chemical
-
నకిలీ పాలు ఎలా చేస్తున్నారో చూస్తే షాకవుతారు..
-
ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!
పెట్రోలియం, జెమ్స్టోన్ (రత్నాలు), చక్కెర, ఆగ్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ పాత్ర అంతర్జాతీయంగా బలోపేతం అవుతోంది. గడిచిన ఐదేళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రంగాల నుంచి భారత్ ఎగుమతుల వాటా పెరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018 నుంచి 2023 మధ్య కాలంలో వీటితోపాటు ఎలక్ట్రికల్ గూడ్స్, న్యూమాటిక్ టైర్లు, ట్యాప్లు, వాల్వ్లు, సెమీకండక్టర్ పరికరాల ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి.వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం..2023లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 85 బిలియన్ డాలర్ల(రూ.7.09 లక్షల కోట్లు)కు పెరిగాయి. ఈ రంగంలో అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి 6.45 శాతంగా ఉంటే, 2023 నాటికి 12.59 శాతానికి పెరిగింది. 2018లో పెట్రోలియం ఉత్పత్తుల పరంగా ఐదో అతిపెద్ద దేశంగా ఉండగా, 2023 నాటికి మూడో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది.విలువైన రాళ్లుప్రీషియస్, సెమీ ప్రీషియష్ (విలువైన రాళ్లు) స్టోన్స్ ఎగుమతుల పరంగా 2018 నాటికి భారత్ వాటా 16.27 శాతం కాగా, 2023 చివరికి 36.53 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ నంబర్1 స్థానానికి చేరింది. 2023లో 1.52 బిలియన్ డాలర్ల విలువైన తర్నాలను భారత్ ఎగుమతి చేసింది. 2018లో ఎగుమతులు కేవలం 0.26 బిలియన్ డాలర్లుగానే (అంతర్జాతీయంగా రెండో స్థానం) ఉన్నాయి.చక్కెర ఎగుమతులుచెరకు లేదా చక్కెర ఎగుమతుల పరంగా అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి ఉన్న 4.17 శాతం నుంచి 2023లో 12.21 శాతానికి చేరింది. చక్కెర ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ఆగ్రోకెమికల్, పురుగు మందులుఆగ్రోకెమికల్, పురుగు మందుల ఉత్పత్తుల ఎగుమతులతో అంతర్జాతీయంగా భారత్ వాటా 8.52 శాతం నుంచి 10.85 శాతానికి పెరిగింది. 2023 చివరికి ఎగుమతులు 4.32 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలు భారత్కు కలిసొస్తున్నాయి. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?రబ్బర్ టైర్ల ఎగుమతులురబ్బర్ న్యూమాటిక్ టైర్ల ఎగుమతులు 2018లో 1.82 బిలియన్ డాలర్లుగా ఉంటే 2023 చివరికి 2.66 బిలియన్ డారల్లకు పెరిగాయి. అంతర్జాతీయంగా భారత్ వాటా 2.34 శాతం నుంచి 3.31 శాతానికి చేరింది.సెమీకండక్టర్లుసెమీకండక్టర్, ఫొటోసెన్సిటివ్ పరికరాల ఎగుమతులు 2018లో కేవలం 0.16 బిలియన్ డాలర్లుగానే ఉండగా, 2023 నాటికి 1.91 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
Twin Brothers: కలిసే తనువు చాలించి..
జీడిమెట్ల: ఇద్దరు అన్నదమ్ములు కవలలుగా జన్మించి తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులు కవలలకు ముద్దుగా రాము, లక్ష్మణ్ అని పేర్లు పెట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఎదిగి..బతుకుదెరువు కోసం హైదరాబాద్కి వచ్చి దొరికిన పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో అన్నను కాపాడేందుకు తమ్ముడు ప్రయతి్నంచి ఇద్దరూ ఒకేసారి మృత్యుఒడికి చేరారు. ఈ విషాదకర సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో జరిగింది. జీడిమెట్ల డీఐ కనకయ్య, ఎస్సై హరీష్ తెల్పన వివరాల ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికూరు గ్రామానికి చెందిన రాము(32), లక్ష్మణ్(32) కవలలు. వీరు ఉపాధి కోసం నగరానికి వచ్చి గుండ్లపోచంపల్లి, అన్నారం గ్రామంలో ఉంటూ వివిధ పనులు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సాధు నారాయణరావు అనే ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ వద్ద రోజువారీ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత నాలుగు రోజులుగా వీరిద్దరూ జీడిమెట్ల ఏస్వీ కో ఆపరేటివ్ సొసైటీలో 3 సంవత్సరాలుగా మూతపడి ఉన్న సాబూరి ఫార్మా పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాము, లక్ష్మణ్తో పాటు పాండుబస్తీకి చెందిన సురేందర్రెడ్డి పరిశ్రమలో ఉన్న వ్యాక్యూమ్ ట్యాంక్ గోడపై నిలబడి ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో వీరికి తాగేందుకు చాయ్ రావడంతో లక్ష్మణ్, సురేందర్రెడ్డి గోడపై నుండి కిందకు దిగారు. గోడ దిగే క్రమంలో రాము ప్రమాదవశాత్తు వ్యాక్యూమ్ ట్యాంకులో పడిపోయాడు. పరిశ్రమ మూడు సంవత్సరాలుగా మూసి ఉన్నకారణంగా ట్యాంకులో రసాయనాలతో కూడిన నీరు 6 ఫీట్ల మేర ఉంది. రాము ట్యాంకులో పడటాన్ని గమనించిన లక్ష్మణ్ వెంటనే ట్యాంకు గోడ ఎక్కి ఓ కర్ర సాయంతో వెతకగా రాము అసస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అన్నను బయటకు తీసేందుకు లక్ష్మణ్ సైతం ట్యాంకులోకి దిగి అతను కూడా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో సురేందర్రెడ్డి ట్యాంకులోకి దిగి అపస్మారకస్థితిలో ఉన్న రాము, లక్ష్మణ్లను బయటకు తీశాడు. ఇద్దరిని వెంటనే షాపూర్నగర్లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మృతిచెందారని డ్యూటీ డాక్టర్ నిర్ధారించారు. సురేందర్రెడ్డి సైతం అస్వస్థతకు గురికావడంతో చికిత్స అందిస్తున్నారు. రాము, లక్ష్మణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ జిల్లా గాజువాకలోని శ్రవణ్ షిప్పింగ్ లో ప్రమాదం
-
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) రెండు పెట్రోకెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముడి చమురును నేరుగా అధిక విలువైన రసాయన ఉత్పత్తులుగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు కంపెనీ రెండవ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ఓఎన్జీసీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ వెల్లడించారు. వేర్వేరు రాష్ట్రాల్లో రెండు ప్రాజెక్టులకుగాను 2028 లేదా 2030 నాటికి రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఈడీ డి.అధికారి తెలిపారు. పెట్రోకెమికల్స్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4.2 మిలియన్ టన్నుల నుంచి 2030 నాటికి 8.5–9 మిలియన్ టన్నులకు చేర్చాలన్నది ప్రణాళిక అని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు సొంతంగా, మరొకటి భాగస్వామ్యంలో నెలకొల్పనున్నట్టు తెలిపారు. -
పాలీసైక్ల్తో రీ సస్టెయినబిలిటీ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యర్ధాల నిర్వహణ సంస్థ రీ సస్టెయినబిలిటీ (గతంలో రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్) తాజాగా పాలీసైక్ల్ ప్రైవేట్ లిమిటెడ్తో జట్టు కట్టింది. ప్లాస్టిక్ రసాయనాల రీసైక్లింగ్ కోసం దేశీయంగా ఫీడ్స్టాక్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద తక్కువ గ్రేడ్ ప్లాస్టిక్స్ను సేకరించి పాలీసైకిల్, దాని భాగస్వామ్య సంస్థల కెమికల్ రీసైక్లింగ్ ప్రాజెక్టుల కోసం ఫీడ్స్టాక్ను సిద్ధం చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా ఢిల్లీలో తొలి సారి్టంగ్, ప్రీ–ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు తోడ్పడగలవని రీ సస్టెయినబిలిటీ సీఈవో మసూద్ మలిక్ తెలిపారు. -
సైలెంట్ కిల్లర్.. వయెలెంట్గా..
సాక్షి, హైదరాబాద్: సైలెంట్ కిల్లర్గా పిలిచే కేన్సర్ వ్యాధి రాష్ట్రంలో వయెలెంట్గా విస్తరిస్తోంది. పొగాకు, మద్యం వినియోగం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయంలో పెరిగిపోతున్న రసాయన ఎరువులు, శీతల పానీయాల వినియోగం, ఆధునిక జీవన శైలి పోకడల వంటి పరిణామాలతోనే కేన్సర్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కేన్సర్ను ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స మొదలుపెట్టగలిగితే వ్యాధిని నయం చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతుండగా...శరీరంలో తెలియకుండానే మొదలైన ఈ వ్యాధిని ముదిరిపోయేంతవరకూ పసిగట్టలేకే మరణాలవరకూ తెచ్చుకుంటున్నాం. జాతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన తాజా నివేదికలోని కేన్సర్ కేసుల, మరణాల గణాంకాలు ఇప్పుడు ప్రమాద ఘంటికల్ని మోగిస్తు న్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 8.08లక్షల మంది కేన్సర్తో మరణించగా...అందులో ఒక్క తెలంగాణలోనే 27,339 మంది ఉన్నట్లు ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది. రెండేళ్లతో పోలిస్తే పెరిగిన మరణాల సంఖ్య అంతకుముందు రెండేళ్లతో పోల్చుకుంటే దేశంతో పాటు రాష్ట్రంలోనూ కేన్సర్ రోగులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం కేన్సర్ మరణాల్లో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉంది. 1.16లక్షల మరణాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా 66,879 మరణాలతో మహారాష్ట్ర దాని తర్వాతి స్థానంలో నిలిచింది. దేశంలోని ప్రతి లక్ష మందిలో ఒకరికి కేన్సర్ ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 2022లో దేశంలో కేన్సర్ రోగులు 14.61 లక్షలుండగా అందులో తెలంగాణలోనే కొత్తగా 49,983 కేన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇక భవిష్యత్తులో దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి కేన్సర్ వచ్చే అవకాశం ఉందని, 2025 నాటికి ఆ సంఖ్య 15.7 లక్షలకు చేరుకోనుందని ఐసీఎంఆర్ తాజా నివేదికలో హెచ్చరించింది. అధికంగా ఆ వయసువారే.. 60–64 వయస్సు గలవారు అత్యధికంగా కేన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు 10.6%, నోటి కేన్సర్ 8.4%, ప్రొస్టేట్ కేన్సర్ కేసులు 6.1%, నాలుక కేన్సర్ కేసులు 5.9%, కడుపు కేన్సర్ కేసులు 4.8% నమోదవుతున్నాయి. మహిళల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో రొమ్ము కేన్సర్ 28.8%, గర్భాశయ కేన్సర్ 10.6%, అండాశయ కేన్సర్ 6.2%, ఊపిరితిత్తుల కేన్సర్ 3.7% నమోదవుతున్నాయి. 35 ఏళ్లు దాటితే పరీక్షలు తప్పనిసరి... ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 35ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకోసారైనా కేన్సర్ స్క్రీనింగ్ పరీ క్షలు చేయించుకోవాలి. దంత వైద్యుల వద్దకు వెళితే వారు చేసే పరీక్షలు నోటి కేన్సర్ నిర్ధారణకూ ఉపయోగపడతాయి. 8 నుంచి 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు సర్వైకల్ కేన్సర్ రాకుండా టీకాను వేయించి వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. యాభై ఏళ్లు దాటినవారికి మలంలో రక్తం పడితే కొలనోగ్రఫీ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆలస్యంగా రావడం వల్లే అధిక మరణాలు ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం మంది కేన్సర్ చివరి దశలో ఉండగా మాత్రమే ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో అధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇక విదే శాల్లో 70 నుంచి 80 శాతం మంది మొదటి దశలోనే ఆస్పత్రులకు వచ్చి వైద్యులను సంప్రదిస్తున్నారు. సర్వైకల్, రొమ్ము కేన్సర్లను సులువుగా నయం చేయవచ్చు. రొమ్ము కేన్సర్ను మూడో దశలోనూ, థైరాయిడ్ కేన్సర్ వస్తే 100% నయం చేయవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. పిల్లల్లో రక్త సంబంధిత కేన్సర్లే అధికం.. జన్యుమార్పిడి వల్లే పిల్లల్లో కేన్సర్ వస్తుంటుందని, ఎక్కువగా వారి లో రక్త సంబంధిత కేన్సర్లు అధికంగా వస్తుంటాయని వైద్యులు చెబుతు న్నారు. పిల్లల్లో వైద్యానికి స్పందించే లక్షణం ఎక్కువ వారికి వచ్చే కేన్స ర్లలో 80% వరకు నయం చేయడానికి వీలుంటుందని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. మూడో దశ కేన్సర్లతో వచ్చే పిల్లల్ని సగం మందిని, నాలుగోదశలో వస్తే 25% మందిని బతికించవచ్చని అదే తొలి రెండు దశల్లో వస్తే 90%మందికి నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. దేశంలో 2035 నాటికి 13లక్షల కేసులు.. పొగాకు, మద్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల 66 శాతం, ఇన్ఫెక్షన్లతో 20% కేన్సర్లు వస్తున్నాయి. హార్మోన్లు, జన్యుమార్పుల వల్ల 10% పైగా, కాలుష్యం వల్ల ఒక శాతం కేన్సర్ రిస్క్లున్నాయి. 2035 నాటికి దేశంలో కేన్సర్ మరణాలు 13 లక్షలకు చేరుకుంటాయని అంచనా. –డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
ఈమె డాక్టర్ భారతి ఎందరికో స్ఫూర్తి
సాకే భారతి రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అనంతపురం ఎస్.కె.యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పీహెచ్డీ పట్టా తీసుకుంది. ఆమె పుట్టి పెరిగిన సామాజిక వర్గం (ఎరుకల)లో, ఆమె నివసిస్తున్న శింగనమల మండలం నాగుల గుడ్డం గ్రామంలో ఆమె సాధించింది ఎంత పెద్ద ఘనకార్యమో చాలామందికి తెలియదు.అసలు సాకే భారతి చదువుకుంటూ ఉంటేనే ‘చదువెందుకు’ అని చాలామంది స్త్రీలు ఆశ్చర్యపోయేవారు. ‘మేము ఏం చదివామని సుబ్రంగా కాపురాలు చేస్తున్నాం’ అని కూడా అనేవారు. కాని చదువు తెచ్చే వెలుతురు భారతికి బాగా తెలుసు.ఈ మెట్టు తర్వాత తనకు ప్రోఫెసర్గానో అసిస్టెంట్ప్రోఫెసర్గానో ఉద్యోగం వస్తే మారబోయే తన జీవితమూ తెలుసు. తనను చూసైనా తన వర్గంలో తనలాంటి సామాజిక వర్గాల్లో స్ఫూర్తి రావాలని ఆమె కోరిక. ముగ్గురు ఆడపిల్లలు తల్లిదండ్రులకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లల్లో సాకే భారతి రెండో సంతానం. తండ్రికి చదువు లేదు. పైగా ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని, అబ్బాయి పుట్టలేదని భార్యను ఇబ్బంది పెట్టేవాడు. తను కూడా చాలా అస్థిమితంగా ఉండేవాడు.ఇంట్లో వాతావరణం ఏమీ బాగుండేది కాదు. అప్పుడు భారతి తాత భారతితో అన్నమాట ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది– అమ్మా... నా కూతుర్ని మీ నాన్నకు ఇస్తే ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆడపిల్లకు ఏం తక్కువ? బాగా చదువుకుంటే ఎన్నో గొప్ప పనులు చేయవచ్చు.నువ్వు బాగా చదువుకుని మీ నాన్న కళ్లు తెరిపియ్యాలి’ అన్నాడు. ఆ రోజు నుంచి భారతి గట్టిగా చదువుకోవాలనుకుంది. ఇవాళ్టికీ చదువుకుంటూనే ఉంది. ఎన్నో కష్టాలు భారతి మూడోక్లాసుకు వచ్చేసరికి చిన్న చెల్లెలు పుట్టింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూలికి వెళ్లాలి. అక్క బడికెళ్లాలి. చెల్లెల్ని ఎవరు చూసుకోవాలి? రెండేళ్లు బడి మానేసి ఇంట్లో చెల్లెల్ని చూసుకుంటూ ఉండిపోయింది భారతి. ఆ తర్వాత పదోక్లాస్లో పెళ్లి చేశారు. అప్పుడు కూడా ఒక సంవత్సరం చదువు సాగలేదు.పెళ్లయ్యాక నివాసానికి ఇల్లు లేకపోవడంతో రేకుల షెడ్డు వేసుకుని అందులోనే ఉన్నారు. అక్కడే ఒకరోజు కాలేజీకి వెళుతూ ఒకరోజు కూలి పనికి వెళుతూ చదువుకుంది భారతి. ఇంటర్ (ఎం.పి.సి.)లో రోజు కూలి పాతిక రూపాయలు, డిగ్రీ (బిఎస్సీ)లో రోజు కూలి యాభై రూపాయలు వచ్చేది. ఈ లోపు కూతురు పుట్టింది. పాటలంటే చాలా ఇష్టమున్న భారతి తన కూతురికి ‘గాయని’ అని పేరు పెట్టింది. పెళ్లి, సంసారం వల్ల చదువు మీద శ్రద్ధ ఉండటం లేదని భారతి బాధ పడుతుంటే భర్త ఏరికుల శివప్రసాద్ ఇంటర్ చదువు కొనసాగేలా ప్రోత్సహించాడు. పామిడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, అనంతపురం ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, అనంతపురంలోనే ఎమ్మెస్సీ పూర్తి చేసింది. గ్రామం నుంచి కళాశాలకు పోవడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో రోజూ ఎనిమిది కిలోమీటర్లు గార్లదిన్నెకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో అనంతపురం వెళ్లి చదువుకుంది. డిగ్రీలో భారతి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఇల్లు లేదు.. ఉద్యోగం లేదు భారతి నివసిస్తున్న ఇల్లు అసంపూర్ణ స్థితిలో ఉంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే డబ్బులేక నిర్మాణం సగంలోనే ఆపేయాల్సి వచ్చింది.ప్రోఫెసర్ కావాలన్నదే భారతి కోరిక. ప్రోఫెసర్ ఉద్యోగం వస్తే నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరి కొంతమంది విద్యార్థులకు పంచి చదువులో రాణించే విధంగా కృషి చేస్తాను’ అంది భారతి. పీహెచ్డీ పట్టా వచ్చాక దానిని ఇంట్లో పెట్టి కూలి పనికి వెళుతోంది భారతి. టొమాటో చేనులో, బెండకాయ చేనులో పని చేస్తోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేస్తే 150 రూపాయలు వస్తున్నాయి. – రుషింగప్పగారి మునెప్ప, శింగనమల, సాక్షి చేతిలో పలుగూ పార నెత్తిన పచ్చగడ్డి నుదుటిన ఎప్పుడూ దొర్లే చెమట కాని గుండెల నిండా చదువు పూర్తి చేయాలన్నసంకల్పం.మహా మహా సౌకర్యాలు ఉండి కూడా పీహెచ్డీ కల నెరవేర్చుకోలేని వారు చకితమయ్యేలా ఏ సౌకర్యాలూ లేని వాళ్లు కొండంత స్ఫూర్తి పొందేలా వ్యవసాయ కూలీ భారతి మొన్న (సోమవారం) పీహెచ్డీ పట్టా అందుకుంది. అనంతపురంలో ఈ అద్భుతం జరిగింది. 2016లో పీహెచ్డీ సీటు 2016లో సాకే భారతి ఎస్.కె. యూనివర్శిటీలోప్రోఫెసర్ ఎం.సి.ఎస్ శోభ దగ్గర ఆర్గానిక్ కెమెస్ట్రీలో పిహెచ్.డి ప్రవేశం ΄పొందింది. పిహెచ్.డిలో చేరడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఉపకార వేతనం భారతి చదువుకు సహాయపడింది. దీంతోపాటు కూలి పనులకు వెళ్తూ 2023 సంవత్సరానికి పట్టా పొందింది. స్లిప్పర్లతో, అతి సాదా బట్టలతో స్నాతకోత్సవంలో పట్టా అందుకోవడానికి భారతి స్టేజీ ఎక్కితే ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగి పోయింది. -
ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..
