మంచివే ఉండవు. ఎన్ని మంచి గుణాలు ఉన్నా, ఒక్కొక్క దాంట్లో చెడు వాసన కూడా ఉంటుంది. ఇక్కడ వాసన అంటే ముక్కుతో పీల్చేదికాదు, గత జన్మలనుంచి లేదా గత అనుభవాలనుంచి తెచ్చుకున్నవి. మనలో ఉన్న ఒక్క చెడు వాసన... అంటే అలవాటు మిగిలి ఉన్న మంచి గుణాలను పాడు చేసేస్తుంది. ఇది పోవాలంటే భగవంతుడిని శరణాగతి వేడుకోవాలి. లేదా సత్పురుషుల సాంగత్యం చేయాలి. అప్పుడు ’ఛీ ! ఛీ ! నేనిలా బతక్కూడదు...’ అనే బుద్ధి కలుగుతుంది. దీని గురించే రామకృష్ణ పరమహంస ఏమంటారంటే....‘‘ఏనుగు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు తొండం ఎత్తి ఒక జాజితీగ పీకుతుంది, ఓ చెట్టుకొమ్మను పట్టుకుని విరిచేస్తుంది. అలా వెళుతూ పక్కన ఒక దుకాణంలోంచి ఒక అరటిపళ్ళగెల ఎత్తి లోపల పడేసుకుంటుంది. అదే ఏనుగు పక్కన మావటివాడు అంకుశం పట్టుకుని నడుస్తూ పోతున్నాడనుకోండి. అది తొండం ఎత్తినప్పుడల్లా అంకుశం చూపగానే దించేస్తుంది తప్ప దేనినీ పాడుచేయదు. అలాగే మంచివారి సాంగత్యబలం మనలో ఉన్న వాసనాబలం పాడవకుండా రక్షింపబడుతుంది’’ అంటారు. -
బడ్జెట్లో గీత కార్మికులకు అన్యాయం
భీమవరం : కల్లుగీత కార్మికులకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశారని రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి తీవ్రంగా విమర్శించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసం విచ్చలవిడిగా మద్యం, బెల్టు దుకాణాలను ప్రోత్సహించడంతో గీత కార్మికులకు ఉపాధి కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టుషాపులపై ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు గీత కార్మికులు వచ్చిన ఆదాయంతో ఇళ్లు నిర్మించుకుంటే చంద్రబాబు పాలనలో ఉన్న ఇళ్లు అమ్ముకుని జీవించాల్సి వస్తోం దన్నారు. నిధులు కేటాయించకపోవడంతో కల్లుగీత కార్పొరేషన్ ఉత్సవ విగ్రహంగా మిగిలిందన్నారు. కల్లుగీత కార్పొరేషన్కు తక్షణం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిడదవోలులో ఉన్న ఏౖMðక తాటిబెల్లం పరిశ్రమకు నిధులు కేటాయించకపోవడంతో నిరుపయోగంగా మారిందన్నారు. తాటి పరిశ్రమకు తక్షణం రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో గీత వృత్తిపై నాలుగు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని వీరి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.14 కోట్లు కిస్తీల రూపం ఆదాయం సమకూరుతుందని చెప్పారు. గీత కార్మి కుల సంక్షేమాన్ని పట్టించుకోకపోతే సెప్టెంబర్లో రాష్ట్రవ్యాప్త ఆం దోళనలకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి నివాసాలు, కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. సంఘం భీమవరం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కడలి పాండు, చింతపల్లి చినవీరాస్వామి, ఉపాధ్యక్షుడు చెల్లబోయిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
బసివిని, దేవదాసీలను ఆదుకోవాలి
ఎస్సీ సంక్షేమ సంఘం డిమాండ్ అనంతపురం న్యూటౌన్ : బసివినీ, దేవదాసీలు, మాతంగుల సంక్షేమానికి పాటు పడాలని ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరి కారణంగా జీవితం కోల్పోయిన బసివినిలుగా, దేవదాసీలు మారిన వారి సంక్షేమం కోసం బడ్జెట్ రూ.100 కోట్లు కేటాయించాలని, వయస్సుతో నిమిత్తం లేకుండా పింఛన్ సౌకర్యం కల్పించాలని, వీరి పిల్లలకు ఉచిత విద్యనందించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో నరసింహులు, నారాయణ, బాబు, బంగారు రాము, ప్రకాష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కొరతతోనే క్రీడాకారుల వెనుకబాటు
జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషఅధ్యక్షుడు నారాయణరెడ్డి మలికిపురం : క్రీడారంగానికి మౌలిక వసతుల కొరతతోనే ప్రతిభావంతులు వెనుకబడుతున్నారని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి పేర్కొన్నారు. దిండిలో బుధవారం జరిగిన జిల్లా బ్యాడ్మింటన్అసోసియేషన్సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్ర వరంలో అకాడమీ ద్వారా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఓఎన్జీసీ వంటి సంస్థలు, స్పాన్సర్ల సహకారంతో రాష్ట్ర , జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఒలింపిక్లో సి«ంధు పతకం సాధించడంతో బ్యాడ్మింటన్కు ఆదరణ పెరిగిందన్నారు. ప్రపంచంలో క్రికెట్కు 14 దేశాల్లోనే ఆదరణ ఉండగా బ్యాడ్మింటన్కు 216 దేశాల్లో ఆదరణ ఉందన్నారు. సాత్విక్ ప్రసాద్, కృష్ణ ప్రసాద్ అనే క్రీడాకారులకు ప్రోత్సాహకంగా ఈ సమావేశంలో సభ్యులు రూ. 1. లక్ష విరాళాలు సమకూర్చారు. రాష్ట్రంలో టాప్ 15 మంది బ్యాడ్మింటన్క్రీడాకారుల్లో ఆరుగురు మన జిల్లా వారేనని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్టేట్ 13, 15, 17,19 సెలక్షన్లకు మన జిల్లా నుంచి క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. అన్ని ప్రాంతాలలోనూ టోర్న్మెంట్లు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. ఉపాధ్యక్షుడు మెట్ల రమణ బాబు, కొడాలి తనూజ, కోశాధికారి రాజారెడ్డి, కార్యదర్శి ఆర్. రామాంజనేయ రాజు, రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈసీ సభ్యుడు ముదునూరి అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. -
బౌన్సర్స్ అసోసియేషన్ సమావేశం
తాడితోట (రాజమహేంద్రవరం) : తూర్పుగోదావరి జిల్లా బౌన్సర్స్ అసోసియేషన్ సమావేశాన్ని రాజమహేంద్రవరంలోని దానవాయిపేట వద్ద గల పవర్ ఫ్లెక్స్ గేమ్లో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ తగరం సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి అడ్డూరి వెంకట రమణ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తగరం సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా బౌన్సర్లు ఉపాధి సంపాదించుకోవాలన్నారు. కార్యదర్శి పసుపులేటి సంతోష్ వందన సమర్పణ చేశారు. కోడూరి సునీల్, బొండు విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
రైస్మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కోదాడఅర్బన్: కోదాడ రైస్మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం పట్టణంలోని రైస్మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా టి. వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా కె. చెన్నారెడ్డి, ఉపాధ్యక్షుడిగా సిహెచ్.సైదయ్య, సంయుక్త కార్యదర్శిగా బి. శ్రీనివాసరావు, కోశాధికారిగా పి.అప్పారావులను ఎనుకున్నారు. నల్లగొండ జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్. చిన్నపురెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికకు కన్వీనర్గా కె.నర్సిరెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు పలువురు అసోసియేషన్ నాయకులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిల్లర్లు జి.సత్యనారాయణ, ఎన్.సత్యనారాయణ, వి.బ్రహ్మం, పి.రమేశ్, భానుప్రసాద్, పిచ్చేశ్వరరావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
నర్సరీ అసోసియేషన్ పదవులకు 36 నామినేషన్లు
కడియం : నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, 11 మంది డైరెక్టర్ల పదవులకు 36 నామినేషన్లు అందాయి. నామినేషన్ల గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అధ్యక్ష పదవికి నాలుగు నామినేషన్లు అందాయి. వీటిలో రెండు డమ్మీ నామినేషన్లుగా భావిస్తున్నారు. 1, 5 వార్డులకు ఐదేసి నామినేషన్లు వచ్చాయి. 1వ వార్డు ఐదు, 2వ వార్డు రెండు, 3వ వార్డుకు రెండు, 4వ వార్డు 5, 5వ వార్డు మూడు, 6వవార్డు మూడు, 7వ వార్డుకు మూడు, 8వ వార్డుకు రెండు, 9వ వార్డుకు రెండు, 10వ వార్డుకు రెండు, 11వ వార్డుకు మూడు నామినేషన్లు వచ్చాయి. కాగా 24, 25 తేదీల్లో ఉప సంహరణలు ఉంటాయి. ఆ తరువాత పోటీలో ఉండే వారి వివరాలు తేలాల్సి ఉంటుంది. -
