deals
-
మూడు నెలల్లో రూ.5,330 కోట్ల ఒప్పందాలు
భారతీయ సాంకేతిక రంగంలోని కంపెనీలు 2024 జులై–సెప్టెంబర్ కాలంలో 635 మిలియన్ డాలర్ల (రూ.5,330 కోట్లు) విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు కన్సల్టింగ్ కంపెనీ ‘గ్రాంట్ థ్రాంటన్ భారత్’ వెల్లడించింది. అందుకుగల కారణాలు విశ్లేషిస్తూ సంస్థ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని వివరాల ప్రకారం..యూఎస్ ఫెడ్ ఇటీవల కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అది టెక్ కంపెనీలకు సానుకూలాంశంగా మారింది. లోన్లు అధికంగా జారీ చేస్తూ టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకునేందుకు ఫైనాన్స్ సంస్థలు ఆసక్తి చూపుతాయి. భారత్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత అనిశ్చితులు తొలగి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సెప్టెంబర్ త్రైమాసికంలో 79 ఒప్పందాలు జరిగాయి. గతంలో కంటే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 20 మిలియన్ డాలర్ల(రూ.168 కోట్లు)కు పైగా విలువ కలిగిన డీల్స్ 12 నమోదయ్యాయి. విలీనాలు, కొనుగోళ్లు జూన్ త్రైమాసికంతో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ఇవి గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే 53 శాతం అధికమై 26 డీల్స్కు చేరుకున్నాయి. ఈ ఒప్పందాల విలువ 205 శాతం దూసుకెళ్లి 116 మిలియన్ డాలర్లు(రూ.975 కోట్లు)గా నమోదైంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!భారత్పట్ల బుల్లిష్గా..‘పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్పై చాలా బుల్లిష్గా ఉన్నారు. మార్కెట్లలోకి ప్రవహించే మూలధనం ప్రధాన లబ్ధిదారుల్లో భారత్ ఒకటి. వరుసలో పెద్ద సంఖ్యలో ఐపీవోలు ఉండటంతో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది పెట్టుబడిదారులు ఈ ఐపీవోల నుంచి మెరుగైన లాభాలు సంపాదించాలని భావిస్తున్నారు. ఏడాది కాలంలో స్టార్టప్ వ్యవస్థలో భారీగా నిధులు చేరాయి’ అని నివేదిక వివరించింది. -
పిజ్జాలు పంపించి.. రూ.కోట్ల డీల్స్ పట్టాడు!
కంపెనీలు తమ వ్యాపారం కోసం క్లయింట్లను ఆకర్షించడానికి చాలా చేస్తుంటారు. అయితే ఒక స్టార్టప్ సీఈఓ క్లయింట్లకు ఫుడ్ ట్రీట్ ఇచ్చి కోట్ల రూపాయల డీల్స్ దక్కించుకున్న సంగతి మీకు తెలుసా? ఈ డీల్స్ ద్వారా ఆ స్టార్టప్కు ఊహించనంత ఆదాయం వచ్చింది.న్యూయార్క్కు చెందిన టెక్ స్టార్టప్ యాంటిమెటల్ కో ఫౌండర్, సీఈవో మాథ్యూ పార్క్హస్ట్ గత ఏప్రిల్ నెలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెక్ ఇన్ఫ్లుయన్సర్లతో సహా పలువురికి పిజ్జాలను కొనుగోలు పంపించారు. ఇందు కోసం 15,000 డాలర్లు (సుమారు రూ.12.5 లక్షలు) ఖర్చు పెట్టారు. బీటా దశలో తమ కంపెనీ గురించి అవగాహన పెంచడమే ఈ ట్రీట్ ఉద్దేశం.కేవలం రెండు నెలల్లోనే యాంటిమెటల్ తన ఖర్చులను లాభదాయక ఒప్పందాలుగా మార్చి ఒక మిలియన్ డాలర్లకు పైగా (రూ.8.3 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. పిజ్జాతో ట్రీట్ చేసిన 75 కంపెనీలు పార్క్ హస్ట్ క్లయింట్లుగా మారాయి. ఈ విషయాన్ని సీఈవో పార్క్హస్ట్ సీఎన్బీసీ మేక్ ఇట్తో స్వయంగా వెల్లడించారు. నిజానికి 'పిజ్జా' తమ ఫస్ట్ ఛాయిస్ కాదని చెప్పారు. షాంపైన్ పంపించాలనుకున్నామని, అయితే దానికి చాలా ఖర్చవుతుందని, పిజ్జాను ఎంచుకున్నట్లు పార్క్హస్ట్ వివరించారు. -
డీల్స్ @ రూ. 60,000 కోట్లు!
ముంబై: ఓ వైపు దేశీ స్టాక్ మార్కెట్లు ఈ నెల(ఆగస్ట్)లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ మరోపక్క లిస్టెడ్ కార్పొరేట్ ప్రపంచంలో భారీస్థాయి విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. గత ఐదు నెలల తదుపరి ఆగస్ట్లో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేయగా.. షేర్ల అమ్మకపు డీల్స్ కొత్త రికార్డ్కు తెరతీశాయి. ఒక పరిశీలన ప్రకారం ఈ నెలలో 29 వరకూ మొత్తం రూ. 60,000 కోట్లమేర భారీ బ్లాక్డీల్స్ జరిగాయి. క్యాలెండర్ ఏడాదిలోని ఏ నెలలోనైనా విలువరీత్యా ఇవి అత్యధికంకాగా.. రెండు భారీ డీల్స్ ఇందుకు దోహదపడ్డాయి. సాఫ్ట్వేర్ సేవల దేశీ కంపెనీ కోఫోర్జ్(గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్)లో రూ. 7,684 కోట్ల విలువైన ఈక్విటీని పీఈ దిగ్గజం బేరింగ్ అనుబంధ కంపెనీ హల్ట్ విక్రయించింది. ఇదేవిధంగా ప్రయివేట్ రంగ విద్యుత్ కంపెనీ అదానీ పవర్లో ప్రమోటర్ గ్రూప్ రూ. 7,412 కోట్ల విలువైన షేర్లను యూఎస్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్కు విక్రయించింది. ఈ బాటలో ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ కుటుంబం 3 శాతం వాటాను రూ. 2,802 కోట్లకు విక్రయించింది. దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎమ్లో చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్ఫిన్ రూ. 2,037 కోట్ల విలువైన వాటాను అమ్మివేయగా.. ఆన్లైన్ ఫుడ్ సర్వింగ్ ప్లాట్ఫామ్ జొమాటోలో పీఈ దిగ్గజం టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాను రూ. 1,124 కోట్లకు విక్రయించింది. మార్కెట్ల వెనకడుగు.. ఈ ఏడాది జూలై 20న దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ సరికొత్త గరిష్టం 67,500 పాయింట్లను అధిగమించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం దాదాపు 20,000 పాయింట్ల స్థాయికి చేరింది. ఈ రికార్డ్ స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ నిజానికి ఆగస్ట్లో 3 శాతం వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 65,100, నిఫ్టీ 19,350 వద్ద కదులుతున్నాయి. అయితే దేశీయంగా అదనపు లిక్విడిటీ, మిడ్, స్మాల్క్యాప్స్నకు విస్తరించిన యాక్టివిటీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు వంటి అంశాలు.. ఈ నెలలో భారీ స్థాయి లావాదేవీలకు కారణమవుతున్నట్లు కార్పొరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థపై మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలు, స్టాక్ మార్కెట్ భవిష్యత్పై పెరుగుతున్న ఇన్వెస్టర్ల విశ్వాసం జత కలుస్తున్నట్లు తెలియజేశాయి. ఇతర స్టాక్స్లోనే.. ప్రధానంగా ఇండెక్సేతర కంపెనీలలోనే ఇటీవల వాటాల విక్రయాలలో భారీ లావాదేవీలు నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మొత్తం మార్కెట్లో జరుగుతున్న అంశాలను సెన్సెక్స్ లేదా నిఫ్టీ ప్రతిఫలించకపోవచ్చని తెలియజేశాయి. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు), విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు), పీఈ సంస్థలు తదితర దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు స్వల్పకాలిక అంశాలను పరిగణనలోకి తీసుకోవని వివరించాయి. ఈ నెలలో మార్కెట్లు రికార్డ్ గరిష్టాల నుంచి కొంతమేర క్షీణించినప్పటికీ.. మిడ్, స్మాల్ క్యాప్స్ చరిత్రాత్మక గరిష్టాలకు చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎన్ఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 23% జంప్చేయగా.. నిఫ్టీ దాదాపు 7% ఎగసింది. ఇక జూన్లోనూ మొత్తం రూ. 50,000 కోట్ల విలువైన భారీ బ్లాక్డీల్స్ నమోదుకావడం మార్కెట్ల లోతుకు నిదర్శనమని నిపుణులు విశ్లేíÙంచారు. -
జూలైలో కార్పొరేట్ డీల్స్ 3.1 బిలియన్ డాలర్లు
ముంబై: కార్పొరేట్ డీల్స్ (ఒప్పందాలు) విలువ జూలై నెలలో 58 శాతం పెరిగి 3.1 బిలియన్ డాలర్లుగా (రూ.25,730 కోట్లు) నమోదైంది. మొత్తం మీద డీల్స్ సంఖ్య తగ్గింది. ఈ వివరాలను గ్రాంట్ థార్న్టన్ విడుదల చేసింది. జూలైలో మొత్తం 3.1 బిలియన్ డాలర్ల కార్పొరేట్ ఒప్పందాలు నమోదయ్యాయి. విలువ పరంగా 58 శాతం పెరిగినా, సంఖ్యా పరంగా చూస్తే 46 శాతం తగ్గాయి. అంతర్జాతీయంగా మందగమనం కార్పొరేట్ డీల్స్పై ప్రభావం చూపించినట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ శాంతి విజేత తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి కార్పొరేట్ డీల్స్ విభాగంలో స్తబ్ధత ఉన్నట్టు చెప్పారు. సీమాంతర లావాదేవీలు డీల్స్ విలువ పెరగడానికి దోహదపడినట్టు చెప్పారు. అదే సమయంలో ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లలో అప్రమత్తత ఉండడంతో డీల్స్ సంఖ్య తగ్గినట్టు తెలిపారు. ముఖ్య డీల్స్.. ► 29 డీల్స్ విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉంది. ► రూట్ మొబైల్లో 58 శాతం వాటా కొనుగోలుకు 721 మిలియన్ డాలర్లతో ప్రాక్సిమస్ ఓపల్ కుదుర్చుకున్న డీల్ అతిపెద్దదిగా ఉంది. ► అదానీ క్యాపిటల్, అదానీ హౌసింగ్ ఫైనాన్స్లో 90 శాతం వాటా కొనుగోలుకు బెయిన్ క్యాపిటల్ 176 మిలియన్ డాలర్లతో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. ► నాలుగు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) విలువ 668 మిలియన్ డాలర్లుగా ఉంది. -
అదానీ పవర్లో 8.1% వాటా విక్రయం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్లు తాజాగా అదానీ పవర్లో 8.1 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఇందుకోసం 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,000 కోట్లు) వెచ్చించాయి. సెకండరీ మార్కెట్లో అత్యంత భారీ ఈక్విటీ డీల్స్లో ఇది కూడా ఒకటని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం.. 31.2 కోట్ల షేర్లను ప్రమోటర్ అదానీ కుటుంబం విక్రయించగా, సగటున షేరుకు రూ. 279.17 రేటుతో జీక్యూజీ పార్టనర్స్, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. జీక్యూజీ ఇప్పటికే అదానీ గ్రూప్నకు చెందిన పలు సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఒక ఇన్వెస్టరు, ప్రమోటరు గ్రూప్ మధ్య ఈ తరహా లావాదేవీ జరగడం భారత్లో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు వివరించాయి.. అదానీ గ్రూప్ వ్యాపార ప్రమాణాలను, బలాన్ని ఇది సూచిస్తోందని తెలిపాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ దెబ్బతో అదానీ గ్రూప్ అతలాకుతలం అయిన పరిస్థితుల్లో, ఈ ఏడాది మార్చి నుంచి ఆ గ్రూప్ సంస్థల్లో జీక్యూజీ క్రమంగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్లో 5.4 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 6.54%, అదానీ ట్రాన్స్మిషన్లో 2.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీలోనూ.. మరో స్టాక్ మార్కెట్ డీల్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్ 1.27 శాతం వాటాలను రూ. 717.57 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా జీక్యూజీ పార్ట్నర్స్, వాషింగ్టన్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ తదితర సంస్థలు కొనుగోలు చేశాయి. జేఎస్డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్.. షేరు ఒక్కింటికి రూ. 341.7 రేటు చొప్పున 2.10 కోట్ల షేర్లను విక్రయించింది. డీల్ అనంతరం జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్ వాటా 20.22 శాతం నుంచి 18.95 శాతానికి తగ్గింది. ఇటీవలే జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో జీక్యూజీ పార్ట్నర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్ రూ. 411 కోట్లతో 1.19 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. -
