Cabinet meet
-
బీసీలకు 42 శాతం కోటా ముసాయిదా బిల్లుకు ఆమోదం
-
పోలవరానికి మళ్లీ ‘చంద్ర’గ్రహణం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును ‘చంద్ర’గ్రహణం వీడటంలేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి దానిని ఛిద్రం చేస్తూనే ఉన్నారు. మధ్యలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టును గాడిలో పెట్టి, పూర్తిస్థాయిలో నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించినప్పటికీ, ఈ ఏడాది ఎన్డీఏలో చేరిన చంద్రబాబు దానికీ మోకాలడ్డారు. పూర్తిస్థాయిలో 45.72 మీటర్ల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే వైఎస్సార్సీపీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందంటూ కేంద్రంతో 41.15 మీటర్లకే ప్రాజెక్తును పరిమితం చేయించి, రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టేశారు. జల శక్తి శాఖ ప్రతిపాదనలను అడ్డుకొని పోలవరం తొలి దశలో 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేలా అంచనా వ్యయాన్ని సవరిస్తూ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ బోర్డు (పీఐబీ) ఈ ఏడాది ఫిబ్రవరి 27న మెమొరాండంను ఆమోదించింది. దాని ఆధారంగా నిధులు మంజూరు చేసేందుకు 2017 మార్చి 15న ఆమోదించిన తీర్మానాన్ని సవరించాలంటూ కేంద్ర కేబినెట్కు మార్చి 6న కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్డీఏలో చేరిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పోలవరానికి నిధులిస్తే ఎన్నికల్లో రాజకీయంగా వైఎస్సార్సీపీకి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దల చెవిలో ఊదారు.దాంతో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. ప్రాజెక్టును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇప్పటిదాకా చేసిన ఖర్చు పోను మిగిలిన రూ.12,157.53 కోట్లు ఇస్తామని చెప్పింది. దీనిని కేంద్ర మంత్రివర్గంలోని టీడీపీ మంత్రి కె.రామ్మోహన్నాయుడు వ్యతిరేకించలేదు. అంటే.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గింపునకు అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. 41.15 మీటర్ల ఎత్తుతో నిష్ఫలమే పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు (150 అడుగులు). గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఈ స్థాయిలో కేవలం 115.44 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటాయి. 41.15 మీటర్లకంటే ఎగువన నీటి నిల్వ ఉన్నప్పుడే కుడి, ఎడమ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఇప్పుడు ప్రాజెక్టును 41.15 మీటర్లకే తగ్గించడం వల్ల కాలువలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడం సాధ్యం కాదు.ప్రాజెక్టు ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆయకట్టు 8 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ కూడా అసాధ్యం. 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తీ ప్రశ్నార్థకమవుతుంది. మహానగరంగా మారుతున్న విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడమూ కష్టమే. అంటే.. ప్రాజెక్టు లక్ష్యాలకే గండి కొట్టేశారని నిపుణులు చెబుతున్నారు. జాతీయ ప్రాజెక్టును రాష్ట్ర ప్రాజెక్టుగా మార్చేసిన వైనం 2005లో అన్ని అనుమతులు సాధించి అప్పటి సీఎం వైఎస్సార్ పోలవరం నిర్మాణాన్ని చేపట్టారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తీవ్ర స్థాయిలో పోరాడారు. జాతీయ హోదా ప్రతిపాదన తుది దశలో ఉండగా ఆయన హఠాన్మరణం చెందారు. చివరకు విభజన చట్టం ద్వారా పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. వంద శాతం వ్యయంతో పోలవరాన్ని పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం బాధ్యతలను 2016 సెపె్టంబరు 7న దక్కించుకుంది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంగీకరించారు. కానీ, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33,168.24 కోట్లు అవసరం. అలాంటిది రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేస్తానని అంగీకరించడం ద్వారా ప్రాజెక్టును ఆరి్థక సంక్షోభంలోకి నెట్టేశారు.‘చంద్ర’గ్రహణం నుంచి విముక్తి చేసిన వైఎస్ జగన్ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ మ్యాన్యువల్ను తుంగలో తొక్కారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాంలను కట్టకుండానే ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ కట్టేశారు. 2019 ఫిబ్రవరి నాటికి కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీలు వదిలేసి చేతులెత్తేశారు. దీంతో 2018, 2019లో వచి్చన గోదావరి వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు తప్పిదాలను సరిదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని చేపట్టారు.కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్లను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, గ్యాప్–1లో ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్, దిగువ కాఫర్ డ్యాంను పూర్తి చేశారు. విద్యుత్ కేంద్రం పనులను కొలిక్కి తెచ్చారు. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం పనులను దాదాపుగా పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేలి్చతే.. శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమైన ప్రతిసారీ తాజా ధరల మేరకు ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరారు.ఇందుకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ.. తొలి దశలో 41.15 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేసి, ఆ తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 45.72 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఇందుకు వైఎస్ జగన్ అంగీకరించారు. దీంతో తొలి దశ పనులు పూర్తి చేసేందుకు రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆరి్థక శాఖ మంత్రి నోట్ జారీ చేశారు. ఇలా పోలవరానికి పట్టిన ‘చంద్ర’గ్రహణాన్ని వైఎస్ జగన్ విడిపించారు. కానీ, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రంగప్రవేశంతో ప్రాజెక్టుకు మరోసారి గ్రహణం పట్టింది. -
మోదీ గుడ్ న్యూస్.. ఇకపై వారందరికి ఫుల్ పెన్షన్!