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి
నెల్లూరు(పొగతోట): ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జీఎస్.కృష్ణప్రసాద్, ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి కాయల సతీష్కుమార్, సీపీఎస్ రాష్ట్ర అ«ధ్యక్షుడు ఎం.గిరీష్ అన్నారు. ఆదివారం స్థానిక ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీల్లో అన్యాయం జరుగుతోందని, డిప్యూటేషన్లకు నిబంధనల కొర్రీలు పెడుతున్నారని, ఇతరులకు గంటల వ్యవధిలోనే బదిలీ చేస్తున్నారన్నారు. కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఒక్క సూపరింటెండెంట్ లేడన్నారు. ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సీహెచ్వీఆర్సీ శేఖర్రావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి మద్దతు తెలుపుతామన్నారు. రాష్ట్ర దళిత సంఘం నాయకుడు బాలచెన్నయ్య మాట్లాడారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణం చేయించారు. ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.అశోక్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు ఎన్. మల్లిఖార్జున పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడి జీఎస్ కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి వై.అశోక్కుమార్, గౌరవాధ్యక్షుడు ఎం.గిరీష్, కోశాధికారి జి.అరుణ్కుమార్, సహాయకులు– కాయల సతీష్కుమార్, కె.రవికుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్.మల్లిఖార్జున్, అర్గనైజింగ్ సెక్రటరీ వై.ప్రభాకర్రావు, సహ అధ్యక్షుడిగాటి.రాజేష్బాబు, జి.మల్లిఖార్జున, బి.రాములు, జాయింట్ సెక్రటరీలుగా జి.మధు, సీహెచ్. బెన్ని, బి.తులసిమాల, ఈసీ మెంబర్స్– పి.దుర్గనగేంద్ర, బి.రాజేష్, కె.భాస్కర్, జి. రాఘురామయ్యను ఎన్నుకున్నారు. -
నేడు న్యాయవాద సంఘ కార్యవర్గ ఎన్నికలు
కర్నూలు(లీగల్): కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం కార్యవర్గ ఎన్నికకు శుక్రవారం పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి, న్యాయవాది ఎన్.నారాయణరెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. మూడు పదవులకు అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నందున పోలింగ్ అనివార్యమైందన్నారు. అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎస్.చాంద్బాషా, సుబ్బయ్యలు పోటీ పడుతుండగా.. ఉపాధ్యక్ష స్థానానికి అనిల్కుమార్, దేవప్రసాద్లు బరిలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి సి.వి.శ్రీనివాసులు, జయలక్ష్మిదేవి మధ్య పోటీ ఉంది. మహిళా ప్రతినిధి స్థానానికి ఎం.సుమలత, బి.గీతామాధురి, వరలక్ష్మిలు పోటీ పడుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారన్నారు. -
వెయ్యి కోట్లతో గోదాములు
నిజామాబాద్ కల్చరల్/నిజామాబాద్క్రైం : రాష్ట్రంలో ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో గోదాములు నిర్మిస్తోందని ఎంపీ కవిత పేర్కొన్నారు. ఆమె సోమవారం నిజామాబాద్ మండలంలోని నర్సింగ్పల్లిలో తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రద్ధానంద్గంజ్లో నిర్వహించిన నిజామాబాద్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో, పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఖానాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎవెన్యూ ప్లాంటేషన్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో గోదాంల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసిందని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్లో