bonds
-
మున్సిపల్ బాండ్లకు వెబ్సైట్
న్యూఢిల్లీ: మున్సిపల్ బాండ్ల కోసం ప్రత్యేకించిన వెబ్సైట్ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ఆవిష్కరించింది. తద్వారా దేశీయంగా మున్సిపల్ బాండ్ల మార్కెట్లలో క్రెడిబిలిటీ, విజిబిలిటీని పెంచనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దేశీ మున్సిపల్ బాండ్లపై సమగ్ర డేటాను అందించడం ద్వారా మార్కెట్లో లావాదేవీలు నిర్వహించేవారికి వెబ్సైట్ ప్రధాన కేంద్రంగా నిలవనున్నట్లు తెలియజేసింది.బాండ్ల జారీ, క్రెడిట్ రేటింగ్స్, లావాదేవీల పరిమాణం, వాస్తవిక ఈల్డ్స్, ధరలు తదితరాలను ఇందులో అందించనుంది. అంతేకాకుండా దేశీయంగా తొలి మున్సిపల్ బాండ్ ఇండెక్స్ అయిన నిఫ్టీ ఇండియా మున్సిపల్ బాండ్ ఇండెక్స్ గత చరిత్ర తదితర పూర్తి వివరాలకు ఇది వేదిక కానుంది. పారదర్శకంగా, సులభంగా బాండ్ల సమాచారాన్ని పొందగలగడంతోపాటు.. ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే లక్ష్యాలతో వెబ్సైట్ను తీసుకువచ్చినట్లు ఎన్ఎస్ఈ వివరించింది. ఎప్పటికప్పుడు సంబంధిత తాజా సమాచారాన్ని నిర్మాణాత్మక పద్ధతిలో సమకూర్చడం ద్వారా మున్సిపల్ బాండ్లను పెట్టుబడి సాధనంగా విశ్వసించేందుకు వెబ్సైట్ దోహదపడనున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: హెచ్సీఎల్ గ్రూప్తో ప్రుడెన్షియల్ జతసంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు వెబ్సైట్ సహకరించనున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ చౌహాన్ పేర్కొన్నారు. వెరసి పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. ముని బాండ్లుగా పిలిచే వీటిని స్థానిక ప్రభుత్వాలు, ఏజెన్సీలు, రోజువారీ నిధుల అవసరాలకు జారీ చేస్తాయి. జాతీయ రహదారులు, రహదారులు, స్కూళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు సైతం వీటిని వినియోగిస్తాయి. -
సన్యాసిగా మారిన వ్యక్తి ఆర్బీఐ బాండ్ల బదిలీకి బాంబే హైకోర్టు నో
ముంబై: ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి జైన సన్యాసం స్వీకరించిన వ్యక్తి పేరుతో ఉన్న ఆర్బీఐ బాండ్లను తమకు బదిలీ చేయాలంటూ అతడి భార్య, తల్లి వేసిన రిట్ పిటిషన్ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ప్రాపంచిక జీవితాన్ని త్యజించడమంటే మరణంతో సమానమని, అతడి ఆస్తులకు తామే వారసులమవుతామన్న వారి వాదనలను తోసిపుచ్చింది. మనోజ్ జవెర్చంద్ దెధియా అతడి కుమార్తె, కుమారుడు జైన సన్యాసం స్వీకరించి, సాధువులుగా మారారు. పేర్లను సైతం మార్చుకున్నారు. అయితే, 2022 నవంబర్లో మనోజ్ సన్యాసం తీసుకోకమునుపు, తన పేరుతో ఉన్న ఆర్బీఐ బాండ్లను ట్రాన్స్ఫర్ చేసే విషయంలో హెచ్డీఎఫ్సీ అధికారులను సంప్రదించారని పిటిషనర్ల లాయర్ హితేశ్ సోలంకి కోర్టుకు తెలిపారు. తమ నిబంధనల ప్రకారం సన్యాసమంటే మరణంతో సమానం కాదని వారు ఆయన వినతిని తిరస్కరించారన్నారు. స్పందించిన ధర్మాసనం.. కేవలం సన్యాసం స్వీకరించిన ఫొటోలు, ఆహ్వాన పత్రికలుంటే చాలదని, అందుకు అనుగుణమైన క్రతువులు జరిపినట్లు ఆధారాలు చూపాల్సి ఉందంది. ఈ వ్యవహారంపై సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. -
ఏటా రూ.15 వేల కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా తెచ్చుకున్న అప్పుల తిరిగి చెల్లింపుపై రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) స్పష్టతనిచ్చింది. 2015 జనవరి 1వ తేదీ నుంచి 2025 జనవరి 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం రూ.3,49,137 కోట్లను బాండ్ల వేలం ద్వారా తీసుకున్నట్టు వెల్లడించింది. గరిష్టంగా 45 ఏళ్ల కాలపరిమితితో ఈ నిధులు సమీకరించారని.. అంటే 2060 నాటికి ఈ అప్పులన్నింటినీ తీర్చాల్సి ఉంటుందని తాజాగా విడుదల చేసిన ‘ఔట్ స్టాండింగ్ స్టేట్ గవర్నమెంట్స్ సెక్యూరిటీస్’నివేదికలో తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు చేసిన అప్పుల లెక్కలను అందులో వెల్లడించింది. తెలంగాణ వచ్చే నాలుగేళ్లలో రూ.60.947.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఈ ఏడాది రూ.17 వేల కోట్ల పైమాటే.. రాష్ట్రం బాండ్ల వేలం ద్వారా సేకరించిన రుణాలను ఏ సంవత్సరంలో ఎంత తీర్చాల్సి ఉంటుందో ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడించింది. దాని ప్రకారం 2025లో రూ.17,150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది. 2026లో రూ.20వేల కోట్లను అప్పులకు అసలు, వడ్డీ కింద చెల్లించాలి. మొత్తమ్మీద వచ్చే నాలుగేళ్లలో రూ.60 వేల కోట్లకు పైగా చెల్లించాలి. ఇవి రిజర్వు బ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్లో తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ మాత్రమేనని.. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు అదనమని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. గడువు తీరిన నాటి నుంచి.. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రూపాల్లో అప్పులు తీసుకుంటుంది. అందులో ప్రధానమైనవి ఆర్బీఐ ద్వారా సేకరించే రుణాలు. ఆర్థిక శాఖ వర్గాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉండే సెక్యూరిటీ బాండ్లను ఆర్బీఐ వేదికగా బహిరంగ మార్కెట్లో వేలానికి పెట్టి ఈ నిధులను సమకూర్చుకుంటుంది. ఇన్ని కోట్ల విలువైన బాండ్లను వేలం వేస్తున్నామని, ఇన్ని సంవత్సరాల కాలపరిమితిలో, ఇంత వడ్డీ చెల్లించి రుణం తీరుస్తామని ఆర్బీఐకి ఇండెంట్ పెడుతుంది. ఆర్బీఐ వేలంలో పాల్గొన్న సంస్థలు.. ఆ బాండ్లను స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బాండ్ల కాలపరిమితి ముగిసిన కొద్దీ అసలు, వడ్డీ కలిపి చెల్లించి బాండ్లను విడిపించుకుంటాయి. మళ్లీ అవసరాన్ని బట్టి అవే బాండ్లను వేలానికి పెట్టి నిధులు తెచ్చుకుంటాయి. -
కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా?
నేను ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలోని ఇబ్బంది వల్ల వేరే ఉద్యోగం చూసుకున్నాను. ప్రస్తుతం ఉన్న కంపెనీలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేస్తాను అని అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. కానీ, రాజీనామా ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాము అని చెప్పారు. తీరా రాజీనామా చేసే సమయానికి ‘మేము రిలీవింగ్ ఇవ్వము. నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వము. అగ్రిమెంట్ ప్రకారం మూడేళ్లు పనిచేయాల్సిందే – అంటే ఇంకో 14 నెలలపాటు ఇక్కడే ఉండాలి అంటున్నారు.’ ఇదే కంపెనీలో పని చేస్తే నేను జీవితాన్ని కోల్పోతాను. ఎంతో హెరాస్మెంట్గా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. – ఒక ఐ.టీ. ఉద్యోగి, హైదరాబాద్అసలు మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కంపెనీ వారికి ఎందుకు ఇచ్చారు? అలా తీసుకునే హక్కు కానీ, తీసుకుని వారి వద్దనే ఉంచుకునే హక్కు కానీ ఎవరికీ లేదు. పరిశీలించిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు మీకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా కాదని ఎవరైనా చేస్తే అది చట్టరీత్యా తప్పు. ఐటీ కంపెనీలలో సాధారణంగా ఫ్రెషర్స్ గా వచ్చిన వారితో బాండు రాయించుకోవడం చూస్తుంటాము. కానీ, బాండు రాయించుకున్నంత మాత్రాన మీరు వారి వద్ద బానిసత్వం చేయాలి అని అర్థం కాదు. అలాంటి బాండ్లు అన్నివేళలా చెల్లవు కూడా. కంపెనీవారు మీకు ఏదైనా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి, (స్పెషల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ వంటివి) ఆ శిక్షణ ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటే, సదరు శిక్షణ నుంచి మీరు నేర్చుకున్న పని ఆ కంపెనీకి ఉపయోగకరం అయినప్పుడు మాత్రమే వారు ఇచ్చిన శిక్షణకు ప్రతిఫలంగా కొంతకాలం వారి వద్ద పనిచేయాలి అనే నిబంధన చెల్లుతుంది. అంతేకానీ ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గర ఇలాంటి బాండ్లు రాయించుకుంటే అవి చెల్లవు. వాటికి భయపడాల్సిన అవసరం లేదు.కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్, సెక్షన్ 27 ఒక వ్యక్తిని తన వాణిజ్య/వ్యాపారాలు చేయడం వీలు లేదు అని రాసుకున్న ఏ అగ్రిమెంట్ అయినా కాంట్రాక్టు అయినా చెల్లవు. మీరు రాసుకున్న అగ్రిమెంట్/ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ లోని పదజాలాన్ని ఒకసారి పరిశీలించండి. మీరు లిఖితపూర్వక నోటీసు ఇచ్చి, నోటీసు సమయాన్ని పూర్తి చేసి ఆ కంపెనీని వదిలి వెళ్లవచ్చు. వీలుంటే ఒక లాయర్ని సంప్రదించి ఆ కాంట్రాక్టు చెల్లుతుందో లేదో చూసుకోండి. ఇదీ చదవండి: ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!ఐటీ ఉద్యోగి అయినప్పటికీ, మీరు చేసే పని గనుక లేబర్ యాక్ట్ పరిధిలోకి వస్తే, మీరు లేబర్ కోర్టును కూడా సంప్రదించవచ్చు. అలాగని అందరు ఐటీ ఉద్యోగులకూ లేబర్ చట్టాలు వర్తించవు. కొందరికి మాత్రమే వర్తిస్తాయి. ప్రత్యామ్నాయంగా మీరు సివిల్ కోర్టును మీరు ఆశ్రయించవచ్చు. కొంత సమయం పట్టినప్పటికీ మీకు సరైన న్యాయం దొరుకుతుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసంsakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
ఎస్బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజాగా రూ.10,000 కోట్లు సమీకరించింది. ఏడోసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులు సమకూర్చుకుంది. 15 ఏళ్ల కాలపరిమితిగల వీటికి కూపన్ రేటు 7.23 శాతంకాగా.. రూ.11,500 కోట్లకుపైగా విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. నిజానికి బ్యాంక్ రూ.5,000 కోట్ల విలువైన బాండ్ల జారీకి తెరతీసింది. అధిక బిడ్డింగ్ నమోదైతే మరో రూ.5,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించేందుకు గ్రీన్షూ ఆప్షన్(ఓవర్ అలాట్మెంట్)ను ఎంచుకుంది. వెరసి బాండ్ ఇష్యూకి రెండు రెట్లు అధికంగా స్పందన లభించింది.ఇదీ చదవండి: లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లుబిడ్ చేసిన సంస్థలలో ప్రావిడెంట్ ఫండ్స్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితరాలున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల హౌసింగ్ విభాగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులుగా తాజా నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఎస్బీఐ జారీ చేసిన బాండ్లకు స్థిరత్వ ఔట్లుక్సహా ఏఏఏ రేటింగ్ను పొందింది. వీటి జారీతో దీర్ఘకాలిక బాండ్లపై ఇతర బ్యాంకులు సైతం దృష్టి సారించేందుకు వీలు చిక్కినట్లు ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. -
Freedom: స్వేచ్ఛ
సృష్టి లోని జీవులన్నీ కోరుకునేది స్వేచ్ఛ. కాని, అది ఎంత వరకు సాధ్యం? మనమే తల్లి తండ్రులని ఎంచుకుని, పుట్టటం మన చేతుల్లో లేదు అనుకుంటాం. పుట్టిన తరువాత ఇక చేయగలిగినది ఏమీ లేదు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుండి బయట పడాలని తాపత్రయం. బొడ్డు కోసి మాయనుండి వేరైన తరువాత అసలైన బంధనాల్లో ఇరుక్కుపోవటం జరిగింది. అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్తిగా తల్లితండ్రుల మీద ఆధారపడతారు. అక్కడి నుండి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధార పడక తప్పదు. జ్ఞానసముపార్జన కోసం గురువుల మీద ఆధారపడ వలసి వస్తుంది. ఆహారం కోసం అయితే వడ్డించినవారి మీద, వండినవారి మీద, సంబారాలని ఇంటికి తెచ్చినవారి మీద, పంటలు పండించినవారి మీద – ఇట్లా ఎందరి మీదనో ఆధార పడకుండా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా! ముందుగా అవన్నీ తెచ్చుకోవటానికి కావలసిన డబ్బులు ఉండాలి. అవి ఆకాశంలో నుండి ఊడి పడవు. మనం స్వంతంగా తయారు చేయలేము. మఱి, నేను స్వేచ్ఛాజీవిని. ఎవరి మీదా ఆధారపడను అనటం ఎంత సమంజసం? ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది ఇరుకుగా ఉన్న గర్భంలో నుండి బయట పడి స్వేచ్ఛాజీవిని అనుకున్న మానవుడికి తాను ఇరుక్కున్న చుట్టరికపు బంధనాల నుండి విడివడాలని అంతర్గతంగా అంతరంగపు అట్టడుగు పొరల్లో మాటుపడి ఉన్న కోరిక. ఈ బంధనాలనే పురాణాలు ప్రతీకాత్మకంగా వృత్రాసురుడు అని చెప్పాయి. చుట్టుకున్నవే చుట్టరికాలు, బంధించేవే బంధనాలు. నిజమైన స్వేచ్ఛ అంటే దేనినీ పట్టుకొని ఉండక పోవటం. దేనినీ పట్టించుకోక పోవటం అనుకుంటారు. నిజమైన స్వేచ్ఛాజీవి అందరికీ సమంగా అందుబాటులో ఉంటాడు. వీరు నాకు ఇష్టులు, మేలు చేసినవారు, బంధువులు, భవిష్యత్తులో నాకు సహాయ పడతారు, నాకు కీడు చేశారు, ఎందుకూ పనికిరారు మొదలైన భావనలతో ప్రవర్తించటం అభిప్రాయాల ఊబిలో కూరుకుపోవటమే. అది వ్యక్తుల విషయం మాత్రమే కాదు, వస్తువులు, సిద్ధాంతాలు మొదలైనవి కూడా. ఎదుటివారి పట్ల ఎటువంటి అభిప్రాయమూ లేకుండా వారికి మేలు కలిగేట్టు తనకు చేతనైనంత వరకు ప్రవర్తించటం, తరువాత ఎటువంటి ప్రతిఫలం కాని, గుర్తింపు కాని ఆశించకుండా ఉండటం స్వేచ్ఛాజీవి లక్షణం. ఏ మాత్రం ఆశించినా అది బంధమే. ఒకవేళ ఏదైనా ప్రతిఫలం లభిస్తే, దానిని ఎటువంటి వ్యామోహం లేకుండా స్వీకరించాలి. ‘‘వద్దు, అది నన్ను బంధిస్తుంది.’’ అని నిరాకరిస్తే, అదే పెద్ద బంధనం అవుతుంది. ‘‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. తరువాత బంధనాలలో ఇరుక్కుంటాడు’’ అన్న ఆంగ్ల సామెత వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. నిజంగానే మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామా? స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు. తనంతట తాను అనుభవించ వలసినది. ఆ విధంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన అంతా. స్వ+ ఇచ్ఛ అంటే తన అసలైన ఇచ్ఛ, అంటే కోరిక ఏదైతే ఉన్నదో, బంధనాల నుండి విడివడాలని – అది నెరవేరటానికి తగినట్టుగా ఉండగలగటమే స్వేచ్ఛ. దానిని గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండగలగటం, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, ఎవరినీ దేనినీ లెక్కచేయకపోవటం అనే అపోహ వ్యాపించి ఉంది లోకంలో. సర్వసంగపరిత్యాగులని చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. వారికి ఇల్లు, బంధువులు మొదలైన బంధాలు ఉండవు. పేరు ప్రఖ్యాతులు వంటి చుట్టలలో (వలయాల్లో) ఇరుక్కోరు. ఈ క్షణాన మోక్షం ఇస్తానంటే ఏవో సద్దుకొని వస్తాను అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరే వారు ఎంత మంది ఉంటారు? అదీ నిజమైన స్వేచ్ఛ అంటే. – డా. ఎన్. అనంత లక్ష్మి -
క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
ప్రాపర్టీ విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా? లేక దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కోసం ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ జారీ చేసే సెక్షన్ 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవాలా..? – అనిల్ మిశ్రా ప్రాపర్టీని రెండేళ్లకు పైగా కలిగి ఉన్న తర్వాత విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించడం) చేసిన తర్వాత మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రాపర్టీని విక్రయించిన ఆరు నెలల్లోపు క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఈసీ కింద రూ.50 లక్షల వరకు లాభాన్ని మూలధన లాభాల నుంచి మినహాయింపునకు అవకాశం ఉంటుంది. రూ.50 లక్షలపై 20 శాతం పన్ను అంటే రూ.10 లక్షల మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది. ప్రభుత్వ మద్దతు గల ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ తదితర ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు జారీ చేసే స్థిరాదాయ సాధనాలనే క్యాపిటల్ గెయిన్ బాండ్లుగా చెబుతారు. క్యాపిటల్ గెయిన్ బాండ్లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్తో ఉంటాయి. వీటిపై 5.25 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. వడ్డీ ఆదాయాన్ని ఏటా రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి నికరంగా లభించే రేటు 3.68 శాతం. ఈక్విటీ ఫండ్స్తో పోల్చి చూసినప్పుడు క్యాపిటల్ గెయిన్ బాండ్లపై లభించే 5.25 శాతం రేటు చాలా తక్కువ. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గత ఐదేళ్ల కాల సగటు రాబడి 20 శాతంగా ఉంది. ఇప్పుడు పన్ను ఆదా కోసం క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఐదేళ్ల కాలానికి రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, 5.25 శాతం రేటు ప్రకారం గడువు తీరిన తర్వాత రూ.63 లక్షలు సమకూరుతుంది. అదే 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (రూ.10లక్షలు) చెల్లించి, మిగిలిన రూ.40 లక్షలను ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో రూ.70 లక్షలు సమకూరుతుంది. ఈ గణాంకాలను పరిశీలించి చూసినప్పుడు మూలధన లాభాల పన్ను చెల్లించి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడమే మేలని అనిపిస్తుంది. కానీ, ఈక్విటీల్లో మెరుగైన రాబడి వస్తుందని చెప్పి మొత్తం తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయడం సంక్లిష్టం కావచ్చు. ఐదేళ్లు, అంతకుమించిన కాలాలకు ఈక్విటీల్లో మెరుగైన రాబడులు వస్తాయి. కానీ ఇదేమీ గ్యారంటీడ్ కాదు. ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, క్యాపిటల్ గెయిన్ బాండ్లు హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. రిస్క్ లేని రాబడి కోరుకునేట్టు అయితే, ఐదేళ్ల తర్వాత కచ్చితంగా పెట్టుబడి మొత్తం కావాల్సిన వారు క్యాపిటల్ గెయిన్ బాండ్లకు వెళ్లొచ్చు. కొంత రిస్క్ తీసుకుని, అవసరమైతే ఐదేళ్లకు అదనంగా మరికొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసేట్టు అయితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవచ్చు. ఎస్సీఎస్ఎస్ ఖాతాను ఎనిమిదేళ్ల తర్వాత కూడా పొడిగించుకోవచ్చా..? – గురునాథ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) నిబంధనల్లో సవరణ చోటు చేసుకుంది. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత కోరుకుంటే మరో మూడేళ్ల కాలానికి దీన్ని పొడిగించుకోవచ్చు. ఇలా ఒక్కసారి మాత్రమే పొడిగింపునకు అవకాశం ఉండేది. ఆ తర్వాత కూడా అందులోనే ఇన్వెస్ట్మెంట్ కొనసాగించాలంటే, ఉపసంహరించుకుని మళ్లీ తాజాగా ఖాతా తెరవాల్సి వచ్చేది. ఈ నిబంధనను మార్చారు. ఇకపై ఐదేళ్ల ప్రాథమిక కాల వ్యవధి ముగిసిన తర్వాత నుంచి.. మూడేళ్లకు ఒకసారి చొప్పున ఖాతాను పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. అంతేకానీ, ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు. గడువు పొడిగించే సమయంలో ఉన్న రేటు తదుపరి కాలానికి వర్తిస్తుంది. ఇందులో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఐదేళ్లు పూర్తయి ఉంటే, కొనసాగించుకోవడం వల్ల తదుపరి మూడేళ్ల కాలానికే 8.2 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. దీనికి బదులు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని, తిరిగి తాజాగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఐదేళ్ల కాలానికి 8.2 శాతం గరిష్ట రేటును పొందొచ్చు. -
బాండ్ల పునర్వ్యవస్థీకరణకు వేదాంత బాండ్హోల్డర్ల ఓకే
న్యూఢిల్లీ: నాలుగు సిరీస్ల బాండ్లను పునర్వ్యవస్థీకరించేందుకు బాండ్హోల్డర్లు సమ్మతించినట్లు వేదాంత గ్రూప్ మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్ తెలిపింది. ఈ బాండ్ల సిరీస్లో చెరి 1 బిలియన్ డాలర్ల విలువ చేసే రెండు ఇష్యూలు, 1.2 బిలియన్ డాలర్లది ఒకటి, 600 మిలియన్ డాలర్లది మరొకటి ఉన్నాయి. ఇవి 2024 నుంచి 2026 మధ్య మెచ్యూర్ అవుతాయి. తాజా పరిణామం నేపథ్యంలో తదుపరి ప్రణాళిక గురించి చర్చించేందుకు జనవరి 4న వేదాంత ఇన్వెస్టర్ల సమావేశం నిర్వహించనుంది. భారీ రుణభారాన్ని తగ్గించుకునే దిశగా వేదాంత రిసోర్సెస్ నాలుగు సిరీస్ల బాండ్ల పునర్వ్యవస్థీకరణను తలపెట్టింది. -
గోల్డ్ బాండ్ @ రూ. 6,199
ముంబై: తదుపరి దశ సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్జీబీ)కు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా ధరను ప్రకటించింది. ఒక గ్రాము బాండుకు రూ. 6,199ను నిర్ణయించింది. వీటి సబ్్రస్కిప్షన్ ఈ నెల సోమవారం(18న) ప్రారంభమై ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఎస్జీబీ పథకం 2023–24– సిరీస్–3లో భాగంగా ఆర్బీఐ ఈ నెల 18–22 మధ్య పసిడి బాండ్ల సబ్ర్స్కిప్షన్కు తెరతీస్తోంది. స్మాల్, పేమెంట్, గ్రామీణ బ్యాంకులు మినహా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు వీటిని విక్రయిస్తాయి. వీటితోపాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పూర్తి స్వచ్ఛత(999)గల పసిడి సగటు ముగింపు ధర ఆధారంగా గ్రాముకు రూ. 6,199 ధరను నిర్ధారించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐతో చర్చల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకు రూ. 50 చొ ప్పున ఇన్వెస్టర్లకు డిస్కౌంట్ను ఆఫర్ చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడంతోపాటు.. డిజిటల్ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది. వెరసి గోల్డ్ బాండ్ రూ. 6,149కు లభించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కాగా.. ఎస్జీబీ సిరీస్–4లో భాగంగా వచ్చే (2024) ఫిబ్రవరి 12–16 మధ్య బాండ్లను ఆఫర్ చేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. -
కార్పొరేట్ బాండ్ల భారీ వృద్ధి.. 2030 కల్లా రూ.110 లక్షల కోట్లకు
ముంబై: రానున్న కాలంలో కార్పొరేట్ బాండ్ల మార్కెట్ భారీగా విస్తరించనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా పేర్కొంది. దీంతో 2030 మార్చికల్లా కార్పొరేట్ బాండ్ మార్కెట్ పరిమాణం రెట్టింపుకానున్నట్లు అభిప్రాయపడింది. వెరసి రూ.110 లక్షల కోట్ల మార్క్ను దాటే వీలున్నట్లు అంచనా వేసింది. పెట్టుబడి వ్యయాలకు దన్ను, ఆకట్టుకుంటున్న మౌలిక సదుపాయాల రంగం, పొదుపును ఫైనాన్షియలైజ్ చేయడం వంటి అంశాలు ఇందుకు దోహదం చేయనున్నట్లు వివరింంది. 2023 మార్చివరకూ గత ఐదేళ్లలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ వార్షికంగా 9 శాతం వృద్ధి చెంది ర. 43 లక్షల కోట్లకు చేరినట్లు నివేదికలో క్రిసిల్ పేర్కొంది. ఈ బాటలో 2030 మార్చికల్లా రెట్టింపునకుపైగా ఎగసి రూ. 100–120 లక్షల కోట్లను తాకనున్నట్లు అంచనా వేసింది. నియంత్రణ సంస్థల మధ్యవర్తిత్వం కూడా ఇందుకు సహకరించనున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి పేర్కొన్నారు. గరిష్టస్థాయిలోని సామర్థ్య వినియోగం, కార్పొరేట్ రంగ పటిష్టత, బలమైన బ్యాలన్స్షీట్లు, ఆర్థిక పురోభివృద్ధి అంచనాలు పెట్టుబడి వ్యయాల్లో వృద్ధికి కారణంకానున్నట్లు క్రిసిల్ వివరింంది. దీంతో 2027కల్లా రూ. 110 లక్షల కోట్ల పెట్టుబడులు నవెదుకావచ్చని అభిప్రాయపడింది. అంచనా పెట్టుబడి వ్యయాలలో ఆరో వంతు కార్పొరేట్ బాండ్ మార్కెట్ సమకూర్చవచ్చని పేర్కొంది. మౌలిక రంగానికి మౌలిక రంగ ఆస్తుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ బలపడుతుండటం, వేగవంత రికవరీ వంటి అంశాల నేపథ్యంలో దీర్ఘకాలిక రుణాలకు అవకాశాలు మెరుగుపడనున్నట్లు క్రిసిల్ తెలియజేసింది. ప్రస్తుతం కార్పొరేట్ బాండ్ల జారీ నిధుల్లో 15 శాతం మౌలిక రంగానికి చేరుతున్నట్లు తెలియజేసింది. ఏఏ రేటింగ్ కార్పొరేట్ బాండ్ల జారీపై పెట్టుబడి నియంత్రణలను సరళతరం చేయడంతో పెన్షన్ ఫండ్స్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ను వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక వృద్ధికి సహకరించే వీలున్నట్లు క్రిసిల్ డైరెక్టర్ రమేష్ కరుణాకరన్ వివరించారు. రిటైల్ విభాగంలో పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చేందుకు నాన్బ్యాంక్ రుణదాతల నుంచి సైతం కార్పొరేట్ బాండ్లకు డిమాండ్ కనిపించనున్నట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. నాన్బ్యాంక్ రుణదాతలు అధిక స్థాయిలో రుణాలను రిటైలర్లకు అందిస్తుండటంతో దేశ జీడీపీలో రిటైల్ క్రెడిట్ 30 శాతానికి చేరింది. యూఎస్లో ఇది 54 శాతంకాగా.. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్ ప్రొడక్టులలో గరిష్టంగా పెట్టుబడులు మళ్లుతున్నట్లు తెలియజేసింది. -
Electoral bonds case: పలు సమస్యలున్నాయి!