వృద్ధాప్యం! ఆ వయసులో ఎదుర్కొనే సమస్యలు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలామంది ఆ వయసు సమీపించే సమయంలో కూడా ఫిట్గా యవ్వనంగా ఉండాలనే రకరకాల డైట్ ఫాలో అవుతుంటారు. అయినా ఏదో ఒకరకంగా మనలో ఆ వృద్ధాప్య ఛాయాలు కనిపిస్తునే ఉంటాయి. ఐతే దానికి చెక్పెట్టి మనం ఎప్పటికీ యవ్వనంగా ఉండొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు అని చెబుతున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. హర్వర్డ్ శాస్త్రవేత్తల బృందం వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ఓ సరికొత్త రసాయన కాక్టెయిల్ని కనిపెట్టింది. వారంతా ఈ కాక్టెయిల్ని మానవులు, ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలనిచ్చింది. వారి ఏజ్ని చాలా ఏళ్లు వెనక్కి నెట్టినట్లు నిర్థారించారు. తాము ఈ పరిశోధనలను "రసాయన ప్రేరిత రీ ప్రోగ్రామింగ్ టు రివర్స్ సెల్యులర్ ఏజింగ్" అనే పేరుతో చేసినట్లు తెలిపారు ఈ మేరకు హార్వర్డ్ పరిశోధకుడు డేవిడ్ సింక్లైర్ జూలె12న ప్రచురితమైన జర్నల్ ఏజింగ్లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. "జన్యు చికిత్స ద్వారా రివర్సల్ ఏజింగ్ సాధ్యమవుతుందని భావించాం. ఇప్పుడూ ఈ కెమికల్ కాక్టెయిల్స్తో అది సాధ్యమని చూపించాం. ఇది నిజంగా మనిషిని పూర్తి యవ్వనవంతుడిగా మార్చే ఒక ముందడగు అని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. ఈ రసాయన కాక్టెయిల్లో ఐదు నుంచి ఏడు ఏజెంట్లు ఉంటాయని, వీటిలో చాలా వరకు శారీరక, మానసిక రుగ్మతలకు చికిత్స అందిస్తాయని చెప్పారు. తమ బృందం సెల్యూలర్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా మానవ కణాలను పునర్జ్జీవింప చేయడానికి మిళితం చేయగల అణువులను కనుగొనడానికి మూడు ఏళ్లు పైగా కృషి చేశారు. ఈ పరిశోధనల్లో.. ఆప్టిక్ నరాలు, మెదడు, కణజాలం, మూత్రపిండాలు, కండారాలు తదితరాలపై అధ్యయనాలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో..వాటి జీవితకాలం పొడిగించబడటమేగాక మంచి ఫలితాలు కనిపించాయన్నారు. అలాగే కోతులపై చేసిన పరిశోధనల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇక మిగిలింది మానవులపై చేయాల్సిన పూర్తి స్తాయి క్లినికల్ ట్రయల్స్ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో అవి కూడా ప్రారంభకానున్నాయని చెప్పారు. అంతా సవ్యంగానే జరగుతుందని, మంచి ఫలితాలే వస్తాయని ధీమగా చెబతున్నారు హార్వర్డ్ శాస్త్రవేత్త సింక్లైర్. (చదవండి: ఇది చినుకు కాలం.. జనం వణుకు కాలం.. 3-4 వారాలు బాధించే జ్వరంతో జాగ్రత్త!) -
ఒక శకం ముగిసింది: ప్రముఖ పారిశ్రామికవేత్త కన్నుమూత
తొలి తరం వ్యవస్థాపకుడు, రసాయనాల తయారీ కంపెనీ దీపక్ నైట్రేట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ చిమన్లాల్ కె మెహతా (సీకె మెహతా) సోమవారం కన్నుమూశారు. మౌలిక్ మెహతా కంపెనీకి సీఈవోగా ఉన్నారు.దీంతో పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర పరిశ్రమ వర్గాలు సంతాపాన్ని ప్రకటించాయి. ఒక శకం ముగిసింది అంటూ ఆయనకు నివాళులర్పించారు. 1972-73లో దీపక్ నైట్రేట్ తయారీని ప్రారంభించిన చిమన్లాల్ రెండేళ్లలోనే లాభాల బాట పట్టించారు. అనేక కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలను ప్రారంభించడంలోనూ, దీపక్ ఫౌండేషన్ను స్థాపించడంలోమెహతాది కీలకపాత్ర. 1971లో దీపక్ నైట్రేట్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వచ్చింది. ఈ సందర్భంగా 20 రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ చేయడం విశేషం. దీపక్ నైట్రేట్ 1984లో మఫత్లాల్ ఇండస్ట్రీస్ నుండి సహ్యాద్రి డైస్టఫ్స్, కెమికల్స్ యూనిట్ను కొనుగోలు చేసింది. కంపెనీ 1995లో మహారాష్ట్రలోని తలోజాలో హైడ్రోజనేషన్ ప్లాంట్ను స్థాపించింది. ప్రస్తుతం, కంపెనీ గుజరాత్లోని నందేసరి , దహేజ్, మహారాష్ట్రలోని తలోజా అండ్ రోహా తెలంగాణలోని హైదరాబాద్లో ప్లాంట్స్ ఉన్నాయి. దీపక్ నైట్రేట్ 100కి పైగా ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలను ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయ రసాయనాలు, రంగులు, రబ్బరు, ఫార్మాస్యూటికల్స్, స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ లాంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో కెమికల్స్లో ఆరో అతిపెద్ద సంస్థగా ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా రెట్లు పెరిగి, పదేళ్ల నాటి 24వ స్థానంతో పోలిస్తే దీపక్ నైట్రేట్ అయిదో అతిపెద్ద లిస్టెడ్ కెమికల్ ప్లేయర్గా ఉంది. ఏప్రిల్, 2023 నాటికి రూ. 25,208 కోట్లు. -
అనంతపురంలో పేలుడు.. ముక్కలైన వ్యక్తి శరీరం
సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలో పేలుడు కలకలం రేపుతోంది. ఊహించని ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. రవాణాశాఖ కార్యాలయం సమీపంలోని బాలాజీ స్టిక్కర్ అండ్ స్ప్రే పేయింట్ షాపులో కెమికల్ పెయింట్ డబ్బా ఓపెన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెయింట్ బాక్స్ పేలడంతో సతీష్ అనే వాచ్మెన్ అక్కడిక్కడే మృతిచెందాడు. పేలుడు ధాటికి మృతుడి శరీర భాగాలు తునాతునకలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పేలిన పెయింట్ డబ్బా పదేళ్ల క్రితం నాటిదని తేలుస్తోంది. -
రసాయనాల తయారీ హబ్గా భారత్
న్యూఢిల్లీ: దేశీయంగా రసాయనాలకు డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయంగా రసాయనాల వినియోగంలో అయిదో వంతు వాటా భారత్దే ఉండనుంది. 2040 నాటికి ఇది 1,000 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 82,00,000 కోట్లు) చేరనుంది. ’తదుపరి రసాయనాల తయారీ హబ్గా భారత్’ పేరిట రూపొందించిన నివేదికలో కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే ఈ విషయాలు వెల్లడించింది. గత దశాబ్దకాలంగా ఇటు రసాయనాల వినియోగంలోనూ, అటు షేర్హోల్డర్ల కు సంపద సృష్టిలోనూ భారత కెమికల్స్ రంగం అంతర్జాతీయ పరిశ్రమను మించి రాణించిందని పేర్కొంది. ప్రస్తుతం ఇటు వినియోగం అటు తయారీ.. రెండింటిలోనూ అంతర్జాతీయంగా ఆధి పత్య పాత్ర పోషించే స్థాయిలో భారత్ ఉందని మెకిన్సే వివరించింది. 2021–27 మధ్య కాలంలో పరిశ్రమ 11–12 శాతం, 2027–40 మధ్య 7–10 శాతం మేర వృద్ధి చెందవచ్చని పేర్కొంది. 2040 నాటికి అంతర్జాతీయంగా తన మార్కెట్ వాటాను మూడు రెట్లు పెంచుకోవచ్చని వివరించింది. ‘వచ్చే రెండు దశాబ్దాల్లో అదనంగా పెరిగే రసాయనాల వినియోగంలో భారత్ వాటా 20 శాతం పైగా ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశీయంగా డిమాండ్ 2021లో 170–180 బిలియన్ డాలర్లుగా ఉండగా .. 2040 నాటికి 850–1,000 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది‘ అని మెకిన్సే వివరించింది. అన్నింటా వినియోగం.. రసాయనాలు ప్రస్తుతం రోజువారీ ఉత్పత్తుల్లో భా గంగా మారిపోయాయి. డిటర్జెంట్లు, దుస్తులు మొ దలుకుని సుగంధ పరిమణాలు, క్రిమి సంహారకా లు, పెయింట్ల వరకు వివిధ రంగాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయంగా పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండటం భారత్కు లాభించగలదని మెకిన్సే పేర్కొంది. ఆ యా ఉత్పత్తుల్లో వినియోగించే అనేక రసాయనా లను తయారు చేసే టాప్ దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉండటం ఇందుకు కారణమని వివరించింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారిపోతుండటం, పలు దేశాలు ప్రస్తుతమున్న కీలక తయారీ మార్కెట్లకు ప్రత్యామ్నాయాలను అన్వేíÙస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ కీలక గమ్యస్థానంగా మారేందుకు అవకాశం ఉందని పేర్కొంది. సవాళ్లున్నప్పటికీ .. దేశీ కంపెనీలు క్రాకర్ సామరŠాధ్యల లేమి, కీలక ఖనిజాల కొరత తదితర సమస్యలు ఎదుర్కొంటున్నాయని మెకిన్సే తెలిపింది. అలాగే పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో సుశిక్షితులైన నిపుణుల కొరత, సమయానికి పర్యావరణ అనుమతులు, స్థలపరమైన కేటాయింపులు జరగకపోతుండటం వంటి సవాళ్లు కూడా ఉంటున్నాయని పేర్కొంది. అయినప్పటికీ తక్కువ మూలధనం, చౌకగా కారి్మకుల లభ్యత తదితర అంశాల కారణంగా పలు రసాయనిక విభాగాల్లో భారత్ ఇప్పటికీ చవకైన మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. మరోవైపు, భారత్ రసాయనాల తయారీలో కీలకంగా మారుతున్నప్పటికీ తనకు అవసరమైన కెమికల్స్ కోసం మాత్రం దిగుమతులపై ఆధారపడాల్సి ఉంటోంది. రసాయనాల పరిశ్రమలో అసేంద్రీయ, పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ అంటూ మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. వీటిలో స్పెషాలిటీ కెమికల్స్ మాత్రమే నికరంగా ఎగుమతి చేయగలుగుతోంది. కీలకమైన ముడివనరులు, ఖనిజాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా అసేంద్రీయ, పెట్కెమ్ విభాగాలు దిగుమతులపైనే ఆధారపడటం కొనసాగవచ్చని మెకిన్సే వివరించింది. భారత్లో రసాయనాల వినియోగానికి స్పెషాలిటీ కెమికల్స్ విభాగం ఊతమివ్వగలదని పేర్కొంది. 2040 నాటికి భారత నికర ఎగుమతుల్లో ఈ విభాగం వాటా 10 రెట్లు పెరిగి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోగలదని తెలిపింది. ప్రస్తుతం ఇది 2 బిలియన్ డాలర్లు. -
ఇకపై స్పెషాలిటీ కెమికల్స్ జోరు
కరోనా మహమ్మారి తదుపరి ప్రపంచ కెమికల్ దిగ్గజాలు సరఫరాల చైన్ను పునర్వ్యవస్థీకరించే సన్నాహాలు ప్రారంభించాయి. తద్వారా చైనాయేతర దేశాల కంపెనీలపై దృష్టి సారిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీలు సామర్థ్య విస్తరణను చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఇకపై స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీలు మరింత మెరుగైన పనితీరు చూపే వీలున్నట్లు పలువురు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. దేశీయంగా టాప్ పొజిషన్లో ఉన్న స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీలు కొంతకాలంగా విస్తరణ కార్యకలాపాలు అమలు చేస్తున్నాయి. దీంతో ప్రొడక్టుల లభ్యత పెరగనుంది. మరోవైపు కోవిడ్–19 తదుపరి ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనడం, ఆర్థిక వ్యవస్థలు పురోగమన పథం పట్టడం వంటి అంశాలు పలు రంగాలకు జోష్నిస్తున్నాయి. వీటిలో స్పెషాలిటీ కెమికల్ పరిశ్రమ సైతం చేరనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి పలు గ్లోబల్ కెమికల్ దిగ్గజాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. రిస్కులను తగ్గించుకునే వ్యూహాలు దీనికి కారణంకాగా.. ఇందుకు అనుగుణంగా భారత్ వంటి దేశాలవైపు చూస్తున్నా యి. ఇదే సమయంలో పలు అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలోనూ డిమాండుపై అంచనాలతో దేశీ కంపెనీలు తయారీ సామర్థ్యాలను పెంచుకుంటూ రావడం మరిన్ని అవకాశాలకు దారిచూపనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వెరసి స్పెషాలిటీ కెమికల్స్కు పెరగనున్న డిమాండును అందుకునే బాటలో దేశీ పరిశ్రమ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. చైనాకు చెక్ కోవిడ్–19 సవాళ్ల తదుపరి ఏడాది కాలంగా స్పెషాలిటీ కెమికల్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఓవైపు చైనాకు ప్రత్యామ్నాయాల అన్వేషణలో భాగంగా ఇతర దేశాల కంపెనీలపై గ్లోబల్ కెమికల్ దిగ్గజాలు దృష్టిసారిస్తుంటే.. మరోపక్క యూరోపియన్ కెమికల్ దిగ్గజాలు భారత్ మార్కెట్వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు ప్రధానంగా యూరోప్లో తయారీ వ్యయ, ప్రయాసలతో కూడుకోవడం ప్ర భావం చూపుతోంది. భారత్ నుంచి చౌకగా ప్రొడక్టులను ఔట్సోర్సింగ్ చేసుకునేందుకు వీలుండటం ఇందుకు సహకరిస్తున్నట్లు నిపుణులు విశ్లేషించారు. నిజానికి ఈ రంగంలో దేశీయంగా పలు కంపెనీలు ప్రొడక్టులను భారీగా ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఇకముందు ఔట్సోర్సింగ్ మరింత పుంజుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త మాలిక్యూల్స్.. కొద్ది రోజులుగా స్పెషాలిటీ కెమికల్ తయారీ ముడివ్యయాలు తగ్గుతూ వస్తున్నాయి. దీనికితోడు ఇంధన వ్యయాలూ దిగివస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా కొత్త మాలిక్యూల్స్, ప్రాసెస్పై కొన్ని కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అంతేకాకుండా సొంతంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, దిగుమతి ప్రొడక్టులకు ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తద్వారా గ్లోబల్ దిగ్గజాల నుంచి దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులను పొందడంపై కన్నేసినట్లు నిపుణులు పేర్కొన్నారు. షేర్లపై ఎఫెక్ట్ పటిష్ట అమ్మకాలు సాధిస్తున్న స్పెషాలిటీ కెమికల్ కంపెనీల స్టాక్స్ గత కొన్నేళ్లుగా లాభాలతో దూసుకెళ్లడంతో ఇటీవల కొంతమేర దిద్దుబాటును చవిచూస్తున్నాయి. గత 5–7 ఏళ్ల కాలాన్ని పరిగణిస్తే పలు దిగ్గజాల షేర్లు రెటింపునకుపైగా బలపడ్డాయి. అయితే కొద్ది నెలలుగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక మందగమన భయాలు వంటి ప్రతికూలతలతో వెనకడుగు వేస్తున్నాయి. 52 వారాల గరిష్టాలతో పోలిస్తే ఎస్ఆర్ఎఫ్, దీపక్ నైట్రైట్, ఆర్తి ఇండస్ట్రీస్, ఆల్కిల్ అమైన్ కెమికల్స్, క్లీన్ సైన్స్ టెక్నాలజీస్ తదితర షేర్లు 20–40 శాతం మధ్య పతనమయ్యాయి. అయినప్పటికీ ఐదేళ్ల సగటు ధరలతో చూస్తే ప్రీమియంలోనే ట్రేడవుతున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ ఆర్జనలపట్ల ఆశావహ అంచనాలు సానుకూల ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. ఇటీవల త్రైమాసిక ఫలితాలలో పీఐ ఇండస్ట్రీస్ ఆదాయం జంప్చేయగా.. రిఫ్రిజిరెంట్ గ్యాస్ ధరలతో గుజరాత్ ఫ్లోరో, ఎస్ఆర్ఎఫ్ లబ్ది పొందే వీలుంది. ఎఫ్ఎంసీజీ రంగం ద్వారా గలాక్సీ, ఫైన్ ఆర్గానిక్ మార్జిన్లు మెరుగుపడ్డాయి. ఇక దీపక్, ఆర్తి, జూబిలెంట్ కొంతమేర మార్జిన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ప్రత్యేక ప్రొడక్టుల ద్వారా పనితీరు మెరుగుకానున్నట్లు అభిప్రాయపడ్డారు. యాజమాన్యాలు రెడీ దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ భారీఎత్తున పెరుగుతోంది. అయినప్పటికీ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, దీపక్ నైట్రైట్ తదితరాలు పటిష్ట ఫలితాలు సాధించవచ్చని అంచనా. ఇక ఆర్తి ఇండస్ట్రీస్, నోసిల్, వినతీ ఆర్గానిక్స్, గలాక్సీ సర్ఫక్టాంట్స్, టాటా కెమికల్స్, అనుపమ్ రసాయన్ తదితర దిగ్గజాల యాజమాన్యాలు గ్లోబల్ సరఫరా చైన్ల పునర్వ్యవస్థీకరణతో భారీగా లబ్ది పొందే వీలున్నట్లు ఊహిస్తున్నాయి. వెరసి ఈ రంగంలోని పలు దిగ్గజాలు భవిష్యత్లో పటిష్ట పనితీరును ప్రదర్శించే అవకాశముంది. -
టీ పొడి అనుకొని పురుగులమందు.. చాయ్ తాగి అయిదుగురు దుర్మరణం
లక్నో: విష రసాయనాలు కలిసిన టీ (చాయ్) తాగి ఇద్దరు చిన్నారులు, వారి తండ్రి సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లా నగ్లా కన్హాయ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామమూర్తి అనే మహిళ గురువారం తన ఇంట్లో టీ పొడిగా పొరపడి, పొలంలో పిచికారీ చేసిన పురుగులమందు డబ్బాలోని పౌడర్ను వేసి టీ కాచింది. దానిని భర్త శివనందన్(35), కుమారులు శివాంగ్(6), దివ్యాన్ష్5)తోపాటు తన తండ్రి రవీంద్ర సింగ్(55), పొరుగునుండే సొబ్రాన్(42)లకు ఇచ్చిది. తాగిన తర్వాత వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రవీంద్ర సింగ్, శివాంగ్, దివాన్ష్ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోగా మిగతా ఇద్దరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఎస్పీ చెప్పారు. చదవండి: కదులుతున్న కారుపైకి ఎక్కి టపాసుల కాల్పులు...సీన్ కట్ చేస్తే... -
అలర్ట్: పాపులర్ డవ్, ఇతర షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్స్,రీకాల్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ యూనీ లీవర్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. డవ్, ట్రెస్మే, నెక్సస్, సువేవ్, టిగీ లాంటి షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్ ఉన్నట్టు గుర్తించిన కారణంగా వాటిని భారీ ఎత్తున రీకాల్ చేసింది. ఈ నేపథ్యంలో కలుషితమైన ఏరోసోల్ డ్రై షాంపూ ఉత్పత్తుల వినియోగాన్ని నిలిపి వేయాలని వినియోగదారులకు కంపెనీ సూచించింది. వీటిని వినియోగించడం ప్రమాదమంటూ హెచ్చరిక జారీ చేసింది. యూనిలీవర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో రీకాల్ వివరాలను అక్టోబర్ 18న ప్రకటించింది. రీకాల్ చేసిన వాటిల్లో అక్టోబరు 2021కి ముందు తయారు చేసిన డ్రై షాంపూ ఏరోసోల్ ఉత్పత్తులున్నాయని యునిలీవర్ తన నివేదికలో తెలిపింది. తమ అంతర్గత పరిశోధనలో ఏరోసోల్స్ ప్రొపెల్లెంట్ కేన్సర్ కారకం బెంజీన్కు మూలమని కనుగొన్నట్లు తెలిపింది. వీటి వాడకంతో బెంజీన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున అమెరికాలో పంపిణీ చేసిన ఉత్పత్తులు అన్నింటినీ రీకాల్ చేశామనీ, ఆయా ఉత్పత్తులను షెల్ఫ్ల నుండి తీసివేయమని రిటైలర్లను కోరింది. కాగా బెంజీన్ అధిక స్థాయిలోశరీరంలో చేరితే లుకేమియా, ప్రాణాంతక రక్త రుగ్మతలు, బోన్ మారో క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో ప్రమాదకరమైన కలుషితాలను గుర్తించడం ఇదే మొదటి సారి కాదు. తాజా పరిణామంతో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ఏరోసోల్ల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. గత ఏడాదిన్నర కాలంలో, జాన్సన్ అండ్ జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్వెల్ పర్సనల్ కేర్ కంపెనీకి చెందిన బనానా బోట్ లాంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నాయి.అలాగే ప్రోక్టర్ అండ్ గాంబుల్ స్ప్రే-ఆన్ యాంటీ పెర్స్పిరెంట్లు సీక్రెట్ అండ్ ఓల్డ్ స్పైస్, యూనిలివర్స్ సువేవ్ లాంటి ఉత్పత్తులలో బెజీన్ కనుగొనడం, రీకాల్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్: గౌలిగూడలో కెమికల్ పేలుడు, ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: అప్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తోంది. మ్యాన్హోల్లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒక్కసారిగా అందులో బ్లాస్ట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటర్తో కెమికల్ రియాక్ట్ అవ్వడం వల్లే పేలుడు సంభవించిందని తెలిపారు. కెమికల్ బ్లాస్ట్లో మరణించిన వ్యక్తిని భరత్ బాతోడ్ (కొడుకు).. గాయాలైన వ్యక్తిని గోపాల్ బాతోడ్గా (తండ్రి)గా గుర్తించారు. -