నిజామాబాద్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గంప శ్రీనివాస్గుప్తా, ప్రధాన కార్యదర్శిగా కమల్ కిషోర్ ఇన్నాని, కోశాధికారిగా సిర్ప రాజేశ్వర్ ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర లభించే వరకు గోదాముల్లో నిల్వ ఉంచుకునేందుకు గోదాముల నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా పంటను మార్కెట్లోనే అమ్ముకునే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ మార్కెట్లో 4 వేల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. బైపాస్ రోడ్డును శ్రద్ధానంద్ గంజ్ పక్కన గల స్థలం నుంచి అనుసంధానం చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ ఆవరణలో ఎంపీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్లు చాంగుబాయి, విశాలినిరెడ్డి, ఎనుగందుల మురళి, పంచరెడ్డి సురేశ్, మర్చంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, మాజీ అధ్యక్షుడు కరిపె సత్యం, అర్వపల్లి పురుషోత్తం, బచ్చు పురుషోత్తం, మార్కెట్కమిటీ సెక్రెటరీ సంగయ్య తదితరులు పాల్గొన్నారు. వివరాలు 16లో.. -
రాష్ట్రంలో తొలి మహిళా ఒలంపిక్ క్రీడా సంఘం
నూనెపల్లె: క్రీడల్లో పురుషులతో పాటు మహిళలు రాణించాలని ఏపీ మహిళా ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు (ఫెన్సింగ్) కండె వాణి పిలుపునిచ్చారు. తైక్వాండో సంఘం రాష్ట్ర కార్యదర్శి నంద్యాల మహేశ్వరరావు అధ్యక్షతన మహిళా సంఘాన్ని మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ మహిళలు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రంలో తొలి మహిళా ఒలంపిక క్రీడా సంఘం ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు. సంఘం అధ్యక్షురాలిగా కండె వాణి (ఫెన్సింగ్ కర్నూలు), ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరరావు (తైక్వాండో), కోశాధికారిగా ఎల్. శాంతి (యోగా, కృష్ణాజిల్లా),ఉపాధ్యక్షులుగా సి.హెచ్.వి.విజయలక్ష్మి (ఫుట్బాల్, తూర్పుగోదావరి), నాగమాధవి (బాల్ బ్యాడ్మింటన్ చిత్తూరు)తో పాటు ముగ్గురిని సహాయ కార్యదర్శులుగా, ఆరు మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ఎన్నిక
గుంటూరు (పట్నంబజారు): ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో ఆదివారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎం కోటయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎస్వీ సుబ్బారావు, కోశాధికారిగా బీఎస్ఎన్ రాజు, అసోసియేషన్ అధ్యక్షుడిగా కే నాంచారయ్య, ఉపాధ్యక్షులుగా శివనాగేశ్వరరావు, శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శ్రీమన్నారాయణ, సహాయ కార్యదర్శులుగా నాగభూషణం, శంకరరావు, వెంకటస్వామి, రవిశంకర్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎస్ పెద్దయ్య, ఆర్.కోటేశ్వరరావు, ఎం.కోటేశ్వరరావు, వీ జ్యోతి, సీహెచ్.సాంబశివరావు, సుందరయ్య రాజులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఎకై ్సజ్ అధికారులు శౌరి, ఆవులయ్య వ్యవహరించారు. అనంతరం ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులను పూలమాలతో ఘనంగా సత్కరించారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దయానందరాజు నగరంపాలెం: ఉద్యోగుల సమస్యలు పరిష్కారించటానికి ఆం ధ్రప్రదేశ్ నాన్గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నగరశాఖ కార్యవర్గం శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిఉందని ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దయానంద రాజు సూచించారు. శనివారం ఎన్జీవో కల్యాణమండపంలో నగరశాఖ నూతన కార్యవర్గ అభినందన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ గతం సంఘంపై ఉద్యోగుల స్పందించిన తీరుకు నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలున్నారు. ఎన్జీవో