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో పలు సమస్యలున్నాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాలు పొందేందుకు పారీ్టలన్నింటికీ అవి సమానావకాశం కలి్పంచకపోతే వివక్షే అవుతుందని అభిప్రాయపడింది. ‘అంతేగాక ఈ పథకంలో అస్పష్టత కూడా దాగుంది. బాండ్లు కొనేవారి వివరాలు ఎవరికీ తెలియకుండా సంపూర్ణ గోప్యత పాటించడమూ వీలు కాదు. వారి వివరాలను సంబంధిత బ్యాంకు (ఎస్బీఐ), దర్యాప్తు సంస్థలు తెలుసుకునే వీలుంది’ అని అభిప్రాయపడింది. అంతేగాక విపక్షాల బాండ్లను కొనేవారిపై అధికార పక్షాలు ప్రతీకారానికి దిగకుండా ఎటువంటి రక్షణా లేదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఏ పార్టీ ఎంత పవిత్రమైనదో తేల్చడం మా ఉద్దేశం కాదు. ఎన్నికల బాండ్ల పథకానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్నదానిపై మాత్రమే విచారణ జరుపుతున్నాం’’ అని స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సీజేఐ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం రోజంతా విచారణ జరిపింది. ‘‘ఎన్నికల ప్రక్రియలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న ఈ పథకం ఉద్దేశం అభినందనీయమే. కానీ ఈ పథకంలో అతి పెద్ద సమాచార లోపముంది’’ అని అభిప్రాయపడింది. ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్నారు. -
ఎస్బీఐ నిధుల సమీకరణ - బాండ్ల జారీతో రూ. 10,000 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ బాండ్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకుంది. 7.49 శాతం కూపన్ రేటుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేసినట్లు వెల్లడించింది. వెరసి ఎస్బీఐ నాలుగోసారి ఇన్ఫ్రా బాండ్ల జారీని చేపట్టగా.. నిధులను మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు కేటాయించనుంది. నిజానికి ఎస్బీఐ రూ. 4,000 కోట్లు సమీకరించేందుకు బాండ్ల ఇష్యూకి తెరతీసింది. అయితే ఐదు రెట్లు అధికంగా అంటే రూ. 21,045 కోట్ల విలువైన 134 బిడ్స్ దాఖలయ్యాయి. ప్రావిడెండ్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితరాల నుంచి సబ్స్క్రిప్షన్ లభించినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఇక ఇదే మార్గంలో ఆగస్ట్లోనూ బ్యాంక్ రూ. 10,000 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఇష్యూతో కలిపి మొత్తం రూ. 39,718 కోట్ల విలువైన దీర్ఘకాలిక బాండ్లను జారీ చేసినట్లయ్యింది. -
నామినీ నమోదు చేశారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్ లేని సందర్భాల్లో క్లెయిమ్ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నామినీ అంటే ఎవరు..? పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్ను పేర్కొంటే, సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. ఎంతో ప్రాధాన్యం.. 3నామినేషన్ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్ హేర్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ రిజిస్టర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్ దరఖాస్తులో నామినేషన్ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది. అకౌంట్ హోల్డర్ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ నామినేషన్ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్ కాలమ్ను తప్పకుండా పూరించాలి. ఎంత మంది? నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు నామినేషన్ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి. సవరణ..: నామినేషన్ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి. ఊహించని అనుభవం 2021లో మద్రాస్ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది. సరైన నిర్ణయం మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. నామినేషన్ గడువు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్ 30 నాటికి నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్ గుర్తించాలి. -
సావరిన్ గోల్డ్ బాండ్స్ను ఎలా కొనుగోలు చేయాలి?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)కి సంబంధించి మొదటి విడత సావరిన్ గోల్డ్ బాండ్ల (Sovereign Gold Bond) ఇష్యూ సోమవారం(6న) ప్రారంభమైంది. ఈ నెల 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా గ్రాముకి ముందస్తు(నామినల్) ధర రూ. 5,611ను ఆర్బీఐ నిర్ణయించింది. వీటి కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఈ బాండ్లను చివరి సారిగా గత ఏడాది డిసెంబర్ నెలలో ఆర్బీఐ జారీ చేసింది. అప్పుడు గ్రాముకు రూ. 5,409గా ఉంది. ప్రస్తుతం రూ.200 పెరిగింది. ఈ సందర్భంగా సావరిన్ గోల్డ్ బాండ్స్ గురించి ముఖ్య విషయాలు.. ►అధిక ద్రవ్యోల్బణం, రాబోయే గ్లోబల్ మార్కెట్ల అస్థిరత, ఈక్విటీ మార్కెట్ల పనితీరును పరిగణలోకి తీసుకుంటే సావరిన్ గోల్డ్ బాండ్(sgb)లో 10-15 శాతం పెట్టుబడులు పెట్టడం మంచిదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ►ఎస్జీబీ బాండ్స్ ఇతర డిజిటల్ ఆస్తుల కంటే భిన్నం. ఎందుకంటే గోల్డ్ బాండ్ సాయంతో సంవత్సరానికి 2.50 శాతం వడ్డీ రేటును కూడా పొందవచ్చు. ►ఇష్యూ ధరకు జీఎస్టీతో పాటు ఇతర ఛార్జీలు లేనందున బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే అనువైన సమయం ►సబ్స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి మూడు పని దినాల సగటు ముగింపు ధర ఆధారంగా ఇష్యూ ధర నిర్ణయించబడుతుంది. ఈ రేట్లను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించింది. రేట్లను నిర్ణయించడానికి 999 స్వచ్ఛత బంగారం ధరను పరిగణలోకి తీసుకుంటుంది ఆర్బీఐ. ►డిజిటల్ మోడ్లో చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ. 50 ధర తగ్గుతుంది. ►ఈ బాండ్లలో ఏడాదికి గరిష్టంగా 4 కిలోల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పరిమితి 1 గ్రాము బంగారం ► బాండ్లు ఎనిమిదేళ్ల కాలపరిమితితో వస్తాయి. ఆకస్మికంగా వైదొలగాల్సి వస్తే పెట్టుబడిదారుడు కూపన్ చెల్లింపు తేదీకి కనీసం ఒక రోజు ముందు సంబంధిత బ్యాంక్/పోస్టాఫీసును సంప్రదించాలి. ►ఎస్జీబీలో పెట్టుబడి పెట్టినప్పుడు, హోల్డింగ్ సర్టిఫికేట్ను పొందవచ్చు. మీరు దీన్ని డీమ్యాట్ రూపంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తక్కువ లిక్విడిటీ కారణంగా కొన్నిసార్లు ఎక్స్ఛేంజీలలో విక్రయించడం కష్టం. ►ముఖ్యంగా, మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత ఎస్జీబీ ఎలాంటి పన్ను విధించదు. అయితే, మీరు దానిని 36 నెలల ముందు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాలుగా పన్ను విధించబడుతుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను ఆర్బీఐ పన్ను విధిస్తుంది. 36 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచిన బంగారం కోసం, ఇది దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించబడుతుంది. ఇండెక్సేషన్ తర్వాత 20 శాతం పన్ను విధిస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్లను దొంగిలించినా నష్టం ఉండదు గోల్డ్ ఓ సెంటిమెంట్, గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ ఒక జ్వువెలరీ, ఒక కమోడిటీ. ఇలాంటి బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు 2015లో ప్రధాని మోదీ చేతుల మీదిగా కేంద్రం 3 కొత్త స్కీమ్లను ప్రారంభించింది. బాండ్ల రూపంలో బంగారం అమ్మకాలు, గోల్డ్ కాయిన్స్ అమ్మకం,గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లను అందుబాటులోకి తెచ్చారు. పథకం ప్రారంభించే సమయంలో మోదీ మాట్లాడుతూ.. దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారు నిల్వలను ఉపయోగంలోకి తీసుకొని వచ్చేందుకు ఈ కొత్త పథకాల్ని స్టార్ట్ చేసినట్లు చెప్పారు. బంగారాన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మానిటైజ్ చేసుకునేలా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, బాండ్ల రూపంలో బంగారం అమ్మకాలు, అశోక్ చక్రం ముద్రతో గోల్డ్ కాయిన్స్ అమ్మకాలు జరుపుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు 20వేల టన్నులున్న బంగారం పేద దేశం ఎలా అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసిన మోదీ.. ‘‘బాండ్ల ద్వారా బంగారానికి భద్రత ఉంటుంది. ఇంట్లో బంగారాన్ని దాచుకోవాలంటే భయంగా ఉంటుంది. బాండ్లను ఎవరైనా దొంగిలించినా నష్టం ఉండదని ’’ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. -
మున్సిపల్ బాండ్ ఇండెక్స్ను ప్రారంభించిన ఎన్ఎస్ఈ
న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈ అనుబంధ విభాగమైన ఎన్ఎస్ఈ ఇండిసెస్ మొదటిసారిగా మున్సిపల్ బాండ్ ఇండెక్స్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు నిధులు సమీకరణ కోసం జారీ చేసే మున్సిపల్ బాండ్లను ‘నిఫ్టీ ఇండియా మున్సిపల్ బాండ్ ఇండెక్స్’ ట్రాక్ చేస్తుంటుంది. అన్ని రకాల మెచ్యూరిటీలు, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్ల వివరాలు ఇందులో ఉంటాయి. శుక్రవారం బెంగళూరులో మున్సిపల్ డెట్ సెక్యూరిటీలపై సెబీ నిర్వహించిన వర్క్షాప్లో ఈ సూచీని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సూచీలో 28 మున్సిపల్ బాండ్లు ఉన్నాయి. 10 మున్సిపల్ కార్పొరేషన్లు వీటిని జారీ చేశాయి. ఏఏ క్రెడిట్ రేటింగ్ విభాగంలో ఉన్నాయి. ఎంత మేర నిధులు చెల్లించాల్సి ఉందనే ఆధారంగా ఒక్కో బాండ్కు వెయిటేజీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్లు అభివృద్ధి ప్రాజెక్టులకు కావాల్సిన నిధులను ఇలా సెక్యూరిటీల జారీ ద్వారా సమీకరించుకోవచ్చు. -
దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలోని అధిక ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? చాలా మందికి దీన్ని తెలుసుకోవాలని ఉంటుంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ సర్వే పరిశీలిస్తే.. అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులకు (యూహెచ్ఎన్డబ్ల్యూఐ/అధిక ధనవంతులు) అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనం ఈక్విటీలే అని తెలుస్తోంది. 34% పెట్టుబడులను ఈక్విటీలకే కేటాయిస్తున్నారు. ఆ తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్లో 25 శాతం, బాండ్లలో 16 శాతం, ప్రైవేటు ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ రూపంలో 10 శాతం, బంగారంలో 6 శాతం, ఇతర ఇష్టమైన వస్తువులపై (కళాకృతులు, కారు) 4% చొప్పున పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిసింది. నైట్ ఫ్రాంక్ సంస్థ అంతర్జాతీయంగా సర్వే నిర్వహించి ‘ద వెల్త్ రిపోర్ట్ అవుట్లుక్ 2023’పేరుతో విడుదల చేసింది. సర్వే ఫలితాలు.. ► దీర్ఘకాలంలో ఎంతో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 88 శాతం మంది భారతీయ అధిక ధనవంతుల సంపద 2022లో వృద్ధి చెందింది. ► గతేడాది 10 శాతానికి పైగా తమ సంపద పెరిగినట్టు 35 శాతం మంది చెప్పారు. ► ఈ ఏడాది కూడా తమ సంపద కనీసం 10 శాతం వృద్ధి చెందుతుందని 53 శాతం మంది అధిక ధనవంతులు అభిప్రాయపడుతున్నారు ► 47 శాతం మంది 10 శాతానికి పైనే పెరగొచ్చన్న అంచనాతో ఉన్నారు. ► అంతర్జాతీయంగా.. సంపన్నుల కంటే ధనవంతులే ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ► మన దేశంలో అధిక ధనవంతులు కనీసం ఒక్కొక్కరు 5 నివాస ఆస్తులను కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా ఇది 4.2గానే ఉంది. ► 2022లో 14 శాతం మంది అధిక ధనవంతులు ఇంటిని కొనుగోలు చేయగా, 2023లో 10 శాతం మంది ఇంటిని కొనుగోలు చేస్తారని అంచనా. ► యూకే, యూఏఈ, యూఎస్ఏ ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్య ప్రాంతాలుగా ఉన్నాయి. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
ఇక కార్పొరేట్ బాండ్ సూచీల్లో ఫ్యూచర్ కాంట్రాక్టులు
న్యూఢిల్లీ: బాండ్ మార్కెట్లో లిక్విడిటీని పెంచే దిశగా కార్పొరేట్ బాండ్ సూచీల్లో ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టడానికి స్టాక్ ఎక్సే్చంజీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను హెడ్జ్ చేసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. సెబీ సర్క్యు లర్ ప్రకారం సూచీలోని బాండ్లకు సముచిత స్థాయి లో లిక్విడిటీ ఉండాలి. సూచీలో కనీసం 8 ఇష్యూయర్లు ఉండాలి. ఏ ఒక్క ఇష్యూయర్ వెయిటేజీ 15 శాతానికి మించకూడదు. నిర్దిష్ట గ్రూప్ ఇష్యూయర్లకు (ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు మొదలైనవి మినహా) వెయిటేజీ మొత్తం మీద 25 శాతం మించకూడదు. కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ (సీబీఐఎఫ్) కాంట్రాక్టు విలువ రూ. 2 లక్షలకు తగ్గకూడదు. మూడేళ్ల వ్యవధికి ఈ కాంట్రాక్టులను ప్రవేశపెట్టొచ్చు. సోమ వారం నుంచి శుక్రవారం వరకు ట్రేడింగ్ వేళలు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5 గం.ల దాకా ఉంటాయి. చదవండి: ఇంత కథ నడిచిందా!, చోక్సీ భారత్ రాకుండా లంచాలు ఎరచూపుతున్నారా? -
బాండ్ల జారీ ద్వారా రూ.105 కోట్లు: అపోలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో ఐసీఐసీఐ బ్యాంక్నకు నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా రూ.105 కోట్లు సమీకరించనున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైసెస్ బుధవారం తెలిపింది. ఒక్కొక్కటి రూ.10 లక్షల విలువైన 1,050 ఎన్సీడీలను జారీ చేసేందుకు డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపిందని కంపెనీ వెల్లడించింది. ఎన్ఎస్ఈ హోల్సేల్ డెట్ మార్కెట్లో వీటిని లిస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
తొలిసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ, రూ.10వేల కోట్లు సమకూర్చుకున్న ఎస్బీఐ
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) తొలిసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేసింది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకుంది. దీంతో ఒకేసారి ఇన్ఫ్రా బాండ్ల జారీ ద్వారా భారీస్థాయిలో నిధులను సమీకరించిన దేశీ ఫైనాన్షియల్ దిగ్గజంగా నిలిచింది. మౌలికసదుపాయాలు, అందుబాటు ధరల హౌసింగ్ విభాగానికి రుణాలను అందించనుంది. వార్షికంగా 7.51 శాతం కూపన్ రేటుతో పదేళ్ల కాలపరిమితికి ఈ బాండ్లను జారీ చేసింది. వీటి కొనుగోలుకి 3.27 రెట్లు అధికంగా రూ. 16,366 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ప్రభుత్వ సెక్యూరిటీలతో పోలిస్తే 0.17 శాతం ఈల్డ్ వ్యత్యాసం(స్ప్రెడ్)తో బాండ్ల జారీని చేపట్టింది. మౌలిక అభివృద్ధి అత్యంత కీలకమని బాండ్ల విజయవంత విక్రయంపై ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా స్పందించారు. అతిపెద్ద రుణదాత సంస్థగా సామాజిక, పర్యావరణహిత, తదితర ఇన్ఫ్రా ప్రాజెక్టులు ముందుకుసాగేందుకు సహకరించనున్నట్లు తెలియజేశారు. ఈ దీర్ఘకాలిక బాండ్ల ద్వారా మౌలికాభివృద్ధికి బ్యాంకు తనవంతు పాత్ర పోషించగలదని వ్యాఖ్యానించారు. బాండ్లకు దేశీ రేటింగ్ సంస్థల నుంచి ఏఏఏ రేటింగ్ లభించింది. బాండ్ల విక్రయం నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 608 వద్దే ముగిసింది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు: భారీ లాభాల్లో రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి చాలా రోజుల తరువాత లాభాల్లోకి మళ్లింది. ఆరంభంలోనే అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి 67 పైసలు జంప్ చేసి 82.14 స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం 50 పైసలు లాభంతో ట్రేడ్ అవుతోంది. మంగళవారం నాటి ముగింపు 82.72 పోలిస్తే డాలర్తో రూపాయి 82.20 స్థాయిని తాకింది. అటు డాలర్ ఇండెక్స్ సుమారు 109.75 వద్ద ఒక నెలలో దాని కనిష్ట స్థాయికి చేరింది. ఫలితంగా దేశీయ సావరిన్ బాండ్లు కూడా పెరిగాయి. ఈ పరిణామం రూపాయికి సానుకూలంగా మారింది. కాగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఫెడ్ వడ్డీరేటు పెంపు అంచనాల మధ్య డాలర్ బలహీనత కొనసాగుతోంది. మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 17750 పాయింట్లకు ఎగువన ట్రేడ్ అవుతోంది. -
భారత్ బాండ్ ఈటీఎఫ్ హవా: రెండేళ్లలో అనూహ్య వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ బాండ్ ఈటీఎఫ్ల పరిధిలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రెండున్నరేళ్లలోనే రికార్డు స్థాయికి చేరాయి. రూ.50,000 కోట్ల మార్క్ను అధిగమించాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఈ వివరాలను ప్రకటించింది. 2019 డిసెంబర్లో భారత్ బాండ్ ఈటీఎఫ్ మొదటి విడత ఇష్యూ రావడం గమనార్హం. అప్పటి నుంచి ఐదు ఇష్యూలు పూర్తయ్యాయి. వీటి మెచ్యూరిటీ 2023, 2025, 2030, 2031, 2031లో తీరనుంది. ‘‘ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక బలం, ఇన్వెస్టర్లలో వాటి పట్ల ఉన్న విశ్వాసానికి భారత్ బాండ్ ఈటీఎఫ్ల విజయం నిదర్శనం. మన తొలి డెట్ ఈటీఎఫ్ అద్భుత విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది’’అని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే దీపమ్ కార్యదర్శి తుహిన్కాంత పాండే తెలిపారు. ఏఏఏ రెటెడ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన నిఫ్టీ భారత్ బాండ్ సూచీల్లో భారత్ బాండ్ ఈటీఎఫ్లు ఇన్వెస్ట్ చేస్తాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్ల ఘన విజయంతో ఇతర అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు 2019 తర్వాత సుమారు 30 వరకు టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను తీసుకు రావడం గమనార్హం. ప్యాసివ్ డెట్ విభాగంలో రూ.60వేల కోట్ల ఏయూఎంతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ అగ్రగామిగా చేరుకోవడానికి భారత్ బాండ్ ఈటీఎఫ్లు దోహదపడ్డాయి. -
