Booster Dose
-
కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలను మాములుగా హడలెత్తించలేదు. అది పెట్టిన భయం అంత ఇంత కాదు. అప్పటికే ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాల వేరియంట్లుగా కరోనా వైరస్ మార్పు చెందుతూ ప్రభావం చూపించింది. తగ్గుముఖం పడుతుందనే లోపు మరో వేరియంట్ ఓమిక్రాన్ రూపంలో సెకండ్ కరోనా వేవ్తో ఎంతలా భయబ్రాంతులకు గురించేసిందో తెలిసిందే. ఎటూ చూసిన ఆస్పత్రులన్నీ మరణ మృదంగంతో మారు మ్రోగిపోయాయి. క్రమేణ ప్రజలు ఈ మహమ్మారికి అలవాటు పడిపోయి పట్టించుకోవడం వదిలేశారు. ఆ తర్వాత ఆ మహమ్మారి కూడా కనిపించనంత స్థాయిలో మాయం అయ్యింది కూడా. హమ్మాయా! అనుకునేలోపే మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 హడలెత్తిస్తోంది. ఒకటో రెండో కేసులే కదా అనకుంటే పెరుగుతున్న కేసుల ఉధృతి మళ్లీ ఇది వరకటి పరిస్థితికే చేరుకుంటామా? అని గుబులు తెప్పించేస్తుంది. ఇప్పటికే నిపుణుల భయపడొద్దని సూచిస్తూ మరోవూపు మాస్క్లు సామాజిక దూరం అని చెబుతుంటే మళ్లీ టెన్షన్.. టెన్షనే..అని భయాందోళనకు గురవ్వుతున్నారు. దీని గురించి మరో బూస్టర్ తీసుకోవాలా అని ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే వైద్యులు ఏమంటున్నారంటే.. ఈ కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పర్యాటక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే గత నాలుగు రోజుల నుంచి అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్లో విజయవంతంగా వ్యాక్సినేషన్లు వేశారు. 95% మంది తొలి రెండు షాట్ల వ్యాక్సిన్ తీసుకోగా, సుమారు 25% మంది బూస్టర్ డోస్లను కూడా వేయించుకున్నారు. మరీ ఇప్పుడూ ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మళ్లీ బూస్టర్ డోస్లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా? అని పలువురిని వేధిస్తున్న సందేహం. అయితే నిపుణులు 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి ఉన్నవారు వైద్యులను సంప్రదించి గానీ మరో బూస్టర్ తీసుకోవద్దదని సూచిస్తున్నారు. అంటువ్యాధులు ఉన్న ప్రాంత్లాల్లో ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తలు పాటించమని చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్లో ఉండటం వంటివి చేయాలని సూచించారు. మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనా..? ఐతే గతంలో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వచ్చిన వారుఉన్నారని అన్నారు నిపుణులు. అలాగే రెండు సార్లు కరోనాని ఫేస్ చేసిన వారకు కూడా ఉన్నారు. అయితే వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి ప్రమాదం అంత తీవ్రంగా లేదు, పైగా సులభంగా బయటపడగలిగారు. ఈ కొత్త వేరియంట్ జేఎన్.1 దగ్గరకొచ్చేటప్పటికీ.. రోగుల్లో న్యూమోనియా వంటి లక్షణాలతో కొద్దిపాటి శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అవికూడా తేలికపాటి లక్షణాలే అని ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు నిపుణులు. జస్ట్ నాలుగైదు రోజుల్లో నయం అయిపోతుంది. అలా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. అప్రమత్తంగా ఉండండి, లక్షణాలు కనిపిస్తే ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి, వ్యాప్తి చెందకుండా చూసుకోండి అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది కాస్త ప్రమాదకారి కావొచ్చు కాబట్టి వ్యాధినిరోధకతను పెంచుకునేలా మంచి ఆహారం తీసుకుని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించండి. ఇప్పటి వరకు సరిగా వ్యాక్సిన్ వేసుకోకపోయినా లేదా ఒక్కటే వ్యాక్సిన్ తీసుకున్నా..అలాంటి వారు మాత్రమే వీలైతే బూస్టర్డోస్ లేదు రెండు వ్యాక్సిన్ షాట్లను తీసుకోమని సూచిస్తున్నారు వైద్యులు. ఐతే కొద్దిమంది ఆరోగ నిపుణులు మాత్రం ఈ దశలో అదనపు వ్యాక్సిన్ డోస్లను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయ పడుతున్నారు. మళ్లీ వేయించుకుంటే మంచిదేనా..? అసలు మళ్లీ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదా కాదా అనే దిశగా పరిశోధన చేయడం కూడా మంచిదేనని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆ కొత్త వేరియంట్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలం. కొత్త వేరియంట్లకు తగ్గట్టుగా ఏదైనా బూస్టర్ డోస్ ఇవ్వడం మంచిదా? కాదనే దానిపై పరిశోధన చేయడం అవసరమని అంగీకరించారు పరిశోధకులు. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న రోగులకు ఈ పరిశోధన బాగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. (చదవండి: ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది చేసే విపాసన ధ్యానం అంటే ఏంటీ..? ఎందుకు చేస్తారు?) -
Karnataka election results 2023: హస్తానికి బూస్టర్ డోసు
న్యూడిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన అఖండ విజయం కాంగ్రెస్లో నూతనోత్సాహాన్ని నింపింది. కీలకమైన రాష్ట్రంలో పాగా వేయడంతో పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలాఏళ్లుగా గెలుపు రుచి లేకుండా నీరసించిపోయిన కాంగ్రెస్కు ఇది నిజంగా ఒక బూస్టర్ డోసు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇది దివ్యౌషధంగా పనిచేయనుంది. కేంద్రంలో అధికార బీజేపీని ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షం ఎవరన్న ప్రశ్నకు కొంతవరకు సమాధానం దొరికినట్లే. బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి సాకారం కావడం లేదు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అనే ప్రయత్నాలకు బ్రేక్ పడొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో విజయం నేపథ్యంలో ఇతర పార్టీలు కాంగ్రెస్ ఛత్రఛాయలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోనే ఏకైక విపక్ష కూటమి ఏర్పాటైనా ఆశ్చర్యం లేదు. ఇక నాలుగు రాష్ట్రాలపై గురి లోక్సభ సభ్యుడిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఇటీవలే అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసం నుంచి ఆయనను బలవంతంగా ఖాళీ చేయించడం కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి కలిగించాయి. రాహుల్ బీసీల వ్యతిరేకి అంటూ బీజేపీ చేసిన ప్రచారం ఫలించలేదు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కర్ణాటకలో స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారితోనే ఎక్కువగా ప్రచారం చేయించడం కాంగ్రెస్కు లాభించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో 15కు పైగా సీట్లు సాధించింది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని కాంగ్రెస్ ఎండగట్టింది. కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు. ఈ ఏడాది తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఛత్తీస్గఢ్, రాజస్తాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ నెగ్గడంతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కర్ణాటకలో విజయంతో ఆ పార్టీ ఇక మరింత దూకుడుగా వ్యవహరించనుంది. ఈ గెలుపు జాతీయ స్థాయిలో తమ పార్టీ పునర్వైభవానికి దోహదపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు. -
తెలంగాణలో రేపటి నుంచి కోవిడ్ బూస్టర్ డోసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపటి(బుధవారం) నుంచి కోవిడ్ బూస్టర్ డోసుల పంపిణీ ప్రారంభించనుంది ప్రభుత్వం. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా వెళ్లిన వారికి ముందు వ్యాక్సిన్ ఇచ్చేలా వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఐదు లక్షల కార్బోవ్యాక్స్ డోసుల్ని సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో అందుబాటులో ఈ బూస్టర్ డోసుల్ని ఉంచనుంది. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది. హైదరాబాద్లో తాజాగా 21 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని, మాస్క్లు ధరించి తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. మొదటి రెండు డోసులు కోవాగ్జిన్ లేదా కోవీషీల్డ్ తీసుకున్నా.. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్ను తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. అందరికీ మూడో బూస్టర్ డోసు అందుతుందని అధికారులు అంటున్నారు. రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ సమాంతరంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. -
గుడ్ న్యూస్.. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులు ఫ్రీ..!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి. రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. చదవండి: కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్లోకి ఎంట్రీ..! -
కోవిడ్ ఫ్రీ బూస్టర్ డోస్లు నిల్.. కొనుక్కోవాల్సిందే!
చైనాలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అందులో భాగంగా కోవిడ్ బూస్టర్ డోస్లను త్వరిగతిన తీసుకోమని ప్రజలను హెచ్చరిస్తోంది. ఐతే 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా అందిచ్చే కోవిడ్ బూస్టర్ డోస్లు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ లేవని, కనీసం దేశ రాజధాని ఢిల్లీలో సైతం తగినంత మొత్తంలో అందుబాటులో లేవని సమాచారం అలాగే సుమారు రూ. 400లు వసూలు చేసి బూస్టర్ డోస్లు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద ఉన్నాయి గానీ అవికూడా రానున్న కొద్ది రోజుల్లో అయిపోయే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఐతే అధికారిక లెక్కల ప్రకారం కోవిన్ వెబ్ పోర్టల్లో కూడా ఎన్నో బూస్టర్ డోస్లు అందుబాటులో లేవని స్పష్టంగా చెబుతోంది. ఐతే కొన్ని ప్రైవేట్ సెంటర్లో మాత్రం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు ప్రభుత్వం మాత్రం చైనా మాదిరిగా కేసులు పెరగకుండా ప్రజలను సత్వరమే బూస్టర్ డోస్లు తీసుకోమని చెబుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా, దేశంలో సాధారణ టూ డోస్ వ్యాక్సిన్ను ఇప్పటి వరకు 90 శాతం మంది తీసుకోగా, బూస్టర్ డోస్ను ఢిల్లీలో కేవలం 20 శాతం మంది తీసుకోగా, భారత్ అంతటా 30 శాతం మంది తీసుకున్నారు. ప్రజలంతా కూడా వ్యాక్సిన్ తీసుకున్నామన్న ధైర్యంతో ధీమాగా ఉన్నారని కేంద్రం నొక్కి చెబుతోంది. అయినప్పటికీ అవగాహన డ్రైవ్లను నిర్వహించమని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం భారత్లో కేసుల తక్కువుగానే ఉన్నాయని, సగటున 200 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. (చదవండి: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం!) -
బూస్టర్ డోస్గా ‘నాసల్’ వ్యాక్సిన్.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోందన్న భయాల వేళ మరో టీకా అందుబాటులోకి వచ్చింది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో నాసల్ వ్యాక్సిన్ ధరను మంగళవారం ప్రకటించింది భారత్ బయోటెక్. ప్రైవేటు కంపెనీలకు సింగిల్ డోసు టీకా ధర రూ.800(పన్నులు అదనం)గా నిర్ణయించినట్లు తెలిపింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రానుంది ఈ నాసల్ వ్యాక్సిన్. ‘ఇంకోవాక్’(iNCOVACC)గా పిలిచే ఈ నాసల్ వ్యాక్సిన్ను తీసుకునేందుకు కోవిన్ పోర్టల్ ద్వారా ఇప్పటి నుంచే స్లాట్స్ బుక్సింగ్ చేసుకోవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకోవాక్ నాసల్ టీకాను బూస్టర్గా పొందవచ్చు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా దీని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. బీబీవీ154గా పిలిచే ఈ నాసల్ టీకా ఇంకోవాక్ బ్రాండ్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రాథమిక, బూస్టర్ డోసు కోసం అనుమతులు పొందిన ప్రపంచంలోనే తొలి నాసల్ వ్యాక్సిన్గా ఇంకోవాక్ నిలిచినట్లు పేర్కొంది భారత్ బయోటెక్. ఇదీ చదవండి: Corona New Variant BF.7: కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే? -
కోవిడ్ భయాలు: తెలంగాణలో బూస్టర్డ్రైవ్.. ఆదేశాలు జారీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు తక్షణమే బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ చేపట్టింది. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీ చేపడతారు. అందుకు సంబంధించి జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు. మొత్తం 1,571 కేంద్రాలలో ప్రత్యేకంగా బూస్టర్డోసు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. రద్దీ ప్రాంతాల్లో మొబైల్వ్యాక్సినేషన్జరగనుంది. మార్కెట్లు, షాపింగ్మాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర కేంద్రాల వద్ద ప్రత్యేక వాహనాల్లో టీకాల పంపిణీ చేస్తారు. 50 మందికి మించి, ముందస్తు విజ్ఞప్తి చేస్తే, వారికి ఆ మేరకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 1.60 కోట్ల మంది బూస్టర్ డోస్ వేసుకోవాల్సి ఉంది. అలాగే 9 లక్షల మంది రెండో డోస్ టీకా వేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా రెండో డోసు, బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్దఎత్తున ప్రజలు తరలివస్తే ప్రస్తుతం ఉన్న టీకాలు సరిపోయే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తక్షణమే కరోనా టీకాలు సరఫరా చేయాలని ఇటీవల కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విన్నవించిన సంగతి తెలిసిందే. కొత్తగా 12 కరోనా కేసులు రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన 4,367 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 12 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి ఆరుగురు కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 65 యాక్టివ్ కేసులున్నాయి. -
Omicron BF 7: ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?
సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్ సోకడం, వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా మన దేశంలో ఇప్పటికే చాలా మందిలో రోగ నిరోధకత వచ్చిందని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనాథ్రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్–7 పట్ల ప్రజలు అలజడికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ ప్రభావం ఎలా ఉండనుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్రెడ్డి వివరించారు. చైనాలో అలా ఎందుకంటే? చైనాలో మన కంటే చాలా ముందుగానే టీకాల పంపిణీ చేపట్టినా అన్ని వర్గాలకు పంపిణీ చేయలేదు. వయసు మళ్లిన వారిలో చాలా మందికి టీకాలు వేయలేదు. దీంతో ఎక్కువ మందిలో హైబ్రీడ్ రోగ నిరోధకత లేదు. చాలా ముందే టీకాల పంపిణీ జరిగిన నేపథ్యంలో వాటిని తీసుకున్న వారిలోనూ హైబ్రీడ్ రోగనిరోధకత క్షీణించి ఉంటుంది. జీరో కోవిడ్ పాలసీతో అక్కడ కఠినమైన లాక్డౌన్ విధిస్తూ వచ్చారు. దీంతో సహజసిద్ధమైన రోగ నిరోధకత తక్కువ మందికే ఉంది. తక్కువ మందికి వ్యాక్సినేషన్, ఒక్కసారిగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం లాంటి కారణాలతో చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. వాతావరణం కూడా.. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి వైరస్ల ప్రభావం, కదలికలు ఉంటాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో చలి తీవ్రత ఎక్కువ. వైరస్ వ్యాప్తికి అక్కడి వాతావరణం కూడా ఒక కారణం. ఆయా దేశాల్లో ఏ మేరకు మరణాలు సంభవిస్తున్నాయి? ఆస్పత్రుల్లో ఎంత మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు? అనే అంశాలను బట్టి వైరస్ ప్రభావాన్ని అంచనా వేయాలి. బీఎఫ్–7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారనే వార్తలు మినహా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడి కాలేదు. రెండు మూడు నెలల క్రితమే.. మన దేశంలో బీఎఫ్–7 వేరియంట్ కేసులు రెండు మూడు నెలల కిందటే వెలుగు చూశాయి. అయితే వ్యాప్తి పెద్దగా లేదు. దీని బారిన పడిన వారికి జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, డయేరియా, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి రోగ నిరోధకత తక్కువగా ఉండే వారిపై ఈ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది. 60 ఏళ్లుపైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలి. బూస్టర్ డోస్ తీసుకుని చాలా రోజులైన వారు, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారు నాలుగో డోస్ టీకా తీసుకోవడం కూడా మంచిదే. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం. అంతర్జాతీయ ప్రయాణాలను విరమించుకోవాలి. జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. -
Covid-19 Fourth Wave: చైనాలో కరోనా కల్లోలం.. ‘మనకు ముప్పు లేదు’
చైనాలో కరోనా కల్లోలం భారత్లోనూ భయభ్రాంతులకు కారణమవుతోంది. దేశంలో నాలుగో వేవ్ మొదలైపోతుందని ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బిఎఫ్.7 చైనా, అమెరికా, యూరప్ దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తూండడంతో కేంద్రం అప్రమత్తమై కరోనా నిబంధనల్ని పాటించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే చైనాతో పోల్చుకుంటే మనకు ప్రమాదం దాదాపుగా ఉండదని అంటువ్యాధి నిపుణులు భరోసా ఇస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలతో ఈ వేరియెంట్ను కూడా సులువుగా ఎదుర్కోవచ్చంటున్నారు. మనకి ఫోర్త్ వేవ్ ముప్పు పెద్దగా ఉండకపోవడానికి గల కారణాలేంటో చూద్దాం... కరోనా వ్యాక్సినేషన్ భారత్లో కరోనా వ్యాక్సినేషన్ విస్తృతంగా జరిగింది. కరోనా సోకిన తొలి రోజుల్లో కేంద్రం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూసింది. అత్యధికులు రెండు డోసుల్ని తీసుకుంది. అక్టోబర్ నాటికి 220 కోట్ల వ్యాక్సినేషన్లు తీసుకున్నారు. మనం అధికంగా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఎక్కువ మంది తీసుకుంటే, చైనా అచేతన వైరస్తో తయారు చేసిన కరోనా వాక్, సినోఫామ్ వ్యాక్సిన్లు ఇచ్చింది. కరోనా వేరియెంట్లను ఎదుర్కోవడంలో ఇవి విఫలమవుతున్నాయని అంటున్నారు. అత్యధికులకు కరోనా కరోనా మహమ్మారి మొదలైన దగ్గర్నుంచి భారత్లో ఇప్పటి వరకు 4.5 కోట్ల కేసులు నమోదయ్యాయి. కరోనాలో ఉన్న అన్ని వేరియెంట్లు దాదాపుగా భారత్లో వ్యాపించడంతో ప్రజలందరిలోనూ ఈ వేరియెంట్లను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి బలపడింది. అదే చైనాలో ఇప్పటివరకు ఏ వేరియెంట్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. జీరో కోవిడ్ విధానం కారణంగా ఇప్పటివరకు 20 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో అధిక శాతం ప్రజల్లో కరోనా వైరస్ను తట్టుకునే యాంటీబాడీలు ఉత్పన్నం కాలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ సెప్టెంబర్ నుంచే బీఎఫ్.7 కేసులు మన దేశంలో ఒమిక్రాన్ ఉపవేరియెంట్ బీఎప్.7 కేసులు ఈ ఏడాది సెప్టెంబర్లో వెలుగులోకి వచ్చాయి. కానీ పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పటికే భారత్లో తొలి వేవ్ 2020 ఆగస్టు–సెప్టెంబర్లో సార్స్–కోవ్–2తో చాలా ఇబ్బందులు పడ్డాం. 2021 ఏప్రిల్–మే నెలల్లో సెకండ్వేవ్లో డెల్టా వేరియెంట్ దేశాన్ని వణికించింది. మందులకి, ఆక్సిజన్కి కరువు వచ్చి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్ వేరియెంట్తో థర్డ్ వేవ్ కాస్త తక్కువ ప్రభావాన్నే చూపించింది. అందుకే ఈ సబ్ వేరియెంట్ ఏమంత ప్రభావం చూపించదని ఇన్సాకాగ్ మాజీ చీఫ్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. బూస్టర్ డోసులు ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో కోవిడ్–19 వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభించారు. జనాభాలో 28% మందివరకు బూస్టర్ డోసులు తీసుకున్నట్టు నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. చైనాలో 50% మంది బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ 80 ఏళ్లకు పైబడిన 90 లక్షల మంది తీసుకోలేదు. వారికే ఎక్కువగా వైరస్ సోకడం గమనార్హం. మన దేశంలో ప్రజలు కూడా బూస్టర్ డోసులు తీసుకుంటే మంచిదని వైరాలజిస్ట్ గగన్దీప్ కాంత్ సూచించారు. బూస్టర్ డోసు వేరే కంపెనీది తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితేమిటి? మన దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసులు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం రోజుకి సగటున 150 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అదే మిగిలిన ప్రపంచ దేశాల్లో రోజుకి సగటున 5.9 లక్షల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వేరియెంట్లు అన్ని దేశాలపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపించడం లేదు. ఎక్స్ఎక్స్బీ వేరియెంట్తో మన దేశంలో కేసులు 8% నుంచి ఒకానొక దశలో 69శాతానికి చేరినప్పటికీ ఆ తర్వాత వ్యాప్తి తగ్గిపోయింది. నవంబర్ 10న అత్యధికంగా 4,500 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వేరియెంట్ కూడా ప్రమాదకరం కాదని తేలిపోయింది. -
పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు కరోనా వైరస్.. బూస్టర్ డోస్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: చైనా తదితర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ను తప్పకుండా తీసుకోవాలని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్లు ధరించాలని, టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. దేశంలో ఫిబ్రవరి వరకు కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని... అప్పటివరకు జాగ్రత్తలు పాటిస్తే మార్చి నుంచి ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఈ మేరకు డాక్టర్ నాగేశ్వర్రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి మహమ్మారి (పాండెమిక్) దశ నుంచి స్థానికంగా సోకే (ఎండెమిక్) వ్యాధి దశకు తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు. అందుకే అది కొన్ని దేశాల్లోనే వెలుగుచూస్తోందని, మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చైనాలో జీరో కోవిడ్ పాలసీని పాటించారని... సుమారు 70 శాతం మందికి టీకాలు వేయలేదని... వ్యాక్సినేషన్లో చైనా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. భారత్లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగినందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... జాగ్రత్తలు పాటి స్తే సురక్షితంగా ఉండొచ్చన్నారు. పండుగలు, పెళ్లిళ్ల సందర్భంలో ప్రజలు మాస్క్లు ధరించాలని, బూస్టర్ డోస్ వేసుకోవాలని డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సూచించారు. దేశంలో కేవలం 28 శాతం మందే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, మిగిలినవారు వెంటనే తీసుకోవాలన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 6 నెలల్లో బూస్టర్ తీసుకోవాలని, ఏడాదైనా పరవాలేదని.. ఆలస్యమైతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. వరుసగా మూడేళ్లపాటు బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదన్నారు. బీఎఫ్–7 ప్రమాదకరం కాదు... ‘దేశంలో ఒమిక్రాన్ రకానికి చెందిన ఎక్స్బీబీ వైరస్ 80 శాతం ఉంది. బీఎఫ్–7 వేరియంట్ అక్టోబర్లోనే భారత్లోకి వచ్చింది. కానీ 10 కేసులే నమోదయ్యాయి. అది పెద్దగా మనపై ప్రభావం చూపలేదు. హైదరాబాద్లో ఎక్స్బీబీ వైరస్ కేసులు 60 శాతం ఉన్నాయి. దక్షిణ కొరియా, జపాన్లో బీఎఫ్–7 కేసులు ఎక్కువగా ఉన్నాయి. బీఫ్–7 వైరస్ ఒకరికి వస్తే వారి ద్వారా 10 మందికి వ్యాపిస్తుంది. అదే ఒమిక్రాన్ ఒకరికి వస్తే ఐదుగురికి వ్యాపిస్తుంది. బీఎఫ్–7 డెల్టా అంత ప్రమాదకరమైంది కాదు. బీఎఫ్–7 రకం వైరస్ గొంతు, నోటి వరకే వెళ్తుంది. రోగనిరోధకశక్తి తక్కువున్న వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రం ఊపిరితిత్తుల్లోకి ఈ వైరస్ వెళ్లే ప్రమాదముంది. వారికి సీరియస్ అయ్యే అవకాశముంది’ అని డాక్టర్ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్... ‘దేశంలో మూడు రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవిషీల్డ్... వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. రెండు కోవాగ్జిన్... ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. మూడోది కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్. ఇది పెపిటైట్ ఆధారిత టీకా. ఈ ఏడాది జనవరిలోనే కార్బెవ్యాక్స్ వచ్చింది. జూన్లో దానికి బూస్టర్గా అనుమతి లభించింది. కార్బెవ్యాక్స్ చాలా సురక్షితమైనది. వ్యాక్సిన్లను దశలవారీగా వేర్వేరు కంపెనీలవి వేసుకుంటే మంచి ఫలితాలు వస్తున్నాయి. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్ వేసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. దీనిపై మేం అధ్యయనం చేశాం. కార్బెవ్యాక్స్ 95 శాతం సామర్థ్యంతో కూడినది. దీన్ని వేసుకుంటే కరోనా గురించి మనం మరిచిపోవచ్చు. ఇతర వ్యాక్సిన్లతో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు’ అని డాక్టర్ నాగేశ్వర్రెడ్డి చెప్పారు. -
కరోనాపై ఉమ్మడి పోరాటం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోసు ఇవ్వాలని, మహమ్మారి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ మన దేశంలోకి అడుగుపెట్టే అవకాశాలను తగ్గించడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రకటించారు. విదేశీ ప్రయాణికుల నుంచి విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలైందని తెలిపారు. ‘‘మన శత్రువు(కరోనా) కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. మనం ఇకపై మరింత పట్టుదల, అంకితభావంతో శత్రువుపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం పెంచాలి ప్రపంచమంతటా రోజువారీగా సగటున 5.87 లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని, మన దేశంలో మాత్రం సగటున 153 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేయాలని చెప్పారు. బూస్టర్ డోసుతోపాటు కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని విన్నవించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తల విషయంలో ప్రజల్లో చైతన్యం పెంచాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఏమరుపాటు వద్దు కొత్త వేరియంట్లను గుర్తించడానికి పాజిటివ్ కేసుల జినోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు‡’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు. కరోనా అనే విపత్తు ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై, జీవనంపై ప్రభావం చూపిస్తూనే ఉందని గుర్తుచేశారు. గత కొద్దిరోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుందోన్నారు. చైనా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మనదేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. అయినప్పటికీ ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు. 24 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు టెస్ట్లు విదేశాల నుంచి వచ్చేవారికి ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారికి ర్యాండమ్ కరోనా వైరస్ టెస్టు నిర్వహించాలంటూ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి విమానంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల్లో కొందరి నుంచి ఎయిర్పోర్టులోనే నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరెవరికి టెస్టులు చేయాలన్నది వారు ప్రయాణించిన విమానయాన సంస్థ నిర్ణయిస్తుంది. ఎంపీలంతా మాస్కులు ధరించాలి: స్పీకర్ కరోనా వ్యాప్తిపై మళ్లీ భయాందోళనలు మొదలైన నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో çసభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం సూచించారు. లోక్సభ ప్రవేశద్వారాల వద్ద మాస్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎంపీలందరూ వాటిని ధరించి, సభలో అడుగపెట్టాలని కోరారు. గురువారం పార్లమెంట్లో చాలామంది ఎంపీలు మాస్కులు ధరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పార్లమెంట్ సిబ్బందిని లోక్సభ సెక్రటేరియట్ ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు పాటించాలన్న స్పీకర్ బిర్లా సూచనను పలువురు ఎంపీలు స్వాగతించారు. -
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ రెడీ!
