chandrasekhar reddy
-
బకాయిలు కొండంత.. చెల్లించేది గోరంత
సాక్షి, అమరావతి: ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిలకుగానూ అరకొర నిధులను విడుదలచేస్తూ, సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25,000 కోట్లు ఉంటే, కూటమి ప్రభుత్వం రూ.1,300 కోట్లే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఇవ్వాల్సిన బకాయిలెంత? ఇప్పుడు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వ నిజ స్వరూపం బయటపడుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకునేది. కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కు పిలిచి మాట్లాడిన దాఖలాల్లేవు. ⇒ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన రూ.1,300 కోట్లలోనూ రూ.519 కోట్లు జీపీఎఫ్ కోసం, రూ.214 కోట్లు పోలీస్ విభాగం ఒక విడత సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం రూ. 300 కోట్లు మాత్రమే కడతామని చెబుతున్నారు. ఇదేనా మీరు ఉద్యోగులకు ఇస్తున్న సంక్రాంతి కానుక? ⇒ జీపీఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు. దీనికి మొత్తం ఇవ్వకుండా రూ. 519 కోట్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం? ఏడాదికి 15 రోజులు ఉద్యోగులు తమ లీవులను సరెండర్ చేసుకునేందుకు వీలుంది. దీనిని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కు.. అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నారు. సీపీఎస్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు. ఉద్యోగస్తులకు టీడీఎస్ కింద రూ.265 కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు. 36 ఏళ్లు ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఉద్యోగిగా ప్రభుత్వ తీరు అర్థం కావడంలేదు. ⇒ రాష్ట్రంలోని 3.80 లక్షల మంది పెన్షనర్లకు ఏమాత్రం మేలు చేయడంలేదు. డీఎ ఎరియర్స్, పీఆర్సీ ఎరియర్స్, సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిటేషన్ ఆఫ్ లీవ్, గ్రాట్యూటీ వంటి బెనిఫిట్స్ పెండింగ్ లో పెడుతున్నారు. అలాగే, మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్, ఏపీజేఎల్ వంటివి రూ. కోట్లలో ఉన్నాయి. వాటిల్లో ఇంతమేరకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టంచేయాల్సి ఉంది. ⇒ మంచి పీఆర్సీని, మధ్యంతర భృతిని ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీలిచ్చింది. 7 నెలలు గడుస్తున్నా పీఆర్సీని నియమించలేదు, ఐఆర్ను ప్రకటించలేదు. రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రతి ఆరునెలలకు కేంద్రం డీఏను ప్రకటిస్తుంది. ఏపీలో 2024లో రావాల్సిన రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ⇒ కూటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామన్నారు. తొలి రెండు నెలలే అలా ఇచ్చారు. హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులు కొంత, ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది. ప్రతిసారీ ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడంవల్ల ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి. సకాలంలో ప్రభుత్వ వాటా చెల్లించాలి. -
గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
-
పేరెంట్స్ మీటింగ్ కాదు.. పబ్లిసిటీ టీడీపీ మీటింగ్
-
నెల్లూరులో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం..
-
అధికారులను వేదించటమే ప్రభుత్వం పనా?
-
‘ఉద్యోగులను వేధించడమే చంద్రబాబు సర్కార్ పనా?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులే తప్ప ఎలాంటి మేలు జరగటం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు.‘‘నెల్లూరులో మైకు పని చేయలేదని ఐ అండ్ పీఆర్ అధికారిని చంద్రబాబు అందరిముందు అవమానపరచారు. గతంలో కూడా జన్మభూమి సమావేశాల్లో అధికారులను ఇలాగే బెదిరించారు. కొంతమంది ఉద్యోగులు అక్కడే గుండెపోటుతో కుప్పకూలారు. అధికారులు ఏ ప్రభుత్వంలోనైనా పని చేస్తారు. కానీ చంద్రబాబు కొంతమందిని టార్గెట్ చేశారు. గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పని చేసిన అధికారులను చంద్రబాబు వేధిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటి వారిని కూడా చంద్రబాబు వేధిస్తున్నారు’’ అని చంద్రశేఖర్రెడ్డి ధ్వజమెత్తారు.‘‘జత్వానీ కేసులో కూడా ముగ్గురు సీనియర్ ఐపీఎస్లపై వేటు వేశారు. రూల్స్ ప్రకారం పని చేస్తే ఈ వేధింపులేంటి?. చంద్రబాబు చెప్పిన రూల్స్ వ్యతిరేక పనులు చేయడం సాధ్యం కాదు. అంతమాత్రానికే వారిని వేధిస్తారా?. రెడ్బుక్ రాజ్యాంగం రాసుకుని దాన్ని ఫాలో అవమంటే అధికారులు ఎందుకు చేస్తారు?. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే అధికారులు పని చేస్తారని చంద్రబాబు, లోకేష్ గుర్తించాలి. విద్యా సంవత్సరం కూడా చూడకుండా ఉద్యోగుల బదిలీలు చేయటం కరెక్టు కాదు. రెవెన్యూ శాఖలో జరిగిన బదిలీల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింది. పొలిటీషియన్లకు కప్పం చెల్లించిన వారికే కావాల్సిన చోటుకు బదిలీ చేశారు. కిందిస్థాయి ఉద్యోగులు మరింతగా అల్లాడిపోతున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!!‘‘అధికారంలోకి రాగానే ఉద్యోగులకు అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయి?. ఐఆర్, పీఆర్సీ సంగతి ఏం చేశారో తెలియటం లేదు. ఉద్యోగులకు ఇంటి స్థలాలను వెంటనే మంజూరు చేయాలి. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పది శాతం ఇవ్వాలి. విశాఖ ఉక్కు పరిశ్రమలో లక్షమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. పరిశ్రమని ప్రైవేటు పరం చేస్తే వారందరి జీవితాలకు ఇబ్బంది వస్తుంది. కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా చూడాలి. ఉద్యోగులందరికీ వైద్య పరంగా ప్రభుత్వ సహకారం ఉండాలి. ఓపిఎస్ కోసం సీపీఎస్ ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. వారందరికీ న్యాయం చేయాలి’’ అని చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు.‘‘సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలి. జాబ్ కేలండర్ను త్వరగా విడుదల చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. కాకినాడలో ప్రొఫెసర్ పై దాడి చేసిన ఎమ్మెల్యే నానాజీపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులకు ప్రభుత్వం భద్రత కల్పించాలి’’ అని చంద్రశేఖర్రెడ్డి కోరారు. -
నెల్లూరులో టీడీపీ అరాచకాలపై చంద్రశేఖర్ రెడ్డి ఫైర్
-
టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఫైర్
-
ఇచ్చిన ప్రతి హామీ చంద్రబాబు అమలు చేయాలి
-
ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర
కడప కార్పొరేషన్: ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్ ఏడాదిలో ఏడెనిమిది సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీఏ, ఏపీజీఎల్ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా, ఎందుకు జరిగిందో ఉద్యోగులకూ తెలుసన్నారు. రెండేళ్లు కోవిడ్ వల్ల ప్రపంచం యావత్తు అల్లాడిపోయిందని, రాష్ట్రానికి రూ.76 వేల కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. 10,177 మంది రెగ్యులరైజ్ రాష్ట్ర బడ్జెట్ లక్షా ఇరవై ఐదు వేల కోట్లుగా ఉంటే అందులో 95 వేల కోట్లు జీతాలకే పోతోందని, మిగిలిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా పీఎఫ్ బకాయిలను క్లియర్ చేశారని తెలిపారు. కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లుతూ రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయనడం దారుణమన్నారు. 11వ పీఆర్సీ అరియెర్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్ తగ్గిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ఐఆర్ 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్ష¯Œన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 10,177 మందిని రెగ్యులరైజ్ చేశారని, వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న 11 వేల మందికి 010 పద్దు కింద జీతాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. లక్షా ముప్పై ఐదు వేల మందిని సచివాలయాల్లో నియమించిన సీఎం జగన్.. 12వ పే రివిజన్ కమిషన్ కూడా వేసి జూలై నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మే నెలతో పాటు ఒక డీఏ ఇస్తున్నారని, జూన్లో మరో డీఏ ఇస్తారని చెప్పారు. సీపీఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారని వివరించారు. కీలకమైన విద్య, వైద్యరంగాల్లో ఖాళీలన్నీ భర్తీ చేశారని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారని, చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నారని చెప్పారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికీ 16 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేశారన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని చేసిన జగన్ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, పెన్షనర్లపై ఉందని చెప్పారు. వలంటీర్లపై నిత్యం చంద్రబాబు అక్కసు.. 2014లో చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేశారని, తాజాగా ఆయన ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే అదనంగా లక్షా యాభై వేల కోట్లు కావాలన్నారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. అధికారంలోకొస్తే రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభల్లోనే అధికారులను తిడితే ఎంతో మంది గుండెపోటుకు గురయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడూ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాం.. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం.. అంటూ పోలీసులు, ఉద్యోగులను బెదిరిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని అడిగితే.. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను గానీ డీఏలు ఇచ్చేది లేదని మొండికేసిన విషయం ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదని చంద్రశేఖర్రెడ్డి వివరించారు. -
దేశమంతా ఏపీ వైపు చూస్తోంది
ప్రొద్దుటూరు క్రైం: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల వల్ల వైద్యరంగంలో గొప్ప మార్పులు వచ్చాయని, దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడీసీ) చైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం ఐఎంఏ ఏపీ స్టేట్ జోన్–3 రీజినల్ అకడమిక్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్ట, జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులతో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం చేరువైందని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపుల ద్వారా 50 రోజుల్లోనే 60 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదన్నారు. సీఎం నిర్ణయాలతో రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతమయ్యాయని చెప్పారు. రానున్న రోజుల్లో వైద్యం, ఆరోగ్యం విషయాల్లో మన రాష్ట్రం దేశానికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. గతంలో వైద్య రంగానికి సంబంధించి మన రాష్ట్రం కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల కంటే దిగువన ఉండేదని, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యల కారణంగా ఏపీ ముందు వరుసలో ఉందని చెప్పారు. ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణీందర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సమీకృత వైద్యాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోందని, ఇది మంచిది కాదన్నారు. ఈ కాన్ఫరెన్స్లో భాగంగా పలువురు వైద్యులు చేసిన అరుదైన శస్త్రచికిత్సల గురించి వీడియో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జీవీజీ మహేష్, డాక్టర్ త్యాగరాజరెడ్డి, డాక్టర్ ఇ.సాయిప్రసాద్, డాక్టర్ హేమలత, వసుధ, డాక్టర్ హరీ‹Ùకుమార్, అప్నా ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ చంద్రశేఖర్కి ప్రాణాపాయం లేదన్న వైద్యులు
-
టీచర్లను రెచ్చగొట్టేలా ఈనాడు దుర్మార్గపు రాతలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులను రెచ్చగొట్టేలా ఈనాడు కథనాలు రాస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనాడులో ఉపాధ్యాయులపై రాసిన కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రభుత్వ టీచర్లు విద్యార్థుల స్థితిగతులపై డిక్లరేషన్ ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారని శుక్రవారం ఈనాడు వార్త ప్రచురించిందని, కానీ ప్రభుత్వం ఎప్పుడూ మౌఖిక ఆదేశాలు ఇవ్వదని, అధికారికంగా పేపర్ పరంగా ఆదేశాలుంటాయనేది ఆ పత్రికకు తెలియదా అని ప్రశ్నించారు. ఎవరు మౌఖిక ఆదేశాలిచ్చారో రాయకుండా టీచర్లను రెచ్చగొట్టేలా రాయడం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలున్నా తక్షణమే సీఎం వైఎస్ జగన్ పరిష్కరిస్తున్నారని గుర్తుచేశారు. ఇకనైనా ఈనాడు ఇలాంటి అసత్య కథనాలు రాయడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో బాబు ఎంతోమందిని అవమానించారు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం ప్రాంతంలో ఒక పాఠశాలలో టీచర్ స్కూల్లోని సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకొస్తే.. ఆ టీచర్ను యూజ్లెస్ ఫెలో అంటూ తిట్టి సస్పెండ్ చేశారని, అదే జిల్లా శింగనమల ప్రాంతంలో పంచాయతీ అధికారి ఒకరిని జీపుపై ఎక్కించి అవమానించిన ఘనత బాబుదేనన్నారు. టీడీపీ నేత నిమ్మల కిష్టప్ప ఉపాధ్యాయులను చెట్టుకు కట్టేసి కొట్టండి అని గతంలో అన్నారని గుర్తుచేశారు. కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు విద్యావ్యవస్థపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి, ఉపాధ్యాయులకు గౌరవాన్ని పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. -
ఎర్రచందనం..ఎనీటైమ్ ప్రొటెక్షన్
చిప్ పనితీరు ఇలా.. రియల్టైం ప్రొటెక్షన్ చిప్ సెన్సార్ పరికరం 3.6 వాల్ట్స్ లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఎర్రచందనం చెట్లను ఎవరైనా నరికినా, దొంగిలించేందుకు ప్రయత్నించినా క్షణాల్లోనే మొబైల్ అప్లికేషన్స్, వాట్సాప్లకు అలర్ట్స్ పంపిస్తుంది. చెట్ల వద్ద ఉన్న హూటర్ ఎలక్ట్రానిక్ సైరన్ మోగిస్తుంది. వెంటనే అప్రమత్తమై చెట్లను రక్షించుకోవచ్చు.మొబైల్ అప్లికేషన్స్తో క్లౌడ్ సర్వర్ను అనుసంధానం చేయడంతో యూజర్స్కు వివిధ రకాల నివేదికలు చేరవేస్తుంది. గచ్చిబౌలి : ఖరీదైన ఎర్రచందనం చెట్లను పరిరక్షించేందుకు అధునాతన పరికరం (రియల్టైం ప్రొటెక్షన్ చిప్) అందుబాటులోకి వచ్చింది. నగరంలోని బొటానికల్ గార్డెన్లో ప్రయోగాత్మకంగా చిప్ సెట్లు అమర్చినట్టు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) వైస్చైర్మన్, ఎండీ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో విలేకరుల సమావేశంలో అధునాతన టెక్నాలజీని ఆయన వివరించారు. బొటానికల్ గార్డెన్లో 10 వేల ఎర్రచందనం మొక్కలు ఉన్నాయని, మొదటి విడతలో 50 ఎర్రచందనం చెట్లకు రియల్ టైం ప్రొటెక్షన్ చిప్లు అమర్చామని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన సీబీఐఓటీ టెక్నాలజీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. చిప్ల అమరికతో దొంగల నుంచి ఎర్రచందనం చెట్లను రక్షించుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే వీలుంటుందన్నారు. సీబీఐఓటీ సీఈఓ సత్యనారాయణ చొప్పదండి మాట్లాడుతూ ఎర్రచందనం చెట్ల రక్షణకు తమ సంస్థ ఇండియన్ ఉడ్ సైన్స్ టెక్నాలజీస్(ఐడబ్ల్యూఎస్టీ) సహకారంతో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ టెక్నాలజీని ఐడబ్ల్యూఎస్టీతో పాటు ఢిల్లీ ఐకార్, బెంగళూరు, ఝాన్సీ నగరాల్లో వాడుతున్నట్టు వివరించారు. సెన్సార్ కేసింగ్ (యాంటినో)తో అనుసంధానం చేయడంతో మొబైల్ ఫోన్లోనే చెట్ల రక్షణ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎవరైనా చెట్టును కొట్టేందుకు ప్రయత్నించినా చిప్ సెట్ సాయంతో అలారం మోగుతుందన్నారు. ఒక్క సెన్సార్ కేసింగ్తో కిలోమీటరు దూరంలో ఉన్న 500 చెట్లకు చిప్లను అమర్చుకోవచ్చన్నారు.అధికగాలి, జంతువుల రాపిడిని గుర్తించే విధంగా చిప్ సెట్ ఉంటుందన్నారు. ప్రతిరోజూ రాత్రి చెట్టుకు సంబంధించిన సమాచారాన్ని సర్వర్కు చేరవేస్తుందన్నారు. చెట్టును కొట్టాలని చూస్తే అలారం మోగుతుందని, చెట్టు ఎక్కడ ఉందనే వివరాలు ఫోన్కు చేరవేసి మ్యాప్ ద్వారా డైరెక్షన్ చూపిస్తుందన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్నాయక్, డైరెక్టర్ అక్బర్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘మా కుటుంబానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడు’
సాక్షి, నెల్లూరు: తమ కుటుంబానికి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. తాము మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడిచామని.. భవిష్యత్తులో కూడా నడుస్తామని స్పష్టం చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉంటే సాయం చేస్తానని చంద్రశేఖర్రెడ్డికి చెప్పానని గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడి తమ కుటుంబ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్ హయాంలో నా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిని అభివృద్ధి చేశాడు. అతనికి దరిద్రం పట్టి క్రాస్ ఓటింగ్ చేశాడు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజక వర్గాలు మాకు రెండు కళ్ళు లాంటివి. సీఎం జగన్ అడిగితే ఉదయగిరిలో చంద్రశేఖర్ రెడ్డి కూతురు రచనా రెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వమని అడుగుతాను. మా కుటుంబం టీడీపీలోకి వెళ్తున్నారని కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. అవన్నీ పుకార్లే’ అని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. (చదవండి: అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్) -
జీతాలపై దుష్ప్రచారం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక అదనంగా రెండున్నర లక్షలమందికిపైగా ఉద్యోగాలు ఇచ్చిందని, వారంతా ప్రభుత్వంలో కొత్తగా చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఆర్టీసీ విలీనం వల్ల వారు ప్రభుత్వ ఉద్యోగులయ్యారని, గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించాయని, వీటివల్ల జీతాల భారం పెరిగిందని వివరించారు. ప్రభుత్వ సొంత ఆదాయం ఏడాదికి రూ.1.25 లక్షల కోట్ల మేర వస్తుంటే, రూ.90 వేల కోట్లు జీతాలకే సరిపోతోందని చెప్పారు. సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.3 వేల కోట్లకుపైగా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ఈ నెల 16వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. కానీ బయటకు వెళ్లాక ఉద్యమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. -
ఆధారాలు లేకుండా చేయడానికే ఇంటికి నిప్పు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఆధారాలు దొరకకుండా హత్య చేసేందుకే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్(గుడిపల్లి) ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురిని బలిగొన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు సజీవ దహనం కేసు వివరాలను మంగళవారం డీసీపీ అఖిల్ మహాజన్.. ఏసీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్తో కలసి వెల్లడించారు. ఈ ఘటనలో ఐదు గురిపై హత్య, కుట్ర, ఒకరిపై అదనంగా అట్రాసిటీ కేసు పెట్టామన్నారు. బాధితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంకింద పరిహారం అందేలా చూస్తా మని తెలిపారు. మూడురోజులు 16 బృందాలు ద ర్యాప్తు చేసి క్షుణ్ణంగా పరిశీలించాయన్నారు. ఏ1గా మేడి లక్ష్మణ్, ఏ2 శనిగరపు సృజన, ఏ3 శ్రీరాముల రమేశ్, ఏ4గా వేల్పుల సమ్మయ్య, ఏ5గా ఆర్నకొండ అంజయ్య ఉన్నారని తెలిపారు. ఏళ్లుగా దంపతుల మధ్య గొడవలు.. మందమర్రి మండలం వెంకటాపూర్ పరిధి గుడిపల్లికి చెందిన మాసు శివయ్య(48) రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ(42) దంపతులు. శ్రీరాంపూర్కు చెందిన సింగరేణి మైనింగ్ సర్దార్ శనిగరపు శాంతయ్య(57) భార్య సృజనతో గొడవల కారణంగా శివయ్య–రాజ్యలక్ష్మితో ఉంటున్నాడు. ఇరువురు పంచాయతీలు, కేసులు పెట్టుకున్నారు. మెయింటెనెన్సు, జీతభత్యం వేరెవరికీ ఇవ్వకుండా కేసులు ఉన్నాయి. అయినా జీతం డబ్బులు, ఆస్తులు రాజ్యలక్ష్మికే ఇస్తున్నాడని భావించిన శాంతయ్య భార్య సృజన.. భర్తను హత్య చేయాలనుకుంది. తండ్రితో కలసి తనకు సన్నిహితుడైన లక్షెట్టిపేటవాసి మేడి లక్ష్మణ్(42)సాయం కోరింది. దీనికోసం 3 గుంటల భూమి రాసిస్తానని చెప్పింది. అలాగే, రెండు దఫాల్లో రూ.4 లక్షలు ఇచ్చింది. రంగంలోకి దిగిన లక్ష్మణ్.. శాంతయ్యను చంపేందుకు రూ.4లక్షలు ఇస్తానంటూ లక్షెట్టిపేటవాసి శ్రీరాముల రమేశ్ (36) సాయం కోరాడు. రోడ్డు ప్రమాదం చేసేందుకు రూ.1.40 లక్షలతో పాత బొలెరోను కొన్నా రు. నెల క్రితం మంచిర్యాల నుంచి శాంతయ్య, రాజ్యలక్ష్మి వెళ్తున్న ఆటోను బొలెరోతో ఢీకొట్టి చంపుదామనుకుని విఫలమయ్యారు. ఇలా రెండుసార్లు విఫలం కావడంతో ఈనెల 16న ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న లక్ష్మణ్, రమేశ్ మంచిర్యాలకు బస్సులో వెళ్లారు. శివయ్య, రాజ్యలక్ష్మి, శాంతయ్య ముగ్గురే ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు రమేశ్, సమ్మయ్య ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టారు. నిద్రిస్తున్న వారిలో రాజ్యలక్ష్మి అక్క కూతురు మౌనిక(24), కూతుళ్లు ప్రశాంతి(3), హిమబిందు (13నెలలు) ఉన్నట్లు వాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో ఒకరి కోసం ప్లాన్ వేస్తే ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. నిందితులను మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడంతో వివరాలు బయటపడ్డాయి. నిందితుల్ని బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
‘సజీవ దహనం’ హత్యగానే భావిస్తున్నాం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మందమర్రి రూరల్: ‘ఆరుగురు సజీవ దహనం’ కేసును విచారణ చేస్తున్నాం. మా ప్రాథమిక విచారణ లో దీనిని హత్యగానే భావిస్తున్నాం. ఆ కోణంలోనే విచారణ సాగుతోంది. అందులో ఎంతమంది ఉన్నారో త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తాం’ అని రామగుండం పోలీసు కమిషనర్ ఎస్.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన రామగుండం సీపీ మీడియాతో మాట్లాడారు. నిందితులు వాడిన పెట్రోల్ క్యాన్లు, పరిసర స్థలాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్రావు ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ నెల 16న అర్ధరాత్రి వెంకటాపూర్ (గుడిపెల్లి) ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో ఆరుగురు సజీవ దహనమైన విషయం తెలిసిందే. సీన్ రీ కన్స్ట్రక్షన్...: సోమవారం సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత ప్రధాన నిందితులు ముగ్గురితో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. రెండు గంటలపాటు నిందితుల సమక్షంలోనే నేరం జరిగిన తీరు తెలుసుకున్నారు. ఇల్లు కాలిపోయిన చోటికి రెండు వాహనాల్లో వెళ్లారు. ఎవరు సాయం చేశారు? పెట్రోల్ క్యాన్లను ఎలా తీసుకెళ్లారనే విషయాలను నిందితులు వివరించగా, వాటిని ఘటన స్థలంలోనే మరోమారు ధ్రువీకరించుకుని రికార్డు చేశారు. దీంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. -
సలహాదారులుగా ఎవరిని నియమించాలో ప్రభుత్వ ఇష్టం
సాక్షి, అమరావతి: సలహాదారులుగా ఎవరిని నియమించుకోవాలన్నది పూర్తిగా ప్రభుత్వ ఇష్టమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఇతరుల జోక్యానికి తావు లేదంది. సలహాదారును మీరు ఎంచుకోలేరని పిటిషనర్కు తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)గా ఎన్.చంద్రశేఖర్రెడ్డి నియామక ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. చంద్రశేఖర్రెడ్డి నియామకంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శితో పాటు చంద్రశేఖర్రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఎస్.మునయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన చంద్రశేఖర్రెడ్డిని ఉద్యోగుల సంక్షేమం విషయంలో సలహాదారుగా ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఉద్యోగులతో సమన్వయం చేయడం ఆయన బాధ్యత అని చెప్పారు. వాస్తవానికి ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రస్తుతం కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని, సలహాదారును నియమించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సలహాదారుగా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వ ఇష్టమని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఇతరులకు లేదంది. చంద్రశేఖర్రెడ్డి నియామక ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న ఉమేశ్ అభ్యర్థనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. -
కట్టు కథలు, పిట్ట కథలు మానుకో శ్రీరామ్
రాప్తాడురూరల్: పరిటాల శ్రీరామ్ చెబుతున్నట్లు వారి తాతల కాలం నుంచి వారి కుటుంబం నిజంగా బడుగు, బలహీన వర్గాల బాగు కోసం పనిచేసి ఉంటే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాలే 2019 ఎన్నికల్లో ఏకంగా 25 వేలకు పైగా ఓట్ల తేడాతో ఎందుకు ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి (చందు) సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కుటుంబంపై పరిటాల శ్రీరామ్ కట్టు కథలు, పిట్ట కథలు మానుకోవాలని హితవు పలికారు. ‘మా నాన్న తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి ఎవరికీ బెదిరే, అదిరేవారు కాదు. దౌర్జన్యాలకు తలవంచే మనస్తత్వం అసలే కాదు. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడే దౌర్జన్యాలను ఎదిరించిన ధీరుడు. నీ దౌర్జన్యాలకు ఇక్కడ భయపడే వారెవరూ లేరని రవి మొహం మీదే చెప్పిన వ్యక్తి మా నాన్న. ఈ విషయాన్ని అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు సాలార్ బాషా, మీ చిన్నాన్న గడ్డం సుబ్రహ్మణ్యంను అడిగితే తోపుదుర్తి పౌరుషం ఏంటో తెలుస్తుంది. మీ తాతల గురించి, మీ నాన్న గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు మీరు మంచి చేసిందేమీ లేదు. ఉద్యమం పేరుతో దోపిడీ సాగించారు. ఐదెకరాల నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు. మా ఆస్తులు పేదలకు పంచేందుకు సిద్ధం. మీ ఆస్తులు పంచేందుకు మీరూ సిద్ధమేనా?’ అని సవాల్ విసిరారు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది! ‘పరిటాల శ్రీరాములు, బోయ సిద్దయ్య ఇద్దరూ కలసి దోపిడీలు చేస్తే..బోయ సిద్దయ్యనేమో దొంగగా మార్చి, శ్రీరాములు ఉద్యమకారుడు అంటూ పచ్చమీడియా చిత్రీకరించింది. ఇద్దరూ దొంగలైనా కావాలి.. లేదంటూ ఇద్దరూ ఉద్యమకారులైనా కావాలి. పరిటాల శ్రీరాములు ఒక్కడే ఉద్యమకారుడు ఎలా అవుతాడు? పరిటాల రవి హత్యలు చేసి ఎంతో మంది మహిళల తాలిబొట్లు తెంపినాడు. గత ప్రభుత్వంలో శ్రీకాకుళం అడవుల్లో 26 మంది నక్సల్స్ను ఎన్కౌంటర్ చేస్తే మంత్రిగా ఉన్న మీ తల్లి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది? నసనకోట పంచాయతీలోనే భూములు లాక్కున్న చరిత్ర మీ నాన్నది. నువ్వు బచ్చావు.. నీకు తెలీకపోతే ఓసారి పెద్దోళ్లను అడిగితే చెబుతార’ని పరిటాల శ్రీరామ్కు హితవు చెప్పారు. అనంతపురం చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతూ లిటిగెంట్ భూములను కొనుగోలు చేస్తూ దందాలు చేస్తోంది మీరుకాదా అని నిలదీశారు. బెంగళూరు కేంద్రంగా అడ్రెస్ లేని సిమ్ల ద్వారా తమ కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతుండడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో పరిటాల కుటుంబం ఉన్మాద చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. (చదవండి: అనంతలో ప్రభుత్వ ఉద్యోగుల కృతజ్ఞత ర్యాలీ) -
అక్టోబర్ 2న ‘సెల్యూట్ సీఎం సర్’
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ 2న ప్రతి సచివాలయం పరిధిలో సెల్యూట్ సీఎం సర్ కార్యక్రమం నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా పిలుపునిచ్చారు. విజయవాడలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్రశేఖర్రెడ్డి, ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్తో కూడిన కొత్త జీతాలు వచ్చాయని, ఈరోజు తమకు శుభ దినమని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ 1.30 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, ఇది చెరగని చరిత్ర అని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో ఇది సువర్ణ అధ్యాయమన్నారు. తమకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ నూతన పేస్కేళ్ళు వర్తింపచేయడంతో విమర్శలు చేసిన వారి నోళ్లు మూగబోయాయని అన్నారు. ఇంత మందికి మంచి జరగడం సహించని వారు ఈ ఉద్యోగాలు పర్మినెంట్ కాదని, తాత్కాలికమేనని, రూ.15 వేలకు మించి జీతం పెరగదంటూ ఉద్యోగులను కించపరిచేలా అనేక అవాస్తవాలు ప్రచారం చేశారని చెప్పారు. పేస్కేల్స్తో జీతం ఇవ్వడం తమకు వరమైతే కొందరు కుట్రదారులకు చెంపపెట్టులా నిలిచిందన్నారు. సీఎం మాట నిలబెట్టుకున్నారు: చంద్రశేఖర్రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని సీఎం మాట ఇస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైందని ప్రభుత్వ సలహాదారు ఎన్. చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జూలై ఒకటి నుంచి సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్ ప్రకారం జీతం అందించారని కొనియాడారు. నవ చరిత్రకు నాంది: బండి శ్రీనివాసరావు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ సీఎం చేయని సాహసాన్ని ఏపీ సీఎం జగన్ చేశారని, నవ చరిత్రకు నాంది పలికారని తెలిపారు. ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించి యువతకు శాశ్వత భరోసా కల్పించడం గొప్ప విషయమన్నారు. తమ కలలు సాకారమైన వేళ గుండెలు నిండా అభిమానంతో ఈ సమావేశంలో పలువురు సచివాలయ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘సెల్యూట్ సీఎం సర్’ అంటూ నినాదాలు చేశారు. -
YS Rajasekhara Reddy: దశాబ్దాల రాజకీయం... శతాబ్దాల కీర్తి
జనం గుండెల్లో కొలువై ఉన్న మహానేత డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి! ఎన్నికల్లో ఏనాడూ ఓటమి ఎరుగని నేత! రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మిన రైతుజన బాంధవుడు. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యం కోసం పనిచేసిన అపర భగీరథుడు. నిరుపేదలకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించిన ఆరోగ్యశ్రీ ప్రదాత. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందించడం వైఎస్ పాలనలోనే మొదలైంది. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం సరికొత్త ప్రయోగం. ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని సుపరిపాలకుడు వైఎస్. ఆయన ఆశయాల కొనసాగింపునకు ఆవిర్భవించిన వైసీపీ నేటి నుంచి జరిగే ప్లీనరీలో అందుకు పునరంకితమవుతోంది. విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత... ఈ ఐదు లక్షణాలూ కలిగిన విలక్షణ వ్యక్తిత్వం వై.ఎస్.రాజశేఖరరెడ్డి సొంతం. కడప జిల్లా జమ్మల మడుగు మిషనరీ ఆస్పత్రిలో 1949 జులై 8న వైఎస్ జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత, రూపాయికే వైద్యం అందించారు. నాడి చూసి ప్రజల జబ్బులను పసిగట్టి చికిత్స చేసిన ఆయన... 28 ఏళ్ల వయసులోనే రాజకీయ నాయకుడిగా మారి, అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగుర వేశారు. నాలుగు సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ, అమలు చేయడంలోనూ అధికారులకు వైఎస్ పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఉదాహరణకు ఒకసారి కొందరు ఎమ్మెల్యేలు వచ్చి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, తమ వారికి ఇప్పించాలనీ అడిగారు. అప్పుడు వెంటనే సంబంధిత వర్సిటీ వీసీకి ఫోన్ చేసి, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలనీ, ఎమ్మెల్యేలు చెప్పిన వారికి అర్హతను బట్టి పోస్టులు ఇవ్వాలనీ సూచించారు. అయితే వీసీ 14 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారున్నారనీ, ముందు వారికి అవకాశం ఇచ్చిన తర్వాతే కొత్తవారికి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందనీ అన్నారు. ‘ఓకే! అలాగే కానివ్వండి. వీసీగా మీరే యూనివర్సిటీకి బాస్. మేం చెప్పిన వారికే ఇవ్వాలనేం లేదు’ అని వైఎస్ ఆయనకు స్పష్టం చేశారు. అదీ ఆయన వ్యక్తిత్వం. అదే సమయంలో ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించేవారు. ఆలస్యం చేస్తే సహించేవారు కాదు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వైఎస్ఆర్ హయాంలో ఆరేళ్ళ పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. తాను ఆ పదవిలో పనిచేసిన ఆరేళ్లలో ఎన్నడూ, ఏ సందర్భంలోనూ వైఎస్సార్ ‘వీరికి ఈ ఫేవర్ చేయండి’ అని చెప్పలేదనీ, పూర్తి స్వేచ్ఛ తమకిచ్చారనీ చెప్పారు. ఇటువంటి అధికారుల సహకారంతోనే వైఎస్ పాలనలో అద్భుతాలను ఆవిష్కరించారు. అనుక్షణం జనహితమే లక్ష్యంగా పనిచేసే వైఎస్సార్... రైతు పక్షపాతి. ౖరైతు బాగుంటేనే దేశం బాగుంటుందనీ, లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించి, కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందాన్ని చూడడమే తన లక్ష్యమనీ చెప్పేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘జలయజ్ఞం’ పేరిట సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఐదేళ్లలోనే 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి, 13 పూర్తి చేశారు. దాదాపు 25 లక్షల ఎకరాలకు పైగా భూములకు సాగునీటి సౌకర్యం కల్పించారు. రైతులకు ‘ఉచిత విద్యుత్’ చారిత్రక అవసరమని వైఎస్ ఉద్ఘాటించారు. ఢిల్లీలో పార్టీ పెద్దలు, కొందరు ఆర్థికవేత్తలు ఈ పథకాన్ని అమలు చేయగలరా అని అనుమానం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వచ్చి, నేను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తా. రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వలేని నాడు నేను సీఎం పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగను’ అని తేల్చిచెప్పారు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారాయన. అనంతర కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2007లో అమెరికాలో జరిగిన ‘ప్రపంచ వ్యవసాయ వేదిక’ సమావేశంలో భారత్ ఏకైక ప్రతినిధిగా వైఎస్ పాల్గొన్నారు. అక్కడ ఓ బహుళజాతి విత్తన కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఆ కంపెనీకి చెందిన పత్తి విత్తనాల ధరపై అప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు నడుస్తోంది. వారు ఆ కేసును వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరారు. అది అంతర్జాతీయ కంపెనీ అనీ, కాస్త పట్టూ విడుపూ ప్రదర్శించమనీ ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కూడా సూచించారు. అయినా వైఎస్ వెనక్కి తగ్గలేదు. అనంతర కాలంలో సుప్రీంకోర్టులో కేసు గెలిచారు. తద్వారా ఏటా రూ 3,000 కోట్ల చొప్పున గత 16 ఏళ్లలో రైతాంగానికి దాదాపు రూ 48,000 కోట్లు ఆదా కావటం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఆనాడు ఐదు వందల గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ ధర దాదాపు 1,600 రూపాయలు ఉంటే, అందులో దాదాపు వెయ్యి రూపాయలు రాయితీగా ఉండేది. విత్తనాల ధరను 750 రూపాయలకు తగ్గిస్తూ వైఎస్ ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు నిర్ణయించే చట్టాన్ని తీసుకొచ్చింది. దాదాపు ఐదు రాష్ట్రాలు ఆ చట్టాన్ని అనుకరించడంతో ఆ చట్టం దేశం దృష్టిని ఆకర్షిం చింది. ఆ విషయాన్ని ఉటంకిస్తూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ వైఎస్ను ఎంతగానో ప్రశంసించింది. వైఎస్ రైతుల కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ ఒక్క ఉదంతమే ఉదాహరణ. ఐదేళ్ల వైఎస్ పాలనలో చేపట్టిన పథకాలన్నీ జనరంజకమైనవే. 2003లో రాష్ట్రవ్యాప్తంగా మండుటెండల్లో దాదాపు 1,450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ ప్రతి కుటుంబాన్నీ కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత పేదలకు కూడు, గూడు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యాన్ని నెర వేర్చారు. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందిం చడం వైఎస్ పాలనలోనే మొదలైంది. దేశంలో ఎక్కడా లేని మరో వినూత్న పథకం ఫీజు రీయింబర్స్మెంట్. బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన విశిష్ట పథకం. 2008లో ఉగాది పర్వదినాన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు బాగా పెరిగాయి. దీనిపై పెద్ద చర్చ జరి గింది. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. మార్కెట్లో ధరలు, ముఖ్యంగా సోనా మసూరీ ధర తగ్గేవరకూ సీఎం, ఆయన కుటుంబ సభ్యులూ 2 రూపాయలకు కిలో బియ్యం రకాన్నే వాడారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలనీ, గుండె జబ్బులు సహా ఇతర వ్యాధులతో ఎవరూ మరణించకూడదనీ వైఎస్ ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రారంభించారు. సామాన్యులకు ఈ పథకం అపర సంజీవనిలా మారింది. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసు కూడా ఆయన ప్రారంభించిందే. 104 కాల్ సెంటర్ ఏర్పాటు గ్రామీణ ప్రజలకు ఇంటి వద్దకే వైద్య చికిత్సను అందించేందుకు చేపట్టిన మరో బృహత్తర పథకం. పావలా వడ్డీ, అభయ హస్తం, జలయజ్ఞం, రుణ మాఫీ, భూపంపిణీ, పశు క్రాంతి, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక బృందాలు... ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశారు. ఆయన ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. వైఎస్ హయాంలో పాడి పంటలే కాదు, ఐటీ ఎగుమతులు కూడా గణ నీయంగా వృద్ధి చెందాయి. రైతు సంక్షేమమే ధ్యేయంగా తుది శ్వాస వరకూ పనిచేసిన వైఎస్ పుట్టిన రోజైన జూలై 8ని ‘రైతు దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో వైఎస్ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. చివరికి ప్రజల కోసం వెళుతూ, హెలికాప్టర్ ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక మనిషి గొప్పతనం ఆయన చనిపోయినప్పుడు తెలుస్తుందంటారు. అది వైఎస్ విషయంలో అక్షర సత్యమైంది. భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన చేసిన సేవ, ప్రవేశపెట్టిన పథకాల రూపంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. ఎ. చంద్రశేఖర్ రెడ్డి వ్యాసకర్త రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈఓ, వైఎస్సార్కు నాటి ప్రెస్ సెక్రెటరీ -
ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదు: ఎన్.చంద్రశేఖర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: పదకొండవ పీఆర్సీపై అనేకసార్లు చర్చించిన తర్వాతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చేశారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగ సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను మొన్నటి వరకూ ఎన్జీవో అధ్యక్షుడిగా, జేఏసీ ఛైర్మన్గా ఉన్నాను. కొంత మంది ఉద్యోగ నాయకులు హెచ్ఆర్ఏ తగ్గిందని అంటున్నారు. దీనిపై ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై కమిటీ కూడా వేసింది. నిన్న (మంగళవారం) జరిగిన సమావేశంలో మూడు విషయాలను పట్టుబడుతున్నారు. పాత శాలరీ ఇవ్వాలని, పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన జీతాలకు అనుగుణంగా కొత్త జీవో ప్రకారం నిన్న జీతాలు వేశారు. ఇప్పుడు మార్చడానికి వీల్లేదు. ఐఆర్ రికవరీ లేకుండా, హెచ్ఆర్ఏ పెంచాలని అడుగుతున్నారు. కానీ ఆ విషయాన్ని మంత్రుల కమిటీ వద్ద చర్చిస్తే బాగుండేది. కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఉద్యోగులు కోరిన మేర పీఆర్సీ ఇవ్వలేకపోతున్నాం. ఏది ఏమైనా జీతాలు పడ్డాయి కాబట్టి జీవోలు వెనక్కి తీసుకోలేము. ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపై సంప్రదింపులతో సాదించుకోవాలి. లేదంటే ఆ గ్యాప్ అలానే ఉంటుంది. సమ్మె నోటీస్ ఇచ్చి ఆందోళనకు వెళ్తామని చెప్తున్నారు. అనేక సార్లు చర్చలకు ఆహ్వానించి మంత్రుల కమిటీ వేచి చూసింది. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు వేరు కాదు. వారు మరోమారు ఆలోచన చేయాలి. చదవండి: (ఆస్తుల విభజనకు తీసుకున్న చర్యలేమిటి?: విజయసాయిరెడ్డి) సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. మా ఉద్యోగ మిత్రులను రిక్వెస్ట్ చేస్తున్నా చర్చలతో పరిష్కరించుకుందాం. కార్యాచరణ వాయిదా వేయాలని, చర్చలకు రావాలని కోరుతున్నా. ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా ముఖ్యమంత్రి 23 శాతం ఫిట్మెంటు ఇచ్చారు. వచ్చిన జీతాల్లో ఎవరెవరికి ఎంత పెరిగిందో వాళ్ళకే తెలుసు. సామరస్యంతోనే సమస్యను పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు ఒకేసారి విజయవాడ రావడం వల్ల కొంత అసౌకర్యం కలుగుతుంది. అసాంఘిక శక్తులు కూడా మన మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నం చేయవచ్చు. కోవిడ్ వల్ల ఇబ్బంది ఉంది. 200 మంది కంటే ఎక్కువ గుమికూడి ఉండకూడదు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కూడా ఉద్యోగులు ఆలోచించాలి అని ప్రభుత్వ సలహాదారు ఎన్. చంద్రశేఖర్రెడ్డి అన్నారు. -
సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందొద్దు
సాక్షి, అమరావతి: ప్రొబేషన్ ప్రకటనపై గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన, అపోహలకు గురికావద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక సచివాలయ వ్యవస్థ అని, అందులో పనిచేసే ఉద్యోగులపై ఆయనకు ఎంతో అభిమానం ఉందని చెప్పారు. శనివారం విజయవాడలోని ఎన్జీఓ హోమ్లో పలు ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఆదర్శవంతమైందని చెప్పారు. దీన్ని చూసి పలు రాష్ట్రాలు ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను వేగంగా ప్రజలకు చేరవేయడంలో సచివాలయ ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను జూన్లోపు పూర్తి చేసి జులై నుంచి పే స్కేల్స్ ఇస్తామని సీఎం ప్రకటించారని తెలిపారు. కొందరు ఉద్యోగులు గత అక్టోబర్ 2 నుంచే పే స్కేల్స్ అమలు చేయాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, వారంతా సంయమనం పాటించాలని కోరారు. అందరికీ ఒకేసారి ప్రొబేషన్ ప్రకటించి, ఆ తర్వాత పే స్కేల్స్ అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. 23 శాతం ఫిట్మెంట్ వల్ల జీతాలు తగ్గుతాయనే ప్రచారం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో కూడా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం గొప్ప విషయమని తెలిపారు. ఎవరూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు: జానీ బాషా గ్రామ సచివాలయ ఉద్యోగులెవరూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జానీ బాషా చెప్పారు. ప్రొబేషన్పై సీఎం న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. అక్టోబర్ 2 నుంచి పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. దీని వెనుక కొన్ని శక్తులు ఉన్నట్లు అనుమానం ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే కాదని అన్నారని, వారిని పీఆర్సీలో చేర్చడం ద్వారా ఇలాంటి అనుమానాలు పోయాయని తెలిపారు. -
ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి
సాక్షి, అమరావతి: 11వ పీఆర్సీని వారం రోజుల్లో ఇస్తామని సీఎం వైఎఎస్ జగన్ చెప్పిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్.చంద్రశేఖర్రెడ్డి కోరారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. సీఎం ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఉద్యోగుల పట్ల ఆయన సానుకూలంగా ఉన్నారని చెప్పారు. పీఆర్సీని చూపించి కొన్ని ఉద్యోగ సంఘాలు నిరసనలు చేపట్టాయని, వీటిపై ఆలోచించాలన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా పనిచేస్తానని చెప్పారు. బకాయి ఉన్న డీఏలో ఒక డీఏను జనవరిలో ఇచ్చేందుకు ఇప్పటికే ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఉద్యోగులు అడక్కుండానే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని.. 15 ఏళ్లుగా ఎప్పుడు జరగని జాయింట్ స్టాఫ్కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. -
సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగుల పక్షపాతి అని ప్రభుత్వ సలహాదారు, ఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఉద్యోగులు, ప్రజలందరి మన్ననలతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఒక ప్రకటనలో చెప్పారు. త్వరలోనే పీఆర్సీ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అడక్కపోయినా 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చారని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. గ్రామ సచివాలయాల్లో అతి తక్కువ కాలంలో 1.30 లక్షల మందిని పారదర్శకంగా నియమించడం గొప్ప విషయమన్నారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, అందువల్లే ఉద్యోగులకు అందవలసినవి సకాలంలో అందలేదన్నారు. -
చంపుతానని బెదిరింపులు..పరిటాల శ్రీరామ్పై పోలీసులకు ఫిర్యాదు
చిలమత్తూరు: పరిటాల శ్రీరామ్ ఒక ఆకతాయి... ఫ్యాక్షన్ రాజకీయాలకు ఊతమిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి (చందు) విమర్శించారు. ఆదివారం సాయంత్రం తన కాలర్ పట్టుకుని చంపుతానంటూ శ్రీరామ్ బెదిరించడంపై రామగిరి మండల వైఎస్సార్సీపీ నేత నసనకోట ముత్యాలు సోమవారం చిలమత్తూరు పోలీస్స్టేషన్లో చందుతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో చందు మాట్లాడారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆ పార్టీ నాయకులు బెదిరింపు ధోరణులకు పాల్పడుతుండడం సిగ్గుచేటన్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలు.. వైఎస్సార్సీపీ తరఫున తిరుగుతుండడం జీర్ణించుకోలేక గతంలో దాడులు చేయించిన నీచ సంస్కృతి శ్రీరామ్దని గుర్తు చేశారు. తన ఐదేళ్ల పాలనలో లెక్కలేనన్ని పాపాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటు అడిగే ధైర్యం లేక ఇలాంటి రౌడీ మూకల్ని రంగంలో దించి, ప్రజలను బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.100 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టిన అల్లరి మూక శ్రీరామ్ను ప్రశాంతంగా జీవిస్తున్న చిలమత్తూరు మండల ప్రజలపైకి తోలి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం అరాచకాలు భరించలేక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 26వేల ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీని గెలిపించుకున్నారన్నారు. అంతటితో ఆగకుండా స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల్లోనూ పరిటాల కుటుంబాన్ని ఇంటికే పరిమితం చేసేలా ఓటర్లు తీర్పునిచ్చారన్నారు. సొంత మండలం రామగిరిలో 9 పంచాయతీలకు గాను కేవలం రెండింటిని మాత్రమే పరిటాల కుటుంబీకులు నిలబెట్టుకున్నారంటే వారిపై ఎంత ప్రజావ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చిలమత్తూరు మండల జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమేష్, నాయకులు రామకృష్ణారెడ్డి, అమరనాథరెడ్డి, అశ్వత్థరెడ్డి, సోమశేఖర్, న్యాయవాది ఇందాద్ తదితరులు పాల్గొన్నారు. -
150 గ్రామాల్లో కరోనా ఘంటికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతున్నప్పటికీ 150 గ్రామాల్లో మాత్రం వైరస్ విజృంభిస్తోందని, ఏడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వీరవిహారం చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కేసుల పెరుగుదల, వాటి ని యంత్రణ కోసం ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ క్యార్యదర్శి రిజ్వీ నేతృత్వం లో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ డాక్టర్ తాడూరి గంగాధర్, డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి 3 రోజులపాటు హెలికాప్టర్లో సుడిగాలి పర్యటన చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంతాల్లో కరోనా విజృంభించడానికి గల కారణాలపై సీఎం కేసీఆర్కు నివేదిక అందజేశారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగానే పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా విజృంభిస్తున్న ఏడు జిల్లాలకు ప్రభుత్వం ఒక్కో నోడల్ ఆఫీసర్ను నియమించింది. నివేదికలోని అంశాలు ఇలా... ►ప్రజలు మాసు్కలు ధరించకపోవడం, ఏపీ సరిహద్దుల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పరిధిలోని హాలియా, త్రిపురారం, పెద్దవూరల్లో కేసులు పెరుగుతున్నాయి. ►మిర్యాలగూడ పరిధిలోని అల్లగడప, వేమునాలపల్లి, దామరచర్లలో ఉన్న రైస్ మిల్లులు, పవర్ ప్లాంట్ వర్కర్లలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వారే. తరచూ ప్రయాణాలు సాగిస్తుండటం వల్ల అక్కడ కరోనా విజృంభిస్తోంది. ►నకిరేకల్ పరిధిలోని పనగల్, ఒగుడు, రాములబండ, మంచెర్లగూడ ప్రాంతాల్లో జాతర, పెళ్లిళ్లు వైరస్ ఉధృతికి కారణం. ►సూర్యాపేట జిల్లాలో మార్కెట్ హడావుడి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండటం, చేపలు పట్టడం తదితర కారణాల వల్ల వైరస్ విజృంభిస్తోంది. ►ఖమ్మం జిల్లాలో నగరానికి చుట్టుపక్కల వైరస్ తీవ్రంగా ఉంది. ►మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పరిధిలోని గార్ల, కొత్తగూడ, కోమట్లగూడెం, ఉగ్గపల్లిల్లో కరోనా పరీక్షలు తగ్గాయి. ►కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని జమ్మికుంట, వీణవంక ఏరియాల్లో కేసులు, పాజిటివిటీ రెండూ పెరుగుతున్నాయి. ►మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, జైపూర్, నస్పూర్, చెన్నూర్ ప్రాంతాల్లో సింగరేణి కాలరీస్ యాజమాన్యం, జిల్లా వైద్యాధికారుల మధ్య సహకారం కొరవడటం, తక్కువ పరీక్షలు, సరైన వైద్య చికిత్సలు చేయడంలో వైఫల్యం వల్ల ఇక్కడ కేసులు పెరిగాయి. ►పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, గారేపల్లి, కమాన్పూర్, ఓదెల, శ్రీరాంపూర్, అల్లూర్లలో తక్కువ పరీక్షలు, వివిధ శాఖల మధ్య సహకారం కొరవడటం, పవర్ ప్లాంట్ వర్కర్ల మొబిలిటీ వల్ల కేసులు పెరిగాయి. ►రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల అర్బన్, వేములవాడల్లో పరీక్షలు తగ్గడం, దేవస్థానానికి భక్తులు రావడం వల్ల కేసులు పెరుగుతున్నాయి. ►వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ, కమలాపూర్ ప్రాంతాల్లో జనం తాకిడి పెరగడం, మాస్్కలు ధరించకపోవడం వల్ల అధిక కేసులు. సిఫార్సులు... అన్నిచోట్లా కరోనా పరీక్షలు, ఫీవర్ సర్వే చేపట్టాలి. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ను ముమ్మరంగా నిర్వహించాలి. కోవిడ్ క్లినిక్స్ను కొనసాగించాలి. ఈ ప్రాంతాల్లో ఏ వేరియంట్ వైరస్ విస్తరిస్తుందో తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. వివిధ శాఖల మధ్య సహకారం పెంచాలి. -
మా శవాలపై వెళ్లి ఎన్నికలు పెడతారా?
సాక్షి, అమరావతి: మమ్మల్ని చంపి మా శవాలపై ఎన్నికలు నిర్వహిస్తారా? అంటూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను ప్రశ్నించారు. అద్దం చాటు నుంచి దాక్కుని మీడియా సమావేశం పెట్టి తన ప్రాణం ఎంతో విలువైందని, తానొక్కడినే సురక్షితంగా ఉండాలని చూపించారని, ఉద్యోగుల ప్రాణాలు మాత్రం అంత చులకనా? అని నిలదీశారు. విజయవాడలోని ఎన్జీవో హోమ్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకూ కుటుంబాలున్నాయని, తమ ప్రాణాలకు బాధ్యత ఎవరిదని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దం చాటు నుంచి మీరు మాట్లాడినట్టుగా ఉద్యోగులు ఎన్నికల్లో ఎలా పని చేయగలరో చెప్పాలన్నారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను ఎస్ఈసీ విడుదల చేసిన తీరు బాధ కలిగించిందని, ఎన్నికలకు ఇది సమయం కాదు.. ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ఇచ్చాక ఎన్నికలు నిర్వహించాలని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. నోటిఫికేషన్ ఇస్తూ ఎన్నికలకు సహకరించకపోతే దుష్పరిణామాలు ఉంటాయని ఉద్యోగుల్ని భయపెట్టడం ఏమిటని, ఎంతమంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తారు? ఎంతమందిని తొలగిస్తారు? అని నిలదీశారు. ఉద్యోగుల ప్రాణాలు పోయినా పర్వాలేదు.. ఎన్నికలు మాత్రం జరపాలని అనుకోవడం ఏమిటన్నారు. కరోనా సమయంలో అందరూ ఇళ్లలో ఉన్నా ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పనిచేసిన విషయం ఎన్నికల కమిషనర్కు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం రెండున్నరేళ్ల నుంచి సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా, మీరు రిటైరయ్యే సమయంలో పంతం కోసం ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరికాదని తప్పుపట్టారు. ఎన్నికలు, వ్యాక్సిన్ రెండు అవసరమే అని చెప్పిన హైకోర్టు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెబితే ఏకపక్షంగా నోటిఫికేషన్ విడుదల చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. వెంటనే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో సోమవారం ఈ కేసు విచారణకు వస్తుందని, అప్పటివరకూ ఆగాలని కోరారు. సుప్రీంకోర్టులో ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. ఇప్పటికీ తమ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగుల్ని తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. -
పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తాం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల అభ్యర్థనలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. నిమ్మగడ్డ మొండిగా ముందుకు వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలను బహిష్కరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ క్షేమంగా ఉండాలి.. ఉద్యోగులు మాత్రం ప్రాణాలు బలి పెట్టాలా. అధికారులపై చర్యలు తీసుకుంటామని.. నిమ్మగడ్డ బెదిరించడం న్యాయం కాదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్పై ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. అద్దం చాటున దాక్కుని నిమ్మగడ్డ ప్రెస్ మీట్ పెట్టారు’’ అని చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. (చదవండి: ఒంటెత్తు పోకడలకు చెంపపెట్టు) ‘‘ఆయన ఎందరిపై చర్యలు తీసుకుంటారో చూస్తాం. నిమ్మగడ్డ వ్యవహించిన తీరు, మాట్లాడిన విధానం.. బాధ కలిగించింది. ఎలాగైనా ఎన్నికలు జరిపి తీరుతామనే నిమ్మగడ్డ మొండివైఖరి సరికాదు. మా ప్రాణాలకు ష్యూరిటీ ఎవరు ఇస్తారు.. నిమ్మగడ్డ గ్యారెంటీ ఇస్తారా. 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఒకే తాటిపై ఉన్నాం. ఉద్యోగులను భయపెట్టాలని నిమ్మగడ్డ చూస్తున్నారు. మమ్మల్ని భయపెట్టి చంపే అధికారం మీకు లేదు. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడం’’ అని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. -
హైకోర్టు తీర్పు శుభపరిణామం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేయడం శుభపరిణామమని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవో హోంలో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ సమావేశం సోమవారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు, ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేయాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్కు అనుగుణంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ధర్మం వైపు న్యాయం హైకోర్టు తీర్పుపై ఏపీ అమరావతి జేఏసీ సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ను హైకోర్టు రద్దు చేయడంపట్ల ఏపీ అమరావతి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పుడూ ధర్మం వైపే న్యాయం ఉంటుందని ఈ తీర్పు ఋజువు చేసింది అని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
స్థానిక ఎన్నికలను వాయిదా వేయండి
గుంటూరు మెడికల్: ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. స్థానిక ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖరరెడ్డి అన్నారు. ప్రభుత్వ సలహా తీసుకోకుండా.. ఉద్యోగుల్ని సంప్రదించకుండా విడుదల చేసిన షెడ్యూల్ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ను డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్వేవ్, బర్డ్ ఫ్లూ భయాందోళనల్లో ప్రజలున్నారని.. ఇలాంటి సమయంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమని.. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మొండిగా వ్యవహరిస్తే.. ఎన్నికలను బహిష్కరించి కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని.. ఉద్యోగుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కాగా, సీపీఎస్ రద్దుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని చంద్రశేఖరరెడ్డి చెప్పారు. కరోనా వల్ల రెవెన్యూ తగ్గి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో సీపీఎస్ రద్దుతో పాటు పీఆర్సీ విషయంలో జాప్యం జరిగిందన్నారు. త్వరలోనే అవి పరిష్కారమవుతాయని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముందన్నారు. సమావేశంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ మినిస్టీరియల్ రాష్ట్ర అధ్యక్షుడు బండి చంద్రశేఖరరావు, ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రచార కార్యదర్శి వి.కృపావరం, రాష్ట్ర కోశాధికారి ఎం.వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎ.రంగారావు, నాయకులు ఘంటసాల శ్రీనివాసరావు, సీహెచ్.రాంబాబు, ఎం.ఎన్.మూర్తి, కె.ఎన్.సుకుమార్, సీహెచ్.అనిల్, జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. వేసవిలో నిర్వహించాలి: వైఎస్సార్ టీఎఫ్ సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వేసవి సెలవుల్లో నిర్వహించాలని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జాలిరెడ్డి, జి సుదీర్ ఓ ప్రకటనలో కోరారు. కరోనాతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భయాందోళనతో ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు భయపడుతున్నారని, ముందుగా వారికి వ్యాక్సిన్ అందించాలని పేర్కొన్నారు. ఆ తర్వాత వేసవి సెలవుల్లో ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో ఎన్నికల విధులు బహిష్కరించడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని ప్రకటనలో తెలిపారు. -
ఎన్నికల షెడ్యూల్ను వెనక్కు తీసుకోవాలి: ఏపీ ఎన్జీవో
సాక్షి, విజయవాడ: ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను వెనక్కి తీసుకోవాలని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనాతో చాలా మంది ప్రజలు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ఎన్నికలు వద్దని ఇప్పటికే ఎస్ఈసీకి అనేక సార్లు విన్నవించాం. అయినా మొండిగా షెడ్యూల్ విడుదల చేయడం దారుణం. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదు' అని అన్నారు. చదవండి: (సంక్షేమ కార్యక్రమాల అమలు ఆపండి) ఈ సందర్భంగా టీడీపీ నేత అశోక్బాబుకు చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'ఉద్యోగ సంఘాల్లో పనిచేసి రాజకీయాల్లోకి వెళ్లి ఆరోపణలు చేస్తున్నారు. మీ రాజకీయ పార్టీల సంగతి మీరు చూసుకోండి. మీలాగా రాజకీయ పార్టీలకు మస్కాలు కొట్టడం మాకు చేతకాదు. ఉద్యోగ సంఘాలపై అశోక్ బాబు ఆరోపణలు సిగ్గుచేటు' అంటూ మండిపడ్డారు. చదవండి: (నిమ్మగడ్డ ‘కోడ్’ ముందే కూత) -
ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో
సాక్షి, అమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కోవిడ్ స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ఎన్నికల విధులు బహిష్కరిస్తామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతోందని ఇలాంటి సమయంలో నోటిషికేషన్ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేసిన విషయం తెలిసిందే.(చదవండి: నిమ్మగడ్డ తీరుపై సర్వత్రా విస్మయం) ఈ విషయంపై స్పందించిన చంద్రశేఖర్రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలు దఫాలుగా ఎన్నికల కమీషనర్కు తెలియజేశాం. సీఎస్ కూడా ఇదే విషయాన్ని ఆయనకు వివరించారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ అప్రజాస్వామికం. తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికల తరువాత కరోనా వ్యాపించింది. ఎన్నికల కమీషనర్ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికలు పెడితే ప్రజలు కూడా కరోనాతో భయబ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో పాలన కుంటుపడలేదు. 9లక్షల కు పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తాం’’ అని పేర్కొన్నారు. వ్యవస్థ కోసం పనిచేయాలి కానీ.. నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నేత సుధీర్బాబు అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరని పేర్కొన్నారు. ఇక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులందరూ వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని, ప్రభుత్వ అభ్యర్థనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఎన్నికల కమిషన్ వ్యక్తుల కోసం కాదు.. వ్యవస్థ కోసం పనిచేయాలని హితవు పలికారు. -
మా ప్రాణాలను పణంగా పెట్టలేం: చంద్రశేఖర్ రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందిని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దేశంలో ఇటు వంటి వ్యవస్థ ఎక్కడ లేదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా సచివాలయ వ్యవస్థను అభినందించారని ఆయన గుర్తుచేశారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లడుతూ.. త్వరలోనే ఉద్యోగులు అందరూ అమరావతి నుంచి వైజాగ్ వస్తున్నారని, వారంతా వైజాగ్ను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన జీతాలను ఈ నెల నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ('దొడ్డి దారిన పదవి పొందిన దద్దమ్మవి నువ్వు') మూడు డీఏలు ఇవ్వడంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పేరు చెప్తేనే అందరూ భయపడే పరిస్థితి ఉన్న సందర్భంలో ఎన్నికలు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని.. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు. కరోనా తగ్గిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. (దేవినేని ఉమకు షాకిచ్చిన జక్కంపూడి గ్రామస్తులు) -
ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ తీపి కబురు
సాక్షి, అమరావతి: తమ సమస్యల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ కారణంగా రెండు నెలల పాటు తగ్గించిన డిఫర్ జీతాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. అదే విధంగా సీపీఎస్ అమలు, పీఆర్సీ విషయంలో కూడా సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఇందుకు ఉద్యోగుల అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. కాగా ఏపీ ఎన్జీవో ముఖ్యనేతలు నేడు సీఎం జగన్ను కలిశారు. (చదవండి: సమగ్ర భూ సర్వేతో శాశ్వత భూ హక్కు) ఈ భేటీ అనంతరం చంద్రశేఖర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగికి రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. కోవిడ్ సోకిన ఉద్యోగులకు 30 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని అడిగామని, ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అదే విధంగా డిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు నవంబరు నెలలో ఇచ్చేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. అన్ని రకాల సౌకర్యాలు, రాయితీలు ఇవ్వటానికి సీఎం అంగీకరించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇక నాల్గవ తరగతి ఉద్యోగుల వయోపరిమితి 62 ఏళ్ళకు పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారని సంఘం ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు అన్నారు. మహిళా ఉద్యోగులకు ఐదు రోజులు సెలవులు ఇవ్వాలని కోరామని తెలిపారు. -
అశోక్బాబుపై ఏపీఎన్జీవో ఫైర్..
సాక్షి, అమరావతి: తాము ఎప్పుడు టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదని.. అశోక్బాబు చెప్పేవన్నీ అవాస్తవాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అశోక్బాబు తనను ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా కాకుండా అడ్డుకోవాలని చూశారని, చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారిని ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా చేయాలని చూశారని ధ్వజమెత్తారు. ‘‘అశోక్బాబు మమ్మల్ని రాజకీయంగా వేధించారు. ఇంకోసారి ఆయన ఏపీఎన్జీవో పేరు ఎత్తితే సహించేదిలేదని’’ చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. ఏపీఎన్జీవో సంఘానికి అశోక్బాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. (చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం నోటీసులు) ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనుడు టీడీపీకి మద్దతు తెలిపామని అశోక్బాబు మాట్లాడటం సిగ్గుచేటని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అశోక్బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన ఘనుడు అశోక్బాబు అని, వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఒక మాటైనా మాట్లాడావా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఉద్యోగుల హక్కులను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని అశోక్బాబుపై బొప్పరాజు నిప్పులు చెరిగారు. (‘టీడీపీకి మిగిలింది ఆ ఒక్కటే’) ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్సీ పదవి.. గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించానని స్వయంగా అశోక్బాబే ఒప్పుకున్నారని, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ పదవిని అశోక్ బాబు సంపాదించారని, వెంటనే ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అశోక్ బాబు పై రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్, గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైనతే హైకోర్టు ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా అశోక్ బాబు కు వచ్చిన నిధులుపైన కూడా విచారణ జరపాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. -
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ఎన్నికల అధికారులు చేపట్టారు. గడువు ముగిసిన తర్వాత ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాస రావు, సహాధ్యక్షుడిగా పురుషోత్తం నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఏపీ ఎన్జీవో ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాపై ఇప్పుడు మీరు మరిన్ని బాధ్యతలు పెట్టారు. ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తూ.. ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాము. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. పాలనా రాజధానిని విశాఖగా ప్రకటించిన సందర్భంగా ఉద్యోగులు వైజాగ్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను అన్ని విధాలుగా మోసం చేసింది' అని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు అన్నారు. చంద్రశేఖర్రెడ్డి 1985 నుంచి ఏపీ ఎన్జీవో సంఘంలో వివిధ పదవులు నిర్వహించారు. ఐదున్నరేళ్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బండి శ్రీనివాస్ ప్రకాశం జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షునిగా, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. -
జన సైనికులూ...పవన్ నైజాన్ని గుర్తించండి
కాకినాడ: రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలపై ప్రజల మనోభావాలనే శనివారం నాటి మూడు రాజధానుల సంఘీభావ ర్యాలీలో తాను తెలిపానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్న టీడీపీ తీరును ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి జగన్ను నానా దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే స్వయంగా చంద్రబాబు, ఆయన భజనపరులు అసభ్యకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. తన నివాసంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల కోసం మూడు రాజధానుల ప్రతిపాదన ఆసరాగా ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఎలా సమర్థించారో ప్రజలకు తెలియంది కాదన్నారు. కులం రంగు పులమొద్దు పవన్పై తాను రాజకీయ విమర్శలు చేస్తే కాపు కులస్తులపై చేశానంటూ ఆ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. జనసేన నాయకుడు పంతం నానాజీ కాకినాడ సిటీ, రూరల్లో పోటీ చేసి ఏ స్థాయిలో ఓట్లు తెచ్చుకున్నారో? ఆ సామాజిక వర్గంలో అతని బలమేమిటో అందరికీ తెలుసన్నారు. బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన్రంగా జిల్లాలో తొలిసారి అడుగు పెట్టిన దగ్గర నుంచి విద్యార్థి నాయకుడిగా తాను కాపు సామాజికవర్గంతో సాన్నిహిత్యంగా, జక్కంపూడి శిష్యునిగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. తనను సవాల్ చేసే స్థాయి నానాజీకి లేదన్నారు. తనకు ఉన్న స్నేహితులు, పార్టీ కేడర్లో అత్యధికులు కాపుకులస్తులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కులం పేరుతో ఇంతగా రాజకీయాలు చేస్తున్న జనసేన.. కాపు ఉద్యమం సమయంలో ముద్రగడ, ఆయన భార్య, కోడలు, కుమారులను చంద్రబాబు సర్కార్ అవమానకరంగా వేధింపులకు గురిచేసినప్పుడు ఎందుకు పత్తాలేకుండా పోయిందన్నారు. తమ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, జక్కంపూడి విజయలక్ష్మి వంటి వారంతా ముద్రగడను పరామర్శిస్తే టీడీపీ, జనసేన నాయకులు ఏమయ్యారన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తుని సంఘటనలో ఉన్న కేసులన్నింటినీ సీఎం జగన్ ఎత్తివేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబును వదిలి తనకుతానుగా రాజకీయాలు చేసి జగన్లా ప్రజల్లో తిరిగితే భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. వైఎస్సార్ సీపీ సిటీ అధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ ప్రశాంత కాకినాడ నగరంలోఅలజడులు సృష్టించేందుకు పంతం నానాజీప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా నైతిక విలువలు లేని, కాపుల్లో పట్టులేని నానాజీకి చంద్రశేఖరరెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. వైఎస్సార్ సీపీ నగర మహిళాధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన సైనికులూ...పవన్ నైజాన్ని గుర్తించండి జనసేన అధినేత పవన్కల్యాణ్ నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ఆ పార్టీ కేడర్ గుర్తించాలని చంద్రశేఖరరెడ్డి హితవు పలికారు. పవన్కల్యాణ్ చంద్రబాబు చెప్పినట్టే ఆడుతున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబుతో కలిసి పోటీ చేసి ఆ తరువాత మూడున్నరేళ్లు పత్తాలేకుండా పోయినమాట వాస్తవం కాదా? అని నిలదీశారు. గత ఎన్నికల ప్రచార సభల్లో సైతం అప్పటి అధికార టీడీపీ ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించకుండా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే లక్ష్యంగా పవన్ ఆరోపణలు చేయడానికి చంద్రబాబుతో కుమ్మక్కవ్వడం కాదా అని నిలదీశారు. రాజధాని వివాదంలోను, ఉద్దానం సమస్యపై అప్పటి ప్రతిపక్షనేత జగన్ పర్యటన తెలుసుకుని చంద్రబాబు డైరెక్షన్లో రెండు రోజుల ముందుగానే ఆ ప్రాంతాలను పవన్ సందర్శించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. -
‘దేవినేని ఉమా తన మాటలను వెనక్కి తీసుకోవాలి’
సాక్షి, విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. రాష్ట్రంలో ఘోరంగా ఓటమి చెందినా చంద్రబాబుకు ఇంకా సిగ్గురాలేదని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అయిదు మంచి కన్సలెన్సీలో బోస్టన్ కన్సల్టెన్సీ ఒకటి అని పేర్కొన్నారు. ఇదే బోస్టన్ కన్సల్టెన్సీతో చంద్రబాబు అయిదేళ్లు ముందు కలిసి పని చేయించారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో ఇన్స్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడింది వాస్తవం కాదా? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు 29 గ్రామాలు ప్రజలు భాధలకి కారణం చంద్రబాబేనని, శవ రాజకీయం చేయడం చంద్రబాబు అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు.(‘చంద్రబాబు, పవన్కు వారి త్యాగాలు తెలియవా’) రాజకీయాల్లోకి లాగొద్దు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరగాల్సిందేనని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. బీసీజీ నివేదికను తాము స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా తాము అండగా ఉంటామని తెలిపారు. దేవినేని ఉమా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని, ఉద్యోగ సంఘాల నేతలను ఏసీబీ ద్వారా ముఖ్యమంత్రి బెదిరిస్తున్నాడనడంలో వాస్తవం లేదన్నారు. దేవినేని ఉమా వ్యాఖ్యలను తీవ్రంగా కండిస్తున్నామని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులుగా మూడు రాజధానులపై మా అభిప్రాయం మేము చెపుతున్నాము. దేవినేని ఉమా రాజకీయ లబ్ది కోసం సీఎంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలను రాజకీయాల్లోకి లాగొద్దని దేవినేని ఉమాకు సూచించారు. -
బస్సులో రచ్చ, టీడీపీ నేతబంధువు వీరంగం
సాక్షి, ముద్దనూరు: టీడీపీ ప్రజాప్రతినిధి బంధువు ఒకరు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రచ్చ రచ్చ చేసిన వైనమిది. బస్సెక్కి మెట్లపై నిలబడిన తనను లోపలికి రమ్మని పిలిచినందుకు ఆగ్రహించి.. సిబ్బందితో వాగ్వాదానికి దిగడమేగాక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక తన బంధువులను రప్పించి బస్సు డ్రైవర్ను తమ వాహనంలో బలవంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. తప్పించుకున్న డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది. ఎమ్మెల్సీ బీటెక్ రవికి చెందిన సమీప బంధువు చంద్రశేఖరరెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి పులివెందులకొస్తున్న ఓవీఆర్ ట్రావెల్స్ బస్సు ఎక్కి మెట్లపై నిలబడ్డాడు. సడన్ బ్రేక్ వేసినప్పుడు ప్రమాదం జరిగే వీలుందంటూ క్లీనర్ ఆయన్ను లోపలికి రమ్మని పిలిచాడు. దీంతో ఆగ్రహించిన సదరు ఎమ్మెల్సీ బంధువు క్లీనర్పై పరుషపదజాలంతో వాగ్వాదానికి దిగడమేగాక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో తీవ్రంగా భయపడిన క్లీనర్ బస్సు కర్నూలుకు రాగానే దిగి వెళ్లిపోయాడు. ఈలోగా చంద్రశేఖరరెడ్డి సమాచారమివ్వడంతో అతని బంధువులు స్కార్పియో వాహనంలో వచ్చి.. బస్సు ముద్దనూరు సమీపంలోకి రాగానే అడ్డుకున్నారు. స్కార్పియోలో ఉన్న సునీల్రెడ్డి, వంశీధర్రెడ్డి, రఫీలతోపాటు చంద్రశేఖరరెడ్డిలు బస్ డ్రైవర్ శ్రీనివాసులును బలవంతంగా దించేసి.. వాహనంలో తమ వెంట తీసుకుపోయారు. వాహనం సింహాద్రిపురం సమీపంలోకి రాగానే శ్రీనివాసులు కేకలేయడంతో అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే డ్రైవర్ ముద్దనూరు పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు చంద్రశేఖరరెడ్డితోపాటు సునీల్రెడ్డి, వంశీధర్రెడ్డి, రఫీలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
‘సీఎం జగన్ నిర్ణయం హర్షనీయం’
సాక్షి, విజయవాడ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషమని, ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఆంధ్రబ్యాంక్ పేరును యధావిధిగా ఉంచాలని చేసిన కేబినెట్ తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తునట్లు ప్రకటించారు. ఆశా కార్యకర్తల జీతాలు మూడు వేల నుంచి పది వేలకు పెంచడం అభినందనీయమన్నారు. -
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘానికి కొత్త నాయకత్వం వచ్చింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్.చంద్రశేఖర్రెడ్డి, బండి శ్రీనివాస్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా కొనసాగిన అశోక్బాబు స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు ఆదివారం ఉదయం విజయవాడలోని ఎన్జీవో హోమ్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, మహిళా విభాగం అధ్యక్షురాలు, కన్వీనర్లు హాజరయ్యారు. రాష్ట్ర సంఘానికి ఇన్చార్జి అధ్యక్షునిగా ఉన్న సీహెచ్ పురుషోత్తంనాయుడు అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. చంద్రశేఖర్రెడ్డి, బండి శ్రీనివాస్లను అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రశేఖర్రెడ్డి 1985 నుంచి ఏపీ ఎన్జీవో సంఘంలో వివిధ పదవులు నిర్వహించారు. ఐదున్నరేళ్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బండి శ్రీనివాస్ ప్రకాశం జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షునిగా, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం.. ఈ సందర్భంగా విలేకరులతో నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఐదు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు లక్షలమంది పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా వారి న్యాయమైన కోర్కెల సాధనకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం నుంచి 35 శాతం మధ్యంతర భృతి మంజూరుకు ప్రయత్నిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణాలకు స్థలాలిప్పించే విషయంలో ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం అశోక్బాబు మాట్లాడుతూ పదేళ్లపాటు ఎన్జీవో సంఘ నాయకునిగా క్రియాశీల పాత్ర పోషించానని, తనకు సహకరించిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పెద్దలకు భంగపాటు ఇదిలా ఉండగా, రాష్ట్ర ఎన్జీవో సంఘ ఎన్నికల్లో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని భంగపాటుకు గురయ్యారు. పశ్చిమ కృష్ణా ఎన్జీవో సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.విద్యాసాగర్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు అన్నివిధాలా ప్రయత్నించారు. చివరకు పోలీసు శాఖ ద్వారా కొన్ని జిల్లాల సంఘ నాయకులను బెదిరించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. అశోక్బాబు ఆధ్యర్వంలో ఎన్జీవో సంఘం ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించిందని, రానున్న ఎన్నికల నేపథ్యంలో అటువంటి కార్యవర్గమే ఉంటే అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు మంచిదనే అభిప్రాయాన్ని ఉద్యోగ సంఘ నాయకులకు వివరించినట్టు తెలుస్తోంది. విద్యాసాగర్ను ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు సహకరించాలని అశోక్బాబు కూడా పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే 11 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో సీఎం చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆదివారం ఉదయం 9 గంటల్లోపు సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని, ఆయనతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని కొందరు ముఖ్య నాయకుల్ని అధికారులు కోరారు. అయితే వారంతా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించి ఎన్నికను నిర్వహించారు. -
ఏపీ ఎన్జీవో హోమ్లో ఘర్షణ
-
ఏపీ ఎన్జీవో హోమ్లో ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో హోమ్లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏపీ ఎన్జీవో హౌసింగ్ బోర్డు ఆదివారం సమావేశమైంది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై చర్చ జరిగింది. తెలంగాణ ఎన్జీవోలు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని, సమావేశాన్ని అడ్డుకున్నారు. అంతలోనే ఏమైందో సమావేశంలో ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డిపై కొంతమంది దాడికి దిగారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేశారు. అంతేకాక పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. -
మూడు విడతల్లో రూ.60కోట్లు పంచారు
-
టీడీపీ శ్రేణులకు నిరంతర శిక్షణ: పెద్దిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్టీ మహానాడు ముగిశాక, టీడీపీ శ్రేణులకు నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి చెప్పారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందన్నారు. మార్చి ఒకటి నుంచి 10 వరకు మండల, డివిజన్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మే 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు ఉంటుందన్నారు. నెరవేరని .. తెలంగాణ ఆశయం: రావుల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సాధించుకుని 31నెలలు పూర్త వుతున్నా, తెలంగాణ ఆశయం మాత్రం ఇంకా నెరవేరలే దని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి అన్నారు. అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్షగా మిగిలిపోయా యని, దానికి గృహనిర్మాణ పథకమే ఉదాహరణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి దాకా కట్టిన ఇళ్లు 1,217 మాత్రమే కావడం శోచనీయమన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా, లక్ష్యం చేరుకోవాలంటే ఇంకా 20 ఏళ్లు పడుతుందన్నారు. రైతులను, పేదలను మభ్యపెట్టిన సంవత్సరంగా 2016 మిగిలిపోతుందన్నారు. -
ఆటా ఎన్నికల్లో తన్నులాట
నేపర్విల్లే: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఎన్నికల సందర్భంగా ఇద్దరు నాయకులు బూతులు తిట్టుకుంటూ తన్నుకున్నారు. ఒక వీడియోలో ఉన్నదాని ప్రకారం ఆటా సభ్యులు హరీందర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇంతలో ఆ గదిలోకి వచ్చిన హనుమంతు రెడ్డి అనే వ్యక్తి సభ్యులను బయటకు వెళ్లిపోవాల్సిందిగా బలవంతం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన హరీందర్ దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. గొడవ పెద్దదై ఒకరినొకరు కొట్టుకునేవరకు వెళ్లింది. నామినేషన్ పత్రాల్ని తనిఖీ చేయడానికి వచ్చిన సభ్యులకు వాటిని చూపించకుండానే, హనుమంతు పత్రాలను తనతోపాటు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనపై హనుమంతును వివరణ కోరగా, ఎన్నికల నామినేషన్కు తుదిగడువు పూర్తయ్యాక నామినేషన్ ప్రతాలను సేకరించడానికి ఆటా అధ్యక్షుడు ముగ్గురు ఆధీకృత వ్యక్తులను నియమించారని తెలిపారు. ముగ్గురిలో తానూ ఒకడినన్నారు. నేపర్విల్లే పోస్టాఫీసుకు నామినేషన్ పత్రాలను స్వాధీనం చేసుకోడానికి వెళ్లిన తమపై హరీందర్, చంద్రశేఖర్ దాడి చేశారన్నారు. హరీందర్ 2013లో వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడారు. -
సాక్షి విలేకరిపై దాడికి నిరసనగా వైఎస్సార్సీపీ రాస్తారోకో
అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు సాక్షి విలేకరి చంద్రశేఖర్రెడ్డిపై దాడికి పాల్పడిన రేషన్ డీలర్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం మండల కేంఆదంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోయింది. విలేకరిపై దాడిచేసిన దుండగులపై చర్య తీసుకునేవరకూ ఆందోళన ఆగదని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చింతకొమ్మదిన్నె మండల పరిధిలో వైఎస్సార్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. కడప మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డిని(40) ద్విచక్ర వాహనంపై కడప నుంచి పులివెందుల వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్-ఆటో ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానిక వైఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్స్పాల్ చంద్రశేఖర్ రెడ్డి మరో ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డితో కలిసి బైక్ పై సింహాద్రిపురం నుంచి పులివెందుల వెళ్తుండగా.. సబ్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, ఇది గుర్తించిన స్థానికులు వారిని వెంట నే 108 సాయంతో ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
సంపులో జారిపడి రైతు మృతి
లింగాల మండలకేంద్రం శివారులో ఉన్న పొలానికి వెళ్లి చంద్రశేఖర్ రెడ్డి(39) అనే రైతు మృత్యువాత పడ్డాడు. పొలం వద్ద నీరు తోడుతుండగా ప్రమాదవశాత్తూ సంపులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఎట్టకేలకు డీఆర్వో పోస్టు భర్తీ
చంద్రశేఖరరెడ్డికి లైన్ క్లియర్ రేపు బాధ్యతల స్వీకరణ విశాఖపట్నం : ఆదినుంచి వివాదాస్పదమైన జిల్లా రెవెన్యూ అధికారి నియామకం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. గతంలో ప్రభుత్వం నియమించిన చంద్రశేఖర్రెడ్డికి లైన్క్లియర్ అయింది. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్కు సమాచారం అందింది. డీఆర్వోగా పనిచేస్తున్న కె.నాగేశ్వరరావును అన్నవరం దేవస్థానం ఈవోగా ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేసేందుకు సర్కారు చేసిన ప్రయత్నాలు మంత్రుల మధ్య బేధాభిప్రాయాలతో బెడిసికొట్టాయి. గతంలో డీఆర్వోగా పనిచేసిన నరిసింహారావు మళ్లీ ఇదే పోస్టుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేయగా జిల్లా ఉన్నతాధికారి విముఖత వ్యక్తంచేయడం, మంత్రులు ఆసక్తి చూపకపోవడంతో చివరకు ఆయన ఎస్ఈజెడ్ ఆర్అండ్ ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా విధుల్లో చేరారు. ఆగస్టులో చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా కడప జేసీ -2గా పనిచేస్తున్న చంద్రశేఖర్రెడ్డిని విశాఖ డీఆర్వోగా ప్రభుత్వం నియమించింది. కానీ మంత్రుల మధ్య ఏర్పడిన బేధాభిప్రాయాల కారణంగా ఆయన విధుల్లో చేరలేకపోయారు. తరువాత తెలంగాణ నుంచి రాష్ట్రానికి కేటాయించగా విశాఖ ఆర్డీవోగా తొలి పోస్టింగ్ పొందిన వెంకటేశ్వర్లను డీఆర్వోగా నియమిస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 19న ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ జీవో వచ్చిన 24 గంటలు తిరగకుండానే జీవోను పెండింగ్లో పెడుతున్నట్లు మరో జీవో ఇచ్చి వెంకటేశ్వర్ల నియామకానికి బ్రేక్లు వేశారు. వెంకటేశ్వర్ల నియామకం విషయంలో కూడా జిల్లాకు చెందిన ఓ మంత్రి అభ్యంతరం వ్యక్తంచేయడంతో డీఆర్వో పోస్టు భర్తీ కాకుండా ఆగిపోయింది. కడప జేసీ -2గా పనిచేస్తూ అక్టోబర్లో రిలీవైన చంద్రశేఖర్రెడ్డి పరిపాలనా కమిషనర్కు రిపోర్టు చేసినప్పటికీ విశాఖ డీఆర్వోగా మాత్రం పోస్టింగ్ పొందలేకపోయారు. అప్పటి నుంచి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆయన విషయంలో మంత్రులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చివరుకు సీఎం పేషీ జోక్యం చేసుకోవడంతో పాటు రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం మంత్రులతో మాట్లాడంతో చంద్రశేఖర్రెడ్డి నియామకానికి లైన్ క్లియర్ ఇచ్చినట్లు సమాచారం. -
వనరుల సద్వినియోగానికి అత్యాధునిక టెక్నాలజీ
ఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖర రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇంధన వనరుల సద్వినియోగానికి ప్రపంచ దేశాల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖకు చెందిన స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఎస్ఈసీఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.చంద్రశేఖర రెడ్డి గురువారం తెలిపారు. సీఐఐ నిర్వహిస్తున్న పవర్ ప్లాంట్ సమ్మిట్-2015లో ఆయన మాట్లాడారు. డొమెస్టిక్ ఎఫీషియెంట్ లైటింగ్ ప్రోగ్రాం కింద ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్తో (ఈఈఎస్ఎల్) కలిసి ఎస్ఈసీఎం ఇప్పటికే 55 లక్షల ఎల్ఈడీ బల్పులను పంపిణీ చేసిందని చెప్పారు. ‘విశాఖతోసహా ఇతర మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశాం. తద్వారా సంప్రదాయ విధానంతో పోలిస్తే 23 శాతం విద్యుత్ ఆదా అయింది. ఇంధన వనరుల సద్వినియోగాన్ని మరింత మెరుగుపరిచేందుకై ఈఈఎస్ఎల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాయి’ అని వెల్లడించారు. పర్యావరణ స్థిరత్వం ద్వారానే పోటీలో నిలదొక్కుకోవడమేగాక ప్రపంచ స్థాయికి వెళ్లొచ్చన్న విషయాన్ని భారతీయ పరిశ్రమ గుర్తించిందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తన లేఖలో పేర్కొన్నారు. -
వాలీబాల్ చాంపియన్ నిజామాబాద్
నిజామాబాద్స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి అండర్-19 వాలీబాల్ పోటీల్లో నిజామాబాద్ బాలబాలికలు సత్తా చాటారు. సొంతగడ్డపై జరిగిన టోర్నమెంట్లో చాంపియన్గా నిలిచారు. అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థులను మట్టికరిపించి జయకేతనం ఎగురవేశారు. జిల్లాకేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీ శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలంటే ప్రతిఒక్కరికీ ఇష్టమేనన్నారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పాడుతాయన్నారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ బాలబాలికల జట్లు ప్రథమ స్థానంలో నిలువడం జిల్లా గర్వకారణమన్నారు. ఆటల్లో గెలుపు, ఓటములు సహజంగా ఉంటాయని, ఓడినవారు విజయం కోసం మరింత కృషిచేయాలని సూఇంచారు. తాను చిన్నప్పుడు ఆటలకు దూరమయ్యానని చదువుతోనే బాల్యం గడిచిపోయిందన్నారు. ఇప్పుడు మాత్రం ప్రతీరోజు టెన్నిస్ ఆడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానన్నారు. పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు జాతీయస్థాయి టోర్నమెంట్లో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలుపాలన్నారు. అనంతరం క్రీడల నిర్వహణ కార్యదర్శి సాయిలు, డీవీఈవో ఒడ్డెన్న, ఆర్ఐవో విజయ్కుమార్లు మాట్లాడుతూ అండర్-19 రాష్ట్రస్థాయి టోర్నమెంట్ను విజయవంతం చేసినందుకు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. జాతీయస్థాయి టోర్నమెంట్ మహారాష్ట్రలోని కోలాపూర్లో త్వరలో జరుగుతుందని, అక్కడ మన రాష్ట్ర జట్టును ప్రథమ స్థానంలో నిలుపాలన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన జయ హాస్పిటల్ డాక్టర్ ప్రేమానందం, ఎంఎస్ఆర్ స్కూల్ డెరైక్టర్ విక్రమ్రెడ్డి, ఎన్వైకే కో-ఆర్డినేటర్ రాంచందర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి, డీఎస్డీవో శర్మ, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్, పీడీలు మన్నన్, మల్లేశ్గౌడ్, శ్రీధర్, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
అవిశ్వాసం.. అయోమయం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్పై అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో గురువారం నిర్వహించాలని తలపెట్టిన ప్రత్యేక సమావేశం విషయంలో గందరగోళం నెలకొంది. చైర్మన్ దామోదర్రెడ్డిపై వైస్చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి వర్గీయులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని భావించారు. ఈ సమావేశానికి చైర్మన్ మద్దతు డెరైక్టర్లు గైర్హాజరు కాగా, వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి మద్దతు డెరైక్టర్లు హాజరయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు చేరుకున్న చంద్రశేఖర్రెడ్డి తన మద్దతు డెరైక్టర్లతో కలిసి డీసీసీబీ సమావేశం హాలులోకి వెళ్లారు. జిల్లా సహకార అధికారి సూర్యచంద్రరావుతో అరగంట పాటు చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రశేఖర్రెడ్డి డీసీవోపై తీవ్ర ఆరోపణలు చేశారు. పక్షపాత ధోరణితో సహకార చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డీసీవోను సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేశారు. ఈ విషయంలో తాము కోర్టును ఆశ్రయించనున్నట్లు చంద్రశేఖర్రెడ్డి ప్రకటించారు. సమావేశానికి 11 మంది డెరైక్టర్లు హాజరైనప్పటికీ, కేవలం తొమ్మిది మంది మాత్రమే సంతకాలు చేసినట్లు డీసీవో పేర్కొన్నారు. నేటికి వాయిదా : డీసీవో అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేస్తున్నాముని డీసీవో ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక రోజు వాయిదా వేసేందుకు తమకు అధికారం ఉందని పేర్కొన్నారు. ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కో-ఆప్షన్ డెరైక్టర్లకు ఓటు హక్కు అంశంపై న్యాయ సలహా కోసం ఉన్నతాధికారులను సంప్రదించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై రాత్రి ఏడు గంటలకు మరో ప్రకటన విడుదల చేశారు. ‘గురువారం 11 గంటలకు డీసీసీబీ పాలకవర్గ ప్రత్యేక సమావేశం డీసీవో అధ్యక్షతన జరుపబడినది. ఈ సమావేశానికి తొమ్మిది మంది పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. చట్ట ప్రకారం 11 మంది సభ్యులు ఉంటేనే కోరం ఉన్నట్లు.. కానీ కోరం లేనందున సహకార చట్టం సెక్షన్ 34-ఎ (12) ప్రకారం ఈ సమావేశం జరుపబడలేదు’ అని ప్రకటనలో డీసీవో పేర్కొన్నారు. సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేశామని మీడియాతో ప్రకటించిన డీసీవో.. సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో గందరగోళం నెలకొంది. అవిశ్వాసం వీగిపోయినట్లే.. : చైర్మన్ దామోదర్రెడ్డి తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లేనని చైర్మన్ దామోదర్రెడ్డి పేర్కొన్నారు. అవిశ్వాస నోటీసు ఇచ్చిన డెరైక్టర్లు ఆ మేరకు బలం నిరూపిం చుకోవాల్సి ఉంటుందని, లేనిపక్షంలో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లేనని స్పష్టం చేస్తున్నారు. కారణం లేకుండా సమావేశాన్ని ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఒకవేళ రేపటికి వాయిదా వేసిన పక్షం లో ఈ మేరకు అధికారికంగా నోటీసులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. డీసీవోపై రాజకీయ ఒత్తిళ్లు? డీసీసీబీ చైర్మన్ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జిల్లా సహకార అధికారిపై తీవ్ర స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఒక వర్గం చైర్మన్ దామోదర్రెడ్డికి, మరోవర్గం ముఖ్య నాయకులు చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా ఒత్తిళ్లకు గురి చేసినట్లు సమాచారం. దీంతో సహకార అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రోడ్ల నిర్మాణానికి కొత్త టెక్నాలజీ
కిలోమీటరుకు రూ.10 లక్షల ఖర్చు ఆదా ఏడాది పనులు ఆరు నెలలకే పూర్తి పెలైట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లా దీనిపై ఆగస్టు 7న విజయవాడలో ఇంజనీర్ల రాష్ట్ర స్థాయి సదస్సు చిత్తూరు(టౌన్): రాష్ట్రంలో తారు రోడ్ల నిర్మాణానికి ఇకపై కొత్త టెక్నాల జీని అవలంబించనున్నారు. తద్వారా ఖర్చుతోపాటు సమయమూ ఆదా కానుంది. ప్రస్తుత టెక్నాలజీతో చేపట్టే పనులకు ఏడాది సమయం పడితే కొత్త టెక్నాలజీ ద్వారా ఆరు నెలలకే పూర్తిచేసే అవకాశముంది. పైగా కిలోమీటరు దూరానికి దాదాపు రూ.10 లక్షల వరకు ఆదా అవుతుందని పంచాయతీరాజ్ ఇంజనీర్లు గుర్తించారు. ఈ పద్ధతి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే అమలులో ఉంది. పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ విభాగానికి చెందిన చిత్తూరు ఈఈ అమరనాథరెడ్డి, చౌడేపల్లి, తంబళ్లపల్లె డీఈఈలు చంద్రశేఖర్రెడ్డి, జ్యోతిరాములు నాలుగు రోజుల క్రితం తమ సిబ్బందితో కలసి వెళ్లి కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్లో కొత్త టెక్నాలజీతో నిర్మించిన తారురోడ్డును పరిశీలించారు. సంబంధిత ఇంజనీర్లతో క్షుణ్ణంగా చర్చించి వచ్చారు. కొత్త టెక్నాలజీనే ఇకపై రాష్ట్రంలో అంచెలంచెలుగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఆగస్టు 7న విజయవాడలో రాష్ట్రస్థాయి ఇంజనీర్లు (ఈఎన్సీ స్థాయి అధికారులు) సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొననున్నారు. ప్రస్తుత టెక్నాలజీ ఇదీ.. తారురోడ్ల నిర్మాణానికి ప్రస్తుతం అవలంబిస్తున్న టెక్నాలజీ వల్ల కిలోమీటరు దూరానికి రూ.50 లక్షలు ఖర్చవుతోంది. ముందుగా ఎర్త్వర్క్ చేసుకున్న తర్వాత గ్రావెల్ తోలడం, ఆ తర్వాత 150 ఎంఎంతో రెండు లేయర్లుగా మెటల్ వేసి రోలింగ్ చేసిన తర్వాత 25 ఎంఎంతో తారురోడ్డు నిర్మిస్తున్నారు. దీనికి కిలోమీటరు దూరానికి రూ.50 లక్షల ఖర్చుతో నెల రోజుల సమయం పడుతోంది. కొత్త టెక్నాలజీ ఎలాగంటే.. కొత్త టెక్నాలజీతో తారు రోడ్డు నిర్మించేందుకు కిలోమీటరుకు రూ.40 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రస్తుత టెక్నాలజీతో పోల్చితే కిలోమీటరుకు రూ.10 లక్షలు తగ్గుతుంది. కొత్త టెక్నాలజీలో ఎర్త్వర్కు, గ్రావెల్ వర్కు పాతదే అయినా రెండు లేయర్లుగా వేయాల్సిన మెటల్కు బదులు 12 ఎంఎం, 15 ఎంఎం, 40 ఎంఎం, 45 ఎంఎం మెటల్ను ఒకటిగా కలిపి వంద మిల్లీమీటర్ల ఎత్తు వచ్చే విధంగా నిర్మిస్తారు. దానిపై యథాతథంగా 25 ఎంఎం పరిమాణంతో తారు రోడ్డును నిర్మిస్తారు. రెండు లేయర్లు ఒకటిగానే కలిపి వేయడంతో ఖర్చుతోపాటు సమ యం కలిసొస్తుంది. నెల రోజులు సమయం పట్టే ఓ రోడ్డు నిర్మాణం 15 రోజుల్లోనే పూర్తవుతుంది. పెలైట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లా కొత్త టెక్నాలజీకి కేంద్రం నుంచి రూ.50 కోట్ల పనులకు అంగీకారం లభించినట్టు పంచాయతీరాజ్ ఇంజనీర్ ఒకరు చెప్పారు. ముందుగా చిత్తూరు జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. కేంద్రం మంజూరు చేసే రూ. 50 కోట్లను జిల్లాలో నూతనంగా నిర్మించే తారు రోడ్లకు కేటాయించనున్నారు. దీనికోసం పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ విభాగం ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా రోడ్లకు మహర్దశ నిధుల లేమి కారణంగా ఇప్పటికే జిల్లాలో చేపట్టిన సుమారు రూ.300 కోట్ల పనులను ప్రభుత్వం నిలిపేసింది. రూ.500 కోట్ల పనులను పరోక్షంగా అడ్డుకుంటోంది. ఈ పరిస్థితిలో రూ.50 కోట్లతో కొత్తగా తారు రోడ్ల నిర్మాణాలకు గాను చిత్తూరు జిల్లాను కేంద్రం పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో ఆనందం వ్యక్తమవుతోంది. -
కదంతొక్కిన ‘పామాయిల్’ కార్మికులు
అశ్వారావుపేట, న్యూస్లైన్: ఆయిల్ఫెడ్ ప్రభుత్వరంగ సంస్థకు చెందిన అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమలో జరిగిన అవకతవకలపై కార్మికులు కదంతొక్కారు. ఫ్యాక్టరీ ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. వారికి వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్షనేత తాటి వెంకటేశ్వర్లు అండగా నిలిచారు. కాంట్రాక్టు కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకున్న వారి నుంచి తిన్నదంతా క క్కిస్తానని కార్మికులకు మద్దతుగా ఫ్యాక్టరీ ఎదుట బైఠాయించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. అశ్వారావుపేటలో సమస్య పరిష్కారం కాకపోతే హైదరాబాదులోని ఆయిల్ఫెడ్ ప్రధాన కార్యాలయానికి కార్మికులకు తన సొంత ఖర్చులతో తీసుకెళ్లి ఆయిల్ఫెడ్ ఎండీతో మాట్లాడిస్తానన్నారు. కార్మికుల కష్టార్జితం నుంచి మినహాయించుకున్న ప్రావిడెంట్ఫండ్(పీఎఫ్) సొమ్మును అణా పైసతో సహా తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తమ పీఎఫ్ సొమ్మును కాంట్రాక్టర్లు దోచుకున్నారని ఫ్యాక్టరీ మేనేజర్ చంద్రశేఖరరెడ్డికి కార్మికులు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. తమకు ఫీఎఫ్ డబ్బు ఒక్కపైస కూడా అందలేని ఆరోపించారు. ఇదే విషయాన్ని కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పీఎఫ్ కార్యాలయం నుంచి కార్మికులు సాధించిన కొన్ని కీలకపత్రాలను మేనేజర్ చంద్రశేఖరరెడ్డికి తాటి అందజేశారు. పీఎఫ్ సొమ్ము ఇప్పించాలని కోరారు. ఫోర్మన్ విల్సన్రాజుపై దాడి చేసిన పాతకాంట్రాక్టర్ కుమారుడు మధుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏడేళ్ల పీఎఫ్ చెల్లించాలి.. 2007లో అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించినప్పటి నుంచి పనిచేసిన కార్మికులకు పీఎఫ్ సొమ్ము చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఫోర్మన్ దాడిచేసిన దుండగులను అరెస్ట్ చేయాలని, విల్సన్రాజుపై బనాయించిన కేసును ఎత్తివేయాలని ని నాదాలు చేశారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టర్లు ఇచ్చినంత తీసుకుంటే ఉంచుతున్నారని, హక్కులపై ప్రశ్నిస్తే పనిలోనుంచి తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్ కుమారుడు మధుకు అనుకూలంగా ఉన్నవారే ఫ్యాక్టరీలో ఉద్యోగం చే యాలని, అతని మాట వినకున్నా, చెప్పిన ట్టు చేయకపోయినా, అధికారులను బదిలీ చేయిస్తాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే విల్సన్ రాజును రౌడీలతో కొట్టించాడని అన్నారు. కార్మికుల ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పాలో తెలియక మేనేజర్ చంద్రశేఖర్రెడ్డి మౌనంగా ఉండిపోయారు. తిన్నదంతా కక్కిస్తా: ఎమ్మెల్యే తాటి కార్మికులు, విల్సన్రాజు సమస్యలను విన్న ఎమ్మెల్యే ఫ్యాక్టరీ మేనేజర్ చంద్రశేఖర్రెడ్డి, డివిజనల్ అధికారి రమేష్కుమార్రెడ్డిలపై ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోజుకూలీ చేసుకునే వారిని మీ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటూ పోతే ఊరుకునేదిలేదు. ఇంతకుముందు ఇక్కడ ఎవరున్నారో నాకు అనవసరం. ఈ ప్రజలు నన్ను నమ్మారు. నా ప్రజలను ఎవరు అన్యాయం చేసినా ఊరుకోను. కార్మికుల సొమ్ములు ఎవరెంత తిన్నారో అణాపైసాలతో సహా కక్కిస్తా.. కాంట్రాక్టర్లకు సహకరించిన అధికారులను వదిలిపెట్టేది లేదు. మీరు (మేనేజర్ను ఉద్దేశించి) ఎన్నిసార్లు సస్పెండ్ అయినా మళ్లీ అశ్వారావుపేటకే ఎందుకు వస్తున్నారు..? ఆయిల్ఫెడ్లో మీకు ఎక్కడా ఉద్యోగం లేదా..? దేశంలో ఎన్నో ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఉండగా.. ఎప్పుడూ అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీనే ఎందుకు వార్తల్లోకెక్కుతుంది..? మీరు ఇక్కడ ఎందుకోసం ఉంటున్నారో నాకు తెలుసు.. అంతా కక్కిస్తా.. మీ వైఖరి మార్చుకోకుంటే చాలా ఇబ్బంది పడతారు. ప్రతి నెల కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించేటపుడు పీఎఫ్ చెల్లింపును ఎందుకు పరిశీలిచడంలేదు. కార్మికులకు పీఎఫ్ సొమ్ము తిరిగి ఇప్పించేంత వరకు ఇక్కడే కూ ర్చుంటాను’ అంటూ తాటి ఫ్యాక్టరీ గేటు ఎదుట బైఠాయించారు. ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీని త క్కువగా చూపుతూ ప్రైవేటు కంపెనీలతో కు మ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి బాధ్యులపై చర్యలకు ప్రభుత్వాన్ని కోరతానన్నారు. రైతులు పండించే పామాయిల్ కు పూర్తి మద్దతు ధర సాధించడం తన లక్ష్యమన్నారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం నుంచి ఏ కార్మికునికి ఎంత పీఎఫ్ సొమ్ము అం దాలో లెక్కలతో సహా నెల రోజులలోపు వివరం గా తెలియజేస్తామని మేనేజర్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా అక్కడి వచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నారాయణ వెంట ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సింగు నర్సింహరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఉన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో జెడ్పీటీసీ అంకత మల్లికార్జునరావు, ఆయిల్ఫాం రైతు సంఘం రాష్ట్ర నాయకులు మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు జూపల్లి రమేష్బాబు, జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్బాబు, టీడీపీ నాయకులు ఆలపాటి రామ్మోహనరావు, బండి పుల్లారావు, సీపీఎం నాయకులు బుడితి చిరంజీవి నాయుడు, టీఆర్ఎస్ నాయకులు కోటగిరి సీతారామస్వామి, జూపల్లి కోదండ వెంకటరమణారావు, చంటిబాబు ఉన్నారు. -
పర్సాయపల్లి స్టేజీ వద్ద చైన్ స్నాచింగ్
అర్వపల్లి, న్యూస్లైన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్పై వచ్చిన ఓ వ్యక్తి అపహరించుకెళ్లాడు. సూర్యాపేట - జనగాం ప్రధాన రహదారిపై పర్సాయపల్లి స్టేజీ సమీపంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని పర్సాయపల్లికి చెందిన బైరబోయిన సైదులు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ శివారులోని బస్ స్టేజీ వద్ద నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండగకు ఇల్లు అలుక్కోవడానికి ఎర్రమట్టి కోసమని సైదులు భార్య సంధ్య కొత్తపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్తోంది. మార్గమధ్యంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తలతాడును కత్తిరించుకొని పరారయ్యా డు. వెంటనే ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకొచ్చి దొంగను తిరుమలగిరి వరకు వెంబడించినా ఫలితం లేకపోయింది. గొలుసును కత్తిరించే సమయంలో వారి మధ్య పెనుగులాట జరగడంతో సంధ్యకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి, ఏఎస్ఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి సంఘట న స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
ఈ ఏడాది పోలీస్ శాఖ కొన్ని మరకలను మూటగట్టుకొంది
కర్నూలు, న్యూస్లైన్: శాంతిభద్రతల పరిరక్షణలో ఈ ఏడాది పోలీస్ శాఖ కొన్ని మరకలను మూటగట్టుకొంది. ప్రధానంగా దోపిడీలు, చైన్స్నాచింగ్ వంటి నేరాలను అదుపు చేయలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. అయితే చోరీ సొమ్ము రికవరీలో మాత్రం రెండేళ్ల కంటే కాస్త ఊరట కల్పించారు. దొంగల పాలైన సొత్తు రూ.6.50 కోట్లు కాగా, రూ.4.50 కోట్లు రికవరీ చేశారు. రోడ్డు ప్రమాదాలు గతంలో మాదిరే ఈ ఏడాదీ పునరావృతమయ్యాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే వాటి సంఖ్య ఈ ఏడాది కాస్తతగ్గింది. రాజకీయ నాయకులతో కొంతమంది పోలీస్ అధికారులు సన్నిహిత సంబంధాలు పెంచుకున్నట్లు ఆరోపణలు వచ్చా యి. ముఖ్యంగా ఫ్యాక్షనిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన నిఘా విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న విమర్శలు లేకపోలేదు. సల్కాపురం సమీపంలో కోడుమూరుకు చెందిన ఎరుకలి రామాంజనేయులు, ఆయన కుమారుడు వెంకట్రాముడు, కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన సహకార సంఘం అధ్యక్షుడు ఆలం బాషా దారుణ హత్యలు పోలీసుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేశాయి. క్రిష్ణగిరి సహకార బ్యాంకు సీఈఓ చిన్నసోమన్న అదృశ్యం కేసును ఇప్పటికీ ఛేదించలేకపోయారు. ఈ ఏడాదిలో ఆరునెలలపాటు ఎస్పీగా చంద్రశేఖర్ రెడ్డి పనిచేశారు. ఆయన తరువాత రఘరామిరెడ్డి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎస్పీ రఘురామి రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒక్క పోలింగ్ బూత్లో కూడా రీపోలింగ్ జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాక్షనిస్టులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి సంబంధించిన సెల్ఫోన్లకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బందోబస్తును పర్యవేక్షించారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఉద్యమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెల్లెలు ఆస్తికి రక్షణగా ఉన్నాడన్న కోపంతో డోన్ మం డలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డిని బంధువు లే దారుణంగా హత్య చేశారు. కర్నూలు నుంచి చిన్నమల్కాపురం వెళ్తుండగా ఎర్రగుంట్ల బ్రిడ్జి వద్ద స్కార్పియో వాహనాన్ని అడ్డగించి కత్తులతో నరికి చంపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సల్కాపురం సమీపంలో జంట హత్యలు పోలీసు శాఖను కుదిపేశాయి. ఎరుకలి వెంకట్రాముడు, ఆయన కుమారుడు రామాంజనేయులు గూడూరు నుంచి కర్నూలు కోర్టుకు వెళ్తుండగా ప్రత్యర్థులు వెంబడించి దారుణంగా హత్య చేశారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి లభిస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక డోన్ పట్టణానికి చెందిన కడిమెట్ల కృష్ణ అలియాస్ కిట్టును ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. కిట్టు తండ్రి లక్ష్మన్న సహకార సంఘం ఎన్నికల్లో డోన్ ఒకటవ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి డెరైక్టర్గా పోటీ చేశారు. అధికార పార్టీ నాయకులకు మింగుడుపడక కిరాయి హంతకుల చేత హత్య చేయించారు. అవుకు మండలం గుండ్ల శింగవరం సబ్స్టేషన్ వద్ద తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆలమూరు రాముడు, బనగానపల్లె మద్దిలేటి, ఇమ్రాన్, ఆటోడ్రైవర్ మొదీన్ బాషా మృతిచెందారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ముద్ర ఉన్న నేరస్తులపై ఎస్పీ రఘురాం రెడ్డి కఠినంగా వ్యవహరించారు. పోటీలో ఉన్న అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడ్డారనే కారణంపై కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు, మరికొంతమంది అనుచరులను పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. కర్నూలు కేంద్రంగా పెద్ద ఎత్తున పేకాట జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు బుధవారపేటకు చెంది న మట్కాడాన్ స్థావరంపై దాడి చేశారు. వివిధ జిల్లాలకు చెందిన 58 మందిని అదుపులోకి తీసుకుని రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రఘురాం రెడ్డి జిల్లాలో ‘మీతో మీ ఎస్పీ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు శాంతిభద్రతల పరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చెప్పుకునే అవకాశం కల్పించారు. కొంతమంది సిబ్బంది దీని నీరుగారుస్తున్నారు. అయ్యలూరు గ్రామానికి చెందిన న్యాయవాది సర్వేశ్వరరెడ్డికి, గంగవరం గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డికి మధ్య ఉన్న పొలం తగాదా కారణంగా కోర్టుకు వెళ్లి వస్తున్న సర్వేశ్వరరెడ్డి వాహనాన్ని జీపుతో ఢీకొట్టి వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. నిరుద్యోగ యువత ఫ్యాక్షన్ బారిన పడకుండా ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో ఫ్యాక్షన్ విస్తరించడానికియువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడమేనని గుర్తించారు. కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ ఉద్యోగాల ఎంపికకు చర్యలు తీసుకున్నారు. పోలీసు శాఖపై అధికార పార్టీ పెత్తనంపై కఠినంగా వ్యవహరిం చిన ఎస్పీ రఘురామి రెడ్డిని హైదరాబాదు సౌత్జోన్ డీసీపీగా బదిలీ చేసి శంషాబాద్ డీసీపీగా ఉన్న రమేష్నాయుడును నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిం చారంటూ ఎస్పీ క్యాట్ను ఆశ్రయించి తాత్కాలికంగా నిలుపుదల చేయించుకున్నారు. క్రికెట్ బెట్టింగ్, జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చడానికి చైన్స్నాచింగ్కు పాల్పడి ఇంజనీరింగ్ విద్యార్థులు హకీం సమీర్, జయసూర్య సింహారెడ్డి, శ్రీధర్రెడ్డి తదితరులు కటాకటాలపాలయ్యారు. గుప్త నిధుల వేటలో రంగారెడ్డి జిల్లా పాల్మాకుల గ్రామానికి చెందిన బుర్ర నాగరాజు, రమాదేవి మృత్యు ఒడి చేరారు. డోన్ మండలం వెంకటాపురం బొంతిరాళ్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జీవితంలో ఒకేసారి ధనవంతులమైపోదామన్న దురాశతో తమ జీవితాలనే బలి తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోలీస్ దర్బార్ సొంతశాఖ సిబ్బంది సమస్యలపై ఎస్పీ రఘురామిరెడ్డి దృష్టి సారించారు. జిల్లా కేంద్రంతో పాటు సబ్ డివిజన్ స్థాయిలో పోలీసు దర్బార్ నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించేవారితో పాటు అవినీతికి పాల్పడేవారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సొంత శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి ఖాళీలను బట్టి అడిగిన చోటుకే పోస్టింగ్లు ఇస్తూ పైరవీలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. -
2 నుంచి సమైక్య ఉద్యమం ఉధృతం
మచిలీపట్నం, న్యూస్లైన్ : నూతన సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి చెప్పారు. సంఘ నాయకులతో కలసి ఆదివారం మచిలీపట్నం వచ్చిన ఆయన తూర్పు కృష్ణా ఎన్జీవోల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జనవరి రెండో తేదీ నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని చేయనున్నట్లు ఆయన వివరించారు. జనవరి రెండున విశాఖపట్నంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, మూడున రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. నాలుగున సీమాంధ్ర జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు, ఉద్యోగులతో ర్యాలీలు, 6 నుంచి 10 వరకు అన్ని ప్రాంతాల్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. పీఆర్సీ, ఐఆర్ కోసం చర్చలు... ఉద్యోగులకు పీఆర్సీ, మధ్యంతర భృతి ఇప్పించేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని చంద్రశేఖరరెడ్డి తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం తన చిత్తానుసారం వ్యవహరించిందన్నారు. ఉద్యోగులు కోరినవిధంగా నిబంధనలు మార్చి హెల్త్కార్డులు మంజూరు చేయాలని, లేకుంటే వాటిని తిరస్కరిస్తామని చెప్పారు. జూన్ 30 నాటికి తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలూ తలోదారిగా వ్యవహరించాయన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను విడగొడుతున్నట్లు ప్రకటించిందన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఏవీవీఎస్వీవీ నరసింహం మాట్లాడుతూ ఈ రాష్ట్రం ఇప్పటి వరకు సమైక్యంగా ఉందంటే ఏపీ ఎన్జీవో అసోసియేషన్లోని ఉద్యోగుల ఉద్యమమే కారణమన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు సంబంధించి మలివిడత చర్చ ప్రారంభం కాగానే సీమాంధ్రలో మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్లపై ఈ ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణా ఎన్జీవో అసోసియేషన్ కన్వీనర్ ఉల్లి కృష్ణ, అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు, కోశాధికారి దారపు శ్రీనివాస్, కార్యదర్శి కె.శివశంకర్, వెస్ట్ కృష్ణా అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు టీఎస్ఆర్ ఆంజనేయులు, అవనిగడ్డ, నాగాయలంక, కైకలూరు, బంటుమిల్లి, మొవ్వ, పామర్రు, గుడివాడ తదితర ప్రాంతాల ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
'కేంద్రమంత్రులు, ఎంపీలను ఓడించడమే లక్ష్యం'
సమైక్యాంధ్రకు విరుద్దంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్ అబిడ్స్లో ఏపీఎన్జీవో హోంలో సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన ఏపీఎన్జీవోల నేతలు ఆయన సమావేశమైయ్యారు. ఈ సందర్బంగా ఆయన చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...రానున్న ఎన్నికలల్లో వారిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. బయట ఓ రకంగా మాట్లాడుతూ... లోపల మరోలా వ్యవహరిస్తున్నారని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఆయన ధ్వజమెత్తారు. ఆ సమావేశానికి ఏపీఎన్జీవోలతోపాటు సీమాంధ్రలోని దాదాపు 150 ఉద్యోగ సంఘాలు ఆ భేటీలో పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేస్తే సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, అలాగే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు,ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర మంత్రులు అనుసరిస్తున్న వైఖరిపై ఏపీఎన్జీవో నాయకులు ఆదివారం మండిపడ్డారు. -
‘కేంద్ర మంత్రి పళ్లంరాజు రాజీనామా చేయాలి’
కాకినాడ: కేంద్ర మంత్రి పదవికి పళ్లంరాజు రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పళ్లంరాజు తన పదవికి రాజీనామా చేయాలని..లేకుంటే ఆమరణ దీక్ష చేస్తానని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీపై కూడా ఆయన మండిపడ్డారు. ఆంటోనీ కమిటీ వాదనలు చెప్పడం అంటే చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని అభిప్రాయపడ్డారు.