రాణా కపూర్కు సెబీ జరిమానా
న్యూఢిల్లీ: అదనపు టైర్(ఏటీ)–1 బాండ్ల విక్రయంలో అక్రమాలపై యస్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో రాణా కపూర్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది. యస్ బ్యాంకు అధికారులు రిటైల్ ఇన్వెస్టర్లకు తప్పుడు పద్ధతిలో అదనపు టైర్–1 బాండ్లను విక్రయించడంపై సెబీ తాజా జరిమానాకు తెరతీసింది. సెకండరీ మార్కెట్లో ఏటీ–1 బాండ్లను విక్రయించేటప్పుడు బ్యాంకు, కొంతమంది అధికారులు రిస్కులను ఇన్వెస్టర్లకు వెల్లడించకపోవడాన్ని సెబీ తప్పుపట్టింది. 2016లో ప్రారంభమైన ఏటీ–1 బాండ్ల అమ్మకం 2019వరకూ కొనసాగింది. వీటి విక్రయ వ్యవహారాన్ని మొత్తంగా కపూర్ పర్యవేక్షించినట్లు సెబీ పేర్కొంది. బాండ్ల విక్రయంపై సభ్యుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందడంతోపాటు అమ్మకాలను పెంచేందుకు అధికారులపై ఒత్తిడిని సైతం తీసుకువచ్చినట్లు తెలియజేసింది. -
బాండ్లలోకి.. సేఫ్ రూట్
పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి. దీర్ఘకాలం పాటు ఆ పెట్టుబడిని కొనసాగించుకోవాలి. రాబడులు కూడా స్థిరంగా ఉండాలి. ఇలా కోరుకునే రిటైల్ ఇన్వెస్టర్లకు.. ప్రభుత్వ బాండ్లలో నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం తాజాగా అందుబాటులోకి వచ్చింది. స్టాక్ బ్రోకర్ ద్వారా ‘ఎన్ఎస్ఈ గోబిడ్’ ఖాతా తెరిచి ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆర్బీఐ తీసుకొచ్చిన రిటైల్ డైరెక్ట్ డైరెక్ట్ గిల్ట్ (ఆర్డీజీ) అకౌంట్ రూపంలో అయినా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయవచ్చన్నది చూద్దాం.. స్టాక్ మార్కెట్ మాదిరే ప్రభుత్వ బాండ్లకు సంబంధించి కూడా ప్రైమరీ, సెకండరీ మార్కెట్లు ఉన్నాయి. ఈక్విటీ ప్రైమరీ మార్కెట్లో వివిధ కంపెనీల ప్రమోటర్లు ఐపీవో రూపంలో (ప్రైమరీ మార్కెట్) షేర్లను ఆఫర్ చేస్తారు. ప్రభుత్వ బాండ్ల ప్రైమరీ మార్కెట్లో సర్కారు తరఫున ఆర్బీఐ బాండ్లను ఆఫర్ చేస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను కాలానుగుణంగా ఆర్బీఐ వేలం నిర్వహిస్తుంటుంది. బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్స్ తదితర ఇనిస్టిట్యూషన్స్ ఇందులో పాల్గొని కొనుగోలు చేస్తుంటాయి. ఈ రూపంలో ప్రభుత్వానికి నిధులు సమకూరుతుంటాయి. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం సంస్థాగత ఇన్వెస్టర్ల మాదిరే ప్రభుత్వ సెక్యూరిటీలను (జీసెక్లు) వేలంలో పాల్గొని కొనుగోలు చేసుకోవచ్చు. నాన్ కాంపిటీటివ్ బిడ్ల రూపంలో ప్రత్యేక కోటా (5 శాతం) కింద పాల్గొని కనీసం రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. భారత ప్రభుత్వ ట్రెజరీ బిల్లులు (టీ బిల్స్), డేటెడ్ సెక్యూరిటీలు (జీసెక్లు), ప్రభుత్వ బంగారం బాండ్లు (ఎస్జీబీలు), రాష్ట్రాభివృద్ధి రుణాలు (ఎస్డీఎల్) తదితర సెక్యూరిటీలు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజుల కోసం రుణాలు తీసుకోవాలని భావించినప్పుడు టీ బిల్లులను జారీ చేస్తుంది. డేటెడ్ జీసెక్లు, ఎస్డీఎల్ను ఏడాది నుంచి 40 ఏళ్ల కాల వ్యవధుల కోసం ఆర్బీఐ ఇష్యూ చేస్తుంటుంది. ఐపీవోలు ఎప్పుడైనా రావచ్చు. కానీ, ప్రభుత్వ సెక్యూరిటీల వేలం అలా ఉండదు. ఆర్బీఐ దీన్ని కేలండర్ షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తుంటుంది. కనుక కొనుగోళ్లకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. డేటెడ్ సెక్యూరిటీల విషయంలో ఆరు నెలల ముందుగా ఆర్బీఐ వేలం కేలండర్(షెడ్యూల్)ను ప్రకటిస్తుంది. ఆర్బీఐ పోర్టల్ నుంచి ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ► ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయిన తర్వాత ప్రస్తుతానికి వేలంలో ఉన్న సెక్యూరిటీల వివరాలు కనిపిస్తాయి. టీ బిల్లులను ముఖ విలువ (ఫేస్వ్యాల్యూ) కంటే తక్కువకే ఆఫర్ చేస్తారు. ఉదాహరణకు 182 రోజుల టీబిల్లు (రూ.100 ముఖ విలువ)ను రూ.98కి వేలం వేస్తారనుకుంటే.. అప్పుడు మీకు లభించే రాబడి రేటు 1.09 శాతం అవుతుంది. జీసెక్ల వేలం ఈల్డ్ ఆధారితంగానూ ఉండొచ్చు. లేదా ధరల ఆధారితంగానూ ఉండొచ్చు. నూతన జీసెక్లు సాధారణంగా ఈల్డ్ ఆధారితంగానే ఉంటాయి. కూపన్ రేటు ఆధారంగా బిడ్ వేసుకోవచ్చు. వేలం పూర్తిగా సబ్స్క్రయిబ్ అయిన తక్కువ కూపన్రేటును కటాఫ్ ఈల్డ్గా పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో ఆ రేటే బాండ్పై లభించే వడ్డీ రేటు అవుతుంది. ధరల ఆధారిత వేలాన్ని కూడా ఆర్బీఐ నిర్వహిస్తుంటుంది. పాత తేదీలతో కూడిన జీసెక్లను తిరిగి జారీ చేసే సందర్భాల్లో ఇలా చేస్తుంది. పోటీతో కూడిన బిడ్డింగ్లో కటాఫ్ ఈల్డ్ కంటే తక్కువకు కోట్ చేసిన లేదా కటాఫ్ ప్రైస్ కంటే ఎక్కువకు కోట్ చేసిన ఇనిస్టిట్యూషన్లకు కేటాయింపులు చేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు.. ఇనిస్టిట్యూషన్లు నిర్ణయించిన కటాఫ్ ఈల్డ్/ధరల వద్ద కోట్ బిడ్ చేయాల్సి ఉంటుంది. కాంపిటీటివ్ బిడ్డింగ్లో సగటు రేటు ఆధారంగా బాండ్ల కేటాయింపు ఉంటుంది. సగటు రేటు కటాఫ్ రేటు కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు ముఖ విలువ కంటే కొంచెం ఎక్కువకు జీసెక్లను కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. సెకండరీ మార్కెట్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐఎల్) నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్–వోఎం) ప్లాట్ఫామ్పై ప్రభుత్వ బాండ్లలో సెకండరీ ట్రేడింగ్ కొనసాగుతుంటుంది. టెలిఫోన్ ఆర్డర్లు కూడా ఇక్కడే నమోదవుతాయి. కనుక తాజా మార్కెట్ ఆక్షన్ కోసం, ధరలు, లిక్విడిటీ సమాచారం కోసం ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆర్డీజీ ఖాతా సాయంతో సెకండరీ మార్కెట్లోనూ పాల్గొనవచ్చు. ఎన్డీఎస్–వోఎం రెండు విభాగాలను.. ‘రెగ్యులర్ మార్కెట్’, ‘ఆడ్ లాట్స్ విభాగం’ను ఆఫర్ చేస్తుంది. రెగ్యులర్ మార్కెట్లో ఒక లాట్ సైజ్ రూ.5కోట్లు. రూ.5కోట్లకంటే తక్కువ విలువ ట్రేడ్స్ కోసం ఆడ్లాట్స్ విభాగం పనిచేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు జీసెక్లను ఇక్కడే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు చేసుకోవాల్సిన ప్రభుత్వ సెక్యూరిటీల ప్రత్యక్ష ధరలను మార్కెట్ వేళల్లో https:// www. ccilindia. com/ OMHome. aspx పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వాటి కూపన్ రేటు, సంవత్సరం వారీగా ట్రేడవుతుంటాయి. ఉదాహరణకు పదేళ్ల ప్రభుత్వ బాండ్ 0610 ఎ 2031 ఈ పేరుతో ట్రేడవుతుంది. ఇందులో 6.10 అన్నది కూపన్ రేటు. జీసెక్ 2031 అన్నది మెచ్యూరిటీ సంవత్సరాన్ని తెలియజేస్తుంది. ఫిక్స్డ్ రేటు బాండ్లు కూడా వాటి కూపన్రేటుతోనే ట్రేడవుతాయి. ఫ్లోటింగ్ రేటు బాండ్లు ఎఫ్ఆర్బీ పేరుతో ఉంటాయి. టీబిల్లులు మెచ్యూరిటీ సంవత్సరంతో ఉంటాయి. ఉదాహరణకు 091 ఈఖీఆ17022022 అన్నది.. 91 రోజుల ట్రెజరీ బిల్లు.. 2022 ఫిబ్రవరి 17న మెచ్యూరిటీ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఎన్డీఎస్–వోఎం హోమ్పేజీలో ట్రేడింగ్కు అందుబాటులో ఉన్న అన్ని సెక్యూరిటీలు కనిపిస్తాయి. ఏ ధర వద్ద ప్రారంభమైంది, కనిష్ట, గరిష్ట ధరలు కూడా ఉంటాయి. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్.. ఆర్బీఐ వద్ద ప్రారంభించే ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా) ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. సెక్యూరిటీల కొనుగోళ్లకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) తదితర మార్గాల్లో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చు. ఇతరత్రా ఏవైనా సహాయం కావాలంటే పోర్టల్లో అన్ని వివరాలు ఉంటాయి. టోల్ ఫ్రీ టెలిఫోన్ నంబరు 1800–267–7955 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 7 గం. దాకా) కాల్ చేయడం లేదా, ఈమెయిల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్కీము కింద అందించే సదుపాయాలకు ఎటువంటి చార్జీలు ఉండవు. దేశీయంగా సేవింగ్స్ ఖాతా, పాన్, కేవైసీ కోసం అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రం, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్ మొబైల్ నంబరుతో రిటైల్ ఇన్వెస్టర్లు నమోదు చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన సెక్యూరిటీలు .. సెటిల్మెంట్ రోజున ఆర్డీజీ ఖాతాలోకి జమవుతాయి. కాలవ్యవధి బాండ్ నుంచి పొందే రాబడులపై కాలవ్యవధి ఎంతో ప్రభావం చూపిస్తుంది. 91 రోజుల టీబిల్లు లేదా 20ఏళ్ల జీసెక్లలో దేనిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి ఎలా వస్తారు? ఈ విషయంలో మీ ఆర్థిక లక్ష్యానికి ఎంత కాలం ఉందన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. మూడు నెలల్లో ఖర్చుల కోసం అయితే 91 రోజుల టీబిల్లు తీసుకోవాలి. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే అప్పుడు 20ఏళ్ల జీసెక్ను తీసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు మరో ప్రాధాన్య అంశం అవుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతుంటే, అప్పటికే మార్కెట్లో ఉన్న పాత బాండ్ల రేట్లు తగ్గిపోతాయి. ఎందుకంటే కొనుగోలుదారులు అధిక కూపన్ రేటును ఆఫర్ చేస్తున్న తాజా బాండ్ల వైపు మొగ్గు చూపిస్తారు. ఎంపిక చేసుకునే బాండ్ కాల వ్యవధి దీర్ఘకాలంతో ఉంటే కనుక రేట్ల పెరుగుదల సమయంలో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. స్టాక్ సూచీల మాదిరే బాండ్ల రేట్లు కూడా మారుతుండడం సహజం. గడిచిన 20ఏళ్లలో ఆర్బీఐ రెపోరేటు 4–8 శాతం మధ్య కదలాడింది. పదేళ్ల జీసెక్ 5.8–9.1 శాతం మధ్య ట్రేడ్ అయింది. మనం ఇప్పుడు కనిష్ట రేట్ల వద్ద ఉన్నాం. కనుక దీర్ఘకాలంతో కూడిన వాటితో పోలిస్తే స్వల్పకాల బాండ్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇక కాలవ్యవధిని పెంచుకుంటున్నామంటే రేట్ల పరంగా కొంచెం రిస్క్ తీసుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి. కనుక కొంచెం అదనపు రేటు కోసం దీర్ఘకాలం సెక్యూరిటీని ఎంపిక చేసుకోవడం కాకుండా.. మీ లక్ష్యానికి సరిపడే కాలవ్యవధిపై ఉన్న బాండ్కే పరిమితం కావడం మంచిది. సెక్యూరిటీ టీబిల్లు, జీసెక్లను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంటుంది. వీటి మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (ఎస్డీఎల్)పై రేటు సాధారణంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. కనుక వీటి ఎంపిక విషయమై తగిన అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ మార్గం అనుకూలం. లిక్విడిటీ ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ అన్నది.. షేర్లలో మాదిరి భారీగా ఉండదు. ముఖ్యంగా ఆడ్లాట్ విభాగంలో ఈ పరిస్థితి ఉంటుంది. కనుక ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకునే వారు కాలవ్యవధి వరకు వేచి ఉండేందుకు ముందుగానే సన్నద్ధం కావాలి. ఒకవేళ గడువుకు ముందే వాటిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. ఎన్డీఎస్–వోఎంలో ఆయా బాండ్కు సంబంధించి మొత్తం ఎన్ని ట్రేడయ్యాయి అన్నది చూసుకోవాలి. ఇటీవలే ఇష్యూ అయిన 10ఏళ్లు, 5ఏళ్లు, 3ఏళ్ల జీసెక్లలో ట్రేడ్ వ్యాల్యూమ్ 70–80 శాతంగా ఉంది. దీర్ఘకాల జీసెక్లతో పోలిస్తే టీబిల్లులు, ఎస్డీఎల్లలో వ్యాల్యూమ్ తక్కువగా ఉంటుంది. ఈ లిక్విడిటీ అన్నది పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటుంది. ఈ అంశాలకు ప్రాధాన్యం.. ప్రభుత్వ సెక్యూరిటీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు.. -
రుణానికి బ్యాంకు గ్యారంటీగా బీమా బాండ్లు!
ముంబై: బ్యాంకు గ్యారంటీలకు ప్రత్యామ్నాయంగా ఇన్సూరెన్స్ బాండ్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. ముంబైలో పారిశ్రామికవేత్తలతో ఆర్థిక మంత్రి భేటీ సందర్భంగా సోమనాథన్ ఈ ప్రకటన చేశారు. బ్యాంకుల వద్ద రుణ సాయాన్ని పొం దేందుకు పలు సందర్భాల్లో బ్యాంకు గ్యారంటీలు నమర్పించాల్సి వస్తుంది. ఈ గ్యారంటీ కింద బీమా బాండ్లను అనుమతిస్తే.. రుణాలు పొందడం మరింత సులభం కానుంది. చదవండి : 'నిధి' కంపెనీల పట్ల జాగ్రత్త, హెచ్చరించిన ప్రభుత్వం -
బుల్ మళ్లీ రంకెలేసింది..
ముంబై: భారత్ స్టాక్ మార్కెట్లో మళ్లీ బుల్ రంకెలేసింది. అంతర్జాతీయ మార్కెట్ల అండతో దేశీయ మార్కెట్... విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో దూసుకెళ్లింది. పెరుగుతున్న కరోనా కేసులు, ద్రవ్యోల్బణ ఆందోళనలు పరుగును ఆపలేకపోయాయి. అమెరికాలోని హెడ్జ్ ఫండ్ డిఫాల్ట్తో తడబడలేదు. ప్రపంచవ్యాప్తంగా పుంజుకుంటున్న బాండ్ ఈల్డ్స్ భయాలను బేఖాతరు చేసింది. కరిగిపోయిన రూపాయితోనూ కలవరపడలేదు. వెరసి రెండు వారాల గరిష్టస్థాయి వద్ద స్థిరపడింది. ఆర్థిక, ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 1,128 పాయింట్లు లాభపడి 50,137 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పెరిగి 14,845 వద్ద నిలిచింది. గడిచిన రెండు నెలల్లో ఇరు సూచీలకూ అత్యధిక లాభాలు ఇవే కావడం విశేషం. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండు నెలల కనిష్టానికి పతనం కావడంతో ఐటీ, ఫార్మా షేర్లకు కలిసొచ్చింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఏడాది స్థాయికి చేరుకోవడంతో మెటల్ షేర్లు మెరిశాయి. కిందటి వారంలో నష్టాలను చవిచూసిన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. అయితే రియల్టీ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 1260 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 369 పాయింట్లను ఆర్జించగలిగింది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో మూడు షేర్లు, నిఫ్టీ ఇండెక్స్లోని 50 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. ‘‘రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రారంభంతో పాటు కార్పొరేట్ కంపెనీ క్యూ4 ఫలితాల విడుదల నేపథ్యంలో రిటైల్ కొత్త ఇన్వెస్టర్లు, అధిక సంఖ్యలో కొనుగోళ్లను చేపట్టి ఉండొచ్చు. నిఫ్టీ చివరి ట్రేడింగ్ సెషన్లో కీలకమైన 14,500 మద్దతు స్థాయిని ఛేదించగలగడం కూడా సాంకేతికంగా కలిసొచ్చింది. ఇప్పటికీ మార్కెట్ అంతర్గతంగా బలహీనంగా ఉంది. ట్రేడర్లు అప్రమత్తత వహించాలి’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. ఆరంభం నుంచి దూకుడుగానే ... మూడురోజుల విరామం తర్వాత దేశీయ మార్కెట్ లాభాలతో మొదలైంది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు సూచీల గ్యాపప్ ప్రారంభానికి కారణమయ్యాయి. సెన్సెక్స్ 323 పాయింట్ల లాభంతో 49,331 వద్ద, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 14,628 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనసాగిన పర్వంతో సూచీలు దూసుకెళ్లాయి. మిడ్ సెషన్లో కాస్త వెనక్కి తగ్గినా.., యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,260 పాయింట్లు లాభపడి 50,268 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లను ఆర్జించి 14,876 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, బ్యాంకింగ్, ఇంధన షేర్లు జోరుతో సూచీలు ఈ స్థాయిలో లాభాలను మూటగట్టుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►ఎన్హెచ్ఏఐ నుంచి భారీ కాంట్రాక్టు దక్కించుకోవడంతో దిలీప్ బిల్డ్కాన్ 5% లాభంతో రూ.586 వద్ద ముగిసింది. ►బోనస్ ఇష్యూను పరిగణనలోకి తీసుకోవడంతో ఇక్రాన్ ఇంటర్నేషనల్ షేరు ఎనిమిది శాతం లాభంతో రూ.87 వద్ద స్థిరపడింది. ►అధిక వ్యాల్యూమ్స్తో ట్రేడైన యస్ బ్యాంక్ షేరు చివరికి 17% లాభంతో రూ.16 వద్ద స్థిరపడింది. -
ఖజానాకు మరో రూ. 1,500 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల నిమిత్తం సెక్యూరిటీ బాండ్ల వేలం కొనసాగుతోంది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వాన్ని ఆదుకున్న బాండ్ల వేలంలో భాగంగా మంగళవారం రూ. 1,500 కోట్లు ఆర్బీఐ వేలం ద్వారా సమకూరనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 11,407 కోట్ల విలువైన బాండ్లను వేలానికి పెట్టింది. ఇందులో సాధారణ వేలం కింద రూ. 1,500 కోట్లు, గ్రీన్ షూ ఆప్షన్ కింద మరో రూ. 500 కోట్లు సమీకరించుకొనే అవకాశం కల్పిస్తూ షెడ్యూల్ ఇచ్చింది. దీంతో బహిరంగ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరపతి కారణంగా ఈ మేరకు బాండ్ల వేలం ద్వారా నిధులు సమకూరనున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది రూ. 9,000 కోట్లను బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే పలు దఫాలుగా ఆ మేరకు నిధులు ప్రభుత్వానికి సమకూరాయి. తాజా అవసరాల నేపథ్యంలో ఈ నెల ఖర్చుల కోసం నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. చదవండి: (సంక్షేమానికి ఆధార్ అడగొచ్చు) -
అంత్యక్రియలకు అంతిమ పోరు..