పలు దేశాల్లో కరోనా వైరస్ వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మరోసారి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బూస్టర్ డోస్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో అప్డేట్ ఇచ్చింది. ముక్కు ద్వారా అందించే(నాజల్ స్ప్రే) కోవిడ్ వ్యాక్సిన్ను త్వరలో దేశంలో బూస్టర్ డోస్గా తీసుకువస్తున్నట్టు పేర్కొంది. గోవాగ్జిన్ టీకా నుంచి నాజల్ వ్యాక్సిన్ రూపంలో దీన్ని అందించనున్నారు. డీజీసీఏ నుంచి తుది ఆమోదం పొందిన వెంటనే బూస్టర్ డోస్ రిలీజ్చేయనున్నట్టు సమాచారం. జాతీయ మీడియా సమాచారం మేరకు నాజల్ వ్యాక్సిన్కు అనుమతులు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే వారంలో టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. 18 ఏళ్లుపైన వయసు ఉన్న వారికి బూస్టర్ డోస్గా నాజల్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నాజల్ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం? నాజల్ వ్యాక్సిన్లు ఇంజెక్షన్ ద్వారా తీసుకునే వ్యాక్సిన్తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను కలిగి వున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, నాజల్ వ్యాక్సిన్లను నిల్వ సౌలభ్యం, పంపిణీలో సులభంగా ఉంటుంది. నాజల్ వ్యాక్సిన్లు వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు , ఎగువ శ్వాస కోశం వద్ద రక్షణను అందిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. #Breaking | Bharat Biotech’s nasal Covid vaccine to be rolled out as booster dose #6PMPrime #Covid #India | @Akshita_N @milan_reports pic.twitter.com/HutHQ7tLMj — IndiaToday (@IndiaToday) December 22, 2022 -
COVID-19 Vaccine: నోటి ద్వారా కరోనా టీకా.. ప్రపంచంలో ఇదే మొదటిది
బీజింగ్: సూది(సిరంజీ)తో అవసరం లేకుండా నోటి ద్వారా తీసుకొనే కోవిడ్–19 టీకా చైనాలోని షాంఘై నగరంలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ తరహా టీకా ప్రపంచంలో ఇదే మొదటిదని చెబుతున్నారు. టీకా తీసుకున్న తర్వాత 5 సెకండ్ల పాటు శ్వాస పీల్చుకోవడం ఆపేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ 20 సెకండ్లో పూర్తవుతుంది. ఈ టీకా తీసుకుంటే ఒక కప్పు టీ తాగినట్లే ఉందని షాంఘై వాసి ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇన్హేలర్ లాగా నోటి ద్వారా తీసుకొనే ఈ టీకాను బూస్టర్ డోసుగా ఉచితంగా ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సూదితో కంటే ఇది సులభంగా అందజేయవచ్చన్నారు. -
మరణించిన వ్యక్తికి.. బూస్టర్ డోస్
బయ్యారం(వరంగల్): మరణించిన వ్యక్తికి బూస్టర్ డోస్ వేసినట్లు ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. మండల కేంద్రానికి చెందిన బొందలపాటి కృష్ణయ్య(87) అనారోగ్యంతో గత నెల 28న మృతి చెందాడు. అంతకుముందు కృష్ణయ్య సంగారెడ్డి జిల్లా పరిధిలో నివాసం ఉండేవారు. కోవిడ్ టీకా రెండు డోసులూ సంగారెడ్డి జిల్లా బానూర్ పీహెచ్సీ పరిధిలో వేసుకున్నాడు. అయితే ఈనెల 17న క్రిష్ణయ్యకు బూస్టర్డోస్ వేసినట్టు సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి గురై ఆన్లైన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పరిశీలించారు. అందులోనూ బూస్టర్డోస్ వేసినట్టు ఉంది. -
కోవిడ్ వ్యాక్సిన్పై మాట మార్చిన కేంద్రం.. తెరపైకి కొత్త కంపెనీ!
న్యూఢిల్లీ: కోవిషీల్డ్, కోవాగ్జిన్ కోవిడ్ టీకాలు తీసుకున్న వ్యక్తులు బూస్టర్ డోసుగా బయోలాజికల్–ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోర్బావ్యాక్స్ వ్యాక్సిన్ వేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. ఇప్పటివరకు ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నామో బూస్టర్ డోసుగా అదే కంపెనీ వ్యాక్సిన్ బూస్టర్ వేసుకోవాలని చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా వేరే కంపెనీకి చెందిన వ్యాక్సిన్కు అనుమతినిచ్చింది. కోవిడ్–19పై నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫార్స్ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఈ అనుమతులు మంజూరు చేసింది. కోవిషీల్డ్ లేదంటే కోవాగ్జిన్ తీసుకున్న ఆరు నెలలు లేదంటే 26 వారాల తర్వాత కోర్బావ్యాక్స్ను 18 ఏళ్లకు పైబడిన వారు బూస్టర్ డోసుగా వేసుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. చదవండి: ధనికులకు మాఫీలు.. పేదలకు పన్నులు: కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్ -
Free Chhole Bhature: బూస్టర్ డోస్ తీసుకున్నవారికి బంపర్ ఆఫర్!
చండీగఢ్: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది కేంద్రం. అయితే.. ప్రజల నుంచి స్పందన లేకపోవటం వల్ల ఉచితంగా అందిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 రోజుల పాటు ఈ ఉచిత డోసులు అందిస్తామని తెలిపింది. మరోవైపు.. మూడో డోసు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను పోత్సహించేందుకు కొందరు తమ వంతుగా పాటుపడుతున్నారు. చండీగఢ్కు చెందిన స్ట్రీట్ వెండర్ ఉచితంగా ఛోల్ భతుర్(సెనగ మసాల పూరీ) టిఫిన్ అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. కరోనా వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నవారికేనని ఓ షరతు పెట్టారు. ఉత్తర భారతంలో చోల్ భతురే చాలా ఫేమస్. సెనగ మసాలా కర్రీతో పూరీని అందిస్తారు. ఈ స్నాక్స్ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ స్ట్రీట్ ఫుడ్కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు 45 ఏళ్ల సంజయ్ రాణా. చండీగఢ్లో తన ద్విచక్రవాహనంలో ఛోలో భతురేను విక్రయిస్తారు సంజయ్. గత 15 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. ‘అర్హులైన ప్రతిఒక్కురు ముందుకు వచ్చి మూడో డోసు తీసుకోవాలి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ కరోనా పెరుగుతోంది. పరిస్థితులు చేతి నుంచి చేజారేవరకు ఎందుకు వేచి చూడాలి? ప్రికాషన్ డోసు వేసుకున్న రోజున తన వద్దకు వస్తే ఉచితంగా ఈ ఛోలో భతురేను ఇస్తున్నా.’ గత ఏడాది సైతం తొలి డోసు వేసుకున్న వారికి ఉచితంగా అందించారు సంజయ్. ఈ విషయాన్ని మన్కీ బాత్లో ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంజయ్ రాణాపై ప్రశంసలు కురిపించారు. ఇదీ చదవండి: ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి.. ఎలాగంటే -
ఉచిత బూస్టర్ డోస్ 24/7
సాక్షి, హైదరాబాద్: నగర వ్యాప్తంగా ఉచిత బూస్టర్ డోస్ కార్యక్రమం ఊపందుకుంటోంది. గత ఏప్రిల్ 10 నుంచి ఇప్పటిదాకా 60 ఏళ్లు పైబడిన వారికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమం నిర్వహించగా, తాజాగా దీనిని 18 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా విస్తరించారు. రెండో డోస్ నుంచి 6 నెలల వ్యవధి వచ్చిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ టీకా అందించే ప్రక్రియను గత శుక్రవారం ప్రారంభించారు. నగర వ్యాప్తంగా మొత్తం 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ కార్యక్రమం కొనసాగనుంది. ఆఫీసులు.. కళాశాలల్లోనూ.. ఇటీవల కోవిడ్ కేసులు పెరగడం, కొత్త వేరియంట్ల రాకపై అంచనాల నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కోవాగ్జిన్, కోవిషీల్డ్ బూస్టర్డోస్లకు ఆర్డర్ ఇచి్చంది. ఇవి అందుబాటులోకి రావడంతో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో కూడా టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలలోనూ ఏర్పాటు చేస్తున్నారు. గత శనివారం వరకూ వానల కారణంగా విద్యా సంస్థలు మూసి ఉండడంతో సోమవారం నుంచీ వీటి ఏర్పాటు మొదలైంది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రానికి స్పందన చాలా బాగుందని, తొలిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యవధి నిర్ణయించుకోగా లబి్ధదారులు పెరగడంతో రాత్రి 8 గంటల దాకా కూడా కొనసాగించామని సెంటర్ ఇన్చార్జి సుధా ఓంకార్ చెప్పారు. 20 వేలు దాటిన ఫ్రీ బూస్టర్ గత 15వ తేదీ నుంచి మంగళవారం దాకా 20,485 వరకు వ్యాక్సిన్లు అందించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్ చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో కాకుండా అభ్యర్థనను అనుసరించి 100 మందికి మించి విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ బూస్టర్ డోస్ కేంద్రాలను నెలకొల్పుతున్నామని చెప్పారు. ఆయా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ 24/7 కొనసాగుతుందన్నారు. (చదవండి: డిటెన్షన్ సెంటర్ @ వికారాబాద్! ) -
AP: బూస్టర్ డోస్ తప్పనిసరి
మహారాణిపేట(విశాఖ దక్షిణ): కరోనా బూస్టర్ డోస్ అమలుకు అధికార యంత్రాంగం శుక్రవారం శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లాలోని కేజీహెచ్, ప్రభుత్వ ఆస్పత్రులు, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఒకటి, రెండు డోస్లు వేసుకున్న అందరికీ దీనిని వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మొత్తం 14,57,463 మందికి బూస్టర్ డోస్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందులో 18 నుంచి 44 ఏళ్ల వయసున్న 9,02,463 మంది, 45 నుంచి 59 ఏళ్ల లోపు 5,60,340 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 5,340 మందికి బూస్టర్ డోస్ వేశారు. ఈ నెల 15 నుంచి రెండున్నర నెలల పాటు(సెప్టెంబర్ 30 వరకు) వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ సమయం లోగా ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 800 మందికి బూస్టర్ డోస్ వేసినట్లు ఆమె చెప్పారు. ఫస్ట్, సెకండ్ డోస్లు పూర్తయిన వారు.. విశాఖ జిల్లాలో మొత్తం 20,85,216 మందికి కరోనా మొదటి డోస్.. 21,81,642 మందికి రెండో డోస్ టీకాలు వేశారు. మొదటి డోస్లో 115.5 శాతం మంది, రెండో డోస్లో 104.60 శాతం మంది ఉన్నారు. హెల్త్కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 18 నుంచి 44 ఏళ్ల వయస్సు గల వారు, 45 నుంచి 59 ఏళ్ల వయస్సు గలవారు, 60 ఏళ్లు దాటిన వారు, 12 నుంచి 14 ఏళ్ల లోపు వారు, 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేయించుకోవాలని డీఎంహెచ్వో పేర్కొన్నారు. బూస్టర్ డోస్ తప్పనిసరి జిల్లాలోని కేజీహెచ్తోపాటు 63 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక ఏరియా ఆస్పత్రి, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోస్ వేస్తున్నారు. మొదటి, రెండో డోస్లు వేసుకున్న ప్రతి ఒక్కరూ నిర్ణీత కాలంలో ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకొని బూస్టర్ డోస్ వేయించుకోవాలి. – డాక్టర్ కె.విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి -
Booster Dose: ఇకపై ఫ్రీగా కరోనా బూస్టర్ డోస్
ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే 199.72 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఇప్పటి వరకు 18-59 ఏళ్ల వారికి రెండు డోసులు ఉచితంగా అందించింది కేంద్రం. ఆ తర్వాత ఏప్రిల్ 10న ప్రికాషన్ డోసుల పంపిణీ ప్రారంభించింది. అయితే.. 18-59 ఏళ్ల వారు ప్రికాషన్ డోస్ను ప్రైవేటు కేంద్రాల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. అలాగే 60 ఏళ్లుపైబడిన వాళ్లకు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వారియర్లకు మూడో డోసు ఫ్రీగానే అందించింది. కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రికాషన్ డోస్పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవటం వల్ల ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా ప్రికాషన్ డోసు అందించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. జులై 15న మొదలై 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా మూడో డోసు అందించనున్నారు. 'దేశ జనాభాలో ఎక్కువ మంది తొమ్మిది నెలల క్రితమే రెండు డోసులు తీసుకున్నారు. ఐసీఎంఆర్, ఇతర అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల్లోపు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. బూస్టర్ డోస్ తీసుకుంటే ఇమ్యూనిటీ ప్రతిస్పందన మెరుగ్గా ఉంటుందని తేలింది. 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో 18-59 ఏళ్ల వారికి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా ప్రికాషన్ డోసు అందించనున్నారు. జులై 15న ప్రారంభం కానుంది.' అని అధికారులు తెలిపారు. కేవలం ఒక శాతమే.. ఇప్పటి వరకు దేశంలోని 77 కోట్ల మంది ఉన్న 18-59 ఏళ్ల వయసు వారిలో కేవంల 1 శాతం మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారు. అర్హత కలిగిన 60 ఏళ్లు పైబడినవారు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లు 16 కోట్ల మంది ఉండగా.. అందులో 26 శాతం మంది మూడో డోసు తీసుకున్నారు. వ్యవధి తగ్గింపు.. కొద్ది రోజుల క్రితమే ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉండగా.. ఆ సమయాన్ని ఆరు నెలలకు కుదించింది. వ్యాక్సినేషన్పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్ వేగం పెంచేందుకు ఇంటింటికీ టీకా 2.O పథకాన్ని జూన్ 1న ప్రారంభించింది కేంద్రం. ప్రస్తుతం ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 96 శాతం మంది తొలి డోసు తీసుకోగా.. 87 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ఇదీ చదవండి: కోవిడ్ టీకా తీసుకున్నవారికి రూ.5 వేల రివార్డు.. నిజమెంత? -
ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్: బూస్టర్ డోస్పై కేంద్రం కీలక నిర్ణయం
Covid booster dose.. దేశంలో ఫోర్త్ వేవ్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య గ్యాప్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డోసుల మధ్య గ్యాప్ను ఆరు నెలలకు తగ్గించింది. సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య వ్యవధిని తగ్గించాలని వ్యాక్సినేషన్పై సలహా మండలి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) సూచించింది. ఈ మేరకు తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సెకండ్ డోస్కు, బూస్టర్ డోస్కు మధ్య 9 నెలల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను తాజాగా 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, 18-59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు.. సెకండ్ డోస్ తీసుకున్న ఆరు నెలలు లేదా 26 వారాల తర్వాత ప్రికాషన్ డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, నిర్వాహకులకు లేఖ ద్వారా తెలిపారు. Gap between second COVID jab and booster dose reduced from 9 to 6 months Read @ANI Story | https://t.co/Ej35O8Q0ef#Covid_19 #Covidbooster #Covidvaccination #CovidVaccine #BoosterDoseGap pic.twitter.com/fj0WZYydQQ — ANI Digital (@ani_digital) July 6, 2022 ఇది కూడా చదవండి: తెలంగాణలో జికా వైరస్ కలకలం.. హెచ్చరించిన వైద్యులు -
‘భిన్న’ బూస్టర్డోస్గా కార్బెవ్యాక్స్
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ తయారుచేసిన కార్బెవ్యాక్స్ కోవిడ్ టీకాను బూస్టర్ డోస్గా ఇచ్చేందుకు ఆ సంస్థకు భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) తాజాగా అనుమతులిచ్చింది. దేశంలోనే హెటిరోలోగస్ బూస్టర్ డోస్గా అనుమతి పొందిన తొలి సంస్థ తమదే అని బయోలాజికల్ ఈ శనివారం ప్రకటించింది. ముందుగా తీసుకున్న రెండు టీకాల తర్వాత వేరే తయారీ సంస్థకు చెందిన కోవిడ్ టీకా మూడోదిగా తీసుకుంటే దానిని హెటిరోలోగస్ బూస్టర్ డోస్గా వ్యవహరిస్తారు. దేశంలో 18 ఏళ్లు, ఆపైబడిన వయసు వారు కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ రెండు డోస్లు తీసుకున్న 6 నెలల వ్యవధి తర్వాత బూస్టర్డోస్గా కార్బెవ్యాక్స్ను తీసుకోవచ్చు. -
మూడో టీకా ఎక్కడ?
