Chris Lynn
-
బట్లర్ ఊచకోత.. డస్సెన్, లిన్ మెరుపులు వృధా
అబుదాబీ టీ10 లీగ్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ రెచ్చిపోయాడు. ఈ లీగ్లో డెక్కన్ గ్లాడియేటర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోస్.. చెన్నై బ్రేవ్ జాగ్వార్స్తో జరిగిన మ్యాచ్లో వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్లో జోస్ కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న జోస్.. 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా డెక్కన్ గ్లాడియేటర్స్ చెన్నై బ్రేవ్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోర్ చేసింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (29 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), క్రిస్ లిన్ (28 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు సాధించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నోర్జే, లూక్ వుడ్కు తలో వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గ్లాడియేటర్స్.. బట్లర్, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (24 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వీర ఉతుకుడు ధాటికి మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బట్లర్ అజేయమైన అర్ద శతకంతో గ్లాడియేటర్స్ను విజయతీరాలకు చేర్చాడు. బట్లర్ విధ్వంసం ధాటికి డస్సెన్, లిన్ మెరుపు అర్ద శతకాలు వృధా అయ్యాయి. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్లో నికోలస్ పూరన్ గోల్డన్ డకౌట్ కాగా.. రిలీ రొస్సో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్.. మార్కస్ స్టోయినిస్తో (2 నాటౌట్) కలిసి గ్లాడియేటర్స్ను గెలిపించాడు. బ్రేవ్ బౌలర్లలో సాబిర్ అలీ రావు 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో గెలుపొందిన డెక్కన్ గ్లాడియేటర్స్ రెండుసార్లు అబుదాబీ టీ10 లీగ్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. -
T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే!
నేషనల్ క్రికెట్ టీ10 లీగ్-2024లో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 27 బాల్స్ ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్రేటు 244.44గా నమోదైంది.చికాగో జట్టుకు కెప్టెన్గాఅమెరికా వేదికగా జరుగుతున్న ఈ టీ10 లీగ్లో యాక్టివ్ క్రికెటర్లతో పాటు రిటైర్డ్ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. టైటిల్ కోసం ఆరు జట్లు పోటీపడుతున్న ఈ పొట్టి లీగ్లో రాబిన్ ఊతప్ప చికాగో జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం టెక్సాస్ గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా పరుగుల వర్షం కురిపించాడు.క్రిస్ లిన్ ధనాధన్ ఇన్నింగ్స్ఓపెనర్గా బరిలోకి దిగిన ఊతప్ప ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ క్రిస్ లిన్ సైతం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్ల సాయంతో 60 పరుగలోత అజేయంగా నిలిచాడు. వీరితో పాటు మైక్ లూయీస్ 10 బంతుల్లోనే 34 రన్స్తో నాటౌట్గా నిలవగా.. నిర్ణీత 10 ఓవర్లలో చికాగో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. 41 పరుగుల తేడాతో జయభేరిలక్ష్య ఛేదనలో టెక్సాస్ గ్లాడియేటర్కు డేవిడ్ మలన్ శుభారంభమే అందించాడు. 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో జేమ్స్ ఫుల్లర్ 13 బంతుల్లో 37 పరుగులతో మెరవగా.. ఇతరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో పది ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి టెక్సాస్ కేవలం 132 పరుగులే చేయగలిగింది. ఫలితంగా చికాగో 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.అమెరికా నేషనల్ క్రికెట్ టీ10లీగ్లో ఆరుజట్లున్యూయార్క్ లయన్స్, టెక్సాస్ గ్లాడియేటర్స్, చికాగో సీసీ, డల్లాస్ లోన్స్టార్స్, లాస్ ఏంజెలిస్ వేవ్స్, అట్లాంటా కింగ్స్. టీమిండియా మాజీ క్రికెటర్లలో సురేశ్ రైనా న్యూయార్క్కు సారథిగా ఉండగా.. చికాగోకు ఊతప్ప నాయకుడు. మిగిలిన జట్లలో టెక్సాస్కు షాహిద్ ఆఫ్రిది, డల్లాస్కు దినేశ్ కార్తిక్, లాస్ ఏంజెలిస్కు షకీబ్ అల్ హసన్, అట్లాంటాకు ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్లుగా ఉన్నారు.చదవండి: జైశంకర్తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?.. టీమిండియా ఇక్కడకు రావాల్సిందే!Begin your morning with some sumptuous Robin Uthappa sixes! 🫶Uthappa and Lynn got Chicago off to a flying start by putting on 112 from just 38 balls.🔥#NCLonFanCode pic.twitter.com/gLVq6E5H4v— FanCode (@FanCode) October 8, 2024 -
విండీస్ ఆటగాడి ఒంటరి పోరాటం.. 5 వికెట్లతో చెలరేగిన అఫ్రిది
గ్లోబల్ టీ20 కెనడా లీగ్-2023లో భాగంగా వాంకోవర్ నైట్స్తో నిన్న (ఆగస్ట్ 5) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో మాంట్రియాల్ టైగర్స్ వికెట్ తేడాతో విజయం సాధించింది. తద్వారా లీగ్లో రెండో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి జరిగే ఫైనల్లో మాంట్రియాల్ టైగర్స్.. సర్రే జాగ్వార్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఐదేసిన అఫ్రిది.. క్వాలిఫయర్స్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన వాంకోవర్.. అబ్బాస్ అఫ్రిది (4-0-29-5) ధాటికి నిర్ణీత ఓవర్లలో 137 పరుగులకే పరిమితమైంది. అఫ్రిది ఐదు వికెట్లతో చెలరేగగా.. అయాన్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. వాంకోవర్ ఇన్నింగ్స్లో మహ్మద్ రిజ్వాన్ (33 బంతుల్లో 39; 2 ఫోర్లు, సిక్స్), కోర్బిన్ బోష్ (28 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు) హర్ష్ ధాకర్ (21 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు పరుగులు చేయగా.. కెప్టెన్ వాన్ డర్ డస్సెన్, నజీబుల్లా గోల్డెన్ డకౌట్లయ్యారు. రెచ్చిపోయిన రూథర్ఫోర్డ్.. 138 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్ అతి కష్టం మీద 9 వికెట్లు కోల్పోయి మరో 3 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. విండీస్ ఆల్రౌండర్ షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (34 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటిరిపోరాటం చేసి మాంట్రియాల్ను గెలిపించాడు. అతనికి దీపేంద్ర సింగ్ (25 బంతుల్లో 28; 2 ఫోర్లు), ఆండ్రీ రసెల్ (11 బంతుల్లో 17; ఫోర్, 2 సిక్సర్లు), అయాన్ అఫ్జల్ (14 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) సహకరించారు. వీరు మినహా జట్టులోకి మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వాంకోవర్ బౌలర్లలో జునైద్ సిద్ధిఖీ 4 వికెట్లతో సత్తా చాటగా.. ఫేబియన్ అలెన్, కోర్బిన్ బోష్ తలో 2 వికెట్లు, రూబెన్ ట్రంపెల్మెన్ ఓ వికెట్ పడగొట్టారు. -
ILT20 2023: ఐఎల్ టీ20 తొలి విజేతగా అదానీ గ్రూప్ జట్టు.. అంబరాన్నంటిన సంబరాలు
International League T20, 2023 - Desert Vipers vs Gulf Giants: ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్టీ20) మొదటి ఎడిషన్ విజేతగా గల్ఫ్ జెయింట్స్ అవతరించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో డెజెర్ట్ వైపర్స్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. గల్ఫ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్వైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. నెల రోజుల పాటు సాగిన టోర్నీ ఈ ఏడాది ఆరంభంలో యూఏఈ దుబాయ్ క్యాపిటల్స్- అబుదాబి నైట్ రైడర్స్ మ్యాచ్తో జనవరి 13న ఐఎల్టీ20కి తెరలేచింది. ఈ రెండు జట్లతో పాటు ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్, డెజర్ట్ వైపర్స్ సహా గల్ఫ్ జెయింట్స్ ట్రోఫీ కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో తుదిపోరుకు అర్హత సాధించిన డెజర్ట్ వైపర్స్- గల్ఫ్ జెయింట్స్ మధ్య ఆదివారం(ఫిబ్రవరి 12) ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన గల్ఫ్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బ్రాత్వైట్ ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వైపర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 పరుగులు సాధించింది. గల్ఫ్ బౌలింగ్ ఆల్రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్.. అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 19 పరగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ పతనాన్ని శాసించాడు. ఇతరులలో గ్రాండ్హోం ఒకటి, కైస్ అహ్మద్ రెండు, క్రిస్ జోర్డాన్ ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ జట్టుకు ఓపెనర్ క్రిస్ లిన్(ఆస్ట్రేలియా) అదిరిపోయే ఆరంభం అందించాడు. క్రిస్ లిన్ అద్భుత ఇన్నింగ్స్ ఐదో స్థానంలో వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లిన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు చేయగా.. హెట్మెయిర్ 13 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో 18.4 ఓవర్లలోనే గల్ఫ్ జెయింట్స్ టార్గెట్ను ఛేదించింది. 3 వికెట్లు నష్టపోయి 149 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. డెజర్ట్ వైపర్స్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐఎల్టీ20 మొదటి చాంపియన్గా రికార్డులకెక్కింది. దీంతో జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కాగా గల్ఫ్ జెయింట్స్ అదానీ స్పోర్ట్స్లైన్కు చెందిన జట్టు అన్న సంగతి తెలిసిందే. ఐఎల్టీ20 ఫైనల్: డెజర్ట్ వైపర్స్ వర్సెస్ గల్ఫ్ జెయింట్స్ మ్యాచ్ స్కోర్లు డెజర్ట్ వైపర్స్- 146/8 (20) గల్ఫ్ జెయింట్స్- 149/3 (18.4) చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్ Ind Vs Pak: ప్రపంచకప్లో పాక్పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు 🎶 BRING IT ON! 🎶 Strength, challenge, & victory! Our anthem tells you all you need to know about us!🤩#GiantArmy, presenting to you the Gulf Giants anthem, written & performed by @salim_merchant @Sulaiman 💪#ALeagueApart #DPWorldILT20 #BringItOn @ilt20official @ilt20onzee pic.twitter.com/jJJbUHBxq6 — Gulf Giants 🦅 (@GulfGiants) January 15, 2023 -
ఇదేం బాదుడురా సామీ.. బిగ్బాష్ లీగ్లో చారిత్రక విజయం
బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్య ఛేదన ప్రస్తుత సీజన్లో (2022-23) నమోదైంది. నిన్న (జనవరి 5) అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో హోబర్ట్ హరికేన్స్ నిర్ధేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని అడిలైడ్ స్ట్రయికర్స్ మరో 3 బంతులుండగానే ఛేదించి (7 వికెట్ల తేడాతో) చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో రెచ్చిపోవడంతో 39.3 ఓవర్లలో ఏకంగా 459 పరుగులు నమోదయ్యాయి. THE GREATEST CHASE! Simply incredible from Matt Short who brings up a ton to pull off the biggest chase in BBL history! Jawdropping stuff #BBL12 pic.twitter.com/98VzoYHMXY — KFC Big Bash League (@BBL) January 5, 2023 మాథ్యూ షార్ట్ వీరోచిత శతకంతో (59 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అడిలైడ్ స్ట్రయికర్స్కు చారిత్రక విజయాన్ని అందించాడు. షార్ట్కు క్రిస్ లిన్ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆడమ్ హోస్ (22 బంతుల్లో 38; ఫోర్, 4 సిక్సర్లు) సహకరించడంతో కొండంత లక్ష్యం అమాంతం కరిగిపోయింది. హోబర్ట్ బౌలర్లలో ప్యాట్రిక్ డూలే (2/25), టిమ్ డేవిడ్ (1/18)లను మినహాయించి మిగతా బౌలర్లనంతా అడిలైడ్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. You should watch these highlights. #BBL12 https://t.co/3fWaTjiGFa — KFC Big Bash League (@BBL) January 5, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్.. బెన్ మెక్ డెర్మాట్ (30 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కాలెబ్ జువెల్ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జాక్ క్రాలే (28 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ల సహకారంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. గ్రాండ్హోమ్ 2, కాన్వే, షార్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో అడిలైడ్.. 19.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, బీబీఎల్ హిస్టరీలో రికార్డు ఛేదనను నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు హోబర్ట్ హరికేన్స్ పేరిట ఉండింది. 2016/17 సీజన్లో మెల్బోర్న్ రెనిగేడ్స్తో జరిగిన మ్యాచ్లో హరికేన్స్ 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఎలిమినేటర్ మ్యాచ్.. గల్లీ క్రికెట్లా ఈ ఆటలేంటి!
మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ముందు బ్యాటింగ్ ఎవరు రావాలనే దానిపై వివిధ పద్దతులు ఆచరించేవాళ్లం. ఒక పిల్లాడు వంగితే.. వాడి వీపుపై చేతులతో సంఖ్యలను చెబుతూ ఏ స్థానంలో ఎవరు ఆడాలనేది నిర్ణయించేవారు. మరికొంతమంది పచ్చాలు వేసేవారు. ఇదంతా గల్లీ క్రికెట్ కాబట్టి మస్తు ఎంజాయ్గా అనిపించేది. కానీ ఇదే తీరు ఒక అంతర్జాతీయ మ్యాచ్లో జరిగితే ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా అబుదాబి టి10 లీగ్లో భాగంగా టీమ్ అబుదాబి జట్టు ఓపెనర్లు అలెక్స్ హేల్స్, క్రిస్ లిన్ చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఇద్దరిలో ఎవరు స్ట్రైక్ తీసుకోవాలనిదానిపై చిన్న గేమ్ ఆడారు. ఆ గేమ్ పేరు రాక్-పేపర్-సిసర్స్. ఈ గేమ్లో గెలిచిన హేల్స్ స్ట్రైక్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన కొందరు అభిమానులు.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో గల్లీ క్రికెట్లా ఆటలేంటి అంటూ ఫన్నీ కామెంట్స్ చేవారు. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే చేసిన హేల్స్ సుల్తాన్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెక్కన్ గ్లాడియేటర్స్ టీమ్ అబుదాబిని 5 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఓడియన్ స్మిత్ 32 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్ 21 పరుగులు చేశాడు. క్వాలిఫయర్-2లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్ ఫైనల్కు చేరుకుంది. ఇక డిసెంబర్ 4న(ఆదివారం) న్యూయార్క్ స్ట్రైకర్స్తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. pic.twitter.com/HC34HqTkbQ — Hassam (@Nasha_e_cricket) December 3, 2022 చదవండి: దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం.. -
ఆ బ్యాటర్ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు క్రిస్ లిన్ టి20 బ్లాస్ట్లో సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్లో క్రిస్ లిన్ నార్తంప్టన్షైర్ తరపున క్రిస్ లిన్ ఈ సీజన్లో అరంగేట్రం చేశాడు. సీజన్లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న లిన్.. లీస్టర్షైర్తో మ్యాచ్లో 66 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు నాటౌట్గా నిలిచాడు. క్రిస్ లిన్ టి20 కెరీర్లో ఇది మూడో సెంచరీ. అతని ధాటికి నార్తంప్టన్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ టోర్నీకి ముందు లిన్ పని అయిపోయిందని.. అతను రాణించే అవకాశం లేదని విమర్శలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన విమర్శలన్నింటికి క్రిస్ లిన్ తన బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్షైర్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి వికెట్కు మరో ఓపెనర్ బెన్ కరన్(31)తో కలిసి 109 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పిన లిన్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత లిన్కు జేమ్స్ నీషమ్ తోడయ్యాడు. ఐపీఎల్ నుంచి నేరుగా టి20 బ్లాస్ట్లో అడుగుపెట్టిన నీషమ్ ఆడిన తొలి మ్యాచ్లోనే మెరిశాడు. 30 బంతుల్లోనే 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లీస్టర్షైర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. స్కాట్ స్టీల్ 64 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! A special innings from a special player @lynny50 💯 #Blast22 | @NorthantsCCC pic.twitter.com/NImOepuOHU — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 -
'ముంబై జట్టులో విభేదాలు.. అందుకే ఈ ఓటములు'
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సీజన్లో వరుసగా 7 మ్యాచ్ల్లో ఓటమి చెంది పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ అఖరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్పై ఆ జట్టు మాజీ ఆటగాడు క్రిస్ లిన్ సంచలన వాఖ్యలు చేశాడు. ముంబై జట్టులో అంతరర్గత విభేదాలున్నాయాని, అందుకే జట్టు వరుస మ్యాచ్ల్లో విఫలమవుతుందని క్రిస్ లిన్ అభిప్రాయపడ్డాడు. "ముంబై జట్టుకు గెలవడం,ఓడిపోవడం రెండూ అలవాటే. ముంబై బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సమస్యలు ఉన్నాయి. వారి డ్రెస్సింగ్ రూంలో గ్రూపులు ఉన్నట్లు కనిపిస్తోంది. త్వరలో ముంబై జట్టు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉంది. అది జట్టుకు మంచి సంకేతం కాదు. కాగా కెప్టెన్ ఒత్తిడిలో ఉన్నప్పుడు పొలార్డ్ వంటి సీనియర్ రోహిత్కు సాయంగా ఉండాలి. కానీ జట్టులో అది కనిపించడంలేదు అని క్రిస్ లిన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ధోనికో లెక్క.. పంత్కో లెక్కా..? నో బాల్ వివాదంలో ఆసక్తికర చర్చ -
కళ్లు చెదిరే క్యాచ్.. ఔటయానన్న సంగతి మరిచిపోయి
బిగ్బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు సీన్ అబాట్ కళ్లు చెదిరే క్యాచ్తో మెరిశాడు. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో జాసన్ బెండార్సీస్ వేసిన బంతిని ఓపెనర్ క్రిస్ లిన్ ఆఫ్సైడ్ దిశగా కవర్డ్రైవ్ ఆడాడు. అయితే ఎవరు ఊహించని విధంగా సీన్ అబాట్ గాల్లోకి ఎగిరి కుడివైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో క్రిస్ లిన్.. సీన్ అబాట్ స్టన్నింగ్ ఫీట్కు షాక్ తిన్నాడు. అసలు ఔటయ్యానా అనే సందేహం కలిగిందంటే.. సీన్ అబాట్ ఎంత వేగంతో బంతిని అందుకున్నాడో అర్థమవుతుంది. ఇక చేసేదేం లేక 2 పరుగులు చేసిన లిన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బిగ్బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 19.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. డకెట్ 21, విల్డర్మత్ 27, మాక్స్ బ్రియాంట్ 22 పరుగులు చేశారు. సీన్ అబాట్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ సిక్సర్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో 100 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన సిడ్నీ సిక్సర్స్ ప్రస్తుతం సీన్ అబాట్ బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తుండడంతో 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 8 పరుగుల దూరంలో ఉంది. Catch of the summer? 🤯 Chris Lynn could NOT believe it... #BBL11 This 'Oh What a Feeling' Moment brought to you by @Toyota_Aus pic.twitter.com/6fGBa3l5D0 — Fox Cricket (@FoxCricket) December 29, 2021 -
'షార్ట్ వేసుకుందామనుకున్నా.. కానీ మాల్దీవ్స్లో లేను'
ముంబై: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ఆ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి అందరూ వ్యాక్సినేషన్ వేసుకునే పనిలో పడ్డారు. ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ రద్దు చేయడంతో క్రికెటర్లు కూడా వ్యాక్సిన్ వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కోహ్లి, రహానే, శిఖర్ ధావన్, పుజారా, ఇషాంత్ శర్మ సహా మిగతా ఆటగాళ్లంతా ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్నారు. తాజాగా దినేష్ కార్తీక్ మంగళవారం కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నాడు. ఈ విషయాన్ని తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. అయితే కార్తీక్ తాను షేర్ చేసిన ఫోటోలో అతని ప్యాంటు కాస్త కనిపించి కనిపించనట్టుగా ఉంది.. అచ్చం ఆర్మీ అధికారులు వేసుకునే ప్యాంటులాగా ఉంది. కార్తీక్ ఫోటోను ట్యాగ్ను చేస్తూ ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రిస్ లిన్ ట్రోల్ చేశాడు. ''కార్తీక్ కాస్త మంచిగా కనిపించే ప్యాంటు వేసుకోవచ్చుగా'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి కార్తీక్ తనదైన శైలిలో ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ''నిజమే లిన్.. అసలు మొదట షార్ట్ వేసుకొని వ్యాక్సిన్ వేసుకోవాలనుకున్నా.. కానీ నేను మాల్దీవ్స్లో లేను.. అందుకే ఆ ఆలోచనను విరమించుకొని ఈ ప్యాంటు వేసుకున్నా'' అంటూ పేర్కొన్నాడు. కార్తీక్, లిన్ల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక దినేశ్ కార్తీక్ ఐపీఎల్ 14వ సీజన్లో కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. క్రిస్ లిన్ ముంబై ఇండియన్స్కు ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్లో లిన్ ఒక్క మ్యాచ్కే పరిమితం అయ్యాడు. సీజన్ తొలి మ్యాచ్ ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో లిన్ 48 పరుగులు చేశాడు. అయితే డికాక్ రాకతో లిన్కు తుది జట్టులో అవకాశం లభించలేదు. ఇక కార్తీక్ కేకేఆర్ తరపున 7 మ్యాచ్లాడి 123 పరుగులు సాధించాడు. చదవండి: కెప్టెన్గా పంత్.. కోహ్లి, రోహిత్లకు దక్కని చోటు 'జడ్డూ స్థానంలో వచ్చాడు.. ఇప్పుడు అవకాశం రాకపోవచ్చు' Could have at least worn pants — Chris Lynn (@lynny50) May 11, 2021 I was thinking shorts like you , then realised I'm not in Maldives . So wore this 😂 — DK (@DineshKarthik) May 11, 2021 -
ఐపీఎల్ 2021: మీకేమీ ప్రత్యేక ఏర్పాట్లు చేయలేం
కాన్బెర్రా: ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లను స్వదేశానికి తీసుకెళ్లేందుకు చార్టర్ విమానం వేయాలని కోరిన ఆ దేశానికి చెందిన క్రిస్ లిన్ విజ్ఞప్తికి చుక్కెదురైంది. ఈ విషయంలో తాము ఎటువంటి సాయం చేయలేమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెగేసి చెప్పారు. ఐపీఎల్లో ఆడిన క్రికెటర్లంతా ప్రైవేట్గా ప్రయాణించారని, ఇదేమే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటనలో భాగంగా కాదన్నారు. అందుచేత ఆసీస్ క్రికెటర్లను తిరిగి స్వదేశానికి చేర్చేక్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేమన్నారు. ఆసీస్ క్రికెటర్ల కోసం ఏమైనా స్పెషల్ ఏర్పాట్లు చేస్తారా అనే ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీతో మాట్లాడిన మోరిసన్.. తాము ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. ‘ వారు(ఆసీస్ క్రికెటర్లు) ప్రైవేట్గా భారత్కు వెళ్లారు. ఆస్ట్రేలియా పర్యటనలో వారేమీ భారత్కు వెళ్లలేదు. వారికి తిరిగి రావడానికి వారుకున్న మౌలిక వసతులను ఉపయోగించుకునే రావాలి. ఇక్కడ వారే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. నేను వారిని కోరేది ఒక్కటే.... వారు సొంత ఏర్పాట్లు చేసుకుని రావాలనే ఆఖరిగా చెబుతున్నా’ అని తెలిపారు. ఇక్కడ చదవండి: మాకు చార్టర్ విమానం వేయండి: సీఏకు లిన్ విజ్ఞప్తి ఇంత ఖర్చుతో ఐపీఎల్ అవసరమా?: రాజస్థాన్ ఆటగాడు -
మాకు చార్టర్ విమానం వేయండి: సీఏకు లిన్ విజ్ఞప్తి
ఢిల్లీ: తమకు వచ్చేవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ స్ప‘ష్టం చేశాడు. ఈ విషయాన్ని మంగళవారం న్యూకార్పోరేషన్ మీడియాకు తెలిపిన లిన్.. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు చార్టర్ ప్లేన్ వేయమని విజ్ఞప్తి చేసినట్లు తెలిపాడు. ఈ టోర్నీ ముగిసిన తర్వాత తామంతా(ఆస్ట్రేలియా క్రికెటర్లు) క్షేమంగా స్వదేశానికి వచ్చేందుకు చార్టర్ విమానాన్ని వేయమని కోరినట్లు తెలిపాడు. ‘సీఏకు టెక్స్ట్ మెసేజ్ చేశాను. ప్రతీ ఐపీఎల్ టోర్నమెంట్ ద్వారా సీఏ 10 శాతం డబ్బును సంపాదిస్తుంది. ఇప్పుడు ఆ డబ్బును మాకు చార్టర్ విమానం వేయడానికి ఖర్చు చేస్తుందనే భావిస్తున్నా. మా కంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేము కఠినమైన బయోబబుల్లో ఉంటున్నాము. వచ్చేవారం వ్యాక్సిన్ కూడా వేయించుకుంటాము. దాంతో మమ్మల్ని టోర్నీ ముగిసిన తర్వాత చార్టర్ విమానం ద్వారా ఇంటికి చేరుస్తారని ఆశిస్తున్నా. మేము షార్ట్ కట్లు గురించి అడగడం లేదు. మేము సంతకాలు చేసేటప్పుడే రిస్క్ తెలుసుకునే చేశాం. ఈ మెగా టోర్నీ పూర్తయి ఎంత తొందరగా ఇంటికి క్షేమంగా చేరుకుంటే అంత కంటే మంచిది మరొకటి ఉండదు’ అని లిన్ తెలిపాడు. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియా క్రికెటర్, కేకేఆర్ సభ్యుడు ప్యాట్ కమిన్స్ .. పీఎం కేర్స్కు 50వేల యూఎస్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.భారత్లో కరోనా రోగులకు ఆక్సిజన్ సప్లయ్ కొరత ఉన్న కారణంగా తనవంతు విరాళాన్ని ప్రకటించాడు. అదే సమయంలో ఐపీఎల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న మిగిలిన ఆసీస్ క్రికెటర్లను కూడా సాయం చేయాలని కోరాడు. కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం నాటికి కోవిడ్ కేసుల అప్డేట్ విడుదల చేసే సమయానికి గత 24 గంటల్లో 3, 23,144 కొత్త కేసులు నమోదు కాగా, 2,771 మృత్యువాత పడ్డారు. -
రనౌట్: ఏమో.. ఇదే నాకు చివరి మ్యాచ్ కావొచ్చు!