ప్రొద్దుటూరు క్రైం: ‘కరోనాతో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది.. మనం పోరాటం చేయాల్సింది రోగితో కాదు వ్యాధితో.. వారిని వివక్షతతో చూడకండి’. ఎవ్వరికి ఫోన్ చేసినా ప్రస్తుతం మనకు వినిపించే మాటలు ఇవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవే సూచనలు చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తుల విషయంలో, వైరస్తో మృతి చెందిన వారి పట్ల ఎక్కడ చూసినా వివక్షత కనిపిస్తోంది. మనిషికి వైరస్ సోకిందని తెలియగానే అతను ఏదో చేయకూడని నేరం చేసినట్లు, సమాజానికి పనికి రాడన్నట్లుగా చూస్తున్నారు. కరోనా వైరస్ సోకి చనిపోయినవారి మృతదేహాలు అనాథ శవాలుగా మిగులుతున్నాయి. పుట్టి, పెరిగిన చోటే మట్టిలో కలసిపోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆశ ఉంటుంది. బంధువులు, అయిన వారి చేతుల మీదుగా తమ చివరి మజిలీ జరగాలని చాలా మంది కోరుకుంటారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ సోకి మృతి చెందితే అయ్యో పాపం అంటున్నారే గానీ మృతదేహాన్ని తమ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు కొందరు ససేమిరా అంటున్నారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. కరోనా వల్ల అనేక కుటుంబాలు సతమతం అవుతున్నాయి.. మన అనుకున్న బంధాలు కూడా దూరమవుతున్నాయి... అవగాహన లేక అపోహలు ఆవహించడమే ఇందుకు కారణం. ఏ కార్యం వెళ్లకపోయినా చివరి మజిలీలో మాత్రం కాటికి చేరిన వారికి కాస్త మట్టి ఇవ్వాలని అంటారు.. మరి ఈ కరోనాతో ఆ సంప్రదాయాలన్నీ మసిబారుతున్నాయి. చాపాడు మండలానికి చెందిన ఓ గర్భిణి అనారోగ్యంతో బాధపడుతూ కవలలకు జన్మనిచ్చి కడప రిమ్స్లో కన్నుమూసింది. ఈమెకు కూడా తర్వాత పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ పేద మహిళ మృతదేహం స్వగ్రామానికి తీసుకు రావడానికి అక్కడి వారు ఒప్పుకోలేదు. దీంతో అనాథ శవంగా కడప శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. ఐసీఎంఆర్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ►కరోనా సోకిన వ్యక్తులను అంత్యక్రియలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ కొన్ని నిబంధనలను సూచించింది. ►కోవిడ్తో మృతి చెందాడా లేదా అనేది ముందుగా నిర్ధారించుకోవాలి. ►ఆస్పత్రి వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే మృతదేహాన్ని ప్యాక్ చేయాలి. ముందుగా మృతదేహంపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేసి, పాలిథిన్ కవర్తో భద్రంగా ప్యాక్ చేయాలి. ►అంత్యక్రియలకు వెళ్లే ముందు బట్ట, లేదా తాడు సాయంతో మృతదేహాన్ని పాడె పైకి తరలించారు. ►పాడెను మోసుకొని వెళ్లేవారు మృతదేహాన్ని తాకకుండా చూసుకోవాలి ►20 మందికి మించి అంత్యక్రియల్లో పాల్గొనరాదు. వీళ్లు కూడా మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది సహకారంతో.. కడపలోని ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి దేవుని కడపలో నివాసం ఉంటోంది. కొన్ని రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో తోటి ఉద్యోగుల సూచన మేరకు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకోగా మలేరియా అని తేలింది. వ్యాధి తీవ్రం కావడంతో మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్కు తీసుకెళ్లారు. వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమెకు గుండె పోటు రాగా, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారి కొన్ని క్షణాల్లో మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె స్వస్థలమైన పాత కడపలోని శివారు ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించగా స్థానికులు అందుకు నిరాకరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇక్కడ దహన సంస్కారాలు చేయనివ్వమని చెప్పడంతో అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడింది. తర్వాత రెవెన్యూ, పోలీసు అధికారులు జోక్యంతో చివరకు ఆమె దహన సంస్కారాలు పూర్తి చేయగలిగారు. గ్రామస్తులు వద్దన్నారని.. ఆమె స్వగ్రామం చాపాడు మండలంలోని ఖాదర్పల్లె. భర్త, సోదరుడు కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్కు వెళ్లారు. లాక్డౌన్ నిబంధనల కారణంగా వారు సకాలంలో ఇండియాకు రాలేకపోయారు. గర్భిణిగా ఉన్న ఆమెను కాన్పు కోసం కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి రక్తస్రావం ఎక్కువగా జరగడంతో ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పారు. దీంతో ఆమెను గత నెల 4న కడపలోని రిమ్స్కు తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత సిజేరియన్ చేయగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో చేరేముందే ఆమెకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా తర్వాత వచ్చిన రిపోర్టులో పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామం నడి»ొడ్డున శ్మశానం ఉండటంతో అక్కడ అంత్యక్రియలు చేసేందుకు కొందరు గ్రామస్తులు అంగీకరించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులను కడపకు పిలిపించి చివరి చూపుగా కుమార్తె మృతదేహాన్ని చూపించారు. తర్వాత రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కడపలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఊరంతా బంధువులున్నా ఆమె చివరి చూపునకు నోచుకోలేదు. బంధువులు వద్దని చెప్పడంతో... ప్రొద్దుటూరులోని దస్తగిరిపేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడు అతను. వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ముందుగా అతని ఇద్దరు కుమారులకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స కోసం కడపలోని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్ కింద వారి తండ్రికి పరీక్షలు చేయగా రెండు రోజుల తర్వాత ఆయనకు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఉన్న అతన్ని కోవిడ్ ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాలని భావించగా బంధువులు వద్దని చెప్పారు. దీంతో అతనికి కడపలోనే అంత్యక్రియలు నిర్వహించారు. వైరస్ సోకుతుందని శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు.. కరోనా వైరస్ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. అయితే చనిపోయిన వారి నుంచి వైరస్ సోకుతుందనే దానికి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు ఏమీ లేవు. అలా సోకే అవకాశం కూడా తక్కువే. మృతదేహం నుంచి ఏమైనా స్రావాలు బయటికి వచ్చి, వాటిని ఇతరులు తాకితే మాత్రం వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాజుపాళెం మండలంలో ఇటీవల ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికంగానూ, చుట్టు పక్కల గ్రామాల్లో బంధువులు ఉన్నా వైరస్ భయంతో చూడటానికి ఎవరూ రాలేదు. దీంతో ఉన్న నలుగురే అతని మృతదేహాన్ని శ్మశానికి మోసుకొని వెళ్లారు. లాక్డౌన్ ప్రారంభంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. స్థానికంగా కేసులు ఎక్కువగా లేకున్నా చైనా, ఇటలీ దేశాల్లో వచ్చిన కరోనా కేసులను చూసి ఎక్కువగా భయాందోళనకు గురయ్యేవారు. ప్రొద్దుటూరు, కడపలో అనేక చోట్ల సాధారణ మరణాలు సంభవించాయి. అయితే చాలా ప్రాంతాల్లో అయిన వాళ్లు రాకుండానే అంత్యక్రియలు చేశారు. అడ్డుకోవడం సరికాదు కరోనా అనుమానాలతో చనిపోయిన వారి భౌతికకాయాలను ఆయా గ్రామాల శ్మశాన వాటికలలో పూడ్చడం లేదా కాల్చడాన్ని అడ్డుకోకూడదు. అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవు. డబ్లు్యహెచ్ఓ ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ మృతులను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి దానిని కాల్చడం లేదా పూడ్చడం చేయాలి. ఈ రెండింటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పూడ్చేటట్లయితే లోతుగా గుంత తీసి పూడ్చాలి. పాజిటివ్ కేసుల మృతదేహాలపై పడి ఏడ్వడం, తాకడం చేయకూడదు. తగిన దూరంలో ఉంటే వైరస్ స్ప్రెడ్ అవ్వదు. అపోహలు, అవగాహన రాహిత్యంతో అడ్డుకోవడంలాంటి చర్యలకు పాల్పడరాదు. – సి.హరికిరణ్, కలెక్టర్ మానవతా దృక్పథంతో ఆలోచించాలి కరోనా వైరస్తో లేదా ఇతర కారణాలతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు అడ్డుపడటం మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఏవైనా అపోహలు పోలీసులు, రెవెన్యూ అధికారులను సంప్రదించి తెలుసుకోవాలి. ఇష్టానుసారం మృతదేహాలను అడ్డుకుంటామంటే కుదరదు. శ్మశాన వాటికల్లోకి రాకుండా అడ్డు కోవాలనిచూస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, కడప -
షేర్లు.. బంగారం.. బాండ్లు.. ఏది బెటర్??
కరోనా కారణంగా ఎకానమీలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈక్విటీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకొని నగదు దగ్గరపెట్టుకొనేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కొందరేమో బంగారంలో, కొందరు బాండ్లలో పెట్టుబడులకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ క్రెడిట్ సూసీ ఈ మూడు పెట్టుబడి సాధనాలపై తన అభిప్రాయాలను ఇలా వెల్లడించింది. 1. ఈక్విటీలు: రాబోయే నెలల్లో ఆటుపోట్లు సహజంగానే ఉంటాయి. అయితే ఇందులో భిన్న రంగాల తీరు భిన్నంగా ఉండొచ్చు. ఉదాహరణకు ఫార్మా రంగం మంచి పురోగతి చూపవచ్చు. ఇదే తరహాలో ఐటీ, టెలికం షేర్లు కూడా పాజిటివ్గానే ఉండే ఛాన్సులున్నాయి. స్వల్పకాలానికి ఫైనాన్షియల్స్ బలహీనంగా ఉండొచ్చు. కానీ దీర్ఘకాలానికి మంచి రాబడినిస్తాయి. 2. బాండ్స్: ఆర్బీఐ మరింత వేగంగా లిక్విడిటీ పెంచే చర్యలు ప్రకటించవచ్చు. అందువల్ల బాండ్స్లో ‘‘ ఏఏ ’’ అంతకుమించిన రేటింగ్ ఉన్న బాండ్స్ను 3-5 ఏళ్ల కాలపరిమితితో పరిశీలించవచ్చు. రూపీ విలువ పెద్ద మార్పులు లేకుండా 74-76 మధ్యనే కదలాడవచ్చు. 3. బంగారం: వరుసగా ఐదో నెల కూడా ఈటీఎఫ్ హోల్డింగ్స్ పెరిగాయి. సమీప భవిష్యత్లో రేటు తగ్గే ఛాన్సులు లేవు. అందువల్ల రాబోయే ఏడాదిలో అంతర్జాతీయంగా బంగారం 1800 డాలర్లను చేరవచ్చు. -
విదేశీ పెట్టుబడులకు చర్యలు: శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ సత్వర చర్యలను పూనుకుంటోంది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందకు కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా విదేశీ మదుపర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ బాండ్లను అంతర్జాతీయ సూచీలో ప్రవేశపెట్టడానికి చర్చలు కొనసాగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అంతర్జాతీయ సూచీలో విదేశీ నిధులు తప్పనిసరి కావడంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ఈ చర్యల వల్ల విదేశీ నిధులు దేశంలోకి ప్రవేశించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అంతర్జాతీయ సూచీలో అత్యధిక విదేశీ నిధులు పొందుతున్న దేశాల నిపుణులతో చర్చిస్తున్నామని, దేశీయ ప్రభుత్వ బాండ్ల ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. ఆర్థిక వ్యవస్థను బలపరిచే క్రమంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)లో నిధులు ప్రవాహాన్ని విశ్లేషిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న విదేశీ పెట్టుబడుదారుల సలహాను ఈ ఏడాది బడ్జెట్లో ప్రస్తావించినట్టు శక్తికాంత దాస్ గుర్తు చేశారు. ఈ పనిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బ్యాంకింగ్ రంగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. మ్యూచువల్ ఫండ్స్లో రుణ వృద్ధి లేకపోవడం వల్ల బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని, వీటన్నింటికి పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్హెచ్బీ)ను ప్రారంభించిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. చదవండి: త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్ -
ఎలక్టోరల్ బాండ్స్.. గోప్యతా? పారదర్శకతా?
కేంద్ర ప్రభుత్వం గత యేడాది జనవరిలో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇందులో పారదర్శకత లోపించిందంటూ విమర్శలొస్తున్నాయి. దీన్ని నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. బాండ్ల ద్వారా అందిన మొత్తం, దాతల బ్యాంకు అకౌంట్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందచేయాల్సిందిగా రాజకీయ పార్టీలను ఆదేశించింది. అసలీ పథకం లక్ష్యమేమిటి? దీనిపై వ్యతిరేకతకు కారణాలేమిటి? బాండ్ అంటే రుణ రూపంలోని పెట్టుబడి. ఎవరైనా బాండ్ను కొనుగోలు చేస్తున్నారంటే ప్రభుత్వానికో, మున్సిపాలిటీకో లేదా కార్పొరేషన్కో అప్పు ఇస్తున్నారన్న మాట. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం 2017 ఫైనాన్స్ చట్టం ద్వారా ఎలక్టోరల్ బాండ్ పథకానికి శ్రీకారం చుట్టింది. 2018 జనవరి 2న దీన్ని నోటిఫై చేసింది. ఎన్నికల వ్యయ ప్రక్షాళన కోసమే దీన్ని తీసుకొచ్చినట్టు వివరించింది. ఈ బాండు ప్రామిసరీ నోటు తరహాలో ఉంటుందని ప్రకటించింది. అధీకృత బ్యాంకు నుంచి వీటిని పొందాల్సి ఉంటుంది (ఎస్బీఐ బ్యాంకు శాఖల నుంచి మాత్రమే బాండ్లు కొనుగోలు చేయాలని కేంద్రం ప్రకటించింది). దేశ పౌరులు కానీ లేదా దేశంలో నమోదైన సంస్థలు గానీ వీటిని కొనుగోలు చేయవచ్చు. పదిహేను రోజుల్లోగా వీటిని నగదుగా మార్చుకోవచ్చు. దాతల వివరాలను గోప్యంగా ఉంచుతారు. రాజకీయ పార్టీలకు నగదును విరాళంగా ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ బాండ్ల జారీ విషయంలో.. పార్టీలకు–దాతలకు మధ్య ఆర్బీఐ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ప్రపంచంలోని ఏ పక్క ప్రజాస్వామ్య దేశంలోనూ ఇలాంటి పద్ధతిలో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే విధానం లేదని నిపుణులు చెబుతున్నారు. దాతలెవరో..! విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే, వీటిని నగదుగా మార్చుకున్న పార్టీలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు గత యేడాది మార్చిలో 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. ఎన్నికల బాండ్ల ద్వారా పొందే రూ.2 వేలు పైబడిన మొత్తాల వివరాలను ఎన్నికల కమిషన్కు తెలియజేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి త్రైమాసికంలోనూ తొలి నెలలో (జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్) వీటి కొనుగోలుకు పది రోజుల గడువు మాత్రమే వుంటుంది. లక్ష, పది లక్షలు, ఒక కోటి సహా ఎంత మొత్తాలకైనా బాండ్లు కొనుగోలు చేయవచ్చు. బాండ్పై దాత పేరు ఉండదు. బాండ్ల ద్వారా ఎంత మొత్తం అందుకున్నామనే విషయాన్ని వెల్లడిస్తూ ఈసీకి రాజకీయ పార్టీలు రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. కోర్టులో ఎందుకు సవాల్ చేశారు? ఎలక్టోరల్ బాండ్ల పథకం కోసం– ఫైనాన్స్ యాక్ట్ 2016, 2017 ద్వారా బీజేపీ ప్రభుత్వం కంపెనీల చట్టం, ఆదాయ పన్ను చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, విదేశీ విరాళాల నియంత్రణల చట్టానికి పలు సవరణలు చేసింది. దీంతో ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మాజీ సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గత అక్టోబరులో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బాండ్ల వ్యవహారంపై 2018 ఫిబ్రవరిలో సీపీఎం మొదటæ కోర్టుకెక్కింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం బాండ్ల జారీని నిలిపివేయాలని, దాతల వివరాలు వెల్లడించాలని కోరుతూ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) అనే ప్రభుత్వేతర సంస్థ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాతల పేర్లను గోప్యంగా ఉంచేందుకు ఉద్దేశించిన క్లాజు భారత ప్రజాస్వామ్యానికి మరింత ప్రమాదకారిగా పరిణమించగలదని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. ఒక రాజకీయ పార్టీకి ఎవరెంత విరాళంగా అందచేస్తున్నారనే విషయం సామాన్య పౌరులు తెలుసుకునేందుకు ఈ పథకం విధివిధానాలు వీలు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘గోప్యత’ ఎందుకు? దాతల వివరాలను వెల్లడించడం వల్ల గోప్యత హక్కుకు గండికొట్టినట్టవుతుందనేది కేంద్రం వాదన. వారి పేర్లను గోప్యంగా ఉంచడమనేది, రహస్య బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవడమనే ప్రక్రియకు కొనసాగింపేనని వ్యాఖ్యానిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ వాదనను కొట్టిపారేస్తున్న వారు– ‘గోప్యత’ నల్లధనాన్ని చలామణిలోకి తీసుకురావడానికే దారి తీస్తుందంటున్నారు. రాజకీయ పార్టీలకు డబ్బులిచ్చే బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు కాపాడాలనే ఆలోచన కూడా దీని వెనుక ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేసినట్టవుతుందన్న కేంద్ర వాదనతో ఈసీ విభేదిస్తోంది. చట్టానికి చేసిన మార్పులు ఆందోళనకర పరిణామాలకు దారి తీయగలవని కూడా హెచ్చరిస్తోంది. -
సెన్సెక్స్ తక్షణ నిరోధశ్రేణి 39,120–39,270
వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కారణంగా వారం రోజుల క్రితమే సెన్సెక్స్ కొత్త రికార్డును నెలకొల్పగా, గతవారం నిఫ్టీ కూడా అదే ఫీట్ను సాధించింది. కేవలం నెలరోజుల్లో భారత్ సూచీలు 10 శాతం ర్యాలీ జరపడం విశేషం. ఈ ట్రెండ్ భారత్కే పరిమితం కాలేదు. దాదాపు ఇదేస్థాయిలో అమెరికా, జర్మనీ సూచీలు సైతం పెరిగాయి. ఆసియాలో హాంకాంగ్, చైనా ఇండెక్స్లు కూడా 5 శాతంపైగానే జంప్చేశాయి. అమెరికా కేంద్రబ్యాంక్ ఫెడరల్ రిజర్వ్...వడ్డీ రేట్లపెంపునకు, బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమానికి స్వస్తిచెప్పడం... ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల ర్యాలీకి కారణం కావొచ్చు. కానీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ త్వరలో ప్రారంభం కానుండడం, కార్పొరేట్ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండడం వంటి అంశాల నేపథ్యంలో భారత మార్కెట్ మరింత ముందుకు వెళ్లగలుగుతుందా లేదా అన్న సంశయం ప్రస్తుతం విశ్లేషకుల్లో నెలకొని ఉంది. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... ఏప్రిల్ 5తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 39,270 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నమోదుచేసిన అనంతరం చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 190 పాయింట్లు పెరిగి 38,862 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే తొలుత 39,120–39,270 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 39,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే క్రమేపీ 39,850 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే 38,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 38,580 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 38,150 పాయింట్ల వరకు తగ్గొచ్చు. నిఫ్టీ అవరోధశ్రేణి 11,730–11,760 ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,761 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఆ స్థాయి వద్ద జరిగిన భారీ లాభాల స్వీకరణ కారణంగా 11,559 పాయింట్ల స్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 11,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ అప్ట్రెండ్ కొనసాగితే తొలుత 11,730–760 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. డబుల్టాప్గా పరిణమించిన ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆ సందర్బంలో వేగంగా 11,810 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే క్రమేపీ 11,890 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధశ్రేణిని దాటలేకపోతే 11,610 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 11,560 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో వదులుకుంటే 11,450 పాయింట్ల వరకు క్షీణించొచ్చు. -
ఎలక్టోరల్ బాండ్లపై కేంద్రం సమర్థన
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పారదర్శకత, జవాబుదారీతనం సాధించేందుకు తాము తీసుకుని వచ్చిన సంస్కరణల్లో ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశపెట్టడం కీలక ముందడుగని కేంద్రం తెలిపింది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలను వ్యతిరేకించింది. పాత విధానంలో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో అధిక భాగం అక్రమ మార్గాల్లో పోగైందేననీ, అదంతా లెక్కచూపని నల్లధనమని గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లను జారీ చేస్తూ కేంద్రం తీసుకున్న చర్యల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై ఈ నెల 5వ తేదీన మరో ధర్మాసనం వాదనలు వింటుందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. -
1 నుంచి ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలకు రంగం సిద్ధమైంది. 2019, జనవరి 1 నుంచి 10 వరకూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ బాండ్లను జారీచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, గాంధీనగర్, పట్నా, చండీగఢ్, బెంగళూరు, భోపాల్, ముంబై, జైపూర్, లక్నో, చెన్నై, కోల్కతా, గువాహటి నగరాల్లోని 29 ఎస్బీఐ శాఖల్లో ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గత నవంబర్నాటికి 6విడతల్లో రూ.1,056.73 కోట్ల విలువైన బాండ్లను ప్రజలు కొనుగోలు చేశారంది. -
బంగారం కంటే ‘బాండ్లే’ బెటర్!