శివాజీనగర: రానున్న రోజుల్లో కరోనా నాలుగో దాడి నుంచి బయటపడడానికి మూడవ టీకా.. బూస్టర్ డోస్ తీసుకోవటం అనివార్యం. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బూస్టర్ డోస్ లభించకపోవడంతో జనం ఆందోళనకు కారణమైంది. బెంగళూరులోని పాలికె ఆసుపత్రుల్లో బూస్టర్ డోస్ ఉండడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం కావలసింత టీకా నిల్వలు ఉన్నాయి. బూస్టర్ డోస్ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ ధరను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్థోమత ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేసుకొంటున్నారు. అంత డబ్బు పెట్టలేనివారు ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరుగుతూ లేదని చెప్పించుకుంటున్నారు. సామాన్యులకు కష్టం మరోవైపు మంత్రులేమో ఆస్పత్రుల్లో బూస్టర్ టీకా ఉచితంగా వేస్తున్నట్లు రోజూ చెబుతుంటే వాస్తవం మరోలా ఉంది. సామాన్యులు, పేదలు మూడో టీకా కోసం వేచి చూస్తున్నారు. రెండు డోస్ల టీకాలను ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం నాలుగో దాడి పొంచి ఉన్న సమయంలో చేతులెత్తేయడం ఏమిటని పలువురు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తక్షణం ఉచిత బూస్టర్ డోస్ను అందరికీ పంపిణీ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. (చదవండి: పరిహారం కోసం సీఎం ఇంటికి పాదయాత్ర..) -
ఓపెన్ మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోస్.. ధర ఎంతంటే ?
కరోనా తీవ్రత తగ్గి జనజీవతం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.అయితే ఇప్పటికీ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో 18 ఏళ్లు పైబడి ఇప్పటికే రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు బూస్టర్ డోసు వేసుకోవడం మంచిందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ తరుణంలో బూస్టర్ డోస్ను ఓపెన్ మార్కెట్లో అందిస్తున్నట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. దేశంలోనే తొలి కరోనా టీకా కోవిషీల్డ్ని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసింది. మొదటి రెండు డోసులు దాదాపుగా ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందించింది. కాగా బూస్టర్ డోసును ప్రభుత్వ ఆధ్వర్యంతో ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం అందించింది. కాగా ఇప్పుడు బూస్టర్ డోసును ఓపెన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో బయట మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోసుకు రూ. 600లుగా సీరమ్ నిర్ణయించింది. దీనికి స్థానిక పన్నులు అదనం అని సీరమ్ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా కొనుగోలుకు రూ. 600 ధర వర్తిస్తుందని, ఆస్పత్రులకు తక్కువ ధరకే సరఫరా చేస్తామని కూడా తెలిపింది. ఈ వ్యాక్సిన్ 2022 ఏప్రిల్ 10 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్వర్కర్లు 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసును ప్రభుత్వం ఉచితంగా అందివ్వనుంది. #LargestVaccineDrive Precaution/ booster Dose to be now available to all 18+ population group from 10th April, 2022, at Private Vaccination Centres.https://t.co/f0QDul20gz#CovidVaccine #IndiaFightsCorona @narendramodi @mansukhmandviya @blsanthosh @saudansinghbjp pic.twitter.com/dinGOwC4aq — Tajinder Singh Sran (@TajinderSTS) April 8, 2022 చదవండి: గుడ్ న్యూస్: బహిరంగ మార్కెట్లో విక్రయానికి 2 వ్యాక్సిన్లకు అనుమతి -
విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్ డోసు!
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాలు, క్రీడలు, అధికారిక, వ్యాపార కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్లేవారికి కరోనా టీకా బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేంద్రం త్వరలోనే అనుమతిచ్చే అవకాశముందని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. దీన్ని ప్రైవేట్ కేంద్రాల్లో ఇవ్వాలా, ఉచితంగానా, రుసుముతోనా అనేదానిపై సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించాయి. 60 ఏళ్లు దాటిన వారితోపాటు హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు ఇప్పటికే బూస్టర్ డోసుఇస్తున్నారు. కొన్ని దేశాలు బూస్టర్ డోసు తీసుకున్నవారినే దేశంలోకి అనుమతిస్తున్నాయి. భారత్లో ఆదివారం నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విదేశాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పాలంటే సాధ్యమైనంత త్వరగా బూస్టర్ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత మార్గదర్శకాల మేరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలి. -
చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ ఇచ్చారట.. ఇంకేముంది!!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని న్యూ గొల్లగూడెంకు చెందిన కొత్త మల్లారెడ్డి (రిటైర్డ్ హెడ్మాస్టర్) ఈనెల 11న చనిపోయారు. కానీ వైద్య శాఖ సిబ్బంది మాత్రం ఫిబ్రవరి 16, బుధవారం రోజున బూస్టర్ డోస్ తీసుకున్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే విషయం సెల్ఫోన్కు మెసేజ్ రాగా, వాళ్ల కుటుంబ సభ్యులు కోవిన్ యాప్లో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి చూస్తే, అందులో కూడా ఇవాళ వ్యాక్సిన్ వేసినట్టుగా ఎంట్రీ చేశారు. మల్లారెడ్డి భార్య కళావతికి కూడా ఇవాళ బూస్టర్ డోస్ వేయకున్నా, వేసినట్టుగా మెసేజ్ రావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చదవండి: (మేడారం గద్దెపైకి సారలమ్మ.. చిలకలగుట్ట నుంచి రానున్న సమ్మక్క) -
మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్ ప్రారంభం
శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో మొబైల్ కోవిడ్ వ్యాక్సిన్ వ్యాన్ను జాయింట్ జోనల్ కమిషనర్ మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ళు నిండిన వారు రెండు డోసుల వ్యాక్సి న్ వేయించుకొని 9 నెలలు పూర్తి అయితే బూస్టర్ డోస్ వేస్తామన్నారు. వికలాంగులు, సిక్ అయిన వారికి ఇంటికే వెళ్లి బూస్టర్ డోస్ వేస్తామని వివరించారు. శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిల్ పరిధిలోని వారు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. వృద్దులు, సిక్ అయిన వారు బూస్టర్ డోస్ కోసం కంట్రోల్ రూం నెంబర్ 040–21111111లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంహెచ్ఓలు డాక్టర్ రవి, డాక్టర్ కార్తీక్, పీఓ మాన్వి తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి కార్టూన్
-
మాస్కు ఆంక్షలను ఎత్తేసిన ఇంగ్లండ్
లండన్: మాస్కులు తప్పనిసరి సహా పలు కోవిడ్ ఆంక్షలను ఇంగ్లండ్ గురువారం ఎత్తేసింది. బూస్టర్ డోస్ టీకా తీవ్రమైన అనారోగ్యంతోపాటు ఆస్పత్రుల్లో చేరడాన్ని తగ్గించిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుంచి ఇంగ్లండ్లో ఎవ్వరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఇక నైట్ క్లబ్బులు, ఇతర వేదికలకు కోవిడ్ పాసులు కూడా అవసరం లేదని తెలిపింది. ఇక ఇంటినుంచే పని, స్కూళ్లలో ఫేస్ మాస్కుల నిబంధనను గత వారమే ప్రభుత్వం ఎత్తివేసింది. ఓమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తిని అడ్డుకోవడానికి, బూస్టర్ డోస్ వేసుకోవడానికి సమయమిస్తూ డిసెంబర్ మొదటివారం నుంచే ‘ప్లాన్ బి’ చర్యలు ప్రారంభించింది. అందరికీ బూస్టర్ డోసు టీకాలు వేయడంతోపాటు, నిర్ధారణ పరీక్షలు, యాంటీ వైరల్ చికిత్సలను అందించడంలో యూరప్ బలంగా పనిచేసిందని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావీద్ తెలిపారు. వైరస్ పూర్తిగా నిర్మూలనయ్యే అవకాశం లేదని, వైరస్తో సహజీవనం నేర్చుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ తగ్గుముఖం పడుతున్నా.. పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 12 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ 84 శాతం పూర్తయ్యిందని, అర్హత ఉన్నవాళ్లంతా రెండో డోసు తీసుకున్నారని, 81 శాతం మంది బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని వెల్లడించారు. ఆస్పత్రుల్లో చేరిక, ఐసీయూ చికిత్సలో ఉన్నవారి సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని, కొత్త సంవత్సరం సమయంలో రోజుకు రెండులక్షలున్నా ఇప్పుడు లక్షకు పడిపోయాయని తెలిపారు. మరోవైపు గురువారం యూకేలో 96,871 కొత్త కేసులు నమోదయ్యాయి. 338 మరణాలు సంభవించాయి. గతవారమే ప్రకటన ఒమిక్రాన్ బారిన పడినవారి సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రధాని బోరిస్ జాన్సన్ గత వారమే ప్రకటించారు. అయితే... తమ వినియోగదారులను ఫేస్ మాస్కులు ధరించమని కోరతామని కొన్ని దుకాణదారులు, రవాణా సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం చట్టపరమైన చర్యల నుంచి తప్పుకొంది. ఇక అయితే రాజధానిలోని బస్సులు, సబ్ వే రైళ్లలో ఇప్పటికీ మాస్కులు వసరమని లండన్ మేయర్ సాధిక్ ఖాన్ తెలిపారు. ఇక ఒమిక్రాన్ సోకి వారికి ఐదురోజుల ఐసోలేషన్ సరిపోతుందన్నారు. కోవిడ్ 19ను ఫ్లూలాగా పరిగణించి దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేస్తున్నట్లు అక్కడి ఆరోగ్యాధికారులు తెలిపారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్లు సొంత ప్రజారోగ్య నియమాలను రూపొందించుకున్నాయి. అదేవిధంగా వారి వైరస్ నిబంధనలను కొంత సడలించాయి. -
తెలంగాణ: వచ్చేవారంలో పతాకస్థాయికి ఒమిక్రాన్.. తగ్గేది మాత్రం అప్పుడే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ వచ్చే వారం నాటికి తీవ్రస్థాయికి చేరుకుంటుందని కాంటినెంటల్ ఆసుపత్రుల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే వారం తర్వాత తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రెండు మూడు వారాల్లో పీక్కు చేరుకుంటుందని చెప్పారు. ఫిబ్రవరి చివరి నాటికి తగ్గుముఖం పడుతుందన్నారు. మానవుడి పుట్టుక తర్వాత ఇంత వేగంగా విస్తరించిన వైరస్ లేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత, వ్యాప్తి, చికిత్స, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై డాక్టర్ గురు ఎన్ రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 80 శాతం మందికి వైరస్... మీజిల్స్ వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది అనుకున్నాం. కానీ ఒమిక్రాన్ దానిని మించిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది వైరస్ బారినపడతారు. 50 నుంచి 80 శాతం వేగంతో విస్తరిçస్తున్నందున త్వరగా ఇన్ఫెక్ట్ చేస్తుంది. దగ్గు, జలుబు తుంపర్ల ద్వారా ఇది విస్తరిస్తుంది. మాస్క్ లేకుండా ఉంటే మరింత వేగంగా విస్తరిస్తుంది. ఇళ్లలో ఒకరికి వస్తే ఇతరులకూ వ్యాపిస్తుంది. (చదవండి: ఆటలు వద్దు.. సూచనలు జారీ చేసిన విద్యాశాఖ కమిషనర్) ఊపిరితిత్తులను ఇన్ఫెక్ట్ చేయదు ఒమిక్రాన్ సోకినప్పుడు ఎక్కువ కేసుల్లో లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. గొంతులో ముక్కులో ఉండే వైరస్ ఇది. ఊపిరితిత్తులను ఇన్పెక్ట్ చేయదు. డెల్టా మందులు పనికిరావు డెల్టాకు వాడే మందులు ఒమిక్రాన్కు పనికిరావు. డెల్టాకు స్టెరాయిడ్స్, రెమిడిసివిర్, మోనొక్లోనాల్ యాంటీబాడీస్ ఉపయోగించాం. కానీ ఒమిక్రాన్కు ‘మాన్లువిరపిర్’అనే మాత్ర వేసుకోవాలి. ఇది ఎం తో సురక్షితమైంది. మొదటి రెండ్రోజులు జ్వరం అ లాగే ఉంటే ఈ మందు వేయొచ్చు. కానీ గర్భిణిలు, త్వరలో ప్రెగ్నెన్సీ వచ్చే వారికి ఇవ్వకూడదు. ఈ మందు తీసుకున్న ఆరు నెలల వరకు ప్రెగ్నెన్నీ కో సం ప్రయత్నించకూడదు. కొందరు అనుభవం లేని డాక్టర్లు ఇప్పటికీ అనవసరంగా క్లోరోక్విన్, ఐవర్మెక్టిన్, యాంటీబయోటిక్ మందులు ఇస్తున్నారు. డెల్టానా, ఒమిక్రానా తెలుసుకోవచ్చు ఎస్ జీన్ ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్చేస్తే అందులో ఒమిక్రానా లేదా డెల్టా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షలు ప్రభుత్వంలో అందుబాటులో లేవు. ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లో కొన్నిచోట్ల చేస్తున్నారు. మేము మా ఆస్పత్రిలో రూ.1,200 తీసుకుని ఔట్ పేషెంట్లకు, అవసరమైన వారికి కూడా చేస్తున్నాం. డోలో వేసుకుంటే చాలు: ఒమిక్రాన్లో జ్వరం వస్తే డోలో వేసుకుంటే సరిపోతుంది. ఏడు రోజులు ఐసోలేషన్లో ఉండి, చివరి 24 గంటల్లోపు జ్వరం లేకుంటే సాధారణ జీవనంలోకి రావొచ్చు. డోలో వేసుకున్నా రెండు మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోతే అప్పుడు డాక్టర్ను సంప్రదించాలి. ఇది సోకితే భవిష్యత్తులో కోవిడ్ రాదు ఒమిక్రాన్ వచ్చిపోయిన వారికి దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది ఏళ్లపాటు ఉంటుందంటున్నారు. మళ్లీ భవిష్యత్తులో కోవిడ్ రాకుండా కాపాడుతుందని అంటున్నారు. ఒమిక్రాన్ వచ్చినవారికి డెల్టా వేరియంట్ వచ్చే అవకాశం ఉండదు. కానీ డెల్టా వచ్చిన వారికి ఒమిక్రాన్ వస్తుంది. బూస్టర్తో మెరుగైన రక్షణ రెండు వ్యాక్సిన్ల తర్వాత బూస్టర్ తీసుకోవాలని సూచిస్తున్నాం. మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. ఒమిక్రాన్ వచ్చినా 90 శాతం మందికి ఐసీయూకు వెళ్లే ప్రమాదం ఉండదు. మరణాలు ఉండవు. అలసట, తలనొప్పి ఉంటాయి ఒమిక్రాన్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నాలుగు వారాల వరకు అలసట, తలనొప్పి, ఆందోళనతో కూడిన మానసిక స్థితి ఉంటుంది. ఒమిక్రాన్ వైరస్ వెన్నెముక ద్రవంలోకి చేరుకొని, తర్వాత మెదడుకు చేరుకొని అక్కడ వాపు తీసుకొస్తుంది. దీనివల్ల నాలుగైదు వారాలు పై సమస్యలు వస్తాయి. నిద్ర సరిగా పట్టక పోవడం ఉంటుంది. పిల్లలు తట్టుకుంటున్నారు పిల్లలు ఒమిక్రాన్ను తట్టుకుంటున్నారు. ఎవరికీ ఏమీ కావట్లేదు. తల్లిదండ్రులు భయపడి పిల్లల్ని ఆస్పత్రులకు తీసుకొచ్చి చూపిస్తున్నారు. 10% కంటే తక్కువ ఐసీయూ ఆక్యుపెన్సీ హైదరాబాద్లో మాలాంటి ఐదారు పెద్దాసుపత్రుల్లోని ఐసీయూల్లో 10 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉంది. కొందరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని కోరుకుంటూ వస్తున్నారు. కొందరు కొత్త మందుల కోసం వస్తున్నారు. మన ప్రభుత్వాలను అభినందించాలి మన దేశంలో వ్యాక్సినేషన్ బాగా జరగడం వల్ల మరణాలు పెద్దగా లేవు. మరణించేవారిలో 90 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే. వ్యాక్సినేషన్తో ఎంతో ప్రయోజనం చేకూరింది. తెలంగాణ , ఏపీల్లో పీహెచ్సీల్లో సైతం వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వాలను అభినందించాలి. (చదవండి: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్ హెల్మెట్కు బై బై?) -
బూస్టర్ డోస్పై తెలంగాణ సర్కార్ కీలక ప్రతిపాదన..!
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఎటుచూసినా కేసులే కనిపిస్తున్నాయి. ఇళ్లలో ఎవరికివారే కరోనా టెస్టులు చేసుకునే అవకాశం ఉండటంతో అధికారికంగా ప్రకటించే కేసుల సంఖ్య కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో జనం కరోనా వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు. రెండో డోస్ పూర్తయినవారు బూస్టర్ డోస్ (ప్రికాషనరీ) కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఫ్రంట్లైన్ వారియర్స్, వైద్య సిబ్బందికి మాత్రమే బూస్టర్ డోస్ వేస్తున్నారు. పైగా వీరికి రెండో డోస్ పూర్తయిన 9 నెలలకు వేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారమే ప్రస్తుతం బూస్టర్ డోస్ వేస్తున్నారు. సుదీర్ఘ గడువు వల్ల కీలకమైన కరోనా కల్లోల సమయంలో చాలామంది బూస్టర్ డోస్ వేయించుకునే పరిస్థితి లేదు. దీంతో యాంటీబాడీస్ లేక కరోనాకు గురయ్యే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. దీంతో డోస్ తర్వాత 9 నెలలకు ప్రికాషనరీ డోస్ వేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేసి, గడువును ఆరు నెలలకే కుదించాలని పలువురు కోరుతున్నారు. పైగా రెండో డోస్ వేయించుకున్న ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ వేయాలన్న ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు. వ్యాక్సిన్తోనే రక్షణ... అందుకే డిమాండ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 5.07 కోట్ల కరోనా టీకా డోస్లు వేశారు. అందులో మొదటి డోస్ 100 శాతం పూర్తయింది. రెండో డోస్ కూడా 76 శాతం మందికి వేశారు. 15–17 ఏళ్ల వయస్సు పిల్లల్లో 51 శాతం మందికి వేశారు. 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్లకు లక్షన్నర మందికి వేశారు. అయితే బూస్టర్ డోస్ విషయంలో ప్రభుత్వం కొందరికే పరిమితం చేయడం, అది కూడా రెండో డోస్ తర్వాత తొమ్మిది నెలలకు వేయడంపై నిరాశ వ్యక్తపరుస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ బూస్టర్ వేయాలని కోరుతున్నారు. దేశంలో ముందుగా హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. తర్వాత 60 ఏళ్లు పైబడినవారికి, ఆ తర్వాత 45–59 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్ జరిగింది. గతేడాది మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ వేస్తున్నారు. గత నెల నుంచి 15–17 ఏళ్ల వయసు వారికి వేస్తున్నారు. ఇప్పటికే 18 ఏళ్లు పైబడి రెండో డోస్ పూర్తి చేసుకున్నవారు లక్షల్లో ఉన్నారు. వారందరూ ఇప్పుడు బూస్టర్ డోస్ కావాలని కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతించకపోవడంతో చాలామంది అధికారిక ధ్రువీకరణపత్రం అవసరం లేకపోయినా ఫర్వాలేదని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ డబ్బులు పెట్టి బూస్టర్ డోస్ వేయించుకుంటున్నారు. దేశంలో వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నందున బూస్టర్ డోస్ ఇవ్వాలన్న వినతులు వస్తున్నాయి. ఇక ఫ్రంట్లైన్, హెల్త్ వర్కర్లకు రెండో డోస్ వేసిన మూడు నెలలకే బూస్టర్ డోస్ ఇవ్వాలని కోరుతున్నారు. వారికి 3 నెలలకే ఇవ్వాలి రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలి. హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలి. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా) ప్రికాషనరీ డోసు ఇవ్వాలి. ఇక 18 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా పై ప్రతిపాదనలు ఇస్తున్నాం. ఆ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. – కేంద్రానికి రాసిన లేఖలో మంత్రి హరీశ్ -
డాక్టర్కే ఐదు డోసుల వ్యాక్సిన్! దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం
పట్నా: దేశంలో కరోనా వైరస్కు అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వం కోవిడ్ టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు డోసుల టీకాను ప్రజలకు అందిస్తోంది. ఇటీవల ఈ రెండు డోసులతో పాటు మూడో టీకాగా.. బూస్టర్ డోస్ కూడా వేస్తోంది. అయితే ఓ డాక్టర్ ఏకంగా ఐదు డోసుల టీకా వేయించుకున్నట్లు రికార్డులు చూపడం బీహార్లో కలకలం రేపింది. దీంతో బిహార్ ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. చదవండి: India Covid-19: కాస్త తగ్గిన రోజువారీ కేసులు.. అయినా కొత్తగా 2 లక్షలకు పైనే పట్నాలో సివిల్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ విభా కుమారి సింగ్ ఐదు కరోనా టీకాలు వేసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఈ విషయంపై సదరు డాక్టర్ స్పందిస్తూ.. తాను కోవిడ్ టీకా నిబంధనలకు లోబడి కేవలం మూడు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ (బ్యూస్టర్తో కలిపి) మాత్రమే వేయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే తన పాన్కార్డును ఉపయోగించుకొని ఎవరో మరో రెండు డోసుల టీకాను వేయించుకున్నారని తెలిపారు. కోవిన్ పోర్టల్ వివరాల ప్రకారం.. డాక్టర్ విభా 28 జనవరి, 2021న మొదటి డోసు, మార్చిలో రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. అదేవిధంగా 13 జనవరి, 2022న ఆమె బూస్టర్ డోస్ తీసుకున్నారు. అయితే ప్రభుత్వ రికార్డులు ప్రకారంలో ఆమె బూస్టర్ డోస్తో కలిపి 5 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు చూపడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 ఫిబ్రవరి 2021న మూడో డోసు, 17జూన్ 2021న నాలుగో డోసును ఆమె పాన్కార్డు ద్వారా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు రికార్డుల్లో వుంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
Omicron: ఒమిక్రాన్ ప్రతీ ఒక్కరికి సోకుతుంది
Booster doses won't stop the rapid spread of Omicron variant: కోవిడ్-19 కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ దాదాపు నియంత్రించలేం అని నిపుణులు నొక్కి చెబుతున్నారు. పైగా బూస్టర్ వ్యాక్సిన్లు ఈ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేవని, ప్రతి ఒక్కరూ ఈ వైరస్ బారిన పడతారని వక్కాణించారు. అయితే ఈ కొత్త రకం వేరియంట్కి భయపడవలసిన అవసరంలేదని నిజానికి అందరూ ఈ వైరస్ని ఎదుర్కోగలరని అన్నారు. ఇది డెల్టా కంటే ప్రమాదకరమైనది కాదని కాకపోతే ఆచరణాత్మకంగా మాత్రం ఈ ఒమిక్రాన్ వైరస్ ఉధృతిని ఆపలేం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీకి సంబంధించిన సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జైప్రకాష్ ములియిల్ అన్నారు.అయితే ఇక ఈ వ్యాధి మనకు జలుబు వలే వస్తుంటుందని కూడా చెప్పారు. పైగా దీన్ని ఎదుర్కొగల సహజ రోగ నిరోధక శక్తి మనలో ఉంటుందని, అందువల్ల భారత్ ఇతర దేశాల మాదిరి తీవ్రంగా ప్రభావితం కాలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు వ్యాక్సిన్లు ప్రవేశ పెట్టక ముందే మన దేశంలో దాదాపు 85% మందికి కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపారు. అలాగే వ్యాక్సిన్లు అనేవి శాశ్వత సహజ వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏ వైద్య సంస్థలు బూస్టర్ డోస్లు వైరస్ భారిన పడకుండా చేయగలవని స్పష్టం చేయలేదనే విషయాన్ని నొక్కి చెప్పారు. ఈ బూస్టర్ డోస్లు కేవలం ముదు జాగ్రత్త చర్యగా తీసుకునే చికిత్సలో భాగమే తప్ప ఆ వైరస్ భారిన పడకుండా మాత్రం కట్టడి చేయలేదని తెలిపారు. ఈ మేరకు బూస్టర్ డోస్ తీసుకున్నవాళ్లు సైతం ఈ కరోనా వైనస్ బారిన పడ్డారని నివేదికలు చెబుతున్నాయని ములియిల్ చెప్పారు. (చదవండి: యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడి కన్నుమూత) (చదవండి: నిందితుడికి బెయిల్.. అతన్ని రాత్రి గృహనిర్బంధం చేయాల్సిందే!) -
హైదరాబాద్ లోని చార్మినార్ లో బూస్టర్ డోస్ టీకా పంపిణి ప్రారంభం
-
నేటి నుంచి ఏపీలో బూస్టర్ డోసు
-