చెన్నై: గత ఐపీఎల్ సీజన్లో జట్టుతోనే ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం పొందలేకపోయాడు ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రిస్ లిన్. అయితే, ఈ సీజన్లో ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లోనే కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, ఇద్దరి జోడీ బాగానే ఆడుతుందనకుంటున్న సమయంలో సమన్వయ లోపం కారణంగా రోహిత్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ బౌలర్ యజువేంద్ర చహల్ వేసిన 4వ ఓవర్ చివరి బంతిని క్రిస్ లిన్ కవర్స్ ఫ్లిక్ చేయగా, నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న రోహిత్ క్రీజు దాటి ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో చురుగ్గా కదిలిని ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి బంతిని చహల్కు త్రో వేయగా, వెనువెంటనే వికెట్లకు గిరాటేయడంతో హిట్మ్యాన్ రనౌట్గా పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం క్రిస్ లిన్ మాట్లాడుతూ.. ‘‘మొదటి మ్యాచ్ అది కూడా రోహిత్తో కలిసి ఆడనుండటంతో తొలుత కాస్త నర్వస్గా ఫీలయ్యాను. నిజానికి నేను పరుగు తీయొచ్చని అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ రనౌట్కు ఆస్కారం ఏర్పడింది. ఒకవేళ అవకాశం ఉంటే కెప్టెన్ కోసం నా వికెట్ను సమర్పించుకునేవాడిని. ఏదేమైనా ఇలా జరగకుండా ఉండాల్సింది. తప్పిదం జరిగిపోయింది. ఒకవేళ రోహిత్ క్రీజులో ఉంటే ఇంకొన్ని పరుగులు చేసేవాడేమో. మ్యాచ్ ఫలితం కూడా వేరేలా ఉండేది కావొచ్చు. ఏమో ఎవరికి తెలుసు.. మొదటి మ్యాచే నాకు చివరి మ్యాచ్ అవుతుందేమో!’’ అని వ్యాఖ్యానించాడు. కాగా, శుక్రవారం నాటి మ్యాచ్లో క్రిస్లిన్ 35 బంతుల్లో 49 పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్లో ముంబై 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చదవండి: మాక్సీ మెరుపులు: గట్టిగా హగ్ ఇచ్చేవాళ్లం.. కౌంటర్ పడిందిగా! ఒక కెప్టెన్గా ఏం ఆశించానో.. అదే చేశాడు : కోహ్లి -
అందుకే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు.. కానీ
చెన్నై: భుజం నొప్పి కారణంగానే తమ జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్లో బౌలింగ్ చేయలేకపోయాడని ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రిస్లిన్ అన్నాడు. బ్యాట్స్మెన్గా తన సేవలు జట్టుకు ఎంతో ముఖ్యమని, బౌలింగ్ చేసే క్రమంలో నొప్పి ఎక్కువైతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పూర్తిగా కోలుకున్న తర్వాత బంతితో మ్యాజిక్ చేయగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఎన్నో అంచనాల నడుమ ఐపీఎల్-2021 బరిలో దిగిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లోనే అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. రెండు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ చేతిలో ఓటమి పాలైంది. ముంబై ఆటగాళ్లలో క్రిస్ లిన్(49) మినహా మిగతా వాళ్లెవరూ రాణించకపోవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమై కోహ్లి సేనకు మ్యాచ్ సమర్పించుకుంది. ఇక సమన్వయ లోపం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్ కావడం, స్టార్ ప్లేయర్గా పేరొందిన హార్దిక్ పాండ్యా కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో భారీ మూల్యమే చెల్లించింది. కాగా ఈ మ్యాచ్ నేపథ్యంలో క్రిస్ లిన్ మాట్లాడుతూ.. ‘‘హార్దిక్కు భుజం నొప్పి ఉన్న కారణంగానే బౌలింగ్ సేవలు వినియోగించులేకపోయాం. ఈరోజు మ్యాచ్లో మేం ఆరో బౌలర్ను మిస్ కావచ్చు. ఆరంభ మ్యాచ్లో హార్దిక్ బౌలింగ్ చేయడం కుదరకపోవచ్చు. కానీ టోర్నీ మొత్తం తను దాదాపు 14 మ్యాచ్లకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. తను కోలుకున్నట్లయితే మాకు అదనపు బలం చేకూరుతుంది. తను బంతితోనూ, బ్యాట్తోనూ అద్భుతం చేయగలడని నేను విశ్వసిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. చదవండి: వారెవ్వా జేమిసన్.. దెబ్బకు బ్యాట్ విరిగింది -
టి20 ప్రపంచకప్ జరగకపోవడమే మంచిది: లిన్
మెల్బోర్న్: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది టి20 ప్రపంచకప్ నిర్వహించకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ సూచించాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నాడు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే జట్లకు వసతి, ప్రయాణ సదుపాయాలు కల్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తలనొప్పిగా మారుతుందన్నాడు. ‘మేమంతా టోర్నీ జరగాలనే ప్రార్థిస్తాం. పోటీల్లో తలపడాలని ఆశిస్తాం. కానీ ఇçప్పుడైతే మనముందున్న సవాళ్లతో ఆడాల్సి ఉంది. టోర్నీకి చాలా రోజుల ముందు జట్లను రప్పించి క్వారంటైన్, హోటళ్లలో బస, ప్రయాణ సదుపాయాలు కల్పించడం అంత సులువేం కాదు’ అని లిన్ వివరించాడు. -
ఫ్యాన్స్ షాక్: క్రిస్ లిన్ నెత్తిపై పొగలు
హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వసంకర క్రికెటర్ క్రిస్ లిన్కు కోపం వచ్చింది.. మైదానంలోనే సహచర ఆటగాళ్లపై మండిపడ్డాడు.. ఆ వెంటనే అతడి నెత్తిపై నుంచి పొగలు వచ్చాయి. ఈ విచిత్ర ఘటన పాకిస్తాన్ సూపర్ లీగ్లో కనిపించింది. శుక్రవారం రావల్పిండి వేదికగా పెషావర్ జల్మి-లాహోర్ ఖలందర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో క్రిస్ లిన్ నెత్తిపై పొగలు రావడం ప్రస్తుతం సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే కొందరు ఫ్యాన్స్ అవాక్కవుతుండగా.. మరికొందరు కెమెరా జిమ్మిక్కు కావచ్చని అనుమానిస్తున్నారు. అయితే కెమెరా పనితనం ఏమి లేదని, పొగలు వచ్చిన మాట వాస్తవమని, దానికి కారణాలు తెలియవని ఈ విచిత్ర ఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన ఓ అభిమాని పేర్కొన్నాడు. (చదవండి: ‘ప్రతీ సిక్స్ను డొనేట్ చేస్తా’) ఇక ఈ మ్యాచ్లో క్రిస్ లిన్ ప్రాతినిథ్యం వహించిన లాహోర్ ఖలందర్స్ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 12 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్కు దిగిన పెషావర్ జట్టు 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అయితే బౌలర్ల పేలవ ప్రదర్శనపై క్రిస్ లిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలోనే అతడి నెత్తిపై పొగలు వచ్చాయి. అనంతరం బ్యాటింగ్కు దిగిన లాహోర్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులే సాధించి ఓటమి పాలైంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో క్రిస్ లిన్ మెరుపుల గురించి తెలియన వారు ఉండరు. గత సీజన్ వరకు కోల్కతా నైట్రైడర్స్ తరుపున ఆడిన ఈ విధ్వంసకర ఆటగాడు.. రానున్న సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తరుపున ప్రాతినిథ్యం వహించనున్నాడు. Never seen anything like this. Serious heat 😮 pic.twitter.com/qRj2T5knc7 — Mazher Arshad (@MazherArshad) February 28, 2020 చదవండి: కోహ్లి.. అందుకే విఫలం కెప్టెన్ అయినంత మాత్రాన అలా చేస్తావా? -
మళ్లీ లిన్ మోత మోగించాడు..
హోబార్ట్: ఈ ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్కు ఆడబోతున్న ఆసీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో మెరుపులు మెరిపిస్తున్నాడు. బీబీఎల్లో బ్రిస్బేన్ హీట్కు సారథిగా వ్యవహరిస్తున్న లిన్.. శుక్రవారం హోబార్ట్ హరికేన్స్తో జరిగిన మ్యాచ్లో చెలరేగి ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 88 పరుగులు సాధించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన లిన్ వచ్చీ రావడంతోనే బ్యాట్కు పని చెప్పాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు మోత మోగించాడు. ఈ క్రమంలోనే ఓపెనర్ మ్యాక్స్ బ్రయాంట్(65)తో కలిసి 95 పరుగుల్ని జోడించాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో బ్రిస్బేన్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఆపై మ్యాట్ రెన్షాతో కలిసి ఇన్నింగ్స్ను నడిపించిన లిన్ జట్టు స్కోరును రెండొందల దాటించాడు. రెన్ షా 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయడంతో బ్రిస్బేన్ మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇక లిన్ నాటౌట్గా మిగిలాడు. ఆపై టార్గెట్ను ఛేదించే క్రమంలో హరికేన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. దాంతో బ్రిస్బేన్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో బ్రిస్బేన్కు ఇది రెండో విజయం. అంతకుముందు సిడ్నీ సిక్సర్స్పై బ్రిస్బేన్ విజయం సాధించింది. ఆ మ్యాచ్లో కూడా లిన్ దూకుడుగా ఆడాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 94 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిడ్నీ సిక్సర్స్పై బ్రిస్బేన్ హీట్ 48 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.(ఇక్కడ చదవండి:‘ప్రతీ సిక్స్ను డొనేట్ చేస్తా’) -
‘ప్రతీ సిక్స్ను డొనేట్ చేస్తా’
మెల్బోర్న్: ఆస్ట్రేలియా పించ్ హిట్టర్లలో క్రిస్ లిన్ ఒకడు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు ఈ హార్డ్ హిట్టర్. గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో అతని కనీస ధర రూ. 2 కోట్లకే ముంబై దక్కించుకుంది. క్రిస్ లిన్ను కోల్కతా నైట్రైడర్స్ వదిలేసుకోవడంతో ఈసారి వేలంలోకి వచ్చాడు లిన్. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న లిన్.. ఈ లీగ్లో కొట్టే ప్రతీ సిక్స్ను ఆస్ట్రేలియాలో అడవులు అంటుకుని వాటి బారిన పడ్డ బాధితులకు డొనేట్ చేస్తానంటున్నాడు. ‘ హే గయ్స్.. ఈ ఏడాది బిగ్బాష్ లీగ్లో నేను కొట్టే ప్రతీ సిక్స్కు 250 డాలర్లను వారికి సాయంగా అందిస్తా. ఒక్కో సిక్స్కు 250 డాలర్లను ఇవ్వాలనుకుంటున్నా’ అని లిన్ ట్వీట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన వివాదాస్పద టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ కూడా తన వంతు సాయాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఏటీపీ కప్లో తాను కొట్టే ప్రతీ ఏస్కు 200 డాలర్లను ఇస్తానని తెలిపాడు. మరొక ఆసీస్ టెన్నిస్ ప్లేయర్ అలెక్స్ డి మినార్ కూడా ప్రతీ ఏస్కు 250 డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. కాకపోతే తాను ఎక్కువ ఏస్లు కొట్టలేనేమోననే అనుమానం వ్యక్తం చేశాడు. ఇలా క్రికెట్ స్టార్లు, టెన్నిస్ స్టార్లు కలిసి తమ దేశంలోని అడవులు అంటుకుని వాటి బారిన పడ్డ వారికి సాయం చేయడానికి నడుం బిగించారు. గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలో అడవులను అంటుకున్న మంటలు క్రమంగా న్యూసౌత్ వేల్స్ , విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్లాండ్ తదితర ప్రాంతాలకు వ్యాపించడంతో 17 మంది మ్యత్యువాడ పడగా వందల సంఖ్యలో గాయపడ్డారు.(ఇక్కడ చదవండి: క్రిస్ లిన్కు జాక్పాట్ లేదు..!) -
క్రిస్ లిన్కు జాక్పాట్ లేదు..!