జిల్లా కార్యదర్శి నాగవర్దన్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆశయాలకనుగుణంగా నాయకులు పనిచేయాలన్నారు. అత్యధిక మేజారిటీతో గెలిపించినందుకు నగరశాఖ నూతన అధ్యక్షుడు సుకుమార్, కార్యదర్శి మూర్తి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం .. శుక్రవారం ఉదయం జరిగిన ఏపీఎన్జీవో నగరశాఖ ఎన్నికల కౌంటింగ్ శనివారం తెల్లవారుఝామున ముగిసింది. నగరశాఖలో మొత్తం 1,536 ఓటర్లు ఉండగా 1,356 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుకుమార్ ప్యానల్కు 1,004 ఓట్లు లభించగా శివశంకర్ ప్యానెల్కు 274 ఓట్లు లభించాయి. దీనితో సుకుమార్ ప్యానెల్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ఎ.భూషణం ప్రకటించారు. అధ్యక్షుడిగా సుకుమార్, కార్యదర్శిగా యం.యస్.మూర్తి, ట్రెజరర్ పి.హరికిషన్, అసోసియేట్ ప్రెసిడెంట్ యస్డి.జానీబాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ వైవి.సత్యనారాయణరావు, ఉపాధ్యక్షులుగా కె.సాంబయ్య, డి.శ్రీనివాసరావు, ఎల్.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలుగా బి.కొండారెడ్డి, పి.కోటేశ్వరరావు, వై.పద్మజ, పి.రవిబాబు, కె.శివజ్యోతి, డీఈసీ మెంబర్లుగా యం.కోటేశ్వరరావు, బి.సునీల్కుమార్, సిహెచ్.వీరబ్రహ్మేశ్వరరావులతో ప్రమాణం చేయించారు. -
పెద్ద చెరువు మత్స్య సంఘం అధ్యక్షడిగా ‘వేముల’
కోదాడ: పెద్దచెరువు మత్య్ససహకార సంఘం నూతన కార్యవర్గం గురువారం బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ కార్యాలయంలో సమావేశమైన డైరెక్టర్లు నూతన అధ్యక్షుడిగా వేముల రాముడుని, కార్యదర్శిగా గాదె మధుని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఐతేబోయిన ధనమూర్తి, కోశాధికారిగా సింగం శ్రీనులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి సూర్యదత్ నూతన పాలకవర్గం చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర ముదిరాజ్ మహసభ అధ్యక్షుడు బండా ప్రకాశ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫెడరేషన్ చైర్మన్ పోలు లక్ష్మణ్, రాష్ట్ర ముదిరాజ్ యూత్ అధ్యక్షుడు గుళ్లపల్లి శ్రీను, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, వల్లూరి రామిరెడ్డి, పార సీతయ్య, కుక్కడపు బాబు తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగ విచారణకు సిద్ధం కావాలి
నెల్లూరు(పొగతోట): మాపై ఆరోపణలు చేస్తున్న వారు బహిరంగ విచారణకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(ఏపీఆర్ఎస్ఏ) అధ్యక్ష, కార్యదర్శులు షఫిమాలిక్, కాలయ సతీష్కుమార్ అన్నారు. ఆదివారం ఏపీఆర్ఎస్ఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసోసియేషన్ను అడ్డుపెట్టుకుని స్వార్థప్రయోజనాల కోసం పాకులాడుతున్న నాయకులు రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి కషి చేస్తున్న మాపై ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నామని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనే సంకల్పంతోనే కావలి, ఆత్మకూరు, గూడూరు డివిజన్లకు ఎన్నికలు పూర్తి చేశామని తెలిపారు. బదిలీల ప్రక్రియ జరుగుతున్నందున ఎన్నికల నిర్వహణ జాప్యం జరిగిందన్నారు. నెల్లూరు డివిజన్కు ఈ నెల 28న నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆగస్టు 7న నామినేషన్లు స్వీకరించి 14న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. నెల్లూరు డివిజన్కు కాయల సతీష్కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఎన్నికల ప్రక్రియ నెల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఏపీఆర్ఎస్ఏ నాయకులు డి.శ్రీరామకష్ణ, టి.శ్రీనివాసులు, ఎంఎం ప్రసాద్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. -
ఔను.. వాళ్లు ఒక్కటయ్యారు!