-
CM Jagan: ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా?. ఇందుకు సంబంధించి ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో వ్యాఖ్యానించారాయన. ‘‘ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలి. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చు’’ అని కేబినెట్ భేటీలో సీఎం జగన్ అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు.. వాటికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈనాడు, యెల్లో మీడియాలో జరిగే ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. -
MP: కౌంటింగ్ వేళ క్యాబినెట్ మీటింగ్.. కాంగ్రెస్ అభ్యంతరం
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన చివరి క్యాబినెట్ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ సమావేశానికి మంత్రులందరితో పాటు సీనియర్ అధికారులను కూడా పిలిచారు. ఎటువంటి అజెండా లేకుండా ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందుగా ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓట్ల లెక్కింపును ప్రభావితం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే ఇది అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీసీ శర్మ ఆరోపించారు. బాలాఘాట్ పోస్టల్ బ్యాలెట్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీకి ఓటు వేయలేదు కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపునకు మూడు రోజుల ముందుగా ఇలా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం గత పదేళ్లలో ఎప్పుడూ జరగలేదు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేరు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెయిన్స్ పదవీ విరమణ తర్వాత కొత్త ప్రధాన కార్యదర్శిగా వీర రాణా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే బెయిన్స్ తర్వాత రాష్ట్రంలో ఆమె సీనియర్ మోస్ట్ అధికారి. -
సీఎం జగన్ నిర్ణయంపై హర్షం
సాక్షి, విజయవాడ: మీడియా ప్రతినిధులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంపట్ల సీఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇస్తోన్న ఇళ్ల స్థలాలను సద్వినియోగంచేసుకోవాలని ఛైర్మన్ మీడియా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరబోతోంది ఆంధ్రప్రదేశ్లోని పాత్రికేయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలకు సంబంధించి సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్( ఇండియా ) మాజీ జాతీయ కార్యదర్శి , అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు వర్షం వ్యక్తం చేశారు పాత్రికేయుల్లో అత్యధికులు నిరుపేదలేనని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం జగన్కు కృతజ్ఞతులు తెలియజేస్తున్నామని తెలిపారు. మీడియాలోని ఒక వర్గం నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నప్పటికీ ఆయన పట్టించుకోకుండా మీడియా సంస్థల్లో పని చేసే పాత్రికేయుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చబోతున్నారన్నారు. ఇది సీఎం జగన్ విశాల దృక్పథానికి నిదర్శనమన్నారు. గతంలో దివంగత నేత వైఎస్సార్ మాత్రమే పాత్రికేయులకు విలువైన ఇళ్ల స్థలాలు ఉచితంగా పంపిణీ చేశారని, ఫలితంగా వారి ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగయ్యాయని వారు గుర్తు చేశారు. సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లోని జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరబోతోందని వారు ఆనందం వ్యక్తం చేశారు. మీడియా మంచి కోరే సీఎం జగన్కు కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు అందరికీ ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్ట్ లు అందరికీ ఈరోజు ఒక చారిత్రిక సందర్భం. ఉమ్మడి రాష్ట్రంలో చివరగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత మళ్ళీ జర్నలిస్టుల గృహ వసతి గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పాదయాత్ర సందర్భంగా చాలా చోట్ల జర్నలిస్టులు జగన్మోహన్రెడఇని కలిసి తమ సమస్యలను విన్నవించిన నేపథ్యంలో ఆయన తన పార్టీ ఎన్నికల ప్రణాళిక లో పొందుపరిచిన హామీని ఇవాళ నెరవేర్చారు. వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఇవాళ క్యాబినెట్లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్కు ఆయన క్యాబినెట్ సహచరులకు మరొక్కసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి తరఫున కృతజ్ఞతలు’అని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. -
ఏపీ కేబినెట్ తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఇవే
-
కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం
-
ప్రజల వద్దకు అభివృద్ధి పనులు
న్యూఢిల్లీ: గత తొమ్మిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ప్రధాని మోదీ చెప్పారు. వచ్చే తొమ్మిది నెలల కాలంలో ఈ పనుల గురించి ప్రజలకు వివరించాలని మంత్రివర్గ సహచరులను ఆయన కోరారు. సోమవారం రాత్రి ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధానిమాట్లాడారు. 2047లో వందో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే నాటికి మౌలిక వసతులు మొదలుకొని బడ్జెట్ పరిమాణం వరకు ప్రగతి ప్రయాణాన్ని వివరించే పవర్ ప్రజెంటేషన్ కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటి నుంచి 2047వ సంవత్సరం వరకు స్వర్ణయుగం, అమృత్ కాల్గా ప్రధాని మోదీ పేర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించిన ప్రధాని, అదే సమయంలో దేశం సాధించిన ప్రగతిని ప్రశంసించారు. విదేశాంగ, రక్షణ సహా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటనల సందర్భంగా సాధించిన విజయాలను వారు వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులను సరిగ్గా వినియోగించుకోవడమెలాగనే అంశంపైనా చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్లో..‘కేబినెట్ సమావేశం ఫలప్రదంగా సాగింది. వివిధ విధివిధానాలపై అభిప్రాయాలను పంచుకున్నాం’ అని పేర్కొన్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనుండటం, ఇటీవల బీజేపీ అగ్ర నాయకత్వం వరుస సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ భేటీ చర్చిస్తుందన్న వార్తలు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. -
కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ
-
ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
-
కేసీఆర్ కేబినెట్ నిర్ణయాలు
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించింది. వైఎస్సార్ కల్యాణమస్తు పథకంలో గతం కంటే ఎక్కువ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. ►కర్నూలు జిల్లా డోన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం ►ఈ నెల రైతులకు ఇన్ఫుట్ సబ్సీడీ చెల్లింపునకు కేబినెట్ ఆమోదం ►ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపునకు కేబినెట్ ఆమోదం ►1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం ►డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ►విశాఖలో టెక్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ►నెల్లూరు బ్యారేజ్ను నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్గా మారుస్తూ నిర్ణయం ►రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటివ్ బెర్త్ల నిర్మాణానికి ఆమోదం ►లీగల సెల్ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం ►పంప్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం -
AP: సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
సాక్షి,అమరావతి: ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రి వర్గం పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అజెండాలోని అన్ని అంశాలకు ఆమోదం తెలిపింది. వై ఎస్సార్ లా నేస్తం, వై ఎస్సార్ ఆసరా, ఈ బీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించింది. -
నేడు ఏపీ కేబినేట్ భేటీ
-
తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
-