బంగారం!! భారతీయ సంస్కృతి దీని చుట్టూ ఎంతలా అల్లుకుపోయిందో మాటల్లో చెప్పటం కష్టం. పిల్ల పెళ్లికోసం తను పుట్టినప్పటి నుంచే బంగారాన్ని కొనుగోలు చేసి కూడబెట్టడం మనకు కొత్తేమీ కాదు. అలాగే పెళ్లయినా, మరో కార్యక్రమమయినా బంగారాన్ని ధరించటమంటే స్టేటస్ సింబల్. ఎన్ని ఇబ్బందులొచ్చినా కొందరు ఇంట్లో ఉన్న బంగారం జోలికెళ్లరు. కొందరైతే బంగారాన్ని అవసరం కోసం వాడటం... మళ్లీ కొనటం చేస్తూనే ఉంటారు. ఇంతలా అల్లుకుపోయిన బంగారం... రాబడుల పరంగా ఈ మధ్య వన్నె తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయంగా ధర పెరిగినా... ఇక్కడ రూపాయి అంతకన్నా ఎక్కువ పతనం కావటం ఒక కారణం. ఇక సాంకేతికాంశాలు, దానికున్న ప్రాధాన్యం దృష్ట్యా ఒక దశకు చేరాక మళ్లీ పతనం కావటం... మళ్లీ పెరగటం జరుగుతోంది. కాకపోతే ఈక్విటీ మార్కెట్లు ప్రతికూల ఫలితాలను కూడా ఇస్తున్నాయి. అంటే... మన పెట్టుబడి సైతం దారుణంగా కరిగిపోతున్న సందర్భాన్ని ఈ ఏడాది చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బంగారమన్నది సురక్షితమైన పెట్టుబడి సాధనమే. కాకుంటే పండగల సీజన్ కూడా వస్తున్న నేపథ్యంలో ఇలా బంగారం కొనదలచిన వారు.. భౌతిక బంగారం కాకుండా కేంద్రం అందిస్తున్న సావరిన్ గోల్డ్ బాండ్లను కొనొచ్చంటున్నారు నిపుణులు. దీనికోసం వారు చెబుతున్న కారణాలేంటో ఒకసారి చూద్దాం... నిజం చెప్పాలంటే బంగారాన్ని భౌతికంగా కన్నా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుకోవడం మెరుగైన ఆప్షన్. ఇలా చేయాలనుకున్న వారు... గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అందించే గోల్డ్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) వంటి ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అయితే, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్ ఈ రెండూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అందించేవే. కనుక వీటి కొనుగోలుకు చార్జీలు చెల్లించాలి. కనీసం 0.6% నుంచి 1.2% మధ్యలో చార్జీలు, ఎక్స్పెన్స్ రేషియో రూపంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మూడింట్లో సార్వభౌమ బాండ్లు మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. వీటికి ఎలాంటి చార్జీలు లేవు. సరికదా ఏటా వడ్డీ రూపంలో కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. సార్వభౌమ బంగారం బాండ్లు అంటే? వీటిని కేంద్రం తొలిసారి 2015లో ప్రారంభించింది. బంగారంలో పెట్టుబడులను ఎలక్ట్రానిక్ రూపంలోకి మళ్లించడం ద్వారా, దిగుమతుల భారాన్ని తగ్గించడం దీని లక్ష్యం. ఆర్బీఐ ద్వారా ఆఫర్ చేస్తోంది. తరచూ వీటిని జారీ చేస్తున్న కేంద్రం... తాజా బంగారం ధర ఆధారంగా వీటి రేటును నిర్ణయిస్తోంది. ఈ మధ్య కూడా జారీ చేసింది. ఒక గ్రాము చొప్పున విక్రయమయ్యే ఈ బాండ్లను బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనొచ్చు. దీని ఇన్వెస్టర్లు కేవైసీ నిబంధనలను పాటించాలి. ఇవి డీమ్యాట్ రూపంలో ఉంటాయి. రాబడులిలా ఉంటాయి... దేశీయ బంగారం ధరలకు అనుగుణంగానే బంగారం బాండ్ల ధర కూడా ఉంటుంది. పెట్టుబడులను వెనక్కి తీసుకునేటపుడు అంతకు మూడు రోజుల కిందట సగటు బంగారం (999 స్వచ్ఛత కలిగినది) ధర ఆధారంగా చెల్లిస్తారు. ఇండియన్ బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ ఈ ధరల్ని ప్రకటిస్తుంది. ఈ బాండ్ల విలువపై ఏటా 2.5 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. ఈ వడ్డీ ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతాకు ఆరు నెలలకోసారి జమవుతుంది. కనీస పెట్టుబడి ఒక గ్రాము. ఒక్కో వ్యక్తి సొంతంగా 4 కిలోల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో బాండ్లు కొనుగోలు చేయొచ్చు. ట్రస్ట్లు, ఇతర సంస్థలకు ఈ పరిమితి 20 కిలోలు. ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రతీ గ్రాముపై ఆర్బీఐ రూ.50 తగ్గింపునిస్తోంది. బంగారం బాండ్ల ధర పెరగడం, తగ్గడం అన్నది మార్కెట్తోనే ముడిపడి ఉంటుంది. బంగారం ధరలు తగ్గినప్పుడు వడ్డీ ఆదాయం రూపంలో కొంత మేర పెట్టుబడి విలువకు రక్షణ ఉంటుంది. బంగారం మాదిరే బంగారం బాండ్లను కూడా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వద్ద హామీగా ఉంచి రుణాలను పొందొచ్చు. ఉపసంహరణ, పన్ను సార్వభౌమ బంగారం బాండ్ల కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఒకవేళ ఏదైనా అత్యవసరం ఏర్పడి డబ్బులు అవసరమైతే... ఈ బాండ్లను జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత ముందుగానే వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. అయితే వడ్డీ చెల్లించడానికి కనీసం ఒక రోజు ముందు బ్యాంకు లేదా పోస్టాఫీసులో రెడీమ్ గురించి తెలియజేయాల్సి ఉంటుంది. డీమ్యాట్ రూపంలో కలిగి ఉంటే, స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లోనూ ట్రేడ్ అవుతాయి. బంగారం బాండ్లపై చేసే వడ్డీ చెల్లింపులు పన్ను ఆదాయం కిందకే వస్తాయి. పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఆదాయం శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, బంగారం పెట్టుబడిపై వచ్చిన మూలధన లాభానికి పన్ను లేదు. -
15 నుంచి గోల్డ్ బాండ్స్ స్కీమ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సార్వభౌమ పసిడి బాండ్ల పథకం అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. అక్టోబర్ 19 దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. 23న బాండ్ల జారీ ఉంటుంది. ఫిబ్రవరి దాకా మొత్తం అయిదు విడతల్లో బాండ్ల జారీ ఉండనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. తదుపరి విడతల తేదీలు నవంబర్ 5–19 (నవంబర్ 13న జారీ), డిసెంబర్ 24–28 (జారీ జనవరి 1), జనవరి 14–18 (జారీ జనవరి 22), ఫిబ్రవరి 4–8 (జారీ ఫిబ్రవరి 12)గా ఉంటాయని వివరించింది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్సే్చంజీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. మరోవైపు, వడ్డీ రేట్లు తగ్గినప్పుడల్లా రుణగ్రహీతలకు ఆ ప్రయోజనాలను బదలాయించడంలో బ్యాంకులు జాప్యం చేస్తుండటంపై అభిప్రా యాన్ని ఆరు వారాల్లోగా తెలియజేయాల్సిందిగా ఆర్బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. -
బాండ్లతో జనానికి బ్యాండ్
‘‘చూశారా! ఎంత స్పందనో? అమరావతి బ్రాండ్ ఇమేజ్ను, చంద్రబాబు నాయకత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పోటీలు పడ్డారు. అందుకే అరగంటలోనే మేం కావాలనుకున్న మొత్తం కంటే ఎక్కువ పెట్టుబడులొచ్చాయి?’’ రూ.2,000 కోట్ల విలువైన అమరావతి బాండ్లను లిస్ట్ చేసినప్పుడు ఏపీ ప్రభుత్వం చెప్పిన మాటలివి. సరే! బాబు నాయకత్వాన్ని, అమరావతి ఇమేజ్ని చూసి పెట్టుబడులు పెట్టినపుడు మీరు అరేంజర్కు (రన్నింగ్ లీడ్ మేనేజర్) 0.9 శాతం.. అంటే రూ.18 కోట్లు ఎందుకిచ్చారు? జీహెచ్ఎంసీ వంటి సంస్థలు తమ బాండ్ల అరేంజర్కు ఫీజుగా 0.10 శాతమే ఇచ్చాయి కదా? మీరు కూడా అలా చేస్తే ఓ 2 కోట్లతో పోయేది కదా?... ఈ ప్రశ్న అడిగిన వారికి బాబు ఇచ్చే సమాధానమేంటో తెలుసా? ‘‘ఈ బాండ్లలో రిస్కు ఎక్కువ. అందుకే అంత ఫీజు చెల్లించాల్సి వచ్చింది’’ అని. అంటే తమ నాయకత్వాన్ని చూసి ఇన్వెస్టర్లు ఎగబడి వచ్చేశారని చెప్పేదీ వారే! రిస్కుంది కాబట్టి ఇన్వెస్టర్లు రారేమోనని భయపడి ఎక్కువ ఫీజులు చెల్లించామని చెప్పేదీ వారే!! ఈ రెండు పొంతన లేని సమాధానాలను పక్కనబెడితే అసలు ప్రశ్న ఒకటుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే బాండ్లకు రిస్కుంటుందా? ఉంటే ఆ ప్రభుత్వం పనికిరాని డిఫాల్టరనేగా అర్థం? మరి అలాంటప్పుడు నాయ కత్వం గురించి బోడి గొప్పలెందుకు? అసలు వీళ్ల చర్యల్లోని మతలబులేంటి? తెరవెనుక ఏం జరిగింది? ‘సాక్షి’ పరిశోధనలో వెల్లడైన నిజాలు సాక్షి, అమరావతి: అమరావతి కథల్లాగే... ఈ బాండ్ల కథలూ అన్నీ ఇన్నీ కావు. ఇంతా చేస్తే ఈ బాండ్లలో ఏకంగా 95 శాతాన్ని కొన్నది ముగ్గురు ఇన్వెస్టర్లే! అందులో ఒక్క ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థే ఏకంగా రూ.1,300 కోట్లు పెట్టి 62.5 శాతాన్ని కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నంలోని మధురవాడలో రూ.400 కోట్ల విలువైన 40 ఎకరాలను ఎకరా రూ.32 లక్షలకే కట్టబెట్టింది. పైపెచ్చు మిగతా సంస్థలన్నిటికీ భూములను 33 ఏళ్ల లీజుకిస్తూ... ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు మాత్రం ఏకమొత్తంగా విక్రయించేసింది. అది చాలదన్నట్లు మిగతా వారెవ్వరూ ఇవ్వనంత వడ్డీని ఆఫర్ చేస్తూ ప్రభుత్వ బాండ్లనూ జారీ చేసింది. నిజానికి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం 10 ఎకరాలకు మించి లేదు. దీనికి ప్రపంచవ్యాప్తంగా 9,400 మంది ఉద్యోగులుండగా, సింహభాగం అమెరికాలోనే ఉన్నారు.అలాంటిది అక్కడే పదెకరాల్లో విస్తరించిన ఆ సంస్థకు... విశాఖపట్నంలో 2,500 ఉద్యోగాలిస్తామని చెప్పేసరికి ఏకంగా 40 ఎకరాలు కారుచౌకగా కట్టబెట్టేయడం గమనార్హం. విశాఖలో పదెకరాలకు మించి భూమి కేటాయించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ చేసిన సూచనలను బాబు ప్రభుత్వం పక్కనబెట్టేసింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు ప్రస్తుతం ఇండియా మొత్తమ్మీద 600 మంది మాత్రమే ఉద్యోగులున్నారు. అలాంటి ఒక్క విశాఖలో 2,500 ఉద్యోగాలివ్వడానికి ఎన్నాళ్లు పడుతుందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు.వడ్డీ రేట్ల విషయానికొస్తే అమెరికాలో 4 శాతం మించి లేవు. ఇండియాలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఇన్వెస్ట్ చేసిన బాండ్లపై 7–9 శాతానికి మించి వడ్డీ రావడం లేదు. అలాంటిది బాబు ప్రభుత్వం మూడు నెలలకోసారి 10.32 శాతం చెల్లించేలా బాండ్లను జారీ చేసింది. వార్షికంగా చూస్తే ఈ వడ్డీ ఏకంగా 10.78 శాతం కావడం గమనార్హం. ఇలా అత్యధిక వడ్డీనిచ్చే బాండ్లను, కారుచౌకగా భూములను ఆ కంపెనీకే ఎందుకిచ్చారనేది ఊహలకు అందనిదేమీ కాదు. సలహాదారు నుంచి ఇన్వెస్టరుగా... అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టిన మరో సంస్థ ఏకే క్యాపిటల్. మొదట బాండ్ల ఇష్యూకు సలహాదారుగా వ్యవహరించిన ఈ సంస్థ... తరవాత లీడ్ మేనేజర్గా(అరేంజర్) రూపాంతరం చెందింది. అంటే బాండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లను తీసుకొచ్చే పని దీనిదన్న మాట. చివరకు ఈ సంస్థ కూడా ఇన్వెస్టరుగా మారిపోయి ఏకంగా 25 శాతం... అంటే రూ.250 కోట్ల మేర పెట్టుబడి పెట్టడం గమనార్హం. ప్రభుత్వం జారీ చేసే బాండ్లలో అరేంజర్గా ఉన్న సంస్థ పెట్టుబడి పెట్టకూడదన్నది సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నిబంధన. కానీ.. ఏకే క్యాపిటల్ దీన్ని తుంగలో తొక్కిందని, దీనిపై సెబీకి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అందుబాటులో ఉన్నా... నిజానికి అరేంజర్ల పాత్ర తగ్గించడానికి, బాండ్లు జారీ చేసే సంస్థలకు ఖర్చులు తగ్గడానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ‘సెబీ’ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. రూ.200 కోట్లకు పైబడి బాండ్లు జారీ చేసే సంస్థలన్నీ ఈ ప్లాట్ఫామ్ను ఆశ్రయించవచ్చు. అరేంజర్ ప్రమేయం లేకుండా నేరుగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. చిన్న, అనామక సంస్థలకు ఇబ్బందిగా ఉన్నా... పేరున్న సంస్థలకిది బాగా కలిసి వస్తోంది. మరి తన బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రపంచమంతా డప్పు కొట్టే చంద్రబాబు అనామకుడు కాదు కదా! మామూలు కంపెనీలకంటే ఏపీ ప్రభుత్వం మెరుగైనదే కదా? పైగా అందరికంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టి వస్తారు. కానీ, తెలిసిన సంస్థను అరేంజర్గా ఎంచుకుని, దానికి భారీ ఫీజులిచ్చి... కావాల్సిన వారు మాత్రమే పెట్టుబడులు పెట్టేలా చేయటం వెనక బాబు పన్నిన కుట్రను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అబద్ధాలతో అక్రమాలను కప్పెట్టేయత్నం అమరావతి బాండ్లను పారదర్శకంగా జారీ చేస్తున్నామని, పబ్లిక్ ఇష్యూ తర్వాత ఈ వివరాలు స్టాక్ ఎక్ఛేంజీలో లభిస్తాయని ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో వీసమెత్తు వాస్తవం లేదు. బాండ్లను పబ్లిక్ ఇష్యూగా కాకుండా ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో జారీ చేశారు. దీంతో ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారి వివరాలు సాధారణ ప్రజలకు తెలియవు. ఇన్వెస్టర్ల వివరాలు చెప్పాలని ఒత్తిడి రావడంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం బోర్డు వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు మాట్లాడుతూ.. 59 మంది పెట్టుబడి పెట్టారంటూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బిర్లా, ఏకే క్యాపిటల్ గ్రూపుల పేర్లు మాత్రమే వెల్లడించారు. నిజానికి ఈ మూడు సంస్థలే వివిధ పథకాల పేర్లతో 95 శాతం పెట్టుబడి పెటినట్లు ‘సాక్షి’ పరిశోధనలో వెల్లడైంది. జీవోనూ ఉల్లంఘించారు ‘హడ్కో’ లాంటి సంస్థల నుంచి రుణాలు తీసుకుంటే వడ్డీరేటు 8 శాతం లోపు, అదే ఇన్ఫ్రా బాండ్ హోదా అయితే వడ్డీరేటు 6 శాతంలోపు ఉంటేనే ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వ జీవోలో స్పష్టం చేశారు. అదే బాండ్ల రూపంలో నిధులు సేకరిస్తే వడ్డీరేటు వాణిజ్య బ్యాంకుల టర్మ్ రుణాల కంటే తక్కువ ఉంటేనే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. ప్రస్తుతం ఎస్బీఐ బేస్రేట్ 8.95 శాతం. కానీ, 10.32 శాతానికి అమరావతి బాండ్లను జారీ చేస్తూ కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం జీవో నిబంధనలకు విరుద్ధమని సాక్షాత్తూ ఆర్థిక శాఖ అధికారులే చెబుతున్నారు. దీని మర్మమేంటి బాబూ! అమరావతి బాండ్లలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన సంస్థలు 12.5 శాతం పెట్టుబడి పెట్టాయి. సాధారణంగా ఆదిత్య బిర్లా గ్రూపు పెట్టుబడులను అనుమానించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకే డైరెక్టర్ అటు ఏకే క్యాపిట్లో, ఇటు ఆదిత్య బిర్లా గ్రూపులో ఉండటంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏకే క్యాపిటల్లో డైరెక్టర్గా ఉన్న సుభాష్చంద్ర భార్గవ.. ఏబీ నువో, ఏబీ క్యాపిటల్, ఏబీ సన్లైఫ్ పెన్షన్, ఏబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏబీ మై యూనివర్స్ లిమిటెడ్లో కూడా డైరెక్టర్. ఈ డైరెక్టర్కు, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పలువురు స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు. వీటిని పరిశీలిస్తే బాండ్ల జారీకి సలహాదారుగా ఏకే క్యాపిటల్ సంస్థను తెరపైకి తీసుకురావడం దగ్గర్నుంచి చివరి వరకూ అంతా బాబు కనుసన్నల్లోనే, అనుకున్నట్టే జరిగినట్లు తెలుస్తోంది. అంత భారీ ఫీజు ఎందుకు? అరేంజర్గా వ్యవహరించే సంస్థకు చిన్న ఇష్యూల్లో అయితే కాస్త ఎక్కువగా... పెద్ద ఇష్యూల్లో కొంచెం ఎక్కువగా చెల్లిస్తారు. ఉదాహరణకు ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) రూ.200 కోట్ల మేర బాండ్లు జారీ చేసింది. చిన్న ఇష్యూ కనుక ఫీజు ఎక్కువుండాలి. అయితే ఫీజు కింద జీహెచ్ఎంసీ రూ.20 లక్షలు అంటే 0.10 శాతం చెల్లించింది. అమరావతి బాండ్ల సైజు రూ.2,000 కోట్లు.కాబట్టి ఇది ఇంకా తక్కువుండాలి. పోనీ 0.10 శాతం అనుకున్నా రూ.2 కోట్లు మాత్రమే చెల్లించాలి. కానీ బాబు సర్కారు ఏకే క్యాపిటల్కు ఏకంగా 0.9 శాతం... అంటే రూ.18 కోట్లు చెల్లించింది. గతంలో స్టాక్ బ్రోకర్గా పనిచేసి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తికి ఏకే క్యాపిటల్తో ఉన్న సంబంధాల గురించి పలువురు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ తాజా చర్యలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. -
ప్లీజ్.. నా బిడ్డ పేరు అడగండి
ప్రతివారి జీవితంలోను ఒక్కో బంధం ఏర్పడిన ప్పుడు ఒక్కో ‘హోదా’ వస్తుంది. పెళ్లి కాగానే భార్యాభర్తలు, పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు, మనుమలు జన్మించగానే అమ్మమ్మతాతయ్యలుగా పిలుస్తుంటారు. ఈ బంధాలు ప్రపంచంలో వారి వారి భాషలలో ఉన్నాయి. మరి బిడ్డ జన్మించగానే తల్లిదండ్రులుగా పిలువబడే వారిని, పుట్టిన బిడ్డ పసికందుగానే మర ణిస్తే, ఏమని పిలవాలి. మాజీ తల్లిదండ్రులనా, భార్యాభర్తలనా... ఏమని? ఇదే ప్రశ్న వేస్తున్నారు ఎల్ రైట్ అనే మహిళ. ఆమెకు పుట్టిన కుమారుడికి టెడ్డీ అని ముద్దుగా పేరు పెట్టుకుంది. మూణ్నాళ్ల ముచ్చటలాగ, కన్ను తెరిచిన మూడోనాడే టెడ్డీ కన్ను మూశాడు. ఒకసారి తను ఒక బిడ్డకు జన్మనిచ్చింది కనుక ఆ బిడ్డ మరణించినా తన గురించి అమ్మ అనే చెప్పాలంటోంది ఎల్ రైట్. ‘‘మా అబ్బాయి నాతో ఎన్నో సంవత్సరాలు ఆనందంగా గడుపుతాడనుకున్నాను. కాని వాడు హాస్పిటల్ నుంచి ఇంటికే చేరలేదు. వాడితో నా అనుబంధం మూడు రోజులు మాత్రమే. వాడు పుట్టగానే నాలో మాతృత్వం పొంగుకొచ్చింది. అంతలోనే ఇలా జరిగింది. 2015 సెప్టెంబరులో నాలో కొత్త మార్పు వస్తోందని తెలుసుకున్నాను. నా భర్త ‘నికో’ ఇంటికి రాగానే విషయం చెప్పాలనే ఆత్రంతో ఎదురుచూస్తున్నాను. వచ్చీరాగానే అతని చేతిలో ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిపోర్టును చేతిలో పెట్టాను. అతను సంతోషంతో గంతులు వేశాడు. నాకు చెప్పరాని ఆనందం అనిపించింది. 12 వారాల తరవాత స్కానింగ్ తీయించి, అప్పుడు అందరితో ఈ ఆనందాన్ని పంచుకున్నాం. స్కానింగ్ స్క్రీన్ మీద పసిబిడ్డ ఏడుస్తూ, అరుస్తూ, కాళ్లు కదపడం చూసి మురిసిపోయాను. నా భర్తకి వెంటనే మెసేజ్ పంపాను. ఇలా కళ్లుమూసుకు తెరిచేలోగా ఆరు నెలలు గడిచిపోయాయి. రోజులు దగ్గరపడే కొద్దీ నాలో ఆనందం రెట్టింపవుతోంది. తొమ్మిది నెలలు నిండాయి, హాస్పిటల్లో చేరాను. సిజేరియన్ చేసి బాబుని నాకు చూపించారు. బాబుని హాస్పిటల్ టవల్లో చుట్టి ఉంచారు. అయితే.. ఆనందంలో మురిసిపోతున్న నాకు డాక్టర్ మాటలు నెత్తి మీద పిడుగు పడినట్టుగా అయ్యింది. బాబుకి ఏదో చిన్న అనారోగ్యం ఉందని చెప్పారు. రెండు మూడు రోజుల కంటే ఊపిరి పీల్చలేడని చెప్పారు. అప్పటికే నేను నా చిన్నారికి టెడ్డీ అని పేరు పెట్టుకున్నాను. వాడు కేవలం 74 గంటలు మాత్రమే భూమి మీద గాలి పీల్చుకున్నాడు. రెండు రోజులు నా బిడ్డను దగ్గరగా పడుకోబెట్టుకున్నాను. ఆ రోజు అర్ధరాత్రి మిడ్వైఫ్ వచ్చి గాభరాగా నన్ను నిద్రలేపింది, బాబుకి బాగోలేదని. నేను బాబు శరీరం ముట్టుకుని చూశాను, చల్లగా మంచుముద్దలా ఉంది. నెమ్మదిగా ఊపిరి తీసుకోవడం ఆగిపోతోంది, చూస్తుండగానే 20 నిమిషాలలో అంతా సర్దుకుంది. బాబుకి నా పాలు పట్టించాను. అందులో ఏం అమృతం ఉందో కాని, బాబు కాసేపటికే ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఆట ఎంతోసేపు ఉండదని తెలుసు, కాని నా మాతృహృదయం బాబుకి పాలు తాగిస్తున్నంతసేపు ఆనందపారవశ్యంలో నిండిపోయింది. బాబుని గుండెలకు హత్తుకున్నాను. వాడు ఎంత గట్టిగా తన్నుతుంటే అంత ఆనందం వేసింది. మళ్లీమళ్లీ ఈ అనుభూతి ఉండదు కదా అనుకున్నాను. టెడ్డీ మే 16, 2016లో పుట్టాడు, మే 19, 2016లో తన చిరునవ్వులను తనతో తీసుకువెళ్లిపోయాడు. టెడ్డీ శరీరానికి పెట్టిన ఆక్సిజన్ గొట్టం తొలగించారు. శరీరానికి వేసిన మెడికల్ టేపులన్నీ తీసేశారు. ఊపిరి లేని, చిరునవ్వుల టెడ్డీని నాకు అందించారు. ఎట్టకేలకు వాడు అన్ని రకాల ఇబ్బందుల నుంచి మోక్షం పొందాడు, ఇది జరిగిన తరవాత నేను మానసికంగా, శారీరకంగా కృంగిపోయాను. ఇలాంటివి ఇతరులకు కూడా జరుగుతుంటాయి. హృదయాన్ని పోలి ఉండే వాడి చిరునవ్వులను మరచిపోలేకపోతున్నాను. నా స్నేహితులందరికీ మెసేజ్ పంపాను, ‘గుడ్ బై టు టెడ్డీ’ అని. ‘టెడ్డీ డైడ్’ అనడానికి నాకు మనస్కరించలేదు. వాస్తవాన్ని అంగీకరించడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఫోన్ మోగగానే ఎత్తాలంటే కూడా మనస్కరించలేదు, మనసు సంభాళించుకుని ఫోన్ ఎత్తగానే, వారు ‘నీకు మేమందరం ఉన్నాం. మేం నిన్ను ప్రేమగా చూసుకుంటాం’ అంటున్నారు. నేను సమాధానం చెప్పకపోయినా వారు కోపం తెచ్చుకోవట్లేదు. నా స్పందన కోసం వారు ఎదురుచూడట్లేదు. నా కథ ఎందుకు చదవాలా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి తల్లిదండ్రులమైతే, పిల్లలు ఉన్నా ఉండకపోయినా మమ్మల్ని తల్లిదండ్రులుగానే గుర్తించాలి అని నేను కోరుకుంటున్నాను. మీరందరూ మా అబ్బాయి పేరు ఏంటి అని అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటున్నారు ఎల్ రైట్ అనే ఈ బ్రిటన్ మాతృమూర్తి. – రోహిణి -