ప్రథమార్ధంలో డీల్స్ డౌన్
ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధంలో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ పరిమాణంపరంగా పెరిగినా విలువపరంగా మాత్రం 75 శాతం క్షీణించింది. 32.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ వ్యవధిలో డీల్స్ సంఖ్య 5.2 శాతం పెరిగి 1,400కి చేరింది. 1980లో ఎంఅండ్ఏ డీల్స్ను రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత ఇదే గరిష్ట స్థాయి. గతేడాది ఏప్రిల్లో హెచ్డీఎఫ్సీ ద్వయం 40 బిలియన్ డాలర్ల ఒప్పందం ప్రకటించగా.. ఈసారి కనీసం 5 బిలియన్ డాలర్ల ఒప్పందాలు కూడా లేకపోవడం గమనార్హం. ఫైనాన్షియల్ మార్కెట్ల డేటా సంస్థ రెఫినిటివ్ నివేదిక ప్రకారం.. తొలి త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్ల లోపు ఒప్పందాలే ఎక్కువగా ఉండగా .. రెండో త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్ల డీల్స్ నాలుగు నమోదయ్యాయి. ఈక్విటీ విభాగంలో 2018 తర్వాత ఈసారి ప్రథమార్ధంలో ఐపీవో మార్కెట్లో సందడి నెలకొంది. 75 చిన్న, మధ్య తరహా సంస్థలు లిస్ట్ కాగా.. 1.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. లిస్టయిన సంస్థల సంఖ్య వార్షికంగా చూస్తే 25 శాతం పెరిగినా.. సమీకరించిన నిధుల పరిమాణం మాత్రం 73 శాతం తగ్గింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఫాలో ఆన్ ఆఫర్లు 127 శాతం పెరిగి 9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అదానీ గ్రూప్లో భాగమైన నాలుగు సంస్థల్లో 1.9 బిలియన్ డాలర్ల వాటాలు విక్రయించడం ఇందుకు ఊతమిచ్చింది. ► ఆర్థిక రంగంలో అత్యధికంగా 7.5 బిలియన్ డాలర్ల మేర ఒప్పందాలు కుదిరినప్పటికీ.. విలువపరంగా 89 శాతం తగ్గాయి. ఇండ్రస్టియల్స్ విభాగంలో 5.2 బిలియన్ డాలర్లు (11.6 శాతం డౌన్), హై టెక్నాలజీలో 5 బిలియన్ డాలర్ల (73.1 శాతం తగ్గుదల) ఒప్పందాలు కుదిరాయి. ► ప్రైవేట్ ఈక్విటీ దన్ను గల ఎంఅండ్ఏ డీల్స్ విలువ 8.2 బిలియన్ డాలర్లుగా (56 శాతం క్షీణత) నమోదైంది. ► ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లు 10.3 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2021 తర్వాత ప్రథమార్ధంలో ఇంత అత్యధికంగా నిధులు రావడం ఇదే ప్రథమం. ► ప్రైమరీ బాండ్ల జారీ 66 శాతం పెరిగింది. ఇందులో ఫైనాన్షియల్ రంగం 81.3 శాతం, ఇండస్ట్రియల్స్ 7 శాతం మేర వాటా దక్కించుకున్నాయి. -
స్మార్ట్ఫోన్స్ కొనేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Big Saving Days) పేరుతో తాజా సేల్ ఈవెంట్ను ప్రకటించింది. ఈ సేల్ జూన్ 10న ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగనుంది. ఈ పరిమిత కాల సేల్లో ఐఫోన్ 13, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23, పోకో ఎక్స్5తో సహా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్కార్ట్ బెస్ట్ డీల్స్, ఆకర్షణీయ తగ్గింపులను అందిస్తోంది. వీటితోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్స్.. ఫ్లాట్ డిస్కౌంట్స్ ⮞ ఐఫోన్13 (iPhone 13) 128జీబీ స్టోరేజ్ వేరియంట్ను ఫ్లిప్కార్ట్ రూ.58,749 నుంచి ఆఫర్ చేస్తోంది. ఇది యాపిల్ ఆన్లైన్ స్టోర్లో రూ.69,900 ఉంది. అంటే రూ. 11,151 ఫ్లాట్ తగ్గింపు . అదనంగా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు అదనంగా 10 శాతం తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.57,999లకే ఐఫోన్13ను కొనుగోలు చేయవచ్చు . ⮞ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 (Samsung Galaxy F23) 5Gని రూ.13,499లకే అందిస్తోంది. మార్చిలో లాంచ్ అయినప్పుడు దాని అసలు ధర రూ.17,499. రూ.6,500 తగ్గింపు అంటే ఎవరు వదులుకుంటారు? ఇంకా తక్కువ ధరకు ఫోన్ కావాలనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) రూ. 10,999 లకే అందుబాటులో ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం14 (Samsung Galaxy M14)ని అయితే ఫ్లిప్కార్ట్లో రూ. 14,327 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ⮞ ఇక రూ.15,499 ఉన్న మోటో జీ62 (Moto G62) రూ. 14,499లకు, 15,499 ఉన్న పోకో ఎక్స్5 (Poco X5 5G)ని రూ.14,999లకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.4,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్ -
టెక్ ఒప్పందాల జోరుకు బ్రేకులు
న్యూఢిల్లీ: టెక్నాలజీ సర్వీసుల రంగంలో ఒప్పందాల జోరు తగ్గింది. ఈ ఏడాది (2023) తొలి త్రైమాసికంలో లావాదేవీల సంఖ్య 150కి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 270 పైగా, 2021లో 220 పైచిలుకు ఒప్పందాలు కుదిరాయి. కన్సల్టెన్సీ ఈవై, ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్, ప్రైవేట్ ఈక్విటీ ఒప్పందాలు 57 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. 2020తో పోలిస్తే (27 బిలియన్ డాలర్లు) ఇది రెట్టింపు కావడం గమనార్హం. అయితే, గతేడాది ఆఖరులో నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికం వరకు డీల్స్ నెమ్మదించినట్లు నివేదిక తెలిపింది. అయినప్పటికీ రాబోయే రోజుల్లో మధ్య స్థాయి కంపెనీల మధ్య లావాదేవీలు మెరుగ్గానే ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది మిగతా కాలంలో రిస్కులను తగ్గించుకునే ఉద్దేశంతో ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు సంస్థలు మరింతగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ►2022లో ఐటీ సర్వీసులు, బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్), ఈ–ఆర్అండ్డీ (ఇంజినీరింగ్, ఆర్అండ్డీ) తదితర విభాగాల్లో 947 డీల్స్ కుదిరాయి. అయిదేళ్లలో ఇదే అత్యధికం. ► 2020తో పోలిస్తే 2022లో మొత్తం ఒప్పందాల విలువ, పరిమాణం రెట్టింపైంది. ►ఐటీ సర్వీసుల ఒప్పందాల్లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థల భాగస్వామ్యం 2020తో పోలిస్తే 2022లో 2.5 రెట్లు పెరిగింది. భారీ ఒప్పందాల సెగ్మెంట్లో (500 మిలియన్ డాలర్ల పై స్థాయి) 62.5 శాతం వాటా దక్కించుకుంది. ► అధునాతన టెక్నాలజీలను దక్కించుకునే ఉద్దేశంతో ఐటీ సర్వీసుల కంపెనీలు ఎక్కువగా ఐపీ/ప్రోడక్ట్ సంస్థల్లో వాటాలను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపుతున్నాయి. ►భారీ సంస్థలు ప్రధానంగా ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఆర్/వీఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ), హైపర్–ఆటోమేషన్, కోడింగ్ తక్కువగా ఉండే లేదా అసలు కోడింగ్ అవసరం ఉండని కొత్త టెక్నాలజీలపై ఆసక్తిగా ఉంటున్నాయి. ►ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితులు ఎలా ఉన్నప్పటికీ కంపెనీల డిజిటల్ పరివర్తన ప్రక్రియ పలు దశాబ్దాల పాటు కొనసాగనుంది. దీనిపై సంస్థలు బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయనున్నాయి. తద్వారా రాబోయే రోజుల్లోనూ అధునాతన ఐటీ సొల్యూషన్స్కు డిమాండ్ భారీగానే ఉండనుంది. ►గడిచిన 24 నెలల్లో కంపెనీల పెట్టుబడుల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయి. సంస్థలు డిజిటల్, వ్యాపార పరివర్తన మీద ఇన్వెస్ట్ చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ► ప్రస్తుతం తయారీ, ఆటోమోటివ్, సరఫరా వ్యవస్థలు మొదలైన విభాగాల్లో ఏఆర్, వీఆర్, ఐవోటీ వంటి టెక్నాలజీల వినియోగం పెరుగుతోంది. టెక్నాలజీ రంగంలో డిజిటైజేషన్, క్లౌడిఫికేషన్, డిజిటల్ సీఎక్స్ (కస్టమర్ అనుభూతి) వంటి విభాగాలు వృద్ధి చెందనున్నాయి. -
క్యూ1లో 35 శాతం తగ్గిన డీల్స్
ముంబై: ప్రస్తుత కేలండర్ ఏడాది(2023) తొలి త్రైమాసికంలో డీల్స్ 35 శాతం క్షీణించినట్లు గ్రాంట్ థార్న్టన్ నివేదిక పేర్కొంది. జనవరి–మార్చి(క్యూ1)లో 9.7 బిలియన్ డాలర్ల విలువైన 332 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. ప్రపంచ ఆర్థిక మాంద్య భయాలు, కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం డీల్స్పై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం మొత్తం డీల్స్లో సగభాగానికిపైగా ఆక్రమించిన విలీనాలు, కొనుగోళ్లు(ఎంఅండ్ఏ) విలువ 21 శాతం నీరసించి 4.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 46 శాతం తక్కువగా 76 డీల్స్ నమోదయ్యాయి. ప్రధానంగా ఐపీవో మార్కెట్ క్షీణించడం ప్రభావం చూపింది. 2022 క్యూ1లో బిలియన్ డాలర్లు నమోదుకాగా.. తాజా సమీక్షా కాలంలో 84.4 మిలియన్ డాలర్లకు తగ్గింది. మరోపక్క క్విప్ విభాగంలో స్పైస్జెట్ కార్గో లాజిస్టిక్స్ బిజినెస్ 30.1 కోట్ల డాలర్లు, డేటా ప్యాటర్న్స్ 6 కోట్ల డాలర్లు చొప్పున సమీకరించాయి. అయితే 2022 క్యూ1లో 54.1 కోట్ల డాలర్ల సమీకరణతో పోలిస్తే తక్కువే. కాగా.. మొత్తం డీల్స్లో స్టార్టప్ రంగం వాటా 22 శాతంకాగా.. 6.9 కోట్ల డాలర్ల విలువైన 17 లావాదేవీలు జరిగాయి. అయితే ఇవి 2022 క్యూ1తో పోలిస్తే 71 శాతం క్షీణించడం గమనార్హం. -
మణిపాల్ హాస్పిటల్స్లో షియర్స్కు మెజారిటీ వాటా
న్యూఢిల్లీ: మణిపాల్ హాస్పిటల్స్లో మెజారిటీ వాటాలు దక్కించుకునే దిశగా షియర్స్ హెల్త్కేర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. హెల్త్కేర్ రంగంలో ఇదే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ డీల్ కాగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. డీల్పై వచ్చే వారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని వివరించాయి. ఒప్పందం ప్రకారం మణిపాల్ హాస్పిటల్స్ విలువ సుమారు రూ.40,000 కోట్లు – రూ.42,000 కోట్లుగా మదింపు చేసినట్లు పేర్కొన్నాయి. ప్రమోటర్ కుటుంబం, ఇతర ఇన్వెస్టర్లయిన టీపీజీ, ఎన్ఐఐఎఫ్ నుంచి వాటాలు కొనుగోలు చేయడం ద్వారా తన వాటాను పెంచుకునేందుకు షియర్స్ ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మిగతా ఇన్వెస్టర్ల నుంచి 41 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా షియర్స్ తన మొత్తం వాటాను 59 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. మణిపాల్ గ్రూప్నకు 28 ఆస్పత్రులు, 8,000 పడకలు ఉన్నాయి. సింగపూర్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టెమాసెక్కు సంబంధించిన హెల్త్కేర్ డెలివరీ అసెట్లను షియర్స్ నిర్వహిస్తోంది. షియర్స్కు మణిపాల్ హాస్పిటల్స్లో ప్రస్తుతం 18 శాతం వాటాలు ఉన్నాయి. దానితో పాటు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీకి 21%, భారత సార్వభౌమ వెల్త్ఫండ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)కు 8 శాతం వాటాలు ఉన్నాయి. కోల్కతాకు చెందిన హాస్పిటల్ చెయిన్ మెడికా సినర్జీ, మెడాంటా హాస్పిటల్స్ ఆపరేటర్ గ్లోబల్ హెల్త్లోనూ షియర్స్ వాటాదారుగా ఉంది. -
అమెరికానే బురిడీ కొట్టించిన నిత్యానంద.. అసలు కైలాస దేశమే లేదు..