TS: తెలంగాణ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిన మరుసటి రోజే.. తెలంగాణ కేబినెట్ భేటీ కావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, దళిత బందు అమలు, సొంత ఇంటి స్థలం కలిగిన వారికి రూ. 3 లక్షల ఆర్ధిక సహాయం, రైతు బంధు నిధుల విడుదల తో పాటు అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. గవర్నర్ వద్ద పెండింగ్ లో బిల్లులపై ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు.. పోడు భూములకు పట్టాలు పంపిణీ తేదీల ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. గిరిజన బంధు లాంటి కీలకాంశంపై నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ నడుస్తోంది. -
ఈనెల 29న ఏపీ కేబినేట్ సమావేశం
విజయవాడ: ఈనెల 29వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. -
కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్
-
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ఈ నెల 22న ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ఈ నెల 22న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. -
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన భేటీ కానున్న కేబినెట్
-
కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్
-
సీఎం జగన్ అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం
-
TSRTC: కి.మీ.కు 25 పైసలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపు దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి కిలోమీటరుకు 25 పైసల చొప్పున పెంచే దిశగా నివేదికను రూపొందిస్తున్నారు. దీనికితోడు కిలోమీటరుకు 20 పైసలు, కిలోమీటరుకు 28–30 పైసలుతో మరో రెండు ప్రత్యామ్నాయ నివేదికలను కూడా తయారు చేస్తున్నారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు వీలుగా వీటిని సీఎం కార్యాలయానికి సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి సూచనతో.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్టీసీని ఇప్పటికిప్పుడు గట్టెక్కించాలంటే టికెట్ చార్జీల పెంపు అనివార్యమంటూ మంగళవారం సీఎం నిర్వహించిన సమీక్షలో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపాదనలు సమర్పిస్తే.. మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నట్టు మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో సీఎం కార్యాలయం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కసరత్తు ప్రారంభించి దాదాపు పూర్తి చేసినట్టు తెలిసింది. ప్రస్తుతానికి 25 పైసలైతే ఓకే.. పెరిగిన డీజిల్, టైర్లు, ఇతర పరికరాల ధరల కార ణంగా గత కొన్ని నెలల్లో ఆర్టీసీపై పడిన అదనపు భారం నుంచి గట్టెక్కాలంటే కిలోమీటరుకు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచాలనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. 2019 డిసెంబర్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచారు. ఆ సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.65 ఉంది. ఈ రెండేళ్లలో లీటరుపై గరిష్టంగా రూ.22 మేర పెరిగింది. దీంతో అదనంగా సాలీనా దాదాపు రూ.500 కోట్ల భారం పడిందని లెక్కలు తేల్చారు. ఇక టైర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆ భారం కిలోమీటరుకు రూపాయి చొప్పున పడుతోంది. విడిభాగాల ధరలు భారీగా పెరగడం వల్ల పడిన అదనపు భారం కిలోమీటరుకు మరో రూపాయి చొప్పున పడుతోంది. ఈ లెక్కన నిత్యం సగటున రూ.50 లక్షల అదనపు భారం ఉంటోంది. అంటే సాలీనా సుమారు రూ.180 కోట్ల భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కి.మీ.కు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల వల్ల గతంలో లాగా బస్సులు తిరగటం లేదు. కోవిడ్ సమస్య తగ్గితే ఖర్చు కూడా పెరుగుతుంది. అప్పుడు కూడా కొంత అనుకూలంగా ఉండేలా కి.మీ.కు 28 పైసల నుంచి 30 పైసల వరకు పెంచాలనే ప్రత్యామ్నాయ నివేదికను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో మధ్యేమార్గంగా 20 పైసలతో మరో నివేదికను కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు పెంపు చోటు చేసుకునే అవకాశం ఉంది. -
నేడు ఏపీ కేబినెట్ భేటీ
-
కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 1.22 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి బీమా పరిధిని కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. అలాగే 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ-ఆధారిత, ఫలిత-అనుసంధాన పవర్ డిస్కం పథకానికి కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు. అలాగే దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయిందని తెలిపారు. 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ సేవలకు భరత్నెట్ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) మోడ్ కింద రూ .19,041 కోట్లతో సాధ్యమయ్యే గ్యాప్ నిధులతో కేబినెట్ ఆమోదించినట్లు టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు పవర్ డిస్కంల సంస్కరణలు, బలోపేతానికి భారీ ఆర్థిక సహాయం డిస్కంల సామర్థ్యాన్ని పనితీరును మెరుగు పరచుకునేందుకు షరతులతో కూడిన ఆర్థిక సహాయం కొత్త పథకం కోసం 3,03,758 కోట్ల రూపాయల అంచనా వ్యయం 97,631 కోట్లు రూపాయలు కేటాయింపు ప్రభుత్వం కేంద్రం విధించిన షరతులకు అంగీకరిస్తే పెద్దఎత్తున డిస్కంలకు ఆర్థిక సహాయం భారత్ నెట్ ద్వారా 16 రాష్ట్రాల్లో ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు భారత్ నెట్కు రూ.19,041 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం పవర్ డిస్కమ్ సంస్కరణలు, బలోపేతానికి భారీ ఆర్థిక సహాయం డిస్కమ్ల సామర్థ్యం పెంపునకు షరతులతో కూడిన ఆర్థిక సాయం షరతులకు అంగీకరిస్తే డిస్కమ్లకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయం -
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ప్రారంభం
-
కాసేపట్లో ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశం
-
Telangana: నేడే కేబినెట్ భేటీ..లాక్డౌన్పై కీలక నిర్ణయం..!
సాక్షి, హైదరాబాద్: శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. లాక్డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించనుంది. దాంతో పాటుగా గోదావరి వాటర్ లిఫ్ట్, హైడల్ పవర్ ఉత్పత్తితో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటి జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ పై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొనుంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గడంతో ఆయా రాష్ట్రాలు లాక్డౌన్కు కాస్త సడలింపులను ఇచ్చారు. జూన్ 8న కేబినెట్ భేటీలో లాక్డౌన్ను పది రోజుల పాటు పొడిగించడంతో పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: గత 24 గంటల్లో 1417 కరోనా కేసులు -
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
-
ఈ నెల 30 న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మిషన్ కర్మయోగి’ పేరిట సివిల్ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సివిల్ సర్వీసులపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసుల సామర్థ్య పెంపు కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. పౌర అధికారులను మరింత సృజనశీలురుగా, నిర్మాణాత్మకంగా, చురుకుగా, పారదర్శకంగా ఉండేలా దేశ భవిష్యత్ కోసం వారిని దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మిషన్ కర్మయోగిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. వారు మరింత ఉత్తేజంగా, సాంకేతిక అంశాలపై పట్టు సాధించేలా ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని అన్నారు. ప్రపంచంలో అత్యంత మెరుగైన విధానాలను ఒంటబట్టించుకునే పౌర అధికారులు భారత సంస్కృతి, విధానాలకు అనుగుణంగా వాటిని మెరుగుపరిచే క్రమంలో సామర్థ్య పెంపు దోహదపడుతుందని తెలిపారు. ఇక జమ్ము కశ్మీర్లో డోంగ్రి, హిందీ, కశ్మీరీ, ఉర్దు, ఇంగ్లీష్లను అధికార భాషలుగా గుర్తించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. మరోవైపు జపాన్, ఫిన్లాండ్, డెన్మార్క్లతో వరుసగా జౌళి శాఖ, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత మూడు ఎంఓయూలకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. చదవండి : షూటింగ్స్ ప్రారంభించుకోండి! -
రాజస్తాన్ హైడ్రామా : అది మా హక్కు..