బూస్టర్ డోసు అంటే ఏమిటి?.. పాటించాల్సిన జాగ్రత్తలేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు వ్యాప్తి నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. 15–18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభమైనందున, తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించాలి. సోమవారం నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లతో పాటు 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు (దీర్ఘకాలిక వ్యాధులున్నవారు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నాం. అర్హులంతా తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. సంక్రాంతి రోజు గుంపులుగా కాకుండా ఎవరి ఇళ్లల్లో వారుండి పండుగ జరుపుకోవాలి. బూస్టర్ డోసు అంటే.. ► నిర్దిష్ట డోసుల మేరకు టీకా తీసుకున్న తర్వాత దాన్నుంచి లభించే రక్షణ తగ్గుతోందని భావించినప్పుడు అదనంగా ఇచ్చే దానినే బూస్టర్ డోసు అంటారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు బూస్టర్ డోసు ఇస్తున్నాయి. మన దేశంలో ప్రికాషనరీ (ముందుజాగ్రత్త) డోసుగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి వేస్తారు.. ► ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లు 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ టీకా వేస్తారు. రెండోడోసు తీసుకున్న 9 నెలలకు ఈ డోసు ఇస్తారు. ఏ టీకా తీసుకోవాలి.. ► గతంలో ఏ కంపెనీకి చెందిన టీకా రెండు డోసులు తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే టీకా వేస్తారు. మరొకటి తీసుకోకూడదు. ప్రికాషనరీ డోసుకు అర్హులైన లబ్ధిదారుల జాబితా కోవిన్ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. పాటించాల్సిన జాగ్రత్తలేంటి.. ► టీకా తీసుకున్న తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు సంబంధిత వ్యాక్సినేషన్ కేంద్రంలోనే ఉండాలి. ఆ సమయంలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా? లేదా? అని పరిశీలిస్తారు. డోసు వేసుకున్న రోజు మద్యం సేవించకూడదు. మాంసాహారం తినకూడదు. చదవండి: క్షణం ఆలస్యమై ఉంటే అంతే -
సైబర్ బొంకు..బూస్టర్ డోస్ పేరుతో నేరగాళ్ల నయా పన్నాగం
సాక్షి హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమతుంటే.. దీనిని సాకుగా తీసుకుని సైబర్ నేరస్తులు సరికొత్త మోసాలకు సిద్ధమవుతున్నారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ నకిలీ లింక్లు పంపిస్తున్నారు. ఇది నిజమేనని నమ్మి నేరస్తుల వలలో చిక్కి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు తాజాగా బూస్టర్ డోస్, ఉచిత ఒమిక్రాన్ పరీక్షల పేరిట మోసాలకు సిద్ధమవుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఫలానా రోజున, ఫలానా ప్రాంతంలో బూస్టర్ డోస్ కోసం ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి ఉన్న వాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని మెసేజ్, వాట్సాప్, ఈ–మెయిల్స్ పంపిస్తూ అమాయకులకు వల వేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో పలు కేసులు నమోదయ్యాయని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నగర ప్రజలూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఓటీపీతో హ్యాంకింగ్.. బూస్టర్ డోస్ ప్రచారాన్ని ప్రజలను నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు కాల్ స్పూఫింగ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మెడికల్, ఇతరత్రా ప్రభుత్వ విభాగాల నంబర్లను డిస్ప్లే అయ్యేలా స్పూఫింగ్ చేయడంతో మోసగాళ్లు ఫోన్ చేసినా సరే బాధితుల ఫోన్లో ‘వ్యాక్సిన్ డిపార్ట్మెంట్’ అని సెల్ఫోన్లో కనిపిస్తుంటుంది. దీంతో అటువైపు నుంచి బాధితులు కూడా సులువుగా నమ్మేస్తారు. టీకా కోసం షెడ్యూల్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నకిలీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మెసేజ్, వాట్సాప్, ఈ– మెయిల్స్కు నకిలీ లింక్లు పంపిస్తున్నారని తెలిసింది. తమ పేర్ల నమోదు నిర్ధారణ కోసం సెల్ఫోన్కు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) తెలపాలని కోరుతున్నారు. ఓటీపీ తెలపగానే.. బాధితుల సె ల్ఫోన్ లేదా కంప్యూటర్కు హానికరమైన సాఫ్ట్వేర్లను పంపిస్తారు. దీంతో బాధితుడి ఎలక్ట్రానిక్ ఉపకరణం హ్యాక్ అయిపోతుంది. ఆపైన సెల్ఫో న్లోని క్రెడిట్, డెబిట్ కార్డ్, యూపీఐ, ఆధార్, పాన్ కార్డ్ నంబర్లు, ఈ– మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తారు. వాటి సహాయంతో మోసాలకు పాల్పడే ప్రమాదముంది. 56 కేసులు నమోదు.. కరోనా ప్రారంభ దశలో సైబర్ నేరస్తులు కోవిడ్ మందులు, పల్స్ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల, కాన్సట్రేటర్లు, రోగ నిరోధక శక్తిని పెంచే సాధనాలు వంటివి సరఫరా చేస్తామనే మాయమాటలతో ప్రజలను నమ్మించి దోచుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది కరోనా మందుల బ్లాక్ మార్కెట్పై 56 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు బూస్టర్ డోస్ ఇస్తామని వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో ప్రచారాలను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కోవిడ్ బూస్టర్ డోస్ అంటూ వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఈ–మెయిల్స్ వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏ ప్రభుత్వ సంస్థలు, బ్యాంక్లు కూడా ఓటీపీ అడగవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఓటీపీ అడిగితే మోసమే బూస్టర్ డోస్ తీసుకుంటే సురక్షితమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో డోస్ ఇప్పిస్తామని నకిలీ మెసేజ్, ఫోన్లు, లింక్లు పంపించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ఎవరైనా క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలు, యూపీఐ, ఓటీపీ అడిగారంటే మోసమేనని గుర్తించాలి. – డాక్టర్ లావణ్య, డీసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ -
Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు! 30 కోట్లు దాటిన కేసులు!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు కొనసాగుతున్నప్పటికీ శుక్రవారం నాటికి 300 మిలియన్ల (30 కోట్లు)కు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు నివేదికలు తెల్పుతున్నాయి. మరోవైపు డజన్ల కొద్ది దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శర వేగంగా వ్యాపిస్తోంది. హాస్పిటల్లో పెరిగిన ఐదేళ్లలోపు పిల్లల చేరికలు వాక్సిన్కు అర్హత వయసులేని వారికి సంబంధించిన డేటాను అమెరికా శుక్రవారం విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం గత కొద్దివారాలుగా కోవిడ్ మహమ్మారి బారినపడ్డ ఐదేళ్లలోపు పిల్లలు ఆసుపత్రుల్లో చేరడం పెరిగిందని తెల్పింది. అందోళనకరమైన ఈ తాజా పరిణామం దృష్ట్యా పిల్లలకు టీకాల అవసరం ఎంతైన ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ రోచెల్ వాలెన్స్కీ పేర్కొన్నారు. గత నెల (డిసెంబర్) మధ్యకాలం నుంచి దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం పుంజుకుంది. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల రేటు ప్రతి లక్ష పిల్లల్లో 2.5 నుంచి 4 కంటే ఎక్కువ నమోదవుతుంది. 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లల్లో ఈ రేటు లక్షమందికి గాను 1గా నమోదవుతుందని మొత్తం 14 రాష్ట్రాల్లో 250 ఆసుపత్రుల్లో సీడీసీ సేకరించిన సమాచారం ప్రకారం తయారు చేసిన డేటా తెల్పుతోంది. నాలుగో డోస్ అవసరం లేదు: యూకే మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి నాలుగో డోస్ వ్యాక్సిన్ తీసుకోవల్సిన అవసరం లేదని బ్రిటీష్ ఆరోగ్య అధికారులు (యూకే) శుక్రవారం తెలిపారు. మూడో డోస్ తీసుకున్న 3 నెల్ల తర్వాత 65 అంతకంటే ఎక్కవ వయసున్న వృద్ధులు ఆసుపత్రుల్లో చేరడం దాదాపు 90 శాతం తగ్గిందని యూకే హెల్త్ సెక్యురిటీ ఏజెన్సీ తెల్పింది. కోవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లు దాటాయి ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 300 మిలియన్లను దాటింది. కాగా గత వారం రోజుల్లో డజన్ల కొద్దీ దేశాలలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అధికారిక ఏఎఫ్పీ గణాంకాల ప్రకారం గడచిన ఏడు రోజుల్లో మొత్తం 34 దేశాల్లో అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో యూరప్కు చెందినవి 18 దేశాలుకాగా, ఆఫ్రికాలో ఏడు దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్కవారంలోనే 13.5 మిలియన్ల కొత్త కేసులు నమోదవ్వడాన్నిబట్టి కోవిడ్ ఉధృతి ఎంత వేగంగా ఉందో తెలుస్తోంది. మరణాల సగటు రేటు మాత్రం మూడు శాతం పడిపోయింది. యుఎస్, యుకె, కెనడా, ఇజ్రాయెల్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఒమిక్రాన్తో ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం 70 శాతం కంటే తక్కువగా ఉందని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ అథారిటీ శుక్రవారం తెలిపింది. ఐతే గతంలో వచ్చిన వేరియంట్లకంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, తక్కువ ప్రమాదకారి అని తెలియజేసింది. చదవండి: అమెరికా చరిత్రలో ఇది చీకటి రోజు.. డొనాల్డ్ ట్రంప్పై బైడెన్ తీవ్ర విమర్శలు -
ఒమిక్రాన్పై మూడో డోస్ ప్రభావం 88%
లండన్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకి ఆస్పత్రి పాలవకుండా టీకా బూస్టర్ డోస్ 88 శాతం మేర రక్షణ కల్పిస్తుందని బ్రిటన్కు చెందిన యూకేఎస్హెచ్ఏ(యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ) అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ టీకా మొదటి రెండు డోసుల కన్నా మూడో డోసు అత్యధిక రక్షణనిస్తుందని తెలిపింది. కోవిడ్ టీకాల రెండో డోసు తీసుకున్న 6 నెలల అనంతరం వాటి రక్షణ 52 శాతానికి పడిపోతోందని ఆరోగ్య నిపుణుడు ప్రొఫెసర్ ఎరిక్ టోపాల్ చెప్పారు. ఈ సమయంలో బూస్టర్డోస్ ఇవ్వడం వల్ల కరోనాకు వ్యతిరేకంగా రోగనిరధోకత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బూస్టర్డోస్తో టీకా రక్షణ సామర్థ్ధ్యం ( రెండోడోసు ముగిసిన ఆరు నెలల తర్వాత) 52 నుంచి 88 శాతానికి పెరుగుతుందని ఎరిక్ చెప్పారు. రెండేళ్ల కిత్రం వెలుగు చూసిన వైరస్ స్పైక్ ప్రొటీన్ ఆధారంగా టీకాలు తయారు చేశారు. అయితే తర్వాత కాలంలో వైరస్ పలు రూపాంతరాలు చెంది ఒమిక్రాన్గా అవతరించింది. అయినప్పటికీ మూడో డోసు ఇస్తే టీకాలు దీన్ని సమర్ధవంతంగా అడ్డుకోవడం విశేషమని ఎరిక్ అభిప్రాయపడ్డారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్తో ఆస్పత్రి పాలవడం మూడు రెట్లు తక్కువగా ఉందని పరిశోధన తెలిపింది. ఐసీయూలో చేరికలు తక్కువే: బోరిస్ బ్రిటన్లో ఒమిక్రాన్ కారణంగా ఐసీయూలో చేరికలు తక్కువగానే ఉన్నాయని, గత వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉందని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం తెలిపారు. ముందు జాగ్రత్తకోసం బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరాన్ని మరోమారు ఆయన గుర్తు చేశారు. ఒమిక్రాన్తో ఐసీయూలో చేరిన కేసుల్లో అత్యధికం బూస్టర్ తీసుకోనివేనన్నారు. తన మంత్రులు గతంలో భావించినట్లు తీవ్రమైన లాక్డౌన్ నిబంధనలు అవసరపడకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గతవేరియంట్ల కన్నా ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఇంగ్లండ్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగాయి. -
‘ఫ్లొరోనా’కలకలం..! లక్షణాలివే..