♦ సిండికేట్గా ఏర్పడిన వ్యాపారులు ♦ అసోసియేషన్ పేరుతో దందా ♦ రైతుకు ‘మట్టి’కొట్టేందుకు ఎత్తుగడ బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలిస్తున్న వ్యాపారులంతా ఒక్కటయ్యారు. ప్రాజెక్ట్ నుంచి నల్లమట్టి తరలించే వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను పెంచి రైతులను దగా చేసేందుకు సిద్ధమయ్యారు. అన్నదాతకు ‘మట్టి’ కొట్టేందుకు ఆదివా రం సమావేశమైన వ్యాపారులు.. తెలంగాణ టిప్పర్ అసోసియేషన్గా ఏర్పడ్డారు. అసోసియేషన్కు చెందిన పోస్టర్లను టిప్పర్లకు అతికించి మరీ నల్లమట్టిని తరలిస్తున్నారు. ఒక్కటైన వ్యాపారులంతా ఒకే ధరకు మట్టిని విక్రయించాలని నిబంధనలు విధించుకున్నారు. అంతే కాకుండా ధరల పట్టికను కూడా సిద్ధం చేశారు. ఫలితంగా అన్నదాత ఆరుగాలం కష్టపడి పోగేసిన డబ్బు ‘మట్టి’పాలయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడే ఎందుకో..? శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సుమారు రెండున్నర నెలలుగా నల్లమట్టిని రైతుల కోసమంటూ తరలిస్తున్నారు. రైతులకు ఎలాంటి భారం కాకుడదని ప్రాజెక్ట్ అధికారులు ఎలాంటి ఆంక్షలు లేకుండా మట్టిని తరలించేందుకు అనుమతించారు. ఇన్నాళ్లు ఎవరికి వారే మట్టిని తరలించిన వ్యాపారులు సిండి‘కేటుగాళ్లు’గా మారారు. అంతా కలిసి అసోసియేషన్గా ఏర్పడ్డారు. అయితే, ఇన్నాళ్లుగా ఏర్పాటు చేయని అసోసియేషన్ ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అసోసియేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిం దో? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసోసియేషన్ ఏర్పాటుకు ముందు అధికారులు ఎక్కడా నల్లమట్టి తరలింపును అడ్డుకోలేదు. మరి అలాంటప్పుడు ‘అసోసియేషన్’ ఎందుకో వ్యాపారులకే తెలియాలి. అసోసియేషన్కు సభ్యత్వ రుసుం.. తెలంగాణ టిప్పర్ అసోషియేషన్లో సభ్యత్వం కోసం డబ్బులు వసూలు చేసినట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. టిప్పరు రూ.1000, డంపర్కు రూ.2 వేల చొప్పున చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఇలా ఇప్పటివరకు సుమారు 150 వరకు టిప్పర్లు, డంపర్ల పేరుతో అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్నట్లు సమాచారం. అందుకోసమేనా..?! ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలించేందుకు కొందరు వ్యాపారులు తమిళనాడు, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో టిప్పర్లను తీసుకువచ్చారు. దీంతో పోటీ తీవ్రమైంది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు తక్కువ ధరకే నల్లమట్టిని విక్రయించారు. దీనివల్ల రైతులకు కొంత ఊరట లభించింది. అయితే, పోటీ వల్ల దందా దెబ్బ తింటుందని భావించిన వ్యాపారులు.. ‘ఒకే ధర’ నిబంధనను అమలు చేసేందుకు అసోసియేషన్గా ఏర్పడినట్లు తెలిసింది. దీనివల్ల రైతులపై ధరాభారం పడనుంది. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా రైతుల పేరుతో మట్టి దందాకు శ్రీకారం చుట్టారు! పోస్టర్ ఉంటేనే.. సభ్యత్వం తీసుకున్న టిప్పర్లకు ‘తెలంగాణ టిప్పర్ అసోషియేషన్’కు చెందిన పోస్టర్లను అతికించారు. ఎస్సారెస్పీ నుంచి నల్ల మట్టి తరలించే ప్రతి టిప్పర్కు అసోసియేషన్ పోస్టర్ ఉండాలి. లేదంటే నల్లమట్టి తరలించేందుకు వీలు లేదనే నిబంధన పెట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టిని తరలించేందుకు ప్రాజెక్ట్ అధికారులకు సీనరేజ్ చెల్లించాలి. కానీ సీనరేజ్ చెల్లిస్తే ఆ భారం అంతిమంగా రైతుపైనే పడుతుందని చిలుక పలుకులు పలుకుతున్న వ్యాపారులకు.. అసోసియేషన్ సభ్యత్వ రుసుము భారం కూడా రైతులపైనే పడుతుందని తెలియదా..? -
ట్యాక్సీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటాం!