జైపూర్ : రాజస్తాన్ హైడ్రామా రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ పంపిన మార్గదర్శకాలపై చర్చించేందుకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి గవర్నర్ లేవనెత్తిన అంశాలపై తాము సవివరంగా చర్చించి సమాధానాలను సిద్ధం చేశామని భేటీ అనంతరం మంత్రి హరీష్ చౌధరి పేర్కొన్నారు.జులై 31నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తాము కోరుతున్నామని, అసెంబ్లీని సమావేశపరచడం తమ హక్కని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారనేది స్పీకర్ నిర్ణయమని చెప్పారు. కేబినెట్ ప్రతిపాదనలను గవర్నర్ ముందుంచుతామని చెప్పారు. 21 రోజుల నోటీస్తో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవచ్చని గవర్నర్ తెలిపిన క్రమంలో ఈ పరిణామం బీజేపీ బేరసారాలకు దిగేందుకు అనుకూలంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు సిద్ధపడితే 21 రోజుల నోటీస్ అవసరం లేదని గవర్పర్ పేర్కొన్న క్రమంలో ఈ దిశగా కేబినెట్ భేటీలో ఎలాంటి చర్చ జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో తక్కువ వ్యవధిలో ఎమ్మెల్యేలను సమావేశాలకు రప్పించలేరని గవర్నర్ పేర్కొంటూ ఎమ్మెల్యేలకు 21 రోజుల నోటీస్ను అందిస్తారా అని గవర్నర్ అశోక్ గహ్లాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు సభలో భౌతికదూరం నిబంధనలను ఎలా పాటిస్తారని ఆయన ప్రభుత్వాన్ని వివరణ కోరారు. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో విలీనం చేయడంపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. ఓ వైపు ఈ వ్యవహారంలో న్యాయపోరాటం జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీకి, అశోక్ గహ్లాత్కు గుణపాఠం చెబుతామని ఆమె హెచ్చరించారు. చదవండి : మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్కు షాక్ -
రాజస్తాన్ హైడ్రామా : కేబినెట్ భేటీ షురూ
జైపూర్ : రాజస్తాన్లో అశోక్ గహ్లోత్ సర్కార్పై ఆ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో నెలకొన్న రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ నుంచి తాజా ప్రతిపాదనను గవర్నర్ కల్రాజ్ మిశ్రా కోరడంతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గవర్నర్ పంపిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్కు మంత్రిమండలి మరోసారి విజ్ఞప్తి చేస్తుందని గహ్లోత్ శిబిరం పేర్కొంది. కాగా అసెంబ్లీని సమావేశపరచాలని అంతకుముందు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను తోసిపుచ్చుతూ గవర్నర్ పంపిన నోట్లో పలు అంశాలను ప్రస్తావించారు. ఆ నోట్లో ‘21 రోజుల నోటీస్ వ్యవధికి ప్రభుత్వం అంగీకరిస్తే శాసనసభను సమావేశపర్చవచ్చు. లేదా, సమావేశం ఎజెండా బలనిరూపణే అయితే, ఆ నోటీస్ కాల వ్యవధిని తగ్గించవచ్చు. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే.. ఆ మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల’ని పేర్కొన్నారు. అయితే రాజస్తాన్ అసెంబ్లీలో బీజేపీ తన పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు అసెంబ్లీ సమావేశాలకు ముందు 21 రోజుల నోటీసు ఇవ్వాలన్న నిబంధనను తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది ప్రలోభాలకు ఆస్కారం ఇచ్చినట్టేనని, కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ పేర్కొన్నారు. కాగా బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్కు గుణపాఠం చెబుతామని విలీనాన్ని సవాల్ చేస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన ఆ పార్టీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. ఇక కాంగ్రెస్లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఓ బీజేపీ ఎమ్మెల్యే రాజస్తాన్ హైకోర్టులో మంగళవారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. చదవండి : మళ్లీ మార్చి పంపండి! -
పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్
-
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా వ్యాప్తి వంటి అంశాలపై చర్చించేందుకు సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ భేటీ జరిగింది. కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ పొడిగింపుపై ముఖ్యంగా మంత్రి మండలి చర్చించింది. గ్రీన్జోన్లలో మద్యం షాపులు తెరవడంతోపాటు.. మద్యం ధరలను పెంచే విషయాన్ని కేబినెట్ పరిశీలించనుంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈనెలాఖరు వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్డౌన్ పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. (మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా మద్యం విక్రయం) అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్లోనూ లాక్డౌన్ పొడిగించనున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. పొరుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరవడంతో తెలంగాణలో షాపులు తెరుస్తారా..? లేదా అనేది ఉత్కంఠగా మారింది. దీనిపై నేటి మీడియా సమావేశంలో కేసీఆర్ తుది నిర్ణయం వెల్లడించనున్నారు. -
వైద్యులపై దాడిచేస్తే ఏడేళ్ల జైలు
-
వైద్యుల రక్షణకు ఆర్డినెన్స్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను బుధవారం కేంద్ర కేబినెట్ తీవ్రంగా పరిగణించింది.వైద్యులపై దాడులను నిరోధించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. 1897 ఎపిడెమిక్ చట్టంలో మార్పులు తెస్తూ ఈ ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా ఆర్డినెన్స్ను తీసుకురానుంది. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్డినెన్స్ అమల్లో ఉండనుంది. కేంద్ర మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దాడులకు పాల్పడితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని, నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వైద్యులపై దాడులకు పాల్పడేవారికి రూ లక్ష నుంచి రూ ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తామని చెప్పారు. వాహనాలు, ఆస్పత్రులపై దాడిచేస్తే వాటి మార్కెట్ విలువ కంటే రెండింతలు వసూలు చేస్తామని అన్నారు.డాక్టర్లు, వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్య సిబ్బందికి రూ 50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. 50 లక్షల మాస్క్లకు ఆర్డరిచ్చామని, వైద్య పరికరాల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా మే 3 వరకూ విధించిన లాక్డౌన్ అమలు తీరుతెన్నులను కేంద్ర మంత్రివర్గం సమీక్షించిందని చెప్పారు. లాక్డౌన్ నియమ నిబంధనలు ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును పర్యవేక్షించామని తెలిపారు. చదవండి : 'కరోనాపై పోరులో మీడియా ప్రముఖ పాత్ర' -
కోవిడ్-19 : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
-
ప్రధాని సహా ఎంపీల వేతనాల్లో కోత
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సోమవారం కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత విధించాలని నిర్ణయించారు. రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ నిధులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తమ వేతనాలను తగ్గించేందుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంగీకరించారు. వేతనాల కోత ద్వారా సమకూరిన నిధులను కన్సాలిడేషన్ ఫండ్కు జమ చేస్తారు.కాగా, కేబినెట్ నిర్ణయాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తే రూ 7900 కోట్లు సమకూరుతాయని మంత్రి తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4067కు పెరిగింది. చదవండి : బడా నిర్మాత కూతురికి కరోనా -
రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టిందని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. లాక్డౌన్ నేపథ్యంలో కార్మికులకు ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా త్వరలో జిల్లాల వారీగా హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. 80 కోట్ల మందికి ప్రత్యేక రేషన్ ద్వారా రూ 3 కే కిలో బియ్యం, రూ 2 కే కిలో గోధుమలు సరఫరా చేస్తామని చెప్పారు. ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయని, పాలు నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచిఉంటాయని తెలిపారు. ప్రజలంతా క్రమశిక్షణతో మెలుగుతూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ భరోసా ఇచ్చారు. ఇక మహమ్మారి వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు మూడు వారాల పాటు దేశమంతటా లాక్డౌన్ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకూ దేశమంతటా లాక్డౌన్ అమల్లో ఉంటుంది. దీంతో అత్యవసర సేవలు మినహా దేశమంతా షట్డౌన్లోకి వెళ్లింది. చదవండి : ఐదు రోజులుగా హౌరా స్టేషన్లోనే.. -
ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ
-
యూపీ: యోగి ఐ సర్కార్..
లక్నో : అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి, సంక్షేమాన్ని కొత్తపుంతలు తొక్కించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నిర్ణయించారు. పాలనాపగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో పోలీసుల దమనకాండ, ఎడాపెడా పేర్ల మార్పు వంటి నిర్ణయాలతో వివాదాస్పద సీఎంగా పేరొందిన యోగి క్రమంగా పాలనా సంస్కరణలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా కసరత్తు వేగవంతం చేశారు. మంత్రులందరికీ ఐపాడ్లు సమకూర్చి పేపర్లెస్ కేబినెట్గా మార్చేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. లక్నోలో ఇటీవల జరిగిన డిఫెన్స్ ఎక్స్పోలో సీఎం యోగి ఐపాడ్తో నోట్స్ రాసుకోవడం, ఆదేశాలు ఇవ్వడం అధికారిక కార్యక్రమాలకు విస్తృతంగా ఐపాడ్ను వినియోగించడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. చదవండి : టీచర్లకు విదేశీ భాషలు నేర్పించండి : యోగి -
జీఎన్రావు కమిటీ, బీసీజీ నివేదికల అధ్యయనానికి హైపవర్ కమిటీ
సాక్షి, అమరావతి : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంపై అధ్యయనం చేసిన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) నివేదికల్లోని అంశాల సమగ్ర, తులనాత్మక పరిశీలనకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్రావు నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికను కేబినెట్ ముందుంచారు. ఇవే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీజీని సైతం ఇప్పటికే ప్రభుత్వం కోరింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ సంస్థ నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించడం కోసం మంత్రులు, సీనియర్ ఐఏఎస్లతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని శుక్రవారం కేబినెట్ తీర్మానించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలని మంత్రి మండలి నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని మీడియాతో తెలిపారు. ఆ వివరాలు ఇలా.. చంద్రబాబు హయాంలో జరిగిందిదీ.. ‘2015లో అప్పటి ప్రభుత్వం ఒక ఊహాజనితమైన కలల రాజధాని నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకుని దేశంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను విస్మరించి అప్పటి మంత్రి నారాయణ బృందం ఇచ్చిన రిపోర్టును ఆమోదించింది. 2015–16లో రైతుల నుంచి 33 వేల ఎకరాలు, అసైన్డ్ లేదా ప్రభుత్వ, బంజరు భూమి 21 వేల ఎకరాలు కలిపి మొత్తం 54 వేల ఎకరాలు సేకరించింది. ఆ భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ. 2 కోట్ల వంతున సుమారు రూ.1.10 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేసింది. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే అప్పటి పాలకులు అయిదేళ్ల పాలనలో రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో అప్పట్లో భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.1,500 కోట్లు కాగా, రూ.4 వేల కోట్లకుపైగా నెలకు వందకు రూ.1.10 నుంచి రూ.1.15 వడ్డీతో అప్పు తెచ్చారు. ఈ అప్పునకు ఏటా వడ్డీ రూపంలో ప్రభుత్వం రూ.570 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని గొప్పగా చెప్పిన అనుభవమున్న అప్పటి ముఖ్యమంత్రి.. మౌలిక సదుపాయాల కోసమే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చవుతుందని నివేదిక తయారు చేసి అయిదేళ్లలో రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. అలాంటప్పుడు అనుభవం లేని, వాస్తవ దృక్పథం గల మనమేమి చేయాలని ఎవరైనా ఆలోచించాలి కదా? ఈ పరిస్థితిలో మౌలిక సదుపాయాల కల్పనకే రూ. 1.10 లక్షల కోట్లు వెచ్చించాలంటే.. కలల రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందనే అంశంపై మంత్రివర్గం వాస్తవ దృక్పథంతో చర్చించింది. రాష్ట్ర అవసరాల మాటేమిటి? అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 6 నెలల క్రితం పాత్రికేయులతో మాట్లాడుతూ.. తేగలిగినంత అప్పు మేమే తెచ్చాం. ఇక వీరికి ఎవరు అప్పు ఇస్తారు? అని అన్నారు. రూ.25 వేల కోట్లో రూ.50 వేల కోట్లో అప్పు తెచ్చుకుందామనుకున్నా చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో శంకుస్థాపనలు చేసిన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రూ.25 వేల కోట్లకు పైగా అవసరం ఉంది. స్కూళ్ల మరమ్మతులకు రూ.12 వేల కోట్లు, అధ్వానంగా ఉన్న ఆస్పత్రుల బాగుకు రూ.14 వేల కోట్లు, ఆరోగ్యశ్రీ కింద పేదల వైద్య అవసరాలు తీర్చడం కోసం రూ.3,150 కోట్లు కావాలి. పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమకు నీరివ్వడం కోసం సాగునీటి ప్రాజెక్టులకు వెరసి మరో లక్ష కోట్ల రూపాయలు అవసరం. అమ్మ ఒడికి ఏటా రూ.6 వేల కోట్లు, రాష్ట్రంలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం ఏటా రూ.9 కోట్ల చొప్పున 5 ఏళ్లకు రూ.45 వేల కోట్లు కావాలి. రక్షిత నీరు లేని దుస్థితి.. గుక్కెడు రక్షిత మంచి నీటి కోసం ప్రజలు తపిస్తున్నారు. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో సురక్షితంకాని నీరు తాగి ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్షిత మంచి నీరు సరఫరా చేసేందుకు వాటర్ గ్రిడ్ కోసం రూ.40 వేల కోటు, గిరిజన, బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.35 వేల కోట్లు కావాలి. పేదలకు సబ్సిడీ బియ్యం సరఫరాకు ఏటా రూ.10 వేల కోట్లు, పేదల విద్యాభివృద్ధికి ఏటా రూ.6 వేల కోట్లు అవసరం. చదువు ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమని మా ప్రభుత్వం నమ్మింది. అందుకే సంపూర్ణమైన ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తోంది. ఇవే కాకుండా రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం వాటా పోను రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.8 వేల కోట్లు ఇవ్వాలి. రోడ్ల నిర్మాణం చేపట్టాలి. గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో పేదలకు మౌలిక వసతులు కల్పించాలి. మా ప్రభుత్వం వ్యవసాయానికి పగలే ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏటా మరో రూ.3 వేల కోట్లు కావాలి. ఈ విషయాలన్నింటినీ మంత్రి మండలి సమగ్రంగా చర్చించింది. మరి రాజధాని నిర్మాణం ఎలా? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం, అవసరాలు, అభివృద్ధి, భవిష్యత్తు చూడాలి. ఇవన్నీ వదిలి ఈ కలల రాజధానిని ఇక్కడ ఎప్పటికి నిర్మించగలం? ప్రజా సంక్షేమాన్ని, బాగోగులను, మౌలిక సదుపాయాల కల్పనను, పేదల చదువు, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రాజధాని నిర్మాణం చేసే పరిస్థితే వస్తే హైదరాబాద్తోనో, బెంగళూరుతోనో, చెన్నైతోనో ఎప్పటికి పోటీ పడగలం? అనేది సమగ్రంగా మంత్రిమండలి చర్చించింది. విస్తృత చర్చ, మంత్రుల తర్జనభర్జనల అనంతరం జీఎన్రావు కమిటీ నివేదిక, రాబోయే బీసీజీ నివేదిక రెండింటి అధ్యయనం కోసం హైపవర్ కమిటీ వేయాలని నిర్ణయించింది. అందులో నిపుణులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు. దానికి సంబంధించిన మార్గదర్శకాల గురించి చర్చించాం. రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన పడాల్సిన పనిలేదు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రాజధాని మారుస్తున్నట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందరితో చర్చి స్తాం. మా ప్రభుత్వం ఏ పని చేసినా ధైర్యంగా చేస్తుంది. జర్నలిస్టులపై దాడి జరిగిందని చెబుతున్నారు.. దాడి గురించి ఎవరైనా రాసిస్తే హోం మంత్రి, డీజీపీతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకునేలా చూస్తాం. దాడి జరిగినందుకు నేను క్షమాపణ చెబుతున్నా. రాజధాని ప్రాంతంలోని రైతులే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ మేలు చేయాలన్నదే మా అధినేత ఆశయం. ఊహాజనితమైన కలల వల్ల కొందరు వ్యథ చెందుతున్నారనేది వాస్తవం. వారి ఆందోళన, దిగులు, బాధ పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తాం. మాది అమానవీయ ప్రభుత్వం కాదు. ఆదుకునే సర్కారు’ అని మంత్రి పేర్ని నాని వివరించారు. -