వాషింగ్టన్: వివాదాస్పద గురువు నిత్యానంద ఏకంగా అమెరికానే బురిడీ కొట్టించాడు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్దికాలం క్రితం భారత్ నుంచి పారిపోయిన ఈయన.. ఓ ఐలాండ్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికే 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస' అని పేరుపెట్టుకున్నాడు. ఇదే తన దేశమని ప్రకటించుకున్నాడు. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో కైలాస ప్రతినిధులు పాల్గొని భారత్కు వ్యతిరేకంగా ప్రసంగించారు. వీరి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే 'సిస్టర్ సిటీ' పేరుతో కైలాస దేశం అమెరికాలోని నెవార్క్ నగరంతో ఒప్పందం కుదుర్చుంది. జనవరి 12న ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రతులపై ఇరువురు సంతకాలు కూడా చేశారు. దీంతో పాటు వర్జీనియా, ఓహియో, ఫ్లోరిడా సహా అమెరికాలోని 30 నగరాలు కైలసతో సాంస్కృతిక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఆ దేశం తెలిపింది. కానీ అసలు కైలాస అనే దేశమే లేదని తెలుసుకున్నాక అమెరికా నగరాలు నివ్వెరపోయాయి. దీంతో నెవార్క్ నగరం కైలాసతో ఒప్పందాలు రద్దు చేసుకుంది. కనీసం ఒక దేశం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా గుడ్డిగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏంటని నెవార్క్ అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: పుతిన్పై ఐసీసీ అరెస్టు వారెంట్ -
జోరుగా కార్పొరేట్ డీల్స్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా దేశీయంగా విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్ఏ).. ఇతరత్రా కార్పొరేట్ డీల్స్ మాత్రం గతేడాది భారీగానే జరిగాయి. కోవిడ్ పూర్వ స్థాయిని మించి 159 బిలియన్ డాలర్ల విలువ చేసే 2,103 లావాదేవీలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే విలువపరంగా 29 శాతం పెరిగాయి. 2022 వార్షిక నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం డీల్స్లో ఎంఅండ్ఏ తరహా ఒప్పందాల వాటా అత్యధికంగా ఉంది. 20పైగా భారీ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 2021తో పోలిస్తే రెట్టింపై 107 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. అయితే, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీన డీల్ (సుమారు 60 బిలియన్ డాలర్లు)ను మినహాయిస్తే మాత్రం ఎంఅండ్ఏ ఒప్పందాల విలువ 2021తో పోలిస్తే 15 శాతం తగ్గిందని నివేదిక తెలిపింది. ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులూ 2021తో పోలిస్తే 22 శాతం తగ్గి 52 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు పేర్కొంది. అయితే, అంతకన్నా ముందు మూడేళ్ల వ్యవధితో పోలిస్తే విలువ, పరిమాణంపరంగాను 20 శాతం ఎక్కువగానే నమోదైనట్లు వివరించింది. ఇన్వెస్టర్లు భారత్ను దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నారని, ప్రస్తుత మార్కెట్ మందగమనం కాస్త కష్టతరంగానే ఉన్నా చాలా మందికి పెద్దగా ఆందోళకరమైన అంశం కాకపోవచ్చని ఈ ధోరణుల ద్వారా తెలుస్తోందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ దినేష్ ఆరోరా తెలిపారు. ఆకర్షణీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ.. దేశీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ, హెల్త్కేర్, ఇంధనం, విద్యుత్, ఇండస్ట్రియల్స్ మొదలైన విభాగాలు ఆకర్షణీయంగా ఉండగలవని నివేదిక పేర్కొంది. గతేడాది కంపెనీలు తమ స్థానాలను పటిష్టపర్చుకోవడం, పోటీని కట్టడి చేయడం, కొత్త వినూత్న విభాగాల్లోకి ప్రవేశించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. దీనితో బ్యాంకింగ్, సిమెంట్, విమానయాన రంగాల్లో కొన్ని భారీ డీల్స్ చోటు చేసుకున్నాయని నివేదిక వివరించింది. -
క్షీణించిన కొనుగోళ్లు, విలీనాల డీల్స్ ..నవంబర్లో ఎంత శాతం అంటే
ముంబై: గత నెలలో కొనుగోళ్లు, విలీనాల (ఎంఅండ్ఏ) డీల్స్ విలువ 37 శాతం క్షీణించింది. 2021 నవంబర్తో పోలిస్తే 2.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గణాంకాల ఆధారంగా గ్రాంట్ థార్న్టన్ రూపొందించిన నివేదిక ప్రకారం డీల్స్ పరిమాణం సైతం 40 శాతం తగ్గి 119కు చేరాయి. అయితే ఈ ఏడాదిలోనే అత్యధికంగా పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తాయి. గత 11 ఏళ్లలో నాలుగోసారి గరిష్టస్థాయిలో కంపెనీలు లిస్టింగ్ను సాధించాయి. 2022 నవంబర్లో ఎంఅండ్ఏ పరిమాణంలో స్టార్టప్లదే హవా. 21 శాతం లావాదేవీలు నమోదయ్యాయి. -
మొదట ముంబై.. చివరన చెన్నై.. మరి హైదరాబాద్?
సాక్షి, హైదరాబాద్: వేగవంతమైన పట్టణీకర నేపథ్యంలో భూమి లభ్యత అనేది అత్యంత కీలకంగా మారింది. కరోనా నేపథ్యంలో ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలో స్థల లావాదేవీలు జరిగాయి. గతేడాది జులై – సెప్టెంబర్ (క్యూ3) నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1,757 ఎకరాలలో 45 భూ ఒప్పందాలు జరిగాయని అనరాక్ డేటా తెలిపింది. ఇందులో 69 శాతం వాటా 1,205 ఎకరాలు బహుళ నివాస సముదాయాల అభివృద్ధి కోసమే జరిగాయని.. వీటిల్లో సుమారు 4.5 నుంచి 5 కోట్ల చ.అ. విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లుంటాయని వెల్లడించింది. ఫస్ట్ ముంబై దేశంలోని 7 ప్రధాన నగరాలలో గత ఏడాది కాలంలో 1,205 ఎకరాలలో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా 28 భూ ఒప్పందాలు జరిగాయి. అత్యధికంగా 64 శాతం వాటాతో ముంబైలో 11 డీల్స్లో 768 ఎకరాల లావాదేవీలు జరిగాయి. 12 శాతం వాటాతో 4 డీల్స్లో ఎన్సీఆర్లో 150 ఎకరాల ఒప్పందాలున్నాయి. ఇందులో గుర్గావ్లో 77 ఎకరాలలో మూడు డీల్స్, నోయిడాలో 73 ఎకరాల ఒక డీల్ జరిగింది. కోల్కతాలో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) ప్రాతిపదికన 92 ఎకరాలలో రెండు ఒప్పందాలు జరిగాయి. రెండు భూ ఒప్పందాలలో 78 ఎకరాల లావాదేవీలతో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బెంగళూరులో ఐదు డీల్స్లో 59 ఎకరాలు, పుణేలో మూడు డీల్స్లో 42 ఎకరాలు, చెన్నైలో ఒక డీల్లో 16 ఎకరాల లావాదేవీలు జరిగాయి. ఏ డెవలపర్లంటే.. గోద్రెజ్ ప్రాపర్టీస్, సన్టెక్ రియాల్టీ, ఆషియానా హౌసింగ్, మహీంద్రా లైఫ్స్పేసెస్, ఎం3ఎం గ్రూప్, రన్వాలా డెవలపర్స్ నివాస సముదాయాల తో పాటూ పారిశ్రామిక, వాణిజ్యం, డేటా సెంటర్లు, రిటైల్ డెవలప్మెంట్ కోసం భూ ఒప్పందాలు జరిపారు. ఆర్ధిక స్థోమత ఉన్న చాలా మంది డెవలపర్లు ప్రధాన నగరాలలోని కీలకమైన ప్రాంతాలలో ల్యాండ్ బ్యాంక్ను ఏర్పరుచుకునేందుకు డీల్స్ను జరిపారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లపైనే.. కరోనా, నగదు లేమి కారణంగా గత 7–8 నెలలుగా పరిమిత స్థాయిలో భూ ఒప్పందాలు జరిగాయని అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. మరీ ముఖ్యంగా గత 3–4 నెలలుగా పరిశ్రమ స్టాండ్స్టిల్ దశకు చేరుకుందని పేర్కొన్నారు. ఏడాది కాలం పాటు డెవలపర్లు రుణాలను తీర్చడం లేదా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేయడానికే ఇష్టపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది క్యూ3 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని.. దీంతో గతంలో తమ వద్దే స్థలాలను అట్టిపెట్టుకున్న చాలా మంది భూ యజమానులు తిరిగి విక్రయానికి పెట్టారని పేర్కొన్నారు. దీంతో గతేడాది ధరల కంటే కొంచెం ఎక్కువ లేదా అదే ధరలకు పరిమిత స్థాయిలో భూ ఒప్పందాలు జరిగాయని వివరించారు. ఏ విభాగంలో ఎన్ని ఒప్పందాలంటే.. ► 1,757 ఎకరాలలో 45 భూ ఒప్పందాలు జరగగా.. ఇందులో ఆరు డీల్స్లో 411 ఎకరాలలో లాజిస్టిక్స్, పారిశ్రామిక పార్క్ల ఒప్పందాలున్నాయి. గుర్గావ్లో రెండు డీల్స్ ద్వారా 275 ఎకరాలు, చెన్నైలో 2 డీల్స్లో 83 ఎకరాలు, హౌరాలో 31 ఎకరాలలో ఒకటి, ముంబైలో 22 ఎకరాలలో మరో భూ ఒప్పందం జరిగింది. ► 58 ఎకరాలలో మిశ్రమ అభివృద్ధి కోసం మూడు భూ ఒప్పందాలు జరిగాయి. ముంబై, చెన్నై, గుర్గావ్లో ఒక్కోటి చొప్పున డీల్స్ జరిగాయి. ► 44 ఎకరాలలో వాణిజ్య అభివృద్ధి కోసం ఐదు ఒప్పందాలు జరిగాయి. ఇందులో బెంగళూరులో మూడు, ముంబైలో రెండు డీల్స్ ఉన్నాయి. ► నవీ ముంబైలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 30 ఎకరాల లావాదేవీలు జరిగాయి. 9 ఎకరాలలో రిటైల్ అభివృద్ధి కోసం రెండు భూ ఒప్పందాలు జరిగాయి. చదవండి: హైదరాబాద్లో అమ్ముడవ్వని ఇళ్లు 12 వేలు! -
ఆగస్ట్లో డీల్స్ జూమ్
ముంబై: గత నెల(ఆగస్ట్)లో దేశీ కార్పొరేట్ ప్రపంచంలో డీల్స్ భారీగా ఎగశాయి. మొత్తం 219 డీల్స్ జరిగాయి. 2005 తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 ఆగస్ట్తో పోల్చినా రెట్టింపయ్యాయి. వీటి విలువ 8.4 బిలియన్ డాలర్లు. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ అందించిన వివరాలివి. అయితే ఈ(2021) జులైతో పోలిస్తే లావాదేవీలు పరిమాణంలో 21 శాతం ఎగసినప్పటికీ విలువలో 36 శాతం క్షీణించాయి. ఇందుకు విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగంలో యాక్టివిటీ ఆరు రెట్లు పడిపోవడం కారణమైంది. ఆగస్ట్లో ప్రధానంగా ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారానే అత్యధిక డీల్స్ నమోదయ్యాయి. 182 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. దేశీ కంపెనీలు, యూనికార్న్(స్టార్టప్లు) ఇందుకు వేదికయ్యాయి. లాభదాయక అవకాశాలు, ఆర్థిక రికవరీపై విశ్వాసం, పరిశ్రమల స్థాపనలో నైపుణ్యం వంటి అంశాలు ప్రభావం చూపాయి. యూనికార్న్ల స్పీడ్ పారిశ్రామిక పురోగతి, బలపడుతున్న డిమాండ్, ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఇకపై సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నట్లు గ్రాంట్ థార్న్టన్ నిపుణులు శాంతి విజేత పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లు, విధానాల మద్దతు, ప్రపంచ దేశాల పురోభివృద్ధి ఇందుకు మద్దతుగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎంఅండ్ఏ విభాగంలో 86.7 కోట్ల డాలర్ల విలువైన 37 డీల్స్ జరిగాయి. 2020 ఆగస్ట్లో 90.8 కోట్ల డాలర్ల విలువైన 30 లావాదేవీలు నమోదయ్యాయి. టెక్, ఎడ్యుకేషన్, ఫార్మా, ఎనర్జీ రంగాలలో అధిక డీల్స్ జరిగాయి. గత నెలలో ఏడు స్టార్టప్లో యూనికార్న్ హోదాను అందుకున్నాయి. బిలియన్ డాలర్ల విలువను సాధించిన స్టార్టప్లను యూనికార్న్లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టార్టప్ వ్యవస్థ 115 డీల్స్ ద్వారా 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకుంది. -
3 శాతం పెరిగి, జులైలో కార్పొరేట్ డీల్స్ రూ.97,680 కోట్లు
ముంబై: దేశీయంగా కార్పొరేట్ డీల్స్ (ఒప్పందాలు) జూలై నెలలో 3 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లు (రూ.97,680 కోట్లు)గా నమోదైనట్టు గ్రాంట్ థార్న్టన్ భారత్ ఓ నివేదిక రూపంలో తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3 శాతం పెరగ్గా.. ఈ ఏడాది జూన్ నెలతో పోలిస్తే 6 శాతం పురోగతి కనిపించింది. కరోనా తర్వాత కంపెనీలు తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా చౌకగా నిధులు సమీకరించడంతోపాటు.. నగదు నిల్వలను ఖర్చు పెట్టడంపై దృష్టి సారించినట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ శాంతి విజేత తెలిపారు. రానున్న నెలల్లోనూ ఒప్పందాలు సానుకూలంగానే ఉంటాయని అంచనా వేశారు. జూలై నెలలో విలీనాలు, కొనుగోళ్లకు సంబంధించి (ఎంఅండ్ఏ) 36 ఒప్పందాలు నమోదయ్యాయి. వీటి విలువ 5.6 బిలియన్ డాలర్లుగా ఉంది. సంఖ్యా పరంగా చూస్తే 13 శాతం పెరిగాయి. కానీ విలువ పరంగా ఎంఅండ్ఏ ఒప్పందాల విలువ 37 శాతం తగ్గింది. ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులకు సంబంధించి 145 ఒప్పందాలు నమోదు కాగా.. వీటి విలువ 7.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐటీ సొల్యూషన్స్, ఈ కామర్స్, కన్జ్యూమర్ రిటైల్, డిజిటల్ హెల్త్కేర్, ఫిన్టెక్, ఎడ్టెక్ కంపెనీల విభాగాల్లో లావాదేవీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లు పెరగడం, నగదు లభ్యత అధికంగా ఉండడం, కరోనా కారణంగా ప్రయోజనం పొందే రంగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడం సానుకూలించినట్టు గ్రాంట్ థార్న్టన్ పేర్కొంది. చదవండి: భవిష్యత్తులో ఏం జరుగుతుందో, కనిపెట్టే పనిలో అమెరికా -