ఏ చర్చకైనా సిద్ధం: ఉండవల్లి
సాక్షి, రాజమండ్రి: అమరావతి బాండ్ల విషయంపై గొడవ రాజుకుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు అమరావతి బాండ్ల అవకతవకలపై ప్రశ్నిస్తుండగానే మాజీ ఎంపీ ఉండవల్లి ఆరుణ్ కుమార్ సవాల్తో మరింత రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విసిరిన సవాల్పై గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి స్పందించారు. ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. కానీ ప్రజలకు బహిరంగ చర్చలపై నమ్మకం పోయిందని, ఒక గదిలో రెండు కెమెరాల సమక్షంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆ ఒక్క పుస్తకంపైనే కాకుండా చాలా అంశాలపై కుటుంబరావు మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో కుటుంబరావు జీతం తీసుకుంటున్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. టీడీపీ నేతగా కుటుంబరావు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయనని ఉండవల్లి పేర్కొన్నారు. తప్పు చేస్తే నిర్భయంగా ఒప్పుకునే మనస్తత్వం తనదని తెలిపారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలకు దిగటం సరికాదన్నారు. చంద్రబాబుపై ఈర్ష్యతో మాట్లాడుతున్నానడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన తనకు రాజకీయ ప్రత్యర్థిని కాదన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. కుటుంబరావు తనను పేపర్ టైగర్ అంటున్నారని, కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి సభలో కనీసం ప్రస్తావించలేని టీడీపీ ఎంపీలు పేపర్ టైగర్లు కాదా అని ప్రశ్నించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని ఉండవల్లి స్పష్టం చేశారు. -
అమరావతి బాండ్ల లిస్టింగ్
సాక్షి,ముంబై: ఆంధప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సేకరిస్తున్న నిధుల కోసం అమరావతి బాండ్ల నమోదును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం ప్రారంభించారు. రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో నమోదు చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఏపీసీఎం 9.15 గంటలకు గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు. బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశీష్కుమార్తో కలిసి చంద్రబాబు బాండ్ల లిస్టింగ్ను ప్రారంభించారు. బీఎస్ఈలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలోమంత్రులు యనమల, నారాయణతోపాటు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఇంకా ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్పై బాండ్లను జారీ చేయగా , మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. -
ప్రజల సొమ్మంటే ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, అమరావతి: రాజధాని బాండ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక వడ్డీ రేట్లకు చేస్తున్న అప్పులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రభుత్వానికి మూడు రోజుల క్రితం పలు ప్రశ్నలు సందించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఆర్డీయే, కుటుంబరావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలు ప్రస్తావించారు. కాగా ఈ అంశాల్లో వారి డొల్లతనాన్ని బుగ్గన మరోసారి ఘూటుగా ప్రశ్నించారు. ప్రభుత్వం తాను ప్రస్తావించిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిందంటూ మండిపడ్డారు. రాజధాని బాండ్ల విషయంలో వాస్తవాలను ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. బాండ్ల విషయంలో వడ్డీ రేటు 10.5 శాతం కాదని, 10.32 మాత్రమేనని ప్రభుత్వం చెబుతుందని వాటి మధ్య ఎంత తేడా ఉందో గమనించాల్సిందిగా ప్రజలను కోరారు. ముంబై స్టాక్ ఎక్చ్సేంజ్కు కమిషన్ ఇవ్వలేదని కుటుంబరావు చెప్పారు. కానీ ప్రభుత్వ జీవోలోనే 0.85 శాతం కమిషన్తో పాటు జీఎస్టీ చెల్లిస్తున్నట్టు రాసి ఉందని ఆయన గుర్తుచేశారు. జీఎస్టీ కలుపుకొని ఏకంగా 20 కోట్ల మేర కమిషన్ చెల్లించడం దారుణం కాదా అని ఆయన ప్రశ్నించారు. 2000 కోట్లకు 1573 కోట్లు మాత్రమే వడ్డీ కడుతున్నామని చెప్పడం ద్వారా ప్రజల సొమ్ము పట్ల వారు ఎంత ఆషామాషీగా వ్యవహరిస్తున్నారనేది అర్ధం అవుతుందన్నారు. అప్పుల విషయంలో ప్రభుత్వం జీవోల్లో రాసేది ఒకటి బయట వ్యవహరించేది మరోటి అని మండిపడ్డారు. ఇంత ఎక్కువ వడ్డీ రేటుకు అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా కుటుంబరావు వివరణలోని లోపాలను ఎత్తి చూపారు. బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి లేఖ పూర్తి సారాంశం -
బాండ్ల విక్రయంతో నష్టమే తప్ప లాభం లేదు: ఐవైఆర్
అమరావతి: రాజధాని బాండ్ల విక్రయంతో ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..బ్యాంకు వడ్డీ కంటే అధికంగా చెల్లిస్తామని విక్రయాలు చేపడుతున్నారని...దీని వల్ల ప్రజలపై భారీగా భారం పడే అవకాశముందన్నారు. షేర్ మార్కెట్లో ఓవర్ సబ్స్రైబ్ మంచిదే కానీ బాండ్ల విక్రయంలో మంచిది కాదన్నారు. రూ.60 వేల కోట్లతో ఎలక్షన్ ఇయర్లో టెండర్లు పిలవడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై భారీగా భారం పడుతుందన్నారు. బాండ్ల ద్వారా వచ్చేదంతా అప్పే అవుతుందని, మళ్లీ రీయింబర్స్మెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలపై భవిష్యత్లో పెద్దభారం పడుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి, అధిక వడ్డీ చెల్లించినపుడు స్పందన బాగా ఉంటుంది.. ప్రస్తుతం రాష్ట్ర స్థూల వార్షిక ఆదాయం 29 శాతం ఉంది..బాండ్ల ద్వారా వచ్చే రూ.60 వేల కోట్ల అప్పుతో ఆదాయంలో అప్పు శాతం 29 నుంచి 35 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోతుందని, ప్రజలపై మరింత భారం పడే అవకాశముందన్నారు. మహానగర వ్యామోహం అనేది రాష్ట్రానికి గుదిబండగా మారనుందని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం వరకు అయితే రూ.5 వేల కోట్లు సరిపోతాయని స్పష్టం చేశారు. -
పొదుపు బాండ్లపై తగ్గిన వడ్డీ!
న్యూఢిల్లీ: ఎనిమిది శాతంవడ్డీ లభించే ప్రభుత్వ (పన్ను పరిధిలోకి వచ్చే) పొదుపు బాండ్లు పొందేందుకు కాలపరిమితి ఈ నెల 2వ తేదీతో ముగిసిపోయిందని విచారపడే వారికిది కాస్తంత ఉపశమనం కలిగించే వార్తే. ఈ పొదుపు బాండ్లను కేంద్రం మరోసారి ఆవిష్కరిస్తోంది. అయితే ఈ బాండ్లపై వడ్డీ రేటును మాత్రం ఈ సారి 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గిస్తోంది. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. పోస్టాఫీసు పొదుపు పథకాల్లో ఇటీవల కేంద్రం వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. అయితే 7.75 శాతంతో కూడిన పొదుపు బాండ్లు కూడా ఇతర స్థిర ఆదాయ ప్రొడక్టులతో పోల్చితే అధిక రాబడులనే అందిస్తాయి. ఆర్బీఐ బాండ్ల స్కీమ్ అని కూడా పేరున్న ఈ 8 శాతం సేవింగ్స్ బాండ్స్ స్కీమ్ను కేంద్రం 2003లో తీసుకువచ్చింది. ఆ ఏడాది ఏప్రిల్ 21న సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది. బాండ్ కాలపరిమితి ఆరేళ్లు. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యేకించి ప్రవాస భారతీయుల నుంచి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. అయితే ఇవి పన్ను రహిత బాండ్లు కాదు. వీటిపై వచ్చే వడ్డీకి ఆయా వర్గాల ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
పోగొట్టుకున్న ఆస్తి
సంపాదించుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఆస్తి, గౌరవం, హోదా, పరపతి... ఇవన్నీ అలాగే పోగొట్టుకోవచ్చు కూడా! మరి, సంపాదించి... పోగొట్టుకోనిది ఏదైనా ఉందా? ఉంది... దాన్నే ‘బంధం’ అంటారు. కట్టుకున్నవారితో బంధం... కన్నవారితో బంధంలో... అనుబంధం లేకపోతే? అన్నీ ఉండీ ఏమీ లేనట్టే! అన్నింటి కన్నా గొప్ప ఆస్తి పోగొట్టుకున్నట్టే!! పరంధామయ్య పొయ్యి మీద పాలు మరగపెడుతున్నాడు. గిన్నె చేజారి, కాళ్ల మీద పడింది. చర్మం కాలి, బొబ్బలు వచ్చేశాయి. విపరీతమైన మంట, నొప్పితో విలవిల్లాడిపోయాడు. కుంటుకుంటూ వెళ్లి మంచమ్మీద జారిగిలబడ్డాడు. భార్య సుశీల గుర్తుకు వచ్చింది. ‘తను చనిపోయి ఐదేళ్లు అవుతోంది. డెబ్భై ఏళ్ల వయసులో ఒక్కణ్ణే అయిపోయాను. ఇంత ఇంట్లో పిలిస్తే పలకడానికి కూడా ఎవరూ లేరు’ అనుకుంటుండగా బయట ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. కుంటుకుంటూనే మెల్లగా బయటకు వచ్చాడు. వాళ్లను చూడగానే గుండెలో ఏదో గుబులుగా అనిపించింది. వాళ్లు తన కొడుకులు రమేష్, సురేష్. భయపెట్టే బంధాలు రమేష్ లోపలికి వస్తూనే ‘ఏంటీ, ఇంటి కొనుగోలుకు మనిషిని పంపిస్తే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావంట.’ దబాయిస్తున్న కొడుకు వైపు విస్మయంగా చూశాడు. ‘నా ముందు నిల్చోవడానికి కూడా భయపడేవాడు, వీడేనా ఇన్ని మాటలు అంటోంది..’ అనుకుంటూ నిల్చోలేక అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. ‘ఈ ఇల్లేమీ నీ సంపాదన కాదుగా? ఆల్రెడీ వాడికి డబ్బు ఇచ్చేశావు. ఈ ఇంటిని నాకే ఇవ్వాలి..’ అంటున్న చిన్న కొడుకు సురేష్కేసి నిర్వేదంగా చూశాడు. ‘ఈ ఇల్లు నీ ఒక్కడికే చెందుతుందా? నువ్వొక్కడివేనా ఆయన కొడుకివి’ అంటూ తమ్ముడిపై విరుచుకుపడ్డాడు రమేష్. ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటున్నారు. ఊళ్లో నలుగురూ పోగయ్యారు. ‘‘వచ్చేవారమే ఇంటి రిజిస్ట్రేషన్. వచ్చి సంతకాలు పెట్టు’’ అంటూ విసురుగా వెళ్లిపోయాడు రమేష్. చిన్న కొడుకు కూడా వచ్చిన దారి పట్టాడు. పరంధామయ్య స్థితి చూసిన పెద్దమనుషులు ‘‘ఈ వయసులో నీకెందుకయ్యా ఈ కష్టం. ఒక్కడివే ఎన్ని పాట్లని పడతావు. ఇల్లు అమ్మేసి కొడుకుల దగ్గరే ఉండు. చూడు కాళ్లు బొబ్బలెలా వచ్చాయో..!’’ సానుభూతిగా మాట్లాడుతున్న వాళ్లవైపు చూసి, మెల్లగా లోపలికెళ్లిపోయాడు పరంధామయ్య. సంపాదన కోసం కష్టపడ్డ రోజులన్నీ గుర్తొచ్చాయి పరంధామయ్యకు. సంపాదన మైకం భార్య, ఇద్దరు కొడుకులు... ‘బాగా సంపాదించాలి, ఊళ్లో అందరి కన్నా ధనవంతుడి’ని కావాలని కలగన్నాడు. ఉన్న కొద్ది భూమి అమ్మేసి ఆ డబ్బును ఇనుము వ్యాపారంలో పెట్టాడు. రేయింబవళ్లు కష్టపడ్డాడు. రెండేళ్లకే ఉన్న ఇంటిపై మరో ఇల్లు వేశాడు. పిల్లలను పట్నంలో పెట్టి చదివించాడు. ఎప్పుడూ పని ధ్యాసే. పైసకు పైస చేర్చి టౌన్లో ప్లాట్లు కొన్నాడు. భార్య అప్పుడప్పుడు అంటుండేది ‘ఏనాడూ బుక్కెడు తిండి కుదురుగా కూర్చుని తిన్నది లేద’ని. ఆ మాటలు పట్టించుకునేవాడు కాదు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. పెళ్ళిళ్లు అయ్యాయి. ఇద్దరూ వ్యాపారాలే చేస్తున్నారు. ఇద్దరూ పట్నంలో ఉండడం వల్ల ఎప్పుడో చుట్టపుచూపుగా వచ్చిపోయేవాళ్లు. కోడళ్ళిద్దరికీ పడదు. వాళ్లు వచ్చి కూడా నాలుగేళ్లకు పైగా అయింది. ఇక మనవలు, మనవరాళ్లు సరే సరి. భార్య ఐదేళ్ల కిందట చనిపోయింది. అప్పటి నుంచి ఆస్తులు పంచమని కొడుకుల గొడవ. ఈ ఇల్లు ‘అమ్మే ద్దాం..’ అంటున్నాడు రమేష్. ‘ఈ ఇల్లు నాకే కావాలి’ అని వాదిస్తున్నాడు సురేష్. ఇక్కడే అన్నదమ్ములిద్దరికీ పడటం లేదు. కంటి మీద కునుకు లేదు.. బొబ్బలెక్కిన కాళ్లు మండుతున్నాయి. ఇకనైనా తెలుస్తుందా! కళ్లు తెరిచేసరికి తనెక్కడో ఉన్నట్టు అర్థమైంది పరంధామయ్యకు. ఆశ్చర్యంగా చూస్తుంటే ‘అంకుల్! మీకు రెండ్రోజులుగా విపరీతమైన జ్వరం. ఊళ్లో వాళ్లు ఫోన్ చేసి మీ గురించి చెప్పారు. మీ ఇంటి పరిస్థితి తెలుసు కదా! చూసెల్దామని వచ్చాను. మీరు స్పృహలో లేరు. వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాను..’ అని వర్ధన్ చెబుతుంటే కళ్లనీళ్లు ఆగలేదు పరంధామయ్యకు. తను సాయపడిన ప్రసాద్ కొడుకు వర్ధన్. ప్రసాద్ చనిపోయి ఆరేళ్లు అయ్యింది. కానీ, అతని కొడుకు తనను మర్చిపోలేదు. ‘నిన్ను చూస్తుంటే మనసు నిండిపోతుందయ్యా. నా కొడుకులు సంపాదించిందంతా పట్టుకుపోయారు. ఇంకా కావాలంటున్నారు. నన్ను ఒంటరివాడిని చేశారు’అంటూ కుమిలిపోతున్న పరంధామయ్యను ఓదార్చాడు వర్ధన్. కర్మ రుణాలు ‘‘ఎక్కడకొచ్చాం’’ ఆ క్లినిక్ను చూసి వర్ధన్ని అడిగాడు పరంధామయ్య. ‘‘అంకుల్! ఇది గతం గురించి తెలుసుకొని, సాంత్వన చెందే చోటు. మీరు మా నాన్నగారు నిలదొక్కుకోవడానికి సాయపడ్డారు. ఇప్పుడు మీ బాధ పోగొట్టడానికి నేను సాయపడాలనే ఇక్కడకు తీసుకువచ్చాను’’ అంటూ కౌన్సెలర్ను పరిచయం చేశాడు వర్ధన్. రిగ్రెషన్ థెరపీ గురించి అంతా తెలుసుకున్న పరంధామయ్య తన బాధల్ని తొలగించమని కోరాడు. కర్మలు పునరావృతం తన గత జీవితాన్ని తనే చేతనత్వంతో దర్శిస్తున్నాడు పరంధామయ్య. థెరపీ మొదలయిన కొద్దిసేపటికి అతని మనోఫలకం మీద ఏవేవో దృశ్యాలు.. వాటి గురించి చెబుతున్నాడు. ఐదేళ్ల క్రితం... ‘నా భార్య సుగుణ చావు బతుకుల్లో ఉంది. తన దగ్గర కాసేపు కూర్చోమంది. అప్పుడే బయట నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లక తప్పనిస్థితి. చె య్యి పట్టుకొని ఆపింది. ‘ఎన్నాళ్లు సంపాదనంటూ తిరుగుతావు! ఈ రోజైనా ఉండకూడదా! సంచీ నిండా డబ్బు తెచ్చుకోవాలని చూస్తావు. కానీ, మనసు నిండా ఏం నింపుకోవాలని చూడవా!’ అంటోంది. తను మళ్లీ వస్తానని చెప్పి వచ్చేశాడు. వెళ్లిన అరగంటకే పెద్దోడు ఫోన్ చేశాడు - ‘అమ్మ చనిపోయిందని..’ ‘డబ్బు కోసం ఆశపడి చివరి రోజుల్లో ఉన్న భార్య దగ్గర కాసేపు కూడా కూర్చోలేకపోయాను. ప్రేమగా చూసుకోవాల్సిన భార్యను ఇంటి పనులు చేసే యంత్రంలాగే చూశాను..’ పరంధామయ్య గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కాసేటి తర్వాత ఇంకా ప్రయాణించండి... అని కౌన్సెలర్ సూచనలు అందుకున్నాడు. తనకు ఇంకా వెనక్కి వెళుతున్నాడు.. పాతికేళ్ల వయసు. తండ్రితో తాను గొడవ పడుతున్నాడు. ‘‘భూమి అమ్మడానికి వీల్లేదు’’ అంటున్నాడు తండ్రి. ‘‘అమ్మి తీరాల్సిందే’’ అంటున్నాడు తను. ‘‘అన్నం పెట్టిన నేలయ్యా, దాన్ని అమ్మద్దు. నీకు దండం పెడతా!’’ అని తన కాళ్లు పట్టుకుంటున్నాడుతండ్రి. తను అనరాని మాటలన్నీ అంటున్నాడు తండ్రిని. విసిగిపోయిన ఆయన ‘నీ ఇష్టం’ అన్నాడు. తను భూమిని అమ్మేశాడు. వ్యాపారం మొదలుపెట్టాడు. ఆరు నెలలు తిరక్కుండానే తండ్రి చనిపోయాడు. ముసలోడైపోయాడు అనుకున్నాడు. కానీ, భూమి మీద మమకారంతో చనిపోయాడు తన తండ్రి. పరంధామయ్య గుండెలో నుంచి దుఃఖం ఉబుకుతోంది. తండ్రికి చేసిన అన్యాయం గుర్తుకు వచ్చింది. తండ్రిని క్షమించమని వెక్కుతూనే ప్రాథేయపడ్డాడు పరంధామయ్య. ‘‘ఇంకా వెనక్కి ప్రయాణించండి. మీ ఈ జీవితం నుంచి గత జీవితంలోకి... ’’ అన్నారు కౌన్సెలర్. పరంధామయ్య గతంలోకి ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణం.. మెల్ల మెల్లగా ఒక దగ్గరకు చేరుకుంది. ‘ముగ్గురు వ్యక్తులు గొడవపడుతున్నారు. వారిలో తనున్నాడు. ఎవరో పెద్దాయన మోకాళ్లలో తల దాచుకుని ఏడుస్తున్నాడు. అతను తన తండ్రి. ఆస్తుల కోసం గొడవలు. తను ఆ ఇంటికి పెద్ద. కాబట్టి, తనకు ఎక్కువ వాటా కావాలని తమ్ముళ్లతో వాదిస్తున్నాను. వాళ్లెవరో కాదు రమేష్, సురేష్లు. అంటే, వాళ్లే ఈ జన్మలో నాకు కొడుకులుగా పుట్టారా? వాళ్లను తను కొడుతున్నాడు. తమను విడదీయడానికి తండ్రి వచ్చాడు. అయినా నేను వినడం లేదు. తను అందరికన్నా ధనవంతుడవ్వాలి. ఈ విషయం అర్థమయ్యాక పరంధామయ్య మనసు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. తనకు డబ్బు మీద ఉన్న కాంక్ష ఎంతటిదో అర్థమైంది. ఆస్తి కోసం తండ్రిని వేధించాను. భార్యను పట్టించుకోలేదు. పిల్లలను దూరం పెట్టాడు. బంధువులను దగ్గరకు రానివ్వలేదు. అందుకే తాను ఒంటరి అయిపోయాడు. ఈ విషయం అర్థమవగానే పరంధామయ్య మనసు తేలికపడింది. తన ధన దాహం బంధాలను ఎలా దూరం చేసిందో అర్థమైంది. ఈ బాధల నుంచి బయటపడడమే కాదు, పిల్లలను దగ్గరకు తీసుకొని, తన ఆస్తి మీరే అని చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తనకీ అవకాశాన్ని కల్పించిన వర్ధన్కి, కౌన్సెలర్ కృతజ్ఞతలు తెలిపి పిల్లల వద్దకు బయల్దేరాడు పరంధామయ్య. విశ్వమంతా ఒకే న్యాయం ‘ఎలాంటి విత్తనం నాటుతామో అలాంటి మొక్కే వస్తుంది’. ఇది ప్రకృతి చెబుతోంది. ‘ఏదైనా వస్తువు పైకి విసిరేస్తే పైకి వెళ్లదు. అది కిందే పడుతుంది’. ఇది సైన్స్ చెబుతోంది. కర్మలు కూడా అంతే! ఎవరైతే ఈ ప్రక్రియను అర్థం చేసుకుంటారో వారిలో ఆత్మపరిణతి చెంది, కర్మల నుంచి బయటకు వస్తారు. లేదంటే, కర్మల విషవలయంలో తిరుగుతూనే వుంటారు. మన దేశం ‘భగవద్గీత’ ద్వారా ప్రపంచ దేశాలకు కర్మన్యాయ జ్ఞానాన్ని ఇచ్చింది. బుద్ధిజవ్ు సైతం కర్మన్యాయం గురించి వివరించింది. అయితే, మిగతా ప్రపంచ దేశాలు వీటిని ఆధారంగా చేసుకొని శాస్త్రీయ పరిశోధనలు చేస్తూ, పరిష్కారానికి చికిత్సామార్గాన్ని సూచించారు. అదే పాస్ట్లైఫ్ రిగ్రెషన్ థెరపీ. 1950 నుంచి జరిగిన ఈ పరిశోధనల విస్తృతి ఇంకా పెరుగుతోంది. తెలుసుకొని వదిలేయడం కాకుండా అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టడం ద్వారా పాప కర్మలు తగ్గించుకునే అవకాశం ఉంది. డాక్టర్ బ్రెయిన్ ఎల్ వెయిజ్ అనే అమెరికన్ ైసైకియో థెరపిస్ట్ కర్మన్యాయం మీద పరిశోధనలు జరిపి‘మెనీ లైవ్స్... మెనీ మాస్టర్స్’ అనే పుస్తకం రాశారు. ఇంకా ఎంతో ప్రముఖ మనస్తత్వ నిపుణులు పాపకర్మలు మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయనే అంశాలను గ్రంథస్థం చేశారు. కర్మలకు దూరంగా ఉంటే మానవ జీవనానికి అర్థం ఉండదు. మంచి కర్మలు చేసిన మనిషి సుఖమయ జీవనాన్ని పొందుతాడని అర్థం చేసుకోవాలి. ధృతరాష్ర్టుడి కథలోనూ... కురుక్షేత్ర యుద్ధంలో నూరుగురు కుమారులను కోల్పోయిన ధృతరాష్ట్రుడు ఆవేదనతో కృష్ణుడిని సమీపించి ‘కృష్ణా... కొడుకులను కాపాడుకోలేని నిస్సహాయుడిని ఎందుకయ్యాను?’ అని అడిగాడు. కృష్ణుడు అతనికి జ్ఞాననేత్రం ద్వారా గత జన్మ కర్మలను దర్శించే అవకాశం ధృతరాష్ట్రుడికి కల్పించాడు. ‘కిందటి జన్మలో వేటగాడైన ధృతరాష్ట్రుడు చెట్టు మీదున్న మగపక్షికి బాణం వేశాడు. అది తప్పించుకుంది. అతనికి కోపం వచ్చి, చెట్టుకు నిప్పు పెట్టాడు. చెట్టు పై గూడులో ఆ మగ పక్షి సంతానమైన వంద పక్షులు మంటల్లో కాలిపోయాయి. మంటల ధాటికి మగ పక్షి కళ్లు పోయాయి. దానివల్లే ఈ జన్మలో అంధత్వం ప్రాప్తించింది. కొడుకులు యుద్ధంలో మరణిస్తుంటే నిస్సహాయిడై ఉన్నానని గ్రహించాడు. శిక్షకు శిక్ష తప్పదని అదే కర్మ పాఠం అని గ్రహించాడు. వృద్ధాప్య పాఠం చాలా మంది వృద్ధాప్యంలో ‘తమను ఎవరూ పట్టించుకోరు’ అని బాధపడుతూనో, ‘పిల్లలు తమ మాట ఇంకా వినితీరాలని’ ఆలోచన వల్లనో ప్రశాంతతను కోల్పోతుంటారు. వృద్ధాప్యం అనేది ఒక అందమైన విద్యావిధానం. అన్ని బాధ్యతలూ తీరిపోయి జీవన ప్రయాణంలో పరుగులు తీయడం తగ్గి తమ కోసం తాము జీవించే అవకాశం వృద్ధాప్యం కలిగిస్తుంది. ఈ వయసులో తమ చేతన (ఆత్మ) లక్ష్యం ఏంటి? అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇదో మంచి అవకాశం. మన పూర్వీకులు వృద్ధాప్యంలో అన్ని బంధాల నుంచి విముక్తి పొంది, తమను తాము తెలుసుకోవడానికి వానప్రస్థాశ్రమాన్ని చేరుకునేవారు. ఈ వయసులో బంధుత్వాలకు దగ్గరగా ఉంటూనే బంధాల నుంచి మానసికంగా దూరం అవడం నేర్చుకోవాలి. - నిర్మల చిల్కమర్రి -