Pregnant woman in Israel was found to be infected with ‘florona’: ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్తు ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్లో మరో కొత్త రకం వ్యాధి కలకలం రేపుతోంది. అక్కడ తొలి ‘ఫ్లొరోనా’ కేసు నమోదయ్యినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం గురువారం మీడియాకు వెల్లడించింది. ఓ గర్భిణీ స్త్రీలో మొదటి కేసు వెలుగు చూసినట్లు తెలిపింది. ఐతే ఆమె ఇంతవరకూ వ్యాక్సిన్ వేయించుకోలేదని స్పష్టం చేసింది. ఇది కొత్త రకం వెరియంట్ కాదని, ఒకే సమయంలో ఫ్లూ, కోవిడ్లకు చెందిన రెండు రకాల వైరస్లు శరీరంలోకి ప్రవేశించడం వల్ల రోగనిరోధకత వ్యవస్థ విచ్ఛిన్నమై ఫొరోనా సోకి ఉండవచ్చని ఇజ్రాయెల్ వైద్యులు తెలిపారు. అంతేకాకుండా గత కొన్ని వారాలుగా దేశంలో ఇన్ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో అది ఉద్భవించి ఉండవచ్చని పేర్కొన్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై, కొత్త వ్యాధి వ్యాప్తి కట్టడికి పూనుకుంది. ఇమ్యునిటీ వ్యవస్థను బలపరిచేందుకు శుక్రవారం నుంచే కోవిడ్ 19 నాలుగో డోస్ వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించింది. అలాగే అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు కూడా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతించింది. ఇక మూడో డోస్ వేసి 4 నెలలు గడుస్తున్న కారణంగా రోగనిరోధకత తగ్గిన వ్యక్తుల కోసం బూస్టర్ డోస్లు వేసున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్మన్ యాష్ పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అక్కడి వైద్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఒక్క గురువారం నాడే 5000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏమిటీ ఫ్లొరోనా? ఫ్లొరోనా అనేది కోవిడ్, ఇన్ఫ్లూయెంజా వైరస్లు ఒకే సమయంలో శరీరంలో ప్రవేశించడం వల్ల ఏర్పడిన డబుల్ ఇన్ఫెక్షన్. ఫ్లొరోనా వ్యాధి లక్షణాలివే.. ఫ్లొరోనా వ్యాధి తాలూకు లక్షణాలు కొంత ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు డేటా తెలుపుతోంది. ఐతే కోవిడ్-19 లక్షణాలతోపాటు గుండె కండరాలలో నొప్పి/మంట వంటి అదనపు లక్షణాలు కనిపిస్తాయి. అలాగే న్యుమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలతోపాటు, మయోకార్డిటిస్కు కూడా దారితీయవచ్చు. సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోతే రోగి మృతి చెందే ప్రమాదం కూడా ఉంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్తో పాటు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ సిఫార్సు చేస్తోంది. ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో రోగనిరోధకత పాత్ర ఏమిటి? రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఫ్లొరోనా ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇమ్యునిటీని పెంపొందించుకునేందుకు బూస్టర్ డోసులు వేసుకోవడంతోపాటు, ఇతర జాగ్రత్తలు కూడా విధిగా పాటించాలని సూచిస్తున్నారు. చదవండి: Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’ -
వ్యాక్సిన్ రోగ నిరోధకత 9 నెలలే.. సెకండ్ డోస్ కూడా వేయించుకోండి: ఆరోగ్య శాఖ
Covid 19 vaccination immunity period: కోవిడ్ వాక్సిన్ డోస్, వైరస్ ఇన్ఫెక్షన్, హాస్పిటలైజేషన్, మరణాల రేటు తగ్గించేందుకేనని కేంద్రం అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ఈ రోజు (గురువారం) మీడియా సమావేశంలో స్పష్టం చేసింది. పోస్ట్ వ్యాక్సినేషన్ తర్వాత రోగ నిరోధకత 9 నెలల వరకు ఉంటుందని, పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా భయపడాల్సిన అవసరం లేదని, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లన్నీ మనదేశంతో సహా, ఇజ్రాయెల్, యూఎస్, యూరప్, యూకే, చైనా నుంచి వచ్చినప్పటికీ ప్రాథమికంగా వ్యాధిని ఎదుర్కొనేవే కానీ వ్యాధిని పూర్తిగా నిరోధించవు. ముందు జాగ్రత్తగా తీసుకునే కోవిడ్ డోసులు.. వ్యాధి తీవ్రతను తగ్గించడం, ఆసుపత్రుల్లో చేరికలు, మరణాల రేటులను తగ్గించడానికేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) డైరెక్టర్ జనరల్ డా. బలరాం భార్గవ తెలిపారు. మన దేశంలోని వయోజన జనాభాలో దాదాపు 90% మందికి మొదటి డోస్ టీకాలు పూర్తయ్యాయి. ఐతే టీకాలు వేయించుకున్న వారిలో కొంతమందికి ముందుగా రోగ లక్షణ అంటువ్యాధులు ఉన్నందు వల్ల చాలా మందిలో సార్స్-కోవ్ 2 యాంటిజెన్కు సంబంధించి కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి. మరికొందరికి గుర్తించబడని లక్షణ రహిత అంటువ్యాధులు ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 10 నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా అర్హులైన వారికి ఫోన్ ఎస్సెమ్మెస్ సందేశాలు పంపడం ద్వారా విస్తృత టీకా కవరేజీని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్ -
ఏపీలో జనవరి 10 వ తేదీ నుంచి బూస్టర్ డోస్
-
బూస్టర్కు డాక్టర్ సర్టిఫికెట్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: అరవై ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బూస్టర్ డోసు (ప్రికాషన్ డోసు)ను తీసుకొనేటపుడు.. తమ ఆరోగ్య స్థితిని తెలియజేయడానికి ఎలాంటి డాక్టర్ సర్టిఫికెట్ను చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. 15–18 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లకు కోవిడ్–19 వ్యాక్సినేషన్, వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు వీలుగా జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. టీనేజర్లకు వ్యాక్సినేషన్ జనవరి 3 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అలాగే బూస్టర్డోసును జనవరి 10 తేదీ నుంచి ఇస్తారు. ఈ రెండు కేటగిరీల్లో వారికి విధివిధానాలను వివరిస్తూ రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలు... ► 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలున్న వారు బూస్టర్ డోసు కోసం డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన/ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ► వీరు బూస్టర్ తీసుకొనే ముందు తమ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి. ► ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని కూడా ఫ్రంట్లైన్ వర్కర్లుగా పరిగణిస్తారు. వీరు కూడా బూస్టర్ డోసుకు అర్హులు. అందరిలాగే రెండోడోసు తీసుకున్న 9 నెలలు/ 39 వారాల తర్వాత బూస్టర్ తీసుకోవచ్చు. ► టీనేజర్ల కోసం ప్రత్యేకంగా కొన్ని టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడున్న టీకా కేంద్రాల్లో కొన్నింటిని టీనేజర్ల కోసమే ప్రత్యేకంగా ఎంపిక చేసే అవకాశం రాష్ట్రాలకు ఉంది. ► వయోజనులకు టీకాలు వేస్తున్న రెగ్యులర్ కేంద్రాల్లోనూ టీనేజర్లు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వారికి ప్రత్యేక క్యూలైన్ను ఏర్పాటు చేయాలి. కోవాగ్జిన్, కోవిషీల్డ్లు మిక్స్ కాకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. ► టీనేజర్లు జనవరి 1 నుంచి కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా 3వ తేదీ నుం చి నేరుగా కేంద్రాలకు వెళ్లి అన్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలిడోసు తీసుకొన్న 28 రోజుల తర్వాత రెండోడోసు తీసుకోవచ్చు. ► టీనేజర్లకు ఇవ్వడానికి ప్రస్తుతం ఒక్క కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉన్నందువల్ల... దీని సరఫరా షెడ్యూల్ను రాష్ట్రాలకు త్వరలో కేంద్రం తెలియజేస్తుంది. -
భారీ పోరుకు... బూస్టర్!
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు... జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు కేంద్ర ఆదేశాలు... ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ ఎక్కువవుతున్న భయాలు... వీటన్నిటి మధ్య ప్రధాని మోదీ శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన కొత్త టీకా విధాన ప్రకటన నైతిక స్థైర్యాన్ని నింపవచ్చు. నియమిత రెండు డోసులే కాక, అదనపు మూడో డోస్ను బూస్టర్ డోస్గా ఇవ్వాలంటూ కొద్ది రోజులుగా దేశమంతటా చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని చేసిన ఆ ప్రకటన – క్రిస్మస్ హెల్త్గిఫ్ట్. భారత్ బయోటెక్ సంస్థ తయారీ కోవాగ్జిన్ టీకాను 12 ఏళ్ళు పైబడ్డవారికి వేయవచ్చంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించిన కాసేపటికే మోదీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. నూటికి 50 మందిలో టీకా రోగనిరోధకతను ఒమిక్రాన్ తోసిపుచ్చినట్టు దేశంలో ప్రాథమిక డేటా. అందుకే, బూస్టర్డోస్లు, టీనేజర్లకు టీకాలతో కరోనాపై పోరాటపటిమనీ, పరిధినీ పెంచడం స్వాగతించాలి. పెద్దనోట్ల రద్దు ప్రకటన నాటి నుంచి చీకటి పడ్డాక మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నా రంటే, ఒక విధమైన ఉత్కంఠ! ఒమిక్రాన్ కేసులు, లాక్డౌన్ పుకార్ల మధ్య శనివారమూ అదే పరిస్థితి. చివరకు మోదీ 15 – 18 ఏళ్ళ మధ్యవయసు పిల్లలకు టీకాలు, ఫ్రంట్లైన్ వర్కర్లు – ఆరోగ్య సంరక్షణ వర్కర్లు – తీవ్ర అనారోగ్య సమస్యలున్న 60 ఏళ్ళు పైబడ్డ పెద్దలకు ‘ముందు జాగ్రత్త డోస్’ (ప్రపంచమంతా బూస్టర్ అంటున్న మూడో డోస్)లు జనవరి నుంచి ఇస్తామనేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే కాస్తంత ఆలస్యమైందని కొందరు అంటున్నా, కనీసం ఒమిక్రాన్ వేళ ధైర్యమిచ్చే ప్రకటన చేశారనే భావన కలిగింది. ప్రస్తుతం దేశంలో నెలకి 30 కోట్ల పైగా (కోవిషీల్డ్ 25 – 27 కోట్లు, కోవాగ్జిన్ 5–6 కోట్ల) డోస్లు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్రాల వద్ద 18 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయట. 11 రాష్ట్రాల్లో దేశ సగటు కన్నా తక్కువగా టీకాకరణ జరుగుతోంది. తాజా ప్రకటనతో నాలుగు వారాల తేడాతో వేసే రెండు డోసుల కోవాగ్జిన్ టీకా, మూడు డోసుల డీఎన్ఏ ఆధారిత టీకా జైకోవ్–డి... ఈ రెండిటికీ మనదేశంలో 12 ఏళ్ళు పైబడ్డవారికి వాడేందుకు అనుమతి ఉన్నట్టయింది. జైడస్ క్యాడిలా తయారీ జైకోవ్–డికి ఆగస్టులోనే భారత్లో అనుమతి లభించింది. అదింకా మార్కెట్లోకి రాలేదు. అంటే, దాదాపు ఏడాదిగా విపణిలో ఉన్న కోవాగ్జిన్ ఒక్కటే మన టీనేజర్లకు శరణ్యం. అటు జైకోవ్–డి విషయంలో కానీ, ఇటు కోవాగ్జిన్ విషయంలో కానీ ఈ నిర్ణీత వయసు వారిపై ఆయా టీకాల సామర్థ్యంపైనా, సురక్షితమేనా అన్నదానిపైనా సరైన పరిశోధన పత్రాలు లేవు. బాహాటంగా సమాచారమూ లేదు. తయారీ సంస్థల పత్రికా ప్రకటనలే ప్రజలకు ఆధారం కావడం విచిత్రం. నిజానికి, 2 ఏళ్ళు పైబడిన పిల్లలకు సంబంధించిన డేటాను భారత్ బయోటెక్, 12 ఏళ్ళు పైబడిన వారి డేటాను జైడస్ క్యాడిలా సమర్పించాయి. కానీ, 15 – 18 ఏళ్ళ మధ్యవయస్కులకే టీకాలు పరిమితం చేస్తూ మోదీ ప్రకటనకు కారణాలేమిటో తెలియదు. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక వర్ధమాన దేశాల్లో సరఫరా సరిగ్గా లేదు. టీకాల కొరత ఉంది. పైపెచ్చు పిల్లలకూ, టీనేజర్లకూ కరోనా తీవ్రంగా వచ్చే అవకాశం తక్కువనీ, అత్యధిక రిస్కున్నవారికి సైతం అన్ని దేశాల్లో టీకాకరణ పూర్తి కాలేదనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 22న కూడా పేర్కొంది. అందుకే, అర్హులైన వయోజనులందరికీ టీకాలు వేయడం పూర్తయ్యే దాకా భారత్లో టీనేజర్లకు ఓకే చెప్పరని భావించారు. ప్రభుత్వ విధానానికి మార్గదర్శనం చేస్తున్న శాస్త్రవేత్తలు సైతం పదే పదే సమావేశమైనా, బాహాటంగా ఏమీ చెప్పలేదు. ఎట్టకేలకు ప్రధానే స్వయంగా కొత్త నిర్ణయం ప్రకటించే ఘనత తీసుకున్నారు. టీకాల సరఫరా సమృద్ధిగా ఉన్న అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు ఇప్పటికే పసిపిల్లలకూ, టీనేజర్లకూ టీకాలు వేసేస్తున్నాయి. మన దేశ తాజా కోవిడ్ టీకా విధానంపై అది సహజంగానే ప్రభావం చూపింది. ఆ మాటకొస్తే, ఐరోపాలోని అనేక దేశాలతో పాటు కెనడా, బహ్రయిన్, ఇజ్రాయెల్, ఒమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, చైనా లాంటివి కూడా ఇప్పటికే 12 ఏళ్ళ లోపు వారికి టీకాలకు ఓకే అనేశాయి. భారత్లో వయోజనుల్లో 40 శాతం మందికి (38 కోట్ల మందికి) పూర్తిగా టీకాలేయడం అవనే లేదు. అందుకే, వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్, ఇప్పటికీ తొలగిపోని డెల్టా వేరియంట్ ముప్పు నేపథ్యంలో – 18 ఏళ్ళ లోపు వారి కన్నా వయోజనులకే మరింత రిస్కుంది అనేది మరో వాదన. మొత్తం మీద టీకాకరణలో కొత్త దశలోకి కొత్త ఏడాది అడుగిడనున్నాం. రెండో డోస్ వేసుకున్నా 8 నుంచి 9 నెలల్లో రోగనిరోధకత తగ్గుతుందన్న అధ్యయనాలతో ‘ముందు జాగ్రత్త’ పేరుతో కొందరికి బూస్టర్ డోసులూ వేయనున్నాం. మొదటి డోస్ వేసుకొని రెండో డోసుకు రాని వారిని ఒప్పించడంతో పాటు, అవసరార్థులకు బూస్టర్ డోస్ వేయడం ఇప్పుడున్న సవాలు. వ్యాధి లక్షణాలు కనపడ్డ 5 రోజుల్లోగా తీసుకుంటే, అమెరికా, బ్రిటన్లలో ఆసుపత్రి కష్టాలు, మరణాలను 89 శాతం తగ్గిస్తున్నాయంటున్న యాంటీ వైరల్ మాత్రల్నీ అనుమతించవచ్చేమో ఆలోచిస్తే మంచిదే! సమస్యల్లా – దేశ జనాభా మొదలు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల దాకా అందరూ కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించడం, రిస్కు లేని దేశాల నుంచి వస్తున్నవారు అసలు నిబంధనల్నే పాటించక పోవడం! దేశంలో తాజా కేసుల పెరుగుదలకు అదే కారణమని అధికారులు మొత్తుకుంటున్నారు. కానీ, మాస్కులు తీసేసి, భౌతిక దూరమైనా లేకుండా, గుంపులుగా తిరుగుతున్నవారికి ఏమని చెప్పాలి? ఎన్నిసార్లని జాగ్రత్తల బుద్ధి గరపాలి? కరోనాపై పోరులో అదే పెను సమస్య! -
15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్!