కోల్కతా: ఈసారి ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్ కనీస ధరకే అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లకే ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. క్రిస్ లిన్పై మిగతా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపెట్టకపోవడంతో అతను కనీస ధరకే పరిమితమయ్యాడు. ఈ వేలంలో లిన్కు అత్యధిక ధర పలుకుతుందని ఊహించనప్పటికీ లిన్కు నిరాశే ఎదురైంది. కోల్కోత్ నైట్ రైడర్స్ కూడా తమ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్ను వదిలేసుకుంది. క్రిస్ లిన్ (రూ. 9.6 కోట్లు)కు అత్యధిక మొత్తం చెల్లించి రావడంతోనే అతన్ని కేకేఆర్ వదిలేసుకుందనేది కాదనలేని వాస్తవం. అబుదాబి టీ10 లీగ్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు లిన్ ఇటీవలే సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ వదిలేసిన రోజుల వ్యవధిలోనే ఈ రికార్డును లిన్ సాధించాడు. మరాఠా అరేబియన్స్ తరుఫున లిన్ 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్కు చెందిన అలెక్స్ హేల్స్ టీ10 అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. అయినప్పటికీ లిన్ కోసం పెద్దగా పోటీ లేకుండా పోయింది. ఇక్కడ ముంబై ఇండియన్స్ అతన్ని కనీస ధరకే కొనుగోలు చేయడంతో జాక్పాట్ కొట్టిందనే చెప్పాలి. -
‘అతడ్ని వదిలేశాం.. నిన్ను తీసుకుంటాం’
హైదరాబాద్: కోల్కతా నైట్రైడర్స్ స్టార్ హిట్టర్ క్రిస్ లిన్ను ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ వేలంలోకి విడిచిపెట్టడంపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెదవివిరిచిన విషయం తెలిసిందే. ఇది చెత్త నిర్ణయమంటూ విమర్శించాడు. అయితే యువీ విమర్శలపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ ఫన్నీగా స్పందించాడు. ‘యువరాజ్ సింగ్ మేము హిట్టర్ క్రిస్ లిన్ను వదిలిపెట్టాం. దీంతో కేకేఆర్ వేలంలో నిన్ను తీసుకోవడానికి బిడ్ వేయవచ్చు!. ఇద్దరు చాంపియన్ల(లిన్, యువీ)పై ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఉంటుంది’అంటూ కేకేఆర్ సీఈఓ ట్వీట్ చేశాడు. ‘క్రిస్లిన్ని కేకేఆర్ ఎందుకు రిటైన్ చేసుకోలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అతడిని వేలంలోకి వదిలేయడమనేది కేకేఆర్ తీసుకున్న చెత్త నిర్ణయం. ఈ విషయమై కోల్కతా నైట్రైడర్స్ సహ యజమాని షారూక్ ఖాన్కి మెసేజ్ చేస్తా’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్–2020 వేలానికి ముందు ఎనిమిది ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. వీరిలో కొందరు వరుస వైఫల్యాలతో జట్టుకు బలహీనతగా మారగా... మరికొందరు వేలంలో భారీ మొత్తాలకు అమ్ముడై అదే స్థాయి ప్రదర్శన కనబర్చకుండా భారంగా మారిపోయారు. దీంతో క్రిస్ లిన్, జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి వంటి ఖరీదైన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు వదిలేసుకున్నాయి. -
అది కేకేఆర్ బ్యాడ్ కాల్: యువరాజ్
న్యూఢిల్లీ: ఐపీఎల్–2020 వేలానికి ముందు ఎనిమిది ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు వరుస వైఫల్యాలతో జట్టుకు బలహీనతగా మారగా... మరికొందరు వేలంలో భారీ మొత్తాలకు అమ్ముడై అదే స్థాయి ప్రదర్శన కనబర్చకుండా భారంగా మారిపోయారు. దాంతో కోల్కోత్ నైట్ రైడర్స్ కూడా తమ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్ను వదిలేసుకుంది. క్రిస్ లిన్ (రూ. 9.6 కోట్లు)కు అత్యధిక మొత్తం చెల్లించి రావడంతోనే అతన్ని కేకేఆర్ వదిలేసుకుందనేది కాదనలేని వాస్తవం. అబుదాబి టీ10 లీగ్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు లిన్ ఇటీవలే సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ వదిలేసిన రోజుల వ్యవధిలోనే ఈ రికార్డును లిన్ సాధించాడు. మరాఠా అరేబియన్స్ తరుఫున లిన్ 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్కు చెందిన అలెక్స్ హేల్స్ టీ10 అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. లిన్ తాజా ప్రదర్శనతో కేకేఆర్ చింతించడం ఖాయం. అయితే కేకేఆర్ ఫ్యాన్స్కు లిన్ను వదిలేయడం అమితంగా బాధిస్తోంది. హార్డ్ హిట్టర్ అయిన లిన్ను రిలీజ్ చేయడంతో ఆ ఫ్రాంఛైజీ అభిమానుల్ని షాక్ గురి చేసింది. ఇదే అభిప్రాయాన్ని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సైతం వ్యక్తం చేశాడు. లిన్ను వదిలేయడం కేకేఆర్ బ్యాడ్ కాల్గా అభివర్ణించాడు. ఇది తనకు ఓ జోక్గా అనిపిస్తుందన్నాడు. ఈ విషయాన్ని అసలు కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ తెలియజేశారో,లేదో అంటూ యువరాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఒకవేళ షారుఖ్ కూడా అతని వదిలేయడానికి ఇష్టపడితే అప్పుడు రిలీజ్ చేసినా ఇబ్బంది ఉండదన్నాడు. ‘ నేను చూసిన ఐపీఎల్లో లిన్ ఒక ప్రత్యేక ఆటగాడు. కేకేఆర్కు ఎన్నో సందర్భాలు మంచి ఆరంభాలు ఇచ్చాడు. అసలు అతన్ని ఎందుకు అంటిపెట్టుకోలేదో నాకైతే కచ్చితంగా తెలియదు. నా వరకూ అయితే అది కేకేఆర్ తప్పుడు నిర్ణయం. దీనిపై షారుఖ్కు మెస్సేజ్ ఉందా. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో లిన్ అసాధారణ ఆటగాడు’ అని యువీ పేర్కొన్నాడు. ఇక విదేశీ లీగ్లో ఆడటంపై యువీ సంతృప్తి వ్యక్తం చేశాడు. వచ్చే రెండు-మూడేళ్లలో మరిన్ని లీగ్లు రాబోతున్నాయని, వాటిలో ఆడటం చూస్తున్నట్లు యువీ తెలిపాడు. ఒక ఏడాది మొత్తంగా ఆడేకంటే రెండు-మూడు నెలలు క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నానని యువీ పేర్కొన్నాడు. -
మళ్లీ సీఎస్కేదే విజయం
కోల్కతా: ఐపీఎల్లో భాగంగా ఇక్కడ కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్కతా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే ఇంకా రెండు బంతులుండగానే ఛేదించింది. ఫలితంగా ఏడో విజయాన్ని కోల్కతా ఖాతాలో వేసుకుంది. కాగా, ఈ సీజన్లో కేకేఆర్తో జరిగిన రెండు లీగ్ మ్యాచ్ల్లోనే సీఎస్కేదే పైచేయి అయ్యింది. తాజా మ్యాచ్లో సురేశ్ రైనా(58 నాటౌట్; 42 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, రవీంద్ర జడేజా(31 నాటౌట్; 17 బంతుల్లో 5 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. ఇక చెన్నై జట్టులో డుప్లెసిస్(24), కేదార్ జాదవ్(20)లు ఫర్వాలేదనిపించగా, ఎంఎస్ ధోని(16) నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్, పీయూష్ చావ్లా తలో రెండు వికెట్లు సాధించగా, గర్నీ వికెట్ తీశాడు. అంతకుముందు కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు ఓపెనర్ సునీల్ నరైన్(2) నిరాశ పరిచాడు. కాగా, మరో ఓపెనర్ క్రిస్ లిన్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు తీసింది.అయితే ఫస్ట్ డౌన్లో వచ్చిన నితీశ్ రాణా(21) మోసర్తుగా ఆడగా, రాబిన్ ఊతప్ప గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. క్రిస్ లిన్ మాత్రం 51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు సాయంతో 82 పరుగులు సాధించిన తర్వాత నాల్గో వికెట్గా ఔటయ్యాడు. ఆపై ఎవరూ రాణించకపోడంతో కేకేఆర్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆండ్రీ రసెల్(10), దినేశ్ కార్తీక్(18), శుభ్మన్ గిల్(15)సైతం విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లో ఆకట్టుకుని కేకేఆర్ను కట్టడి చేశారు.ఇమ్రాన్ తాహీర్ నాలుగు వికెట్లతో మెరవగా, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించాడు. సాంట్నార్కు వికెట్ దక్కింది. -
కేకేఆర్ను కట్టడి చేశారు..
కోల్కతా: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 162 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు ఓపెనర్ సునీల్ నరైన్(2) నిరాశ పరిచాడు. కాగా, మరో ఓపెనర్ క్రిస్ లిన్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు తీసింది.అయితే ఫస్ట్ డౌన్లో వచ్చిన నితీశ్ రాణా(21) మోసర్తుగా ఆడగా, రాబిన్ ఊతప్ప గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. క్రిస్ లిన్ మాత్రం 51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు సాయంతో 82 పరుగులు సాధించిన తర్వాత నాల్గో వికెట్గా ఔటయ్యాడు. ఆపై ఎవరూ రాణించకపోడంతో కేకేఆర్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆండ్రీ రసెల్(10), దినేశ్ కార్తీక్(18), శుభ్మన్ గిల్(15)సైతం విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లో ఆకట్టుకుని కేకేఆర్ను కట్టడి చేశారు. కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.ఇమ్రాన్ తాహీర్ నాలుగు వికెట్లతో మెరవగా, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించాడు. సాంట్నార్కు వికెట్ దక్కింది. డుప్లెసిస్ నాలుగు క్యాచ్లు పట్టడం విశేషం. -
బెయిల్స్ పడకపోతే ఫోర్ ఇస్తారా?