సోమవారం నుంచి గోల్డ్ బాండ్స్ ట్రేడింగ్
ముంబై: ఫిబ్రవరి 8, మార్చి 29న జారీ అయిన గోల్డ్ బాండ్లు సోమవారం (ఆగస్టు 29) నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ కానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత జారీ అయిన సావరిన్ గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ ఇప్పటికే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. 2015 అక్టోబర్ 30న పసిడి బాండ్ల పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇప్పటికి నాలుగు దఫాలుగా పసిడి బాండ్ల జారీ పక్రియ జరిగింది. చివరి దశలో జారీ చేసిన పసిడి బాండ్లు ఎప్పుడు ట్రేడవుతాయన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆర్బీఐ పేర్కొంది. కాగా ఐదవ విడత పసిడి బాండ్ల జారీ ప్రక్రియను వచ్చే నెల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బాండ్లకు సంబంధించి తొలి పెట్టుబడిపై వార్షిక స్థిర వడ్డీరేటు 2.75 శాతం. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. రెండు గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ విలువైన బాండ్ల కొనుగోలుకు వీలుంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తరవాత ఎగ్జిట్ ఆఫర్ ఉంటుంది. -
లబ్ధిదారులకు బాండ్ల పంపిణీ
మునగాల: 2005–2011 సంవత్సరాల మధ్యలో బాలికా శిశు సంక్షేమ అభివృద్ధి పథకానికి దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులకు మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో కోదాడ ఐసీడీయస్ సీడీపీఓ కృష్ణకుమారి చేతుల మీదుగా బాండ్లను పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఇద్దరు ఆడపిల్లలు కన్న తల్లులతో పాటు ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్న మహిళలు 150 మంది లబ్ధిదారులకు, బంగారుతల్లి పథకం లబ్ధిదారులకు బాండ్లను పంపీణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు ఆడపిల్లల ఉన్న తల్లిదండ్రులకు రూ.60వేలు, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లికి రూ.లక్ష చొప్పున బాండ్లను పంపీణీ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ బాండ్లు బాలికకు 20ఏళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ లోగా బాండ్లు పొందిన పిల్లలు మధ్యలో చదువు మానేసిన, వివాహాం చేసుకున్న ఈ బాండ్లు వర్తించవని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భీమపంగు అక్కమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు సంధ్య, మణి, మణెమ్మ, కమల, రూప తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ్ గోల్డ్ బాండ్ @రూ. 3119
ఈ నెల 18 నుంచి నాలుగో దఫా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ న్యూఢిల్లీ: బంగారం బాండ్ల నాలుగో దఫాకు సబ్స్క్రిప్షన్ ఈ నెల 18(వచ్చే సోమవారం) నుంచి ప్రారంభమై 22న ముగుస్తుంది. ఈ నాలుగో దఫా పుత్తడి బాండ్ల ధరను ఒక్కో గ్రామ్కు రూ. రూ.3,119గా ఆర్బీఐ నిర్ణయించింది. బంగారాన్ని భౌతిక రూపంలో కొనుగోలు చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఈ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్(ఎస్జీబీ)ను రూపొందించింది. బాండు కొనుగోలుచేసినప్పటి బంగారం ధరపై ప్రతీ ఆరు నెలలకు చెల్లించేలా 2.75 శాతం వార్షిక వడ్డీ వుంటుంది. పుత్తడి ధర పెరిగితే బాండు ధర కూడా పెరుగుతుంది. లేదా ధర తగ్గితే తగ్గుతుంది. ఈ బాండ్లను బ్యాంక్లు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్, ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకూ మూడు దఫాలుగా రూ.1,322 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లు జారీ చేశారు. కనీసంగా ఒక గ్రాము, గరిష్టంగా 500 గ్రాముల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. గోల్డ్ బాండ్ స్కీమ్ కింద 5,10,50, 100 గ్రాముల డినామినేషన్లలో 5-7 కాలపరిమితితో ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తారు. -
13వ తేదీ నుంచీ గోల్డ్ బాండ్ల ట్రేడింగ్
ముంబై: మొదటి విడత జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లు 13వ తేదీ (సోమవారం) నుంచీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడవుతాయని రిజర్వ్ బ్యాంక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2015 నవంబర్ 30న జారీ చేసిన బాండ్లు సోమవారం నుంచీ ట్రేడవుతాయని, తరువాతి తేదీల్లో జారీ చేసిన బాండ్ల ట్రేడింగ్ తేదీలను తరువాత నోటిఫై చేస్తామని కూడా ఆర్బీఐ తెలిపింది. ఇప్పటివరకూ మూడు విడతల గోల్డ్ బాండ్ల జారీ జరిగింది. త్వరలో నాల్గవ విడతను కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం బాండ్లపై వార్షిక వడ్డీరేటు 2.75 శాతం. -
గోల్డ్ డిపాజిట్, బాండ్లపై వడ్డీరేటు 3% లోపే!
న్యూఢిల్లీ: పసిడి డిపాజిట్ స్కీమ్, బాండ్లపై వడ్డీరేట్లు ఎంత ఉండవచ్చన్న అంశంపై ఆర్థికశాఖ సీనియర్ అధికారుల నుంచి కొన్ని సంకేతాలు అందాయి. పసిడి డిపాజిట్పై ఈ రేటు 1.5 శాతం నుంచి 2 శాతం వరకూ ఉండవచ్చని ఆ వర్గాల కథకం. గోల్డ్ బాండ్లపై వడ్డీరేటు 2 నుంచి 3 శాతం వరకూ ఉండే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీపావళి నాటికి కొత్త స్కీమ్లను ప్రారంభించడానికి కసరత్తు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం రూ.15,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16 బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ రెండు స్కీమ్లను బుధవారం కేంద్రం కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. రెండు నెలల్లో ఈ పథకాలు నోటిఫై అవుతాయని, ప్రజల స్పందన ఎలా ఉందన్న అంశాన్ని ఏడాది అనంతరం సమీక్షించడం జరుగుతుందని సీనియర్ ఆర్థికశాఖ అధికారి తెలిపారు. -
అమరావతి పేరుతో బాండ్ల జారీ!
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను సమీకరించేందుకు అమరావతి పేరుతో బాండ్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో రెండుసార్లు చర్చించారు. ‘అమరావతి మౌలిక వసతుల కల్పన ’ పేరుతో బాండ్లను జారీ చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాజధాని నిర్మాణానికి వచ్చే పదేళ్లలో రూ.53,547 కోట్లు అవసరమని సీఆర్డీఏ అంచనా వేసింది. ఇందులో కొంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా మంజూరు చేసినా మిగతా నిధులను సమీకరించాల్సి ఉంటుందని ఇటీవల సీఆర్డీఏ సమీక్షా సమావేశంలో సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతిపై ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నందున అదే పేరుతో వడ్డీపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేని బాండ్లను జారీ చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. బాండ్ల జారీకి విధివిధానాలను ఖరారు చేయడానికి కన్సల్టెంట్ను నియమించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందని సీఆర్డీఏ పేర్కొంది. ‘సెబీ’ మార్గదర్శకాలను కూడా అమలు చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలి పాయి. క్రెడిట్ రేటింగ్ ఆధారంగా మున్సిపల్ రెవెన్యూ బాండ్లా లేదా మౌలిక వసతుల బాండ్లా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమరావతి పేరుతో బాండ్ల జారీతోపాటు పలు రంగాల ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్కు సూచించారు. సింగపూర్ శిక్షణకు 25 మంది అధికారులు సింగపూర్ సంస్థలు చెప్పే పాఠాలు వినడానికి, శిక్షణ పొందడానికి సీఆర్డీఏకు చెందిన 25 మంది అధికారులు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సింగపూర్లో ఉండనున్నారు. నూతన రాజధాని అమరావతిలో భూ వినియోగం, రవాణా వ్యవస్థ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రైవేట్, పబ్లిక్, సామాజిక రంగాల గృహాల నిర్మాణం, గ్రీనరీ, పారిశ్రామిక, ఆర్థిక పురోగతి తదితర అంశాలపై సింగపూర్లో సీఆర్డీఏ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ లీడర్స్ ఇన్ అర్బన్ గవర్నెన్స్ పోగ్రామ్’ పేరుతో ఈ శిక్షణ ఉంటుంది. దీని ద్వారా అధికారుల్లో నైపుణ్యాలను పెంచి, సమర్థ పాలన అందించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సింగపూర్ కంపెనీలు సమర్పించిన రాజధాని మాస్టర్ ప్రణాళికను ఎలా అమలు చేయాలో సింగపూర్ సంస్థలు వివరిస్తాయి. ఇందుకయ్యే రూ.4 లక్షల వ్యయాన్ని సీఆర్డీఏ భరించనుంది. -
జాడ లేని రైతు రుణమాఫీ బాండ్లు!
-
మీ బాండ్లను ‘ఫైనాన్స్కు’ ఇవ్వండి
రైతులకు చెప్పిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ఇప్పుడు బాండ్ల పేరుతో వింత నాటకానికి తెరతీస్తోంది. ప్రభుత్వం ఇచ్చే బాండ్లను రైతులు పెద్ద ఫైనాన్స్ కంపెనీలకు ఇచ్చేలాగా ప్రోత్సహిస్తోంది. తద్వారా ఫైనాన్స్ కంపెనీల వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది. ఈ విషయంలో కూడా రైతు పది వేల రూపాయల వరకు నష్టపోతున్నాడు. ప్రభుత్వం బాండ్లపై ఇచ్చే పది శాతం వడ్డీ ఫైనాన్స్ కంపెనీలకు ముట్టచెప్పాలనే ఎత్తుగడకు తెరతీస్తోంది. అదెలాగంటే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఇటీవల తనను కలసిన రైతులకు వివరించారు. రుణమాఫీలో భాగంగా ఒక్కో రైతుకు లక్షన్నర రూపాయల లోపు రుణాలనే ప్రభుత్వం మాఫీ చేస్తోందని, అందులో తొలి విడతలో రూ.30 వేలు ఇచ్చామని చెప్పారు. మిగతా రూ.1.20 లక్షలకు త్వరలో ప్రభుత్వం బాండ్లు ఇస్తుందని తెలిపారు. బాండ్లు ఇచ్చిన తరువాత పెద్ద బ్యాంకులు, సుందరం వంటి పెద్ద ఫైనాన్స్ కంపెనీలతో మాట్లాడతామని చెప్పారు. బాండ్లు తీసుకున్న వారు ఆ సంస్థలో బాండ్లు ఇచ్చేస్తే డబ్బులు ఇస్తారని తెలిపారు. రూ.1.20 లక్షల బాండ్లు ఇస్తే ఫైనాన్స్ కంపెనీ రూ.1.10 లక్షలే ఇస్తుందని చెప్పారు. ఫైనాన్స్ కంపెనీలు వ్యాపారం చేస్తున్నందున పన్ను చెల్లించాల్సి ఉంటుందని, ఆ పన్ను, వడ్డీ కింద రూ.10 వేలను మినహాయించుకుంటాయన్నారు. ప్రభుత్వ వెంచర్లు, బాండ్లు రూ.100 విలువుంటే కంపెనీలు 98 లేదా 92 లేదా 93 రూపాయల చొప్పున మాత్రమే ఇస్తాయని చెప్పారు. ఇదే జరిగితే రైతు పదివేల రూపాయలు నష్టపోవాల్సిందే. -
వచ్చే నెల నుంచి పీఆర్సీతో కూడిన జీతం
హైదరాబాద్:త్వరలో తెలంగాణ ఉద్యోగుల నిరీక్షణ ఫలించనుంది. వచ్చే నెల జీతంలో పీఆర్సీతో కూడిన జీతాన్ని తెలంగాణ ఉద్యోగులు అందుకోనున్నారు. ఈ మేరకు సోమవారం ఉద్యోగుల పీఆర్సీ వర్తింపు విధివిధానాలను ఖరారు చేస్తూ ఆర్థికశాఖ జీవో విడుదల చేసింది. పీఆర్సీ ద్వారా పెరిగే జీతభత్యాలను వచ్చే నెల జీతంతో ఉద్యోగులకు అందజేయనున్నారు. మార్చి నెలకు సంబంధించిన బకాయిలను ఈనెలలోనే చెల్లించనున్నట్లు ఆర్థికశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా తొమ్మిది నెలల బకాయిలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన విధివిధానాలను టీఎస్ ప్రభుత్వం ప్రకటించలేదు. పీఆర్సీ బకాయిల చెల్లింపునకు సంబంధించి బాండ్ల జారీకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నా.. దానిపై ఇంకా సందిగ్ధత మాత్రం వీడలేదు.ఆ బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారా?లేక బాండ్ల జారీనా అనే అంశంపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయానికి రానుంది. గత నెల్లో పీఆర్సీ ఫిట్మెంట్ జీఓ విడుదలైన సంగతి తెలిసిందే. పీఆర్సీ ఫిట్మెంట్ను 43 శాతంగా నిర్ణయిస్తూ మార్చి 18 వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
నగదు కాదు.. బాండ్లే!
ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలపై సర్కారు భావన నగదు చెల్లింపులకు ఆర్థిక సంకటం జీపీఎఫ్ ఖాతాల్లో జమకు ఎఫ్ఆర్బీఎం చిక్కు బాండ్ల జారీయే శ్రేయస్కరమన్న ఆర్థిక శాఖ దీనివల్ల ఉద్యోగులకు నష్టమేమీ ఉండదని సూచన ఉద్యోగ సంఘాలతో చర్చలకోసం కమిటీ ఏర్పాటు! 2, 3 రోజుల్లో కొలిక్కి: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు వేతన సవరణ (పీఆర్సీ) బకాయిల చెల్లింపునకు సంబంధించి బాండ్ల జారీకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఆ బకాయిలను నగదుగా చెల్లింపు లేదా జీపీఎఫ్ ఖాతాలో జమచేసే ప్రతిపాదనలతో... రాష్ట్ర ఖజానాకు ఇబ్బందులు తప్పవని ఆర్థికశాఖ ఇప్పటికే హెచ్చరించింది. బాండ్లు జారీ చేయడమే శ్రేయస్కరమంటూ తన ప్రతిపాదనను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఇదే సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ బాండ్ల జారీ యోచనను వ్యతిరేకిస్తూ ప్రకటనలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పీఆర్సీ ఉత్తర్వులు జారీ చేసినా... బకాయిలకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామంటూ పెండింగ్లో పెట్టేసింది. ఈలోగా ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిశీలించిన ఆర్థికశాఖ... బాండ్లు జారీ చేయటం తప్ప, మిగతా ఏ మార్గమైనా రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుందని నిర్ధారణకు వచ్చింది. దీంతో ఉద్యోగుల పీఆర్సీ బకాయిలకు సంబంధించి బాండ్లను జారీ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ‘రుణ పరిమితి’ భయం.. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులకు గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ‘వేతన సవరణ’ బకాయిలను చెల్లించాల్సి ఉంది. దీనికి దాదాపు రూ. 5,000 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ లెక్కగట్టింది. తొలుత సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ప్రకారం.. ఈ తొమ్మిది నెలలకు సంబంధించిన బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ ఇంత మొత్తాన్ని జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తే.. అంతమేరకు రుణం తెచ్చుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. ప్రస్తుతం ‘ఆర్థిక బాధ్యత-బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం)’ చట్టం పరిమితి ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వం రూ. 12,900 కోట్లు అప్పుగా తెచ్చుకునే అవకాశముంది. కానీ పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్లో జమచేస్తే.. అంతమేరకు రుణ పరిమితి తగ్గిపోతుంది. అదే జరిగితే రుణాలు లభించక బడ్జెట్ అంచనాలు గాడి తప్పుతాయి. నిధులకు కటకట తప్పదు.. ఉద్యోగుల పీఆర్సీ బకాయిలకు సంబంధించిన మొత్తాన్ని వారికి నగదు రూపంలో చెల్లింపులు చేయాలన్నా, విడతల వారీగా చెల్లించాలన్నా.. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్గ్రిడ్, మిషన్ కాకతీయ, రోడ్ల నిర్మాణం, విద్యుత్ ప్రాజెక్టులు తదితర పథకాల నిధుల్లో భారీగా కోతపెట్టాల్సి వస్తుంది. అందుకే బాండ్లు జారీ చేయడం తప్ప మరోమార్గం లేదని ఆర్థిక శాఖ విశ్లేషిస్తోంది. ‘బాండ్లు జారీ చేయడం ద్వారా ఉద్యోగులకు జరిగే నష్టమేమీ లేదు. జీపీఎఫ్లో జమచేస్తే ఉద్యోగులు తమకు అవసరమైనప్పుడు రుణాలు తీసుకునే వీలుంటుంది. అదే బాండ్లు జారీ చేసినా.. వాటిపై రుణాలు తెచ్చుకోవడం కష్టమేమీ కాదు. బాండ్లపై రుణాలిచ్చేందుకు బ్యాంకులన్నీ సిద్ధంగానే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొమ్మిది నెలల బకాయిలు ఇప్పటికిప్పుడు చెల్లించాలంటే ప్రభుత్వానికి ఆర్థికంగా భారమే. ఉద్యోగులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్కారు తీసుకునే తుది నిర్ణయం ప్రకారం బకాయిల చెల్లింపులు జరుగుతాయి..’’ అని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి తెలిపారు. మరోవైపు పీఆర్సీ బకాయిల విషయంలో ఉద్యోగులతో సంప్రదింపులు, చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని సర్కారు యోచిస్తోంది. ఈ చర్చల కోసం కమిటీ వేసే ఆలోచనలో ఉంది. పీఆర్సీ బకాయిల వ్యవహారం 2,3 రోజుల్లో కొలిక్కి: సీఎం పదో పీఆర్సీ వేతన బకాయిలను బాండ్ల రూపంలో చెల్లించాలా, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో కలపాలా అన్నదాన్ని 2, 3 రోజుల్లో తేలుస్తామని టీఎన్జీవో నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించాకే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. టీఎన్జీవో నూతన అధ్యక్షుడు కారెం రవీందర్రెడ్డి, ప్రధానకార్యదర్శి హమీద్ , గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మంగళవారం రాత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. పీఆర్సీ బకాయిల వ్యవహారాన్ని ప్రస్తావించడంతో పాటు కార్పొరేట్ ఆసుపత్రులతో మాట్లాడి ఉద్యోగుల హెల్త్కార్డుల సమస్యనూ పరిష్కరించాలని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని అనంతరం నేతలు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన 42 రోజుల సకల జనుల సమ్మె కాలాన్ని ఆన్డ్యూటీగా పరిగణించే విషయంలో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారన్నారు. -
స్థానిక సంస్థల ద్వారా బాండ్లు!