Vaccine Registration For Children న్యూఢిల్లీ: 15 - 18 యేళ్లలోపు పిల్లలకు జనవరి 1 నుంచి కోవిడ్ - 19 వ్యాక్సిన్కు రిజిస్ట్రేయన్ చేసుకోవల్సిందిగా ప్రభుత్వం సోమవారం తెల్పింది. స్కూల్ ఐడీ కార్డులను ఉపయోగించి కోవిన్ యాప్లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఆన్లైన్ ప్లాట్ఫాంలో మరో స్లాట్ రూపొందించినట్లు కోవిన్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మీడియాకు తెలిపారు. కాగా 15-18 మధ్య వయసున్న పిల్లలకు జనవరి 3 నుంచి తొలి రౌండ్ కోవిడ్ వ్యాక్సిన్లు వేయనున్నారు. అలాగే ఫ్రంట్లైన్, హెల్త్కేర్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్లు వేయనున్నారు. పిల్లలకు టీకాలు వేయడం ద్వారా స్కూళ్లు, విద్యార్ధులు సాధారణ స్థితికి చేరుకుంటారని, ఇప్పటికే అనేక దేశాల్లో ఈ ప్రక్రియ పూర్తచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్ బయోటిక్స్ డబుల్ డోస్ కోవాగ్జిన్ లేదా జీడస్ కడిలాస్ థ్రీ డోస్ జికోవ్-డి ఈరెండు వ్యాక్సిన్లలో ఒకటి 12 ఏళ్లు పైబడిన పిల్లలకు వేయబడతాయి. సిరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ‘నోవావ్యాక్స్'ను 7 - 11 ఏళ్ల మధ్య పిల్లలపై, అలాగే బయోలాజికల్ ఈ కి చెందిన ‘కార్బెవ్యాక్స్'ను ఐదేళ్లు నిండిన పిల్లలపై ట్రయల్స్ పూర్తి చేసినట్లు డ్రగ్ కంట్రోలర్ ఇప్పటికే ధృవీకరించింది. ఐతే ఈ రెండు వ్యాక్సిన్లు ఉపయోగానికి ఇంకా అనుమతి పొందలేదు. పాఠశాలల్లో కోవిడ్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించారు. మన దేశంలో ఇప్పటివరకు 141.7 కోట్ల వ్యాక్సిన్లు పూర్తి చేసింది. ఐతే 58.1 కోట్ల మందికి మాత్రమే రెండవ డోస్ పూర్తయ్యింది. కాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 6,500 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ సంఖ్య 6.5 శాతం తక్కువ. అలాగే కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు సోమవారం ఉదయం నాటికి 578కి పెరిగాయి. చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు.. -
9–12 నెలల తర్వాతే బూస్టర్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ రెండోడోసు తీసుకున్న తర్వాత ఎన్నాళ్లకు బూస్టర్ డోసు (మూడో డోసు... ప్రధాని మాటల్లో ప్రికాషన్ డోసు) ఇవ్వాలనే దానిపై భారత వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ముమ్మరంగా సమాలోచనలు చేస్తున్నారు. రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల తర్వాతే బూస్టర్ డోసు ఉండొచ్చని విశ్వసనీయ అధికారవర్గాలు ఆదివారం తెలిపాయి. ‘కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు ఎంతెంతకాలం తర్వాత బూస్టర్ డోసును ఇవ్వాలనే విషయంలో సాంకేతికాంశాల మదింపు జరుగుతోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు’ అని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 15–18 ఏళ్లలోపు టీనేజర్లకు జనవరి 3 నుంచి కరోనా టీకాలు ఇస్తామని, జనవరి 10 నుంచి ఫ్రంట్లైన్ వర్కర్లు, వైద్యరంగంలోని వారికి ‘ప్రీకాషన్ డోసు (ముందు జాగ్రత్త చర్యగా)’ను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే 60 ఏళ్లు పైబడి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికీ డాక్టర్ల సలహా మేరకు ప్రికాషన్ డోసు ఇస్తామని మోదీ అన్నారు. ఒమిక్రాన్ వేరియెంట్ ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. ‘రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య వ్యవధి 9 నుంచి 12 నెలలు ఉండొచ్చు. ఇమ్యూనైజేషన్ విభాగం, ఇమ్యూనైజేషన్పై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) ఇదే తరహాలో సమాలోచనలు సాగిస్తున్నాయి’ అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. టీనేజర్లకు ప్రస్తుతానికి కోవాగ్జినే జనవరి 3 నుంచి 15–18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైనపుడు కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు ఆదివారం వెల్లడించాయి. దేశంలో 15–18 ఏళ్ల ఏజ్ గ్రూపులో ఏడు నుంచి ఎనిమిది కోట్ల మంది టీనేజర్లు ఉండొచ్చని పేర్కొన్నాయి. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు... ఈ మూడు కేటగిరీల వారికి మాత్రం గతంలో రెండు డోసులు ఏ కంపెనీ టీకా తీసుకున్నారో ‘బూస్టర్ డోస్’గా అదే టీకా ఇస్తారని తెలిపాయి. -
బూస్టర్ డోసుపై అధ్యయనం
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో టీకాల బూస్టర్ డోసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బూస్టర్ డోసు సామర్ధ్యాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే అన్ని డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న 3వేల మందిపై వైద్య అధ్యయనం నిర్వహించనుంది. హరియాణాకు చెందిన ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ కారణంగా బూస్టర్ డోసులకు అనుమతినిచ్చారు. ఒమిక్రాన్ కారణంగా యూరప్ సహా పలు దేశాల్లో మరో వేవ్ వచ్చే అవకాశాలు పెరిగాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. టీకాలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు బూస్టర్ డోసుతో మరింత రక్షణ లభిస్తుందని చెబుతున్నాయి. వీటన్నింటిపై తాజా అధ్యయనంలో చర్చించనున్నారు. -
ఒమిక్రాన్ దడ, థర్డ్వేవ్ హెచ్చరిక.. ‘బూస్టర్’ వైపు పరుగులు..
హైదరాబాద్కు చెందిన నారాయణకు 60 ఏళ్లు. దీర్ఘకాలిక సమస్యలున్నాయి. రెండో డోస్ పూర్తయి 6 నెలలైంది. థర్డ్వేవ్ హెచ్చరికలతో వైద్యుల సలహా మేరకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బూస్టర్ డోస్ వేయించుకున్నారు. డాక్టర్ సూర్యనారాయణరావు (పేరు మార్చాం). 52 ఏళ్లు. కరోనా రెండో వేవ్ సమయంలో ఈయన గుండెకు స్టెంట్లు వేశారు. షుగర్ కూడా ఉంది. పైగా కరోనా రెండో డోస్ వేసుకొని ఆరు నెలలైంది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని మూడో డోస్ వేయించుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ దడ, థర్డ్వేవ్ హెచ్చరికలతో రాష్ట్రంలో అనేకమంది కరోనా బూస్టర్ డోస్ వ్యాక్సిన్పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు అనధికారికంగా మూడో డోస్ వేయించుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వయసు పైబడినవారు బూస్టర్ వేయించుకుంటున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి కూడా బూస్టర్ డోస్ వేయించుకున్నట్లు ఆయనే స్వయంగా అంతర్గతంగా వెల్లడించడం గమనార్హం. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పలువురు బూస్టర్ డోస్ వేయించుకుంటున్నారు. ఇదంతా అనధికారికంగా జరుగుతుండటంతో ఎంతమంది వేయించుకున్నారో స్పష్టత లేదు. మరోవైపు అవసరమైన వారికి బూస్టర్ డోస్ వేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇటీవలే కేంద్రానికి విన్నవించిన విషయం తెలిసిందే. చదవండి: ఒమిక్రాన్ అప్డేట్స్.. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు.. రెండో డోసులేసుకున్న ఆర్నెల్ల తర్వాత.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఒమిక్రాన్ భయంతో టీకాలు వేయించుకోవడానికి అనేకమంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే 97.35 శాతం మంది మొదటి డోస్.. 56.08 శాతం మంది రెండో డోస్ వేయించుకున్నారు. 11 జిల్లాల్లో నూరు శాతం ఫస్ట్ డోస్ పూర్తయింది. సహజంగా రెండు డోసులు వేసుకున్న ఆరు నెలల వరకే కరోనా నుంచి రక్షణ ఉంటుంది. ఆ తర్వాత బూస్టర్ డోస్ వేయించుకుంటే మంచిదన్న భావన ఉంది. 60 ఏళ్లు పైబడినవారు, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులున్నవాళ్లకు బూస్టర్ వేయాలన్న చర్చ నేపథ్యంలో ఈ వర్గం ప్రజలు చాలా చోట్ల మూడో డోస్ వేయించుకుంటున్నారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో డోస్ వేయాలని వాదనలు నడుస్తున్నాయి. చదవండి: హైదరాబాద్: ఆరుగురు పరారు.. నలుగురు దొరికారు తొలి, రెండో డోస్పైనే కేంద్రం దృష్టి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బూస్టర్ డోస్ వేయించుకునే వారి నుంచి రూ. 1,500 వరకు వసూలు చేస్తున్నట్లు కొందరు తెలిపారు. అధికారికంగా వేయడానికి అనుమతి లేకపోవడంతో రిజిస్ట్రేషన్ లేకుండానే వేస్తున్నారు. కేంద్రం ప్రస్తుతం మొదటి, రెండో డోస్పైనే దృష్టి పెట్టింది. అనేక దేశాల్లో వ్యాక్సిన్ల కొరత ఉండటంతో బూస్టర్ వేయడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో కేంద్రమూ బూస్టర్పై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. చదవండి: క్రికెట్ టోర్నీలో చాన్స్ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్ను