ముంబై: ఉబర్ డ్రైవర్ అత్యాచార ఉదంతం తర్వాత తీవ్ర నియంత్రణలో ఉన్న ట్యాక్సీ కంపెనీలన్నీ ఒక ఆసోసియేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాయి. ‘మేమంతా కలిసే ఉన్నాం అని ప్రభుత్వానికి తెలిపేందుకు ఓ అసోసియేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ‘ఉబెర్’ ఘటన తర్వాత చాలా టాక్సీ కంపెనీల మీద ప్రభుత్వం నిషేధం విధిం చింది. అన్ని కంపెనీల యజమానులతో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. పరిశ్రమకు న్యాయం చేయాలంటే ఏకీకృత జాతీయ సంస్థ ఏర్పాటు చేయాలి. అంతేకానీ ఆర్టీవోలతో కాదు’ అని టాక్సీ ఫర్ ష్యూర్(టీఎఫ్ఎస్) వ్యవస్థాపక డెరైక్టర్ అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. తమ కంపెనీ టాక్సీలు అంత సురక్షితం కాదనే ఆరోపణలను ఆయన ఖండించారు. డ్రైవర్లు, టాక్సీ సమాచారం అంతా మ్యాపింగ్ చేస్తామని తెలిపారు. బెంగళూరులో ఆటోలు, నానో కార్లతో విజయవంతంగా కంపెనీ సేవలు ప్రారంభించామని, త్వరలో ముంబైలో మొదలు పెడతామని ఆయన తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 100 నగరాల్లో తమ సేవలు విస్తరించనున ్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజుకు 40 వేల ట్రిప్పులు, 47 కన్నా ఎక్కువ నగరాల్లో తిరుగుతున్నట్లు చెప్పారు. సొంతంగా కార్లు లేకున్నా 22 వేల ఆపరేటర్లను 10 శాతం చార్జ్తో నడుపుతున్నామని ఆయన వివరించారు. కాల్ సెంటర్ ద్వారానే సర్వీసులు నడుపుతున్నా.. ఆన్లైన్ ద్వారా కూడా బుకింగ్స్ చేస్తున్నామని ఆయన చెప్పారు. -
సమైక్యాంధ్ర ఉద్యమానికి హెచ్ఎంల అసోసియేషన్ మద్దతు
ఒంగోలు ఒన్టౌన్, న్యూస్లైన్ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఈనెల 12 అర్ధరాత్రి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లాశాఖ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్థానిక ప్రధానోపాధ్యాయుల సంఘ భవనంలో శనివారం ఉదయం నిర్వహించిన అసోసియేషన్ సమావేశానికి సంఘ జిల్లా అధ్యక్షుడు వై.వెంకట్రావు అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకట్రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను వెంటనే ప్రకటించాలని, స్కూలు అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా వెంటనే పదోన్నతులివ్వాలని, ప్రధానోపాధ్యాయుల జిల్లా వార్షిక సమావేశం త్వరలో ఏర్పాటు చేయాలని, ప్రతి పాఠశాలకు వాచ్మెన్, స్వీపర్ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. వేసవిలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన ప్రధానోపాధ్యాయులందరికీ సంపాదిత సెలవును వారి సేవా పుస్తకాల్లో నమోదు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీ రమణ, కోశాధికారి కె.దయానందం, రాష్ట్ర కార్యదర్శి జయరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.పెద్దిరాజు, నాలుగు విద్యా డివిజన్ల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య పోరు నిరసనల హోరు
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే కళ్లుమూసుకున్నారా? అంటూ జనం పాలకులపై నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర విభజనను ఒప్పుకునేది లేదని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు తాళాలు వేసి విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి సమైక్య గళం వినిపిస్తున్నారు. పార్టీలకతీతంగా అన్ని రకాల కుల వృత్తులు, వ్యాపార, కార్మిక, సేవా రంగాలకు చెందిన