ప్రథమార్ధంలో డీల్స్ జోరు
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ ప్రభావాలు భారత్లో ఎలా ఉన్నప్పటికీ కార్పొరేట్ రంగంలో డీల్స్ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో దాదాపు 41 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు కుదరడం ఇందుకు నిదర్శనం. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జనవరి 1 నుంచి జూన్ 15 మధ్య కాలంలో దేశీ సంస్థలు 710 లావాదేవీలకు సంబంధించి 40.7 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విలువపరంగా గతేడాది ద్వితీయార్ధంతో పోలిస్తే ఇది రెండు శాతం అధికం. జనవరి–జూన్ మధ్య కాలంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) లావాదేవీలు ఆల్టైమ్ గరిష్టమైన 26.3 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. బిలియన్ డాలర్ల స్థాయి కొనుగోళ్లు, స్టార్టప్లు పలు విడతలుగా నిధులు సమీకరించడం తదితర అంశాలు .. డీల్స్ జోరుకు దోహదపడ్డాయి. అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ .. టెక్నాలజీ విభాగంలోనూ, పర్యావరణ..సామాజిక..గవర్నెన్స్ (ఈఎస్జీ) విభాగంలోనూ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ దినేష్ ఆరోరా తెలిపారు. ఇతర విశేషాలు.. ► ప్రథమార్ధంలో 6.2 బిలియన్ డాలర్ల విలువ చేసే విలీన, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) ఒప్పందాలు కుదిరాయి. ► అదానీ గ్రీన్ ఎనర్జీ సుమారు 3.5 బిలియన్ డాలర్లకు ఎస్బీ ఎనర్జీ ఇండియాను, ఐటీ దిగ్గజం విప్రో దాదాపు 1.45 బిలియన్ డాలర్లు పెట్టి బ్రిటన్కు చెందిన క్యాప్కోను కొనుగోలు చేశాయి. ► ఇవి కాకుండా విదేశాలకు చెందిన సంస్థల కొనుగోళ్లకు సంబంధించి 26 డీల్స్ కుదిరాయి. వీటి విలువ 385 మిలియన్ డాలర్లు. ► టెక్నాలజీ రంగంలో పీఈ పెట్టుబడులు అత్యధికంగా వచ్చాయి. ► 2021లో 16 స్టార్టప్లు..యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే సంస్థలు) క్లబ్లో చేరాయి. -
మారిన ఐటీ కంపెనీల ఫోకస్
ముంబై, సాక్షి: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో కొద్ది రోజులుగా యూరోపియన్ మార్కెట్లవైపు దృష్టి సారించాయి. ఇటీవల యూరోపియన్ ప్రాంతాల నుంచి భారీ డిల్స్ను పొందడంతో రూటు మార్చినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దేశీ ఐటీ కంపెనీలు యూఎస్ నుంచే అత్యధిక కాంట్రాక్టులు సంపాదిస్తుంటాయి. దీంతో ఆదాయంలో యూఎస్ 70 శాతం వాటా వరకూ ఆక్రమిస్తుంటుంది. అయితే ఇటీవల దేశీ కంపెనీలు యూరోపియన్ ప్రాంత కంపెనీలను కొనుగోలు చేస్తుండటం కూడా వ్యూహాల మార్పునకు కారణమవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. (టాటా క్లిక్లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు) కోవిడ్-19 ఎఫెక్ట్ ఏడాది కాలంగా ప్రపంచాన్ని.. ప్రధానంగా యూరోపియన్ దేశాలను కోవిడ్-19 మహమ్మారి వణికిస్తోంది. దీంతో ఔట్సోర్సింగ్కు అంతగా ప్రాధాన్యత ఇవ్వని యూరోపియన్ మార్కెట్లు ఇతర దేశాలవైపు దృష్టిసారించాయి. ఫలితంగా దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలకు అవకాశాలు పెరిగినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు కోవిడ్-19 సంక్షోభం కారణంగా విక్రయానికి వచ్చిన అక్కడి కంపెనీలను సైతం కొనుగోలు చేసేందుకు సన్నద్ధమయ్యాయి. గత కొద్ది నెలలుగా చూస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో పలు చిన్న కంపెనీలను సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ సేవలలు అందించేందుకు భారీ డిల్స్ను సైతం కుదుర్చుకున్నాయి. ఈ బాటలో వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లోనూ ఇతర కంపెనీల కొనుగోళ్లు, లేదా కాంట్రాక్టులను పొందేందుకు ప్రయత్నించే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. (డిక్సన్ టెక్- ఐడీఎఫ్సీ ఫస్ట్.. భల్లేభల్లే) జర్మన్ జోష్ యూరోప్లో ఇటీవల జర్మనీ నుంచి దేశీ కంపెనీలు మెగా డీల్స్ను కుదుర్చుకున్నాయి. గతంలో ఎప్పుడూ ఔట్సోర్సింగ్కు ప్రాధాన్యత ఇవ్వని జర్మన్ కంపెనీలు కరోనా కల్లోలంతో వ్యూహాలు మార్చుకున్నాయి. దీంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితరాలకు అవకాశాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. కొద్ది నెలలుగా యూరోపియన్ ప్రాంత ఆదాయంలో వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధిని సాధిస్తున్నట్లు టీసీఎస్ సీవోవో ఎన్జీ సుబ్రమణ్యం తెలియజేశారు. ఇది కొనసాగే వీలున్న్లట్లు అంచనా వేశారు. గతేడాది నవంబర్లో డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్బ్యాంక్ సిస్టమ్స్ను టీసీఎస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తద్వారా 1,500 మంది జర్మన్ ఉద్యోగులకు శిక్షణ, తదితర సేవలను అందిస్తోంది. ఇదే నెలలో బీమా దిగ్గజం ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్ నుంచి ప్రామెరికా సిస్టమ్స్ ఐర్లాండ్ను సైతం కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు వల్ల వీసాల సమస్యలున్న ప్రాంతాలలో 2,500 మంది ఉద్యోగులను వెనువెంటనే వినియోగించుకునేందుకు వీలు చిక్కినట్లు సుబ్రమణ్యం చెప్పారు. ఇతర కంపెనీల కొనుగోళ్ల నేపథ్యంలో టీసీఎస్ 2022 ఆదాయ అంచనాలలో భారీగా వృద్ధిని ఆశిస్తున్నట్లు టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. -
అమెరికా, చైనా చలో చలో..
బీజింగ్ : కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటనుంచి అమెరికా, చైనాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినప్పటికీ తాజాగా మొదటిదశ వాణిజ్య ఒప్పందంలో ఇరుదేశాలు ముందడుగు వేశాయి. దీనికి సంబంధించి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో ముచ్చటించారు. దిగుమతులు, ఎగుమతుల అంశంపై ఒప్పందాన్ని కొనసాగించేందుకు మొగ్గుచూపారు. ఇక్కడ చైనానే ఒక మెట్టుదిగినట్లు కనబడుతోంది. చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా కాస్త వెనక్కి తగ్గింది. ఇరుదేశాల మధ్య ఆర్థికపురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజింగ్ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే చర్చలకు ముందుకొచ్చి అమెరికాతో సంప్రదింపులు జరిపింది. జనవరిలోనే యూఎస్, చైనా దేశాలు మొదటిదశ ఆర్థిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో అమెరికా బాహాటంగానే చైనాపై అగ్గిమీద గుగ్గిలమయ్యింది. కావాలనే వైరస్ను ప్రపంచానికి అంటగట్టారంటూ పలు విమర్శలు చేసింది. కరోనా వైరస్పై అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, ఆ దేశం చర్యలపట్ల అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ రెండో దశ వాణిజ్య చర్చలకు ట్రంప్ విముఖత చూపారు. (అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్) అంతేకాకుండా చైనా మాతృసంస్థ అయిన టిక్టాక్ను త్వరలోనే బ్యాన్ చేస్తాం అని అమెరికా ప్రకటించింది. టిక్టాక్ యాప్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని వాషింగ్టన్ మీడియా తమ ప్రకటనల్ని సమర్థించుకుంది.అయితే ఈ చర్యలను చైనా ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. కావాలనే అమెరికా అణచివేత ధోరణి అవలంభిస్తుందని ఆరోపించింది. తదనంతరం ఆరోపణలు, ప్రత్యారోపణలు కాస్తా ట్రేడ్ వార్కు దారితీసిన సంగతి తెలిసిందే. చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు వేసిన అమెరికాపై చైనా కూడా అదే ధోరణి అవలంభించింది. అవసరమనుకుంటే చైనాతో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు మొదటిదశ ఆర్థిక ఒప్పందాలపై నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. (మరో నాలుగేళ్లు ట్రంప్కు అవకాశమివ్వండి) -
వాల్మార్ట్తో టీఐహెచ్సీ ఒప్పందం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో తయారీ రంగంలోని ఖాయిలా పరిశ్రమలను పునరుద్దరించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ (టీఐహెచ్సీ) అమెరికాకు చెందిన రిటైల్ బహుళ జాతి కంపెనీ వాల్మార్ట్తో ఒప్పందం చేసుకోనుంది. టీఐహెచ్సీలోని ఎంఎస్ఈలకు ఆన్లైన్ వేదికను అందించడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని టీఐహెచ్సీ అడ్వైజర్ డాక్టర్ బి. యెర్రం రాజు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ‘‘రూ.100 కోట్ల సోషల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం పలు విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. రెండేళ్ల లాకిన్ పీరియడ్తో 7 శాతం డివిడెండ్ను కేటాయిస్తాం. వచ్చే 3 నెలల్లో డీల్ క్లోజ్ చేస్తామని’’ ఆయన పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఖాయిలా పడ్డ 43 ఎంఎస్ఎంఈలను పునరుద్ధరించామని... వీటి ద్వారా సుమారు 1,100 మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయని చెప్పారు. ‘ప్రస్తుతం మరొక 12 ఎంటర్ప్రైజ్లు పునరుద్ధ్దరణ జాబితాలో ఉన్నాయి. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా నారీ పథకాన్ని ఏర్పాటు చేశాం. వార్షిక వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. గరిష్ట రుణం రూ.25 లక్షలు’ అని ఆయన వివరించారు. -
ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్, ఆఫర్లు
సాక్షి, ముంబై: ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ సేల్ను ప్రకటించింది. బిగ్ షాపింగ్ డేస్ సేల్ -2019 లో భాగంగా స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు, ల్యాప్టాప్లు, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు , ఇతర ఆఫర్లను అందించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 ఆదివారం నుండి ప్రారంభమయ్యే డిసెంబర్ 5 వరకు ఐదు రోజుల పాటుకొనసాగనుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు నవంబర్ 30, శనివారం రాత్రి 8 గంటల నుండే కొనుగోళ్లకు ముందస్తు అనుమతి లభిస్తుంది. ముఖ్యంగా రియల్మి, శాంసంగ్ గెలాకసీ, ఆపిల్ ఐ ఫోన్లపై ఆఫర్లను తీసుకొస్తోంది. టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ల్యాప్టాప్లు, కెమెరాలపై 80 శాతం తగ్గింపు లభ్యం. డిఎస్ఎల్ఆర్, డిజిటల్ కెమెరాలపై రూ.10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్. దీంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ప్రధానంగా బిగ్ షాపింగ్ డేస్ అమ్మకం సందర్భంగా ఫ్లిప్కార్ట్ "బ్లాక్ బస్టర్ డీల్స్" కూడా అందించనుంది. ఉదయం 12, 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు అదేవిధంగా తెల్లవారుజామున 2 గంటలకు "రష్ అవర్స్" లో స్పెషల్ సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో ప్రధానంగా రియల్మి 5, రియల్మే ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9, గెలాక్సీ ఎస్ 9 ప్లస్, గూగుల్ పిక్సెల్ 3 ఎ, ఆపిల్ ఐఫోన్ 7, ఆసుస్ 5 జెడ్ వంటి స్మార్ట్ఫోన్లపై తగ్గింపును అందించనుంది. మొబైల్ ఫోన్లపై ఆఫర్లు రియల్మి5 : అసలు ధర రూ. 9,999 డిస్కౌంట్ ధర రూ. 8,999 రియల్మి ఎక్స్: అసలు ధర రూ. 16,999 ఆఫర్ ధర రూ. 15,999 శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 : అసలు ధర రూ. 29,999 డిస్కౌంట్ ధర రూ. 27,999 గెలాక్సీ ఎస్ 9 ప్లస్ : అసలు ధర రూ. 37,999 డిస్కౌంట్ ధర రూ. 34,999 గూగుల్ పిక్సెల్ 3 ఎ : అసలు ధర రూ. 34,999 ఆఫర్ ధర రూ. 29,999 ఆపిల్ ఐఫోన్ 7: అసలు ధర రూ. 27,999 ఆఫర్ ధర రూ. 24,999 ఆసుస్ 5 జెడ్ : అసలు ధర రూ. 16,999 ఆఫర్ ధర రూ. 15,999 -
కాఫీ డేకు భారీ ఊరట