జైపూర్ : కోల్కతా నైట్రైడర్స్తో సొంతమైదానంలో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. సమిష్టిగా రాణించిన కోల్కతా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కోల్కతా.. ఓపెనర్లు సునీల్ నరైన్(47), క్రిస్ లిన్(50) చెలరేగడంతో 37 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. అయితే కోల్కతా ఇన్నింగ్స్ సందర్బంగా విచిత్ర ఘటన చోటుచేసుకుంది. క్రిస్లిన్ బ్యాటింగ్ చేస్తుండగా ధవల్ కులకర్ణి వేసిన నాలుగో ఓవర్ రెండో బంతి.. వికెట్లను తాకింది. కానీ బెయిల్స్ కిందపడలేదు. విచిత్రంగా ఆ బంతి బౌండరీ వెళ్లింది. దీంతో క్రిస్లిన్ బతికిపోగా.. కోల్కతా నాలుగు పరుగులు లభించాయి. అయితే అంపైర్ ఫోర్ ఇవ్వడంపై మైదానంలోనే కెప్టెన్ అజింక్యా రహానే అభ్యంతరం చెప్పాడు. అంపైర్లతో చర్చించాడు. ఇక మ్యాచ్ అనంతరం అంపైర్లతో తాను జరిపిన సంభాషణ గురించి వివరణ ఇచ్చాడు. బంతి వికెట్లను తాకి బౌండరీ వెళ్తే ఎలా ఫోర్ ఇస్తారని ప్రశ్నించాడు. కనీసం దాన్ని డెడ్బాల్గానైనా ప్రకటించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘నిబంధనలు..నిబంధనలే. కనీసం ఫోర్ అన్నా ఇవ్వకండని అంపైర్లకు చెప్పాను. ఇప్పటికే టీ20 ఫార్మాట్ బౌలర్లకు కష్టంగా మారింది. ఇట్లాంటి పరిస్థితుల్లోనైనా బౌలర్స్కు ఫేవర్గా ఆ బంతిని డేడ్ బాల్ ఇవ్వాలని అంపైర్లను కోరాను’ అని రహానే వివరించాడు. ఇక క్రిస్లిన్ ఆ సమయంలో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దొరికిన ఈ అవకాశంతో చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఘటనపై స్పందిస్తూ.. తాను చాలా అదృష్టవంతుడినంటూ వ్యాఖ్యానించాడు. ఈ ఘటనపై నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఐపీఎల్లో వాడుతున్న బెయిల్స్ ఫెవికాల్ యాడ్కి గొప్పగా న్యాయం చేస్తున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కింగ్స్ పంజాబ్-చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ధోని కొట్టిన బంతి వికెట్లకు తాకినప్పటికి బెయిల్స్ కిందపడలేదు. దీంతో కేఎల్ రాహుల్కు లైఫ్ లభించింది. -
‘చెక్ చేయండిరా బాబు.. నమ్మలేకపోతున్నాం’
జైపూర్ : ఐపీఎల్ సీజన్12లో భాగంగా సొంతగడ్డపైనే రాజస్తాన్ రాయల్స్ను మట్టికరిపించి కోల్కతా నైట్రైడర్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత బౌలింగ్తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన కేకేఆర్.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆదివారం నాటి ఈ మ్యాచ్లో చెలరేగిన కోల్కతా ఓపెనింగ్ జోడి (నరైన్- క్రిస్లిన్)ని విడదీసేందుకు రాయల్స్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పది ఓవర్లు కూడా పూర్తికాక ముందే కేకేఆర్ స్కోరు వందకు చేరింది. ముఖ్యంగా ఓపెనర్ క్రిస్ లిన్ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి అభిమానులకు వినోదాన్ని పంచాడు. అయితే ‘బెయిల్స్’ కారణంగానే అతనికి లైఫ్ లభించిందని.. లేదంటే నాలుగో ఓవర్లలోనే అతడి ఆట ముగిసేదని రాయల్స్ అభిమానులు, క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఛేజింగ్లో భాగంగా నరైన్తో పాటు ఓపెనర్గా రంగంలోకి దిగిన క్రిస్ లిన్.. ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో రాయల్స్ బౌలర్ ధవల్ కులకర్ణి నాలుగో ఓవర్ రెండో బంతి(ఇన్సైడ్ ఎడ్జ్) ద్వారా లిన్ ఆట కట్టించాలని ప్రయత్నించాడు. అతడు అనుకున్నట్టుగానే బంతి వికెట్లను తాకగానే.. లైట్స్ కూడా వెలిగాయి. కానీ బెయిల్స్ మాత్రం కిందపడలేదు. అంతేకాదు బంతి బౌండరీ దాటడంతో కోల్కతాకు నాలుగు పరుగులు లభించగా.. అంపైర్ క్రిస్లిన్ను నాటౌట్గా ప్రకటించాడు. దీంతో కంగుతిన్న క్రికెట్ అభిమానులు.. ‘ ఎవరైనా కాస్త చెక్ చేయండిరా బాబు.. ఎవరైనా ఫెవికాల్తో బెయిల్స్ను అంటించారేమో. స్టంప్స్ను బాల్ గట్టిగా తాకినప్పటికీ బెయిల్స్ కిందపడకపోవడం ఏమిటి. అస్సలు నమ్మలేకపోతున్నాం. ఐపీఎల్లో వాడుతున్న బెయిల్స్ ఫెవికాల్ యాడ్కి గొప్పగా న్యాయం చేస్తున్నాయి. ఇందులో ఏదో మతలబు ఉంది’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా కులకర్ణి బౌలింగ్లో లైఫ్ పొందిన క్రిస్లిన్.. దూకుడుగా ఆడి 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో లిన్ ఔటయినప్పటికీ రాబిన్ ఉతప్ప (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు), శుభ్మన్ గిల్ (6 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో 13.5 ఓవర్లలోనే కేకేఆర్ లక్ష్యం(140 పరుగులు) పూర్తి చేసింది. ఇక ఈ మ్యాచ్తో ఐపీఎల్లో తొలిసారి బరిలోకి దిగిన హ్యారీ గర్నీ 2 వికెట్లు తీసి..‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు. Does someone want to check if the bails have been glued down? Never seen a ball hit the stumps that hard and not knock the bails off - unbelievable!#RRvKKR #HallaBol #IPL #IPL12 #ipl2019 #cricket pic.twitter.com/TLqshZ7Kvz — talesfrmthecrypt (@cricketwriter1) April 7, 2019 #RRvKKR #IPL2019 #BCCI #ICC #VIVOIPL What's point of inbuilt LEDs stumps/bails.. Even if the bails don't get dislodged the blink of LEDs should be taken into consideration.. pic.twitter.com/DJ0gDDDpI7 — Saurabh Trivedi (@saurabh7755) April 7, 2019 -
కోల్కతా దర్జాగా...
మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ చావోరేవోలాంటి మ్యాచ్లో చెలరేగింది. బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్పై ఆతిథ్య జట్టును చిత్తు చేసి దర్జాగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. పనిలో పనిగా సొంతగడ్డపై సన్రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. ప్రస్తుత సమీకరణం ప్రకారం చెన్నై మ్యాచ్ తర్వాత కూడా కోల్కతా మూడో స్థానంలోనే ఉంటుంది. దీంతో నైట్ రైడర్స్ తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లోనే ఎలిమినేటర్తోపాటు గెలిస్తే రెండో క్వాలిఫయర్ కూడా అదే వేదికపై ఆడుతుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–11లో ప్లేఆఫ్స్కు చేరిన మూడో జట్టుగా కోల్కతా నైట్రైడర్స్ నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. ఫలితంగా 16 పాయింట్లతో ప్లే ఆఫ్కు అర్హత సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్ (17 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), శ్రీవత్స్ గోస్వామి (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ప్రసిధ్ కృష్ణ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్కతా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (43 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు రాబిన్ ఉతప్ప (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. చివర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (22 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఒత్తిడిలో మరో కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. ఒకే ఓవర్లో నలుగురు ఔట్... తొలి బంతికే ధావన్ కొట్టిన ఫోర్తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మరోవైపు సీజన్లో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం లభించిన గోస్వామి చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఒక పరుగు వద్ద రసెల్ బౌలింగ్లో అంపైర్ ఔట్గా ప్రకటించినా... గోస్వామి రివ్యూ కోరిన తర్వాత అది హెల్మెట్కు తగిలిందని తేలింది. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్న గోస్వామి అదే ఓవర్లో ఒక సిక్సర్, 2 ఫోర్లతో చెలరేగాడు. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్ప్లే ముగిసేసరికి సన్రైజర్స్ స్కోరు 60 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ చక్కటి బంతితో 79 పరుగుల (52 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. అనంతరం విలియమ్సన్ కూడా తన ఫామ్ను కొనసాగించడంతో రైజర్స్ దూసుకుపోయింది. కుల్దీప్ బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టిన అతను, ఆ తర్వాత సియర్ల్స్ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్కు ప్రయత్నించి అదే ఓవర్లో వెనుదిరిగాడు. 45 పరుగుల వద్ద నరైన్ క్యాచ్ వదిలేసిన అనంతరం ధావన్ అర్ధ సెంచరీ (38 బంతుల్లో) పూర్తయింది. చివర్లో మనీశ్ పాండే (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి ఆటగాళ్లు అంతా విఫలమయ్యారు. చివరి ఓవర్లో ప్రసి«ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా, మరో రనౌట్ కలిపి హైదరాబాద్ నాలుగు వికెట్లు కోల్పోయింది. లిన్ మెరుపులు... ఛేదనలో ఎప్పటిలాగే తనదైన శైలిలో సునీల్ నరైన్ (10 బంతుల్లో 29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో మొదలు పెట్టాడు. సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను, చివరి బంతికి సిక్సర్ బాదాడు. ఆ తర్వాత షకీబ్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి నరైన్ ఔటయ్యాడు. లిన్ కూడా ధాటిగా ఆడటంతో కోల్కతా రన్రేట్ దూసుకుపోయింది. పవర్ప్లేలో కేకేఆర్ 66 పరుగులు చేసింది. లిన్, ఉతప్ప మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో కోల్కతా ఇన్నింగ్స్ చకచకా సాగింది. 11 పరుగుల వద్ద భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఉతప్ప ఇచ్చిన క్యాచ్ను రషీద్ వదిలేయగా... దీనిని వాడుకున్న ఉతప్ప... షకీబ్ ఓవర్లో 6,4 తో జోరు ప్రదర్శించాడు. సందీప్ బౌలింగ్లో కొట్టిన భారీ సిక్స్తో 36 బంతుల్లో లిన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే లిన్, ఉతప్పలతో పాటు రసెల్ (4), నితీశ్ రాణా(7) వెనుదిరిగినా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మిగతా పనిని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) ప్రసిధ్ 50; గోస్వామి (సి) రసెల్ (బి) కుల్దీప్ 35; విలియమ్సన్ (సి) రసెల్ (బి) సియర్ల్స్ 36; మనీశ్ పాండే (సి) సబ్–రింకూ సింగ్ (బి) ప్రసిధ్ 25; యూసుఫ్ పఠాన్ (సి) ఉతప్ప (బి) నరైన్ 2; బ్రాత్వైట్ (సి) కార్తీక్ (బి) రసెల్ 3; షకీబ్ (సి) నరైన్ (బి) ప్రసిధ్ 10; రషీద్ ఖాన్ (సి) కార్తీక్ (బి) ప్రసిధ్ 0; భువనేశ్వర్ రనౌట్ 0; కౌల్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–79, 2–127, 3–141, 4–147, 5–161, 6–168, 7–172, 8–172, 9–172. బౌలింగ్: నితీశ్ రాణా 1–0–5–0, ప్రసిధ్ 4–0–30–4, రసెల్ 3–0–31–1, నరైన్ 4–0–23–1, చావ్లా 2–0–19–0, కుల్దీప్ 4–0–35–1, సియర్ల్స్ 2–0–24–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (సి) పాండే (బి) కౌల్ 55; నరైన్ (సి) పాండే (బి) షకీబ్ 29; ఉతప్ప(సి) గోస్వామి (బి) బ్రాత్వైట్ 45; కార్తీక్ నాటౌట్ 26; రసెల్ (సి) పాండే (బి) కౌల్ 4; రాణా (సి) భువనేశ్వర్ (బి) బ్రాత్వైట్ 7; గిల్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–52, 2–119, 3–149, 4–160, 5–172. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–0, సందీప్ శర్మ 2–0–30–0, కౌల్ 4–0–26–2, షకీబ్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–31–0, బ్రాత్వైట్ 2.4–0–21–2. -
లిన్... గెలిపించెన్