యాప్ సాయంతో జనాభా లెక్కలు
-
ఎన్పీఆర్: కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గం మంగళవారం ఆమోదించిన ఎన్పీఆర్ ఆమోదం, తదితర అంశాలపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియా సమావేశం నిర్వహించారు. జనాభా నమోదు కార్రయక్రమాన్ని చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయని తెలిపారు. 2010లోనే దీన్ని తొలిసారి ప్రవేశపెట్టారని, అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొలి కార్డును జారీ చేశారని తెలిపారు. భారతదేశంలో జీవించే ప్రజలందరి జాబితాను రూపొందించేందుకే దీనిని నిర్వహిస్తున్నామన్నారు. పీయూష్ గోయల్ తదితర మంత్రివర్గ సహచరులు పాల్గొన్న ఈ సమావేశంలో రూ. వేల కోట్ల అటల్ భూజల్ యోజనకు ఆమోదం తెలిపినట్టు తెలిపారు. అలాగే ఆయుధాల చట్టంలో సవరణలు చేసినట్టు వెల్లడించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు- ముఖ్యాంశాలు : 2021 ఫిబ్రవరి నుంచి 16వ జనాభా గణన వుంటుంది. ఇందుకోసం స్పెషల్ మొబైల్ ఆప్ తీసుకొస్తాం. ప్రజలు ఈ యాప్ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేయవచ్చు. స్వయం ప్రకటిత వివరాల ఆధారంగా గణన వుంటుంది. అంతేకానీ, దీనికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు, బయో మెట్రిక్ వివరాల నమోదు వుండదు. ప్రధానంగా సంక్షేమ పథకాల అసలైన లబ్దదారులు వెలుగులోకి వస్తారు. తద్వారా లబ్దిదారులకు మేలు కలగనుంది. టూరిజం విభాగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టినట్టు కేంద్రమంత్రి వివరించారు. హిమాలయా, నార్త్ఈస్ట్, కృష్ట, కోస్టల్, ఇకో, డిజర్ట్, తీర్థాంకర్, రామాయణ తదితర 16 సర్క్యూట్స్ ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఒక వ్యక్తి రెండు ఆయుధాలకు లైసెన్స్ కలిగి వుండేందుకు అనుమతి. గతంలో మూడువుండగా, తర్వాత ఒక ఆయుధానికి పరిమితం చేసినా, తాజా నిర్ణయంలో రెండు ఆయుధాలకు అనుమతి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్గా నియమించబడే అధికారి ఫోర్ స్టార్ జనరల్ , సైనిక వ్యవహారాల విభాగానికి అధిపతిగా ఉంటారు. రైల్వే బోర్డు పునర్నిర్మాణం చారిత్రాత్మక నిర్ణయం. ఈప్రక్రియ కొనసాగుతోంది- మంత్రి పియూష్ గోయల్. మొత్తం 8 రైల్వే సేవలను ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్) కిందికి తీసుకురానుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. -
అయోధ్యపై అనవసర వ్యాఖ్యలొద్దు: ప్రధాని
న్యూఢిల్లీ: అయోధ్య అంశంపై ఎటువంటి అనవసర ప్రకటనలు, వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులను కోరారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పరిస్థితులపై చర్చించారు. వివాదానికి తావిచ్చే ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని మంత్రులకు చెప్పారని అధికార వర్గాలు తెలిపాయి. కోర్టు తీర్పును ఓటమి లేదా గెలుపుగా భావించరాదన్నారు. మరోవైపు, ప్రధాని మోదీ ఢిల్లీ కాలుష్య వ్యవహారంపై మొదటి సారి స్పందించారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్న కాలుష్యంపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండేందుకు అవసరమైన యంత్రాలను వెంటనే అందించాలని కేంద్ర వ్యవసాయ శాఖను బుధవారం ఆదేశించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత మల్టీమోడల్ ప్లాట్ఫాం ‘ప్రగతి’ 31వ సమావేశాల్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రా రోజూవారీగా నమోదవుతున్న కాలుష్యస్థాయిని సమీక్షిస్తున్నారని తెలిపింది. మోదీ ఈ సమావేశంలో రూ. 61 వేల కోట్ల రూపాయల విలువ చేసే తొమ్మిది ప్రాజెక్టులను సమీక్షించారు. -
జై జవాన్.. జై కిసాన్
-
మోదీ కేబినెట్ తుది భేటీ : వరాలపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గురువారం చిట్టచివరి కేబినెట్ భేటీ జరగనుంది. ప్రధాని మోదీ నివాసంలో జరిగే కేబినెట్ సమావేశంలో భారీ వరాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్ధల్లో అగ్రవర్ణ పేదలకు పది శాతం కోటా అమలుకు రూ 4000 కోట్ల అదనపు కేటాయింపులకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. ఇక యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీల రిజర్వేషన్లకు సంబంధించి 200 పాయింట్ రోస్టర్ వ్యవస్థ పునరుద్ధరణకు ఆర్డినెన్స్పై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రజాకర్షక వరాలనూ ఈ భేటీ ద్వారా ప్రకటించి పూర్తిస్ధాయిలో ఎన్నికల క్షేత్రంలో అడుగుపెట్టాలని మోదీ సర్కార్ యోచిస్తోంది. కాగా ఈనెల 9 లేదా 11న ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే లోగా మరికొన్ని వరాలతో ఆకట్టుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా గురువారం కేబినెట్లో కీలక నిర్ణయాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రధాని మోదీ నాగపూర్ మెట్రో 13.5 కిలోమీటర్ల ఫేజ్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. -
తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు
-
తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో బీసీలకు రూ. 70 కోట్లతో 70 ఎకరాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆదివారం సీఎం కేసీఆర్తో జరిగిన కేబినేట్ భేటి అనంతరం తెలంగాణ మంత్రులు ఈటెల రాజేంధర్, హరీష్ రావు, జోగురామన్న, కడియం శ్రీహరిలు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలను మాత్రమే తీసుకున్నామని కడియం శ్రీహరి తెలిపారు. త్వరలోనే మరోసారి కేబినెట్ భేటీ జరగనుందని, ఆ కేబినెట్ భేటీలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాజా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను తెలిపారు. హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు, గోపాల మిత్రులకు వేతనం రూ. 3,500 నుంచి రూ. 8500 పెంపు, అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65 ఏళ్లకు పెంపు, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి 7500లకు పెంచుతూ నిర్ణయం, వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలుకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు, ఎన్యూహెచ్ఎంలో పని చేస్తున్న 9 వేల మందికి కనీస వేతనాలు పెంపు, కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనం రూ. 40 వేలకు పెంచినట్లు ప్రకటించారు. ఇక ముందస్తు ఎన్నికలు, పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరగగా మంత్రులు వాటి గురించి ఏం ప్రస్తావించలేదు. వీటిపై కొంగర్కలాన్ సభలో సీఎం కేసీఆర్ స్పష్టతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘మహిళా శక్తి’కి జై!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 115 జిల్లాల్లో ‘ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గ్రామీణ మహిళలకు చేరువై వారిలో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయి. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు కార్మిక సంఘాల్లో సభ్యులైన తమ ఉద్యోగులతో వేతన సవరణపై తదుపరి చర్చలు జరిపేందుకు కూడా అంగీకరించింది. చాలా కాలంగా పెండింగులో ఉన్న సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల వేతనాల పెంపు ప్రతిపాదనకు సైతం మోక్షం లభించింది. ‘బేటీ బచావో–బేటీ పడావో’ విస్తరణ 115 జిల్లాల్లో బ్లాకు స్థాయిలో 920 మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. అలాగే ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న బేటీ బచావో–బేటీ పడావో పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించారు. లైంగిక హింస బాధితులకు సాంత్వన చేకూర్చేలా మరో 150 ‘వన్స్టాప్ కేంద్రాల’ ఏర్పాటుకూ కేంద్రం ఓకే చెప్పింది. విస్తృత పథకమైన ‘ది నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్’లో మరో ఏడు కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలన్నింటికి 2017–20 మధ్య కాలంలో రూ.3,636.85 కోట్లు వెచ్చిస్తారు. భారం సీపీఎస్ఈల పైనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగులతో 8వ దఫా వేతన చర్చలు జరిపేందుకు రూపొందించిన విధాన ప్రక్రియకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘ఉత్పత్తితో పోలిస్తే కార్మికులకయ్యే వ్యయం పెరగకూడదన్న షరతుకు లోబడి వేతన సవరణ జరగాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం, అది కూడా సీపీఎస్ఈలు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లయితేనే, సంబంధిత పాలనా విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ను సంప్రదించిన తరువాతే వేతన పెంపు నిర్ణయం తీసుకోవాలి’ అని కేబినెట్ భేటీ తరువాత ప్రకటన వెలువడింది. ‘వేతనాలు పెరిగితే కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు. ఆర్థిక భారమంతా సదరు సంస్థపైనే ఉంటుంది. ఉద్యోగుల వేతనాలు పెరిగిన తరువాత తమ ఉత్పత్తులు, సేవల ధరలు పెరగకుండా సీపీఎస్ఈలు చూసుకోవాలి. ఇలా సవరించిన వేతనాలు ఎగ్జిక్యూటివ్లు, అధికారులు, యూనియనేతర ఉద్యోగుల వేతనాలను మించకూడదు’ అని అన్నారు. తమకున్న ఆర్థిక వనరులు, చెల్లించే స్తోమత ఆధారంగా వేతన సవరణపై కార్మికులతో చర్చలు జరిపేందుకు ఆయా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. సవరించిన వేతనాలు 2017, జనవరి నుంచి అమల్లోకి వచ్చి ఐదేళ్లు లేదా పదేళ్లు (ఏది ఎంచుకుంటే అది) వర్తిస్తాయి. అటవీయేతర ప్రాంతాల్లో పెంచిన వెదురు చెట్లను నరికేయకుండా సంబంధిత చట్టంలో సవరణ చేసేలా ఆర్డినెన్స్ తేవడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సీజేఐ వేతనం రూ.2.80 లక్షలు సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో పనిచేస్తున్న జడ్జీల వేతనాల పెంపునకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. జడ్జీల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2016లో అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదన ప్రకారం...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.80 లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ. 2.50 లక్షలు, హైకోర్టు న్యాయమూర్తికి రూ.2.25 లక్షల చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. -
నేడు కేబినెట్ భేటీ
► అత్యవసరంగా ఏర్పాట్లు ► చెన్నైకు మంత్రులు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. అత్యవసరంగా పిలుపు నివ్వడంతో సొంత జిల్లాలకు వెళ్లిన మంత్రులు చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. హఠాత్తుగా కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రిగా పళనిస్వామి పగ్గాలు చేపట్టి రెండున్నర నెలలు కావస్తోంది. ఈ కాలంలో రెండు సార్లు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పదిహేను వందలకు పైగా ఫైల్స్ మీద సంతకాలతో ఆమోద ముద్ర వేశారు. గత నెల బడ్జెట్ను సభలో దాఖలు చేయించారు. ఇరకాటాలు, అడ్డంకులు ఎదురవుతున్నా, పదవిని కాపాడుకుంటూ ప్రజాకర్షణ దిశగా తీవ్రంగానే ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. మూడు రోజులుగా తన సొంత జిల్లా సేలం లో సుడిగాలి పర్యటనతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అత్యవసరంగా కేబినె ట్ మీటింగ్కు చర్యలు తీసుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. సీఎం చెన్నైలో లేని దృష్ట్యా, మంత్రులందరూ తమ తమ సొంత జిల్లాలకు వెళ్లి ఉన్నారు. కేబినెట్ పిలుపుతో చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. అత్యవసరంగా పిలుపునిచ్చిన దృష్ట్యా, ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో అన్న ఎదురు చూపులు పెరిగాయి. ప్రధానంగా జులై నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్కు రిజర్వేషన్ల వర్తింపు ఉత్తర్వుల జారీ, ఎన్నికల నిర్వహణకు తగ్గ ఇతర ప్రక్రియలకు ప్రభుత్వ సహకారం తప్పనిసరి. అందుకు కీలక నిర్ణయాలు కేబినెట్లో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రైతు సమస్యల మీద చర్చ, నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు లక్ష్యంగా ఒత్తిడి పెంచే విధంగా చర్చ సాగే అవకాశాలు ఎక్కువే. అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు చేసినా శాఖల వారీగా నిధుల కేటాయింపులపై చర్చ సాగలేదు. ఇందుకు తగ్గట్టు అసెంబ్లీని సమావేశపరిచే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ముందు మరో వ్యవహారంగా గుర్తింపు లేని ఇళ్ల స్థలాలకు పట్టాల మంజూరు వివాదం ఉన్న విషయం తెలిసిందే. దీనిపై కూడా చర్చించి కోర్టుకు వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి. -
ఎరువుల షేర్లకు యూరియా పాలసీ బూస్ట్
ముంబై: నేషనల్ యూరియా పాలసీలో మార్పులకు శుక్రవారం క్యాబినెట్ ఆమోదించనందనే అంచనాలతో ఫెర్టిలైజర్స్ కౌంటర్కు డిమాండ్ పుట్టింది. యూరియా ఉత్పత్తిని గణనీయంగా పెంచాలనే ప్రధాన లక్ష్యంతో కేంద్రం నేషనల్ యూరియా పాలసీలో మార్పులు తేనుంది. దేశీయ యూరియా ఉత్పత్తిలో ఎనర్జీ సామర్ద్యం, ప్రోత్సాహం, ప్రభుత్వంపై సబ్సిడీ భారం హేతుబద్ధీకరించడం లాంటి చర్యలపై దృష్టిపెట్టనుంది. జాతీయ యూరియా విధాన సవరణను కేంద్ర కేబినెట్ చేపట్టనున్నట్లు వెలువడ్డ వార్తలతో ఎరువుల కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ (ఫ్యాక్ట్ ) 17 శాతం దూసుకెళ్లగా.. మద్రాస్ ఫెర్టిలైజర్స్ 14 శాతం, ఆర్సీఎఫ్ 13 శాతం, చంబల్ 8 శాతం, దీపక్ 8 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో 3.1 శాతం కోరమాండల్ ఇంటర్నేషనల్ 3.4శాతం పెరిగింది, దీపక్ ఫెర్టిలైజర్స్ 3.2శాతం , సదరన్ పెట్రోకెమ్ 7 శాతం, జువారీ ఆగ్రో, మంగళూర్ కెమ్, ఎన్ఎఫ్సీఎల్ 5 శాతం, జీఎన్ఎఫ్సీ 4 శాతం చొప్పున దూసుకుపోయాయి. కాగా మే 2015 లో, యూనియన్ క్యాబినెట్ తరువాతి నాలుగు ఆర్థిక సంవత్సరాలకుగాను (జూన్ 2015-మార్చి 2019) ఒక సమగ్ర న్యూ యూరియా విధానాన్ని ఆమోదించింది తాజాగా ఎరువుల సబ్సిడీలను వాస్తవిక అమ్మకాల ఆధారంగా బదిలీ చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
తమిళనాడులో కేబినెట్ సమావేశం
-
ఫోన్ ట్యాపింగ్పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: యనమల
-
ఫోన్ ట్యాపింగ్పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోన్ ను తెలంగాణ ప్రభుత్వ ట్యాప్ చేసిందని ఆరోపిస్తూ ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశామని తెలంగాణ ప్రభుత్వమే చెప్తోందని, ఇది వ్యక్తిగత భద్రత విషయమని, ఇలా ఫోన్ ట్యాప్ చేశామని చెప్పి వదంతులు వ్యాపింపజేయడం సరికాదని అన్నారు. అవసరమైనట్లు కేసును మార్చుకుని ఏపీ ప్రభుత్వాన్ని బదనాం చేశారని తెలిపారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని నాశనం చేసేందుకు ఇలా చేశారని, ఈ విషయాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకున్నామని, కేంద్ర హోంమంత్రికి నివేదిక తప్పకుండా ఇస్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై ముగ్గురు కేబినెట్ మంత్రులతో కమిటీ వేస్తున్నామని తెలిపారు. దాదాపు 125 టేపులు రికార్డు చేసినట్లు తమ వద్ద సమాచారం ఉందని, అసలు టేపులు ఎక్కడనుంచి వచ్చాయి? ఎందుకు వాటిని ప్రసారం చేయాల్సి వచ్చిందో తేలాల్సినవసరం ఉందని చెప్పారు. టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ నేరమని, అది చట్ట విరుద్ధమని అన్నారు. పునర్విభజన చట్టంలో సెక్షన్ 8 గురించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చించామని యనమల అన్నారు. దీంతోపాటు చంద్రబాబు పోన్ ట్యాపింగ్ విషయాన్ని కూడా చర్చించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాము ఎన్నిసార్లు గవర్నర్ కు నివేదించుకున్నా విభజన చట్టంలోని అంశాల విషయంలో ఎలాంటి మేలు జరగలేదని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు రేపు ప్రధానిని, జైట్లీని అవసరం అయితే హోంశాఖ మంత్రిని కలిసి వివరిస్తారని తెలిపారు. ఉమ్మడి రాజధానిలో పౌరుల హక్కుల రక్షణకు అన్ని నిబంధనలు ఉన్నాయని, ఈ విషయంలో గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. విభజన చట్టం ఆదరాబాధరాగా చేశారని, చివరికి వ్యక్తిగత భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని చెప్పారు. ఈ అంశంపై కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్, కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు. కేంద్ర హోంశాఖను కలిసి కేబినెట్ మంత్రులే ఈ తీర్మానం అందజేస్తారని తెలిపారు. -
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
-
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే!