రుణాల సమీకరణకు ఆర్బీఐ గవర్నర్ సూచన హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం పడకుండా ఉండాలంటే స్థానిక సంస్థల ద్వారా.. ప్రధానంగా పట్టణ స్థానిక సంస్థల ద్వారా రుణాల సమీకరణకు బాండ్ల జారీ వంటి చర్యలను చేపట్టవచ్చునని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మున్సిపాలిటీల ద్వారా బాండ్లు జారీ చేయాల్సిందిగా స్వయంగా ఆర్బీఐ గవర్నరే సూచించడంతో అందుకు అనుగుణంగా చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రాజధాని నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున రహదారులు, మంచినీటి వంటి ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టే ఆలోచన చేస్తున్నట్లు వివరించింది. ఈ బాండ్ల జారీ పట్టణ స్థానిక సంస్థల ద్వారా చేపట్టనున్నారు. ఆ విధంగా చేయడం వల్ల ఆ అప్పులు (భారం) రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద కాకుండా ఆ స్థానిక సంస్థ పేరిట ఉంటారుు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పేరిట కూడా స్థానికంగా అభివృద్ధికి బాండ్ల జారీ ద్వారా రుణాలను సమీకరించనున్నారు. వాటిద్వారా షాపింగ్ మాల్స్ వంటి నిర్మాణాలను చేపడితే పట్టణాల్లో ఆస్తి పన్నును కూడా పెంచవచ్చునని, ఆ విధంగా వచ్చిన ఆస్తి పన్నుతో రుణాలను తిరిగి చెల్లించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. పట్టణ స్థానిక సంస్థలకున్న ఆస్తులు, ఆదాయ వనరుల ఆధారంగా బాండ్లు జారీ చేయనున్నారు. వాటిని ప్రజలు గానీ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రఘురాం రాజన్ బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు అజేయ కల్లం, పి.వి.రమేశ్, ఎల్. ప్రేమచంద్రారెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజన్ పై సూచన చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితిని, ఆర్థిక కార్యకలాపాలను అధికారులు ఆయనకు వివరించారు. ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి వచ్చాయని, రాజధాని నిర్మాణం చేసుకోవడానికి వనరుల అవసరం ఉందని చెప్పారు. రైతులను ఆదుకోవడానికి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రైతు సాధికారత కార్పొరేషన్ను ఏర్పాటు చేశామని, దానికి బ్యాంకుల ద్వారా నిధులను ఇప్పించాలని కోరారు. -
అభాగ్యులనుఅక్కున చేర్చుకునే చేతులు
పుట్టుకతో మనిషికి కొన్ని బంధాలు ఏర్పడుతాయి. కానీ పుడుతూనే కొందరికి అన్ని బంధాలూ తెగిపోతాయి. జన్మనిస్తూ తల్లి మరణిస్తుంది. కళ్లు తెరిచేలోపే కన్న తల్లిదండ్రుల్ని మృత్యువు లాక్కెళ్లిపోతుంది. కారణాలు ఏవైతేనేం... పసిగుడ్డుగా ఉన్నప్పుడే బతుకు కుప్పతొట్టి పాలవుతుంది. అలాంటివారికి తమకంటూ చెప్పుకోవడానికి ఏ బంధం ఉంటుంది? ఏ బాంధవ్యం ఒడిలో చేర్చుకుని, గుండెల్లో పొదువుకుని పెంచుతుంది? ఈ ఆలోచన ఒక వ్యక్తిని వేలాదిమందికి తండ్రిని చేసింది. అతడి నీడలో వారి జీవితాలకు పునాది వేసింది! ‘‘నాన్నా... నాకు నాన్న లేడా?’’... ఆ ప్రశ్న వింటూనే అదోలా అయిపోయింది విద్యాకర్ మనసు. ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూండిపోయారు. ఆయన మనసులో ఏముందో అర్థం చేసుకోలేని చిన్నారి అభిలాష్ ఏడుస్తూ నిలబడ్డాడు. ‘‘చెప్పండి నాన్నా... నాకు నాన్న లేడా?’’ అన్నాడు నిలదీస్తున్నట్టుగా. అతడిని దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకున్నారు విద్యాకర్. నీకు నాన్న లేడని ఆ చిన్నారికి చెప్పలేరాయన. ఎందుకంటే అతడు తననే తండ్రి అనుకుంటున్నాడు. ఉన్నాడు అని కూడా చెప్పలేడు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఆ బాబు తండ్రెవరో తనకు కూడా తెలియదు కాబట్టి! మార్చి 27, 1994. చెన్నైలోని అన్నానగర్లో ఉండే విద్యాకర్కి ఓ ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పింది వింటూనే విద్యాకర్ హడావుడిగా స్కూటర్ వేసుకుని బయలుదేరారు. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన గుర్తుల ఆధారంగా ఓ కుప్పతొట్టి దగ్గరకు చేరుకున్నారు. అక్కడి దృశ్యం చూసి ఆయన మనసు కరిగి నీరయ్యింది. కుప్ప తొట్టిలో... కళ్లు కూడా తెరవని ఒక పసికందు పడివుంది. చీమలు కుడుతుంటే గుక్కపట్టి ఏడుస్తోంది. ఒళ్లంతా దద్దుర్లతో ఎర్రగా కందిపోయింది. విద్యాకర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే బిడ్డను తీసుకుని ఆసుపత్రికి పరుగెత్తారు. తక్షణ చికిత్స చేయించి ఆ శిశువును కాపాడారు. తర్వాత బాబుని తీసుకుని ఇంటికి వెళ్లారు. అభిలాష్ అని పేరుపెట్టి ప్రేమగా పెంచడం మొదలుపెట్టారు. అతడే అభిలాష్. ఊహ తెలిసేనాటికి తాను ఎవరి చేతుల్లో ఉన్నాడో అతడే తండ్రి అనుకున్నాడు అభిలాష్. బడిలో చేరిన తరువాత తెలిసింది తన అప్లికేషన్ ఫామ్లో తండ్రి అనే కాలమ్ ఖాళీగా ఉంది అని. అది తట్టుకోలేకపోయాడు. నేరుగా వెళ్లి తను నాన్నా అని పిలిచే విద్యాకర్ని నిలదీశాడు. తర్వాత మెల్లగా నిజం తెలుసుకున్నాడు. నాన్న కాని ఆ నాన్నకు పాదాభివందనం చేశాడు. ఇప్పటికీ రోజూ చేస్తూనే ఉంటాడు. కుప్పతొట్టిలో దొరికిన తనకు కొడుకు స్థానాన్ని ఇచ్చిన విద్యాకర్ రుణం తీర్చుకోలేనంటాడు కన్నీళ్లతో. ప్రస్తుతం ఐఏఎస్ పరీక్షకు ప్రిపేరవు తున్నాడు అభిలాష్. నిజానికి అతడే కాదు. అతడిలా విద్యాకర్ ప్రేమలో తడిసి విరబూసిన కుసుమాలు చాలానే ఉన్నాయి. ఆ గుబాళింపు తెలియాలంటే... చెన్నైలో ఉన్న ‘ఉదవుమ్ కరంగళ్’కు వెళ్లాలి. అది ప్రేమ ప్రపంచం... కన్నవాళ్లే ఒక్కోసారి పిల్లలను విసు క్కుంటూ ఉంటారు. కానీ ‘ఉదవుమ్ కరంగళ్’లో ఉండే ఏ చిన్నారినీ విద్యాకర్ ఒక్కసారి కూడా విసుక్కుని ఉండరు. వాళ్లని చూస్తేనే ఆయన మనసులో ప్రేమ పొంగి పొరలుతుంది. ఎక్కడెక్కడినుంచో ఆ పిల్లలను తీసుకొచ్చా రాయన. తల్లిదండ్రుల్ని కోల్పోయినవాళ్లు, కుప్పతొట్టి లోనో రోడ్డు పక్కనో దారుణమైన స్థితిలో పడివుండి పసికందులుగా దొరికిన వాళ్లు... ఎక్కడ ఓ చిన్నారి కనిపించినా అక్కున చేర్చు కుంటారాయన. వారి కోసమే ‘ఉదవుమ్ కరంగళ్’ను స్థాపించారు. విద్యాకర్ పుట్టింది మంగుళూరులో. పద మూడేళ్ల వయసులో అనుకోకుండా రామకృష్ణ అనే వ్యక్తిని ఓ ప్రమాదం నుంచి కాపాడారు. ఆ తరువాత ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. ఓసారి ఆయనను కలుసుకోవడానికి చెన్నై కూడా వెళ్లారు. అప్పుడే ఆయనకు సమాజం కోసం బతకడమంటే ఏంటో తెలిసింది తొలిసారి. రామకృష్ణ సమాజ సేవ చేసేవారు. ఆయనను చూసి స్ఫూర్తిపొందిన విద్యాకర్... స్థానికంగా కుష్టురోగుల కోసం పనిచేసే ఓ ఎన్జీవోలో చేరారు. సేవ చేస్తూ అక్కడే ఉండిపోయారు. ఆ క్రమంలో ఓరోజు... ఒక రిక్షా కార్మికుడు ఒక పసిబిడ్డను తీసుకుని విద్యాకర్ దగ్గరకు వచ్చాడు. సినిమా హాల్లో దొరికిందని చెప్పి, విద్యాకర్కు అప్పగించి వెళ్లిపోయాడు. ఆ బిడ్డకు ఓ నీడ కల్పించాలని చాలా ప్రయత్నించారు విద్యాకర్. కానీ ఎవరూ సహకరించలేదు. దాంతో ఆయన మనసు కదిలిపోయింది. దిక్కులేని బిడ్డను సాకేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు, ఇలాంటి పిల్లలందరి పరిస్థితి ఏంటి? అని ఆలోచించిన ఆయన ‘ఉదవుమ్ కరంగళ్ (సాయం చేసే చేతులు)’కు పునాది వేశారు. నాటి నుంచి తన సంస్థ ద్వారా ఎందరో చిన్నారులను అక్కున చేర్చుకున్నారు విద్యాకర్. వాళ్లంతా తనను ‘నాన్నా’ అని పిలుస్తుంటే ఆయన కళ్లు చెమ్మగిల్లుతాయి. ఆయన చేతులు వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాయి. - సమీర నేలపూడి ‘ఉదవుమ్ కరంగళ్’ను 1983లో స్థాపించారు విద్యాకర్. మొదట అనాథ శిశువుల సంరక్షణ కోసమే పెట్టినా... తరువాత సంస్థను పలు సేవా కార్యక్రమాల దిశగా విస్తరించారాయన. వృద్ధులకు ఆసరా కల్పిస్తున్నారు. మానసిక వికలాంగులను చేరదీసి చికిత్స చేయిస్తున్నారు. ఎయిడ్ వ్యాధిగ్రస్తులను కూడా చేరదీస్తున్నారు. వీరందరికీ ఆవాసం కల్పించేందుకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు విద్యాకర్. ప్రస్తుతం ఈ స్వచ్ఛంద సంస్థలో ఎనిమిది వందలకు పైగా మానసిక వికలాంగులు, నాలుగు వందల మందికి పైగా ఎయిడ్స వ్యాధిగ్రస్తులు, యాభై మందికి పైగా వృద్ధులు ఉన్నారు. అదే విధంగా ఆరు వందల మందికి పైగా అనాథ పిల్లలున్నారు. వీరిలో నెల రోజుల నుంచి ఇరవయ్యేళ్ల వయసు ఉన్నవారి వరకూ ఉన్నారు. అందరూ విద్యాకర్ని ‘పప్పా (నాన్నా)’ అనే పిలుస్తారు. ఎవరూ అనాథలుగా ఫీలవకూడదన్న ఉద్దేశంతోనే అలా పిలవడం అలవాటు చేశారు విద్యాకర్. అందరికీ చదువు చెప్పిస్తున్నారు. అది కూడా ఎవరికి నచ్చిన కోర్సు వాళ్లు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఆ మంచి మనసే ఆయనను అందరికీ ఆప్తుడిగా మార్చింది. ఆయన ఖ్యాతిని విదేశాల వారు సైతం గుర్తించేలా చేసింది! -
రియల్ ఖిలాడీ
బాలీవుడ్ హీరో అక్షయ్కుమార్ అంటే టక్కున గుర్తొచ్చేది ఖిలాడీ సిరీస్ సినిమాలు. చెఫ్ ఉద్యోగం నుంచి వందల కోట్ల రూపాయల సినిమాలతో బాక్సాఫీస్ను కొల్లగొట్టే స్థాయికి ఎదిగిన అక్షయ్కుమార్.. పెట్టుబడుల్లోనూ ఖిలాడీనే అనిపించుకుంటున్నాడు. బాండ్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు, బీమా పాలసీలు మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేసే అక్షయ్ .. ఎక్కువగా రియల్టీ వైపు మొగ్గు చూపుతాడు. ముంబైలో సంపన్నులు నివసించే లోఖండ్వాలా కాంప్లెక్స్లో అపార్ట్మెంట్, జుహూ ప్రాంతంలో బంగళా, అదే ప్రాంతంలో మరో లగ్జరీ ప్రాజెక్టులో ఇంకో అపార్ట్మెంట్ కొన్నాడు. దేశీయంగానే కాదు.. విదేశాల్లో కూడా భారీగానే ప్రాపర్టీపై ఇన్వెస్ట్ చేశాడు అక్షయ్. దుబాయ్లో అమితాబ్ బచ్చన్ ఇంటికి పక్కనే మరో విలాసవంతమైన విల్లాను కొనిపెట్టుకున్నాడు. ఇటు మారిషస్లోనూ, అటు కెనడాలోనూ కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నాయి అక్షయ్కి. ఇదే కాదు.. వ్యాపారపరమైన తెలివితేటలు కూడా బాగానే ఉన్నాయతనికి. ఏదైనా మంచి ప్రాజెక్టు తగిలిందంటే.. ప్రారంభ దశలోనే రెండు, మూడు ఫ్లాట్లు కొనేస్తాడు. నిర్మాణం పూర్తి కావొచ్చే దశలో మంచి రేటు రాగానే అమ్మేస్తాడు. ఈ విధంగా ఇటు సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు.. అటు రియల్టీ వ్యాపారంలో దూసుకెళ్తున్నాడు. అక్షయ్ కుమార్ రియల్టీ పెట్టుబడుల విషయంలో కొన్ని సెంటిమెంట్ కోణాలు కూడా ఉన్నాయి. జుహూ బీచ్ బంగళాని అతను కొనడం వెనుక అచ్చం సినిమా తరహా ప్రత్యేక కథ ఉంది. సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడుతున్న సమయంలో సదరు ఖాళీ బంగళా దగ్గర ఫొటో షూట్ కోసం ప్రయత్నించాడు అక్షయ్. కానీ, న్యూసెన్స్ చేస్తున్నారంటూ.. ఆ బంగళా వాచ్మన్.. అక్షయ్ని, ఫొటోగ్రాఫర్ని అక్కణ్నుంచి తరిమేశాడు. అటుపైన స్టార్డమ్ వచ్చిన తర్వాత.. పట్టుపట్టి అదే బంగళాని కొనుక్కున్నాడు అక్షయ్. అలాగే, కొన్నాళ్ల క్రితం రౌడీ రాథోడ్ సినిమాను చిత్రీకరించిన ములుంద్ ప్రాంతంలో నిర్మాణదశలో ఉన్న ఒక ప్రాజెక్టులో 4 ఫ్లాట్స్ బుక్ చేసుకున్నాడట. ఇవి ఇన్వెస్ట్మెంట్ కోసం కాదని.. ఆ ప్రాంతంతో తన అనుబంధానికి గుర్తుగా సావనీర్లుగా వాటిని కొన్నాడు. -
పథకాలన్నీ కలిస్తేనే పొదుపు..
సంక్షోభాల్లో బంగారం సంక్షోభాల్లో బంగారం అక్కరకు వస్తుందనేది చాలామంది వాదన. అందుకే దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ఏదైనా ఆర్థిక సంక్షోభం వస్తే బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మేలని సూచిస్తారు. కాని ఇందులో చాలా మంది ప్రజల్లో నెలకొన్న భయాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే అలా సలహా ఇస్తారు కాని, నిజంగా ఆ ఇన్వెస్టర్కి బంగారం ఉపయోగకరంగా ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించరు. ఈక్విటీలు, డెట్ పథకాలు మాదిరే పుత్తడి కూడా ఒక విలువైన ఇన్వెస్ట్మెంట్ సాధనమే. ప్రతీ ఒక్కరి పోర్ట్ఫోలియోలో బంగారం ఉండే విధంగా చూసుకోవాలి. అంతే కాని మొత్తం పెట్టుబడి అంతా బంగారంలోకి మార్చేయకూడదు. సాధారణంగా మొత్తం పెట్టుబడుల విలువలో బంగారం వాటా 5-10 శాతం వరకు ఉంటే సరిపోతుంది. సంక్షోభ సమయాల్లో కూడా ఈ వాటాలో ఎలాంటి మార్పులు ఉండవు. ఒకవేళ ఇప్పటికే మీ పోర్ట్ఫోలియోలో బంగారం తగినంత ఉంటే... పుత్తడిలో పెట్టుబడులు పెట్టండి అంటూ వచ్చే సూచనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాండ్స్ మేలు దేశ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నప్పుడు బాండ్స్లో పెట్టుబడి పెడితే కనీసం అసలుకు రక్షణ ఉంటుందని చాలా మంది భావిస్తారు. కాని ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో దీర్ఘకాలిక బాండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాలను అందిస్తాయి. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, రూపాయి-డాలర్ కదలిక, కరెంట్ అకౌంట్ లోటు వంటి అనేక కీలక గణాంకాలు బాండ్ మార్కెట్ను ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి సంక్షోభ సమయంలో లాంగ్టర్మ్ బాండ్స్, డెట్ పథకాలు సురక్షితమైనవన్న వాదన నిజం కాదు. వీటిల్లో కూడా నష్టాలు ఉంటాయన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. రేటింగ్ ఫండ్స్ బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వలే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పథకాలకు కూడా రేటింగ్ను ఇస్తున్నారు. గత కొంత కాలంగా పథకాలు అందించిన రాబడుల ఆధారంగా ఈ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాని ఫైవ్స్టార్ రేటింగ్ ఉన్న పథకం ఆ తర్వాతి కాలంలో కూడా అదే విధమైన లాభాలను గ్యారంటీగా అందిస్తుందన్న శాస్త్రీయ ఆధారం ఏదీ లేదు. రేటింగ్ తర్వాత ఆ పథకం అంతకంటే ఇంకా మెరుగైన లాభాలు అందించొచ్చు లేకపోతే నష్టాలను కూడా ఇవ్వొచ్చు. మరి రేటింగ్తో కలిగే ప్రయోజనం ఏమిటంటే... ప్రస్తుతం బాగా పనిచేస్తున్న పథకాలను సాకల్యంగా పరిశీలించే వీలుకలుగుతుంది. వీటిలో మీ పోర్ట్ఫోలియోకు సరిపడే పథకాన్ని ఎంచుకుంటే సరిపోతుంది. ఈక్విటీలూ ఉండాల్సిందే ఒక్కసారి మార్కెట్లు పడటం మొదలైతే లాభాలన్నీ హరించుకుపోవడమే కాకుండా భారీ నష్టాలు కూడా వస్తాయన్న ఉద్దేశంతో చాలా మంది ఈక్విటీల గురించి భయపడుతుంటారు. కాని ఇవి ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయన్న అంశాన్ని గుర్తించరు. ఉదాహరణకు సగటు ద్రవ్యోల్బణం (అంటే ధరల పెరుగుదల) 6 శాతం, ఫిక్స్డ్ డిపాజిట్పై వడ్డీ రేటు 8 శాతం ఉందనుకుందాం. ఈ పరిస్థితుల్లో నికరంగా మీకు వచ్చే వడ్డీ రెండు శాతం మాత్రమే. ఇక్కడ అసలుకు ఎటువంటి ఢోకా ఉండదు కాని ద్రవ్యోల్బణం వల్ల మీ కొనుగోలు శక్తి క్రమేపీ తగ్గిపోతుంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బ్యాలెన్సింగ్గా మీ పోర్ట్ఫోలియోలో ఈక్విటీలకు కూడా చోటు కల్పించండి.