సాక్షి, ముంబై : కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య అనంతరం భారీగా నష్టపోయిన కాఫీ డే షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. ఒకవైపు రుణ భారాన్ని తగ్గించుకోనే చర్యలు, మరోపక్క పానీయాల గ్లోబల్ కంపెనీ కోక కోలా వాటాను కొనుగోలు చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కౌంటర్లో జోష్ నెలకొంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 5 శాతానికిపైగా లాభపడి రూ. 65.80 వద్ద అప్పర్ సర్క్యూట్ అయింది. సిద్ధార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడువారాల్లో (జులై 26 నుంచి) 68 శాతం పతనమైంది. పానీయాల రిటైల్ స్టోర్ల కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రూ. 2,400 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో గ్రూప్ రుణ భారం ఆమేర తగ్గనునందని వివరించింది. జులై చివరికల్లా గ్రూప్ రుణభారం రూ.4970 కోట్లుగా నమోదైనట్లు తెలియజేసింది. దీనిలో కాఫీడే రుణభారాన్ని రూ.3472 కోట్లుగా పేర్కొంది. ప్రధానంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ పార్క్ను పీఈదిగ్గజం బ్లాక్స్టోన్కు విక్రయించడం ద్వారా ఈ రుణభారాన్ని తగ్గించుకోనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోపక్క కంపెనీలో వాటాను విక్రయించేందుకు గ్లోబల్ దిగ్గజం కోక కోలాతో కాఫీ డేలో తిరిగి చర్చలు ప్రారంభించినట్లు మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ అంశంపై రెండు కంపెనీలూ అధికారికంగా స్పందించాల్సి వుంది. -
పేటీఎం ఆఫర్లు: ఐఫోన్లపై క్యాష్బ్యాక్
బ్లాక్ ఫ్రైడే సందర్భంగా పేటిఎం మాల్ ఐఫోన్లపై డిస్కౌంట్ని ప్రకటించింది. దాదాపు 20 డివైస్లపై క్యాష్బ్యాక్ను కొనుగోలుదారులు పొందనున్నారు. మోడల్ను బట్టి రూ.4000 నుంచి 8000ల వరకూ క్యాష్బ్యాక్ అందిస్తోంది. అదనంగా ఎస్ బ్యాంక్ నుంచి కొనుగోలు చేస్తే మరో 10 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్లు ప్రధానంగా... ఐఫోన్ 7ప్లస్ 128 జీబీ రూ. 8000 క్యాష్బ్యాక్ ఐఫోన్ 7 32జీబీ రూ. 6750 క్యాష్బ్యాక్ ఐఫోన్ 7 128 జీబీ రూ. 6500 క్యాష్బ్యాక్ ఐఫోన్ 7ప్లస్ 32 జీబీ రూ. 8000 క్యాష్బ్యాక్ దీంతోపాటు మరి కొన్ని స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే ఎస్బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం క్యాష్ బ్యాక్ను లభ్యం. మరింత సమాచారం కోసం పేటీఎం మాల్ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. -
హీరో ఎలక్ట్రిక్ సైకిళ్లు జపాన్ కంపెనీలతో ఒప్పందాలు
న్యూఢిల్లీ: హీరో సైకిల్స్ కంపెనీ ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ కోసం జపాన్కు చెందిన రెండు కంపెనీలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్కు చెందిన యమహా మోటార్ కంపెనీ, మిత్సు అండ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని హీరో సైకిల్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ, టెక్నాలజీ, మార్కెటింగ్ కోసం ఈ రెండు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు హీరో మోటార్స్ కంపెనీ (హెచ్ఎమ్సీ) చైర్మన్ పంకజ్ ఎమ్ ముంజాల్ వెల్లడించారు. ఈ భాగస్వామ్యం నుంచి తొలి ఉత్పత్తిగా హీరో బ్రాండ్ కింద హై ఎండ్ ఎలక్ట్రిక్ మౌంటెన్ బైక్ను (ఈ–ఎమ్టీబీ) అందించనున్నామని వివరించారు. లూథియానాలో సైకిల్ వ్యాలీ... హెచ్ఎమ్సీ గ్రూప్లో ప్రధాన కంపెనీ అయిన హీరో సైకిల్స్ లూధియానాలో సైకిల్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ఇటీవలే ప్రతిపాదించింది. సైకిళ్ల పరిశ్రమకు కావలసిన అన్ని వస్తువులను, సేవలను సరఫరా చేసే లక్ష్యంతో ఈ సైకిల్ వ్యాలీ ప్రాజెక్ట్ను ఈ కంపెనీ అందుబాటులోకి తేనుంది. ఈ ప్రాజెక్ట్కు కీలక పెట్టుబడిదారుగా హీరో సైకిల్స్ వ్యవహరించనుంది. -
రూ.3,000 కోట్లు సమీకరించిన ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నాన్ కన్వర్టబుల్ రెడీమబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లను సమీకరించి నట్టు ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి గడువు తీరే అన్ సెక్యూర్డ్, నాన్ కన్వర్టబుల్ రెడీమబుల్ డిబెంచర్లపై 8.95 శాతం వడ్డీని ఆఫర్ చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు ఆర్ఐఎల్ తెలిపింది. 2028 నవంబర్ 9న ఇవి గడువు తీరుతాయని పేర్కొం ది. ఇంధనం, పెట్రోకెమికల్, రిటైల్, టెలికం విభాగాల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో రిలయన్స్ 30 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిం ది. బ్రాడ్బ్యాండ్ విభాగంలో బలపడేందుకు గాను హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్వర్క్స్లో మెజారిటీ వాటాల కొనుగోలుకు గత నెలలో ఒప్పందాలు కూడా చేసుకుంది. -
వ్యూహాత్మక భాగస్వామ్యానికి రోడ్మ్యాప్
యూఏఈ, భారత్ చర్చలు,14 ఒప్పందాలు న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్, యూఏఈ మధ్య 14 ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, భద్రత, వాణిజ్య, ఇంధనం తదితర కీలకాంశాలతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక కీలక మలుపని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కాగా, భారత్లో యూఏఈ 75 బిలియన్ డాలర్ల(సుమారు రూ.5లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టే అంశం ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యన్ మధ్య జరిగిన 14 ఒప్పందాల్లో లేదు. బుధవారం డెలిగేట్స్ సమావేశం హైదరాబాద్ హౌస్ లో జరగగా, అనంతరం ప్రధాని అధికార నివాసంలో మోదీ, నహ్యన్లు గంటపాటు సమావేశమయ్యారు. తర్వాత ఇరువురూ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య చర్చలు ఫలప్రదంగా జరిగాయని మోదీ చెప్పారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబం ధించి ఉపయుక్తమైన రోడ్మ్యాప్ రూపొం దించినట్లు చెప్పారు. రక్షణ, భద్రతా సహకారా నికి సంబంధించిన ఒప్పందాల ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్లు పేర్కొ న్నారు. దగ్గరి సంబంధాలు ముఖ్యమని, అది కేవలం ఇరు దేశాల మధ్యే కాదని, పొరుగు దేశాలన్నిం టితోనూ బలమైన సంబంధాలు ఉండాలని కోరుకుంటు న్నట్లు తెలిపారు. భారత్, యూఏఈ కలయిక ప్రాంతీయ సుస్థిరతకు సహకరి స్తుందన్నారు. అలాగే ఆర్థిక భాగస్వామ్యం ప్రాంతీయ, ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పాటునందిస్తుందన్నారు. అఫ్గాని స్తాన్తో పాటు మన ప్రాంత పరిణామాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. మీ సందర్శన వల్ల మునుపటి సంబంధాలు మరింత బలపడతాయనే నమ్మకముందని అబుదాబి యువరాజును ఉద్దేశించి మోదీ అన్నారు. నమ్మకమైన మిత్రదేశం: మోదీ ప్రపంచంలో భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రదేశాల్లో యూఏఈ ఒకటి అని మోదీ అభివర్ణించారు. భారత దేశ వృద్ధిలో ముఖ్యమైన భాగస్వామిగా యూఏఈని గౌరవిస్తామని చెప్పారు. మొత్తంగా రక్షణ ఉత్పత్తి, సాంకేతిక సహకారం, సముద్ర, రోడ్డు రవాణాలో ఉత్తమ విధానాల మార్పిడి.. మహిళలు, చిన్నారుల అక్రమ రవాణా నివారణకు కలసి పనిచేయడం, వాణిజ్య, చమురు నిల్వలు, నిర్వహణ తదితర 14 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. -
ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్..స్మార్ట్ ఫోన్లపై టాప్ డీల్స్
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ సేల్స్ లోకి మరోసారి డిస్కౌంట్ అమ్మకాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రిపబ్లిక్ డే సేల్ పేరుతో మూడు రోజులు తగ్గింపు ధరల అమ్మకాలకు తెరలేపింది. ముఖ్యంగా పలు స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లను అందించనుంది. రేపటినుంచి జనవరి 24 నుంచి 26 మధ్య ఈ తగ్గింపు ధరలు అందుబాటులోకి రానున్నాయి. శాంసంగ్, లెనోవా, సోనీ, రెడ్ మీ లాంటిస్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ధరలను , ఆకర్షణీమైన ఎక్సేంజ్ ఆఫర్లను ప్రకటించింది. వీటితో పాటు టీవీలు, గృహోపకరణాలు , కిచెన్ అప్లయన్సెస్ , దుస్తులు, స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ సహా ఇతర ఉత్పత్తులపై డిస్కైంట్ ధరలను అందించనుంది. అంతేకాదు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది. అయితే ఏప్రిల్ 30 తరువాత ఈ క్యాష్ క్రెడిట్ అవుతందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ శామ్సంగ్ గెలాక్సీ (గోల్డ్, 32 జీబీ ) డిస్కౌంట్ ధర రూ. 16, 900 అసలు ధర రూ 18, 490 లెనోవా వైబ్ కే 5 నోట్ (గ్రే 32 జీబీ ) తో 4జీబీ ర్యాం రూ 11,499 అసలు ధరరూ 13, 499 శామ్సంగ్ గెలాక్సీ On8 (బంగారు 16 జీబీ డిస్కౌంట్ ధర రూ 14, 900 అసలు ధర రూ 15,900 నెక్సస్ 6సీ స్పెషల్ ఎడిషన్ (గోల్డ్ 64 జీబీ) డిస్కౌంట్ ధర రూ 35, 998 అసలు ధర రూ 42, 998 ఎంఐ 5 (వైట్, 32 జీబీ) తగ్గింపు ధర రూ 22, 999 అసలు ధర రూ 24, 999 మరిన్ని ఆఫర్ల వివరాల కోసం ఫ్లిప్ కార్ట్ అధికారిక వెబ్ సైట్ లో గమనించగలరు. -
అమెజాన్లో స్మార్ట్ఫోన్లపై ఇవాల్టి బొనాంజా
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ఇటీవలి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ ను మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నారా...? డోంట్ వర్రీ.. మీ లాంటి వారికోసం ఇలాంటి ధమాకా సేల్ ఆఫర్ మళ్లీ మొదలైంది. అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 20 వరకు ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించినట్టు అమెజాన్ ప్రకటించింది. ముఖ్యంగా ఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్లు రడీగా ఉన్నాయి. సిటీ కార్డు వినియోగదారులకు సైట్లో 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్, కేవలం యాప్ ద్వారా అదనంగా మరో 15 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. వీటితో పాటు అమెజాన్ ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్లు, వంటగది ఉపకరణాలు, దుస్తులు మరియు పాదరక్షలు తదితర అమ్మకాల్లో వివిధ ఆఫర్లు అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లపై ఇవాల్టి బ్లాక్ బస్టర్ డీల్స్ ఇలా ఉన్నాయి. మోటో జీ4 ప్లస్ అసలు ధర: రూ 14,999; రాయితీ ధర రూ 13,499 లెనోవా వైబ్ అసలు ధర: రూ 11,999; రాయితీ ధర రూ 9,999 శాంసంగ్ 5 ప్రో అసలు ధర: రూ 11,190; రాయితీ ధర రూ 9,990 ఒన్ ప్లస్ అసలు ధర: రూ 22,990; రాయితీ ధర రూ 19.990 కూల్ ప్యాడ్ మెగా 2.5డీ అసలు ధర: రూపాయలు 6,999; రాయితీ ధర రూ 5,999 మోటో జీ4 ప్లే ప్రైస్: రూ. 8,999; అదనంగా రూ 1,000 క్యాష్ బ్యాక్ శాంసంగ్ 7 ప్రో అసలు ప్రైస్: రూ. 9,190; రాయితీ ధర రూ 7,990 మోటో జీ4 అసలు ధర రూ 12,499; రాయితీ ధర రూ 10,499 లెనోవా వైబ్ కే 5 అసలు ధర, రూ. 7,499; రాయితీ ధర రూ 6,999 -
మీడియా సంస్థలతో ఫేస్బుక్ భారీ డీల్
ఆన్ లైన్ వార్తలో ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 500లక్షల డాలర్లకు పైగా విలువైన డీల్స్ ను మీడియా కంపెనీలతో, సెలబ్రిటీలతో కుదుర్చుకున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు నివేదించింది. తన లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ ల్లో వీడియోలను సృష్టించడానికి, లైవ్ సర్వీసులను పెంచుకోవడానికి మీడియా కంపెనీలతో ఫేస్ బుక్ ఈ డీల్స్ ను కుదుర్చుకుందని తెలుస్తోంది. సీఎన్ ఎన్, న్యూయార్క్ టైమ్స్, వోక్స్ మీడియా, టేస్ట్ మేడ్, మాషేబుల్, హాఫ్పింగ్ టన్ పోస్టు వంటి సంస్థలతో సుమారు 140 డీల్స్ పై సంతకాలు చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అదేవిధంగా కమెడియన్ కెవిన్ హార్ట్, సెలబ్రిటీ చెఫ్ గోర్డన్ రామ్సే, వెల్ నెస్ గురు దీపక్ చోప్రా, ఎన్ఎఫ్ఎల్ క్వార్టర్ బ్యాక్ రస్సెల్ విల్సన్ వంటి సెలబ్రిటీలతో భాగస్వామ్యంపై ఫేస్ బుక్ సంతాకాలు చేసిందని పేర్కొంది. భాగస్వామ్య విస్తృతి సమితిని తాము పెంచుకోవాలనుకుంటున్నామని, దీంతో సంస్థ నిర్వర్తించే పనులపై వివిధ ఆర్గనైజేషన్ల నుంచి ఫీడ్ బ్యాక్ పొందుతామని ఫేస్ బుక్ గ్లోబల్ ఆపరేషన్స్, మీడియా పార్టనర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ ఓసోఫ్ స్కే తెలిపారు. యూజర్లకు తాము అందించలేకపోతున్నా సర్వీసులపై కూడా దృష్టిసారించవచ్చని పేర్కొన్నారు. వాల్ స్ట్రీట్ నివేదించిన రిపోర్టు ప్రకారం ఆన్ లైన్ పబ్లిషర్ బుజ్ ఫీడ్ తో 30.5లక్షల డాలర్లతో ఎక్కువ విలువ కల్గిన డీల్ కుదుర్చుకుందని, తర్వాత స్థానాల్లో న్యూయార్క్ టైమ్స్(30.3లక్షల డాలర్లు), సీఎన్ఎన్ తో (25లక్షల డాలర్ల) డీల్స్ ఉన్నాయి. -
ఉభయతారకం!
► అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరిన ఆరు ప్రాజెక్టులతో విస్తృత ప్రయోజనాలు ► రాష్ట్రంలో సుమారు 17.5 లక్షల ఎకరాలకు సాగునీరు ► తుమ్మిడిహెట్టి, కాళేశ్వరంతో మహారాష్ట్రలో 75 వేల ఎకరాలకు నీరు ► లెండి, పెన్గంగ ప్రాజెక్టుల కింద వచ్చే ఆయకట్టు అదనం ► 19న హైదరాబాద్లో మరో సమావేశం.. భవిష్యత్ ప్రణాళికలపై చర్చలు సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని బీడు భూములకు ప్రాణం పోసే ఆరు ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ఇరు రాష్ట్రాలకూ ఎన్నో ప్రయోజనాలను సమకూర్చనుంది. నాలుగు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు పరిష్కారాన్ని చూపడం ద్వారా... తెలంగాణలోని ఆరు జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని రెండు జిల్లాలకు నీరు అందనుంది. తెలంగాణలో 17.5 లక్షల ఎకరాలకు నీరందనుండగా, మహారాష్ట్రలో కాళేశ్వరం, తుమ్మిడిహెట్టి ద్వారానే 75వేల ఎకరాలకు నీరందుతుంది. లెండి, పెన్గంగలో దక్కే నీటివాటాలకు అనుగుణంగా అదనంగా ఆయకట్టు ఏర్పడనుంది. మహారాష్ట్రతో తాజాగా ఒప్పందం కుదిరిన ప్రాజెక్టులివే... దిగులులేదు‘లెండి’ లెండి నది నీటితో నిజామాబాద్ జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాలతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లోని వేలాది ఎకరాలకు నీరందించాలన్న ఉద్దేశంతో 1985లో లెండి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీ రామారావు, మహారాష్ట్ర సీఎం ఎస్బీ చవాన్లు ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో దీని అంచనా విలువ రూ.54కోట్లు. వ్యయంలో మహారాష్ట్ర 62శాతం, తెలంగాణ 38శాతం భరించాలని... ప్రాజెక్టులోని 6.36 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటా 2.43 టీఎంసీలు కాగా, మహారాష్ట్రకు 3.93 టీఎంసీలను వాటాగా నిర్ణయించారు. ఈ నీటితో తెలంగాణలో సుమారు 25వేల ఎకరాలకు నీరందనుంది. ఇరువురికీ ‘తుమ్మిడిహెట్టి’ వరం ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న బ్యారేజీతో ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 4.5 టీఎంసీల సామర్థం ఉండే ఈ బ్యారేజీ ద్వారా ప్రాణ హిత నుంచి 14.4 టీఎంసీల నీటిని తరలిస్తారు. దీనికోసం మొత్తంగా రూ.4,231కోట్లు ఖర్చు కానుంది. ప్రధాన కాలువలోని 11, 54 కిలోమీటర్ల వద్ద నీటిని ఇతర కాలువలకు మళ్లించి నిర్ణీత ఆయకట్టుకు నీటిని తరలిస్తారు. ఇందుకోసం ఒక్కోటీ 0.2 నుంచి 0.3 టీఎంసీల సామర్థ్యముండే ఐదు రిజర్వాయర్లను (మొత్తంగా 1.1 టీఎంసీలు) నిర్మిస్తారు. వీటికి రూ.2,260కోట్లు అవసరం. ఇక ఇదే తుమ్మిడిహెట్టి ద్వారా మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరందనుంది. సుమారు 3 టీఎంసీల మేర వారికి ప్రయోజనం దక్కనుంది. విస్తృత ప్రయోజనాల ‘కాళేశ్వరం’ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో మొత్తంగా 160 టీఎంసీలను మళ్లించడం ద్వారా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 14.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. గోదావరి నదిపై కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ వద్ద ప్రధాన బ్యారేజీని నిర్మించనున్నారు. సుమారు రూ.70 వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో గరిష్ట ప్రయోజనం మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు నుంచి మార్గమధ్యంలోని గ్రామాలకు 10 టీఎంసీల తాగునీరు అందించడం, హైదరాబాద్, సికింద్రాబాద్లకు 30 టీఎంసీల తాగునీరు అందించడం, మరో 16 టీఎంసీల నీటిని పరిశ్రమల అవసరాలకు వినియోగించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 45 వేల ఎకరాలకు సాగునీరు (సుమారు 4.5 టీఎంసీలు) అందనుంది. దాంతోపాటు అదే జిల్లాలోని మెజార్టీ ఆదివాసీల దాహార్తిని తీర్చనుంది. దిగిరానున్న ‘పెన్గంగ ’ గోదావరి ఉపనది అయిన పెన్గంగలో మొత్తంగా 42 టీఎంసీలను వాడుకునే హక్కు తెలంగాణ, మహారాష్ట్రలకు ఉంది. ఇందులో 12 శాతం వాటా అంటే 5.12 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సి ఉంది. ఈ నీటితో ఆదిలాబాద్ జిల్లాలోని తాంప్సి, జైనథ్, బేల మండలాల్లోని 47,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశముంది. ప్రధాన డ్యామ్ను మహారాష్ట్ర నిర్మించాల్సి ఉంది. ఈ డ్యామ్ నిర్మాణంతో పాటు, ప్రధాన పనులు, కాలువల తవ్వకానికి అటవీ, పర్యావరణ అనుమతులు లభించినా... హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్కు సంబంధించి కేంద్ర జల సంఘం అనుమతులు రావాల్సి ఉంది. అవన్నీ లభించి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో... మహారాష్ట్ర దిగువ పెన్గంగలో వాడుకునే అవకాశమున్న 9 టీఎంసీలను బ్యారేజీల ద్వారా తరలించుకోవాలని నిర్ణయించింది. అందులో రాష్ట్రానికి వచ్చే వాటా 1.5 టీఎంసీలుగా తేల్చారు. తెలంగాణ భూభాగంలోని నదిఒడ్డులో మూడు బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో రాజాపేట, పెన్పహాడ్ వద్ద నిర్మించే బ్యారేజీలను పూర్తిగా మహారాష్ట్ర నిర్మించనుండగా... 1.5 టీఎంసీల సామర్థ్యం గల ఛనాఖా-కొరట బ్యారేజీని తెలంగాణ నిర్మించనుంది. మహారాష్ట్ర ఇందులో తెలంగాణ వాటాగా రాజాపేట బ్యారేజీ కింద 2,500 ఎకరాలకు, పెన్పహాడ్ కింద 4,500 ఎకరాలకు, ఛనాఖా-కొరట కింద 13,500 ఎకరాలకు కలిపి మొత్తంగా 20,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటుంది. 19న మరోమారు సమావేశం ప్రాజెక్టులపై కుదిరిన ఒప్పందాల మేరకు భవిష్యత్ ప్రణాళికలపై ఇరు రాష్ట్రాల మధ్య ఈనెల 19న హైదరాబాద్లో మరోసారి సమావేశం జరగనుంది. 103 మీటర్ల ఎత్తుతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై ప్రధానంగా చర్చిస్తారు. ఒక వారంలో మేడిగడ్డకు టెండర్లు పిలిచేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహారాష్ట్ర సమ్మతి తెలిపిన మేరకు 103 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభిస్తుంది. అయితే ముంపుపై మహారాష్ట్ర తేల్చిన తర్వాత కుదిరే అంగీకారం మేరకు బ్యారేజీ ఎత్తును నిర్ణయించి, ఆ ఎత్తులోనే నీటి నిల్వ చేస్తారు. -
గతవారం బిజినెస్
నియామకాలు * ఆంధ్రాబ్యాంక్ ఎండీగా సురేష్ ఎన్ పటేల్ నియమితులయ్యారు. * ఆర్కే టాకూర్ యుకో బ్యాంక్ ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. * కార్పొరేషన్ బ్యాంక్ ఎండీగా గార్గ్ నియమితులయ్యారు. * ఇండియన్ బ్యాంక్ ఈడీగా పనిచేస్తున్న మహేశ్ కుమార్ జైన్ ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. * ఎస్బీఐ ఎండీగా పి.కె.గుప్తా నియమితులయ్యారు. * రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ సీఈవోగా జాసన్ కొఠారి పదవీ బాధ్యతలు చేపట్టారు. కీలక పరిశ్రమల వృద్ధి రేటు 3.2 శాతం ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ సెప్టెంబర్లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. 3.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అంటే 2014 సెప్టెంబర్ ఉత్పత్తి విలువతో పోల్చితే 2015 సెప్టెంబర్లో ఉత్పత్తి విలువ 3.2 శాతం ఎగసిందన్నమాట. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 2.6 శాతమే. తాజా 3.2 శాతం వృద్ధి నమోదుకు ఎరువులు, విద్యుత్ రంగాలు కారణం. చప్పగా కాఫీడే లిస్టింగ్ కాఫీ డే ఎంటర్ప్రెజైస్ స్టాక్ మార్కెట్లో బలహీనంగా లిస్టయింది. ఇష్యూ ధర రూ.328తో పోల్చితే కాఫీ డే ఎంటర్ప్రై జెస్ షేర్ ధర బీఎస్ఈలో 4.5 శాతం నష్టంతో రూ.313 వద్ద లిస్టయింది. అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరకు 18 శాతం నష్టంతో రూ.270 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో కూడా ఇదే తీరు. ఇంట్రా డేలో రూ.266(19 శాతం) కనిష్ట స్థాయికి పతనమైంది. మార్కెట్ క్యాప్ రూ.5,565 కోట్లుగా నమోదైంది. ఇక మేడిన్ చైనా విమానాలు విమానాల తయారీ రంగాన్ని శాసిస్తున్న బోయింగ్, ఎయిర్బస్ వంటి పాశ్చాత్య దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో చైనా తమ సొంత విమానాన్ని తయారు చేసుకుంది. దేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న తొలి ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ సి919ని సోమవారం ఆవిష్కరించింది. బోయింగ్ 737, ఎయిర్బస్ 320 విమానాల తరహాలో సుమారు 174 మంది దాకా ప్రయాణించేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. వచ్చే బడ్జెట్ నుంచి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు! కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రక్రియ వచ్చే బడ్జెట్ నుంచీ ప్రారంభమవుతుందని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ రంగానికి ప్రస్తుతం ఇస్తున్న పన్ను మినహాయింపులను దశలవారీగా ఉపసంహరణ జాబితా కూడా కొద్ది రోజుల్లో విడుదల చేస్తామంటూ సూచనాప్రాయంగా చెప్పారు. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ బేసిక్ పన్ను రేటును నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గిస్తామని ఆర్థికమంత్రి గత బడ్జెట్లో ప్రకటించారు. రెండో షెడ్యూల్ జాబితాలో బంధన్ బ్యాంక్ ఇటీవల ప్రారంభమైన బంధన్ బ్యాంక్ను ఆర్బీఐ చట్టం రెండో షెడ్యూల్ జాబితాలో చేర్చినట్లు ఆర్ బీఐ వెల్లడించింది. దీంతో బంధన్ బ్యాంక్ ఆర్బీఐ నుంచి బ్యాంకు రేటుకు రుణాలను తీసుకోవచ్చు. అలాగే బ్యాంకుకు క్లియరింగ్ హౌసింగ్ సంబంధిత సభ్యత్వాన్ని ఇచ్చింది. భారత్లోకి యాపిల్ వాచ్లు భారత్లో యాపిల్ స్మార్ట్వాచ్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. వీటి ధర రూ.30,900-రూ.14 లక్షల శ్రేణిలో ఉంది. యాపిల్ స్మార్ట్వాచ్లు ‘యాపిల్ వాచ్ ఎడిషన్’,‘యాపిల్ వాచ్’,‘యాపిల్ వాచ్ స్పోర్ట్’ అనే మూడు వేరియంట్లలో, 38 మిల్లీమీటర్లు, 42 మిల్లీమీటర్లు అనే రెండు డిస్ప్లే పరిమాణాల్లో లభ్యమవుతున్నాయి. ఈ యాపిల్ స్మార్ట్వాచ్లలో కాల్ రిసీవింగ్, ఈ-మెయిల్స్ చెకింగ్, మ్యూజిక్ కంట్రోల్ వంటి తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్లు వినియోగదారులకు యాపిల్ ప్రీమియమ్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. రూ.14 లక్షల విలువైన యాపిల్ టాప్ మోడల్ను కస్టమర్ల ఆర్డర్పైన మాత్రమే తెప్పిస్తామని యాపిల్ రిటైల్ ప్రతినిధి తెలిపారు. రూ.70 వద్ద ఐడీఎఫ్సీ బ్యాంక్ లిస్టింగ్ ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్లు శుక్రవారం బీఎస్ఈలో రూ. 70.50 వద్ద లిస్టయ్యింది. షేరు చివరికి బిఎస్ఈలో 70.70 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 70.40 వద్ద ముగిసింది. బీఎస్ఈలో ఐడీఎఫ్సీ బ్యాంకు స్క్రిప్ రూ. 73.45-67 మధ్య తిరుగాడింది. రెండు ఎక్స్చేంజీల్లోను కలిపి సుమారు రెండున్నర కోట్ల షేర్లు చేతులు మారాయి. డీల్స్.. * దేశీయంగా నాలుగో అతి పెద్ద టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) .. తాజాగా సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ దాదాపు 690 మిలియన్ డాలర్లుగా ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా. * ఫ్రాన్స్కి చెందిన విద్యుత్ పరికరాల తయారీ దిగ్గజం అల్స్తోమ్ తమ విద్యుదుత్పత్తి, గ్రిడ్ వ్యాపార విభాగాలను జనరల్ ఎలక్ట్రిక్ సంస్థకు విక్రయించింది. ఈ డీల్ విలువ దాదాపు 12.4 బిలియన్ యూరోలని అల్స్తోమ్ తెలిపింది. * ఆసియా దేశాల మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి ప్రై వేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ అమెరికాకు చెందిన మీడియా హోల్డింగ్ కంపెనీ చెర్నిన్ గ్రూప్తో చేతులు కలిపింది. 300 మిలియన్ డాలర్ల నిధులతో.. ఎమరాల్డ్ మీడియా పేరిట ప్రత్యేక వెంచర్ ఏర్పాటు చేసింది. -
గతవారం బిజినెస్
ఎన్ఆర్ఐలు ఎన్పీఎస్లో చేరొచ్చు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో చందాదారులుగా చేరేందుకు ప్రవాస భారతీయులను (ఎన్ఆర్ఐ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. తద్వారా వారికీ వృద్ధాప్య ఆదాయ భద్రతా పథకంలో చేరేందుకు వీలుకలగనుంది. సాధారణ బ్యాంకింగ్ మార్గాల ద్వారా లేదా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు నేషనల్ పెన్షన్ స్కీమ్లో చందాదారులుగా ఉండవచ్చు. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం కుదింపు? పెట్టుబడుల ఉపసంహరణలకు (డిజిన్వెస్ట్మెంట్) సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) లక్ష్యాన్ని కుదించే అంశాన్ని కేంద్రం యోచిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణల బడ్జెట్ లక్ష్యం రూ.69,500 కోట్లు. ఈ మొత్తం లక్ష్యాన్ని సగానికికన్నా ఎక్కువగా రూ.30,000 కోట్లకు తగ్గించాలని డిజిన్వెస్ట్మెంట్ శాఖ భావిస్తున్నటు సమాచారం. 731 మిలియన్ డాలర్లకు క్లౌడ్ సర్వీసెస్ దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల రంగ ఆదాయాలు ఈ ఏడాది అఖరు నాటికి 731 మిలియన్ డాలర్ల స్థాయికి చేరొచ్చని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 31 శాతం వృద్ధి సాధించగలదని పేర్కొంది. భారత్లో క్లౌడ్ సేవలపై భారీగా వ్యయాలు పెరుగుతాయని, 2019 నాటికి ఇవి 19 బిలియన్ డాలర్లకు చేరొచ్చని వివరించింది. ఐదే ళ్లలో లక్ష కోట్లకు ఈటీఎఫ్ ఆస్తులు! దేశంలో ఈక్విటీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ (ఈటీఎఫ్) ఫండ్స్ వేగంగా విస్తరిస్తున్నాయని, త్వరలోనే వీటి ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందని ఎన్ఏఎస్ఈ అంచనా వేస్తోంది. గత 12 ఏళ్లలో ఈటీఎఫ్ ఆస్తుల విలువ 12 రెట్లు పెరిగాయని, వచ్చే ఐదేళ్లలో ఈటీఎఫ్లు నిర్వహిస్తున్న ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ అన్నారు. చైనా సంపన్నుల్లో వాంగ్ టాప్ ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన చైనా సంపన్నుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం వాండా గ్రూప్ వ్యవస్థాపకుడు వాంగ్ జియాన్లిన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన సంపద 13.2 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 30 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా గతేడాది నాలుగో స్థానంలో ఉన్న ఆయన ఈసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. దీంతో ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 21.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బంగారు భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 642 టన్నుల పసిడి వినియోగంతో చైనాను అధిగమించి మరోసారి ఫస్ట్ ప్లేస్లో నిల్చింది. 579 టన్నుల బంగారం వినియోగంతో చైనా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ? ఐడీబీఐ బ్యాంకులో వాటాలు తగ్గించుకుని, ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా అది కూడా యాక్సిస్ బ్యాంకులాగా రూపాంతరం చెందేలా చూడాలని భావిస్తోంది. ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారి సతమతమవుతున్న ఐడీబీఐ బ్యాంకు పనితీరును మెరుగుపర్చుకునే వీలు కల్పించాలని యోచిస్తోంది. పేటీఎం ద్వారా బీమా ప్రీమియం చెల్లింపు ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం ప్రధాన బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. పాలసీదారులు ఆన్లైన్ ద్వారా ప్రీమియం చెల్లింపులు జరిపే సౌలభ్యం కల్పించేందుకు బీమా సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఈ సంస్థ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరకు రూ.1,000 కోట్ల ప్రీమియం చెల్లింపులు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, రెలిగేర్ హెల్త్, రిలయన్స్ లైఫ్, రిలయన్స్ జనరల్ సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది. క్యూ3లో మందగించిన అమెరికా వృద్ధి ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించింది. రెండో త్రైమాసికంలో 3.9 శాతంగా నమోదైన వృద్ధి.. క్యూ3లో 1.5 శాతానికి పరిమితమైంది. నిల్వలు పేరుకుపోవడం వల్ల వ్యాపార సంస్థలు కొత్తగా మరిన్ని కొనుగోళ్లపై ఆసక్తి చూపకపోవడం దీనికి కారణమని విశ్లేషకులు తెలిపారు. వచ్చే నెల 6న ఐడీఎఫ్సీ బ్యాంక్ లిస్టింగ్! కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్లు వచ్చే నెల 6న స్టాక్మార్కెట్లో లిస్టవుతాయని అంచనా. ఈ నెల 5 వరకూ ఐడీఎఫ్సీ షేర్లున్న వాటాదారులకి ఒక్కో ఐడీఎఫ్సీ షేర్కు ఒక్కో ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్ కేటాయిస్తామని కంపెనీ పేర్కొంది. ఐడీఎఫ్సీ పుస్తక విలువ రూ.60గా ఉంది. ఈ లెక్కన ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్ విలువ రూ.39.11గా ఉండొచ్చని అంచనా. 5 నుంచి గోల్డ్ బాండ్ల స్కీమ్ పసిడి బాండ్ల పథకాన్ని నవంబర్ 5వ తేదీన ప్రభుత్వం ప్రారంభిస్తోంది. పెట్టుబడి తొలి విలువ ప్రాతిపదికన బాండ్లపై 2.75 శాతం వార్షిక వడ్డీరేటును ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు ...బ్యాంకులు, నోటిఫై చేసిన నిర్దిష్ట పోస్టాఫీసుల ద్వారా నవంబర్ 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. 2 గ్రాముల నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకూ బాండ్ల కొనుగోలు అవకాశం ఉంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలు. ఐదేళ్ల నుంచీ ‘ఎగ్జిట్’ ఆఫర్ ఉంటుంది. విమానయానం మరింత భారం! ఒకవైపు విమాన చార్జీలపై పరిమితులు విధించాలన్న డిమాండ్ ఉండగా.. మరోవైపు టికెట్లపై 2 శాతం లెవీ విధించేలా ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఈ విధంగా వచ్చిన నిధులను ప్రాంతీయంగా ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు వినియోగించాలని భావిస్తోంది. వ్యాపారంలో బెస్ట్.. భారత్కు 130వ స్థానం కొత్త కంపెనీల చట్టం, విద్యుత్ సరఫరా మెరుగుపడటం తదితర అంశాల ఊతంతో వ్యాపారాల నిర్వహణకు అనుకూల దేశాల జాబితాలో భారత్ 130వ స్థానానికి ఎగబాకింది. గతేడాది భారత ర్యాంకింగ్ 142. ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట ప్రపంచ బ్యాంకు 189 దేశాలతో రూపొందించిన జాబితాలో పది అంశాల ప్రాతిపదికన భారత్కు తాజాగా 130వ ర్యాంకు దక్కింది. ఈ లిస్టులో సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా, న్యూజిలాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చైనా (84), పాకిస్తాన్ (138) ర్యాంకుల్లో ఉన్నాయి. డీల్స్.. * సూపర్ వాస్మోల్ 33 తదితర కేశ సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ హైజీనిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో ప్రేమ్జీ ఇన్వెస్ట్ సంస్థ రూ. 216 కోట్లు పెట్టుబడులు పెట్టింది. * రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో జపాన్కి చెందిన నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ మరో 23 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 2,500 కోట్లు వెచ్చించనుంది. ఈ డీల్ పూర్తయితే రిలయన్స్ లైఫ్లో నిప్పన్ లైఫ్ వాటాలు 49 శాతానికి పెరుగుతాయి. * బయోమ్యాబ్ హోల్డింగ్లో తనకున్న 25 శాతం వాటాలను విక్రయిస్తున్నట్లు ఔషధ దిగ్గజం సిప్లా వెల్లడించింది. కంపెనీలో 75 శాతం పైగా వాటాలున్న బయోమ్యాబ్ బ్రిలియంట్ సంస్థ వీటిని కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ డీల్ విలువ సుమారు 26 మిలియన్ డాలర్లుగా ఉండనుంది. -
‘క్లిక్’ అవుతున్న పోస్ట్..
2008లో డాట్ కామ్ బూమ్ బద్దలయింది. బోలెడన్ని ఇంటర్నెట్ కంపెనీలు మూతపడ్డాయి. కాకపోతే... ఆ బూమ్లో వేసిన కేబుళ్లు, బ్రాడ్ బ్యాండ్ లైన్లు... దేశంలో కొత్త ఇంటర్నెట్ విప్లవానికి ఊపిరినిచ్చాయి. ఉత్తరాలు, పోస్టు కార్డులను ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు మరిపించేశాయి. మనీ ఆర్డర్లను డిజిటల్ బ్యాంకింగ్ మింగేసింది. ఇక తపాలా శాఖ ప్రాభవం తగ్గిందనే అనుకున్నారంతా!! కానీ దేశవ్యాప్తంగా పోస్టల్ విభాగానికున్న అద్వితీయ నెట్వర్క్... దాన్నిపుడు ఈ-కామర్స్లో హీరోను చేస్తోంది. కాలం మారుతున్నా అవకాశాలు ఎక్కడికీ పోవని చెప్పేవే ఈ రెండు ఉదాహరణలూ!!. టెక్నాలజీ పరంగా భారీ మార్పులు ♦ ఈ-కామర్స్ డెలివరీల్లో మూడంకెల అభివృద్ధి ♦ అమెజాన్, స్నాప్డీల్ వంటి దిగ్గజాలతో ఇప్పటికే జట్టు ♦ గ్రామాల్లో ఎవ్వరికీ లేనంత విసృ్తత నెట్వర్క్ దీని బలం ♦ అక్కడ డెలివరీలు పెరిగితే ఆదాయం భారీగా పెరిగే చాన్స్ ♦ సీఓడీ కోసం కార్డ్ ఆధారిత, మొబైల్ ఆధారిత పేమెంట్లు? ♦ ఏపీ, తెలంగాణల్లో పెరగనున్న ప్రత్యేక ప్రాసెసింగ్ కేంద్రాలు ♦ దసరా డెలివరీలకు సెలవులు సైతం రద్దు చేసుకుని విధులు ఇపుడెవరి నోట చూసినా ఈ-కామర్సే. డీల్స్, డిస్కౌంట్స్తో ఊదరగొట్టేస్తున్న ఈ-కామర్స్లో అన్నిటికన్నా ముఖ్యమైనది డెలివరీ యంత్రాంగమే. ఎందుకంటే అమ్మేవారు, కొనేవారు దేశమంతా ఉన్నారు. వారిని కలిపే టెక్నాలజీ ఈ-కామర్స్ కంపెనీలన్నిటి దగ్గరా ఉంది. మరి అమ్మేవారి నుంచి వస్తువుల్ని కొనుగోలుదారుకు చేర్చాలి కదా! అందుకే కొన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సొంత లాజిస్టిక్స్ కంపెనీల్ని ఏర్పాటు చేసుకున్నాయి. మిగిలిన దిగ్గజాలు ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయి. కాకపోతే ఎందరెన్ని చేసినా వారికున్నది పరిమిత యంత్రాంగమే. మారుమూల గ్రామాలతో సహా దేశవ్యాప్త నెట్వర్క్ ఉన్న పోస్టల్కు ఏ కొరియర్ కంపెనీ కూడా సాటిరాదు. ఒకవేళ ఎవరైనా విస్తరించినా అది లాభదాయకం కాదు. అందుకే అమెజాన్, స్నాప్డీల్లు గతేడాది పోస్టల్ శాఖతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయి. ఇపుడు అమెజాన్లో కొన్న వస్తువులు కొన్ని నేరుగా పోస్ట్మ్యాన్ అందిస్తున్నాడంటే కారణం అదే మరి. ఈ-కామర్స్కు ప్రత్యేక ఏర్పాట్లు ఈ-కామర్స్ను ప్రాధాన్యాంశంగా పరిగణిస్తున్న పోస్టల్ విభాగం దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు, టెక్నాలజీ ఆధునికీకరణ వంటివి చేపట్టింది. అందుకే... ఈ-కామర్స్ పార్శిళ్ల ద్వారా గతేడాది ఏప్రిల్ - డిసెంబరు మధ్య రూ.1,968 కోట్ల ఆదాయం ఆర్జించిన ఈ శాఖ... ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఏకంగా 115% వృద్ధిని సాధించింది. ఇక ఏపీ, తెలంగాణల్లో అయితే ఈ వృద్ధి 150%. ఇక్కడ సెప్టెంబరు వరకూ ఆర్జించిన ఆదాయం రూ.158 కోట్లు దాటింది. ఇది ఒకరకంగా రికార్డేనని చెప్పాలి. ఇక క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల (సీఓడీ) బట్వాడాకు నాప్టోల్ వంటివి పూర్తిగా పోస్టల్ విభాగంపైనే ఆధారపడుతున్నాయి. స్టాంపుల విక్రయానికి స్నాప్డీల్, దేశవ్యాప్త డెలివరీ కోసం అమెజాన్ ప్రత్యేక ఒప్పందాలూ చేసుకున్నాయి. కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ-కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీలకు తగినంత నెట్వర్క్ లేకపోవటంతో అవన్నీ పోస్టల్నే ఆశ్రయిస్తున్నాయి. ఉచిత పికప్; టెక్నాలజీ మార్పులు టెక్నాలజీని కూడా పోస్టల్ శాఖ వేగంగా అందిపుచ్చుకుంటోందని చెప్పాలి. తమతో ఒప్పందం చేసుకున్న కంపెనీలకు పోస్ట్మ్యాన్ను పంపి ఉచిత పికప్ సదుపాయం ఇవ్వటం... డెలివరీ రోజున కస్టమర్కు ఫోన్ లేదా ఎస్ఎంఎస్ చేయటం... కస్టమర్కు ఫోన్చేసి షెడ్యూలు మార్చుకునే అవకాశమివ్వటం వంటివన్నీ దీన్లో భాగమే. ఇక సీఓడీ రిటర్న్స్ విషయంలో ఒకవైపు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తుండటం దీనికి కలిసొస్తోంది. ఇక హబ్ల ఏర్పాటును కూడా సంస్థ వేగవంతం చేసింది. ఇటీవలే ముంబయిలో 12వేల చదరపుటడుగుల్లో ప్రత్యేక ఈ-కామర్స్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని కూడా ఆరంభించింది. గ్రామాలకు ఈ-కామర్స్ వెళితే...! ఇపుడు ఈ-కామర్స్ కొనుగోలుదారులు ప్రధానంగా ప్రధాన నగరాల నుంచే చేస్తున్నారు. అందుకని వాటి సొంత లాజిస్టిక్స్ వ్యవస్థ కొంతవరకూ పనికొస్తోంది. దీన్లో గ్రామాల వాటా పెరిగితే మాత్రం పోస్టల్కు తిరుగులేని ఆధిక్యం వస్తుందనేది వాస్తవం. ‘‘ప్రస్తుతం విలువ పరంగా ఈ-కామర్స్లో 60 శాతం వాటా దేశంలోని టాప్-20 నగరాలదే. ఇది మారి గ్రామాల వాటా పెరిగితే పోస్టల్కున్న నెట్వర్క్తో అది చాలా బలోపేతమవుతుంది’’ అని రిటైల్ రంగ నిపుణుడు కలిశెట్టి నాయుడు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇది మారుతుందని, ఇప్పటికే స్నాప్డీల్ వంటి సైట్లలో ఆ సంకేతాలొస్తున్నాయని చెప్పారాయన. ఈ సమస్యల్ని అధిగమిస్తేనే... నెట్వర్క్లో పోస్టల్ విభాగం నెంబర్-1 అనటంలో ఎవరికీ సందేహం లేదు. అయితే టెక్నాలజీ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. రిటర్న్ ఆర్డర్లు చాలా ఆలస్యంగా హబ్లకు చేరుతుండటం, సీఓడీ రూపంలో తీసుకున్న నగదును కంపెనీలకు రెమిట్ చేయటంలో మిగతా కొరియర్లతో పోలిస్తే ఆలస్యమవుతుండటం వంటి సమస్యలున్నాయి. ఇక అన్ని సంస్థలకూ సాఫ్ట్వేర్ పరంగా మద్దతివ్వటం కూడా సాధ్యం కావాల్సి ఉంది. - సాక్షి, బిజినెస్ విభాగం ఇది మా ప్రాధాన్యాంశం... పోస్టల్ విభాగానికి ఈ-కామర్స్ను ప్రాధాన్యాంశంగా కేంద్రం నిర్దేశించిందని, ప్రతి నెలా కేంద్ర మంత్రి సారథ్యంలో సమీక్షలు జరుగుతున్నాయని హైదరాబాద్లోని పోస్ట్ మాస్టర్ జనరల్ పి.వి.ఎస్.రెడ్డి చెప్పారు. తాము కూడా దానికి తగ్గట్టే మార్పులు చేస్తున్నామని ‘సాక్షి’ ప్రతినిధితో చెబుతూ... ‘‘దసరాకు అన్ని కంపెనీలూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డెలివరీకి మమ్మల్ని ఆశ్రయించిన సంస్థల కోసం మేం 22, 24, 25 వంటి సెలవు రోజుల్లో కూడా సిబ్బందిని ప్రత్యేకంగా పిలిపిస్తున్నాం. ఈ-కామర్స్ పార్శిళ్లు డెలివరీ చేసిన సిబ్బందికి అదనపు ఇన్సెంటివ్లు ఇస్తున్నాం కనక వాళ్లూ ఉత్సాహంతో చేస్తున్నారు. కంపెనీలకు సీఓడీ రెమిటెన్స్లు ఆలస్యం కాకుండా కార్డు ఆధారిత పేమెంట్, మొబైల్ మనీ వంటి అంశాల్ని పరిశీలిస్తున్నాం. ఈ-కామర్స్ కోసం హైదారాబాద్ హుమయూన్ నగర్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. హైదరాబాద్లో మరొకటి, గుంటూరు, తిరుపతిలో తలా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం’’ అని వివరించారు. తమ విభాగం ముందడుగు వేస్తోందంటూ... మెరుగుపడాల్సింది ఇంకా చాలానే ఉందని కూడా అంగీకరించారాయన. -
రూ. 64 వేల కోట్లపై మోదీ కన్ను?
చైనా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటనలో వివిధ వాణిజ్య ఒప్పందాలతో పాటు, సరిహద్దు సమస్యలు, వీసా తదితర అంశాలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 64 వేల కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మూడురోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. తన తొలిరోజు పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్వస్థలం, అత్యంత పురాతన నగరం జియాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని జియాన్లోని జింగ్షాన్ ఆలయాన్ని, టెర్రకోట యుద్ధవీరుల మ్యూజియాన్ని కూడా సందర్శించారు. తాను మ్యూజియాన్ని సందర్శించిన సమాచారాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు మోదీ. ద జింగ్షాన్ లోని ప్రముఖ బౌద్ధ దేవాలయం గోల్డెన్ టెంపుల్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బౌద్ధ బిక్షువుల ప్రార్థనల మధ్య బంగారు బుద్ధుని విగ్రహానికి ముకుళిత హస్తాలతో అంజలి ఘటించారు. మరోవైపు జియాన్ నగరంలోనే చైనా అధ్యక్షుడితో ప్రధాని సమావేశం కానున్నారు. చైనా ప్రధాని లికెక్వియాంగ్తో మోదీ సమావేశమై సరిహద్దు సమస్యలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 20 రకాల వాణిజ్య అంశాలపై ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 64 వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనాలో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలికారు. ఈ నెల 19 వరకు ఆయన చైనా, మంగోలియా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించనున్నారు. -
ఈ ఏడాది విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2014) తొలి ఐదు నెలల్లో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) డీల్స్ భారీగా పుంజుకున్నాయి. వెరసి జనవరి నుంచి మే వరకూ 16.37 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. ఇందుకు ఒక్క మే నెలలోనే 4.4 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ జరగడం దోహదపడింది. మేలో మొత్తం 52 లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో అంటే 2013 మే నెలలో 1.7 బిలియన్ డాలర్ల విలువైన 44 లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి. కాగా, జనవరి-మే కాలంలో అత్యధికంగా 230 డీల్స్ జరిగాయి. 2013 ఇదే కాలంలో 216 లావాదేవీలు నమోదుకాగా, వీటి విలువ 8.71 బిలియన్ డాలర్లు మాత్రమే. గ్రాంట్ థార్న్టన్ ఇండియా పార్టనర్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 100 మిలియన్ డాలర్ల డీల్స్: మే నెలలో 100 మిలియన్ డాలర్ల డీల్స్ 8 జరిగాయి. వీటిలో ఒక్కొక్కటీ 500 మిలియన్ డాలర్ల విలువైన మూడు డీల్స్ ఉన్నాయి. కాగా, ఈ విభాగంలో మరోవైపు దేశీ కంపెనీల విదేశీ లావాదేవీలు సైతం పుంజుకోవడం గమనార్హం. మే నెలలో ప్రధానంగా అదానీ పోర్ట్స్ డీల్ చెప్పుకోదగ్గది. ధామ్రా పోర్ట్ను 932 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. యునెటైడ్ స్పిరిట్స్కు చెందిన వైట్ అండ్ మెకేను ఫిలిప్పీన్స్కు చెందిన ఎంపెరేడర్ 725 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. ఇక రిలయన్స్-నెట్వర్క్18 మధ్య జరిగిన డీల్ విలువ 678 మిలియన్ డాలర్లుకాగా, టాటా కమ్యూనికేషన్స్కు చెందిన నియోటెల్లో 68% వాటాను వొడాకామ్ కొనుగోలు చేసింది. ఇందుకు 455 మిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇదే విధంగా వదీనర్ పవర్లో 74% వాటాను ఎస్సార్ ఆయిల్ 356 మిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకుంది. -
ఓటరు దేవుని ప్రసన్నం కోసంఆఖరి యత్నాలు
నేటితో ప్రచారానికి తెర .. మండుటెండలో అభ్యర్థుల పోటీ ప్రచారం జోరుగా పాదయాత్రలు, బైక్ ర్యాలీలు కాంగ్రెస్, బీజేపీలకు జీవన్మరణ సమస్య సర్వశక్తులూ ఒడ్డుతున్న సీఎం సిద్ధు పలుచోట్ల ‘జేడీఎస్’ అభ్యర్థులతో లోపాయికారి ఒప్పందాలు పెద్దగా ప్రభావం చూపని ‘ఆమ్ ఆద్మీ’ ‘మందు’ చూపుతో మద్యం దుకాణాల వద్ద మందు బాబులు క్యూ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్సభ ఎన్నిలకు మంగళవారం సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులు ఓటరు దేవుని ప్రసన్నం చేసుకోవడానికి తుది ప్రయత్నాలు చేస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రలు, బైక్ ర్యాలీల ద్వారా ప్రచారాన్ని విస్తృతం చేశారు. ప్రధాన పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వివిధ లేఔట్లలో ర్యాలీలు నిర్వహించారు. పార్టీ అభ్యర్థుల కరపత్రాలను పంచుతూ ముందుకు సాగారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే రోడ్డు షోలు, బహిరంగ సభలకు అవకాశం ఉంటుంది. అనంతరం ఇంటింటి ప్రచారానికి అవకాశం ఉన్నా, అభ్యర్థులు వేరే ‘పనుల్లో’ నిమగ్నమైపోతారు. కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. మంచి ఫలితాలు సాధించకపోతే స్థాన భ్రంశం తప్పదనే అధిష్టానం సంకేతాలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్వ శక్తులను ఒడ్డి అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు. గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఏక తాటిపై నిలవాల్సిందిగా పార్టీ నాయకులకు ఉద్బోధిస్తున్నారు. ‘సెక్యులర్’ ఓట్లలో చీలిక ఏర్పడి, బీజేపీకి లాభిస్తుందనే చోట్ల ‘జేడీఎస్’ అభ్యర్థులను లోపాయికారిగా తప్పించడానికి ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర కన్నడ నియోజక వర్గంలో జేడీఎస్ అభ్యర్థి శివానంద్ నాయక్ చివరి నిమిషంలో నామినేషన్ను ఉపసంహరించుకోగా, బెల్గాంలో పార్టీ అభ్యర్థి నజీర్ భగ్వాన్, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. మరో రెండు చోట్ల కూడా జేడీఎస్ అభ్యర్థులు ప్రచారంలో పాల్గొనకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు పరోక్షంగా మద్దతునిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు మోడీ ప్రభంజనంపై గట్టి ఆశలు పెట్టుకున్న బీజేపీ, కనీసం 20 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఎన్డీఏ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలనుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు తమ ఓట్లకు గండి కొడతారని తొలుత భయపడిన బీజేపీ అభ్యర్థులు, క్రమేణా ఆ పార్టీ ప్రభావం బలహీన పడుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా గురువారం ఒకే దశలో రాష్ర్టంలోని మొత్తం 28 నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగనుంది. ‘మందు’ చూపు ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రంలోని మద్యం దుకాణాలను మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి మూడు రోజుల పాటు మూసి వేయనున్నారు. ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపిస్తుండడంతో గతంలో లాగా మద్యం దుకాణాలను మూసి వేసినా విచ్చల విడిగా మద్యం దొరికే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో మందు బాబులు అప్పు సొప్పో చేసి మూడు రోజులకు సరిపడా మద్యాన్ని స్టాక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరో వైపు బార్లు సైతం ‘రేపు సాయంత్రం 4.30 గంటల నుంచి గురువారం వరకు షాపులు మూసివేయబడును’ అని బోర్డులు వేలాడదీసి మందు బాబులను మరింత ‘అప్రమత్తం’ చేస్తున్నాయి. -
డీల్స్ అండ్ డిస్కౌంట్స్
ఆన్లైన్ షాపింగ్ జోరందుకుంటోంది. దానికి తగ్గట్టే డీల్స్ కూడా అదిరిపోతున్నాయి. షాప్క్లూస్డాట్కామ్.. క్లియరెన్స్ సేల్ పెట్టింది. ఇందులో భాగంగా 80 శాతం పైగా డిస్కౌంట్లిస్తోంది. ఆభరణాలకు సంబంధించి పెండెంట్ సెట్ని రూ.1,099కి, ముత్యాల హారాలను రూ.698కి, గృహోపకరణాలకి సంబంధించి ఇండక్షన్ కుకింగ్ సెట్ లాంటి వాటిని రూ.888 స్థాయిలో అందిస్తోంది. అటు ల్యాప్టాప్ స్పెషల్ కేటగిరీ కింద అసూస్ తదితర ల్యాప్టాప్స్పై 20 శాతం దాకా డిస్కౌంట్స్ ఇస్తోంది. రూ. 15,275 నుంచి ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలా చెయ్యొచ్చు... ఆటోమేటిక్ విత్డ్రాయల్.. దీర్ఘకాలికంగా పొదుపు చేయాలనుకున్నప్పుడు వాటికి ప్రతి నెలా కచ్చితంగా డబ్బు చేరేలా బ్యాంక్ ఖాతాలో ఆటోమేటిక్ విత్డ్రాయల్ ఫీచర్ని యాక్టివేట్ చేయండి. నెల తిరిగేసరికల్లా డబ్బు మీ ఖాతాలోంచి వెళ్లిపోవటం వల్ల చేతిలో డబ్బు ఆడక ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ అలవాటైపోతుంది. చేతిలో ఉన్న సొమ్ముకు మాత్రమే సరిపడేలా బడ్జెట్ దానంతటదే సర్దుకుంటుంది.