-
తెలంగాణ కేబినేట్ నిర్ణయాలు...
-
సమాచారం లేకుండా కేబినెట్కు రావద్దు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్రిశాట్తో ఒప్పందం కుదుర్చుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక్రిశాట్ మనవద్దకు రాదని, మనమే వారి వద్దకు వెళ్లాలని చెప్పారు. అలాగే వ్యవసాయ మిషన్ పనితీరు ఎంతవరకు వచ్చిందని కూడా ఆయన ప్రశ్నించారు. దానికి కూడా మంత్రి పుల్లారావు సమాధానం చెప్పలేకపోవడంతో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కేబినెట్ సమావేశాలకు వచ్చేటప్పుడు సమాచారంతో రావాలని, సమాచారం లేకపోతే అసలు సమావేశానికి రావద్దని అన్నారు. కాగా, కేబినెట్ సమావేశంలో పింఛన్ల ఏరివేత అంశంపై ఎనిమిది మంది మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో ఎక్కువ పింఛన్లను తొలగిస్తున్నారని సీఎంకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇపుడున్న నిబంధనలను మార్చేది లేదని, అర్హులకు అన్యాయం జరగకుండా మాత్రం చూస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. -
భూ సేకరణపైనే ఏపీ కేబినెట్లో చర్చ
-
రుణమాఫీ ఊసెత్తని ఏపీ కేబినెట్ సమావేశం
లక్షలాది మంది రైతులు.. కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేస్తారా లేదా అని ఎదురు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం మాత్రం అటు రుణమాఫీ గురించి గానీ, ఇటు రుణాల రీషెడ్యూల్ గురించి గానీ ఏమాత్రం చర్చించకుండానే మంత్రివర్గ సమావేశాన్ని ముగించేసింది. లేక్వ్యూ అతిథి గృహంలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి... * అక్టోబర్ 2 నుంచి ఇళ్లు, పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ సరఫరా * 2వేల మెగావాట్ల విద్యుత్ సమకూర్చుకోవాలని నిర్ణయం * వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం * 13.50 లక్షల విద్యుత్ మోటార్లను మార్చాలని నిర్ణయం * ఆదర్శ రైతుల స్థానంలో ఎంపీఈవోల నియామకం.. ప్రతి వెయ్యి హెక్టార్లకు ఒక ఎంపీఈవో * అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 100 శాతం డ్రిప్ ఇరిగేషన్ * ఆరోపణలున్న 3వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు * మిగిలినవారిపై తొలగింపుపై అధికారం మంత్రులదే * ఉపాధిహామీ పథకం ద్వారా మొక్కల పెంపకం, సిమెంట్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం * పారదర్శకత కోసం 7 మిషన్ల ఏర్పాటు * 2020 నాటికి ఏపీని టాప్ 3లో ఉంచేందుకు లక్ష్యం * ఎంసెట్ కౌన్సెలింగ్ త్వరగా జరిపేందుకు తెలంగాణ సీఎంకు లేఖ రాయాలని నిర్ణయం -
ఏపీ తొలి కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
ముగిసిన కేంద్ర క్యాబినెట్ భేటీ
-
టీ మంత్రులపై బొత్స అసంతృప్తి
రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తెలంగాణ ప్రాంత మంత్రులు రాకపోవడాన్ని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. వాళ్లు ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి కూడా నష్టం కలిగిస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయానికి అంచనాల పెంపును కూడా పీసీసీ చీఫ్ బొత్స తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు బడ్జెట్ విషయమై సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన తన నిరసన తెలియజేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక లేఖ కూడా ఇచ్చారు. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచడాన్ని గతంలోనే బొత్స సత్యనారాయణ వ్యతిరేకించారు. ఈమేరకు ఇంతకుముందు కూడా ఒకసారి ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు లేఖలు సైతం రాశారు. -
మంత్రివర్గ సమావేశానికి రాలేమంటున్న T-నేతలు
-
రేపు కేంద్ర క్యాబినెట్ ముందుకు టీ బిల్లు
-
పైకి సమైక్యరాగం...లోన విభజనకు సహకారం
-
నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ
ఉదయం 10.30కు సమావేశం.. రాష్ట్ర కరెంటు సంక్షోభమే ఎజెండా! రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ వార్తలు.. హుటాహుటిన ఢిల్లీకి జైపాల్ విభజన నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్సింగ్ మంగళవారం ఉదయం కేంద్ర మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత బుధ, గురువారాలలోనే రెండుసార్లు సమావేశమైన మంత్రివర్గాన్ని మరోసారి ఇలా అకస్మాత్తుగా ఏర్పాటు చేస్తుండటానికి కారణాలు అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. అయితే విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించి, ప్రత్యామ్నాయ ఏర్పాటుపై చర్చించడమే భేటీ ఎజెండా కావొచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం. సమ్మెతో రాష్ట్రం కరెంటు కోతలతో అల్లాడుతుండటమే గాక పలు దక్షిణాది రాష్ట్రాలకు కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే పరిస్థితి తలెత్తడం తెలిసిందే. గ్రిడ్ కుప్పకూలవచ్చన్న వార్తలతో కేంద్రం ఆందోళన చెందుతోందని, ఈ నేపథ్యంలో సబ్స్టేషన్లు, సరఫరా, పంపిణీ వ్యవస్థల నిర్వహణను తాత్కాలికంగా సైనిక దళాల ఇంజనీర్లకు అప్పగించే ఆస్కారం లేకపోలేదని ఆ వర్గాలంటున్నాయి. విభజన నిర్ణయంతో అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, విద్యుత్ సంక్షోభ పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు ముందుకు రాకుంటే ఏం చేయాలన్న అంశాన్ని కూడా మంత్రివర్గం పరిశీలించవచ్చని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. తప్పనిసరైతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించయినా దక్షిణాది గ్రిడ్ కుప్పకూలకుండా చూడవచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటన నుంచి మంగళవారం సాయంత్రం తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10.30కు జరుగుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ఎస్.జైపాల్రెడ్డి సోమవారం రాత్రే హుటాహుటిన హైద్రాబాద్ నుండి ఢిల్లీ బయల్దేరినట్టు సమాచారం. మంత్రి పదవికి రాజీనామా సమర్పించేందుకు సోమవారం సాయంత్రం తనను కలిసిన మానవ వనరుల మంత్రి ఎం.ఎం.పల్లంరాజును కూడా మంగళవారం నాటి భేటీకి తప్పకుండా హాజరవాలని ప్రధాని కోరినట్టు సమాచారం. కానీ రాజీనామా చేసినందున రాలేననిఆయన తేల్చిచెప్పారని, మరో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మాత్రం హాజరవుతానని చెప్పారని తెలిసింది. -
రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ఎనిమిది మంది మంత్రులు గైర్హాజరు