బంగ్లాదేశ్లో ఘోర అగ్నిప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది సజీవదహనమయ్యారు. 450 మందికిపైగా కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రసాయనాలు ఉంచిన ఒక కంటైనర్ డిపోలో తొలుత అగ్నికీలలు చెలరేగి ఆ తర్వాత వరస పేలుళ్లు సంభవించడంతో భారీ ప్రమాదం జరిగింది. దేశంలో ప్రధాన రేవు పట్టణమైన చిట్టగాంగ్కి సమీపంలోని సీతాకుంద్లో షిప్పింగ్ కంటైనర్లు ఉంచే బీఎం కంటైనర్ డిపోలో శనివారం రాత్రి అగ్గి రాజుకుంది. ఆ తర్వాత వరసపెట్టి పేలుళ్లు సంభవించాయని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. రాత్రి 11.45 గంటలకు మంటలు మొదలయ్యాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనం నింపిన కంటైనర్లు కావడంతో ఒక దాని తర్వాత మరొకటి పెద్దగా శబ్దాలు చేస్తూ పేలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి మంటల్ని అదుపులోకి తీసుకురావడం శక్తికి మించిన పనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. ప్రమాదం విషయం తెల్సి ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. వణికిపోయిన చుట్టుపక్కల ప్రాంతాలు ఈ పేలుడు ధాటి ప్రభావం నాలుగు కిలో మీటర్ల వరకు చూపించింది. భవనాలు ఊగాయి. పైకప్పులు చెదిరిపడ్డాయి. హుటాహుటిన 19 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఆరు అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలతో నింపిన కంటైనర్లు కావడంతో ఒక దానికి నిప్పు అంటుకోగానే వరుసగా వెంట వెంట నే అన్నీ పేలిపోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. -
రూ. 1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆగ్రో కెమికల్స్ ఉత్పత్తి సంస్థ నిచినో ఇండియా రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది సుమారు రూ. 650 కోట్లుగా ఉందని, ఏటా 18–20 శాతం మేర వృద్ధి సాధిస్తున్నామని సంస్థ ఎండీ తమూకా నౌహిరో తెలిపారు. దాదాపు 71 ఉత్పత్తులతో దేశీయంగా క్రిమిసంహారకాల మార్కెట్లో తమకు 2–3 శాతం వాటా ఉందని, దేశవ్యాప్తంగా 2,500, తెలుగు రాష్ట్రాల్లో 1,200 మంది డీలర్లు ఉన్నారని చెప్పారు. వరి సాగులో సుడి దోమ సమస్య పరిష్కారానికి ఆర్కెస్ట్రా పేరిట క్రిమిసంహారకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు దిగుబడిని పెంచుకునేందుకు ఇది రైతులకు తోడ్పడగలదని సంస్థ సీవోవో డీజీ శెట్టి తెలిపారు. జపాన్ సంస్థ నిహాన్ నొయాకూ కార్పొరేషన్కు అనుబంధ సంస్థ అయిన నిచినో ఇండియాకు.. తెలంగాణలోని హైదరాబాద్, సంగారెడ్డితో పాటు దేశీయంగా మొత్తం నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. -
ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి
న్యూయార్క్: మనం రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాడే ప్లాస్టిక్స్ పరికరాలన్నింటిలో థాలెట్ ఆనే కెమికల్ ఉన్నట్లు న్యూయార్క్ పరిశోధకులు గుర్తించారు. ఆఖరికి పిల్లలు ఆడుకునే బొమ్మలు దగ్గర్నించి మనం నిత్యం వాడే దుస్తులు, షాంపు నుంచి మేకప్ వరకు అన్ని ప్లాస్టిక్తోనే రూపోందించినవే కావడంతో అత్యధికంగా థాలెట్ అనే కెమికల్ ఉత్పన్నవతోందని వెల్లడించారు. (చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!) ఇది హర్మోన్ల వ్యవస్థను నాశనం చేసే కారకాలుగా ప్రసిద్ధిమైనవే కాక మొత్తం మానవ వినాళికా గ్రంథి వ్యవస్థనే ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ఆ ప్లాస్టిక్ వస్తువులు మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయని అందువల్లే ఈ విషపూరిత రసాయనాలు మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి అని అన్నారు. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండే జబ్బులు అధికమవుతున్నట్లు తాజా అద్యయనాల్లో తెలపారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనలో 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల ఐదు వేల మంది మూత్రంలో థాలెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అంతేకాదు వారు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం ఉందని వెల్లడించారు. గుండెజబ్బులకు ప్రధానం కారణం రసాయాలేనని తెలిపారు. అలాగే పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గిపోవడానికి కారణం ఈ థాలెట్ రసాయనమే కారణం అని చెప్పారు. ఈ థాలెట్ రసాయనం వల్ల అమెరికన్లు రకరకాల వ్యాధుల భారినపడి ఏటా 1,00,000 మంది అమెరికన్లు మరణిస్తున్నారని.. ఫలితంగా ఆర్థికంగా 40 నుంచి 47 బిలియన్ల డాలర్ల వరకు నష్టపోతున్నట్లు న్యూయార్క్ పరిశోధకులు అధ్యయనాల్లో పేర్కొన్నారు. (చదవండి: కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!) -
రిలయన్స్ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. తన ఆయిల్-టు-కెమికల్స్ (ఓటూసీ) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా రూపొందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వ్యాపార బదిలీతో కొత్తగా ఏర్పడిన ఈ అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ, నియంత్రణ కలిగి ఉంటుందని ఆర్ఐఎల్ తెలిపింది. మొత్తం అపరేటింగ్ టీం, కొత్త సంస్థలోకి మారుతుందనీ, అలాగే ఆదాయాలను తగ్గించడం లేదా నగదు ప్రవాహాలపై ఎటువంటి పరిమితులు ఉండవని పేర్కొంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రమోటర్ గ్రూప్ ఓటూసీ వ్యాపారంలో 49.14 శాతం వాటాను కలిగి ఉంటుందనీ, ఈ ప్రక్రియతో కంపెనీ వాటాదారుల్లో ఎలాంటి మార్పు ఉండదని రెగ్యులేటరీ సమాచారంలో రిలయన్స్ వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ ఎక్స్ఛేంజీల ఆమోదం లభించినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. అయితే, ఈక్విటీ వాటాదారులు, రుణదాతలు, ఐటీ, ఎన్సీఎల్టీ బెంచ్ల నుండి ఇంకా క్లియరెన్స్ పొందలేదని చెప్పింది. 2022 నాటికి ముంబై, అహ్మదాబాద్ ఎన్సీఎల్టీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. సంస్థకు చెందిన రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రో కెమికల్ ఆస్తులు మొత్తం కొత్త అనుబంధ సంస్థలోకి బదిలీ అవుతాయి. సౌదీ అరామ్కోతో ఒప్పందం అనంతరం మరింతగా ఇన్వెస్టర్ల ద్వారా కేపిటల్ సమకూర్చుకోవడానికి దోహద పడుతుందని కంపెనీ తెలిపింది. -
పురుగుల మందుతో బోండాలు.. ఇద్దరి మృతి
అరక్కోణం: తెలియక చేసిన చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. రాణిపేట జిల్లా ఎస్ఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన రైతు పెరియస్వామి (65), భార్య లక్ష్మి (57), కుమారుడు శివకుమార్ (27), కోడలు భారతి (22). పెరయస్వామి మంగళవారం రాత్రి బోండాలు చేసేందుకు మైదాపిండి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అలాగే మిరప తోటకు క్రిమిసంహారక మందు తీసుకొచ్చాడు. ఈ విషయం తెలియని కోడలు భారతి రెండూ కలిపి బోండాలు వేసింది. నలుగురూ తినడంతో కొంతసేపటికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. గ్రామస్తులు వారిని షోలింగర్ ప్రభుత్వాస్పత్రికి అనంతరం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భారతి, శివకుమార్ మృతిచెందారు. పెరియస్వామి, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అరక్కోణం తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన ఏడాదిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
వాటర్ ప్లాంట్లో విషద్రావణం
నెల్లూరు, కోవూరు: ఎదుట ఉన్న వాటర్ ప్లాంట్తో తన వ్యాపారం సక్రమంగా జరగడం లేదని ఓ ప్రబుద్ధుడు ఏకంగా మినరల్ వాటర్ ప్లాంటులో విషద్రావణం కలిపేశాడు. అయితే ప్లాంటు నిర్వాహడు ఆ వాసనను పసిగట్టి అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కోవూరులోని పెళ్లకూరు కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పెళ్లకూరు కాలనీ సమీపంలో కొంతకాలంగా కోదండరామయ్య అనే వ్యక్తి సాయిబాబ మినరల్ వాటర్ ప్లాంట్ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ సిద్ధం చేసిన తాగునీటిని అక్కడే క్యాన్లు నింపడంతో పాటు బయట ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఈ వాటర్ ప్లాంట్ సమీపంలో సుజల వాటర్ప్లాంట్ను శ్రావణ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. కాగా సాయిబాబ వాటర్ ప్లాంట్ కారణంగా తన ప్లాంటు సక్రమంగా జరగడం లేదని శ్రావణ్ కోదండరామయ్యపై అక్కసు పెంచుకొన్నాడు. సమయం కోసం వేచిచూస్తున్న అతను మంగళవారం అర్ధరాత్రి విషద్రావణం(పెనాయిల్,యాసిడ్ మిశ్రమం)ను వాటర్ ట్యాంక్ పైపుల ద్వారా కలిపేశాడు. బుధవారం కోదండరామయ్య కుమారుడు ప్లాంటు వద్దకు వచ్చి శుభ్రం చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో వాసన రావడంతో అనుమానం వచ్చి ప్లాంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా అర్ధరాత్రి వేళలో బైక్పై వచ్చిన శ్రావణ విషద్రావణాన్ని పైపుల్లో కలపడం స్పష్టంగా కనిపించింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా గతంలో కూడా ఇదేవిధంగా రెండుసార్లు శ్రావణ్ తమ ప్లాంటుకు చెందిన విద్యుత్ వైర్లను కట్ చేశాడని బాధితులు పోలీసులకు తెలిపారు. దీంతో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సీహెచ్ కృష్ణారెడ్డి సీసీ ఫూటేజీలను పరిశీలించి నిందితులపై కేసు నమెదు చేశారు. అలాగే సుజల వాటర్ప్లాంట్ను సీజ్ చేశారు. -
రక్త పరీక్ష..శిక్ష
ఎవరైనా అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళితే రక్త పరీక్షలు చేసి.. ఫలితం ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తారు. ఇక సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు.. జ్వరపీడితులకు రక్తపరీక్షలు తప్పనిసరి. రోజూ 2 వేల ఓపీ ఉండే అనంతపురం సర్వజనాస్పత్రిలో రక్త పరీక్షలు సకాలంలో చేయడం లేదు. రక్త పరీక్ష నిర్వహించేందుకు రూ.లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్లు తెచ్చినా వాటినిి వాడే కెమికల్స్ లేకపోవడంతో సిబ్బంది మాన్యువల్గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రక్త పరీక్షల ఫలితం ఆలస్యమవుతుండగా.. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందక అల్లాడిపోతున్నారు. ఈ చిత్రంలోని బాలిక పుట్టపర్తి మండలం నిడిమామిడికి చెందిన సాహితి. నవంబర్ నెలలో డెంగీతో సర్వజనాస్పత్రిలో చేరింది. వెంటనే రక్త పరీక్ష చేయాల్సి ఉన్నా.. సెల్కౌంటర్ పనిచేయకపోవడంతో సిబ్బంది వైద్య పరీక్షలు వాయిదా వేశారు. చివరకు చిన్నారి ప్లేట్లెట్ కౌంట్ 30వేలకు తగ్గిపోవడంతో టెక్నీషియన్లు స్పందించి పరీక్షలు చేశారు. చిన్నవార్డులోనే రోజూ 200 మందికిపైగా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమయం సరిపోకపోవడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర సమయంలో కీలకం కానున్న రక్త పరీక్షల నివేదికలు అందక వైద్యులు కూడా సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రి.. జిల్లా వాసులందరికీ పెద్ద దిక్కు. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక్కడికే పరుగున వస్తారు. అందుకే ఇక్కడ రోజూ 2 వేల మంది ఔట్పేషంట్లు, 1,300 మంది ఇన్పేషంట్లు ఉంటున్నారు. డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో దాదాపుగా వెయ్యి మందికి వివిధ రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసమే పెథాలజీ విభాగంలో రక్తపరీక్షల కోసం రూ.20 లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్ మిషన్లు(హెమటాలజీ అనలైజర్) తెప్పించారు. కానీ సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. కెమికల్స్ లేవన్న కారణంతో ఐదు నెలలుగా వాటిని మూలకుపెట్టారు. దీంతో వివిధ వార్డుల్లో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. సెల్కౌంటర్ సేవలు ఇలా... సెల్కౌంటర్ మిషన్ ద్వారా ప్లేట్లెట్స్, టీసీ, డీసీ, సీబీపీ, హెచ్బీ తదితర పరీక్షలు నిమిషాల్లో చేయవచ్చు. ఈ మిషన్ ద్వారా చేసే పరీక్షలు దాదాపుగా 500 వరకు ఉంటాయి. ఫలితం కూడా వేగవంతంగా అందుతుంది. దాన్నిబట్టి పరిస్థితి విషమించిన రోగులను ఇతర ఆస్పత్రులకు పంపడమో, లేదా మెరుగైన వైద్యం అందించడమో చేయవచ్చు. కానీ సెల్కౌంట్ మిషన్లు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డు, ఎఫ్ఎం, ఎంఎం, చెస్ట్, ఆర్థో, గైనిక్ తదితర వార్డుల్లో టెక్నీషియన్లు మాన్యువల్గా పరీక్షలు చేస్తున్నారు. వివిధ వార్డుల్లో రక్తపూతలు తీయడానికే గంటల సమయం వ్యవధి పడుతోంది. రక్తపూతలు తీసిన వెంటనే వారే మాన్యువల్గా పరీక్షలు చేయడానికి కనీసం రెండు గంటల సమయం పడుతోంది. దీంతో ఫలితం ఆలస్యమవుతుండగా.. వైద్య సేవల్లోనూ జాప్యం జరుగుతోంది. పోని ప్రైవేట్గా రక్త పరీక్షలు చేయించాలంటే రూ.300 నుంచి రూ.400 ఖర్చు అవుతుంది. సర్వజనాస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఇది మరింత భారంగా మారింది. పనిభారంతో పరీక్షలు వాయిదా.. సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో రెండు యూనిట్లు ఉన్నాయి. సెల్కౌంట్ మిషన్లు అందుబాటులో లేక ఒక్కోరోజు ఒక్కో యూనిట్ చొప్పున టెక్నీషియన్లు మాన్యువల్గా పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఇక శనివారం, ఆదివారం వస్తే రక్త పరీక్షలకు మూడ్రోజుల సమయం పట్టే పరిస్థితి నెలకొంది. రక్త పరీక్ష ఫలితం వచ్చే వరకూ వైద్యులూ సరైన చికిత్స అందించలేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చిన్నపిల్లల వార్డులోనే కాదు.. ఆస్పత్రిలోని ఎంఎం, ఎఫ్ఎం, ఆర్థో, చెస్ట్, ఓపీ, గైనిక్ తదితర విభాగాల్లో రక్త పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనిభారంతో టెక్నీషియన్లు రక్తపరీక్షలు వాయిదా వేస్తుండటంతో రోగులకు ప్రాణసంకటంగా మారింది. అందుబాటులోకి రావాలంటే.. సెల్కౌంటర్ మిషన్లు అందుబాటులోకి రావాలంటే కెమికల్స్ కావాల్సి ఉంది. సెల్కౌంటర్ మిషన్లో 8 రకాల కెమికల్స్ను వినియోగిస్తారు. వాటికోసం ప్రతి నెలా రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది రెండు మినీ సెల్కౌంటర్ మిషన్లను సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీర్లు ల్యాబ్లలో ఎలక్ట్రికల్, ఏసీ తదితర పనుల్లో జాప్యం చేశారు. దీంతో వాటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఆస్పత్రి యాజమాన్యం మేలుకుని రూ.లక్షలు విలువ చేసే సెల్కౌంటర్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. కెమికల్స్కు ఆర్డరిచ్చాం కెమికల్స్ లేకపోవడంతో సెల్కౌంటర్ మిషన్లను ఉపయోగించడం లేదు. కెమికల్స్కు ఆర్డర్ ఇచ్చాం. త్వరలోనే కెమికల్స్ వస్తాయి. ప్రస్తుతం అందుబాటులో రెండు మినీ సెల్కౌంటర్ మిషన్లున్నాయి. వాటి ద్వారా రక్త పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రామస్వామి నాయక్,ఆస్పత్రి సూపరింటెండెంట్ రక్తనమూనాలు సేకరిస్తున్న టెక్నీషియన్ -
‘రసాయన’ రోడ్డు ప్రయోగం విఫలం
గన్నవరం (కృష్ణా): అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గన్నవరంలో ప్రయోగత్మకంగా చేపట్టిన ‘కెమికల్ సాయిల్ స్టెబిలైజేషన్’ రోడ్డు నిర్మాణం విఫలమైంది. గ్రావెల్, మెటల్ అవసరం లేకుండానే.. టాప్ సీల్ కెమికల్ను వినియోగించి మట్టిని గట్టిపరచడం ద్వారా తక్కువ ఖర్చుతో రహదారుల నిర్మాణం చేసే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో విజయవంతమైన ఈ టెక్నాలజీకి ఇక్కడ మాత్రం ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ పద్ధతిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6.45 కోట్లు కేటాయించింది. అమెరికాకు చెందిన టాప్ సీల్ కెమికల్ తయారీ సంస్థ టెర్రా పేబ్తో కలిసి కడపకు చెందిన కృష్ణప్ప మినరల్ సంస్థ ఈ రోడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. పది రోజులకే తూట్లు తొలుత ప్రయోగాత్మకంగా గన్నవరంలోని జాతీయ రహదారి నుంచి మర్లపాలెం వరకు రెండు కిలోమీటర్ల పొడవున రూ.40 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి రెండు నెలల కిందట శంకుస్థాపన చేశారు. దీనికి అవసరమైన టాప్ సీల్ కెమికల్ను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. నెల రోజుల కిందట ప్రయోగాత్మకంగా 90 మీటర్ల పొడవున నిర్మాణం చేపట్టారు. రోడ్డును ఆరు అంగుళాల లోతున దున్ని దానిపై నీటిలో కలిపిన కెమికల్ చల్లుతూ గ్రావెల్తో చదును చేశారు. ఈ విధంగా నాలుగు, ఐదు రోజుల్లో మూడుసార్లు కెమికల్ స్ప్రే, రోలింగ్ చేయడం ద్వారా మట్టిని గట్టిపరిచారు. ఈ పనులను అమెరికాకు చెందిన టెర్రా పేబ్ కంపెనీ ప్రతినిధి గ్యారీ నిల్సన్, ఆస్ట్రేలియాకు చెందిన నిపుణుడు చార్లెస్, నిర్మాణ సంస్థకు చెందిన అంజప్ప పర్యవేక్షించారు. ఆశించిన ఫలితం రాక అయితే, కెమికల్ సాయిల్ స్టెబిలైజేషన్ పద్ధతిలో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం చివరకు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 90 మీటర్ల పొడవున వేసిన రోడ్డు పైభాగంలో మట్టి గట్టి పడలేదు. ఫలితంగా రోడ్డు పైపొర (లేయర్) వాహనాల తాకిడికి క్రమంగా దెబ్బతింటోంది. రోడ్డు నిర్మాణం సంతృప్తికరంగా లేకపోవడంతో పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ టెక్నాలజీతో నిర్మించిన రోడ్డు పదేళ్ల పాటు చెక్కుచెదరదని నిపుణులు చెప్పినప్పటికీ, పది రోజులకే దెబ్బతినడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి మట్టి స్వభావం కారణంగానే అనుకున్న రీతిలో నిర్మాణం జరగలేదని కాంట్రాక్ట్ సంస్థ చెబుతోంది. ఈ పద్ధతిలో ఇక్కడ రోడ్ల నిర్మాణానికి అవసరమైన సాంకేతికత, యంత్ర పరికరాలు లేకపోవడం, నేల స్వభావం వల్ల అనుకున్న మేర సక్సెస్ కాలేకపోయామని నిపుణులు పేర్కొంటున్నారు. లోపాలను సవరించి మరోసారి నిర్మాణ పనులు పునఃప్రారంభిస్తామని చెబుతున్నారు. అయితే, పనుల కొనసాగింపుపై పంచాయతీరాజ్ అధికారులు మాత్రం పూర్తిస్థాయి నమ్మకం వ్యక్తం చేయడం లేదు. సంతృప్తికరంగా రాలేదు ప్రయోగత్మకంగా కెమికల్ సాయిల్ స్టెబిలైజేషన్ పద్ధతిలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో నిర్మాణ సంస్థ తాత్కాలికంగా పనులను నిలిపివేసింది. పనుల కొనసాగింపుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – ఎ.వెంకటేశ్వరరావు, డీఈ, పంచాయతీరాజ్ -
అంధత్వం వచ్చే ప్రమాదం..?
గాజువాక: పెదగంట్యాడ స్వతంత్రనగర్ (ఎస్టీ కాలనీ)లో విష రసాయన విలయ తాండవాని కి ఊరు మొత్తం వల్లకాడుగా మారుతోంది. పక్కనే ఉన్న జీవీఎంసీ డంపింగ్ యార్డులో లభించిన రసాయనాన్ని సారాగా భావించి తాగడంతో బాధితులు ఒక్కొక్కరిగా మృత్యువాత పడుతున్నారు. ఆదివారం నాటికి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి మరో నలుగురు మృతి చెందడంతో ఆ సంఖ్య ఏడుకు చేరింది. మరో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసుల సమాచారం. ఈ సంఘటనతో కాలనీలో పలు కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయి. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన కుటుంబ సభ్యులు విష రసాయనాన్ని సేవించి విగత జీవులుగా మారుతుండటంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. తాజాగా కాలనీకి చెంది న ఆసనాల రమణమ్మ, ఆసనాల చిన్నోడు, వాడపల్లి అంకమ్మ మృతి చెందడంతో కాలనీ మొత్తం విషాదంలో మునిగిపోయింది. అప్పలమ్మ మృతదేహం వెలికితీత ఈ దుర్ఘటనలో మృతి చెందిన పెండ్ర అప్పలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాజువాక పోలీసులు సోమవారం వెలికితీశారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేసిన విషయం తెలిసిందే. సంఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు ఆమె మృతదేహాన్ని తవ్వి తీయించారు. గాజువాక తహసీల్దార్ జేమ్స్ ప్రభాకర్ సహకారంతో పంచనామా జరిపించారు. సౌత్ ఏసీపీ ప్రవీణ్ కుమార్, గాజువాక సీఐ కె.రామారావు, ఇంటెలిజెన్స్ సీఐ తిరుమలరావు, ఎస్ఐ అప్పలరాజు తదితరులు కాలనీలో పర్యటించి వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. మరోవైపు ఇక్కడి లేబొరేటరీ సామర్థ్యం సరిపోవడంలేదని, అందువల్ల ఆ రసాయనాన్ని హైదరాబాద్లోని లేబొరేటరీకి పంపుతున్నామని గాజువాక ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎక్సై జ్ డైరెక్టర్ హరికుమార్, జాయింట్ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ నాయుడు, డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాసరావు, సహాయ కమిషనర్ ఎం.భా స్కరరావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్, సీఐలు ఎల్.ఉపేంద్ర, ఆర్.జైభీమ్ తదితరులు మృతుల కుటుంబాలను కలుసుకొని వివరాలు సేకరించారు. కాలనీవాసుల దినచర్య, వారి ఆహార అలవాట్లు, మద్యం అలవాట్లపై వివరాలను సేకరించారు. బాధితులను ఆదుకోండి పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): స్పిరిట్ తాగి ఏడుగురు మరణించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు అన్నారు. కేజీహెచ్ రాజేంద్రప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మృతుల కు టుంబాలకు నష్టపరిహారంగా రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన స్థలం జీవీఎంసీ పరిధిలో ఉన్నా జీవీఎంసీ కమిషనర్, ఇతర అధికారులు బాధితులను పరామర్శించేందుకు రాకపోడం అన్యాయమన్నారు. కలెక్టర్ సాయం ప్రకటించలేదన్నారు. గిరిజనుల పట్ల ప్రభుత్వం ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఈ సంఘటనతో తేటతెల్లం అవుతోందని తెలిపారు. గాజువాకలో జనావా సాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ను ఊరికి దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు భద్రత లేకుండా పోతోందన్నారు. బతుకుతెరువు కోసం డంపింగ్ యార్డ్లో కాగితాలు ఏరుకునే స్థితికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి సరైన ఆర్థిక భద్రత లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటన చోటుచేసుకుందన్నారు. మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం ఆసరా కల్పించాలని కోరారు. గిరిజనుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తే సహించేది లేదన్నారు. జరిగిన సంఘటనకు ప్రభుత్వంతో పాటు జీవీఎంసీ కూడా బాధ్యత వహించి బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం పరిస్థితి విషమంగా ఉన్న బాధితుల నలుగురినీ ఒకే మంచం మీద కూర్చోబెట్టి ఫ్లూయిడ్స్ను ఎక్కించిన నర్సులు... బాధితుడు ఆసనాల ఎర్రోడి చేతి నుంచి రక్తం కారిపోతున్నా పట్టించుకోని సిబ్బంది... సకాలంలో సరైన వైద్యం అందించాలని కోరితే ఈసడింపులు.కేజీహెచ్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పట్టే సంఘటనలివి.. అది మిథనాలేనా? బాధితులు తాగిన రసాయనం మిథనాల్ (మిథైల్ ఆల్కాహాల్) అని ఎక్సైజ్ ల్యాబ్లో జరిపిన ప్రాథమిక పరీక్షల్లో తేలినట్టు కేజీహెచ్కు ఇచ్చిన నివేదికలో తెలిపారు. ఇది ప్రమాదకరమైనదని, కానీ మద్యంలో ఇథైల్ ఆల్కాహాల్ ఉంటుందని, అది ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఇది ఏ రసాయనమన్నది నిగ్గు తేల్చేందుకు ఎక్సైజ్ అధికారులు హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సోమవారం రాత్రి పంపారు. అలాగే పోలీసులు కూడా రసాయన శాంపిల్ను ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. అంధత్వం వచ్చే ప్రమాదం మిథనాల్ రసాయనాన్ని సేవించిన వారికి ప్రాణాపాయమే కాదు.. భవిష్యత్తులో పూర్తిగా అంధత్వం సంభవించే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హైడ్రోజన్ కంటెంట్ బాగా పెరిగి గుండెపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా రక్తపోటు స్థాయి పడిపోయి షాక్కు గురై చనిపోతారని కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. వైద్య పరిభాషలో దీనిని మెటబాలిక్ ఎసిరోసిస్ అంటారన్నారు. డయాలసిస్ ద్వారా శరీరంలోని మిథాల్ రసాయన తీవ్రతను తగ్గించవచ్చని తెలిపారు. -
కనికరం లేని కలెక్టర్!
సాక్షి, విశాఖపట్నం / పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ఆభాగ్యులెవరైనా ఆపదలో ఉంటే పట్టించుకోవలసిన బాధ్యత ఆయనది. క్షతగాత్రులు, బాధితులకు తక్షణమే ఆదుకోవలసిన కర్తవ్యం ఆయనది. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయానికి కృషి చేయాల్సిన విధి కూడా కలెక్టర్పైనే ఉంటుంది. మరి అవేమీ పట్టించుకోకుండా, బాధిత కుటుంబాల గోడు గాలికొదిలేస్తే ఆ కలెక్టర్ను ఏమనుకోవాలి? కనికరం లేని కలెక్టర్ అని అనుకోవాలి. ఇప్పుడు మన విశాఖ కలెక్టర్ కాటమనేని భాస్కర్ను పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్లో విష రసాయనాన్ని తాగి అశువులు బాసిన గిరిజన బాధిత కుటుం బ సభ్యులు అలాగే అనుకుంటున్నారు. మానవ త లేకుండా వ్యవహరించారని ఆక్రోశిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? స్వతంత్రనగర్ ఎస్టీకాలనీలో రసాయనాన్ని తా గి ఏడుగురు గిరిజనులు మృత్యువాతపడ్డారు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో కలెక్టర్ను కలిసి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరడానికి సీపీఎం నాయకులను వెంటబెట్టుకుని వెళ్లారు. తనను కలవకుండా అరగంట సేపు బయటనే కూర్చోబెట్టారు. విషణ్ణవదనాలతో వీరంతా కలెక్టర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 11 గంటలకు చాంబర్ నుంచి బయటకు వచ్చారు. గడియారం వైపు చూపిస్తూ ‘ఇప్పుడే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. పరిహారం గురించి అడక్కండి. నేనేమీ చేయలేను. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి.. ఇక్కడ్నుంచి వెళ్లిపోండి.. ఎలక్షన్ అయ్యాక వస్తే న్యాయం చేస్తాను..’ అంటూ వెళ్లిపోబోయారు. కోడ్కు మానవత్వంతో కూడిన పరిహారానికి సంబంధం లేదని బాధిత కుటుంబీకులు, సీపీఎం నాయకులు ఆయనను ప్రాధేయపడ్డారు. అయినా కలెక్టర్ మనసు కరగలేదు. తాము 10.30 గంటలకే ఆయన్ను కలిసినప్పుడే తమ వినతిని స్వీకరించి ఉంటే ఆయన చెప్పినట్టుగా కోడ్ అడ్డంకి ఉండేది కాదని, ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ అమానవీయంగా వ్యవహరించారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరిగినప్పుడు ఇలాగే తప్పించుకుంటారా? అంటూ సీపీఎం నాయకులు సీహెచ్ నర్సింగరావు, గంగారావు తదితరులు ప్రశ్నించారు. అనంతరం వెనుతిరిగి కేజీహెచ్ మార్చురీ వద్ద తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఎన్నికల కోడ్ అడ్డమన్నారు కలెక్టరేట్కు ఉదయం 10.30 గంటలకే చేరుకున్నాం. మమల్ని కలెక్టర్ చాంబర్లోకి వెళ్లనివ్వకపోవడంతో వరండాలో వేచి ఉన్నాం. 11 గంటల సమయంలో ఆయన గది నుంచి వెలుపలకి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రకటించినందున బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడం కుదరదని, ఎన్నికలు పూర్తయిన తరువాత మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఇది చాలా అన్యాయం. – వాడపిల్లి అప్పన్న,13 జిల్లాల గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
ఏడుకు చేరిన ‘రసాయన’ మృతుల సంఖ్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖ శివారు స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీలో సారాగా భావించి రసాయనాన్ని సేవించి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఘటనలో ఆదివారం ముగ్గురు మృతిచెందగా.. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మరో 12 మందిలో సోమవారం మరో నలుగురు మృతి చెందారు. వీరిలో ఎ. చిన్నారావు (50), బి. అంకమ్మ (45), ఎ.రమణమ్మ (57), ఎ.రమణమ్మ (59) ఉన్నారు. కాగా, రసాయన మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. ప్రస్తుతం కేజీహెచ్లో 9 మంది చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి సైతం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో నెఫ్రాలజీ వార్డుకు ఇద్దరిని, ఎమర్జెన్సీ మెడికల్ విభాగానికి ఇద్దరిని తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వీరు సేవించిన రసాయనం శరీరంలో అన్ని భాగాలకు విస్తరించడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో వీరందరికీ ఐసీయూలో ఉంచి డయాలసిస్ చేస్తున్నారు. అవసరమైన వారికి వెంటిలేటర్పై వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఆసనాల ఎర్రోడు (45) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ బాధితులకు 24 గంటలూ ప్రత్యేక వైద్యం అందించడానికి డాక్టర్ జి.ప్రసాద్, డాక్టర్ ఎ.సత్యనారాయణ, డాక్టర్ జి.బుచ్చిరాజు, డాక్టర్ కె.ఇందిరాదేవితో కూడిన వైద్య నిపుణుల కమిటీని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున నియమించారు. ఐఐసీటీకి రసాయనం.. ఎక్సైజ్ అధికారులు తమ ల్యాబ్లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో బాధితులు సేవించిన రసాయనం మిథనాల్ (మిథైల్ ఆల్కహాల్)గా తేల్చారు. ఇది ప్రాణాంతకమైనదేనని కేజీహెచ్ వైద్యులు తెలిపారు. మరోవైపు మిథనాల్ వంటి రసాయనం సేవించిన వారిలో కొందరికి భవిష్యత్తులో శాశ్వత అంధత్వం కూడా రావచ్చని వైద్యులు చెప్పారు. కాగా, మరింతగా లోతైన పరీక్షల కోసం, దీనిలో ఇంకేమి రసాయనాలు కలిశాయో తెలుసుకునేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి పంపించారు. ఒకట్రెండు రోజుల్లో దీని నివేదిక రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా తమ దర్యాప్తులో భాగంగా ఈ రసాయనాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పి.హరికుమార్ ‘సాక్షి’తో చెప్పారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ హరికుమార్, జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్నాయుడు పరామర్శించారు. కనికరం లేని కలెక్టర్.. రసాయనం తాగి మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించాలంటూ బాధిత కుటుంబీకులు సోమవారం ఉదయం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కె.భాస్కర్ను కలిసేందుకు వెళ్లారు. అరగంటకు పైగా వారిని బయటే కూర్చోబెట్టారు. కలెక్టర్ 11 గంటలకు వారి వద్దకు వచ్చి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. కనీసం తమ గోడు వినకుండా, పరిహారంపై స్పందించకపోవడం దారుణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మత్తుపై ఆశ.. మృత్యు ఘోష!
మత్తు కోసం ఆశపడ్డ బడుగు జీవుల బతుకులను విష రసాయనంహాలాహలంలా దహించింది. చిత్తు కాగితాలేరుకుంటూ జీవితాన్నినడిపించే చిన్న బతుకులకు చేజిక్కిన ‘ద్రవం’ అనుకోని తీరులో విపత్తు సృష్టించింది. పెద గంట్యాడ స్వతంత్ర నగర్ కాలనీలో ఆదివారంవిషాదం కాలువకట్టి మరీ ప్రవహించింది. దొరికినదో, ఎవరిచ్చినదోకానీ.. ఆ అభాగ్యులకు దక్కిన ద్రవ పదార్థం ముగ్గురి ఆయుర్దాయాన్నిహరించింది. చేజిక్కిందే చాలని సంబరపడి, అదేమిటో కూడాతెలియకుండా గొంతు తడిచేసుకున్న అమాయక జీవులకు చివరికిఆపద సంప్రాప్తించింది. అనుకోకుండా దొరికిన క్యాన్లో ద్రవం చివరికికాలకూట విషమై.. బతుకులను కాల్చేసింది.మరో ఎనిమిది మందికి ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. సాక్షి, విశాఖపట్నం/గాజువాక: తెల్లారి లేచింది మొదలు చీకటి పడే వరకు వారికి ఒకటే తపన. ఎవరికీ అక్కర్లేని చెత్త, చెదారాన్ని వారు అక్కున చేర్చుకుంటారు. దానిపై వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాము చేపట్టిన వృత్తి దుర్భరమని తెలిసినా అందులోనే నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. రోజంతా పడ్డ శ్రమకు మత్తు నుంచి ఉపశమనం లభిస్తుందని తాగుడుకు అలవాటు పడ్డారు. ఆ అలవాటే ముగ్గురిని బలితీసుకుంది. మరికొందరిని చావుబతుకుల్లోకి నెట్టేసింది. పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీలో చోటు చేసుకున్న విషాదం వెనక మత్తు ఉండడం.. మృతుల్లో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఉండడం మరింత కలచివేసింది. ఎస్టీ కాలనీలో సంచార జాతుల తెగకు చెందిన కుటుంబాలు అధిక శాతం నివసిస్తున్నాయి. పురుషులు చిన్న చిన్న కూలిపనులు, పందుల పెంకపం వ్యాపకంగాను, మహిళలు చెత్తల్లోనుంచి విక్రయానికి ఉపయోగపడే వ్యర్థాలను సేకరిస్తుంటారు. ఈ తెగలో పురుషులతో పాటు మహిళలు కూడా మద్యం సేవిస్తుంటారు. శనివారం సాయంత్రం కాలనీకి సమీపంలో ఉన్న జీవీఎంసీ డంపింగ్ యార్డులో వ్యర్థాల సేకరణకు కోసం వెళ్లిన వాడపల్లి అంకమ్మకు అక్కడికి సమీపంలోనే పది లీటర్ల క్యాన్తో ఒక రకమైన రసాయన ద్రావకం దొరికింది. దాన్ని ఇంటికి తీసుకొచ్చిన ఆమె అందులో ఉన్నది సారా అని భావించింది. చాలా కాలం క్రితం ఈ కాలనీవాసులు నాటుసారా తెచ్చుకొని సేవించేవారు. దీంతో ఈ ద్రావకం కూడా సారా అని, దాన్ని ఎవరో అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని భావించింది. ఆ ద్రావకాన్ని శనివారం రాత్రే కాలనీలో ఉన్న తమ బంధువులు, పక్కవాళ్లకు పంచింది. సుమారు 20 మంది దానిని సేవించారు. ఆదివారం నిద్ర లేచే సమయానికి వారందరికీ కడుపులో మంట మొదలైంది. కొందరికి వాంతులయ్యాయి. రాత్రి తాగిన సారాలో పవర్ ఎక్కువగా ఉండి ఉంటుందని వారు భావించారు. వారిలో పెండ్ర అప్పలమ్మ(65) మంచంపై నుంచి లేవలేదు. ఇంట్లో కుటుంబ సభ్యులు పిలిచినా ఆమె సరిగా స్పందించకపోవడంతో మత్తు ఎక్కువై ఉంటుందని, అప్పటికే తమ ఇంట్లో ఉన్న మద్యాన్ని కూడా సేవించి ఉంటుందని భావించారు. చివరకు ఉదయం 10 గంటలు దాటినా ఆమె నుంచి చలనం లేకపోవడంతో మృతి చెందిందని నిర్ధారించి దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. మద్యం తాగడం ఆమె చివరి కోరిక అయి ఉండవచ్చని, ఇప్పుడు సారా(రసాయనం) తాగడంతో కోరిక తీరి మృతి చెందిందని భావించారు. ఈ క్రియ ముగిసేలోగా ఆమె సోదరుడు వాడపల్లి అప్పడు(50), ఆ కాలనీకి చెందిన ఆసనాల కొండోడు(64) కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆయనదీ రాత్రి తాగిన మద్యం(కెమికల్) ప్రభావమేననుకున్నారు. మరో కొద్ది సేపటికి అప్పడు పెద్ద కోడలు వాడపల్లి అంకమ్మ కూడా అస్వస్థతకు గురై వాంతులు కూడా అయ్యాయి. వాంతి నుంచి బయటకు వచ్చిన కెమికల్ పడ్డ నేల నల్లటి పొగ మాదిరిగా మారిపోవడంతో ఆమెను గాజువాకలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స మొదలైన కొద్దిసేపటికి ఆమె మామ వాడపల్లి అప్పడు(50), ఆసనాల కొండోడు (64) చనిపోయారు. వీరితో పాటు అస్వస్థకు గురైన 11 మందిని కేజీహెచ్కు తరలించారు. వీరిలో రమణమ్మ, చిన్నారావు, అంకమ్మల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విచారణ చేపట్టిన పోలీసులు ఈ సంఘటనతో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఎస్టీ కాలనీలో పర్యటించారు. మృతులు, బాధితులు సేకరించిన కెమికల్పై ఆరా తీశారు. పది లీటర్ల క్యాన్తో ఉన్న రసాయన ద్రావకంలో ప్రస్తుతం మూడు లీటర్లే మిగిలి ఉందని, ఏడు లీటర్ల ద్రావకాన్ని 11 మంది సేవించారని సౌత్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బాధితులు సేవించింది మద్యం కాదని, ఉడ్ బర్నింగ్కు ఉపయోగించే కెమికల్ అయి ఉంటుందని అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు. పూర్తి స్థాయి నివేదిక సోమవారం వస్తుందని చెప్పారు. గాజువాక సీఐ కె.రామారావు, గాజువాక ఎక్సైజ్ సీఐ ఉపేంద్ర, గాజువాక పీహెచ్సీ వైద్యాధికారి తమ సిబ్బందితో సహా కాలనీలో పర్యటించి సంఘటకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ప్రజా ప్రతినిధులు, నాయకుల పరామర్శ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఈ కాలనీలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సంఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, నాయకులు కటికల కల్పన, గండ్రెడ్డి రామునాయుడు, ఈగలపాటి యువశ్రీ, మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, రుషీ సేవా సంస్థ అధ్యక్షుడు చిక్కా సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు మంత్రి శంకరనారాయణరావు, జెర్రి పోతుల ముత్యాలు తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఉద్యోగం, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి ఎస్టీ కాలనీలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి డిమాండ్ చేశారు. కాలనీని ఆనుకొని జీవీఎంసీ డంపింగ్ యార్డు కొనసాగడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. దీనికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డును కొనసాగించాలని స్థానిక కాలనీల ప్రజలు ఏళ్ల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వం పెడచెవినపెట్టిందన్నారు. డంపింగ్ యార్డు కాలనీ పక్కన ఉండటంవల్లే ఈ ద్రావకం లభించడానికి కారణమైందన్నారు. కేజీహెచ్లో ఆర్తనాదాలు పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): గాజువాక స్వంతంత్రనగర్లో నాటుసారా అని భ్రమపడి పరిశ్రమల్లో వాడే రసాయనాన్ని తాగి అస్వస్థతకు గురైన బాధితులు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు, బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి మిన్నంటింది. ద్రవాన్ని తాగిన సుమారు 20 మందిలో ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు ద్రవం తాగిన మిగతా 11 మందిని కేజీహెచ్కు తరలించారు. వీరిలో ఆసనాల కొండయ్య(60) మార్గమధ్యలో చనిపోయాడు. ఆసనాల చిన్న(58), ఆసనాల రమణమ్మ(59) పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందిస్తున్నారు. మిగతా ఎనిమిది మంది బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున తెలిపారు. ఆస్పత్రికి వచ్చిన కలెక్టర్ కాటమనేని భాస్కర్ బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆయన ఆదేశించారు. పోలీసు, ఎక్సైజ్ అధికారులతో ఘటనపై విచారణ చేపడతామని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితులు తాగింది మద్యం కాదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పరిశ్రమల్లో వాడే రసాయనంగా అనుమానిస్తున్నామని, పరీక్ష నిమిత్తం ద్రవాన్ని ల్యాబ్కు పంపామని, సోమవారం ఉదయానికి పూర్తి సమాచారం తెలుస్తుందని చెప్పారు. కేజీహెచ్లో చికిత్సపొందుతున్న వారి వివరాలు 1.ఎ.ఎర్రొడు (50) 2.ఎ.అప్పన్న (22) 3.ఎ.చినఅప్పన్న (25) 4.పి.చిన్న (32) 5.పి.చిన అప్పన్న (32) 6.ఎ.చిన్నారావు (58)..పరిస్థితి విషమం 7.ఎ.అప్పన్న (40) 8.ఎ.రమణమ్మ (59)..పరిస్థితి విషమం 9.ఎ.రమణమ్మ (55) 10.ఎ.దుర్గయ్య (31) 11. అంకమ్మ(50) పరిస్థితి విషమం డంపింగ్ యార్డ్లో దొరికింది.. సుమారు 20 లీటర్లున్న క్యాన్ శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో డంపింగ్ యార్డ్లో దొరికింది. దాన్ని నాటుసారా అనుకుని సుమారు 20 మంది వరకూ తాగారు. అదే రోజు రాత్రి కూడా తాగిన ముగ్గురు చనిపోయారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. స్పిరిట్ కాదు. వాసన లేకపోవడంతో నాటుసారా అనుకునే మా వాళ్లంతా తాగారు.– ఆసనాల ఆనంద్,బాధిత కుటుంబానికి చెందిన యువకుడు -
హైదరాబాద్లో మల్టిసోర్బ్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్లో అమెరికాకు చెందిన మరో కంపెనీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కెమికల్, ఫార్మా రంగాల్లో అవసరమైన ఆక్సిజన్, తేమ ప్యాకేజింగ్ ఉత్పత్తులను తయారు చేసే మల్టిసోర్బ్.. జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్ (జీహెచ్ఏఎస్ఎల్)లో దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ప్లాంట్ నిర్మాణం, తయారీ యంత్రాలు ఇతరత్రా వాటి కోసం తొలి దశలో రూ.44 కోట్ల పెట్టుబడులు పెట్టామని.. ప్రస్తుతం ఈ కేంద్రంలో 35 మంది ఉద్యోగులు పనిచేస్తారని మల్టిసోర్బ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఎరిక్ అర్మీనట్ తెలిపారు. గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఫిల్ట్రేషన్ గ్రూప్ జీఎం లక్ష్మికాంత్ కైటాన్, సీఓఓ మిచెల్ లిప్పాలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికాలో రెండు తయారీ కేంద్రాలున్నాయని.. యూఎస్ తర్వాత తొలి తయారీ కేంద్రం హైదరాబాద్లోనే ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్లాంట్లో రసాయన, ఫార్మా, మెడికల్ డివైజ్ రంగాలకు అవసరమైన మినిపాక్స్, స్ట్రిప్పాక్స్, ఇంటెలిసోర్బ్, స్టాబిలాక్స్ యాక్టివ్ ప్యాకేజ్ ఉత్పత్తులను తయారు చేస్తామని చెప్పారు. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30 కోట్ల ప్యాకేజ్లుంటుందని.. ఏడాదిలో 100 కోట్ల ప్యాకేజ్లకు పెంచుతామని ఆయన చెప్పారు. త్వరలోనే ఆర్అండ్డీ కూడా ఇక్కడికే.. ప్రస్తుతం దేశీయ కంపెనీలకు అవసరమైన ఉత్పత్తులను అమెరికాలో తయారు చేసి విమానాలు, సముద్ర మార్గాల ద్వారా ఎగుమతి చేస్తున్నాం. కానీ, ఇక నుంచి ఆయా ఉత్పత్తులను హైదరాబాద్ కేంద్రంలోనే తయారు చేస్తాం. త్వరలోనే పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (ఆర్అండ్డీ) కూడా ఇక్కడికే తరలిస్తామని ఎరిక్ తెలిపారు. 2 ఎకరాల్లోని ఈ తయారీ కేంద్రాన్ని జీఎంఆర్ ఏవియేషన్ సెజ్ నిర్మించిందని.. 38 ఏళ్ల పాటు లీజింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. హెల్త్కేర్, ఫుడ్ అండ్ బేవరేజెస్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ప్యాకేజ్డ్ ఆక్సిజన్, తేమ ఉత్పత్తులను అందించే ఫిల్ట్రేషన్ గ్రూప్ అనుబంధ సంస్థే ఈ మల్టిసోర్బ్ కంపెనీ. గత ఆర్ధిక సంవత్సరంలో ఫిల్ట్రేషన్ గ్రూప్ టర్నోవర్ 125 మిలియన్ డాలర్లు. ఇందులో 10 శాతం ఇండియా వాటా ఉంటుందని.. డాక్టర్ రెడ్డిస్, అరబిందో, సన్ఫార్మా వంటి దేశంలోని ప్రముఖ 60 కంపెనీలు మా క్లయింట్గా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఏఎస్ఎల్ హెడ్ సౌరభ్ జైన్ కూడా పాల్గొన్నారు. -
కెమికల్ డబ్బా పేలి ఒకరి మృతి
నిజామాబాద్: మృత్యువు ఏ రూపంలోనైనా ముంచుకు రావచ్చనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ఫిల్టర్బెడ్ వద్ద పేలుడు సంభవించి ఓ వ్యక్తి మృతిచెందాడు. కాలం చెల్లిన కెమికల్ డబ్బాను భూమిలో పాతిపెడుతుండగా అది పేలింది. ఈ సంఘటనలో ఔట్ సోర్సింగ్ కార్మికుడు భూమేష్ మృతిచెందాడు. తిరుపతి రెడ్డి అనే మరో కార్మికుడికి గాయాలయ్యాయి. భూమేష్ మృతదేహం తునాతునకలు అయింది. -
కంటి ఆపరేషన్ ఇష్టం లేక..
ఎమ్మిగనూరురూరల్: కంటి ఆపరేషన్ చేయించుకోవటం ఇష్టం లేని ఓ వ్యక్తి రసాయన మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు పెద్దరంగన్న వివరాల మేరకు.. పట్టణంలోని వెంకటాపురం కాలనీ చెందిన నేదిబొట్టు నాగన్న(65)కు నెల రోజుల కిత్రం ఇంట్లో పడుకొని ఉండగా కంట్లో పురుగు పడింది. అప్పటి నుంచి కన్నును బాగరాపిడి చేయటంతో కంటి సమస్య మొదలైంది. కుమారులు పట్టణంలోని కంటి వైద్య నిపుణులు డాక్టర్ హేమంత్కుమార్ దగ్గరకు తీసుకెళ్లారు. కంటికి ఇన్ఫెక్షన్ అయిందని ఆపరేషన్ చేయాలని లేకపోతే మరో కన్నుకూడా కోల్పోవాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు. అయితే తన రెండు కన్నులు పోయినా ఫర్వాలేదని, తాను ఆపరేషన్ చేయించుకోనని నాగన్న మెండికేశాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో కుటుంబసభ్యులు తెలిసిన చోటల్లా వెతికినా ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో ఆదివారం బనవాసి ఏపీ గురుకుల పాఠశాల ప్రహారీ వద్ద మద్యం సీసాలో రసాయన మందు కలిపి సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వచ్చిన కూలీలు గమనించి మృతుడి కుమారులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈమేరక కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ పేర్కొన్నారు. -
ఎవరిదీ పాపం
- రసాయనిక వ్యర్థాల ఫలితం ... బాలికకు శాపం - వేలల్లో వైద్య ఖర్చులు ... ముందుకు రాని యాజమాన్యాలు - అభం,శుభం తెలియని చిన్నారి నరకయాతన కాళ్లు కాలుస్తున్న కెమికల్ వ్యర్థాలు బీచ్ రోడ్డుపై యథేచ్ఛగా డంపింగ్ అనారోగ్యాల బారిన ప్రజలు చోద్యం చూస్తున్న అధికారులు ఎవరో చేసిన నిర్లక్ష్య వ్యవహారానికి పన్నెండేళ్ల బాలిక నరక యాతన అనుభవిస్తోంది. పారిశ్రామిక వ్యర్థాలను తిరుగాడే ప్రదేశాల్లో పారబోయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ బీచ్ రోడ్డులో సూర్యారావు పేట సమీపంలో ఉండే రెండు రసాయనిక పరిశ్రమలు తమ వ్యర్థాలను ఆరుబయటే పారేస్తుండడం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ నెల 8వ తేదీన తన స్నేహితులతో అటుగా వెళ్లిన ఈ బాలిక రెండు కాళ్లు కాలిపోయాయి. ఏదో చిన్నదేలా అనుకునే సమయంలోనే మోకాలి వరకు బొబ్బలెక్కడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటి వరకు సంబంధిత యాజమాన్యం బాధ్యత తీసుకోలేదు. వైద్య ఖర్చుల కోసం వేల రూపాయలవుతోందని...పేద కుటుంబం ... ఎలా ముందుకు సాగేదని వాపోతోంది ఆ బాలిక తల్లిదండ్రులు. సూర్యారావుపేట (కాకినాడ రూరల్) : పారిశ్రామిక, ఆయిల్ రిఫైనరీల వ్యర్థాలను నిర్వాహకులు బీచ్ రోడ్డులో డంపింగ్ చేయడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక పక్క పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యంతో తీరప్రాంత గ్రామాల ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుంటే మరో పక్క కెమికల్ వ్యర్థాలను బీచ్రోడ్డు, ఖాళీగా ఉన్న నివాస స్థలాల వద్ద పారవేయడంతో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు. డంపింగ్ యార్డుగా బీచ్రోడ్డు.. కాకినాడ రూరల్ మండల పరిధిలోని తీరప్రాంత గ్రామం సూర్యారావుపేటలో సుమారు 5,600 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ నివసించేవారందరూ మత్స్యకారులు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం తీరప్రాంతానికి ఆనుకుని సూర్యారావుపేట, వాకలపూడి, పెనుమర్తి పంచాయతీల పరిధిలో తీరానికి ఆనుకుని సుమారు 18 ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలు, క్రూడ్ ఆయిల్ మరిగిస్తున్న ఫ్యాక్టరీ, చక్కెర తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో ఆయిల్ రిఫైనరీ, క్రూడాయిల్ మరిగించడానికి, ఘగర్ తయారు చేసిన తర్వాత వచ్చిన కెమికల్ వ్యర్థాలను ఫ్యాక్టరీలు నిబంధనల మేరకు నిల్వ చేయకుండా, నేరుగా కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి బీచ్రోడ్డులో ఆరుబయట పారబోయిస్తున్నారు. ముఖ్యంగా బీచ్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలు పోలవరం, నేమాం, సూర్యారావుపేట, శివాలయం, సూర్యారావుపేట లైట్ హౌస్ సమీపాన రాత్రి, తెల్లవారుజామున స్థానికుల సంచారం లేని సమయాల్లో వ్యర్థాలను తీసుకువచ్చి పారబోస్తున్నారు. దీంతో బీచ్రోడ్డులో రాకపోకలు సాగించే సమయంలో వ్యర్థాల నుంచి వస్తున్న ధూళి, దుర్వాసనకు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా వేస్తున్న వ్యర్థాలపై మోటార్బైక్లపై వెళ్తున్న ప్రజలు జారిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘగర్ వ్యర్థాలతో ప్రమాదాలు.. ఘగర్ వ్యర్థాలతో వాహనచోదకులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఘగర్ నుంచి వచ్చిన వ్యర్థ ఊటను నిర్వాహకులు ట్యాంకర్లతో తీసుకొచ్చి బీచ్రోడ్డు, నేమాం, పోలవరం రహదారులపై పారబోస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పోలవరం, నేమాంలకు చెందిన ప్రయాణీకులు బైక్పై నుంచి జారి పడిన ఘటనలో ముగ్గురు గాయాలబారిన పడ్డారు. పి.రమేష్,పోలవరం. కాళ్లు కాలిపోతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాలను ప్యాక్టరీలో నిల్వ చేయకుండా, ట్యాంకర్లతో బయటకు తీసుకొచ్చి బీచ్రోడ్డు, ఖాళీస్థలాల్లో పారబోస్తున్నారు. కంపెనీ నిర్వాహకులు స్థానికుల కంట పడకుండా తెల్లవారుజాము సమయంలో కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్లతో తీసుకొచ్చి లైట్హౌస్ సమీపాన ఖాళీ స్థలంలో వేస్తున్నారు. బూడిద, మట్టి రంగులో ఉంటున్న రసాయన వ్యర్థాల్లో పొరపాటున నడిస్తే కాళ్లు కాలిపోయి, చర్మం అంతా ఎలర్జీ వస్తోంది. ఎస్.సత్తిబాబు, తమ్మవరం. నా కుమార్తె రెండు కాళ్లు కాలిపోయాయి నాకుమార్తె మరియ స్నేహితులతో కలసి బయటకు వెళుతున్న సమయంలో బూడిద రంగులో ఉన్న మట్టిలో నడవడంతో రెండు కాళ్లూ తీవ్రంగా కాలిపోయాయి. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా రూ.30 వేలు వ్యయమవుతాయని వైద్యులు తెలిపారు. కెమికల్ వ్యర్థాలు ఇక్కడ వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. మర్రి శ్రీను, బాధితురాలి తండ్రి, సూర్యారావుపేట. ఘగర్ వ్యర్థాలతో ప్రమాదాలకు గురవుతున్నాం ఘగర్ కంపెనీ నిర్వాహకులు ఘగర్ కోసం వినియోగించిన వ్యర్థాలను తీసుకొచ్చి నేమాం–పోలవరం రోడ్డు వేసేస్తున్నారు. ఘగర్ నుంచి వచ్చిన నూనెలా ఉన్న మడ్డును తీసుకొచ్చి రోడ్డుపై పారబోయడం వల్ల తెల్లవారుజామున బైక్లపై వెళ్తున్నవారు జారిపోయి కిందపడడం వల్ల నలుగురు వాహనచోదకులు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయమై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఎం.రమణ, తమ్మవరం. విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటా కెమికల్ వ్యర్థాలను బీచ్రోడ్డులో పారబోయడంపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటా. పారిశ్రామిక వ్యర్థాలను ఆరు బయట వేయరాదు. ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్న నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తాం. రవీంద్రబాబు, ఈఈ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రమణయ్యపేట. -
తప్పిన పెనుముప్పు
ఆర్టీసీ బస్ను ఢీ కొట్టిన కెమికల్ ట్యాంకర్ 18 మంది ప్రయాణికులకు గాయాలు క్షతగాత్రులకు తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స ఇద్దరి పరిస్థితి విషమం : కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు ట్యాంకర్ బోల్తా పడడంతో రోడ్డుపై ప్రవహించిన కెమికల్ కెమికల్ తెట్టుపై జారిపడిన వాహనచోదకులు గంటన్నర సేపు ట్రాఫిక్ నిలిపివేత కెమికల్ మండకుండా నీరు, ఫోమ్ వెదజల్లిన ఫైర్ సిబ్బంది అన్నవరం : అన్నవరం శివారులోని మండపం జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్ను టైల్స్ క్లీనింగ్ కెమికల్ ట్యాంకర్ ఢీ కొన్న ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆంబులెన్స్లో తుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్ను ఢీ కొట్టి ట్యాంకర్ బోల్తా పడ్డంతో కెమికల్ అంతా జాతీయ రహదారిపై ప్రవహించింది. దీంతో రోడ్డంతా ఆ కెమికల్ తెట్టుతో జిగురుగా అయిపోవడంతో వాటి మీద నుంచి మోటార్ సైకిల్ మీద ప్రయాణించిన ఇద్దరు జారిపోయి పడిపోయారు. దానికితోడు కెమికల్ మండే స్వభావం కలిగినది కావడంతో పోలీసులు సుమారు గంటన్నర సేపు జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేశారు. తుని నుం చి ఫైర్ ఇంజిన్ను రప్పించి సిబ్బంది సాయంతో నీటి ద్వారా, ఆ పై ఫోమ్ ద్వారా ఆ తెట్టును తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. అయి తే అప్పటికీ జిగురు తగ్గక వాహనాల ప్రయాణానికి ఇబ్బందిగా ఉండడంతో రహదారిపై ఇసుక చల్లి వాహనాలు నడిపారు. ప్రమాదం ఎలా జరిగిందంటే... తుని నుంచి రాజమండ్రి వెడుతున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్ (ఏపీ 05 జెడ్ 0037) ఉదయం పది గంటల సమయంలో అన్నవరం గ్రామంలోకి వచ్చేందుకు జాతీయరహదారిని దాటుతుండగా, విశాఖపట్నం వైపు వెళుతున్న కెమికల్ ట్యాంకర్ బలంగా ఢీ కొట్టిం ది. దీంతో బస్ మధ్యభాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్ కూడా 20 మీటర్లు ముందుకు పోయి టెలిఫోన్ స్తంభం అడ్డుకోవడంతో ఆగిపోయింది. స్తంభం అడ్డుకోక పోతే బస్ రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడి పోయేది. నిర్లక్ష్యమే కారణమా.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కెమికల్ ట్యాంకర్ వేగాన్ని తక్కువ అంచనా వేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్, బస్ను వేగంగా రోడ్డు దాటించేయచ్చని నడపడంతో ఈ ప్రమా దం జరిగిందని చెబుతున్నారు. మరి కొంతమందైతే రోడ్డు క్రాసింగ్ అని కూడా చూడకుండా ట్యాంకర్ డ్రైవర్ చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ వచ్చి ఢీ కొ ట్టాడని తెలిపారు. తుని ఏరియా అస్పత్రిలో చికిత్స ప్రమాదంలో గాయపడిన 16 మందికి తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన చంటిబాబు, బద్దర్రావు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. అన్నవరం ఎస్ఐ పార్థసారధి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చేయి అడ్డు పెట్టినా ఆపలేదు అన్నవరం గ్రామంలోకి వచ్చేందుకు జాతీయ రహదారి దాటుతుండగా ట్యాంకర్ డ్రైవర్ అత్యంత వేగంగా దూసుకువచ్చి బస్ను ఢీ కొట్టాడని బస్ డ్రైవర్ ఏసు చెప్పాడు. అప్పటికీ కెమికల్ ట్యాంకర్ను ఆగమని తాను చేతితో సైగ చేసినా ఆపకుండా వచ్చి ఢీ కొట్టాడని తెలిపాడు. బస్ ప్రమాదానికి గురైన సమయంలో బస్లో 20 మంది వరకూ ప్రయాణికులు, అన్నవరం డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులకు ఆర్టీసీ పరిహారం తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎనిమిది మందికి ఆర్టీసీ తరుపున పరిహారం అందజేసినట్లు తుని ఆర్టీసీ డిపో మేనేజర్ రామకృష్ణ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ స్వల్ప గాయాలైనవారికి రూ.500, తీవ్ర గాయాలైనవారికి రూ.వేయి అందజేశామన్నారు. నలుగురు ప్రయాణికులు మాత్రం పరిహారం తీస్కునేందుకు నిరాకరించారని తెలిపారు. నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలవడంతో వారు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వెళ్లిపోయారని తెలిపారు. ఇద్దరికి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారని, అక్కడ వారికి కూడా పరిహారం అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని, డ్రైవర్ నిర్లక్ష్యం మని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. తునిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులు కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన 18 మందిలో 12 మందికి తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. వీరి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారని వారు తెలిపారు. -
కర్నూలులో భారీ అగ్నిప్రమాదం
-
శివా టెక్కు!
అగ్నిమాపక శాఖ అనుమతి లేని ఫ్యాక్టరీ - భారీ అగ్నిప్రమాదంతో వెలుగులోకి.. - దట్టమైన పొగలతో కర్నూలు ఉక్కిరిబిక్కిరి – ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న డాక్టర్లు – నష్టం అంచనా రూ.4 కోట్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగరాన్ని కమ్మేసిన దట్టమైన పొగల వెనుక చీకటి కోణం ఆశ్చర్యం కలిగిస్తోంది. శ్రీ రాయలసీమ ఆల్కాలీస్ అండ్ అల్లైడ్ కెమికల్స్(ఎస్ఆర్ఏఏసీఎల్)కు సమీపంలోని శివటెక్ ఇండస్ట్రీస్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ తయారీ యూనిటైన ఈ శివటెక్ ఇండస్ట్రీస్ కనీసం అగ్నిమాపకశాఖ నుంచి అనుమతి కూడా తీసుకోలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలను అదుపు చేసేందుకు అవసరమైన పరికరాలు సదరు కంపెనీలో లేవు. ఈ కారణంగా మంటలు వ్యాపించి వెంటనే అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడింది. ఎంతో విషతుల్యమైన ఈ రసాయనాల కంపెనీకే అగ్నిమాపకశాఖ అనుమతి లేదంటే.. ఇక మిగిలిన కంపెనీల పరిస్థితి ఏమిటో తలచుకుంటేనే గుండెల్లో దడ పుడుతోంది. మొత్తం మీద శివటెక్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంతో సదరు కంపెనీకి సుమారు రూ.4 కోట్ల మేరకు నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. అయితే, అంతకుమించి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆరేళ్లుగా వ్యాపారం శివ గ్రూపునకు చెందిన శివటెక్ ఇండస్ట్రీ.. ఎస్ఆర్ఏఏసీఎల్కు చెందిన 2.5 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుంది. గొందిపర్ల గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 62/ఏ, పార్ట్–2లో రబ్బరు, ప్లాస్టిక్, పెయింట్స్లో ఉపయోగించే సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్(క్లోరినేటెడ్ పారాఫిన్స్ వ్యాక్స్) తయారీ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఢిల్లీకి చెందిన ఈ కంపెనీ కోటి రూపాయల అధీకృత మూలధనంతో 23 మార్చి 2009లో శివటెక్ ఇండస్ట్రీస్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్లాంటులో నవంబర్ 2011లో ఉత్పత్తి ప్రారంభమయ్యింది. అంటే సుమారు ఆరేళ్లుగా వ్యాపారం చేస్తోంది. రూ.95 లక్షల పెయిడప్ కేపిటల్గా ఉన్న ఈ కంపెనీకి డైరెక్టర్లుగా కసీస్ నెన్వానీ, శివకుమార్ నెన్వానీ, అమిత్ నెన్వానీలు వ్యవహరిస్తున్నారు. అయితే, కనీసం ఫైర్ అనుమతి తీసుకోకుండానే ప్రమాదకరమైన రసాయనాలతో కంపెనీ ఎలా నడుస్తుందో అర్థంకాని పరిస్థితి. ఏదైనా స్కూలు, కాలేజీ పెట్టాలంటేనే కచ్చితంగా అగ్నిమాపకశాఖ(ఫైర్ డిపార్టుమెంట్) నుంచి అనుమత తీసుకోవాలనే నిబంధన ఉంది. అలాంటిది అగ్నిమాపకశాఖ అనుమతి లేకుండానే కంపెనీ నడిపిస్తున్నారంటే.. మిగిలిన పరిశ్రమల పరిస్థితి తలచుకుంటేనే భయాందోళన నెలకొంటోంది. ఆరోగ్యంపై పెనుప్రభావం వాస్తవానికి ఈ కంపెనీ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నుంచి సీఎఫ్ఓ అనుమతి తీసుకుంది. అగ్నిప్రమాదం నేపథ్యంతో తలెత్తిన మంటలతో ఎంత మేర కాలుష్యం వ్యాపించిందనే విషయం లెక్కగట్టేందుకు పీసీబీ సిబ్బంది కూడా అక్కడకు వెళ్లి ఆరా తీస్తున్నారు. వీవోసీ అనలైజర్ ద్వారా కాలుష్యాన్ని లెక్కగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ లెక్కలు తెలితే దాని ప్రభావం ఇంకా ఎంత ఉంటుందనే అంశం తేలనుందని వైద్యనిపుణులు అంటున్నారు. క్లోరినేటెడ్ పారాఫిన్స్ వ్యాక్స్ తయారీ అత్యంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో లీకు కాకుండా చూసుకోవాలి. అయితే, ఇక్కడ కాస్తా అగ్నిప్రమాదం జరగడంతో...ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా కళ్లు మండటంతో పాటు చర్మ వ్యాధులకూ దారితీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తలెత్తిన ఈ ప్రమాదం భారీగా ఉన్న నేపథ్యంలో కేవలం కళ్లు, చర్మ వ్యాధులతో పాటు శ్వాసకోశ సంబంధ వ్యాధులూ వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
‘దివీస్’ అనుమతులు రద్దు చేయాలి
తుని : తీరప్రాంత ప్రజల జోవనోపాధికి హాని కలిగించే దివీస్ మందుల పరిశ్రమ మంజూరు చేసిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం రోడ్డులోని సాదీఖానాలో దివీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్), వ్యవసాయ కూలీ సంఘం, గిరిజన సంఘం, బాధిత గ్రామాలకు చెందిన పెద్దలు హాజరయ్యారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దువ్వా శేషు బాబ్జి మాట్లాడుతూ దానవాయిపేట పంచాయతీ పరిధిలో దివీస్ లాబొరిటీస్ నిర్మాణం చేపట్ట కూడదని హైకోర్టు స్టేటస్ కో జారీ చేసినా పట్టించుకోకుండా పనులు చేపడుతున్నారన్నారు. తక్షణమే పనులు నిలిపివేయాలన్నారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా కొనసాగిస్తున్న 144 సెక్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గం సభ్యుడు బుగతా బంగార్రావు, రాష్ట్ర రైతు కూలి సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ దివీస్ పరిశ్రమను తరలించాలని ఈ నెలాఖరున సంతకాల సేరకణ చేపట్టి సీఎం, గవర్నర్లకు అందజేస్తామన్నారు. రెవెర్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. బాధిత గ్రామాల నుంచి వచ్చిన నాయకులు మట్ల ముసలయ్య, తొండంగి మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీవిశ్వేశ్వరరావు ప్రజల కష్టాలను వివరించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేసుకట్ల సింహాచలం, రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి మాను లచ్చ బాబు, కె. జనార్దన్, రాపా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నానో ఫ్యాక్టరీ వద్దేవద్దు
నంద్యాల: పాణ్యం మండలం కొండజూటూరు పరిసరాల్లో తలపెట్టిన శాంతిరాం నానో కెమికల్ ఫ్యాక్టరీ వద్దేవద్దని కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల సిద్ధారెడ్డి అన్నారు. గ్రామస్తుల ఆందోళనకు మద్దతుగా కిసాన్ సంఘ్, నంది రైతు సమాఖ్య, రైతు సంఘాల సమాఖ్య గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా సిద్ధారెడ్డి మాట్లాడుతూ పండ్లను మాగబెట్టడానికి కెమికల్స్ వాడకాన్ని నిషేధించిన ప్రభుత్వం ఇలాంటి ఫ్యాక్టరీకి ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో కిసాన్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు ఎర్రబోలు ఉమామహేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, రాయలసీమ జలసాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి, హరినాథరెడ్డి పాల్గొన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి.. కొండజూటూరు గ్రామ ప్రజల అభిప్రాయాలను గౌరవించి నానో ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సీపీఐ డివిజన్ కార్యదర్శి మస్తాన్వలి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నంద్యాల ప్రాంతంలో మూతపడ్డ స్పిన్నింగ్ మిల్లు, చక్కెర ఫ్యాక్టరీలను ప్రారంభించాలని కోరారు. -
ప్రకతి వ్యవసాయమే మేలు..
భూతల్లిని కాపాడుకోవాలి రసాయన ఎరువులు తగ్గించాలి ప్రకతి వ్యవసాయదారుల సమావేశం తీర్మానం జగిత్యాల అగ్రికల్చర్ : భూతల్లి ఆరోగ్యాన్ని కాపాడడమే రైతుల లక్ష్యం కావాలని ప్రకతి వ్యవసాయదారుల సమావేశం తీర్మానించింది. మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామంలోని రిటైర్డ్ ఎంఈవో అశోక్కుమార్ తోటలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రకతి వ్యవసాయదారుల శిక్షణ సమావేశం సోమవారం జరిగింది. రసాయన ఎరువులు వాడడంతో భూములు ఎలా పనికి రాకుండా పోతున్నాయని, ప్రకతి సిద్ధమైన వ్యవసాయాన్ని చేయడంతో కలిగే ఉపయోగాలపై ప్రయోగాత్మకమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రకతి వ్యవసాయం చేస్తున్న రిటైర్డ్ ఎంఈవో అశోక్కుమార్ మాట్లాడుతూ ప్రకతిలో లభించే ఆకులు వంటి వ్యర్థాలతో ఖర్చులేకుండా వ్యవసాయం చేయవచ్చని చెప్పారు. విపరీతంగా రసాయన ఎరువులు వేయడంతో కర్బన శాతం తగ్గుతుందని తెలిపారు. దీన్ని పెంచేందుకు లెగ్యూమ్ జాతికి చెందిన జనుము, జీలుగ, పెసర్లు, కందులు, మినుములు, ఉలువలు, పిల్లి పెసర, అనుములు, అలసంద, అడవి అనుప మొక్కలను పెంచి 40 రోజుల తర్వాత వేళ్లు భూమిలోనే ఉంచి పంటను కోసి పొలంలో వేయాలని కోరారు. భూమిలో సూక్ష్మజీవులను పెంచేందుకు వర్మీకంపోస్టు, ఘనా జీవామతం, సప్తధాతువుల మిశ్రమాన్ని సమద్ధిగా అందించాలని కోరారు. ఒక లీటర్ దేశీ ఆవు మూత్రం, కొంచెం ఆవుపేడ, మురిగిన పండ్ల గుజ్జు లేదా బెల్లంతో ద్రావకం తయారుచేసిన ద్రావణంలో విత్తనాలను శుద్ధిచేసిన తర్వాతనే భూమిలో నాటాలని కోరారు. దీంతో మొక్క రోగనిరోధక శక్తితో ఆరోగ్యవంతంగా ఉండి తెగుళ్లు ఆశించకపోవడంతో పంటల దిగుబడి ఖర్చు తగ్గుతుందని వివరించారు. వర్మీకంపోస్టును పంటలకు నేరుగా వాడకుండా నీడకు పోసి అందులో తెగుళ్లను అదుపు చేసే ట్రైకోడెర్మా ఫంగస్ను కలుపడంతో జీవామతం, ఆకుల కషాయం కలిపి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. ఆకులే కాకుండా చేపలు, కోళ్ల వ్యర్థాలు, కోడిగుడ్ల పెంకులు, జంతువుల ఎముకలతోనూ ఘన జీవామతం తయారు చేసుకుని పంటలకు పిచికారీ చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ప్రకతి వ్యవసాయం నిర్వాహకుడు భాస్కర్ పదిరే తదితరులు పాల్గొన్నాడు. నెలకు రూ.2లక్షల ఉద్యోగం వదులుకుని.. –అపర్ణ, మహబూబ్నగర్ అమెరికాలో నెలకు రూ.2 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని పాలేకర్, సహజ సిద్ధమైన వ్యవసాయం చేస్తున్నా. గ్రామంలో రైతులందరు విపరీతంగా రసాయన మందులు వేస్తున్నా దిగుబడి గిట్టుబాటు అయ్యేది కాదు. అందుకే చాలాసార్లు చెప్పి చూశా. అమెరికాలో ఉన్న అమ్మాయి ఏమైనా చెబుతుంది అనుకునేవారు. దీంతో రైతులను మార్చేందుకు నేనే స్వయంగా ప్రకతి వ్యవసాయాన్ని చేయడం మొదలుపెట్టా. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు జగిత్యాలకు వచ్చా. స్టాఫ్వేర్ సంస్థను వద్దనుకుని.. –క్రాంతి, రామాయం పేట, మెదక్ నలుగురు మిత్రులం స్టాఫ్వేర్ సంస్థను నెలకొల్పితే మంచి లాభాలు వచ్చాయి. అయితే ఏసీ గదుల్లో జీవితం నచ్చలేదు. అందుకే నలుగురం కలిసి 40ఎకరాలను కొని రసాయన ఎరువులు వేయకుండా ప్రకతి సిద్ధమైన వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయంలోనే తప్తిగా ఉన్నామన్న భావన కలుగుతోంది. ఎకరాకు 80 డ్రమ్ముల పసుపు దిగుబడి – రాజశేఖర్, ఆదిలాబాద్ జిల్లా పాలేకర్, ప్రకతి సిద్ధమైన వ్యవసాయం చేయడంతో గతేడాది పసుపులో ఎకరానికి 80 డ్రమ్ముల పసుపు దిగుబడి వచ్చింది. ఈ పద్ధతిలో ఖర్చును 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకోగలిగా. ఈ పద్ధతి చేసేందుకు రైతులకు ఓపిక ఉండాలి. అప్పుడే రెండు, మూడేళ్లలో విజయాలు కనబడతాయి. -
లైసెన్స్ రద్దు చేయమన్నా.. స్పందించరేం!
కర్నూలు(అగ్రికల్చర్): నిబంధనలకు విరుద్ధంగా పురుగుమందుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న హైదరాబాద్ కెమికల్స్ లైసెన్స్ రద్దు చేయాలని అంతర్జిల్లా స్క్వాడ్ సూచనలను వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదు. కర్నూలులో అంతర్ జిల్లా స్క్వాడ్ రెండు రోజుల పాటు ఎరువులు, పురుగుమందుల దుకాణాలు, విత్తన కంపెనీలను తనిఖీ చేసింది. హైదరాబాద్ కెమికల్స్ పురుగుమందుల కంపెనీ నెల రోజుల క్రితం వరకు నంద్యాల కేంద్రంగా వ్యాపారాన్ని చేపట్టింది. ఇటీవలనే కర్నూలుకు వ్యాపారాన్ని మార్చింది. ఇందుకు అనుగుణంగా లైసెన్స్ తీసుకున్నారు. అయితే ప్రిన్స్పుల్ సర్టిఫికెట్లో కర్నూలు గోదామును చూపకుండా నంద్యాల పేరుతోనే వ్యాపారం నిర్వహిస్తుండటాన్ని స్క్వాడ్ అధికారులు తప్పు పట్టారు. గోదాములో ఉన్న కోటి రూపాయల విలువ చేసే పురుగుమందుల అమ్మకాలను నిలిపివేస్తు లైసెన్స్ను కూడ రద్దు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. అదే విధంగా కర్నూలు కొత్త బస్టాండు సమీపంలోని రాజశేఖర్రెడ్డి ఫర్టిలైజర్లో లైసెన్స్లో మూడు కంపెనీల ఎరువుల అమ్మకాలకు ఓ పామ్ ఇంక్లూజన్ లేకపోవడంతో రూ.46 లక్షల విలువ ఎరువుల అమ్మకాలను నిలిపివేవారు. ఈ షాపు ౖలñ సెన్స్ రద్దు చేయాలని స్క్వాడ్ ఆదేశించింది. మరో షాపు లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించింది. వ్యవసాయాధికారులు హైద్రాబాద్ కెమికల్స్ లైసెన్స్తో పాటు షాపుల లైసెన్స్లు రద్దు చేయడానికి చొరవ చూపడం లేదు. -
భారీగా పెరిగిన రసాయన ఎరువుల వినియోగం
– ఇప్పటికే 1,22,615 టన్నుల వాడకం – ఎరువుల ఖర్చు రూ.110 కోట్లపైనే – 34 శాతం భూముల్లోనే పంటలు సాగు – ఇంకా సాగుకు నోచుకోని వరి కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 10శాతం వరకు పెరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు జిల్లాలో 1,22, 615 టన్నుల ఎరువుల విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఒక్క ఎరువులపైనే రైతులు రూ.110.35 కోట్లు వ్యయం చేసినట్లు లెక్క. ఖరీఫ్ సీజన్కు 3,32,054 టన్నుల ఎరువులు అవసర మవుతాయి. అయితే గత ఏప్రిల్ 1 నాటికి జిల్లాలో 1,46,279.24 టన్నులు నిల్వ ఉండగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 1,03,395.4 టన్నుల వచ్చాయి. మొత్తంగా 2,49,674.64 టన్నుల ఎరువులుండగా 1,22, 615 టన్నులు అమ్మకం జరిగింది. ఇందులో అత్యధికంగా కాంప్లెక్స్ ఎరువులు 58,509.75 టన్నులు వినియోగించారు. యూరియా 54,233.05 టన్నులు, డీఏపీ 7,175.08 టన్నులు, ఎంఓపీ 5,977.3 టన్నులు, ఎస్ఎస్పీ 1,164.46 టన్నుల ప్రకారం వినియోగించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2.14 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అంటే కేవలం 34శాతం భూముల్లో సాగైన పంటలకే ఇంత భారీగా ఎరువులు వినియోగించడం గమనార్హం. పూర్తిస్థాయిలో పంటలు సాగైతే ఎరువుల వినియోగం ఎంతమేరకు చేరుతుందోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రకతి వ్యవసాయంపై ఆసక్తి కరువు.. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల పెట్టుబడి వ్యయం పెరిగిపోయిన రైతులు నష్టపోతున్న నేపథ్యంలో ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ప్రకతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తోంది. అయితే ఖరీఫ్ సీజన్లో రెండు నెలలు దాటకుండానే ఇంతలా రసాయన ఎరువుల వినియోగం నమోదుకావడాన్ని బట్టి ప్రకతివ్యవసాయ విధానాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదని స్పష్టమవుతోంది. -
బురదతో మహిళల హోలీ!