అసోసియేషన్ల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఫ్లెక్సీలను పట్టుకుని వీధుల్లో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా, మానవహారాలు నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారు. జిల్లాలో ఎనిమిదో రోజు సమైక్యవాదులు కదం తొక్కారు. సాక్షి, తిరుపతి : సమైక్య ఉద్యమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. జిల్లాలోని రెవెన్యూ, ఎంపీడీవో, మునిసిపల్ కార్పొరేషన్, విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. రెవెన్యూ, పల్లె పాలనను చూసుకునే మండల పరిషత్లు, నగర పాలక సంస్థలు, మున్సిపల్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలకు తాళాలు వేసి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ఉద్యమిస్తున్నారు. వైద్యశాలకు తాళాలు సమైక్య ఉద్యమంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు, సిబ్బంది రోడ్డెక్కారు. తిరుపతి నగరంలో రుయా, స్విమ్స్, పలు కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యం ఆందోళనలు చేస్తు న్న ఉద్యమకారులకు సంఘీభావం తెలియజే స్తూ సమైక్యవాదులకు అండగా నిలుస్తున్నారు. వైద్యులు, సిబ్బంది కలిసి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. వినోదానికి బ్రేక్ ఉద్యమంలో జనం కీలకపాత్ర పోషిస్తుండటంతో వినోదాలకు బ్రేక్ ఇచ్చారు. జిల్లాలోని సినిమా హాళ్లు మూసివేశారు. టీవీలో ఎంటర్టైన్మెంట్ చానళ్లను కూడా నిలిపేసి కేబుల్ నెట్వర్క్ యూనియన్లు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. మూడు రోజులు గా టీవీలో ప్రసారాలు రావటం లేదు. వ్యాపార వర్గాలన్నీ షాపులు మూసివేసి ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. ఎనిమిదవ రోజు కొనసాగిన ఆందోళనలు జిల్లాలో ఎనిమిదవరోజు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తాళాలువేసి విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి సమైక్య గళం వినిపించారు. చంద్రగిరిలో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మకు చీర, పసుపు, కుంకు మ, గాజులు, పూలతో సారెపెట్టి మహిళలు నిరసన తెలియజేశారు. తిరుపతిలో అంధులు సమైక్యాంధ్ర కోసం నగర ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో షాపులను మూయించి బంద్ నిర్వహించారు. సత్యవేడులో సమైక్యవాదులు ఏ చిన్నవాహనా న్ని కూడా వీధుల్లో తిరగనివ్వకుండా అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బాలాజీ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతిలో క్రీడాకారులు స్విమ్మింగ్ ఫూల్లో ఈతకొడుతూ విన్నూత్న రీతిలో నిరసన తెలియజేశారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు తిరుపతిలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డి కళాకారులతో కలసి గద చేతబట్టి ఆం దోళనలో పాల్గొన్నారు. ట్రాన్స్కో ఉద్యోగులు విన్నూత్నంగా నిరసన తెలియజేశారు. తిరుపతి ఎస్వీయులో విద్యార్థుల ఆమరణ నిరాహరదీక్షలు కొనసాగాయి. మెడికల్ కళాశాల ముం దు డాక్టర్లు రిలేనిరాహారదీక్ష చేపట్టారు. నాలుగుకాళ్ల మండపం వద్ద మాజీ కౌన్సిలర్లు రిలే నిరాహారదీక్షలు కొనసాగిం చారు. కాంగ్రెస్ సెలూన్లో కటింగ్ కోసం వచ్చిన సీఎం కిరణ్, బొత్స, కావూరిలకు గుండు కొట్టి పంపించటా న్ని ఒక చిత్రకారుడు గీసి చూపించారు. శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్ యజమానులు టీవీలకు పలువురు విభజన పరుల చిత్రాలను అంటించి రోడ్డుపై పగులగొట్టి నిరసన తెలిపారు.