బెంగళూరు: ఈ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో ఓటమి. గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 200లకు పైగా పరుగులు చేసి కూడా పరాజయం పాలైన ఆ జట్టు ఈ మ్యాచ్లో 175 పరుగులనూ కాపాడుకోలేకపోయింది. ఫలితంగా ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... మెకల్లమ్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. రసెల్ (3/31)కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలో దిగిన కోల్కతా 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 176 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ లిన్ (52 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), ఉతప్ప (21 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్లు), కార్తీక్ (10 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సిరాజ్, మురుగన్ అశ్విన్లు రెండేసి వికెట్లు పడగొట్టారు. లిన్ మెరుపులు... రెండు వరుస ఓటములతో డీలా పడ్డ కోల్కతాకు ఈ మ్యాచ్లో అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో పవర్ప్లేలో 51 పరుగులు వచ్చాయి. లిన్ 7 పరుగుల వద్ద ఉన్నపుడు అతను ఇచ్చిన క్యాచ్ను మురుగన్ అశ్విన్ వదిలేశాడు. తొలి వికెట్కు 59 పరుగులు జోడించాక నరైన్ ఔటైనా లిన్... ఉతప్పతో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఈ జోడీ బౌండరీలతో విరుచుకుపడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 88/1తో నిలిచింది. మరో ఇరవై పరుగులు జోడించాక మురుగన్ అశ్విన్ బౌలింగ్లో ఉతప్ప వెనుదిరిగాడు. ఈ క్రమంలో లిన్ 42 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్లో రాణా (15) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగ్గా... క్రీజులోకి వచ్చిన రసెల్ (0) తొలి బంతికే ఔటవ్వడంతో బెంగళూరు శిబిరంలో ఆశలు చిగురించాయి. ఈ సమయంలో విజయానికి 3 ఓవర్లలో 29 పరుగులు అవసరం కాగా... లిన్తో కలిసి కార్తీక్ చెలరేగాడు. సౌతీ వేసిన 18వ ఓవర్లో 14 పరుగులు, ఆ తర్వాత సిరాజ్ ఓవర్లో 11 పరుగులు రావడంతో విజయ సమీకరణం ఆరు బంతుల్లో 4కు చేరింది. చివరి ఓవర్ తొలి బంతిని శుబ్మన్ గిల్ (5 నాటౌట్) బౌండరీకి తరలించి లాంఛనాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: డికాక్ (సి) శుబ్మన్ (బి) కుల్దీప్ 29; మెకల్లమ్ (సి) కార్తీక్ (బి) రసెల్ 38; కోహ్లి నాటౌట్ 68; వోహ్రా (బి) రసెల్ 0; మన్దీప్ సింగ్ (సి) శివమ్ (బి) రసెల్ 19; గ్రాండ్హోమ్ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–67, 2–74, 3–75, 4–140. బౌలింగ్: చావ్లా 3–0–22–0, నరైన్ 4–0–38–0, జాన్సన్ 3–0–38–0, శివమ్ 3–0–21–0, కుల్దీప్ 4–0–20–1, రసెల్ 3–0–31–3. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ నాటౌట్ 62; నరైన్ (సి) గ్రాండ్హోమ్ (బి) మురుగన్ అశ్విన్ 27; రాబిన్ ఉతప్ప (సి) సౌతీ (బి) అశ్విన్ 36; రాణా రిటైర్డ్ హర్ట్ 15; రసెల్ (సి) డికాక్ (బి) సిరాజ్ 0; కార్తీక్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 23; శుబ్మన్ గిల్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–59, 2–108, 3–139, 4–171. బౌలింగ్: సౌతీ 4–0–34–0, ఉమేశ్ యాదవ్ 3.1–0–36–0, యజువేంద్ర చహల్ 4–0–29–0, మొహమ్మద్ సిరాజ్ 4–0–40–2, మురుగన్ అశ్విన్ 4–0–36–2. -
క్రిస్లిన్ విజృంభణ.. పంజాబ్కు భారీ లక్ష్యం
కోల్కతా : సొంతగడ్డపై కింగ్స్పంజాబ్తో జరగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఓపెనర్ క్రిస్లిన్ విజృంభించాడు. దీంతో పంజాబ్కు 192 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతాకు ఆదిలోనే నరైన్(1) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఊతప్పతో లిన్ దాటిగా ఆడాడు. వీరిద్దరు రన్రేట్ తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి కోల్కతా 50 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడు పెంచిన ఉతప్ప34(23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సు).. అశ్విన్ బౌలింగ్లో కరుణ్ నాయర్ అద్భుత క్యాచ్కు పెవిలియన్ చేరాడు. దీంతో రెండో వికెట్కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే నితీష్ రానా లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్గా వెనుదిరిగాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ బాధ్యాతాయుతంగా ఆడగా.. మరో వైపు క్రిస్లిన్ రెచ్చిపోయాడు. ఈ దశలో 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో క్రిస్లిన్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 147 పరుగుల వద్ద ఆండ్రూ టై బౌలింగ్లో కీపర్ క్యాచ్గా క్రిస్లిన్71(41 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్సులు) పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగో వికెట్కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రస్సెల్(10) నిరాశపరిచాడు. కట్టడి చేసిన పంజాబ్ చివర్లో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కార్తీక్ 43(28 బంతులు, 6 ఫోర్లు) దాటిగా ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే టామ్ కుర్రాన్(1) సైతం వికెట్ సమర్పించుకున్నాడు. అండర్-19 స్టార్ శుభ్మన్గిల్(14 నాటౌట్), పియూష్ చవ్లా(2 నాటౌట్)లుగా నిలిచారు. దీంతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది. ఇక చివరి రెండో ఓవర్లో కోలకతాకు కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. పంజాబ్ బౌలర్లలో బీబీశ్రన్, ఆండ్రూ టైలు రెండు వికెట్లు తీయగా.. ముజీబ్, అశ్విన్లు తలా ఓ వికెట్ తీశారు. -
ఐపీఎల్కు ముందే కోల్కతాకు షాక్
సాక్షి, స్పోర్ట్స్ : ఐపీఎల్-11 సీజన్ ప్రారంభం కాకముందే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ క్రిస్లిన్ గాయపడ్డాడు. అతనికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్న కోల్కతా ఫ్రాంచైజీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండు సార్లు కోల్కతాను టోర్నీ విజేతగా నిలబెట్టిన గంభీర్ను కాదని వేలంలో రూ. 9.6 కోట్లకు ఈ స్టార్ బ్యాట్స్మన్ను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విధ్వసంకర ఆటగాడు టీ20 ట్రైసిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో గాయపడ్డాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో కివీస్ ఆటగాడు రాస్ టేలర్ ఆడిన షాట్ బంతిని అందుకునేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో అతడి కుడిచేతి భుజానికి గాయం అయింది. వెంటనే క్రిస్లిన్ను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు స్కానింగ్ చేయగా ఎడమ చేతి భుజం ఎముకకు గాయమైనట్లు గుర్తించారు. వారి సూచన మేరకు బ్రేస్ ధరించి లిన్ డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చాడు. గత ఐపీఎల్లో బౌండరీ ఆపే ప్రయత్నంలో ఇదే తరహాలో గాయపడి తన ఎడమచేతి భుజానికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. ఇప్పటికే క్రిస్లిన్ మొత్తం మూడుసార్లు తన ఎడమ భుజానికి సర్జరీ చేయించుకున్నాడు. దీంతో దుబాయ్లో ప్రారంభం కాబోతున్న పాకిస్థాన్ ప్రిమీయర్ లీగ్(పీఎస్ఎల్)కు పూర్తి స్థాయిలో దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో క్రిస్లిన్ ఐపీఎల్ వరకు కోలుకుంటాడో లేదో అని కోల్కతా శిభిరంలో ఆందోళనలు నెలకొన్నాయి. -
నైట్రైడర్స్ నాయకుడు.. విధ్వంసక హిట్టర్..!
కోల్కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2018లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు నాయకత్వ బాధ్యతలు ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్మన్కు దక్కనున్నాయా?. ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అవకాశం వస్తే నైట్రైడర్స్కు నాయకత్వం వహిస్తానని సోమవారం క్రిస్ లిన్ ప్రకటించడంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. ఐపీఎల్-2017లో మెరుపు ఇన్నింగ్స్లతో క్రిస్లిన్ ఫ్రాంచైజీలను ఆకర్షించాడు. దీంతో వేలంలో రూ. 9.6కోట్ల భారీ మొత్తానికి లిన్ను కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. నైట్రైడర్స్కు అత్యధిక కాలం పాటు నాయకుడిగా వ్యవహరించిన గంభీర్ని వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది. గంభీరే తన కోసం బిడ్ చేయొద్దని కోరాడని ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ కెప్టెన్ వేటలో పడింది. తొలుత ఉతప్పకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంచైజీ భావించింది. అయితే, ఇప్పుడు క్రిస్లిన్ వైపే ఫ్రాంఛైజీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
మా ఓపెనింగ్ కు జడుసుకుంటున్నారు: లిన్
మొహాలీ: కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనింగ్ జంటను చూసి ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయని ఆ జట్టు ఓపెనర్ క్రిస్ లిన్ అభిప్రాయపడ్డారు. ఓపెనర్ గా సునీల్ నరైన్ అద్భుతంగా రాణిస్తున్నాడని లిన్ పేర్కొన్నాడు. మంగళవారం కింగ్స్ పంజాబ్ తో కోల్ కతా 14 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో క్రిస్ లిన్ 52 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో లిన్-నరైన్ లు పరుగుల సునామిని సృష్టించారు. ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ కేవలం 15 బంతుల్లో వేగవంతమైన రికార్డు అర్ధసెంచరీ నమోదు చేశాడు. సునీల్ నరైన్ ఓపెనర్ గా రాణించడం, రాబిన్ ఊతప్ప తిరిగి జట్టులో చేరడంతో మా బ్యాటింగ్ లైనప్ బలపడిందని లిన్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్ధులు మా బ్యాటింగ్ బలాన్ని చూసి భయపడుతున్నారని, మేము మా ఆట పట్ల పాజిటివ్ గా ఉన్నామని తెలిపాడు. కేకేఆర్ 13 మ్యాచ్ లు ఆడి 8 గెలిచిందని, ఇంకో మ్యాచ్ మిగిలి ఉందని ఇది గెలిచి రెండో స్థానం కైవసం చేసుకుంటామని లిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండు సార్లు చాంపియన్ అయిన కోల్ కతా కు ఇది కష్టమేమి కాదని లిన్ పేర్కొన్నాడు. పంజాబ్ తో ఓడడం నిరాశపరిచిందని, ఓటమికి 6,11 ఓవర్లో బంతులు డాట్ అవ్వడమే కారణమన్నాడు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బాల్స్ వేసారని రెండు వికెట్లు త్వరగా కోల్పోవడం కూడా ఓటమికి కారణమైందని లిన్ వ్యాఖ్యానించాడు. ఒక వేళ ముంబైతో జరిగే మ్యాచ్ లో ఓడితే మేము కాంపిటేషన్ నుంచి తప్పుకున్నట్లేనని, ముంబై పై గొప్ప ప్రదర్శన మా జట్టుకు అవసరమని లిన్ అభిప్రాయపడ్డాడు. -
అలా ఎవరూ ఊహించలేరు: గంభీర్
కోల్కతా: ఆస్ట్రేలియా బ్యాట్స్మన్, తమ టీమ్ సహచరుడు క్రిస్ లిన్పై కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే ‘హార్డెస్ట్ హిట్టర్’ అంటూ పొడిగాడు. బంతిని బలంగా బాదడంలో అతడిని మించినవాడు లేడని ఆకాశానికెత్తేశాడు. గాయం నుంచి కోలుకున్న వెంటనే నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడాడని మెచ్చుకున్నాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో బంతిని బలంగా కొట్టడంతో క్రిస్ లిన్ అందరికంటే ముందుంటాడు. పునరాగమనం ఇంత ఘనంగా చాటతానని అతడే అనుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే గాయంతో నెల రోజులు ఆటకు దూరమై బరిలోకి దిగిన వెంటనే నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడడం మామూలు విషయం కాదు. ఆర్సీబీతో మ్యాచ్లో ఊహించని రీతిలో అతడు చెలరేగాడు. సునీల్ నరైన్, లిన్ ఇద్దరూ రెండువైపుల హిట్టింగ్ చేశారు. ఇలాంటి ఇన్నింగ్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆరు ఓవర్లలో 105 పరుగులు చేస్తారని ఎవరూ ఊహించరు. నరైన్ ఓపెనర్గా పంపడం మంచి ఫలితాన్ని ఇచ్చింద’ని ఓ ఇంటర్య్వూలో గంభీర్ పేర్కొన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో నరైన్, లిన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నరైన్ 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేయగా, లిన్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. -
ఐపీఎల్-10: క్రిస్ లిన్ వచ్చేశాడోచ్!