హోలీ అంటే రంగుల పండుగ. పసుపు, గులాబి, ఎరుపు, ఆకుపచ్చ.. ఇలా సప్తవర్ణాలు ముఖాల మీద పులుముకొని ఆడుకోవడం మనకందరికీ తెలుసు. కానీ ఒకే ఒక్క రంగుతో హోలీ ఆడటం ఎప్పుడైనా చూశారా? అది కూడా బురదతో!! అవును.. రాజస్థానీ మహిళలు హోలీని చాలా విభిన్నంగా చేసుకున్నారు. కెమికల్ రంగులతో పాటు ఆర్గానిక్ రంగులు కూడా అక్కర్లేదని చెబుతూ.. ప్రకృతి వైద్య చికిత్సగా భావించే మడ్ బాత్ను తలపించేలా బురద మట్టితో స్నానాలు చేస్తూ హోలీ పండుగను నిర్వహించారు. అందరికీ భిన్నంగా మట్టిని స్విమ్మింగ్ పూల్ గా మార్చుకొని హోలీ సంబరాలు జరుపుకున్నారు. ప్రకృతి చికిత్సా విధానంలో చర్మవ్యాధులు, చుండ్రు వంటి వ్యాధులను తగ్గించేందుకు, శరీరంలోని మలినాలను తొలగించేందుకు బురదతో చికిత్స అందిస్తుంటారు. రేగడి మట్టిని మెత్తగా బురదలా చేసి తలనుంచి పాదాల వరకూ పట్టించి, ఆరిన తర్వాత స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా వేసవిలో శరీరంలోని ఉష్ణతాపం వల్ల వచ్చే చెమట, మలినాలు బయటకు వచ్చి, చర్మవ్యాధులుంటే నశిస్తాయి. ప్రస్తుతం ఉదయపూర్ మహిళలు ఇదే పద్ధతిని హోలీతో రంగరించారు. చిన్నా పెద్దా కేరింతల మధ్య బురదలో మునిగితేలారు. -
కూల్డ్రింక్ అనుకుని..
కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. నంద్యాల మండలం పాండురంగాపురంలో చిన్నారులు కూల్డ్రింక్ అనుకుని ఇంట్లో ఉన్న పురుగుమందు తాగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలో ఓ రైతుకు ఆరేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు హిమజ, హేమశ్రీ ఉన్నారు. వారు మంగళవారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ బాటిల్లో కనిపించిన పురుగుమందు తాగారు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి ఇద్దరినీ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. -
భౌతిక, రసాయన శాస్త్ర బోధనా లక్ష్యాలు
విద్యార్థి ప్రవర్తనలో తీసుకురావాల్సిన వాంఛనీయ మార్పులను లక్ష్యాలంటారు. ‘‘యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్’’.. గమ్యం నుంచి ఉద్దేశం, దాన్నుంచి లక్ష్యం ఆవిర్భవిస్తాయని పేర్కొంది. సెకండరీ స్థాయిలో విజ్ఞానశాస్త్ర బోధన.. మేధస్సుకు సంబంధించినది, ఉన్నత విద్యకు సిద్ధపరిచేదిగా ఉండాలని కొఠారి కమిషన్ పేర్కొంది. జ్ఞానరంగంలోని లక్ష్యాలు-6; భావావేశరంగంలోని లక్ష్యాలు-5;మానసిక చలనాత్మరంగంలోని లక్ష్యాలు-5. విద్యార్థి ఓల్టుమీటరుకు, అమ్మీటర్కు మధ్య భేదాలను గుర్తించాడు.. అతడు సాధించిన లక్ష్యం- అవగాహన. అభ్యసన అనుభవాలు రెండు రకాలు. ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ: నాటకీకరణ, అనుభవాలు; పరోక్ష అనుభవానికి ఉదాహరణ: పోస్టర్లు. బోధనా లక్ష్యాలకు ప్రాతిపదిక విద్యా లక్ష్యాలు. అభ్యసన ఫలితాల్లో కనిపిస్తూ విద్యార్థుల వికాసానికి ప్రతీకలుగా నిలిచేవి స్పష్టీకరణలు. లక్ష్యాలు స్పష్టీకరణలు ద్వారా నెరవేరుతాయి. జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు- జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించుట. ‘దోషాలు సరిదిద్దుతాడు’.. అనే స్పష్టీకరణ అవగాహన లక్ష్యానికి చెందినది. విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని, అవగాహనను కొత్త పరిస్థితులకు అన్వయించడం అనేది వినియోగం అనే లక్ష్యం. జరగబోయే ఫలితాన్ని ఊహించి చెప్పడం అనేది వినియోగం లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. వేగంగా, స్పష్టంగా, కచ్చితంగా ఒక పని చేయడాన్ని నైపుణ్యం అంటారు. జ్ఞానాత్మక రంగంలో ముఖ్యమైన లక్ష్యాలు- జ్ఞానం, అవగాహన, వినియోగం. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ముఖ్యమైన లక్ష్యం- వినియోగం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం మూల్యాంకనం. నైపుణ్యాలను సాధించడంలో అత్యున్నత పాత్ర పోషించేంది అనుకరణ. అంతర్గత ప్రేరణతో ప్రారంభమయ్యేది అనుకరణ. విద్యార్థి ప్రయోగాలు చేసేటప్పుడు, పరిశీలనలు జరిపేటప్పుడు కచ్చితంగా రీడింగులు తీసుకోవడం సునిశితత్వం. ఒక విద్యార్థి ఆమ్లాలు, క్షారాల మధ్య భేదాలను గుర్తించాడు. అతడు సాధించిన లక్ష్యం అవగాహన. ‘ప్రాగుక్తి చేస్తారు’.. అనేది వినియోగం లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. అభ్యసనం అంటే శాశ్వత ప్రవర్తనా మార్పు. మూలకాలను లోహాలు, అలోహాలుగా వర్గీకరిస్తే విద్యార్థి సాధించిన లక్ష్యం అవగాహన. విద్యార్థి శాస్త్ర సంబంధ మ్యాగజైన్లను చదివిన అతను సాధించిన లక్ష్యం అభిరుచి. విషయానికి, అభ్యాసకునికి మధ్య జరిగే పరస్పర ప్రతిచర్యను ఏమంటారు- అభ్యసనానుభవం. సంకేతాలు పరోక్ష రకపు అనుభవాలు. ఉత్తమ లక్షణాన్ని వ్యక్తపరిచే స్థితిని వైఖరి అంటారు. ప్రాక్టీస్ బిట్స్ 1.విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలు? ఎ) లక్ష్యాలు బి) స్పష్టీకరణలు సి) ఆశయాలు డి) వైఖరులు 2.విశాల పరిధి, దృక్పథాన్ని కలిగి ఉండేవి? ఎ) లక్ష్యాలు బి) ఆశయాలు సి) విలువలు డి) స్పష్టీకరణలు 3.విద్యార్థుల అధ్యయనాన్ని నియంత్రించేవి? ఎ) లక్ష్యాలు బి) ఆశయాలు సి) విలువలు డి) ఎ, సి 4.బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించినవారు? ఎ) ఈశ్వరీభాయి పటేల్ బి) మహాత్మాగాంధీ సి) కొఠారి కమిషన్ డి) మొదలియార్ కమిషన్ 5. ఉద్దేశించిన ఆశయం దేన్ని చేరేందుకు ఉపకరిస్తుంది? ఎ) గమ్యం బి) లక్ష్యం సి) స్పష్టీకరణ డి) విద్యా ప్రణాళిక 6.లక్ష్యాలు లేకుంటే ఏ ప్రక్రియ నిరుపయోగమవుతుంది? ఎ) బోధన బి) అభ్యసన సి) ఎ, బి డి) అభ్యసన అనుభవం 7.కొఠారి కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం? ఎ) 1952 బి) 1960 సి) 1964 డి) 1988 8.జ్ఞానాత్మక రంగంలో మూడో లక్ష్యం? ఎ) అవగాహన బి) వినియోగం సి) విశ్లేషణ డి) మూల్యాంకనం 9. మానసిక చలనాత్మక రంగంలోని మొదటి లక్ష్యం? ఎ) అనుకరణ బి) హస్తలాఘవం సి) సునిశితత్వం డి) ఉచ్ఛారణ 10. విద్యార్థి సరైన సాక్ష్యాలు లేనప్పుడు తన నిర్ణయాన్ని నిలిపేస్తాడు అనే స్పష్టీకరణ లక్షణం? ఎ) అవగాహన బి) నైపుణ్యం సి) అభిరుచి డి) శాస్త్రీయ వైఖరి 11. ఒక విద్యార్థి కాపర్ సల్ఫేట్, పొటాషియం డైక్రోమేట్ వంటి రసాయనాలను గుర్తించిన అతను సాధించిన లక్ష్యం? ఎ) జ్ఞానం బి) అవగాహన సి) వినియోగం డి) నైపుణ్యం 12. ఒక విద్యార్థి సాంద్రత, సాపేక్ష సాంద్రతల మధ్య తేడాలను గుర్తించిన సాధించిన లక్ష్యం? ఎ) జ్ఞానం బి) అవగాహన సి) వినియోగం డి) నైపుణ్యం 13. గురుత్వ త్వరణాన్ని నిర్వచించగల విద్యార్థి సాధించిన లక్ష్యం? ఎ) నైపుణ్యం బి) జ్ఞానం సి) అవగాహన డి) కృత్యం 14. ఒక విద్యార్థి ఓమ్ నియమాన్ని నిరూపించే సర్క్యూట్ లో దోషాలను కనుగొన్నాడు..అతను సాధించిన లక్ష్యం? ఎ) జ్ఞానం బి) అవగాహన సి) వినియోగం డి) నైపుణ్యం 15. ప్రయోగానంతరం గ్రాఫ్లు గీసి, వివరాలను గ్రాఫ్ ద్వారా క్రోడీకరించిన విద్యార్థులు సాధించిన లక్ష్యం? ఎ) జ్ఞానం బి) అవగాహన సి) అన్వయం డి) అభిరుచి 16. విద్యార్థి జీవశాస్త్ర సంబంధ పదాలను, భావనలను, సిద్ధాంతాలను పోల్చి చూస్తాడు అనే స్పష్టీకరణకు లక్ష్యం? ఎ) అన్వయం బి) అభిరుచి సి) జ్ఞానం డి) అవగాహన 17.భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యం? ఎ) ప్రతిస్పందించడం బి) వ్యవస్థాపన సి) విలువకట్టడం డి) శీల స్థాపన 18. భావావేశ రంగంలో మూడో లక్ష్యం ఏమిటి? ఎ) ప్రతిస్పందించటం బి) వ్యవస్థాపన సి) విలువ కట్టడం డి) శీల స్థాపన 19. జ్ఞానాత్మకరంగంలోని అత్యున్నత లక్ష్యం ఏమిటి? ఎ) అవగాహన బి) విశ్లేషణ సి) సంశ్లేషణ డి) మూల్యాంకనం 20. భావావేశ రంగంలోని లక్ష్యాలు ఎన్ని? ఎ) 5 బి) 4 సి) ఆరు డి) ఏడు 21.‘వర్గీకరణ’ దేనికి సంబంధించిన స్పష్టీకరణ? ఎ) జ్ఞానం బి) నైపుణ్యం సి) వినియోగం డి) అవగాహన సమాధానాలు 1) సి; 2) బి; 3) ఎ; 4) బి; 5) ఎ; 6) సి; 7) సి; 8) బి; 9) ఎ; 10) డి; 11) ఎ; 12) బి; 13) సి; 14) బి; 15) డి; 16) డి; 17) డి; 18) సి; 19) డి; 20) ఎ; 21) డి. -
ట్రినిటీ ఏసీ క్యాంపస్లో విద్యార్థులకు అస్వస్థత
-
వేప నూనెతో ఎన్నో ప్రయోజనాలు
వేపనూనె... వేప పిండి... ఇవి రెండూ రైతులకు సుపరిచితమే. వీటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపైనా అవగాహన ఉంది. అయితే వినియోగంలో మాత్రం అంతగా చొరవ చూపడంలేదు. వేపనూనె వినియోగిస్తే పైరును చీడపీడలు ఆశించవు. రసాయన మందుల వాడకం తగ్గుతుంది. సాగు ఖర్చులు కలిసొస్తాయి. వేపనూనె వినియోగం, దాని వల్ల కలిగే ప్రయోజనాలు కంకిపాడు ఏవో లంక శ్రీనివాస్ మాటల్లో.. వేపనూనెలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చేదుగా ఉంటుంది. దీనిని వాడితే మొక్కలు కూడా చేదెక్కుతాయి. దీని వల్ల మొక్కలను తినేందుకు పురుగులు ఆశించవు. వేప నూనె, వేపపిండి వినియోగిస్తే పైరులను ఆశించే చీడపీడలను నివారించొచ్చు. దీంతో పురుగు మందుల వినియోగం ఖర్చు తగ్గుతుంది. వేపనూనె ద్వారా పంటకు అవసరమైన చేవ సమృద్ధిగా అందుతుంది. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గడంతో రైతుకు పెట్టుబడులపై వ్యయం ఆదా అవుతుంది. గతంలో వేపనూనె వినియోగం తక్కువగా ఉండేది. ప్రస్తుతం రైతుల్లో అవగాహన పెరగటంతో వినియోగం కొద్దిగా పెరిగింది. వేపనూనె వినియోగం, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. - కంకిపాడు ఇలా వాడుకోవాలి.. వేప నూనెను పంట పొలంలో నేరుగా కానీ, యూరియా, పురుగు మందుల్లో కానీ కలిపి వినియోగించాలి. పంట ఏదైనా సరే, ఏ సమయంలో నైనా వేప నూనె వాడితే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, పురుగు మందు, సూక్ష్మధాతు మిశ్రమాల్లో వేపనూనె కలిపి వాడుకోవచ్చు. యూరియా 50 కిలోల బస్తాకు అర లీటరు నుంచి లీటరు వరకూ వేప నూనె, వేప పిండి అయితే 50 కిలోల బస్తాకు 10 కిలోల వరకూ కలిపి వాడుకోవాలి. యూరియా భూమిలో త్వరగా కరిగిపోకుండా చూస్తుంది. నత్రజని మొక్కకు ఎక్కువ సమయం అందే విధంగా చూడటం వేప నూనె ద్వారానే సాధ్యం. నత్రజని వృథా కాకుండా నిరోధిస్తుంది. పంటలకు కీడుచేసే పురుగు సంతతిని నివారిస్తుంది. పురుగుకు చెందిన గుడ్లు పొదగకుండా వాటిని నిర్వీర్యం చేయటంలో దోహదపడుతుంది. దీని వల్ల అధికంగా పురుగు మందులు వినియోగించాల్సిన అవసరం ఉండదు. వేప నూనె వాడకంతో నత్రజని ఎరువులు వినియోగం తగ్గుతుంది. వ్యవసాయ పెట్టుబడుల్లో ఖర్చులో 20 శాతం, పురుగు మందుల వినియోగం ఖర్చులో 40 శాతం తగ్గుతుంది. నత్రజని వృథా కాకుండా ఉండటమే కాకుండా, మొక్క చేదు ఎక్కటం వల్ల పురుగు వ్యాప్తి నిరోధించటానికి దోహదపడుతుంది. పండ్ల తోటల్లో వినియోగం ఇలా.. పండ్ల తోటల్లో అయితే వేప నూనెను చిన్న ప్లాస్టిక్ సంచుల్లో నింపి మొక్క వేరుకు తగిలించాలి. వేరు ద్వారా నూనె మొక్కకు నేరుగా చేరుతుంది. దీని వల్ల పురుగును నివారించుకోవచ్చు. గానుగ నుంచి తెచ్చిన వేప పిండి పండ్ల తోటలకు పనికిరాదు. వేపనూనెనే వినియోగించాలి. అరటి, పసుపు, కంద, మిర్చి తోటల్లో ఆముదపు పిండి, గానుగ పిండి, పొగాకు పిండితో పాటుగా వేప పిండి కలిపి చల్లుకుంటే పంటకు ఉపయుక్తంగా ఉంటుంది. మొక్క ఎదుగుదలకు, పురుగు నియంత్రణకు పిండి దోహదపడుతుంది. వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై వేపనూనె అందిస్తుంది. లీటరు రూ.100 చొప్పున విక్రయిస్తోంది. వేప పిండి మాత్రం వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా లేదు. బయటి మార్కెట్లో 40 కిలోల వేప పిండి బస్తా రూ.600 నుంచి రూ.800 వరకూ ధర పలుకుతోంది. లంక శ్రీనివాస్ 88866 13370 -
పరిశ్రమలతో పొంచి ఉన్న ప్రమాదం
ఏయూలోని జాతీయ సదస్సులో మంత్రి ‘గంటా’ ఆందోళన త్వరలో సేఫ్టీ అడిట్ చేయించనున్నట్టు వెల్లడి పోర్టు కాలుష్యాన్ని నియంత్రించాలని సూచన ఏయూ క్యాంపస్ : నగరం చుట్టూ ఉన్న ఎన్టీపీసీ, స్టీల్ప్లాంట్, ఫార్మా, కెమికల్ పరిశ్రమలతో ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వీటిపై త్వరలో సేఫ్టీ అడిట్ చేయిస్తామని వెల్లడించారు. పోర్టు కాలుష్యాన్ని సైతం నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖ నగరం బాంబ్పై కూర్చున్నట్టుగా దర్శనమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో సోమవారం ‘పర్యావరణంపై ఉద్గారాలు, మలిన పదార్థాల ప్రభావం’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. పరిశ్రమల స్థాపన ద్వారా సాధించే ప్రగతికంటే ప్రజారోగ్యమే ప్రధానమన్నారు. చిన్నపాటి మానవ తప్పిదాలు ప్రాణాలను హరిస్తున్నాయని, దీనిని ఇటీవల ప్రమాదాలే స్పష్టం చేశాయన్నారు. విశాఖను గ్రీన్ సిటీగా మలిచే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనాన్నరు. పచ్చదనం పెంచితేనే నిర్మాణ అనుమతులు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ గ్రీన్హౌస్ గ్యాస్లు, విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రభావం మానవుని ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయన్నారు. సదస్సు చైర్మన్ ఆచార్య పి.ఎస్.అవధాని మాట్లాడుతూ సదస్సుకు 102 పరిశోధన పత్రాలను విభిన్న అంశాలపై సమర్పించనున్నట్టు తెలిపారు. సమస్యను గుర్తించడం, విశ్లేషించడం, పరిష్కారాలను చూపడం సదస్సు ఉద్దేశంగా పేర్కొన్నారు. స్టీల్ప్లాంట్ డెరైక్టర్(ప్రాజెక్ట్స్) పి.సి.మహాపాత్రో మాట్లాడుతూ తమ పరిశ్రమలో 90 శాతం వ్యర్థాలను పునర్వినియోగం చేస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమలో 43 శాతం పైగా హరితవనంగా చేశామన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రత్యేక సంచికను మంత్రి విడుదల చేశారు. ఆదికవి నన్నయ వర్సిటీ వీసీ పి.జార్జి విక్టర్, జేఎన్టీయూ కాకినాడ వీసీ జి.తులసీరామ్ దాస్, ఏయూ రెక్టార్ ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రమూర్తి, ఆదికవి నన్నయ వర్సిటీ రిజిస్ట్రార్ కె.రఘుబాబులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రముఖ ఎన్ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు
మరికొద్ది రోజుల్లో జేఈఈ మెయిన్ ర్యాంకులు వెల్లడి కానున్నాయి. జూలై 1 నుంచి జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 30 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు; కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లు; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐఐఐటీఎం); ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లు, ఇతర సంస్థల్లో వివిధ కోర్సుల్లో దాదాపు 40,000 సీట్లున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్ఐటీల్లో .. బీటెక్లో టాప్ బ్రాంచ్ల్లో గతేడాది క్లోజింగ్ ర్యాంకుల వివరాలు తెలుసుకుందాం.. EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రోజుకో కొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తి, ఎలక్ట్రికల్ ఉపకరణాలు మార్కెట్లో వచ్చిపడుతున్న తరుణంలో రెండు రకాల అవకాశాల వేదికలను (ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్) అందుకునేందుకు దోహదం చేస్తుంది ఈఈఈ. స్థూలంగా డిజైన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ డివెసైస్ అండ్ సర్క్యూట్స్, అనాలసిస్ అండ్ ఆపరేషన్ ఆఫ్ పవర్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ డిజైన్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ పవర్ సిస్టమ్ అనాలసిస్, యుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి కోర్ సబ్జెక్టులపై విద్యార్థులకు శిక్షణనిస్తారు. అవకాశాలు: మనదేశంలో విద్యుత్ కొరతను అధిగమించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలను భారీ స్థాయిలో చేపడుతున్నాయి. వీటితోపాటు హైడ్రో ఎలక్ట్రిసిటీ రంగం, నేచురల్ గ్యాస్ పాంట్లు, పవర్ కార్పొరేషన్లు, అణు విద్యుత్ కర్మాగారాలు, రైల్వేలు, విద్యుత్ ఉపకరణ ఉత్పత్తుల సంస్థలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఈఈఈ ఉత్తీర్ణులకు అపార అవకాశాలు ఉన్నాయి. గతేడాది కటాఫ్స్: కోర్ బ్రాంచ్ల్లో ఒకటి కావడం.. భవిష్యత్ అవకాశాల నేపథ్యంలో ఈ కోర్సుకు విపరీతమైన డిమాండ్ ఉంది. గతేడాది ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరిలో సీటు లభించిన చివరి ర్యాంకు 3601. అదర్స్టేట్ కోటాలో కూడా చాలా తక్కువ ర్యాంకుకే (4131) సీట్లు భర్తీ అవడం గమనార్హం. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఎక్కువగా చేరే ఎన్ఐటీ తిరుచిరాపల్లి (తమిళనాడు), సూరత్కల్ (కర్ణాటక), కాలికట్ (కేరళ)లలో కూడా వరుసగా సీట్లు లభించిన చివరి ర్యాంకులు.. 3067, 3723, 6460. వీటిని బట్టి చూస్తేనే తెలుస్తోంది ఈఈఈకి ఎంత డిమాండ్ ఉందో! ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే బ్రాంచ్ ఈసీఈ. పరిధి విస్తృతంగా ఉండే ఈసీఈ ద్వారా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, టెలికాం, సెమీకండక్టర్ డిజైన్ తదితర రంగాల గురించిన పరిజ్ఞానం సొంతం చేసుకోవచ్చు. ఈసీఈలో అనలాగ్ ట్రాన్స్మిషన్, డిజిటల్ ట్రాన్స్మిషన్, వాయిస్ అండ్ డాటా, బేసిక్ ఎలక్ట్రానిక్స్, సాలిడ్ స్టేట్ డివెసైస్, మైక్రో ప్రాసెసర్స్, డిజిటల్ అండ్ అనలాగ్ కమ్యూనికేషన్, అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఆంటెన్నా అండ్ వేవ్ ప్రొగ్రెషన్ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. దాంతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్క్యూట్స్, ప్రసార ఉపకరణాలైన ట్రాన్స్మీటర్, రిసీవర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రోవేవ్స్, ఫైబర్ వంటి వాటి తయారీలో ఈసీఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుంది. ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లోనూ, వాటి అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లలోనూ ఉద్యోగావకాశాలు విస్తృతం. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చేరొచ్చు. టీచింగ్ రంగంలోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారతీయ రైల్వేలు, అణు విద్యుత్ కంపెనీలు, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డెరైక్టరేట్ ఆఫ్ జనరల్ పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్ డిపార్ట్మెంట్స్.. మొదలైనవాటిలో ఉద్యోగాలు పొందొచ్చు. గతేడాది ర్యాంకుల విశ్లేషణ: కోర్ బ్రాంచ్ల్లో ఒకటి కావడం, ఉన్నత విద్య, ఉద్యోగావ కాశాల విషయంలో ఎలాంటి ఢోకా లేకపోవడంతో ప్రధాన ర్యాంకర్లలో ఎక్కువ శాతం ఈసీఈనే ఎంచుకుంటున్నారు. గతేడాది సీట్లు లభించిన చివరి ర్యాంకులను గమనిస్తే ఈ విషయం అవగతమవుతోంది. ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీ విద్యార్థికి సీటు లభించిన చివరి ర్యాంకు.. 2543. కాగా ఇతర రాష్ట్ర కోటాలో సీటు కూడా 3364కే భర్తీ అయింది. ఇక దక్షిణ భారత ఎన్ఐటీలు.. తిరుచిరాపల్లిలో 2076, సూరత్కల్లో 2456, కాలికట్లో 4966 ర్యాంకుకే సీట్లన్నీ నిండాయి. CIVILసివిల్ ఇంజనీరింగ్ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాయి. మనదేశంలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న జనాభా, మానవ అవసరాలకనుగుణంగా ఇళ్లు, రహదారులు, మురుగునీటి కాలువలు, భూ అంతర్గత రహదారులు , ఫ్లై ఓవర్లు నిర్మాణంతోపాటు నదులపై ప్రాజెక్టులు చేపడుతున్నారు. భారీ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటన్నింటి నిర్మాణంలో తప్పనిసరిగా సివిల్ ఇంజనీర్ల సేవలు అవసరం. ఈ క్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు హాట్ ఫేవరెట్ బ్రాంచ్గా నిలుస్తోంది. ఉద్యోగావకాశాలు: సివిల్ ఇంజనీర్లకు అటు ప్రభుత్వ రంగంలోనూ, ఇటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రహదారులు- భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం, కాలుష్య నియంత్రణ మండలి, వివిధ పరిశోధన సంస్థలు, భారతీయ రైల్వేలు, జాతీయ రహదారుల విభాగం, జాతీయ విపత్తు నిర్వహణ విభాగం, ఎల్ అండ్ టీ, డీఎల్ఎఫ్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇవే కాకుండా ప్రతి ఏటా యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కొలువుల్లో పాగా వేయొచ్చు. గతేడాది కటాఫ్ ర్యాంకులు: గతేడాది ఎన్ఐటీ-వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో 4954 వరకు, అదర్ స్టేట్ కోటాలో 7483 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఎన్ఐటీ-తిరుచిరాపల్లి, ఎన్ఐటీ-సూరత్కల్, ఎన్ఐటీ-కాలికట్లలో సీట్లు భర్తీ అయిన చివరి ర్యాంకులు 6814, 7411, 11206. MECHANICALమెకానికల్ ఇంజనీరింగ్ ఒక ప్రొడక్ట్ డిజైన్లో, తయారీలో మెకానికల్ ఇంజనీర్లది కీలక పాత్ర. ఇది కేవలం యంత్ర పరికరాలకే కాకుండా.. ఎయిర్ కండీషన్లు, గ్యాస్ టర్బైన్లు వంటి ఎలక్ట్రికల్ పరికరాలకు విస్తరించింది. ప్రొడక్ట్స్, కాంపొనెంట్స్, సిస్టమ్స్.. ఇలా అనేక యంత్ర పరికరాల తయారీలో ప్రతి దశలోనూ మెకానికల్ ఇంజనీర్ల ప్రతిభ ఎంతో అవసరం. మెకానికల్ ఇంజినీరింగ్ పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఎయిరోప్లేన్ నుంచి ఎయిర్ కండీషనర్ దాకా.. రాకెట్ నుంచి రోబోల తయారీ వరకూ.. స్టీలు పరిశ్రమలలో, కార్ల డిజైన్లో.. ఇలా అనేక విభాగాల్లో మెకానికల్ ఇంజనీరింగ్ పాత్ర కీలకం..! వచ్చే 5-10 ఏళ్లలో భారత్లో ఆటోమొబైల్స్, పవర్, ఏరోస్పేస్ పరిశ్రమ గణనీయ వృద్ధిని నమోదు చేసుకోనుంది. గెయిల్, ఎన్టీపీసీ, డీఆర్డీవో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు టాటా మోటార్స్, మారుతి సుజుకీ, హోండా, తదితర సంస్థల్లో ఉపాధికి కొదవ లేదు. గతేడాది కటాఫ్ ర్యాంకులు: గతేడాది ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో సీటు లభించిన చివరి ర్యాంకు 3780 కాగా.. అదర్ స్టేట్ కోటాలో చివరి ర్యాంకు 3530. ఇక ఎన్ఐటీ - తిరుచిరాపల్లి, ఎన్ఐటీ - సూరత్కల్, ఎన్ఐటీ - కాలికట్లలో సీట్లు లభించిన చివరి ర్యాంకులు వరుసగా.. 2818, 3178, 6203. CHEMICAL కెమికల్ ఇంజనీరింగ్ పరిశ్రమల విస్తరణ శరవేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కెమికల్ ఇంజనీర్ల అవసరం బాగా పెరుగుతోంది. మరోవైపు ముడివనరుల కొరత పెరుగుదలతో సహజ వనరుల స్థానంలో సింథటిక్ వనరుల సృష్టికి కెమికల్ ఇంజనీర్ల అవసరం ఎంతైనా ఉంది. కెమికల్ ఇంజనీర్గా ఒక పరిశ్రమలో అనేక క్లిష్టతరమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సంబంధిత పరిశ్రమకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి, డిజైన్, అమలు, నిర్వహణ పనులు కెమికల్ ఇంజనీర్ విధిలో భాగాలే. నిజానికి కెమికల్ ఇంజనీరు ఒక పరిశ్రమలో అనేక ఇంజనీరింగ్ శాఖలను.. అంటే కెమిస్ట్, ఇండస్ట్రియల్ ఇంజనీర్, మెటీరియల్స్ ఇంజనీర్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ల సమ్మిళిత పాత్రను నిర్వహించాలి. ఉద్యోగావకాశాలు: ఉత్పాదక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. పెట్రోలియం, పెట్రోకెమికల్స్ నుంచి ఆహార పరిశ్రమల వరకు కెమికల్ ఇంజనీర్ల పాత్ర కీలకం. మెటీరియల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్లాస్టిక్స్, పవర్ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్, వేస్ట్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, లేబొరేటరీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, ఎరువులు-రసాయనాల కర్మాగారాల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. గతేడాది కటాఫ్ ర్యాంకులు: కెమికల్ ఇంజనీరింగ్లో గతేడాది ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో 8061 వరకు, ఇతర రాష్ట్ర కోటాలో 10,500 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్న ఎన్ఐటీ-తిరుచిరాపల్లి, ఎన్ఐటీ-సూరత్కల్, ఎన్ఐటీ-కాలికట్లలో సీట్లు లభించిన చివరి ర్యాంకులు వరుసగా.. 8174, 8369, 14,463. CSE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నేడు కంప్యూటర్ ప్రవేశించని రంగమే లేదంటే అతిశయోక్తి కాదు. దైనందిన వ్యవహారాల నుంచి వ్యాపార అవసరాల వరకు మానవ జీవితంలో కంప్యూటర్ పెనవేసుకుపోయింది. ఏ స్థాయిలో అంటే ఆన్లైన్లోనే బస్, రైలు, విమాన, సినిమా టికెట్ల బుకింగ్ నుంచి ఆన్లైన్ చాటింగ్ వరకు పెరిగిపోయింది. ఇక కంపెనీలు, పరిశ్రమల అవసరాలు చెప్పాల్సిన పనే లేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో అవకాశాలు విస్తృతమయ్యాయి. కంప్యూటర్ సిస్టమ్స్ డిజైన్, నిర్మాణం, నిర్వహణ కంప్యూటర్ ఇంజనీర్ల పని. డెస్క్టాప్, ల్యాప్టాప్ కంప్యూటర్లు, సర్వర్లతోపాటు మొబైల్ ఫోన్లలో వినియోగించే వివిధ అప్లికేషన్స్ రూపకల్పన, వివిధ పరిశ్రమల్లో ఉపయోగించే అప్లికేషన్స్, ఇంటిగ్రేటెడ్ మైక్రోచిప్స్ను కంప్యూటర్ ఇంజనీర్లు రూపొందిస్తారు. కంప్యూటర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్తోపాటు హార్డ్వేర్ విభాగాల్లోనూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జాబ్ ప్రొఫైల్స్: టెక్నికల్ రైటర్, సాఫ్ట్వేర్ డిజైనర్, మల్టీమీడియా ప్రోగ్రామర్, అప్లికేషన్ ప్రోగ్రామర్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, సిస్టమ్స్ ప్రోగ్రామర్, సిస్టమ్స్ అనలిస్ట్, గేమ్ డిజైనర్, కంప్యూటర్ ఇంజనీర్, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, డేటా నెట్వర్క్ డిజైనర్, సెక్యూరిటీ అనలిస్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వెబ్సైట్ డెవలపర్/డిజైనర్. గతేడాది కటాఫ్ ర్యాంకుల విశ్లేషణ: అన్ని కోర్ బ్రాంచ్ల కంటే సీఎస్ఈని విద్యార్థుల ఫేవరెట్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. ఇందుకు గతేడాది కటాఫ్ ర్యాంకులే నిదర్శనం. గతేడాది ఎన్ఐటీ- వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో కేవలం 2411, అదర్ స్టేట్ కోటాలో 1921 ర్యాంకుకే సీట్లన్నీ నిండాయి. మిగిలిన ప్రధాన ఎన్ఐటీల్లోనూ ఇదే పరిస్థితి. ఎన్ఐటీ-తిరుచిరాపల్లిలో 1344 ర్యాంకు వరకు, ఎన్ఐటీ-సూరత్కల్లో 1785 ర్యాంకు వరకు, ఎన్ఐటీ- కాలికట్లో 4552 వరకు సీట్లు లభించాయి. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్: జూలై 1 నుంచి జూలై 9 వరకు ఛాయిస్ లాకింగ్: జూలై 6 నుంచి జూలై 9 వరకు మొదటి రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 11 ఫీజు చెల్లింపు: జూలై 11 నుంచి జూలై 14 వరకు రెండో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 16 ఫీజు చెల్లింపు: జూలై 16 నుంచి జూలై 19 వరకు మూడో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 21 ఫీజు చెల్లింపు: జూలై 21 నుంచి జూలై 23 వరకు సీటు సరెండర్ (1, 2, 3 రౌండల్లో లభించిన సీటు నచ్చకపోతే): జూలై 21 నుంచి జూలై 23 వరకు మొదటి మూడు రౌండ్లలో సీటు లభించినవారు కేటాయించిన ఇన్స్టిట్యూట్లలో రిపోర్టింగ్: జూలై 21 నుంచి జూలై 24 వరకు నాలుగో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 26 నాలుగో రౌండ్లో సీటు లభించినవారు కేటాయించిన ఇన్స్టిట్యూట్లో రిపోర్టింగ్: జూలై 26 నుంచి జూలై 29 ఇంటర్నల్ స్లైడింగ్: జూలై 31 స్పాట్ రౌండ్ (జీఎఫ్టీఐ, ఎస్ఎఫ్టీఐ) ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్, ఆన్లైన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ ఛాయిస్ లాకింగ్: జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు స్పాట్ రౌండ్ సీట్ ఎలాట్మెంట్: ఆగస్టు 4 కౌన్సెలింగ్ ముగింపు: ఆగస్టు 7 వెబ్సైట్: www.ccab.nic.in జేఈఈ మెయిన్ ర్యాంకుతో ప్రవేశం కల్పించే ఎన్ఐటీలు 1. ఎన్ఐటీ- అగర్తలా 2. మోతీలాల్ నెహ్రూ ఎన్ఐటీ - అలహాబాద్ 3. ఎన్ఐటీ - అరుణాచల్ ప్రదేశ్ 4. మౌలానా ఆజాద్ ఎన్ఐటీ - భోపాల్ 5. ఎన్ఐటీ - కాలికట్ 6. ఎన్ఐటీ - ఢిల్లీ 7. ఎన్ఐటీ - దుర్గాపూర్ 8. ఎన్ఐటీ - గోవా 9. ఎన్ఐటీ - హమీర్పూర్ 10. మాలవీయ ఎన్ఐటీ - జైపూర్ 11. బీఆర్ అంబేద్కర్ ఎన్ఐటీ - జలంధర్ 12. ఎన్ఐటీ - జంషెడ్పూర్ 13. ఎన్ఐటీ - కురుక్షేత్ర 14. ఎన్ఐటీ - మణిపూర్ 15. ఎన్ఐటీ - మేఘాలయా 16. ఎన్ఐటీ- మిజోరాం 17. ఎన్ఐటీ - నాగాలాండ్ 18. విశ్వేశ్వరాయ ఎన్ఐటీ - నాగ్పూర్ 19. ఎన్ఐటీ - పాట్నా 20. ఎన్ఐటీ - పుదుచ్చేరి 21. ఎన్ఐటీ - రాయ్పూర్ 22. ఎన్ఐటీ - రూర్కెలా 23. ఎన్ఐటీ - సిక్కిం 24. ఎన్ఐటీ - సిల్చార్ 25. ఎన్ఐటీ - శ్రీనగర్ 26. సర్దార్ వల్లభాయ్ ఎన్ఐటీ - సూరత్ 27. ఎన్ఐటీ - సూరత్కల్ 28. ఎన్ఐటీ - తిరుచిరాపల్లి 29. ఎన్ఐటీ - ఉత్తరాఖండ్ 30. ఎన్ఐటీ - వరంగల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ, ఐఐఐటీఎం అండ్ ఐఐఐటీడీఎం)లు 1.అటల్ బిహారి వాజ్పాయ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ - గ్వాలియర్ 2.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - కాంచీపురం 3.రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - అమేథి 4.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - గువహటి 5.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - అలహాబాద్ 6.పండిట్ ద్వారకా ప్రసాద్ మిశ్రా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - జబల్పూర్ 7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - కోటా, రాజస్థాన్ 8. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - శ్రీ సిటీ, సత్యవేడు, ఆంధ్రప్రదేశ్ 9. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - వడోదరా 10. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉనా, హిమాచల్ప్రదేశ్ 11. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కల్యాణి, పశ్చిమ బెంగాల్ 12. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - త్రిపుర 13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోనేపట్, హర్యానా -
గోదాములో అగ్నిప్రమాదం
భివండీ న్యూస్లైన్ : రహనాల్ గ్రామంలోని సద్గురు కాంపౌండ్ సిరాజ్ కెమికల్ కంపెనీ గోదాములో గురువారం ఉదయం 11 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా మంటలు చెలరేగడంతో గోదాము ఎదురుగా నిలిపి ఉంచిన టెంపో దగ్ధమైంది. అగ్మి మాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన గోదాముకు ఎలాంటి అనుమతులు లేవని గ్రామ పంచాయితి వికాస్ అధికారి నరేష్ పాటిల్ మీడియాకు తెల్పారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.