న్యూ ఢిల్లీ: ఐపీఎల్-10లో భుజ గాయంతో కొన్ని మ్యాచ్ లకు దూరమైన క్రిస్ లిన్ ఎట్టకేలకు తిరిగి వచ్చాడు. కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ లీన్ ఈ సీజన్ లో అత్యంత వేగంగా 19 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తొలి అర్ధ భాగంలో ముంబై తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ క్రిస్ లిన్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ గాయం తీవ్రం కావడం, ఇప్పటికే మూడు సార్లు అదే భుజానికి గాయం అవ్వడంతో ఐపీఎల్ సీజన్ కు దూరం అవుతాడని అందరూ భావించారు. కానీ క్రిస్ లిన్ మంగళవారం కోల్ కతా జట్టు ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. చాలా దృఢంగా కనిపించిన లిన్ భుజానికి పట్టీలతోనే ప్రాక్టీస్ చేశాడు. క్రిస్ లిన్ ఆడిన రెండు మ్యాచుల్లో ఓపెనర్ గా 125 పరుగులు చేసి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాడు. ఇందులో గుజరాత్ లయన్స్ మ్యాచ్ లో క్రిస్ లిన్ వేగమైన అర్ధ సెంచరీ (93) నమోదు చేయడంతో గుజరాత్ పై కోల్ కతా 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక గాయంతో లిన్ దూరమవ్వడంతో అతని స్థానంలో ఒపెనర్ గా స్పిన్ బౌలర్ సునీల్ నరైన్ ను ప్రయోగించి కోల్ కతా విజయం సాధించింది. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా అధికార వైబ్ సైట్ లో కేకేఆర్ అభిమానులు క్రిస్ లిన్ రాక ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారని, మే 9న కింగ్స్ పంజాబ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండగలడని పేర్కొంది. ఇక క్రిస్ లిన్ రాకతో కోల్ కతా జట్టుకు బలం చేకూరనుంది. భుజగాయం నెమ్మదిగా తగ్గుతుందని, గాయమైన మరుసటి రోజు ఇంజక్షన్ తీసుకున్నానని, అది బాగా పనిచేసిందని క్రిస్ లిన్ క్రికెట్.కామ్.ఏయూ లో పేర్కొన్నాడు. -
ఐపీఎల్లో క్రిస్ లిన్ ఆడతాడు
ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ సందర్బంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ కోల్ కతా నైట్ రైడర్స్ క్రిస్ లిన్ టోర్నీ దూరం కావడం లేదని ఆ జట్టు యాజమాన్యం స్సష్టం చేసింది. ఈ మేరకు గాయపడ్డ లిన్ స్వదేశానికి పయనమైతున్నట్లు వచ్చిన వార్తలను కేకేఆర్ ఖండించింది. ' ఐపీఎల్-10 లో లిన్ మాతోపాటే ఉంటాడు. అతనికి గాయమైన మాట వాస్తవమే. పాత గాయంపైనే మరొకసారి గాయం కావడంతో ఆ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కేకేఆర్ డాక్టర్ల పర్యవేక్షణలో లిన్ కు ట్రీట్మెంట్ కు జరుగుతుంది. అతని గాయంతో ఇబ్బంది లేదు. ఐపీఎల్లో లిన్ ఆడతాడు' అని కేకేఆర్ సహ యజమాని వెంకీ మైసూర్ తెలిపారు. మొన్న గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో లిన్ చెలరేగి ఆడి 41 బంతుల్లో 6 ఫోర్లు,8 సిక్సర్లతో 93 పరుగులు చేసి కోల్ కతా ఘన విజయంలో పాలు పంచుకున్నాడు. ఆ తరువాత ముంబైతో జరిగిన మ్యాచ్ లో 32 పరుగులు చేశాడు. అయితే ఫీల్డింగ్ చేసే సమయంలో బౌండరీ లైన్ వద్ద డైవ్ కొట్టడంతో లిన్ గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో జాస్ బట్లర్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే క్రమంలో లిన్ ఎడమ భుజానికి గాయమైంది. -
ఐపీఎల్ కు క్రిస్ లిన్ దూరం?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ స్టార్ ఆటగాడు క్రిస్ లిన్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ లిన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.మ్యాచ్ చివర్లో గాల్లో డైవ్ కొట్టడంతో అతని భుజానికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో ఫీల్డ్ లో విలవిల్లాడిపోయిన లిన్.. ఫిజియో సాయంతో మైదానం వీడాడు. అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో లిన్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. మొన్న గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో లిన్ చెలరేగి ఆడి 41 బంతుల్లో 6 ఫోర్లు,8 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. ఆ తరువాత నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో 32 పరుగులు చేశాడు. అయితే ఫీల్డింగ్ చేసే సమయంలో బౌండరీ లైన్ వద్ద లిన్ గాయపడ్డాడు. దీనిపై మ్యాచ్ అనంతరం లిన్ ట్వీట్ చేశాడు. 'ప్రియమైన క్రికెట్ దేవుళ్లారా..నేనేమైనా తప్పు చేశానా 'అంటూ తాను డైవ్ కొట్టడాన్ని ట్వీట్ లో ప్రస్తావించాడు. ప్రస్తుతం తనకైన గాయంతో టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్నాడు. -
ఐపీఎల్, ట్వంటీ20 చరిత్రలోనే తొలిసారిగా..
రాజ్కోట్: గత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ లలో ప్రత్యర్థి గుజరాత్ లయన్స్ చేతిలో వారి గడ్డపైనే ఘోరంగా విఫలమైన కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)... ఐపీఎల్-10లో ఆడిన తొలి మ్యాచ్ లోనే ట్వంటీ20 లలో ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్ లో మాత్రమే కాదు ట్వంటీ20 చరిత్రలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా కోల్ కతా సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. శుక్రవారం రాత్రి ఇక్కడి ఎస్సీఏ మైదానంలో జరిగిన మ్యాచ్ లో తొలుత నిర్ణీత ఓవర్లలో గుజరాత్ 4 వికెట్లకు 183 పరుగులు చేయగా, ఛేదనకు దిగిన కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్, కెప్టెన్ గౌతమ్ గంభీర్ లు అజేయ అర్ధ శతకాలతో చెలరేగడంతో 14.5 ఓవర్లలోనే విజయం సాధించింది. ఓ వైపు బ్యాటింగ్ ప్రమోషన్ లో ఓపెనర్ గావచ్చిన క్రిస్ లిన్ (41 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊచకోతకు కెప్టెన్ గంభీర్ (48 బంతుల్లో 76 నాటౌట్; 12 ఫోర్లు) సొగసైన ఇన్నింగ్స్ తోడవడంతో సొంత మైదానంలో లయన్స్ ఘోరంగా విఫలమైంది. క్రిస్ లిన్, గంభీర్ తమ విజృంభణతో కేకేఆర్ కు ఏ వికెట్కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లిన్కు దక్కింది. వీరి విధ్వంసాన్ని రైనా బృందం ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. వీరి ధాటికి లయన్స్ బౌలర్లు కులకర్ణి 2.5 ఓవర్లలో 40 పరుగులు, మన్ ప్రీత్ గోని రెండు ఓవర్లలో 32 పరుగులు, డ్వేన్ స్మిత్ ఒక్క ఓవర్ వేసి 23 సమర్పించుకున్నారు. The highest total ever chased down in T20 cricket without a wicket being lost! https://t.co/Eulvx5Hexo #IPL #GLvKKR pic.twitter.com/6sHHs8qcdJ — ESPNcricinfo (@ESPNcricinfo) 7 April 2017 -
కోల్కతా కుమ్మేసింది
-
కోల్కతా కుమ్మేసింది
►10 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్పై ఘనవిజయం ►చెలరేగిన లిన్, గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. గత సీజన్లో లయన్స్ చేతిలో రెండుసార్లు చావు దెబ్బ తిన్న గంభీర్ సేన వారి సొంతగడ్డపైనే బెబ్బులిలా గర్జించింది. క్రిస్ లిన్ ఊచకోతకు కెప్టెన్ గంభీర్ సొగసైన షాట్లు తోడవ్వడంతో లయన్స్ ఈసారి తోక ముడిచింది. ఏమాత్రం పసలేని బౌలింగ్కు తోడు పేలవ ఫీల్డింగ్ను సొమ్ము చేసుకున్న కోల్కతా ఓపెనర్లు ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపిస్తూ సాగించిన విధ్వంసాన్ని రైనా బృందం ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. రాజ్కోట్: మూడో టైటిల్పై కన్నేసిన కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ పదో సీజన్ను ఘనంగా ఆరంభించింది. క్రిస్ లిన్ (41 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), కెప్టెన్ గంభీర్ (48 బంతుల్లో 76 నాటౌట్; 12 ఫోర్లు) తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగడంతో... శుక్రవారం ఎస్సీఏ మైదానంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) 10 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్ను చిత్తు చేసింది. జట్టు కూర్పులో నాణ్యమైన ఆల్రౌండర్ లేకపోవడం లయన్స్ను దెబ్బతీసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 183 పరుగులు చేసింది. కెప్టెన్ సురేశ్ రైనా (51 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. ఈ జోడి మధ్య నాలుగో వికెట్కు 87 పరుగులు జత చేరాయి. ఓపెనర్ మెకల్లమ్ (24 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 184 పరుగులు చేసి నెగ్గింది. లిన్, గంభీర్ తమ విజృంభణతో జట్టుకు ఏ వికెట్కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లిన్కు దక్కింది. గౌతీ, లిన్ల విధ్వంసం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా తమ తొలి ఓవర్లో ఏడు పరుగులే చేసినా... ఆ తర్వాత ఓపెనర్లు గంభీర్, లిన్ ఆకాశమే హద్దుగా బౌండరీలతో చెలరేగారు. మూడో ఓవర్లో లిన్ ఓ ఫోర్, సిక్స్తో చెలరేగగా, గంభీర్ బౌండరీ బాదాడు. దీంతో మన్ప్రీత్ గోని వేసిన ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఇక ఆరో ఓవర్లో గౌతీ నాలుగు ఫోర్లతో రెచ్చిపోవడంతో వపర్ప్లేలో తొలిసారిగా కోల్కతా అత్యధికంగా 73 పరుగులు చేసింది. ఇక ఏడో ఓవర్లో లిన్.. స్మిత్ బౌలింగ్ను చీల్చి చెండాడాడు. ఏకంగా మూడు సిక్సర్లు, ఓ ఫోర్ బాదడంతో 19 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయ్యింది. 8 ఓవర్లలోనే కేకేఆర్ సెంచరీ మార్కు దాటింది. అటు గంభీర్ 33 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. గోని మరో సారి బౌలింగ్కు దిగగా గంభీర్ మూడు ఫోర్లు బాది 15 పరుగులు సాధించాడు. ఇక 15వ ఓవర్లో లిన్ ఇచ్చిన క్యాచ్ను మెకల్లమ్ బౌండరీ లైన్ దగ్గర వదిలేయడంతో సిక్స్గా వెళ్లింది. ఆ తర్వాత వరుసగా 4,6 సహా మొత్తం 22 పరుగులు రాబట్టి జట్టుకు కావాల్సిన విజయాన్ని అందించాడు. రైనా జోరు అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ లయన్స్కు నాలుగో ఓవర్లోనే షాక్ తగిలింది. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన ఓపెనర్ జేసన్ రాయ్ (12 బంతుల్లో 14; 3 ఫోర్లు) చావ్లా బౌలింగ్లో పేలవ షాట్కు వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బ్రెండన్ మెకల్లమ్తో జతకలిసిన రైనా బ్యాట్ను ఝుళిపించాడు. దీంతో పవర్ప్లేలో లయన్స్ 52 పరుగులు చేసింది. ఏడో ఓవర్ చివరి రెండు బంతులను మెకల్లమ్ 4,6గా మలిచాడు. అయితే వీరి జోరుకు తొమ్మిదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ అడ్డుకట్ట వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే మెకల్లమ్ను ఎల్బీగా అవుట్ చేయడంతో రెండో వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 16వ ఓవర్లో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న రైనా 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అటు దినేశ్ కార్తీక్ అడపాదడపా బౌండరీలతో సహకారం అందించడంతో నిలకడగా పరుగులు వ చ్చాయి. చివరి 4 ఓవర్లలో వీరిద్దరి జోరు కు లయన్స్ 53 పరుగులు రాబట్టింది. స్కోరు వివరాలు గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: రాయ్ (సి) యూసుఫ్ (బి) చావ్లా 14; మెకల్లమ్ ఎల్బీడబ్లు్య (బి) కుల్దీప్ యాదవ్ 35; రైనా (నాటౌట్) 68; ఫించ్ (సి) సూర్యకుమార్ (బి) కుల్దీప్ యాదవ్ 15; దినేశ్ కార్తీక్ (సి) సుర్యకుమార్ (బి) బౌల్ట్ 47; స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–22, 2–72, 3–92, 4–179; బౌలింగ్: బౌల్ట్ 4–0–40–1; చావ్లా 4–0–33–1, నరైన్ 4–0–33–0; వోక్స్ 3–0–35–0; కుల్దీప్ 4–0–25–2; పఠాన్ 1–0–15–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గంభీర్ (నాటౌట్) 76; లిన్ (నాటౌట్) 93; ఎక్స్ట్రాలు 15; మొత్తం (14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 184. బౌలింగ్: ప్రవీణ్ 2–0–13–0; ధావల్ 2.5–0–42–0; గోని 2–0–32–0; కౌశిక్ 4–0–40–0; డ్వేన్ స్మిత్ 1–0–23–0; జకాతి 3–0–30–0. ⇒1 టి20 క్రికెట్లో వికెట్ నష్టపోకుండా అత్యధిక లక్ష్య ఛేదన (184) చేసిన జట్టు కోల్కతా. ⇒1 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి (4,110)ని అధిగమించిన సురేశ్ రైనా (4,166). ఐపీఎల్లో నేటి మ్యాచ్లు ►పంజాబ్ & రైజింగ్ పుణే ►వేదిక: ఇండోర్; సా. గం. 4.00 నుంచి ►బెంగళూరు & ఢిల్లీ డేర్డెవిల్స్ ►వేదిక: బెంగళూరు; రా. గం. 8.00 నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం -
లయన్స్ పై లిన్ వీరవిహారం
రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ క్రిస్ లిన్ వీరవిహారం చేశాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గుజరాత్ బౌలర్లపై ఆది నుంచి విరుచుకుపడ్డ లిన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి ఓవర్ ఆఖరి బంతిని ఫోర్ కొట్టిన లిన్..ఆ తరువాత రెండో ఓవర్ రెండు, మూడు బంతుల్ని సిక్సర్, ఫోర్లగా మలిచి తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. ఆ తరువాత కూడా లిన్ రెచ్చిపోయి ఆడటంతో గుజరాత్ బౌలర్లకు నిరాశే మిగిలింది.అతనికి జతగా కోల్ కతా కెప్టెన్ గౌతం గంభీర్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో కోల్ కతా జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. -
'అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం గొప్ప అనుభవం'
షార్జా: దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కలిస్తో కలిసి బ్యాటింగ్ చేయడం తాను నమ్మలేకపోతున్నానని కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు క్రిస్లిన్ అన్నాడు. ఇది తనకు నమ్మశక్యంకాని అనుభవమని పేర్కొన్నాడు. క్రీజులో కలిస్ చాలా రిలాక్స్గా ఉంటాడని అందువల్ల అతడు ఒత్తిడికి గురికాడని వెల్లడించాడు. నిశ్శబ్దంగా బ్యాటింగ్ చేస్తూ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతాడని చెప్పాడు. గొప్ప క్రికెటర్లలో కలిస్ ఒకడని కితాబిచ్చాడు. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా బ్యాటింగ్ చేయడం కలిస్ ప్రత్యేకత అని 24 ఏళ్ల క్రిస్లిన్ అన్నాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో సంచలన క్యాచ్తో కోల్కతాకు క్రిస్లిన్ విజయాన్ని అందించాడు. 31 బంతుల్లో 45 పరుగులు చేసి బ్యాటింగ్లోనూ రాణించాడు. -
లిన్ ‘విన్నర్’
క్రిస్లిన్ సంచలన క్యాచ్ తో నెగ్గిన కోల్కతా ఉత్కంఠపోరులో బెంగళూరుకు నిరాశ క్యాచ్లు మ్యాచ్ల్ని గెలిపిస్తాయంటారు... నిజమే... ఒక్క క్యాచ్ బెంగళూరు నోటి దగ్గర విజయాన్ని దూరం చేసింది. ఒలింపిక్స్లో జిమ్నాస్ట్లు చేసే విన్యాసాన్ని తలపిస్తూ క్రిస్లిన్ అందుకున్న సంచలన క్యాచ్తో... కోల్కతా ఖాతాలో అసాధారణ విజయం చేరింది. 19.3 ఓవర్ల పాటు బెంగ ళూరు చేతిలో ఉన్న మ్యాచ్ను ఒకే ఒక్క క్యాచ్తో ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్లిన్ కోల్కతా ఖాతాలో చేర్చాడు. షార్జా: సులభంగా గెలవాల్సిన మ్యాచ్... చేతులో కావల్సినన్ని వికెట్లు... ఏ జట్టుకు లేనంత బలమైన బ్యాటింగ్ లైనప్... కానీ ఫలితం లేదు... టి20 ప్రపంచకప్ ఫైనల్ను తలపిస్తూ యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ బెంగళూరు కొంప ముంచింది. రెండు, మూడు ఓవర్లు మిగిలి ఉండగానే గెలవాల్సిన మ్యాచ్ను మాల్యా జట్టు చేజేతులా పొగొట్టుకుంది. తాము గెలుస్తామనే నమ్మకం ఏ కోశానా లేని కోల్కతా నైట్ రైడర్స్ బెంగళూరు చెత్త బ్యాటింగ్ కారణంగా అనూహ్యంగా విజయం సాధించింది. గురువారం షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్లో గంభీర్ సేన 2 పరుగుల తేడాతో కోహ్లి బృందంపై నెగ్గింది. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకోగా... కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసింది. క్రిస్లిన్ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్లు), కలిస్ (42 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఉతప్ప (22), సూర్యకుమార్ (24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్ వరుణ్ ఆరోన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. టకవాలె (28 బంతుల్లో 40; 8 ఫోర్లు), కోహ్లి (23 బంతుల్లో 31; 4 ఫోర్లు), యువరాజ్ (34 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా... ఆఖరి ఓవర్లో జరిగిన డ్రామాలో బెంగళూరు తేలిపోయింది. బ్యాటింగ్లో రాణించడంతో పాటు... అద్భుతమైన క్యాచ్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చిన లిన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తడబాటుతో మొదలై... గంభీర్, మనీష్ పాండే విఫలం కావడంతో కోల్కతా 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ కలిస్, క్రిస్లిన్ ధాటిగా ఆడారు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 80 పరుగులు జోడించారు. అయితే ఆరోన్ ఒకే ఓవర్లో లిన్తో పాటు యూసుఫ్ పఠాన్ను అవుట్ చేసి కోల్కతా జోరుకు బ్రేక్ వేశాడు. కలిస్ వేగం తగ్గించడం, ఉతప్ప ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కోల్కతా ఒత్తిడిలో పడింది. చివర్లో సూర్యకుమార్ ధాటిగా ఆడి నైట్రైడర్స్కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఒత్తిడిలో చిత్తు 151 పరుగుల లక్ష్యఛేదనను బెంగళూరు జట్టు ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు టకవాలె, పార్థీవ్ చెలరేగి తొలి వికెట్కు 67 పరుగులు జోడించారు. అయితే ఈ ఇద్దరూ అదే స్కోరు వద్ద అవుటయ్యారు. కోహ్లి, యువరాజ్ నిలకడగా ఆడటంతో బెంగళూరు 13వ ఓవర్లో వంద మార్కు చేరింది. బెంగళూరు లక్ష్యం దిశగా సాగుతున్న సమయంలో కోహ్లి అవుటయ్యాడు. 25 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో యువరాజ్ నెమ్మదిగా ఆడాడు. దీంతో ఒత్తిడి పెరిగింది. యువీ అవుటయ్యాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా... వినయ్ కుమార్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతికి డివిలియర్స్ దాదాపుగా సిక్సర్గా మలిచాడు. అయితే లిన్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకోవడంతో మ్యాచ్ కోల్కతా ఖాతాలో చేరింది. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: కలిస్ (సి) టకవాలె (బి) చహల్ 43; గంభీర్ ఎల్.బి.డబ్ల్యు (బి) స్టార్క్ 0; మనీష్ పాండే (సి) కోహ్లి (బి) అల్బీ మోర్కెల్ 5; క్రిస్ లిన్ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 45; యూసుఫ్ పఠాన్ (సి) కోహ్లి (బి) ఆరోన్ 0; ఉతప్ప (సి) స్టార్క్ (బి) ఆరోన్ 22; సూర్య కుమార్ నాటౌట్ 24; వినయ్ కుమార్ (సి) అల్బీ మోర్కెల్ (బి) స్టార్క్ 4; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు): 150 వికెట్ల పతనం: 1-1; 2-10; 3-90; 4-90; 5-107; 6-129; 7-150 బౌలింగ్: స్టార్క్ 4-0-33-2; అల్బీ మోర్కెల్ 2-0-21-1; వరుణ్ ఆరోన్ 4-0-16-3; మురళీధరన్ 2-0-25-0; చహల్ 4-0-26-1; దిండా 4-0-26-0 బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: పార్థివ్ పటేల్ (సి) లిన్ (బి) వినయ్ 21; టకవాలె ఎల్.బి.డబ్ల్యు (బి) కలిస్ 40; కోహ్లి (బి) నరైన్ 31; యువరాజ్ (సి) యూసుఫ్ పఠాన్ (బి) ఉమేశ్ యాదవ్ 31; డివిలియర్స్ (సి) లిన్ (బి) వినయ్ 11; అల్బీ మోర్కెల్ నాటౌట్ 6; స్టార్క్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు): 148 వికెట్ల పతనం: 1-67; 2-67; 3-122; 4-141; 5-145 బౌలింగ్: ఉమేశ్ 4-0-40-1; మోర్నీ మోర్కెల్ 4-0-34-0; నరైన్ 4-0-17-1; వినయ్ 4-0-26-2; కలిస్ 4-0-26-1. బెంగళూరు విజయ లక్ష్యం 6 బంతుల్లో 9 పరుగులు...క్రీజులో డివిలియర్స్, ఆల్బీ మోర్కెల్.... వినయ్ వేసిన తొలి మూడు బంతుల్లో మూడు పరుగులు...ఇక విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులు వినయ్ నాలుగో బంతి వేశాడు... డివిలియర్స్ బలంగా గాల్లోకి లేపాడు... బంతి వేగంగా బౌండరీ వైపు దూసుకుపోతోంది.... ఇక సిక్సరే... అనుకునే లోపు క్రికెట్ చరిత్రలో ఇంతవరకు సాక్షాత్కరించని ఓ మెరుపు దృశ్యం కళ్ల ముందు తళుక్కుమంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న క్రిస్లిన్... బౌండరీ రోప్ దగ్గర చేసిన విన్యాసం... క్షణకాలం స్టేడియం మూగబోయేలా చేసింది. ....బంతి గాల్లో వేగంగా దూసుకొస్తోంది. తదేకంగా చూస్తూ పరుగెడుతున్న లిన్ స్లిప్ అయ్యాడు. కానీ రెప్పపాటులో ఒంటి కాలి మీద వెనక్కి లేస్తూ గాలిలో రోప్ మీదకు జంప్ చేశాడు. బౌండరీ దాటుతున్న బంతిని నేర్పుగా రెండు చేతుల్లో ఒడిసిపట్టాడు. అంతే వేగంతో శరీరాన్ని విల్లులా వంచుతూ... ముందుకు తీసుకొచ్చి రోప్ను తగలకుండా కుడి చేతి మీద బరువు వేస్తూ పక్షిలా నేలపైకి ల్యాండ్ అయ్యాడు... సీన్ కట్ చేస్తే... డివిలియర్స్ అవుట్... రెండు, మూడు సెకన్లలోనే ఈ మొత్తం సీన్ జరగడంతో స్టేడియంలోని ప్రతి ఒక్కరు ఒక్కసారిగా ఊపిరి బిగపట్టి నిశ్చేష్టులైపోయారు. చివరి రెండు బంతులకు మూడు పరుగులే రావడంతో కోల్కతా అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకుంది.