diagnosis
-
యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్: ధమనిలో సునామి..!
అసలు ‘యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్’ అంటే ఏమిటో తెలుసుకునే ముందర అన్యురిజమ్ అంటే ఏమిటో చూద్దాం. కొన్నిసార్లు రక్తనాళాల (ధమనుల) గోడలు కొన్ని చోట్ల పలుచబడి బెలూన్లా ఉబ్బే ప్రమాదం ఉంది. ఇలా ఉబ్బినట్లు కావడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అ పలచబడిన రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్ (యూఏపీఏ) అంటే... గర్భసంచికి (యుటెరస్కు) సప్లై అయ్యే రక్తనాళం ఉబ్బడం. అయితే ‘సూడో’ అంటే వాస్తవమైనది కాదనీ, ఉబ్బులా కనిపిస్తూ, చిట్లినప్పటికీ రక్తస్రావం చాలా కొద్ది ప్రాంతానికి పరిమితమవుతుందని అర్థం. అందుకే దీన్ని ‘యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్’ అని చెప్పవచ్చు. ఇది కాస్తంత అరుదుగా కనిపించే సమస్యే అయినప్పటికీ ప్రాణాంతకం అయ్యే అవకాశమున్నందున దీనిపై అవగాహన కోసం...నిజానికి సూడో అన్యురిజమ్ గురించి మరింత విపులంగా చెప్పుకోవాలంటే... అన్యురిజమ్స్ అనేవి దేహంలోని రక్తనాళాల్లో ఎక్కడైనా రావచ్చు. మెదడులో, గుండెకు రక్తాన్ని చేసే థొరాసిక్ ప్రాంతాల్లో వచ్చినప్పుడు ప్రమాదకరంగా మారతాయి. అయితే ఇప్పుడు యుటెరస్కు రక్తసరఫరా చేసే రక్తనాళం బాగా పలుచబారి ఒక చిన్న బెలూన్లా లేదా సంచిలా ఉబ్బి చిట్లితే అది రక్తస్రావం చాలా కొద్ది ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుంది. చుట్టుపక్కల ఉండే కణజాలం ఆ రక్తస్రావాన్ని చాలాదూరం ప్రవహించనివ్వదు. అయితే ఈ కండిషన్ తీవ్రమైన బాధ కలిగిస్తుంది. యుటెరస్లోని ఫైబ్రాయిడ్స్ వంటి తిత్తులు చిట్లడం వల్ల గానీ లేదా కొన్నిసార్లు గర్భస్రావాలు అయినప్పుడుగానీ ఇలాంటి కండిషన్ ఏర్పడటానికి అవకాశాలెక్కువ. అయితే ఇది తక్షణం శస్త్రచికిత్సకు దారితీయవచ్చు. ఒక్కోసారి తుంటి ఎముక విరగడానికి కూడా అవకాశాలుంటాయి. లక్షణాలు... యోని నుంచి భారీగా రక్తస్రావం ఈ రక్తస్రావంలో మధ్య మధ్య అంతరాయాలు (అంటే... అదేపనిగా కాకుండా కాసేపు కనిపిస్తూ, మరికాసేపు ఆగుతూ అప్పుడప్పుడూ జరుగుతుండవచ్చు) పొత్తికడుపు నుంచి కింది భాగమంతా తీవ్రమైన నొప్పి కొన్నిసార్లు పై లక్షణాలేమీ కనిపించకపోవచ్చు కూడా (అసింప్టమేటిక్గా వచ్చే ఈ సమస్య... ఇతర కారణాలను అన్వేషిస్తూ ఇమేజింగ్ పరీక్షలు చేస్తున్నప్పుడు బయటపడవచ్చు). నిర్ధారణ... ఈ కింద పేర్కొన్న పరీక్షల వల్ల సూడో అన్యురిజమ్ కారణంగా జరుగుతున్న రక్తస్రావాలు తెలుస్తాయి. డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కాంట్రాస్ట్ ఎన్హ్యాన్స్డ్ అల్ట్రాసౌండ్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్) మేగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎమ్మారై) యాంజియోగ్రఫీ చికిత్సలు... మేనేజ్మెంటే తొలి చికిత్స...అన్యురిజమ్కు చికిత్స అన్నది రక్తనాళాల ఉబ్బు సైజు, బాధితురాలిలో కనిపిస్తున్న లక్షణాలను బట్టి ఉంటుంది. ఒకవేళ ఉబ్బు చిన్నగా ఉన్నట్లయితే ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ అనే ప్రక్రియను అనుసరిస్తారు. (ఇందులో చాలా చిన్న గాటుతో అక్కడికి రక్తం చేరకుండా ఆపుతారు). కొన్ని సందర్భాల్లో పూర్తిస్థాయి శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. అయితే చిన్నగాటుతో చేసే ఎంబోలైజేషన్కే డాక్టర్లు ప్రాధాన్యమిస్తుంటారు. చిన్న గాటుతోనే చికిత్స పూర్తి చేయడానికి అవకాశముండటంతో బాధితురాలికి ప్రాణాపాయం ముప్పు చాలా తక్కువగా ఉండటమే దీనికి కారణం.యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్కు అత్యాధునిక చికిత్సలు... సమస్య ఉన్న ప్రాంతం వంటి అంశాలను బట్టి మరికొన్ని ఆధునిక చికిత్సలను డాక్టర్లు అనుసరిస్తుంటారు. ఉదా: యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (యూఏఈ) : ఇది ప్రామాణికంగా చేసే చాలా మంచి చికిత్స (గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్). ఇందులో చాలా చిన్న గాటుతో రక్తనాళంలోకి మరో చిన్న పైప్ను (క్యాథెటర్)ను పంపుతారు. ఆ తర్వాత ఉబ్బు వచ్చిన రక్తనాళాన్ని అనేక చుట్లు చుట్టడం (కాయిలింగ్ చేయడం) ద్వారా ప్రభావితమైన ప్రాంతానికి రక్తసరఫరాను నిలిపివేస్తారు. దాంతో ఉబ్బిన చోటికి రక్తం ఆగడంతో అది చిట్లే ప్రమాదం తప్పిపోతుంది. ఇది చాలా మంచి చికిత్స ప్రక్రియగా అనేక సార్లు నిరూపితమైంది. శస్త్రచికిత (సర్జికల్ ఇంటర్వెన్షన్) : ఒకవేళ యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (యూఏఈ)కి అవకాశం లేకపోయినా లేదా యూఏఈ ప్రక్రియ విఫలమైన సందర్భాల్లో శస్త్రచికిత్సకు పూనుకుంటారు. ఇందులో పలుచబడ్డ ప్రాంతాన్ని తొలగించి, మళ్లీ రక్తనాళాలను కలపడమో లేదా మరీ ప్రాణాపాయ పరిస్థితి ఉన్నప్పుడు హిస్టరెక్టమీ ప్రక్రియ ద్వారా గర్భసంచిని తొలగించడమో చేస్తారు. హైబ్రీడ్ టెక్నిక్స్...కొన్ని సందర్భాల్లో ఇటు ఎంబోలైజేషన్తోపాటు అటు సర్జరీ... ఈ రెండూ కలగలసిన ప్రక్రియలను అనుసరిస్తారు. మరీ ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఏదైనా కారణాలతో గాయాలైనా లేదా క్యాథెటర్తో ఆ ప్రాంతాన్ని చేరడానికి కష్టమవుతున్న సందర్భాల్లో ఇలాంటి ఇరు ప్రక్రియల కలయికతో కూడిన హైబ్రీడ్ టెక్నిక్స్ను అవలంబిస్తారు. డా. సవితా రాథోడ్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్(చదవండి: టేస్టీ బర్గర్ వెనుకున్న సీక్రెట్ తెలిస్తే కంగుతినడం ఖాయం..!) -
క్షయ నిర్మూలన ఓ అత్యవసరం!
క్షయ (టీబీ) వ్యాధిని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ వ్యాధిపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీబీ నిర్మూలనలో మన దేశం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, రోగులు పూర్తిగా కోలుకునేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్పీవై)ని అమలుచేస్తోంది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి, స్వల్పకాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకూ అనుమతి ఇవ్వడం విశేషం.దేశం నుంచి క్షయ (టీబీ)ని పారదోలాలని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆయన నాయకత్వంలో టీబీని నిర్మూలించేందుకు వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సల్లో మార్పు తీసుకువచ్చేందుకు గత కొన్నేళ్లుగా వినూత్న విధానాలను భారత్ అవలంబిస్తోంది. డబ్ల్యూహెచ్వో విడుదల చేసిన ‘ప్రపంచ టీబీ నివేదిక – 2024’లో ఇప్పటి వరకు దేశంలో అవలంబిస్తున్న విధానాలను ప్రస్తావించింది. దేశంలో 2015 నుంచి 2023 వరకు 17.7 శాతం మేర టీబీ వ్యాప్తి తగ్గింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాధి క్షీణత రేటు విషయంలో ఇది రెట్టింపు. అలాగే దేశ వ్యాప్తంగా 25.1 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఫలితంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకునేవారి శాతం 2015లో ఉన్న 59 నుంచి 2023 నాటికి 85 గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి దార్శనిక స్ఫూర్తితో టీబీని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం భారత్లో ప్రారంభమైంది. క్షయపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్య క్రమాన్ని పంచకుల నుంచి ప్రారంభించింది. వ్యాధి తొలిదశలో ఉండగానే క్షయ రోగులందరినీ గుర్తించి వారికి సకాలంలో అవస రమైన, నాణ్యమైన చికిత్సను అందించాలనే మా సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది. ‘జన్ భగీదారి’ స్ఫూర్తితో మనమంతా– ప్రజాప్రతినిధులు, ఆరోగ్య నిపుణులు, పౌరసమాజం, కార్పొరేట్ సంస్థలు, సంఘాల–సంయుక్తంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేద్దాం.భారత్ నుంచి టీబీని తరిమేసే ప్రయాణంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న చురుకైన భాగస్వామ్యం... ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలుస్తుందనే భరోసాను ఇచ్చింది. టీబీ నిర్మూలనలో మన దేశ సామాజిక విధానం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, టీబీ రోగులు పూర్తిగా కోలుకొనేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం... ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్పీవై)ని భారత్ అమలుచేస్తోంది. ఏప్రిల్ 2018 నుంచి 1.16 కోట్ల మంది లబ్ధి దారులకు ఎన్పీవై పథకం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ. 3,295 కోట్లు అందించారు. ఈ పథకం ద్వారా నెలవారీగా అందించే ఆర్థిక సాయం గత నవంబర్ నుంచి రూ. 500 నుంచి రూ. 1000కి పెంచడం క్షయ నిర్మూలనలో భారత్ నిబద్ధతను సూచించే మరో అంశం.మరో కీలక అంశం... పోషకాహర సమస్యను పరిష్కరించడంతో పాటు సమాజ భాగస్వామ్యం పెరిగేలా ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ తోడ్పడింది. అలాగే సమాజంలో వివిధ వర్గాలను ఏకం చేసి అవగాహన పెంచడానికి, టీబీ రోగులకు పోషకాహారం, వృత్తిపరంగా, మానసికంగా సాయం అందించే దిశగా సామూహిక ఉద్య మాన్ని సృష్టించింది. జన్ భగీదారి స్ఫూర్తితో ప్రభుత్వ – పౌర భాగ స్వామ్యంతో చేపట్టిన ఈ ఉద్యమం 1.75 లక్షల మంది ని–క్షయ మిత్రల ద్వారా దేశవ్యాప్తంగా 21 లక్షల ఆహార కిట్లను సరఫరా చేసేందుకు స్ఫూర్తినిచ్చింది.టీబీని రూపుమాపడానికి వినూత్న విధానంఅనేక సంవత్సరాలుగా చికిత్స సఫలతా రేటును పెంపొందించేందుకు బెడాక్విలైన్, డెలామనిడ్ వంటి సరికొత్త ఔషధాలను భారత్ ప్రవేశపెట్టింది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి స్వల్ప కాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకు అనుమతి నిచ్చాం. ఇప్పటికే ఉన్న చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది మరింత ప్రభావ వంతంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు 19 నుంచి 20 నెలల పాటు సాగే సంప్రదాయ చికిత్సా విధానంతో పాటు 9 నుంచి 11 నెలల పాటు సాగే చికిత్సా విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ బీపీఏఎల్ఎమ్ విధానంతో రోగులు ఆరు నెలల్లోనే చికిత్సను పూర్తి చేసుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో రోగులందరినీ గుర్తించి సత్వరమే చికిత్స అందించడడానికి వీలుగా అందుబాటులో అధునాతన పరికరాలు ఉండేలా నిరంతర కృషి చేస్తున్నాం. దీని కోసమే సమర్థవంతమైన, కచ్చితమైన పరీక్షా పద్ధతులను ప్రవేశపెట్టాం. అవే జీవ పరమాణు పరీక్షలు (మాలిక్యులర్ టెస్ట్స్). 2014 –15లో కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఉన్న వ్యాధి నిర్ధారణ పరికరాల సంఖ్య ప్రస్తుతం 8,293 కు చేరుకున్నాయి. ఈ పరికరాలు అన్ని జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ స్ఫూర్తితో స్వదేశీ జీవ పరమాణు పరీక్షలను క్షేత్రస్థాయిలో పరీక్షించి రూపొందించిన పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా జిల్లా, బ్లాకు స్థాయిల్లో టీబీ నిర్ధారణకు వెచ్చించే సమయాన్ని తగ్గించడంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించగలిగాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన మన స్వదేశీ మాలిక్యులర్ పరీక్షలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాలు టీబీ నిర్మూలనలో భారత్ను అగ్రస్థానంలో నిలిపాయి.2018 నుంచి టీబీ పరిశోధనలపై అధికంగా నిధులు వెచ్చిస్తున్న అగ్ర సంస్థల్లో ఒకటిగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్థిరంగా నిలవడం మనందరికీ గర్వకారణం. రోగులకు అతి చేరువలోనే సమర్థవంతమైన వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో సహా మరిన్ని నూతన సాధనాలను త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు కొనసాగిస్తాం. భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తూ...వివిధ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నిరూపి తమైన సాంకేతికతలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడం... టీబీ నిర్మూలనా దిశలో భారత్ నాయకత్వానికి నిదర్శనాలు. అధు నాతన రోగ నిర్ధారణ, చికిత్సలకు దారితీసే మార్గదర్శక పరిశోధనల నుంచి సార్వత్రిక సామాజిక తోడ్పాటును అందించే నియమాలను ప్రవేశ పెట్టేవరకూ... టీబీని పారదోలడంలో మన దేశం ముందంజలో ఉంది. టీబీని గుర్తించడం, నిర్ధారించడం, చికిత్స, నివారణలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేయడం ఈ సమయంలో అత్యవసరం. 100 రోజుల పాటు ఉద్ధృతంగా సాగే ప్రచారం టీబీని రూపుమాపడంలో సామూహిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వంలో అందరి భాగస్వా మ్యంతో, మానవాళికి పెద్ద శత్రువుగా ఉన్న టీబీని ఓడించి, ఆరోగ్య కరమైన భవిష్యత్తును కల్పిస్తామని నేను విశ్వసిస్తున్నాను.జగత్ ప్రకాశ్ నడ్డా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి -
అలియా భట్కి ఏడీహెచ్డీ డిజార్డర్..అందువల్లే పెళ్లిలో..!
బాలీవుడ్ నటి అలియా భట్ గ్లామర్కి నటనకి నూటికి నూరు మార్కులు పడతాయి. అంతలా ప్రేక్షకుల మనుసులను గెలుచుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి దటీజ్ అలియా అని ప్రూవ్ చేసింది. ఫిట్నెస్ పరంగా గ్లామర్ పరంగా ఎంతో కేర్ తీసుకునే ఆమె ఏడీహెచ్డీ డిజార్డర్తో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అందువల్లో తన పెళ్లిలో ఆ సమస్య దృష్ట్యా ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. ఏంటా సమస్య? ఎందువల్ల వస్తుంది?అలియా ఏడీహెచ్డీ లేదా టెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. బాల్యం నుంచే తాను ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్లు తెలిపింది. దీని కారణంగా ఏ విషయంపై గంటల కొద్ది దృష్టిపెట్టి పనిచేయలేను అని చెబుతోంది. ఈ ఇబ్బంది వల్లే స్కూల్లో కూడా ఒకదానిపై ఫోకస్ పెట్టలేకపోయేదాన్ని అని తెలిపింది. ఈ సమస్యకు భయపడే పెళ్లిలో కూడా మేకప్ అరగంటకి మించి ఎక్కువ తీసుకోవద్దని ముందుగానే మేకప్ మ్యాన్లకు చెప్పారట. ఆఖరికి షూటింగ్లలో కూడా ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటానని అంటోంది అలియాఏడీహెచ్డీ అంటే..చాలా సాధారణమైన న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్లలో ఒకటి. ఇది సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ పెద్దలల్లో కూడా నిర్ధారణ అవుతుంది. ఈ రుగ్మత ఉన్నవారి మెదడులోని నరాల నెట్వర్క్లు, న్యూరోట్రాన్స్మిటర్లలో తేడాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.దీని కారణంగా ఆయా వ్యక్తులు ఏ పని మీద ఒక అరగంటకు మించి అటెన్షన్ ఉంచలేరు. వెంటనే చికాకు, ఒత్తడికి గురవ్వుతారు. అంతేగాదు దీని వల్ల శ్రద్ధ వహించడం, ఎక్కువ సేపు చురుకుగా ఉండటం వంటి వాటిల్లో సమస్యలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..అజాగ్రత్తఒక దానిపై దృష్టి నిలపడంలో ఇబ్బందిఆర్గనైజ్ చేసి పనిలో ఉండలేకపోవడంఎక్కువ సేపు వింటూ కూర్చోవాలన్న ఇబ్బంది పడటం.మానసిక శ్రమతో కూడిన పనులకు రోజువారీ పనుల్లో మతిమరుపుఎందువల్ల వస్తుందంటే..ఏడీహెచ్డీతో బాధపుడుతున్న వ్యక్తుల్లో మెదడు నిర్మాణం, కార్యచరణలో తేడాలు ఉన్నట్లు మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లలో పూర్తి పరిక్వతతో మెదడు ఉండకుండా నెమ్మదిగా ఉంటుందట. వీళ్లలో నిర్దేశిత శ్రద్ధే ఉంటుందట. వీరి మెదడులో ఆటోమేటిక్ అటెన్షన్ నెట్వర్క్ అనేది డిఫాల్ట్ మోడ్లో ఉంటుందట. అందువల్ల ఇలా జరుగుతుందని అన్నారు. అయితే ఈ రుగ్మత ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరావాల్సి ఉంది. దీనిపై అధ్యయనాలు జరుగుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ డిజార్డర్ కుటుంబ వారసత్వంగా వస్తుందని అన్నారు. (చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ) -
కోవిడ్ కక్కిన విషం.. స్వీట్ లిటిల్స్లో చేదు చక్కెర
కోవిడ్ తర్వాత పిల్లల్లో టైప్– 1 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందేమోనని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా ఇది జరిగేందుకు అవకాశముందనే పరిశోధకుల రిపోర్టులు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’ (జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్)లో ప్రచురితమయ్యాయి.పరిశోధకుల అధ్యయన ఫలితాల వివరాలివి... వైరస్ తాలూకు ప్రభావంతో చిన్నారుల సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు.. వారి క్లోమ (ప్యాంక్రియాస్) గ్రంథిలోని బీటా కణాలు దెబ్బతీయడం వల్ల పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ వచ్చే ముప్పుందని పేర్కొంటున్నారు.అధ్యయన ఫలితాలు చెప్పేదేమిటంటే... జర్మనీలో ఫిబ్రవరి 2015 నుంచి అక్టోబరు 2023 వరకు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు పరిశోధకులు 509 మంది చిన్నారులపై ఓ సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. ఏడాది మొదలుకొని పదహారేళ్ల వయసున్న పిల్లల్లో మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీలనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఈ అధ్యయనం సాగింది. ఈ ‘మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీస్’ అనేవి ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీసే ్రపోటీన్లు. ప్యాంక్రియాస్ను అవి అలా దెబ్బతీయడంలో చిన్నారుల్లో అది టైప్–1 డయాబెటిస్కు కారణమవుతుంది. ఐలెట్ ఆటో యాంటీబాడీస్... ప్యాంక్రియాస్ను దెబ్బతీయడం జరిగితే ముందు లక్షణాలు కనిపించకపోయినప్పటికీ... తుదకు అది టైప్–1 డయాబెటిస్కు దారితీస్తుంది. ఈ తరహా పరిశోధనల అవసరమెందుకంటే... డయాబెటిస్ వ్యాధిలో రక్తంలో చక్కెరను నియంత్రించాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగదు. లేదా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ దేహం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోకపోవచ్చు. దాంతో రక్తంలో చక్కెర ఎక్కువవ్వడంతో తొలిదశల్లో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా నిశ్శబ్దంగా దెబ్బతీసే చక్కెర వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’గా నిపుణులు చెబుతుంటారు. జీవనశైలి సమస్యల్లో ఒకటైన ఈ వ్యాధిని దురదృష్టవశాత్తూ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. దాంతో అది దేహంలోని కీలకమైన అవయాలను... మరీ ముఖ్యంగా గుండె, రక్తనాళాలు, కళ్లు, మూత్రపిండాలు, నరాలను దెబ్బతీస్తుంది. అందువల్ల చిన్నపిల్లల్లో కనిపించే చక్కెరవ్యాధి (జువెనైల్ డయాబెటిస్) అని పిలిచిన ఈ వ్యాధి... ఇప్పుడు యువత పెద్దయ్యాకా వారిని ప్రభావితం చేస్తుండటంతో మనదేశ నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి్టపెడుతున్నారు.గట్ మైక్రోబియమ్ అసమతౌల్యత వల్ల... జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందనీ, ఈ సూక్ష్మజీవుల సమూహాన్నే ‘గట్ బ్యాక్టీరియా’ లేదా ‘గట్ మైక్రోబియమ్’ అంటారనీ, దీనివల్లనే ప్రతి ఒక్కరిలోని వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఏదైనా వైరస్ సోకాక... ఈ గట్ మైక్రోబియమ్లో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య తగ్గి, కీడు చేసేవి పెరగడం వల్ల గట్ మైక్రోబియమ్ సమతౌల్యతలో మార్పుల వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, బలహీనమవుతుంది. ఈ పరిణామం డయాబెటిస్, గుండెజబ్బుల వంటి అనేక దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులకు కారణమవుతుంది.యాంటిజెన్స్కు ఎక్స్పోజ్ కానివ్వపోవడంతో... మునపటి తరంతో పోలిస్తే ఇటీవల పిల్లలను స్వాభావికమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కానివ్వకుండా అత్యంత రక్షణాత్మకమైన రీతిలో తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. పిల్లలు ఆరుబయట ఆడుతూ, ్రపాకృతిక పర్యావరణానికీ, అందులోని కొన్ని వ్యాధికారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు చిన్నారుల్లో ఆ వ్యాధికారకాలను ఎదుర్కొనే యాంటిజెన్స్ ఉత్పన్నం అవుతాయి. కానీ తల్లిదండ్రుల అతిజాగ్రత్త కారణంగా వారు నేచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండటం తగ్గిపోవడంతో కొన్ని రకాల హానికారక అంశాలకు యాంటిజెన్స్ ఉత్పాదన లేకుండా పోయి, సహజ రక్షణ కవచం ఏర్పడకుండా పోయింది. ఈ అంశం కూడా పిల్లల్లో సహజ రక్షణ వ్యవస్థను బలహీనం చేసిందనే అభి్రపాయం కూడా ఇంకొందరు నిపుణులనుంచి వ్యక్తమవుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిందే... కనబడుతున్న తార్కాణాలను బట్టి, ప్రస్తుతానికి టైప్–1 డయాబెటిస్కు మందులేదనే వాస్తవానికి బట్టి రాబోయే భావితరాలను వ్యాధిగ్రస్తం కాకుండా చూసుకునేందుకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. డయాబెటిస్ ఉన్న పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు ... 👉చాలా ఎక్కువ నీరు తాగుతూ ఉండటం; మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్తుండటం. 👉రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటును మానేసిన పిల్లలు అకస్మాత్తుగా మళ్లీ పక్క తడపటం మొదలుపెట్టడం ∙బాగా ఆకలితో ఉండటం; మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం ∙చాలా తేలిగ్గా అలసిపోతుండటం, చాలా నిస్సత్తువగా, నీరసంగా ఉండటం ∙కొందరిలో చూపు మసగ్గా కనిపిస్తుండటం (బ్లర్డ్ విజన్) ∙జననేంద్రియాల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్లు (క్యాండిడియాస్) వంటివి వస్తుండటం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్తో వైద్యం మొదలుపెట్టకపోతే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు.టైప్–1 డయాబెటిస్ను ఎదుర్కొనే తీరు(మేనేజింగ్ టైప్–1 డయాబెటిస్) పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ కనిపించినప్పుడు కింద పేర్కొన్న ఆరు అంశాల ద్వారా దాన్ని మేనేజ్ చేయాలి. అవి... 1. ఇన్సులిన్ : డయాబెటిస్తో బాధపడే పిల్లల విషయంలో ప్రస్తుతానికి ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స. 2. పర్యవేక్షణ (మానిటరింగ్) : పిల్లల్లో కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపోదు. వారు తిన్న దాన్ని బట్టి ఎంత మోతాదులో ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్ని నిత్యం పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఈ అంశాన్ని పిల్లలు ఎంత తిన్నారు, ఎలాంటి ఆహారం తీసుకున్నారు, దాని వల్ల రక్తంలో ఎంత గ్లూకోజ్ వెలువడుతుంది... వంటి అనేక అంశాలను పర్యవేక్షించుకుంటూ ఇన్సులిన్ ఇస్తుండాలి. 3. ఆహారం : కేవలం రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను చూసుకుంటూ యాంత్రికంగా ఇన్సులిన్ ఇవ్వడం కాకుండా... పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు కాబట్టి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా ఆహారం ఉండేలా చూపుకోవాలి. ఆహారంలో తగిన పాళ్లలో పిండిపదార్ధాలను (కార్బోహైడ్రేట్స్) సమకూర్చే కాయధాన్యాలు (హోల్గ్రెయిన్స్), మాంసకృత్తులు (్రపోటీన్లు), ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు ఇస్తుండాలి. వీటిని పిల్లల వయసు, బరువు, రోజంతా చేసే శ్రమ వంటి అంశాల ఆధారంగా ఓ ప్రణాళిక రూ΄÷ందించి, దానికి అనుగుణంగా అవసరమైన మోతాదుల్లో ఇవ్వాలి. 4. శారీరక శ్రమ : ఈ రోజుల్లో చిన్నారులు ఆరుబయట ఆడుకోవడం చాలా తక్కువ. పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర మోతాదులు స్వాభావికంగానే నియంత్రితమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లల్లో ఒళ్లు అలిసేలా ఆడుకోవడం చాలా అవసరం.5. గ్లూకోజ్ను పరీక్షించడం : పిల్లల రక్తంలో గ్లూకోజ్ మోతాదుల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. 6. కీటోన్ మోతాదుల కోసం మూత్రపరీక్ష : మూత్రంలో కీటోన్ మోతాదులను పరీక్షించడం కోసం తరచూ మూత్రపరీక్షలు చేయిస్తూ ఉండాలి. చిన్నారుల్లో పెరుగుతున్న కేసులు... కోవిడ్–19 ఇన్ఫెక్షన్ అన్నది ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ను పెంచడం వల్ల ఆ అంశం ఈ వ్యాధిని ప్రేరేపిస్తోందంటున్నారు మరికొందరు నిపుణులు. ఇక జామా రిపోర్టును అనుసరించి, కోవిడ్–19 బారిన పడ్డ పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన ఆర్నెల్ల నుంచి ఏడాది కాలంలోనే టైప్–1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు మామూలు పిల్లల కంటే 16% ఎక్కువ. మన దేశంలో నిర్దిష్టమైన గణాంకాలు లేకపోయినప్పటికీ... పాశ్చాత్య దేశాల అధ్యయనాల ప్రకారం చూస్తే కోవిడ్ (సార్స్–సీవోవీ2) ఇన్ఫెక్షన్ తర్వాత టైప్–1 డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎంటరోవైరస్, సైటో మెగాలో వైరస్, రుబెల్లా వైరస్లు ఎటాక్ అయ్యా కూడా టైప్–1 డయాబెటిస్ రావడం జరిగినట్లే... కోవిడ్19 విషయంలోనూ జరుగుతోందని మరికొందరు నిపుణుల అభి్రపాయం.కారణాలుటైప్–1 డయాబెటిస్కు జన్యుపరమైన కారణాలను ముఖ్యంగా చెప్పవచ్చు. దాంతోపాటు బాధితులు కొన్ని వైరస్లకు గురికావడం కూడా మరో ముఖ్యమైన అంశం. కోవిడ్–19 కూడా ఒక రకం వైరల్ ఇన్ఫెక్షన్ కావడం కూడా ఈ ముప్పును పెంచుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్), 2022 నివేదిక ప్రకారం మన దేశంలో టైప్–1 డయాబెటిస్తో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 95,600 మంది 14 ఏళ్లలోపు చిన్నారులని తేలింది. -
అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..!
అతనొక అనుభవజ్ఞుడైన డాక్టర్ అయినప్పటికీ తన కుటుంబంలోని వ్యక్తికి వచ్చిన వ్యాధి ఏంటన్నది నిర్థారించలేకపోయాడు. పలు టెస్టులు చేసి ఆ వ్యాధి ఏంటనేది చెప్పలేకపోయాడు. కానీ ఆ వ్యాధి ఏంటనేది..అతడి ఇంట్లో పనిచేసే పనిమనిషి జస్ట్ 15 సెకన్లలో ఠక్కున చెప్పేసింది. ఆమె సమయస్ఫూర్తికి విస్మయానికి గురైన డాక్టర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ పనిమనిషి ఎలా చెప్పిందంటే...డాక్టర్ ఫిలిప్స్ తన కుటుంబంలోని ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. విపరీతమైన చలి, కీళ్లనొప్పులు, దగ్గుతో బాధపడ్డాడు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా వచ్చాయి. దీంతో ఫిలిప్స్ కోవిడ్ 19, ఇన్ఫ్లుంజా, డెంగ్యూ వంటి వైద్య పరీక్షలన్నీ చేశాడు. కానీ ఆ వ్యక్తికి ఏం వ్యాధి వచ్చేందని నిర్థారించలేకపోయాడు. దీంతో అతనికి సరైన అందిచలేకపోయాడు. అసలు అతనకు వచ్చిన సమస్య ఏంటర్రా బాబు అంటు తలపంటుకున్నాడు. అప్పుడే వచ్చిన పనిమినిషి ఆ వ్యక్తికి వచ్చింది 'ఆంజంపి'ని అనే వ్యాధి అని స్థానిక భాషలో చెప్పింది. ఇది తన మనవళ్లకు వచ్చిందని, వారిలో ఈ లక్షణాలు చూశానని అంది. వెంటనే పనిమినిషి చెప్పిన వ్యాధికి సంబంధించిన పార్వోవైరస్ బీ19 అనే వైద్య పరీక్షలు చేశారు డాక్టర్ ఫిలిప్స్. చివరికి ఆమె చెప్పిందే నిజమయ్యింది. ఆ వ్యక్తికి వచ్చిన వ్యాధిని వైద్య పరిభాషలో రిథీమా ఇన్ఫెక్టియోసమ్ అని పిలుస్తారు. ఇది హ్యుమన్ పార్వోవైరస్ బీ19 వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది పిల్లలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇది దగ్గినప్పుడూ, తుమ్మినప్పుడూ శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బుగ్గలపై వచ్చే ఎరుపు దద్దర్లను స్లాప్డ్ చీక్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఈ దద్దర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ మేరకు సదరు డాక్టర్ ఫిలిప్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..17 ఏళ్ల వైద్య అనుభవం ఆ వ్యాధిని నిర్థారించలేదు. కేవలం పది సెకన్లలో ఆ వ్యాధి ఏంటో చెప్పగలిగిన తన పనిమినిషి ముందు తన అనుభవం కూడా సరిపోలేదని అన్నారు. అయితే నెటిజన్లు జనరల్ ప్రాక్టీషనర్(జీపి)ని ఎందుకు సంప్రదించలేదని వైద్యుడిని ప్రశ్నించగా..ఈ రోజుల్లో జీపీ ఆశించిన స్థాయిలో నిర్థారించడ లేదని అన్నారు. తనకు తన పనిమనిషి వ్యాది నిర్థారణ విలువైనదని, అందువల్లే ఒక రోజు సెలువు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదని అని సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు.(చదవండి: జీ7 సదస్సులో మోదీకి భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్ ఇదే..!) -
బోన్ మ్యారో క్యాన్సర్..నియంత్రణ ఇలా...!
క్రానిక్ మైలోయిడ్ లుకేమియా... (సిఎమ్ ఎల్) ఎముక మజ్జ లేదా బోన్ మ్యారోకి సోకే ఓ అరుదైన క్యాన్సర్.. (సిఎమ్ఎల్). ఇది మొత్తం లుకేమియా కేసుల్లో 15% దాకా ఉండే సీఎంఎల్ బోన్మ్యారోను ప్రభావితం చేస్తుంది, ఇది తెల్ల రక్త కణాల నియంత్రణలేని పెరుగుదలకు దారితీస్తుంది. క్యాన్సర్ నిర్ధారణ కాగానే మొదట్లో భయంకరంగా అనిపించినప్పటికీ, సీఎంఎల్ను సరైన విధానంతో నియంత్రించవచ్చునని గుర్తించడం చాలా ముఖ్యం అంటున్నారు హైదరాబాద్లోని నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ జి సదాశివుడు. ఆయన చెబుతున్న విశేషాలివి...సీఎంఎల్ నిర్ధారణ అయినప్పటికీ రోగులు సంతృప్తికరమైన జీవితాలను గడపవచ్చు. అయితే, సీఎంఎల్ నిర్వహణలో సరైన విధానాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే చికిత్స చేయని దీర్ఘకాలిక–దశ సీఎంఎల్ వేగంగా వృద్ధి చెందుతుంది. సమర్థవంతమైన చికిత్సకి, వ్యాధి పెరుగుదలని నివారించడానికి బిసిఆర్–ఎబిఎల్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, చికిత్స లక్ష్యాలకు కట్టుబడి ఉండటం అవసరం. అదనంగా మీ వైద్యునితో తాజా చికిత్సల గురించి చర్చించడం వలన మీరు చికిత్స ప్రక్రియను అర్థం చేసుకోవడానికి, మెరుగైన జీవన నాణ్యతకు సహాయపడుతుంది.కొన్ని సందర్భాల్లో సీఎంఎల్ ని ’మంచి క్యాన్సర్’ అని పిలిచినప్పటికీ, సీఎంఎల్ పురోగమిస్తున్న కొద్దీ అది ’మంచిది’ గా ఉండడం మానేస్తుంది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొంత మంది రోగులు వారి దైనందిన జీవితాలను ప్రభావితం చేసే మందులకు నిరోధకంగా ఉండవచ్చు లేదా దుష్ప్రభావాలను అనుభవించవచ్చు. అయితే, సకాలంలో జోక్యం, జాగ్రత్తగా పర్యవేక్షించడం ఈ సవాళ్లను నివారించడంలో సహాయపడతాయి.వైద్యపరమైన అంశాలతో పాటు, సీఎంఎల్ కలిగించే భావోద్వేగ ప్రభావాన్ని విస్మరించలేం. సీఎంఎల్ రోగులు ఎదుర్కొనే ప్రారంభ సవాళ్లలో క్యాన్సర్తో సంబంధం ఉన్న సామాజిక కళంకం ఒకటి. సామాజిక అంశాల కారణంగా చాలా మంది వ్యక్తులు తమ రోగనిర్ధారణను దగ్గరి కుటుంబసభ్యులకు మించి బయటి వారికి వెల్లడించడానికి సంకోచిస్తారు. అయితే ఓపెన్ కమ్యూనికేషన్ అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య సహాయాన్ని కోరడం అనేది సంపూర్ణ సీఎంఎల్ నిర్వహణలో ముఖ్యమైనవి.సీఎంఎల్ రోగుల కోసం కొన్ని సూచనలు...నిరంతర పర్యవేక్షణ: చికిత్స ప్రభావాన్ని అంచనా వేయడానికి, ఏవైనా మార్పులను ముందుగానే తెలుసుకునేందుకు బిసిఆర్–ఎబిఎల్ స్థాయిలను ఎప్పటికప్పుడు గుర్తించాలి. సకాలంలో జోక్యం చేసుకోవ డానికి, వ్యాధి పురోగతిని నివారించడానికి రెగ్యులర్ పర్యవేక్షణ చాలా ముఖ్యమైనది.దినచర్యలో మానసిక ఆరోగ్య మద్దతు, ఆహారపు సర్దుబాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సీఎంఎల్ నియంత్రణకు వీలు కల్పిస్తుంది.ఆరోగ్య సంరక్షకులు, వైద్యులతో మనసు విప్పి, నిజాయితీగా సంభాషించడం అవసరం. సీఎంఎల్ తో ప్రయాణంలో ఎదుర్కొనే ఏవైనా ఆందోళనలు, లక్షణాలు లేదా సవాళ్లను పంచుకోవాలి.సపోర్ట్ నెట్వర్క్లు: అనుభవాలను పంచుకోవడానికి, భావోద్వేగ మద్దతును పొందడానికిÜపోర్ట్ గ్రూప్ల ద్వారా ఇతర సీఎంఎల్ రోగులతో సంబంధాలు ఏర్పరచుకోండి.నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 నుంచి 1.5 మిలియన్ల మంది సీఎంఎల్ తో జీవిస్తున్నారు. వైద్య శాస్త్రంలో పురోగతి కారణంగా చికిత్స ఫలితాలలో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతోంది. సీఎంఎల్ చికిత్సలో భాగమైన టైరోసిన్ కినేస్ ఇన్హిబిటర్స్ , రోగులకు ఫలితాలు జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచాయి.కౌన్సిలింగ్ చాలా ముఖ్యం...‘నేను బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న 9 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల అన్ని వయసుల రోగులను చూశా. దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా నిర్ధారణ తర్వాత, చాలా మంది రోగులు తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతారు. అందువల్ల, వారికి సరైన కౌన్సెలింగ్ అందించడం చాలా ముఖ్యంప్రొఫెసర్ డాక్టర్ జి సదాశివుడు, నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం(చదవండి: 'టీ'ని అతిగా మరిగిస్తున్నారా? ఎంత వ్యవధిలో చేయాలంటే..) -
పాపులర్ వీడియో గేమర్కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!
ఇటీవల కాలంటో ప్రముఖ సెలబ్రెటీలు, ఆటగాళ్లు కేన్సర్ బారిన పడుతున్నారు. ఒక్కసారిగా వారిలో చురుకుదనం కోల్పోయి డల్గా అయిపోతున్నారు. పాపం అక్కడకి లేని మనో నిబ్బరాన్నంతా కొని తెచ్చుకుని మరీ ఈ భయానక వ్యాధితో పోరాడుతున్నారు. కొందరూ ప్రాణాలతో బయటపడగా.. మరికొందరూ ఆ మహమ్మారికి బలవ్వుతున్నారు. అచ్చం అలానే ఓ ప్రసిద్ధ వీడియో గేమర్ ఈ కేన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. అతని కొచ్చిన కేన్సర్ ఏంటంటే.. ప్రోఫెషనల్ వీడియో గేమ్ ప్లేయర్ ట్విచ్ స్ట్రీమర్ నింజా చర్మ కేన్సర్తో బాధపడుతున్నాడు. ఈ విషయం విని ఒక్కసారిగా అతని అభిమానులంత షాక్కి గురయ్యారు. అతడి పాదాలపై ఒక పుట్టుమచ్చ ఉంది. అది అసాధారణంగా పెద్దది అవ్వడం ప్రారంభించింది. దీంతో వైద్యులను సంప్రదించాడు స్ట్రీమర్. అన్ని పరీక్షలు చేసి మెలనోమా కేన్సర్ అని నిర్థారించారు వైద్యులు. అయితే వైద్యులు ప్రారంభ దశలోనే ఈ కేన్సర్ని గుర్తించారని పేర్కొన్నాడు సోషల్ మీడియా ఎక్స్లో. దయచేసి అందరూ చర్మానికి సంబంధించిన చెకప్లు చేసుకోండి అని అభిమానులను కోరాడు. ఇంతకీ అతనికి వచ్చిన మెలనోమా కేన్సర్ అంటే..! మెలనోమా అనేది మెలనోసైట్స్ నుంచి ఉద్భవించే ఒక రకమైన చర్మ కేన్సర్. ఇది మెలనిన్ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మెలనోమా సాధారణంగా సూర్యరశ్మికి బహిర్గతమయ్యే చర్మంపై ప్రారంభమవుతుంది. చాలా మెలనోమాలు అతినీలలోహిత కాంతికి గురికావడం వల్ల సంభవిస్తాయి. మెలనోమా దశను అనుసరించి చికిత్స విధానం మారుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. ఈ మెలనోమా కేన్సర్ చర్మంపై ఎక్కడైనా తలెత్తుతుందని నిపుణుల చెబుతున్నారు. చాలా పుట్టుమచ్చలు, గోధుమ రంగు మచ్చలు వంటి వాటిల్లో చర్మంపై అసాధారరణ పెరుగదల ఉంటే ఇది వస్తుంది. వీటిని ఏబీసీడీఈలు అనే అగ్లీ డక్లింగ్ గుర్తు ద్వారా మెలనోమాని గుర్తించడం జరుగుతుంది. అంతేగాదు ఆ ప్రదేశంలోని అనుమానాస్పద కణజాలాన్ని చర్మవ్యాధి నిపుణుడు బయాప్సీ చేయించి , క్యాన్సర్ కణాలు ఉన్నాయా, లేదా అని నిర్ణయిస్తాడు. అలా ఈ కేన్సర్ని గుర్తించడం జరిగాక, సిటీ స్కాన్లు, పీఈటీ స్కాన్లు సాయంతో ఏ దశలో ఉందనేది నిర్థారిస్తారు. చికిత్స.. ఇతర కేన్సర్ల కంటే ఇందులో చర్మం వద్ద కణాజాలం కాబట్టి తీసివేయడం కాస్త సులభం. గాయాన్ని తొలగించేటప్పడే క్యాన్సర్ ప్రమేయం ఎంతవరకు ఉందో నిర్థారించి తొలగించాక, పూర్తిగా తొలగిపోయాయా లేదా అని నిర్ధారించుకోవడానికి పాథాలజీ పరీక్షలకు కూడా పంపడం జరుగుతుంది. మెలనోమా చర్మంలోని పెద్ద ప్రాంతాలో ఉంటే మాత్రం చర్మాన్ని అంటుకట్టుట వంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేన్సర్ శోషరస కణుపులకు వ్యాపించే ప్రమాదం ఉంటే.. శోషరస కణుపు బయాప్సీని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ వంటివి కూడా అవసరమవ్వచ్చు. ఇక నింజా 2011 నుంచి వృత్తిపరంగా పలు వీడియో గేమ్లు ఆడి స్ట్రీమర్గా మారాడు. ఇక్కడ ట్విచ్ అనేది ప్రధానంగా వీడియో గేమ్లపై దృష్టి సారించే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్. అయితే ఇది సంగీతం, సృజనాత్మక కళలు, వంట మరిన్నింటిని కవర్ చేసే స్ట్రీమ్లను కూడా కలిగి ఉంటుంది. దీనిద్వారా ఎంతో మంది ప్రముఖులతో లైవ్స్ట్రీమ్లో వీడియో గేమ్లు ఆడి పేరు తెచ్చుకున్నాడు. దీని కారణంగానే అతనికి వేలాదిమంది ఫాలోవర్లుఉన్నారు. మైక్రోసాఫ్ట్ స్ట్రీమిగ్ ఫ్లాట్ఫాం మిక్సర్ కోసం 2019లో ట్విచ్ని వదిలిపెట్టాడు. ఆ మిక్సర్ షట్డౌన్ అయ్యాక మళ్లీ ట్విచ్కి తిరిగి వచ్చాడు. ఈ స్ట్రీమింగ్ ద్వారా అంతర్జాతీయ ప్రశంసల తోపాటు మిలయన్ల డాలర్లును సంపాదించాడు. (చదవండి: తండ్రి మిలియనీర్..కానీ కొడుక్కి 20 ఏళ్ల వరకు ఆ విషయం తెలియదు!) -
మిథున్ చక్రవర్తికి వచ్చిన ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే..?
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి గత శనివారమే తీవ్ర అస్వస్థతకు గురయ్యిన సంగతి తెలిసింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు కోల్కతాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. 73 ఏళ్ల మిధున్ తన పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. వైద్య పరీక్షల్లో మిథున్ బ్రెయిన్కి సంబంధించిన ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్కి గురయ్యినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని పేర్కొంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్తో సత్కరించిన సంగతి తెలిసిందే. అది జరిగిన కొద్దిరోజులకే మిథున్ ఇలా అస్వస్థతకు గురవ్వడం బాధకరం. అయితే మిథున్ చక్రవర్తి ఎదుర్కొంటున్న ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ అంటే ఏమిటీ? ఎందువల్ల ఇది వస్తుంది? ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే.. మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా జరకపోయినా లేదా తగ్గినా ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీంతో మెదడు కణజాలానికి ఆక్సిజన్ వంటి పోషకాలు అందకుండా పోతాయి. వెంటనే మెదడు కణాలు నిమిషాల్లో చనిపోవడం ప్రారంభమవుతుంది. ఈ తర్వాత రోగి పరిస్థితి విషమంగా అయిపోతుంది. అలాగే మెదడుకు సంబంధించిన మరొక ప్రమాదకరమైన స్ట్రోక్ ఒకటి ఉంది. దీని గురించి తరుచుగా వింటుంటాం. అదే బ్రెయియన్ హెమరేజిక్ స్ట్రోక్. ఇది మెదడులోని రక్తనాళం లీక్ అయినప్పుడు లేదా పగిలిపోయి మెదడులో రక్తస్రావం జరిగితే ఈ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఇక్కడ రక్తం మెదడు కణాలపై ఒత్తిడి పెంచి దెబ్బతీస్తుంది. చాలమందికి ఎదుర్కొనే స్ట్రోక్ ఇది. అయితే ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది చాలా అరుదుగా వస్తుందని చెప్పొచ్చు. పైగా ఈ పరిస్థితి కాస్త క్రిటికల్ అనే చెప్పొచ్చు కూడా. లక్షణాలు.. BREAKING: PM @narendramodi dials #MithunChakraborty, inquiring about his health. https://t.co/MPrYMLT0J1 — Sai Ram B (@SaiRamSays) February 11, 2024 మాట్లాడటం, ఇతరులు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. ముఖం చేతులు లేదా కాలులో తిమ్మిరిగా లేదా పక్షవాతానికి గురవ్వడం ఒకటి లేదా రెండు కళ్లల్లో కనిపించే సమస్యలు తలనొప్పి నడకలో ఇబ్బంది ఆకస్మికంగా మైకం కమ్మడం ఏదీఏమైనా స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ అనే చెప్పాలి. దీనికి వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో రోగికి అత్యవసరమైన వైద్య సహాయం త్వరగా పొందితే మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతినకుండా ఇతర స్ట్రోక్లు రాకుండా నియత్రించగలుగుతామని వైద్యులు చెబుతున్నారు. -
కింగ్ చార్లెస్కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కేన్సర్తో బాధపడుతున్న బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కోంది. ఆయన గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన కేన్సర్ అనేది వెల్లడించలేదు. సోమవారం నుంచి చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజు ప్రజావిధుల నుంఇచ తప్పుకుంటారని పేర్కొంది. ఇక బ్రిటిఫ్ ప్రెస్ ప్రకారం ఆయన కెరిర్లో కొన్ని గాయాలు, రెండుసార్లు కరోనా మహమ్మారి బారిని పడటం మినహా రాజ అద్భుతమైన ఆరోగ్యకరమ జీవితాన్నే గడిపారు. ఆయన చక్రవర్తిగా 2022లో సింహాసనాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. పైగా బ్రిటిష్ చరిత్రలో రాజుగా పట్టాభిషేకం అయిన అంత పెద్ద వయసు వ్యక్తి కూడా ఆయనే. ఇక ఆయన లైఫ్స్టైల్ విషయానికి వస్తే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారని అంతరంగికులు చెబుతున్నారు. అందులోనూ ఆయన ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని అంటునన్నారు. అలాంటి ఆయన ఈ కేన్సర్ మహమ్మారిన బారిన పడటం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన ఆహార అలవాట్లు ఎలా ఉండేవి? రోజూవారి దినచర్య ఎలా ఉంటుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందామా!. ఆయన ఒకసారి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజీ షెడ్యూల్కు ఆటంకం కలిగించే భోజనం లగ్జరీ లాంటిదని విశ్వసిస్తానని అన్నారు. అంతేగాదు ఆయన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వంటివి చేస్తారని అధికారిక వర్గాల సమాచారం. 2018లో కార్లెస్ హౌస్లో తన 70వ పుట్టిన రోజు పురస్కరించుకుని తనకు సంబంధించిన 70 వాస్తవాల జాబితాలో తాను రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటానని అదికూడా అల్పహారం, రాత్రి భోజనం మాత్రమేనని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారంలో రెండు రోజులు పూర్తిగా శాకాహారం భోజనం తింటానని, పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువుగా మొక్కల ఆధారిత ఆహారమే ఎక్కువగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అల్పాహారంలో ఎక్కువగా చీజ్, ఉడకబెట్టిన గుడ్లు, పాలు, తేనేతో కూడిన డార్జిలింగ్ టీ తదితరాలే తీసుకుంటారని రాయల్ డైట్ పేర్కొంది. ఆయన ఎక్కువగా సేంద్రీయ ఉత్పత్తులనే ఇష్టపడతారని రాయల్ చెఫ్లు చెబుతున్నారు. ఇక ఫిట్నెస్ విషయానికి వచ్చేటప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయమాలు చేస్తారని ప్యాలెస్ పేర్కొంది. అలాగే కెనడియన్ ఎయిర్ఫోర్స్కి సంబంధించిన ఐదు ప్రాథమిక వ్యాయమాలను రోజుకు రెండుసార్లు చేస్తారని తెలిపింది. ముఖ్యంగా రెండు నిమిషాల స్ట్రెచింగ్ ఒక నిమిషం సిట్ అప్లు, మరో నిమిషం బ్యాక్ లెగ్ రైజ్లు పుష్ అప్లు 11 నిమిషాలు చేస్తారని వెల్లడించింది. వాటన్నింటి తోపాటు ఆరు నిమిషాల పాలు రన్నింగ్, ప్రతి 75 అడుగులకు డేగ జంప్లు చేయడం, వాతావరణం బాగుంటే ఎక్కువ సేపు బహిరంగ ప్రదేశంలో గడపడం వంటివి చేస్తారని రాయల్ ప్యాలెస్ పేర్కొంది. ఇంతలా పిట్నెస్గా ఉంటూ మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించనప్పటికీ కొన్ని రకాల వ్యాధులు ఎందుకు దాడి చేస్తాయనేది ఎవ్వరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న. నిజం చెప్పాలంటే వ్యాధికి రాజు, పేద అనే తారతమ్యం ఉండదేమో రావాలి, వేదన అనుభవించాలి అని ఉంటే టైంకి వచ్చి దాని ప్రభావం చూపించేస్తుందేమో కదూ!. View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
పొరుగునే స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్! మన దగ్గరా అప్రమత్తత అవసరం!!
ఆంధ్రప్రదేశ్కు ΄పొరుగునే ఉన్న ఒడిశాలో కొంతకాలంగా ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్వైరవిహారం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్కడ కనిపిస్తున్న ఈ కేసులు గత రెండు మూడు వారాలుగా ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల ఒక్క సుందర్ఘర్ జిల్లాలోనే దాదాపుగా 200కు పైగా కేసులు రావడంతో పాటు, కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలూ అప్రమత్తం కావాల్సిన అవసరమున్న ఈ తరుణంలో స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్పై అవగాహన కోసం ఈ కథనం. స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను ‘బుష్ టైఫస్’ అని కూడా అంటారు. ఈ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియమ్ పేరు ‘ఓరియెంటియా సుసుగాముషి’. ఇది చిమ్మటలా కనిపించే చిగ్గర్ అనే ఒక రకం కీటకం ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ‘ఓరియెంటియా సుసుగాముషి’ అనే బ్యాక్టీరియమ్ దేహంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకసారి చిగ్గర్ కుట్టాక... బ్యాక్టీరియమ్ బాధితుల రక్తంలోకి చేరితే... దాదాపు పది రోజుల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. చాలావరకు లక్షణాలు నిర΄ాయకరంగా ఉండవచ్చు. కానీ మొదటివారంలో దీన్ని గుర్తించకపోవడం లేదా సరైన చికిత్స ఇవ్వకపోవడం జరిగితే రెండోవారం నుంచి కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె, కొన్ని సందర్భాల్లో మెదడు కూడా ప్రభావితమై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కు దారితీయవచ్చు. నిర్ధారణ ఈ వ్యాధి నిర్ధారణకు చాలా పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు వెయిల్ ఫెలిక్స్ పరీక్ష, ఇన్డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరోసెంట్ యాంటీబాడీ (ఐఎఫ్ఏ) పరీక్ష, ఇన్డైరెక్ట్ ఇమ్యూనో పెరాక్సైడేజ్ (ఐపీపీ) పరీక్ష, ఎలీజా, ఇమ్యూనో క్రొమాటోగ్రాఫిక్ టెస్ట్ (ఐసీటీ), పీసీఆర్ పరీక్షల ద్వారా దీన్ని నివారణ చేయవచ్చు. అయితే చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో కూడా దాదాపుగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో తగిన మోతాదులో యాంటీబయాటిక్ చికిత్స చేసి, బాధితుల పరిస్థితిని నార్మల్ చేయవచ్చు. అందుకే అన్నన్ని ఖరీదైన పరీక్షలకు బదులు కాస్తంత అనుభవజ్ఞులైన డాక్టర్లు కొన్ని లక్షణాల ఆధారంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. ఉదాహరణకు మలేరియాలో ప్రోటోజోవన్ పారసైట్ రకాన్ని బట్టి కొన్ని రోజుల వ్యవధిలో జ్వరం మాటిమాటికీ వస్తుంటుంది. అదే వైరల్ జ్వరాలు చాలా తీవ్రంగా, ఎక్కువ ఉష్ణోగ్రతతో వస్తుంటాయి. ఈ లక్షణాలను బట్టి ఆయా జ్వరాలను గుర్తుబట్టి చికిత్స అందిస్తారు. దీనికి జ్వరం వచ్చిన తొలిదశలోనే సింపుల్గా ఇచ్చే యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తే చాలు. ఒకవేళ చికిత్స అందించకపోతే కొన్నిసార్లు ఇది లంగ్స్, గుండె, నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థతోపాటు కిడ్నీలపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. నివారణ దీనికి టీకా ఏదీ అందుబాటులో లేదు. చిగ్గర్ కీటకాల కాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇవి పొలాల్లో, మట్టిలో నివసిస్తూ, అక్కడే గుడ్లు పెడతాయి. కాబట్టి చేలూ, పొలాల్లో నడిచే సమయాల్లో చెప్పులు వాడటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఫుల్ స్లీవ్ దుస్తులు, కాళ్లు పూర్తిగా కప్పేలాంటి దుస్తులు ధరించడం మేలు. ట్రెకింగ్ వంటి సాహసక్రీడల్లో పాల్గొనేవారు చిగ్గర్స్ ఉండే ప్రాంతాల్లోనే నడిచే అవకాశాలు ఎక్కువ. అందుకే... ట్రెక్కింగ్ చేసేవారు ఇప్పుడీ వ్యాధి విస్తరిస్తున్న ప్రాంతాలకు కొన్నాళ్లు ట్రెక్కింగ్కు వెళ్లకవడమే మంచిది. చికిత్స కొన్ని అరుదైన సందర్భాల్లో (అంటే కాంప్లికేషన్ వచ్చిన కేసుల్లో) మినహా... టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ మందులతోనే ఇది అదుపులోకి వస్తుంది. కీమోప్రోఫిలాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే... అది కొంతవరకు దీని నివారణకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రాల నుంచి ఒడిశా వెళ్లాల్సినవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కిమో ప్రోఫిలాక్టిక్ తీసుకోవడం కొంత మేలు చేస్తుందని చెప్పవచ్చు. డా.. శివరాజు, సీనియర్ ఫిజీషియన్ (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
జ్వరం, జలుబే కదా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు!..అవే ఒక్కొసారి..
మనం సాధారణంగా చిన్నిపిల్లలకు వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను చాలా తేలిగ్గా తీసుకుంటాం. ట్యాబలెట్లు వేస్తున్నాం కదా తగ్గిపోతుందనుకుంటాం. చాలా సర్వసాధరణమైన వ్యాధిగానే భావిస్తాం. కొన్ని రకాల వ్యాధులు విజృంభించే క్రమంలో తొలి దశలో అలాంటి తేలికపాటి లక్షణాలనే చూపిస్తాయి. మనం తెలియక సాధారణమైన జ్వరంగా భావించి ఎప్పుడూ వాడే వాటినే వాడేస్తాం. కానీ మనం కంటిపాపల్లా కాపాడుకుంటున్న చిన్నారుల ప్రాణాలు పోయేంతవరకు కళ్లు తెరవవం. అచ్చం అలాంటి దురదృష్టకర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఆస్ట్రేలియాలోని బాథర్స్ట్ నివాసి క్యాథీ అనే 5 ఏళ్ల చిన్నారి గత కొద్దిరోజులుగా జలుబుతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడుతున్నారు. కానీ క్యాథీ కోలుకోవడం మాని ఆరోగ్యం రోజురోజుకి క్షీణించడం ప్రారంభమైంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. సాధారణమైన జలుబే కదా అనే భావించారు. సరిగ్గా తినక జబ్బు పడుటుందని భావించి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. తీరా జాయిన్ అయ్యాక కోలుకుందా అంటే.. లేకపోగా మరింత సీరియస్ అయ్యి మూసిన కన్ను తెరవకుండా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. చిన్న జలుబు లాంటి ఫీవర్ ఇంతలా మా చిన్నారిని కోల్పోయేంత ప్రాణాంతక మారడం ఏమిటిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో వారు మరోసారి ఆమె హెల్త్ రికార్డును చెక్ చేయించి ఇది జలుబు మరేదైనా అని పలు ఆస్పత్రుల్లో ఎంక్వైయిరి చేయగా అసలు విషయం బయటపడింది. స్ట్రెప్ఏ అనే బ్యాక్టీరియా బారిన పడినట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగానే మూడు రోజుల తర్వాత ఆమె గొంతును పూర్తిగా కోల్పోయిందన్నారు. ఆమె పరిస్థితి మరింత దిగజారి, శ్వాసతీసుకోలేని స్థితికి వచ్చాక మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు. ఐతే వైద్య పరీక్షల్లో వైరల్ ఫీపర్ అని తేలింది దీంతో తాము తేలిగ్గా తీసుకున్నామని ఆవేదనగా చెబుతున్నారు చిన్నారి తల్లిదండ్రులు. ఇంటికి వచ్చకా చిన్నారి ఆరోగ్యం క్షీణించటం, పెదాలు నీలం రంగులోకి మారిపోవడం శ్వాసతీసుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తినట్లు వివరించారు. ఎంతలా సీఆర్పీ చేసి బతికించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు తలిదండ్రులు. ఇంత చిన్నపాటి అనారోగ్యం తమ కూతురు ప్రాణాలను బలితీసుకోవడం జీర్ణించుకోలేక ఆ చిన్నారి శరీరాన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తెలిసింది. ఆమె గొంతు స్టెప్ఏ బ్యాక్టీరియా ఇన్షెక్షన్కు గురైందని ఇది చాలా రకాలు లక్షణాలతో సంకేతాలిస్తుందని, వైద్యులు కూడా ఒక్కోసారి ఇలాంటి కేసులను గుర్తించడంలో విపలమతుంటారని వివరణ ఇచ్చింది వైద్య బృందం. విచిత్రమేమిటంటే ప్రాణాలతో పోరాడి చనిపోయిన ఆ చిన్నారి ముగ్గురికి అవయవదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు కాస్త సీరియస్గా తీసుకుని పవర్ఫుల్ యాంటీబయోటిక్స్ ఇచ్చి ఉంటే మా చిన్నారి మా కళ్ల ముందు ఆడుతూ తిరిగి ఉండేదంటూ వేదనగా చెప్పారు. అందువల్ల పేరెంట్స్ అందరూ చిన్నారులకు వచ్చి కొన్ని రకలా వైరల్ ఫీవర్లను తేలిగ్గా తీసుకోవద్దు. మీ కంటి పాపలను దూరం చేసుకుని శోకాన్ని కొనితెచ్చుకోవద్దని బాధిత తల్లిందండ్రులు ఆవేదనగా వేడుకుంటున్నారు. (చదవండి: గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదా..?) -
మీనియర్స్ డిసీజ్ అంటే..!
మన లోపలి చెవి (ఇన్నర్ ఇయర్) వినికిడి సామర్థ్యానికీ, నిటారుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇక్కడ సమస్య వస్తే వినికిడి శక్తి తగ్గడంతో పాటు, నిటారుగా నిలబడి ఉండే సామర్థ్యం కూడా తగ్గిపోయి ఒళ్లంతా గిర్రున తిరుగుతూ, తూలి కిందికి పడిపోతామేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు... ఏదో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిలబడిప్పుడు వినిపించే హోరు లాంటిది చెవిలోంచి వినబడుతుంటుంది. ఇలా వినికిడి తగ్గడం, తూలి కిందపడిపోయేలా బ్యాలెన్స్ కోల్పోవడం, చెవిలోంచి హోరు వినిపించడం వంటి లక్షణాలతో వ్యక్తమయ్యే మీనియర్స్ డిసీజ్పై అవగాహన కోసం ఈ కథనం. మీనియర్స్ డిసీజ్ను ‘ఇడియోపథిక్ ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్’ అని కూడా అంటారు. అది ప్రాణాంతకం కాదుగానీ... చికిత్స అందరకపోతే క్రమంగా వినికిడి శక్తి కోల్పోయే అవకాశమూ ఉంది. గతంలో కాస్త అరుదుగా కనిపించే ఈ సమస్య... ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుండటం వైద్యవర్గాల్లో ఆందోళనను కలిగిస్తోంది. లక్షణాలు: మీనియర్స్ డిసీజ్లో వర్టిగో, టినైటస్, వినికిడిలోపం (డెఫ్నెస్) ఈ మూడు లక్షణాలూ కలగలసి ఉంటాయి. వర్టిగో లక్షణాలు: పిల్లలు గిరగిరా తిరిగీ, తిరిగీ అకస్మాత్తుగా ఆగినప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి తూలికింద పడిపోతామేమో అనిపించినట్లుగా లేదా రంగుల రాట్నంపై నుంచి విసిరివేసినట్లుగా అనుభూతి చెందుతూ ఆందోళన పడుతుంటారు. వర్టిగోలో కనిపించే ఇదే లక్షణం మీనియర్లోనూ కనిపిస్తుంది. టినైటస్ లక్షణాలు : ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గరి గుయ్ అనే శబ్దమే కొందరికి చెవుల్లోంచి వినిపిస్తూ, చికాకు కలిగిస్తుంది. టినైటస్లోని ఇదే లక్షణం... మీనియర్స్ డిసీజ్లోనూ కనిపిస్తుంది. వినికిడి తగ్గడం : లక్షణాలను నిర్లక్ష్యం చేయడం, చికిత్స తీసుకోకపోవడం వల్ల శాశ్వతంగా వినికిడి కోల్పోయి... పర్మనెంట్ డెఫ్నెస్ వచ్చే అవకాశం ఉంది. వినికిడి లోపం అన్నది ఒక్కోసారి పెరుగుతూ ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒకేరోజులోనే ఈ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. చెవి నిండిపోయినట్లుగా ఉండే ఫీలింగ్ చికాకు కలిగిస్తూ ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు: బాధితులు చెప్పే లక్షణాలతో ఆడియాలజిస్టుల ఆధ్వర్యంలో వినికిడి సామర్థ్యం పరీక్షలు (ఆడియోమెట్రీ టెస్ట్) , వెస్టిబ్యులార్ టెస్ట్ బ్యాటరీ పరీక్షలతో పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో మెదడు ఎమ్మారై, ‘ఎలక్ట్రో కాక్లియోగ్రఫీ’, ‘ఎలక్ట్రో నిస్టాగ్మోగ్రఫీ’ వంటి పరీక్షలు మీనియర్స్ డిసీజ్ నిర్ధారణకు తోడ్పడతాయి. ఇతర పరీక్షలు: మెదడులో గడ్డలు, కొన్ని రకాల మెదడు సమస్యలు ఉన్నప్పుడూ ఈ లక్షణాలే కనిపిస్తాయి కాబట్టి... ‘మీనియర్స్ ప్రోటోకాల్’ కూడా చేసి... సమస్య మెదడుకు సంబంధించింది కాదని రూల్ అవుట్ చేసుకుంటారు. నివారణ / వ్యాధి ఉన్నవారికి చెప్పే జాగ్రత్తలు : మీనియర్స్ డిసీజ్ ఉన్నవారిలో కొన్ని రకాల ఆహార నియంత్రణలను సూచిస్తారు. ఇవి కొంతమేరకు నివారణకూ తోడ్పడతాయి ఆహారంలో ఉప్పు తగ్గించడం చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, కోలాడ్రింక్స్ వంటి పానీయాలను పరిమితంగా తీసుకోవడం ∙ఆల్కహాల్, పొగ అలవాట్లకు దూరంగా ఉండటం చైనా సాల్ట్కు దూరంగా ఉండటం. చికిత్స : ►వికారం, వాంతుల వంటి లక్షణాలను తగ్గించేందుకు యాంటీ–నాసియా (యాంటీ–ఎమిటిక్) మెడిసిన్స్ ఇస్తారు ∙ చెవిలోని ఒక రకం ద్రవం పెరగడం వల్ల మీనియర్స్ డిసీజ్ ►వచ్చే అవకాశం ఉన్నందున దేహంలోని ద్రవాలను బయటకు పంపించేందుకు మూత్రం ఎక్కువగా వచ్చే మందులైన ‘డై–యూరెటిక్స్’ అనే మందుల్ని వాడతారు ►వర్టిగోలో కనిపించే కళ్లు తిరగడం, పడిపోవడం లాంటి లక్షణాలను తగ్గించేందుకు ‘వెస్టిబ్యులార్ రీ–హ్యాబిలిటీషన్’ అని పిలిచే ఫిజియోథెరపీ లాంటి చికిత్సలను అందిస్తారు. ఇందులో బాధితులతో కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తారు ►వినికిడి సామర్థ్యం కోల్పోయిన వారిలో... వారు ఏ మేరకు కోల్పోయారో దాన్ని బట్టి హియరింగ్ ఎయిడ్ మెషిన్నూ అమర్చవచ్చు. ►పై చికిత్సలేవీ పనిచేయనప్పుడు చాలా అరుదుగా కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఇందులో ‘ఎండోలింఫాటిక్ శాక్’ అనే ప్రొసీజర్ ద్వారా చెవిలో అత్యధికంగా స్రవించే ద్రవాన్ని డ్రైయిన్ చేస్తారు∙ ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన ‘ఇంట్రాటింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్’ థెరపీ కూడా ఉపయోగపడుతుంది. డాక్టర్ ఈ.సీ. వినయ కుమార్ సీనియర్ ఈఎన్టి సర్జన్ (చదవండి: అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?) -
లావైపోతున్నారు! ముంచేస్తున్న ఆహారపు అలవాట్లు
ఊబకాయం.. ఇప్పుడు సాధారణమైపోయింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య పీడిస్తోంది. దీని ప్రభావం శరీరంలోని మిగతా అవయవాల మీద పడుతోంది. ఫలితంగా గుండె, కిడ్నీ, మధుమేహం వంటి వ్యాధులకు మూలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఊబకాయం నివారణకు జీవనశైలిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత ఆహారపు అలవాట్లు లావు కావడానికి ఒక కారణమైతే, సరైన వ్యాయామం లేకపోవడం మరో కారణమని జాతీయ ఆరోగ్య మిషన్ చేసిన సర్వేలో తేలింది. శ్రమగల జీవన విధానం, సమతులాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సర్వే స్పష్టం చేసింది. సాక్షి, చిత్తూరు రూరల్: ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం పెరిగిపోతోంది. దానికి తోడు వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అధిక బరువు ఉన్న వారిని గుండె జబ్బులతో పాటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, కీళ్ల సమస్యలు వెంటాడుతున్నాయి. ఊబకాయులు ఇటీవల అనేక దుష్ఫలితాలతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. కార్డియాలజీ రోగుల్లో 25 శాతం మంది ఊబకాయులే ఉంటున్నారు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిర్వహిస్తున్న నాన్ కమ్యూనికల్ డిసీజెస్ (ఎన్ఎసీడీ) సర్వేలో సైతం ఒబెసిటీ కారణంగా రక్త పోటు, మధుమేహం, గుండె జబ్బులు సోకుతున్నట్లు తేలింది. జిల్లాలో 17,54,254 మంది ఉండగా 12,99,758 మందిని ఎన్సీడీ సర్వే చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సర్వే 74.09శాతం పూర్తయింది. అయితే ఈ సర్వేలో బీపీతో బాధపడుతున్నవారు 1,96,772 మంది, మధుమేహంతో 1,96,957 మంది, రెండు ఉన్నవారు 17,675 మంది ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం ప్రజల ఆహార అలవాట్లు, జీవనశైలి, అధికబరువు వంటివి అని వైద్యులు చెబుతున్నారు. బరువుతో గుండె బలహీనత గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ఊబకాయులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కార్డియాలజీ ఓపీల సంఖ్య పెరుగుతోంది. రోజుకు జిల్లాలో 200 నుంచి 250 మంది వరకూ రోగులు వస్తున్నట్లు వైద్యులు లెక్కలు చెబుతున్నాయి. వారిలో 25 శాతం మంది అంటే 55 మంది ఊబకాయులే. వారిలో గుండె రక్తనాళాలు సన్నబడి బ్లాకులు ఏర్పడటం, గుండెపై తీవ్ర ఒత్తిడి, పల్మనరీ ఎంబోలిజమ్, పల్మనరీ హైపర్ టెన్షన్ వంటి సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు. రక్తనాళాల్లో బ్లాకులు ఉన్న వారికి వాటిని తొలగించి స్టెంట్లు వేస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఒబెసిటీ కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పడుతోంది. ఆ కారణంగా ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. దీంతో యూరిన్లో ప్రొటీన్లు లీకవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాళ్ల వాపులు రావడం, కిడ్నీలు పూర్తిగా పాడైన వారిని చూస్తున్నారు. ఊబకాయుల్లో వచ్చే మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న వారు డయాలసిస్ కోసం వస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిత్యం 50 నుంచి 65 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇతర వ్యాధులు ఒబెసిటీ వారిలో రక్తపోటు, మధుమేహం వలన వచ్చే దుష్ఫలితాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒబెసిటీ ఉన్న వారిలో పదిశాతం మందికి గాల్బ్లాడర్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఫ్యాటీ లివర్ ఏర్పడి, దీర్ఘకాలంలో తీవ్రమైన లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి. మోకీళ్లపై ప్రభావం చూపి, నాలుగు పదుల వయసులోనే మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తోంది. బరువు పెరగడానికి కారణాలు పట్టణాల నుంచి పల్లెల వరకు జంక్ఫుడ్ వినియోగం పెరిగింది. పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ఫుడ్, ఐస్క్రీమ్లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోని కొన్ని యాప్లద్వారా జంక్ఫుడ్ను ఆర్డర్ పెడితే క్షణాల్లో గుమ్మం ముందు డెలివరీ చేస్తున్నారు. దీనికి తోడు రెస్టారెంట్లలో విక్రయించే ఆహారాల్లో బిర్యానిదే మొదటిస్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండడం, వీటికి తోడు కూల్డ్రింక్లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మగవారితోపాటు అధికంగా మహిళలకు ఊబకాయం వచ్చేస్తోంది. ఇలా చేస్తే మేలు దేశంలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23.5 దాటిన వారందరినీ ఊబకాయులుగా భావిస్తారు. వారు బరువు తగ్గేందుకు శ్రమగల జీవన విధానం, సమతుల ఆహారం తీసుకుంటే సత్పలితాలు రాబట్టవచ్చు. బరువు తగ్గేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక విధానాలు ఉన్నాయి. దీర్ఘకాల విధానంలో వారానికి మూడు, నాలుగు గంటలు వ్యాయామం ద్వారా బరువు చేయడం తగ్గించుకోవచ్చు. స్వల్పకాలంలో రోజుకు వెయ్యి కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. బీఎంఐ27 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పద్ధతులను అనుసరించినా బరువు తగ్గకుంటే బీఎంఐ 30 శాతం దాటిన వారికి బేరియాట్రిక్ (మెటబాలిక్) సర్జరీలతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. బరువు తగ్గితే మంచిది ఊబకాయం ఉన్న మధుమేహులు తమ బరువులో ఐదు శాతం తగ్గించుకోగా తక్కువ మందులతో మెరుగైన వ్యాధి నియంత్రణా ఫలితాలు రాబట్టవచ్చు. హృద్రోగ సమస్యలను నివారించుకోవచ్చు. సమతుల ఆహారం, క్రమగల జీవన విధానం, జీవనశైలిలో మార్పులు పాటించడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఊబకాయుల్లో మధుమేహ నియంత్రణకు ఆధునిక మందులు అందుబాటులోకి వచ్చాయి. – డాక్టర్ అరుణ్కుమార్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
Pneumonia: అశ్రద్ధ చేస్తే ‘ఊపిరి’ తీస్తుంది
గుంటూరు మెడికల్: ఊపిరితిత్తులకు వచ్చి, ప్రాణాలు తీసే వ్యాధుల్లో న్యుమోనియా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు న్యుమోనియా వ్యాధితో చనిపోతున్నారు. ప్రతి ఏడాది ఐదేళ్లలోపు పిల్లలు రెండు మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. భారత దేశంలో ప్రతి ఏడాది రెండులక్షల మంది పిల్లలు ఈ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వ్యాధి నివారణకు ఉన్న టీకాను వినియోగించటం ద్వారా ఒక మిలియన్ పిల్లల మరణాలు తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది. చలికాలంలో న్యుమోనియా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి బారినపడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వ్యాధి లక్షణాలు... ఈ వ్యాధి అన్ని వయస్సుల వారికి వస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లుదాటిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దగ్గు, కళ్లె పడటం, కళ్లె పసుపు లేదా పచ్చగా ఉండటం, దగ్గినప్పుడు రక్తం పడటం, ఆయాసం, అలసట, ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉండటం, జ్వరం, చలి, వణుకు ఉండటం, తలనొప్పి, కండరాల నొప్పులు, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవటం లేదా తక్కువగా కొట్టుకోవటం, వికారం, వాంతులు, విరేచనాలు, పిల్లలు పాలు తాగలేకపోవటం తదితర లక్షణాలు వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. చలికాలంలో న్యూమోనియా కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువ. ఆడవారితో పోల్చితే మగవారిలోనే వ్యాధి బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. కారణాలు... వ్యాధి ఉన్న వ్యక్తి ముఖానికి కర్చీఫ్ పెట్టుకోకుండా దగ్గినా, తుమ్మినా వారి నోటి తుంపర్ల ద్వారా పక్కన ఉండే వారికి వ్యాధి సోకుతుంది. వైరస్, బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారిలో, పొగతాగేవారిలో, మద్యపానం చేసేవారిలో, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం అధికం. నిర్ధారణ... ఛాతీ ఎక్సరే, సీటీ స్కాన్ పరీక్ష, రక్తపరీక్షలు, కళ్లె పరీక్ష, బ్క్రాంకోస్కోపీ, పల్స్ ఆక్సీమెట్రీ, ఫ్లూయిడ్ కల్చర్ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. వ్యాధి బాధితులు... ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మంది, పిల్లల వైద్య నిపుణులు, 300 మంది పల్మనాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ ఇద్దరు బాధితులు చికిత్స కోసం వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నివారణ చర్యలే ఉత్తమం.. వ్యాధి రాకుండా ముందస్తుగా పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్లు చేయించాలి. వ్యాధి సోకకుండా నివారించే వ్యాక్సిన్లు పిల్లలకు, పెద్దవారికి అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లలకు వ్యాక్సిన్లు వేయిస్తుంది. విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ వినియోగించకూడదు. పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ అడ్డుపెట్టుకోవటం చాలా మంచిది. – డాక్టర్ పి.పద్మలత, జీజీహెచ్ పిల్లల వైద్య విభాగాధిపతి జాగ్రత్తలు తీసుకోవాలి... వ్యాధి బాధితులు త్వరగా కోలుకోవటానికి వైద్యులు రాసిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ధూమపానం చేసేవారికి దూరంగా ఉండటంతోపాటుగా మద్యపానం, ధూమపానం చేయకూడదు. దగ్గినా, తుమ్మినా ముఖానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. తరచుగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వారంలో కనీసం ఐదురోజులపాటు వ్యాయామం చేయాలి. – డాక్టర్ గోపతి నాగేశ్వరరావు, పల్మనాలజిస్ట్, గుంటూరు -
జిల్లాల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: జిల్లాల్లోనూ బ్రెయిన్డెడ్ నిర్ధారణ చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఫలితంగా అవయవదానాలు విరివిగా పెంచి, బాధితులకు మార్పిడి చికిత్సలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ముందుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనంతరం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ బ్రెయిన్డెడ్ నిర్ధారణ ఏర్పాట్లు చేస్తారు. సంబంధిత మెడికల్ కాలేజీల్లోనూ అపస్మారకస్థితికి చేరిన రోగుల బ్రెయిన్డెడ్ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. తక్షణమే కాకతీయ, నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీల్లో బ్రెయిన్డెడ్ నిర్ధారణ, అవయవాల సేకరణ చర్యలు తీసుకోనున్నారు. డిమాండ్ ఎక్కువ... అవయవాలు తక్కువ కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం వంటి అవయవాలను అవసరమైనవారికి మార్పిడి చేయడానికి వైద్యపరంగా వీలుంది. రాష్ట్రంలో జీవన్దాన్ పథకం ద్వారా అవయవ దానాలు, అవయవమార్పిడి జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకుంటే, వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనర్ కార్డు అందజేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో తొలిసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. జీవన్దాన్లో ప్రస్తుతం 2,863 మంది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. నమోదు చేసుకోనివారు 90 శాతం మంది బాధితులు ఉంటారని జీవన్దాన్ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుతం 10 వేల మంది బాధితులు కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారిలో సగం మందికైనా కిడ్నీ మార్పిడి చేయడానికి వీలుంది. కానీ, అవయవాల లభ్యత కొరవడింది. దానికి ప్రధాన కారణం బ్రెయిన్డెడ్ నిర్ధారణ చేయడానికి అనువైన వసతులు లేకపోవడమే. హైదరాబాద్లో మాత్రమే నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు 30 ప్రైవేట్ ఆసుపత్రుల్లో బ్రెయిన్డెడ్ నిర్ధారణ జరుగుతోంది. జిల్లాల్లో ఇటువంటి ఏర్పాట్లు లేవు. దీంతో వేలాదిమంది బ్రెయిన్డెడ్ కేసులు నమోదవుతున్నా, నిర్ధారణ జరగక అవయవాలు వృథాగా పోతున్నాయి. బ్రెయిన్డెడ్ను ఎలా నిర్ధారిస్తారు? ప్రమాదం వల్లగాని, నివారణ కాని వ్యాధి వల్ల కాని మనిషి అపస్మారక స్థితిలోకి చేరుకుంటాడు. కృత్రిమ ఆక్సిజన్ ద్వారా రక్తప్రసరణ జరుగుతున్నప్పటికీ తిరిగి స్పృహలోకి రాని స్థితిని బ్రెయిన్ డెడ్గా పేర్కొంటారు.ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. అయితే రోగి ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని నిర్ధారించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్లతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కూడిన బృందం కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. జిల్లాల్లో అనువైన పరిస్థితులు కరోనా కాలంలో పెరిగిన వైద్య మౌలిక సదుపాయాల కారణంగా అవయవ దానాలు, సేకరణకు అవకాశాలు విస్తృతమయ్యాయి. బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాలను సేకరించాలన్నా, వారు చనిపోవడానికి ముందు అవసరమైన చికిత్స పొందాలన్నా తప్పనిసరిగా ఐసీయూ వసతి ఉన్న ఆసుపత్రులు కావాలి. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో 11,845 ఐసీయూ, వెంటిలేటర్లు ఉండగా, అందులో ప్రభుత్వంలో 2,143, ప్రైవేట్లో 9,702 ఐసీయూ, వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. ఫలితంగా బ్రెయిన్డెడ్ అయిన కేసుల నిర్వహణ సులువని అంటున్నారు. కాగా, 2013లో 189 అవయవదానాలు జరిగితే, ఈ ఏడాది 662 జరగడం గమనార్హం. అవయవ మార్పిడికి డిమాండ్ పెరిగింది అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్ పెరిగింది. కానీ, ఆ మేరకు అవయవాలను అందించలేకపోతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 10 వేల మంది కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇంకా అనేకమంది రిజిస్ట్రేషన్న్ చేయించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అవకాశం ఉన్నచోట బ్రెయిన్డెడ్ నిర్ధారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. – డాక్టర్ స్వర్ణలత, జీవన్దాన్ ఇన్చార్జి -
Diabetes: బార్లీ, కొర్రలు.. వేపుళ్లు, నేతి వంటకాలు.. ఏవి తినాలి? ఏవి వద్దు?
ఇటీవలి కాలంలో ఎక్కువమందికి వస్తున్న జీవనశైలి వ్యాధులలో మధుమేహం ఒకటి. షుగర్ వ్యాధి పేరులోనే చక్కెర ఉంది కానీ, రుచికి మాత్రం చేదే. ఇది చాపకింద నీరులా కిడ్నీల పనితీరు మందగించేలా చేస్తుంది. ముఖ్యంగా కనుదృష్టిని క్షీణింపచేస్తుంది. అలాగని షుగర్ ఉన్న వారంతా భయపడాల్సిన పనిలేదు. చాలామంది మధుమేహం ఉన్నా దశాబ్దాల తరబడి చక్కగానే ఉంటున్నారు. అయితే ఏ వ్యాధినైనా వచ్చాక బాధపడేకంటే రాకుండా నివారించుకోవడమే చాలా మేలు. చిత్రం ఏమిటంటే బీపీ, షుగర్ చాలా మందికి అవి వచ్చినట్లే తెలియదు. ఏవో కొన్ని లక్షణాలను బట్టి డాక్టర్ దగ్గరకు వెళ్తే, వారి సలహా మేరకు పరీక్షలు చేయించుకుని ఉన్నట్లు తెలుసుకుని అప్పుడు చికిత్స తీసుకుంటున్నారు. అందువల్ల షుగర్ వ్యాధి లక్షణాలేమిటో, అది ఎందుకు వస్తుందో, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం. లక్షణాలు ►ఆరోగ్యవంతులు 24 గంటల కాలాన విసర్జించే మూత్ర ప్రమాణం 800 – 2500 మిల్లీలీటర్లు ఇంతకన్నాఅధికంగా మూత్రవిసర్జన జరిగితే దానిని అతి మూత్రవ్యాధిగా చెప్పవచ్చు. ఇలా అతిగా మూత్రం పోవడం అన్నది డయాబెటిస్కు ఒక సూచన. ►మొదటి ప్రధాన లక్షణం మాటిమాటికీ మూత్ర విసర్జన చేయాల్సి రావడం... అదీ ఎక్కువ ప్రమాణంలో. అంతేగాకుండా చెమట ఎక్కువ పట్టడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి, నిస్సత్తువ, నిస్త్రాణ, ఎక్కువ దాహం కావడం, కళ్లు తిరిగినట్లుండటం, కంటిచూపు మసకబారటం వంటివి ఇందులో ప్రధాన లక్షణాలు. అలాగని ఈ లక్షణాలు ఉన్నవారందరికీ షుగర్ ఉందని కాదు. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలోనూ ఇంచుమించు ఇటువంటి లక్షణాలే ఉంటాయి. అందులో అయితే గొంతు వద్ద వాపు, జుట్టు ఊడిపోవటం వంటివి అదనపు లక్షణాలు. యువ తరం నుంచి మధ్య వయసులోకి వస్తున్న వారు మధుమేహం, రక్తపోటు వంటివి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ►ఆఫీసుల్లో లేదా పని ప్రదేశాల్లో శారీరక శ్రమ లేకుండా అదే పనిగా కూర్చుండటం, ఎక్కువసేపు నిద్రించటం, పెరుగు, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం, పాలు, బెల్లం, తీపివస్తువులు, అరటి, సపోటా, మామిడి లాంటి తీపి ఎక్కువగా ఉండే పండ్లను అధికంగా తినడం, కొవ్వుపదార్థాలు తీసుకోవడం, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తరచు తీసుకోవడం మధుమేహానికి ప్రధాన కారణాలు. స్థూలకాయం... షుగర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని గుర్తించాలి. ►సక్రమమైన ఆహారాలు, క్రమం తప్పకుండా వ్యాయామం వలన చక్కెర అదుపులో ఉంటుంది. నివారణ ►మధుమేహ నివారణలో మందులతో పాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ►ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయపు నడక లేదా సాయంత్రపు నడకను కచ్చితంగా అలవర్చుకోవాలి. పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినడం మంచిది. అయితే పెరుగన్నం లేదా చిక్కటి మజ్జిగ బదులు పలుచటి మజ్జిగే మంచిది. ►పరగడుపునే ఒక లీటర్ నీటిని తాగడం, కాకర కాయ కూరను తరచు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ►నెలకి ఒకసారి కచ్చితంగా ఉపవాసం చేయాలి. ఇది షుగర్ లేనివాళ్లకు మాత్రమే. ►యోగాసనాలు, సూర్య నమస్కారాలు దినచర్యలో భాగం చేసుకుంటే దాదాపుగా మధుమేహం, రక్తపోటు నుంచి బయటపడవచ్చు. తినవలసినవి.. బార్లీ, గోధుమలు , కొర్రలు , రాగులు, పాతబియ్యపు అన్నం , పెసలు , కాయగూరలు, ఆకుకూరలు , చేదుపొట్ల , కాకరకాయ , మెంతులు, దొండకాయ, వెలగపండు, మారేడు , నేరేడు గింజలు, ఉసిరిక పండు, పసుపు, పండ్లలో యాపిల్, బొప్పాయి, జామ, బత్తాయి. దానిమ్మ మంచిది. తినకూడనివి.. ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం, వేపుళ్లు, నేతి వంటకాలు, మద్యం, చెరుకు రసం, పుల్లటి పదార్థాలు, చింతపండు, పెరుగు, వెన్న , జున్ను , దుంప కూరలు, కొవ్వులు అధికంగా ఉండే పదార్థాలు వాడకూడదు. అదేవిధంగా రాత్రిపూట మేలుకొని పగలు ఎక్కువ నిద్రించటం, ధూమపానం, మద్యపానం మంచిది కాదు. మలమూత్రాలను ఆపుకోకపోవడం మంచిది. తనంతట తానుగా మన శరీరం దాదాపు ప్రతి వ్యాధిని నివారణ చేసుకోగలదు. కానీ మధుమేహం వస్తే అది కుదరకపోవచ్చు. అందుకే డయాబెటిస్ విషయంలో నివారణకే ప్రాధాన్యం ఇవ్వాలి. చదవండి: ఈ హెర్బల్ టీతో ఇమ్యునిటీని పెంచుకోండి ఇలా.. -
Covid: ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తున్నారా? అయితే ఓసీడే
కరోనా రాకముందే... అలాగే, దాని గురించి తెలిసిన కొత్తలో దాని కారణంగా చాలామందిలో కొన్ని మానసిక సమస్యలు కనిపించడం వైద్యులు గమనించారు. ఉదాహరణకు... యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కొన్ని. అలాగే ఇప్పుడు రెండో వేవ్ కొనసాగుతూ ఉండగా... ఇందులోనూ తమకు సన్నిహితులూ... కొందరైతే తమ సొంత కుటుంబ సభ్యులను కోల్పోవడంతో మరింత తీవ్రమైన మానసిక సమస్యలను చవిచూశారూ...చూస్తున్నారు. అందులో ప్రధానమైనది ‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’. దాని గురించి తెలుసుకుందాం. గత ఏడాది మొదటి కరోనా వేవ్ సీజన్లో దాని గురించి పెద్దగా తెలియని పరిస్థితుల్లో చాలామంది తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు కొన్ని మానసిక లక్షణాలూ కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు తొందరగానే తగ్గిపోవచ్చు. అలా వచ్చి తగ్గిపోయిన సమస్యలను ‘అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్’ అంటారు. మరికొందరిలో అవి తీవ్రమైన ఒత్తిడి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, ఫోబియా, ఓసీడీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలుగా మారే అవకాశమూ ఉండింది. అప్పుడూ ఇప్పుడు కూడా కరోనా విషయమై బాగా టెన్షన్గా ఉండటం, తీవ్రమైన ఆందోళన, విపరీతమైన బెంగ... వ్యాధి వస్తుందా, వస్తే తగ్గుతుందా, లేక మరణానికి దారితీస్తుందా లాంటి సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటి రెండో సీజన్లోనూ అలా అవుతున్నారు. దాన్ని కరోనా ఫోబియాగా చెప్పవచ్చు. వాళ్లలో కరోనా లేకపోయినా... లేదా వచ్చి తగ్గిన వారిలోనూ మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. వారిలో ఆ వ్యాధి లేదనీ... ఒకసారి వచ్చి తగ్గినందున మళ్లీ ఆ వెంటనే సాధారణంగా రాదని చెప్పినా భయం పోదు. ఇలా తమకు దూరంగా ఉన్న రక్తసంబంధీకులు, కావాల్సినవారు ఎలా ఉన్నారో అంటూ ఆందోళన పడవచ్చు. ఇలాంటి ఆందోళనతో టెన్షన్ పడటాన్ని ‘జనరలైజ్డ్ యాంగై్జటీ డిజార్డర్ (జీఏడీ)’గా చెప్పవచ్చు. టెన్షన్తోపాటు విపరీతంగా భయపడటాన్ని ప్యానిక్ డిజార్డర్గా చెప్పవచ్చు. అంటే వీళ్లు కరెన్సీనీ, కూరగాయలనూ, తమ ఇంటిలోని సొంత ఆత్మీయులనూ తాకడానికి కూడా తీవ్రమైన భయాందోళనలకు గురవుతూ ప్యానిక్ అవుతుంటారు. దీన్ని ‘ప్యానిక్ డిజార్డర్’గా చెప్పవచ్చు. ఇక చేతులకు మళ్లీ మళ్లీ శానిటైజర్ పూసుకోవడం, చేతులు అదేపనిగా కడుక్కోవడం చేస్తూ ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్కూ లోను కావచ్చు. ఒకసారి చేతులు కడుక్కున్నా లేదా శానిటైజర్ పూసుకున్నా దాదాపు గంటపాటు రక్షణ ఉందని తెలిశాక కూడా ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తుంటే ఓసీడీగా పేర్కొనవచ్చు. సెకండ్వేవ్లో కనిపిస్తున్న ప్రధాన మానసిక సమస్య... అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ మొదటివేవ్తో పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్లో... కుటుంబ సభ్యులూ, తమకు కావాల్సిన సన్నిహితులు, ఆత్మీయులు మరణించడంతో... చాలామంది ఇప్పుడు ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ మానసిక సమస్యతో బాధపడుతుండటాన్ని చాలామంది సైకియాట్రిస్టులు చూస్తున్నారు. ఈ సమస్య తాలూకు కొన్ని కేస్ స్టడీలు కేస్ స్టడీ 1: డెబ్బయి ఏళ్ల పెద్దవయసు దంపతులు సొంతకూతుర్ని పోగొటుకున్నారు. యూఎస్లో ఉండే వారి కుమారుడు ఇక్కడికి వచ్చేసి వాళ్లకు చికిత్స అందిస్తున్నాడు. అతడు తన ఉద్యోగం కోసం యూఎస్కు వెళ్లే పరిస్థితి లేదు. కేస్ స్టడీ 2: మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్న ఓ యువకుడు ఇటీవల కరోనాతో మరణించాడు. దాంతో 58 ఏళ్ల వయసున్న అతడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. వీళ్లంతా ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’’ గురైనట్లు తేలింది. అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటే... అంతకు ముందు ఉన్న సాకుకూల స్థితి తొలగిపోయి ఒకేసారి కొత్త పరిస్థితులకు ఎక్స్పోజ్ అయినప్పటుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దానికి తగినట్లుగా తమను తాము ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియని అయోమయంలో వ్యక్తులు తీవ్రమైన వ్యాకులతకూ, కుంగుబాటుకు గురియ్యే అవకాశం ఉంది. దాన్నే ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’’గా పేర్కొనవచ్చు. లక్షణాలు: అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అవే లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. బాగా దగ్గరివారు ఆ లక్షణాలను గమనిస్తూ ఉండటం అవసరం. అవి... ∙ఏదో తెలియని భయం/ఆందోళన/గుబులు/గాభరా ∙గుండెవేగంగా కొట్టుకోవడం/గుండెదడ/గుండెల్లో మంట / గుండె బిగబట్టినట్టుగా ఉండటం/ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ∙ అకస్మాత్తుగా అంతులేని భయానికీ లోనవ్వడం (ప్యానిక్ అటాక్) ∙విపరీతంగా చెమటలు పట్టడం ∙ఛాతీ బిగబట్టినట్టుగా అనిపించడం / ఛాతీలో మంట ∙శ్వాససరిగా అందకపోవడం లేదా బలంగా ఊపిరి తీసుకోవడం / ఆయాస పడటం ∙నోరు తడారిపోవడం ∙ఒళ్లు జలదరించడం ∙అయోమయం ∙కడుపులో గాభరా కడుపులో మంట ∙ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తూ ఉండటం ∙చేతులు, కాళ్లు వణకడం, ఒకచోట నిలకడగా ఉండలేకపోవడం ∙నిత్యం అలజడిగా ఉండటం ∙తీవ్రమైన నిద్రలేమి, నిద్రవేళల్లో మార్పులు, వేళకు నిద్రపట్టకపోవడం (ఇర్రెగ్యులర్ స్లీప్ పాట్రన్స్), అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం ఇక ఆ తర్వాత నిద్రపట్టకపోవడం... పై లక్షణాలతో పాటు కొత్త పరిస్థితులకు అడ్జెస్ట్ అయ్యేందుకు పడే ప్రయాసలో డిప్రెషన్కు గురైన వారిలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, నెగెటివ్ ఆలోచనలు రావడం, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవడం వంటి లక్షణాలూ కనిపించడంతో పాటు ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలూ (సూసైడల్ టెండెన్సిస్) కూడా కనిపిస్తాయి. ఆత్మహత్యకు చేసుకోవలన్న ఆలోచనలు మాటిమాటికీ వస్తుంటాయి. దీని నుంచి బయటపడటం ఎలా? ► మీ ఇతర కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, తెలిసినవారు, మీ శ్రేయోభిలాషులు అనుకున్నవారితో భౌతికంగా కాకపోయినా... వర్చువల్గా (అంటే మొబైల్ లేదా ఫేస్టైమ్తో) వారితో సన్నిహితంగా ఉండండి. వారితో మీ సంతోషదాకయమైన క్షణాలను స్మరిస్తూ... ఆ ఆనందకరమైన సమయాలు మళ్లీ త్వరలోనే వస్తాయనే ఆశాభావంతో కూడిన సంభాషణలు చేయండి. ► మీ దగ్గరివారు కూడా కోవిడ్ను ఎదుర్కోవడమో, తమకు ఆత్మీయులైనవారిని కోల్పోవడమో చేసి ఉండవచ్చు. వారు ఈ క్రైసిస్ను ఎలా ఎదుర్కొన్నారు అనే లాంటి అంశాలను మాట్లాడుతూ... మీరూ ఆ మాటలతో మోటివేట్ అయ్యేలా మీ సంభాషణలు ఉండాలి. వారి నుంచి మీరు స్ఫూర్తి పొందేలాంటి సంభాషణలే వినండి. వారి ధైర్యసాహసాలను మెచ్చుకోండి. వాటిని మీరు మీలోనూ నింపుకోండి. ► మీకు ఇష్టమైనవారి ధైర్యసాహసాలను, వారు వారి క్రైసిస్ నుంచి బయటపడ్డ తీరును, వారి మంచి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచండి. దాంతో ఇతరులూ స్ఫూర్తి పొందుతారు. ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచినప్పుడు ఇతరులు వాటిని లైక్ చేస్తే... మీరు వాటిని మళ్లీ మళ్లీ చదువుతున్నప్పుడు మీరూ ఉత్తేజితులవుతారు. ► మీ అనుభవాలను ఉత్తరాలుగా రాసుకోండి. వాటిని మీరు మళ్లీ చదువుకోండి లేదా ఇష్టమైనవారికి పంపండి లేదా మీరే చించివేయండి. ► మీకు ఇష్టమైన హాబీలలో నిమగ్నం కావాలి. గతంలో మీరు ప్రదర్శించిన నైపుణ్యాలను మళ్లీ వెలికి తీయాలి. అంటే పెయిటింగ్, డాన్స్ వంటి వాటిలో నిమగ్నమవుతూ... వాటిని ఆస్వాదిస్తూ ఉండాలి. మీరు బాగా ప్రదర్శించిన వాటికి మీకు మీరే బహుమతులు ఇచ్చుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేవ్ చేసుకోవడమూ అవసరం. ► గతంలో మీరు ప్రదర్శించిన ధైర్యసాహసాలు మాటిమాటికీ తలచుకోవాలి. ‘అప్పుడు వాటిని చేసింది కూడా నేను కదా. మరలాంటప్పుడు నేను ఇప్పుడూ అవే ధైర్యసాహసాలను ప్రదర్శించగలను కదా’ అంటూ ధైర్యం చెప్పుకోవాలి. ► ఆటలూ, క్రీడలూ వంటివి క్రీడా స్ఫూర్తి పెంచుతూ... ఓటమిని తేలిగ్గా తీసుకునే అడ్జస్ట్మెంట్ బిహేవియర్ను వేగవంతం చేయడమే కాకుండా... కొత్త పరిస్థితులకు తేలిగ్గా సర్దుకుపోయే గుణాన్ని పెంపొందిస్తాయి. డిప్రెషన్ నుంచి వేగంగా బయటపడేస్తాయి. ► ఇంట్లోనే వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల మెదడులో ఎండార్ఫిన్స్ వంటి సంతోషకరమైన రసాయనాలు వెలువడుతాయి. అవి ఆనందాన్ని పెంచి డిప్రెషన్ను అధిగమించేందుకూ తోడ్పడతాయి. ఇవి కూడా చేయండి: ► రోజూ అన్ని పోషకాలు ఉండే సమతులాహారం, మంచి పౌష్టికాహారం తీసుకోండి. ► టీవీలో మీకు విపరీతమైన ఆందోళన కలిగించే వార్తలను చూడకండి, వినకండి. ► మీకు చాలా ఇష్టమైనవారితోనే సమయం గడపండి. ∙ఆహ్లాదకరమైన సంగీతం/పాటలు వినండి. ► ఇంట్లోనే మీకు ఇష్టమైన సినిమాలు చూడండి. ముఖ్యంగా హాస్యచిత్రాలు. ► బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడంతో పాటు... యోగా, ప్రాణాయామ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ► ఈ పరిస్థితేమీ ప్రమాదకరం కాదంటూ మీకు మీరు ధైర్యం చెప్పుకుంటూ ఉండండి. ఒకవేళ అది సాధ్యపడకపోతే... టెలిఫోన్లోనే మీ కుటుంబ డాక్టర్తో లేదా సైకియాట్రిస్ట్తో మాట్లాడి, ప్రొఫెషనల్స్ సలహా తీసుకోండి. అలాంటివారిలోనూ మీ పట్ల సహానుభూతితో ఉండేవారినే ఎంచుకుని వారిని సంప్రదించండి. - డాక్టర్ చరణ్ తేజ కోగంటి కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్ -
జిల్లాకో డయాగ్నోస్టిక్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: రోగాన్ని ముందస్తుగా గుర్తిస్తే వేగంగా నయం చేయ వచ్చనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. క్యాన్సర్ లాంటి రోగాన్ని సైతం ప్రాథమిక దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చామని, వచ్చే నెలాఖరులోగా మరో 19 చోట్ల ఈ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. రూ.1.5 కోట్లతో సంబంధిత పరికరాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆనంద్ లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల వివరణ ఇచ్చారు. హైదరాబాద్లోని నారాయణగూడలో అత్యాధునిక పరికరాలతో లేబొరేటరీని అందుబాటులోకి తెచ్చామన్నారు. నగరంలో 20 చోట్ల శాంపిల్ కలెక్షన్ సెంటర్లను తెరిచి రోగుల నుంచి శాంపిల్స్ తీసుకుని నారాయణగూడ ల్యాబ్కు పంపిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లిలో వంద పడకల ఆస్పత్రిని ఉద్యోగుల నియామకం పూర్తిచేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కరోనాపై అసెంబ్లీలో మంత్రి ఆరా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ ఈటల అధికారులను ఆదేశించారు. అధికారుల నుంచి అందే నివేదిక ఆధారంగా భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఈటల వద్ద ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అసెంబ్లీలోని తన చాంబర్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసి యేషన్లతో మంత్రి రాజేందర్ ఫోన్లో మాట్లాడారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, ఆస్పత్రుల్లో చేరుతున్న ఇన్పేషంట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నా, తీవ్రత మాత్రం అంతగా లేదని అధికారులు వివరించారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచడంతో పాటు కరోనా బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. -
కేన్సర్ నిర్ధారణకు సరికొత్త పరీక్ష...
ప్రాణాంతకమైన కేన్సర్ను సులువుగా గుర్తించేందుకు స్టాన్ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. అయస్కాంత లక్షణాలున్న తీగలను ధమనుల్లోకి జొప్పించడం ద్వారా వ్యాధిని చాలా తొందరగా గుర్తింవచ్చునని వీరు అంటున్నారు. కేన్సర్ను నిర్ధారించేందుకు ప్రస్తుతం బయాప్సీనే మార్గం. రక్తపరీక్షల ద్వారా కూడా వ్యాధి నిర్ధారణకు తాజాగా కొన్ని పరీక్షలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. రక్తంలో ప్రవహిస్తూండే కేన్సర్ కణితి కణాలను ఆకర్శించే అయస్కాంత తీగను ఉపయోగించినప్పుడు మాత్రం వ్యాధి ఉన్నదీ లేనిదీ స్పష్టంగా తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సామ్ గంభీర్ తెలిపారు. రక్తంలో అతితక్కువగా ఉండే ఈ రకమైన కణాలను ఇతర పద్ధతుల ద్వారా గుర్తించడం చాలా కష్టమని అన్నారు. ఈ కణాలకు అతుక్కుని అయస్కాంతాలకు ఆకర్శితమయ్యే నానో కణాలను తాము అభివద్ధి చేశామని.. తద్వారా అయస్కాంత తీగను ధమనుల్లోకి జొప్పించినప్పుడు కణితి కణాలు సులువుగా ఈ తీగకు అతుక్కుపోతాయని సామ్ వివరించారు. పందులపై జరిపిన ప్రయోగాల్లో ఈ పద్ధతి చక్కగా పనిచేసిందని అన్నారు. ఈ పరీక్షను కేవలం 2– నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చునని, త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని వివరించారు. -
కేన్సర్ను గుర్తించే సరికొత్త పరికరం
మహమ్మారి కేన్సర్ను చటుక్కున గుర్తించేందుకు తయారైన సరికొత్త పరికరం ఇది. పేరు బ్రెత్ బయాప్సీ. బిల్లీ బాయల్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్ కేవలం మన ఊపిరి ఆధారంగానే వ్యాధి నిర్ధారణ చేస్తుంది. భార్య కేట్కు ఉన్న పెద్దపేగు కేన్సర్ను సకాలంలో గుర్తించకపోవడం.. ఫలితంగా చిన్న వయసులోనే ఆమె మరణించడం బాయల్ మనసును కలచివేసింది. ఇలాంటి చావు ఇతరులెవ్వరికీ రాకూడదని, వీలైనంత ముందుగా కేన్సర్ను గుర్తించే టెక్నాలజీని అభివద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బాయల్.. కేవలం నాలుగేళ్లలోనే దాన్ని సాధించడం విశేషం. మనిషికి రాగల వేర్వేరు కేన్సర్లలో కనీసం సగంవాటిని బ్రెత్ బయాప్సీ ద్వారా గుర్తించవచ్చు. తద్వారా శస్త్రచికిత్సతో చేసే బయాప్సీ అవసరం ఉండదు. కేన్సర్ సోకినప్పుడు మన కణాల్లో కొన్ని నాశనమై కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు ఊపిరి ద్వారా బయటకు వస్తూంటాయి. ఈ వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ను గుర్తించేలా బ్రెత్ బయాప్సీని సిద్ధం చేశారు. ఎలాంటి లక్షణాలు కనబరచకపోయినా ఊపిరిత్తుల, కడుపులోని కేన్సర్ను ఇది సులువుగా గుర్తించగలదు. కొన్ని ఇతర వ్యాధుల నిర్ధారణకూ ఇది ఉపయోగపడుతుందని అంచనా. ఈ అద్భుత ఆవిష్కరణకు ఇంజనీరింగ్ నోబెల్ అవార్డుగా పరిగణించే మెక్రాబర్ట్ అవార్డు దక్కింది. -
ఉబ్బసం వ్యాధి నిర్ధారణకు తేలికైన పరీక్ష
ముక్కులో ఉండే ద్రవాలను పరీక్షించడం ద్వారా ఉబ్బసం వ్యాధిని నిర్ధారించేందుకు మౌంట్ సినాయి (అమెరికా) శాస్త్రవేత్తలు ఓ సులువైన పద్ధతిని ఆవిష్కరించారు. రైబో న్యూక్లియిక్ ఆసిడ్ నమూనాలను సేకరించడం ద్వారా ఈ పద్ధతి పనిచేస్తుంది. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్తో మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించే అవకాశముండగా.. కొత్త పద్ధతి ద్వారా ఎవరైనా ఈ పరీక్షలు పూర్తి చేయడమే కాకుండా... కచ్చితమైన ఫలితాలూ పొందవచ్చు. అంతేకాకుండా ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. మౌంట్ సినాయి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పరీక్షను దాదాపు 190 మంది కార్యకర్తలపై ప్రయోగించి చూసినప్పుడు వారిలో 66 మందికి తక్కువస్థాయి నుంచి ఒక మోస్తరు స్థాయి ఉబ్బసం లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ముక్కులోని ద్రవాల ద్వారా సేకరించిన ఆర్ఎన్ఏలో ఉబ్బసం వ్యాధిగ్రస్తుల్లో మాత్రమే కనిపించే కొన్ని జన్యుపరమైన అంశాలను గుర్తించడం ద్వారా తాము వ్యాధి నిర్ధారణ చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ సుపింద బున్యావానిచ్ తెలిపారు. వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
రోగ నిర్ధారణలో రేడియాలజిస్టులే కీలకం
సాక్షి, హైదరాబాద్: రోగ నిర్ధారణలో రేడియాలజిస్టుల పాత్ర కీలకమని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఐఆర్ఐఏ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ మానస సరోవర్లో ‘ఇండో–యూఎస్ ఇమేజింగ్ అప్డేట్ సదస్సు’జరిగింది. తెలంగాణ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ చాన్స్లర్ కరుణాకర్రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, ఫ్యాకల్టీ డాక్టర్ వెంకట్రామ్రెడ్డి, డాక్టర్ ప్రభాకర్రెడ్డి, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ సికిందర్, డాక్టర్ రాజేశ్, డాక్టర్ టీఎల్ఎన్ ప్రసాద్, డాక్టర్ జాఫర్ హసన్, డాక్టర్ ఖదీర్ చింతపల్లి, డాక్టర్ జగన్మోహన్రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ప్రసాద్లతో పాటు దేశవిదేశాలకు చెందిన సుమారు 350 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాలేయం, మూత్రపిండాలు, ప్రాంకీయాస్, చిన్న, పెద్దపేగుల్లో తలెత్తే సమస్యలను ఎంఆర్ఐ, సీటీ, అల్ట్రాసౌండ్ల ద్వారా సులభంగా గుర్తించవచ్చన్నారు. రేడియాలజిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం రూ.160 కోట్ల మంజూరు కూడా చేసిందని కరుణాకర్రెడ్డి తెలిపారు. రేడియాలజీ కోర్సులను అభ్యసిస్తున్న వారికి ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉందన్నారు. నాన్ ఆల్కాహాలిక్ కేసులు పెరిగాయి అతిగా మద్యం సేవించడంతో కాలేయం దెబ్బతింటున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నాన్ ఆల్కాహాలిక్(మద్యం అలవాటు లేని) కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపొద్దుపోయిన తర్వాత తినడం వల్ల చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. వందలో 50 శాతం మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. – డాక్టర్ కేథర్ చింతపల్లి, ప్రముఖ రేడియాలజిస్టు టెక్నాలజీలో అనేక మార్పులు వైద్యరంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రతిదానికీ బయాప్సీ అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ అవసరం లేదు. అత్యాధునిక ఎంఆర్ఐ, సీటీ, అల్ట్రాసౌండ్ వంటి వైద్యపరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా బాడీలో ఏ భాగం దెబ్బతిన్నదో ఇట్టే తెలిసిపోతుంది. – డాక్టర్ విజయభాస్కర్ నూరి, డైరెక్టర్, విస్టా ఇమేజింగ్ అండ్ మెడికల్ సెంటర్ -
డెంగ్యూ, చికున్ గున్యాకు చెక్
సత్వర వైద్యానికి చర్యలు ► రాష్ట్రంలో కొత్తగా 20 పరీక్ష కేంద్రాలు ► ఈ ఏడాది ఏడు ప్రారంభం వచ్చే ఏడాది మరో 13 ఏర్పాటు ► ఆరోగ్యశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: శరీరంలోని అన్ని వ్యవస్థల ను దెబ్బతీస్తూ... జీవితకాలం ఆరోగ్య సమస్య లను తెస్తున్న డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులను వెంటనే గుర్తించి వేగంగా చికిత్స అందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆరోగ్య శాఖ భావిస్తోంది. నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 14 చోట్ల డెంగ్యూ, చికున్ గున్యా నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భద్రాచలం, కొత్తగూడెం కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమ య్యాయి. సిద్దిపేట, తాండూరు, కామారెడ్డి, నిర్మల్, బాన్సువాడలో త్వరలో కొత్త కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి కాక వచ్చే ఏడాది మరో 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలు ఉండడంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నవి, కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో 34 పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీం తో వేగంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స జరగ నుంది. దోమల నిర్మూలన, పరిసరాల పరిశుభ్ర తపై అందరికీ అవగాహన కల్పిస్తూ నే... చికున్ గున్యా, డెంగ్యూ చికిత్సను వేగంగా అందించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ అదన పు సంచాలకురాలు ఎస్.ప్రభావతి తెలిపారు. చికున్ గున్యా, డెంగ్యూ పరీక్ష కేంద్రాలు ప్రస్తుతం పని చేస్తున్నవి: వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్లోని ఐపీఎం, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, రొనాల్డ్ రాస్ ఆస్పత్రులు. ప్రతిపాదిత కేంద్రాలు యాదాద్రి, సూర్యాపేట, వనపర్తి, నాగర్కర్నూలు, గద్వాల, భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, జనగామ, మహబూబాబాద్, అర్మూర్, బోధన్. డెంగ్యూ కేసులు... జిల్లా పేరు 2016 2017 ఖమ్మం 1416 205 హైదరాబాద్ 780 71 రంగారెడ్డి 568 31 నిజామాబాద్ 258 18 కరీంనగర్ 210 15 వరంగల్ 207 08 మహబూబ్నగర్ 122 12 మెదక్ 93 11 నల్లగొండ 66 01 ఆదిలాబాద్ 39 04 వివరాలు.. 2017 ఆగస్టు 16 వరకు. చికున్ గున్యా కేసులు జిల్లాల వారీగా జిల్లా పేరు 2016 2017 హైదరాబాద్ 22 5 మహబూబ్నగర్ 23 3 ఖమ్మం 15 0 రంగారెడ్డి 7 2 నిజామాబాద్ 1 1 ఆదిలాబాద్ 0 1 వరంగల్ 0 1. -
చెమటతో వ్యాధిని గుర్తించొచ్చు!
బోస్టన్: చెమటను పరీక్షించి రోగాన్ని గుర్తించే సరికొత్త సెన్సర్ను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.రిస్ట్ బ్యాండ్ రూపంలో ధరించేందుకు అనువుగా ఉండే ఈ సెన్సర్ద్వారా మధుమేహం, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి రోగాలు గుర్తించవచ్చు. ఈ సెన్సర్ చెమటను సేకరించి దానిలోని క్లోరైడ్, గ్లూకోజ్ అణువులను విశ్లేషించి రోగ నిర్ధారణ చేస్తుంది. ఈ పరికరం వల్ల రోగ నిర్ధారణ కోసం గంటల తరబడి పరీక్షా కేంద్రాల్లో వేచిచూడాల్సిన అవసరం తప్పుతుంది. ఎలా కావాలంటే అలా వంచుకునే సౌలభ్యం ఉన్న ఈ సెన్సర్లో రెండంచెల వ్యవస్థ ఉంటుంది. ఇందులోని మైక్రోప్రాసెసర్ చర్మానికి అతుక్కుని ఉంటుంది.ఇది స్వేద గ్రంధులను ఉత్తేజపరిచి అందులోని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా చెమటలోని అణువులను విశ్లేషిస్తుంది. -
తక్కువ ఖర్చుతో నోటి క్యాన్సర్ నిర్ధారణ
– అందుబాటులోకి వచ్చిన ఓసీటీ పరికరం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అతి తక్కువ ఖర్చుతో లేజర్ టెక్నాలజీని వినియోగించుకొని నోటి క్యాన్సర్ను నిర్ధారణ చేసే ‘ఆప్టికల్ కొహెరెంట్ టోమోగ్రఫీ(ఓసీటీ)’ పరికరాన్ని కనిపెట్టినట్లు అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెట్రా విల్డర్ స్మిత్ పేర్కొన్నారు. గతంలో వ్యాధి నిర్ధారణకు 80 వేల డాలర్ల ఖర్చు అయ్యేదని, ఓసీటీ యంత్రంతో కేవలం 5 వేల డాలర్లకు నిర్ధారణ చేయవచ్చన్నారు. జి.పుల్లారెడ్డి దంత కళాశాలలో శుక్రవారం నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఓసీటీ యంత్రంపై దంత వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా కాంగిజేంట్–2016 పేరిట సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఓటీసీ పరికరం వినియోగంపై అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పెట్రా విల్డర్ స్మిత్ ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ వికాష్ అగర్వాల్ మాట్లాడుతూ..టీ స్కాన్ పరికరంతో దవడ కండరాల వ్యాధులను సులభంగా గుర్తించవచ్చని వివరించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ దివాకర్ సైకో సోమాటిక్ డీసీజ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వికాష్ అగర్వాల్, దివాకర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ విభాగాధిపతి సాయిరాం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మురళీధర్రెడ్డి, ప్రొఫెసర్లు ప్రవీణ్, వికాష్, నరేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అస్థికల్ని గుర్తిస్తారిలా!
నిర్మాణం ఆధారంగా లింగ నిర్థారణ చేస్తారు అస్థిపంజరాల గుర్తింపులో ఇదే అత్యంత కీలకం శాస్త్రీయ పరిభాషలో ఆస్టియాలజీగా ప్రాచుర్యం దుర్గం చెర్వులో దొరికిన స్కెలిటన్ గుర్తుపట్టారిలా మాదాపూర్లోని దుర్గాం చెరువు స్కిల్టన్ స్టేజ్ వద్ద బుధవారం ఓ అస్థిపంజరం లభించింది. దీని తీరుతెన్నుల్ని అధ్యయనం చేసిన ఫోరెన్సిక్ నిపుణులు 35 ఏళ్ల యువతికి చెందినదిగా గుర్తించారు. శరీర భాగాలు పూర్తిగా పాడైపోయి, కేవలం ఎముకలు మాత్రమే మిగిలినా ఈ వివరాలను తెలుసుకోవడం ఎలా సాధ్యమైంది? అనే అనుమానం మనలో చాలా మందికి వస్తుంది. అస్థిపంజరాలన్నీ సామాన్యుల కంటికి ఒకేలా కనిపిస్తాయి. అయితే వీటిని అధ్యయనం చేసి అనేక వివరాలు తెలుసుకోవచ్చని చెప్తున్నారు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు. ఈ అధ్యయనాన్ని ఫోరెన్సిక్ పరిభాషలో ‘ఫోరెన్సిక్ ఆస్టియాలజీ’ అని పిలుస్తారట. ఈ శాస్త్రం ఆధారంగా అస్థిపంజరాల లింగం, వయసు ఎలా గుర్తిస్తారనే అంశంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...-సాక్షి, సిటీబ్యూరో లింగ నిర్థారణ... అస్థిపంజరం పురుషులదా, స్త్రీలదా అని నిర్థారించడంలో పెల్విక్ బోన్ కీలకపాత్ర పోషిస్తుంది. తొడ ఎముకలు, వెన్నుముకలను కలుపుతూ ఉండే చట్ట ప్రాంతంలో గుండ్రంగా ఉండే దాన్నే పెల్విక్ బోన్ అంటారు. ఇది స్త్రీలకు వెడల్పుగా, పురుషులకు కుంచించుకుని ఉంటుంది. దీని వల్లే తొడ ఎముక యాంగిల్ (వంపు) నిర్మాణంలోనూ తేడాలు వస్తాయి. పురుషుల తొడ ఎముక యాంగిల్ తక్కువగా, స్త్రీలకు ఎక్కువగా నిర్మాణమై ఉంటాయి. లింగ నిర్థారణకు ఇవి ప్రాథమికమైనవి. పుర్రె సైతం ఈ గుర్తింపునకు పనికి వస్తుంది. సాధారణంగా ఇదీ స్త్రీలకు చిన్నదిగా, పురుషులకు పెద్దదిగా ఉంటుంది. ఫీమర్ బోన్గా పిలిచే తొడ ఎముకను బట్టి ఆడా, మగా అనేది గుర్తించవచ్చు. స్త్రీల తొడ ఎముక సున్నితంగా ఉంటుంది. పురుషుల ఎముకకు కండ పట్టి రఫ్గా తయారవుతుంది. దైనందిన జీవితంలో చేసే పనుల్లో ఉన్న వ్యత్యాసం కారణంగానే ఇలా ఉంటాయని ఫోరెన్సిక్ నిపుణులంటున్నారు. వయసు నిర్ధారిస్తారిలా.. అస్థిపంజరం ఏ వయసు వారిదో నిర్థారించడానికి పుర్రె చాలా కీలమైంది. శిశువు గర్భంలో ఉండగా పుర్రె ఏడు భాగాలుగా ఉంటుంది. ప్రసవం సమయంలో అవి అతుక్కుని ఒకటిగా మారతాయి. ఈ అతుకులనే వైద్య పరిభాషలో ‘సూచర్స్’ అంటారు. వయసు పెరిగే కొద్దీ ఈ అతుకులు మాసిపోతాయి. అందుకే పసి వాళ్ల తలపై నడినెత్తి భాగం చాలా మెత్తగా ఉం టుంది. కొన్ని నెలలకు అది పూడి గట్టిగా తయారవుతుంది. సూచర్స్ ఉన్న స్థితిని బట్టి వయసు నిర్థారిస్తారు. పుర్రెలో ఉన్న పళ్లు కూడా వయసు నిర్థారణకు ఉపకరిస్తాయి. దీన్ని ‘ఫోరెన్సిక్ ఒడెంటాలజీ’ అంటారు. జ్ఞ్ఞానదంతం రాకపోతే 18 ఏళ్ల లోపుగా నిర్థారిస్తారు. మిగిలిన పళ్ల తీరు తెన్నులు, ఎముకల నిర్మాణం, వాటి పటుత్వం, ఎత్తు కూడా అస్థిపంజరం ఏ వయసు వారిదో గుర్తించడానికి ఉపకరిస్తాయి. ఆఖరి ఆశలు డీఎన్ఏ పైనే... అస్థిపంజరం లభించకుండా కేవలం కొన్ని ఎముకలే దొరికి, అవి కూడా పూర్తి స్థాయిలో లేకపోతే గుర్తింపు కొద్దిగా ఇబ్బందే. అప్పుడు ఉన్న భాగాలను ఫోరెన్సిక్ లాబ్కు పంపడం ద్వారా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలి. ఈ పరీక్షల్లోనే లింగం, వయసు తదితర వివరాలు బయపడతాయి. లభించిన అస్థిపంజరం ఎవరిదనేది గుర్తించాలన్నా డీఎన్ఏ పరీక్షలు తప్పనిసరి. అనుమానితుల సంబంధీకుల నుంచి రక్తనమూనాల తీసుకోవడం లేదా అనుమానితుల మెడికల్ రికార్డుల ఆధారంగా లభించిన పుర్రెలు, ఎముకలకు డీఎన్ఏ టెస్ట్ చేసి అవి ఎవరివో ఓ అవగాహనకు వస్తారు. కేసుల దర్యాప్తు, అనుమానితులు, నిందితుల గుర్తింపులో ఈ విధానాలన్నీ ఎంతో కీలమైనవి. ‘అనుమానం’ ఉంటే సూపర్ ఇంపోసిషన్... ఓ ప్రాంతంలో లభించిన అస్థిపంజరం ఫలానా వారిదనే అనుమానం ఉండి, డీఎన్ఏ పరీక్షలకు అవసరమైన సంబంధీకుల రక్తనమూనాల, మెడికల్ రికార్డులు అందుబాటులో లేకుండా మరింత ఆధునిక పరిజ్ఞానం ఆధారంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీన్నే ఫోరెన్సిక్ పరిభాషలో స్కల్ సూపర్ ఇంపోసిషన్ అంటారు. మనుషులందరికీ ముఖంలో నుదురు, కళ్లు, చెవులు, ముక్కు, నోరు వంటి భాగాలే ఉంటాయి. అయినప్పటికీ వాటి పరిమాణాల్లో ఉన్న తేడాల కారణంగానే ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. సూపర్ ఇంపొసిషన్ ప్రక్రియలో వీటినే ‘నిర్మిస్తారు’. ప్రత్యేక, అత్యాధునిక సాఫ్ట్వేర్స్ సాయంతో పుర్రెను స్కాన్ చేయడం ద్వారా కంప్యూటర్ సాయంతో దానిపై ఒక్కో పొరను నిర్మించుకు వస్తారు. పుర్రె పరిమాణం, ఆకారాన్ని బట్టి ముఖంలో ఉండే భాగాలకు రూపమిస్తారు. ఫలితంగా అనుమానిత వ్యక్తి దగ్గరి రూపరేఖలు ఉండే పటం తయారవుతుంది. దీని ఆధారంగానే సదరు పుర్రెతో కూడిన అస్థిపంజరం ఫలానా వ్యక్తిదనే నిర్థారణకు వస్తారు. -
కడుపులో క్రిములున్నా.. ఒంటి మీద దురద!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ఉద్యోగరీత్యా రాత్రిపూట పనిచేస్తుంటాను. దీనివల్ల సమయానికి భోజనం చేయలేకపోతున్నాను. ఎండోస్కోపీ చేయిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - అనిల్కుమార్, మిర్యాలగూడ ఆధునిక జీవనశైలిలో మార్పుల 40 శాతం మంది గ్యాస్ట్రిక్ వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. జీర్ణకోశంలో నోటి నుంచి మలమార్గం వరకు ఒక ట్యూబ్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ ఆహారమార్గంలో ఇన్ఫెక్షన్ రావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటుంటారు. కారణాలు: మానసిక ఒత్తిడి, పొగతాగడం, మద్యం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, భోజన వేళలు సరిగా పాటించకపోవడం, రాత్రివేళలలో ఎక్కువసేపు మేల్కొని ఉండటం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, రక్తంగడ్డకట్టడంలో లోపాలు, నొప్పి నివారణమాత్రలు, యాంటీబయాటిక్స్ మందులు ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. లక్షణాలు: కడుపులో నొప్పి, మంట, కడుపులో ఉబ్బరం, ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, మలబద్దకం, కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు కావడం, బరువు తగ్గడం, ఉదయంపూట వాంతి వచ్చినట్లు ఉండటం, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో సాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే అది గ్యాస్ట్రిక్ అల్సర్కు దారితీయవచ్చు. మలంలో రక్తంపడటం కూడా జరగవచ్చు. నాభి పైభాగంలో నొప్పి ఈ సమస్యలో కనిపించే ప్రధానమైన లక్షణం. జీర్ణకోశం లోపల ఉండే సున్నితమైన మ్యూకోజల్ పొరలో వాపు, కమిలిపోవడం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువగా స్రవించడం దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య తీవ్రమైతే పుండు కూడా పడవచ్చు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు: రోగి లక్షణాలను బట్టి ఎక్స్రే, ఎండోస్కోపీ, ఎఫ్టీఎమ్, మలపరీక్ష, అమీబియాసిస్, సీబీపీ, ఈఎస్సార్, ఎల్ఎఫ్టీ, అల్ట్రాసౌండ్స్కానింగ్, కొలనోస్కోపీ, సీటీస్కాన్ లాంటి పరీక్షలు చేస్తారు. నివారణ మార్గాలు: ఆహారం విషయంలో సమయపాలన, మద్యం-పొగతాగే అలవాట్లను మానివేయడం, మిత వ్యాయామం, కారం, మసాలాలకు దూరంగా ఉండటం, రోజుకు 6-8 గంటలు పాటు సరైన నిద్ర, మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రాణాయామం, ధ్యానం చేయడం వంటివి అనుసరించాలి. చికిత్స: హోమియోలో అంకురం నుంచి చికిత్స చేస్తారు. నవీన పద్ధతుల్లో వ్యాధి నిర్ధారణ, కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా మానసిక ఒత్తిడి, పేగులోని పుండ్లు మానేలా చేయడం ద్వారా వ్యాధిని అదుపు చేస్తారు. శారీరక, మానసిక లక్షణాలను బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడం వల్ల రోగి త్వరగా కోలుకుంటారు. డాక్టర్ మురళి అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ స్కిన్ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. నా చేతుల వేళ్లు విపరీతంగా దురద పెడుతున్నాయి. దాంతో చేతులను ఎప్పుడూ రుద్దుకుంటూ ఉంటున్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - కుమారస్వామి, తణుకు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు అలర్జీకి సంబంధించిన కాంటాక్ట్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. బహుశా దుమ్ము, ధూళి, డిటర్జెంట్, పుప్పొడి వంటి ఏవో అంశాలు మీకు సరిపడకపోవడం వల్ల మీకు విపరీతమైన దురద వస్తుండవచ్చు. మీరు ఒకసారి ఈ కింద పేర్కొన్న వైద్య పరీక్షలు చేయించాలి. అవి... సీబీపీ అబ్సల్యూట్ ఇజినోఫిల్ కౌంట్ మలపరీక్ష. కొన్నిసార్లు మన కడుపులో లేదా పేగుల్లో ఏవైనా క్రిమికీటకాలు, పరాన్నజీవులు ఉండటం వల్ల కూడా ఇలా ఒంటి మీద దురద వస్తుంటుంది. చికిత్స: మీకు సరిపడవని తెలిసిన అంశాల నుంచి దూరంగా ఉండండి. (అంటే ఉదాహరణకు డిటర్జెంట్, దుమ్ము, పుప్పొడి వంటివి) మీ కడుపులో ఉండే క్రిములు పడిపోవడానికి ఆల్బెండిజోల్ 400 ఎంజీ మాత్రలు నోటి ద్వారా తీసుకోవాలి వైద్య పరీక్షల్లో ఒకవేళ మీ ఇజినోఫిల్ కౌంట్ ఎక్కువని తేలితే మాంటెలుకాస్ట్ వంటి యాంటీహిస్టమైన్ మందులను రెండు నుంచి నాలుగు వారాల పాటు వాడాలి ఏదైనా ర్యాష్ వంటివి వస్తే వేళ్ల మీద మూడు రోజుల పాటు మోమాటజోన్ క్రీమ్ రాయాలి ప్రతి రోజూ చేతుల మీద మాయిష్చరైజింగ్ క్రీమ్ వాడుతుండాలి. అప్పటికీ సమస్య తగ్గకపోతే వెంటనే చర్మ నిపుణులను సంప్రదించండి. నా రెండు చేతుల మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తే చాలాసేపు గీరుకున్నాను. దాంతో నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. నా చర్మం మామూలయ్యేందుకు ఏం చేయాలి? - పద్మ, నిజామాబాద్ మీరు చెబుతున్న కండిషన్ను పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది తగ్గడానికి పాటించాల్సిన సూచనలు: సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్ను డార్క్ మార్క్స్ ఉన్నచోట బాగా రాయండి ఎండకు ఎక్స్పోజ్ అయ్యే చోట ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యానం రాయండి కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీములు అప్లై చేయండి ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను ప్రతిరోజూ తీసుకోండి.ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. మీరు అలర్జీని అదుపులో ఉంచుకునే మందులూ వాడాలి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా కూతురి వయసు 36 ఏళ్లు. ఆమెకు పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. ఇప్పటికి ఐదుసార్లు గర్భం వచ్చింది. కానీ ప్రతిసారీ ఏడో వారంలో గర్భస్రావం అయ్యింది. ఈ తర్వాత ఏడాదికి గర్భం వచ్చింది కానీ ఈ సారి తొమ్మిదోవారంలో గర్భస్రావం అయ్యింది. చివరిసారిగా రెండేళ్ల క్రితం గర్భం వచ్చి ఎనిమిది వారాలకు గర్భస్రావం అయ్యింది. ఆమెకు మాటిమాటికీ గర్భస్రావం కావడానికి కారణాలు ఏమిటి? నా కూతురికి గర్భం వస్తుందా, రాదా? - ఒక సోదరి, మహబూబ్నగర్ గర్భం రావడం, గర్భస్రావం కావడం మూడు సార్లు వరసగా జరిగితే దాన్ని వరస గర్భస్రావాలు (రికరెంట్ మిస్క్యారేజెస్) అంటారు. సాధారణంగా మన సమాజంలో ఒక శాతం మందిలో ఇలా జరుగుతుంటుంది. మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ గర్భస్రావం అయ్యే అవకాశాలూ పెరుగుతుంటాయి. అండాల సంఖ్య, నాణ్యత... ఈ రెండూ తగ్గుతుండటం వల్ల జరిగే ప్రక్రియ ఇది. చాలా సందర్భాలలో దీనికి కారణాలు తెలియవు. అయితే రెండు శాతం నుంచి ఐదు శాతం మందిలో దీనికి క్రోమోజోముల్లో సమస్య ఉండటం కారణం కావచ్చు. ఇలా మాటిమాటికీ గర్భస్రావాలు అవుతున్న మహిళల్లో 15 శాతం మందిలో యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ కారణంగా ఇది జరుగుతుంది. ఇదేగాక రక్తానికి, గర్భసంచి (యుటెరైన్)కి సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. ఒకవేళ క్రోమోజోమస్ సమస్యలు ఉంటే ప్రీ-నేటల్ పరీక్షలు లేదా ఐవీఎఫ్, ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ వంటివి చేయాలి. ఒకవేళ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఉంటే తక్కువ మోతాదులో ఆస్పిరిన్, హెపారిన్ వంటి మందులు వాడటం వంటివి ఉపయోగపడతాయి. ఒకసారి మీ అమ్మాయికి అన్నిరకాల పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమె గర్భస్రావాలకు నిర్దిష్టమైన కారణం బయటపడితే దాన్ని అనుసరించి చికిత్స చేయాలి. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్ రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్ -
వీర్యంలో పస్సెల్స్ ఎక్కువ, ఏం చేయాలి?
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ ఆహారం సరిగా జీర్ణం కావడం లేదు! నా వయసు 26 ఏళ్లు. బరువు 64 కేజీలు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. కొద్దిరోజులుగా పొట్ట అంతా ఉబ్బరంగా ఉంటోంది. తేన్పులు ఎక్కువగా వస్తున్నాయి. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కావడం లేదు. వీటితో పాటు కోపం, చిరాకు ఎక్కువగా కలుగుతున్నాయి. శారీరకంగానూ, మానసికంగానూ బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరని ప్రార్థిస్తున్నాను. - ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు రాసిన లక్షణాలను బట్టి చూస్తే మీరు పెప్టిక్ అల్సర్తో గానీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధితో గాని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ సమస్యతో ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో రాయలేదు. చాలావరకు అల్సర్స్కు సంబంధించిన వ్యాధి వల్ల కడుపులో నొప్పి రావడం, మంటరావడం జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత నొప్పి ఎక్కువ కావడం గానీ, తక్కువ కావడం గానీ జరుగుతుంది. ఒక్కోసారి కడుపులో అల్సర్స్ తీవ్రత ఎక్కువగా ఉంటే భోజనం తర్వాత వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ముందుగా మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని, వ్యాధి నిర్ధారణ జరిగేలా చూసుకోండి. ఎండోస్కోపీ పరీక్షతో మీ వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ అయితే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. నాకు ఆర్నెల్ల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు చేసిన రక్త పరీక్షల్లో హెపటైటిస్-బి పాజిటివ్ అని చెప్పారు. ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తిరిగి ఆ టెస్ట్ చేయిస్తే మళ్లీ పాజిటివ్ అని తెలిపారు. ఈ వ్యాధికి తగిన చికిత్స అందుబాటులో ఉందా? నాకు సరైన సలహా ఇవ్వండి. - సుదర్శన్నాయుడు, చిత్తూరు మీరు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ఆరు నెలల తర్వాత కూడా మీకు మీ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది కాబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్-బి ఉందని అర్థం. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్తపరీక్షలు చేయించుకొని, వ్యాధి ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి చాలామందిలో నిద్రాణ స్థితిలో ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి చైతన్యవంతం అయ్యే అవకాశం ఉంది. మీరు ప్రతి మూడు నెలలకోసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు నడుచుకోండి. యాండ్రాలజీ కౌన్సెలింగ్ వీర్యంలో పస్సెల్స్ ఎక్కువ, ఏం చేయాలి? నా వయుస్సు 34 ఏళ్లు. నాకు వివాహం జరిగి పదేళ్లు దాటింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. దాంతో దంపతులిద్దరం వైద్యపరీక్షలు చేయించుకున్నాం. ఆమెలో ఏ లోపం లేదు. కానీ నా వీర్యంలో పస్ సెల్స్ ఎక్కువగా (ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్) ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. పస్ సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా? మాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? - కేజేఎన్., విజయవాడ చాలాకాలంగా సంతానం లేనివారిలో మగవారికి మొదట సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఈ పస్ సెల్స్ ఉన్నప్పుడు వీర్యం నాణ్యత తగ్గుతుంది. దాంతో పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. డాక్టర్ సలహా మీద సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల వీర్యంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గితే వీర్యం నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. యూంటిబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ మరోసారి సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసి, ఈసారి వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉన్నట్లు రిపోర్టు వస్తే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తప్పక మెరుగవుతాయి. నాకు కుడిపక్కన వరిబీజం (బుడ్డ) వచ్చింది. డాక్టర్ను సంప్రదిస్తే ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అన్నారు. కానీ ఆపరేషన్ వల్ల సెక్స్లో ఇబ్బందులేమైనా వస్తాయేమోననీ, పిల్లలు కలగరేమో అని చేయించుకోవడం లేదు. నాకు మార్గం చెప్పగలరు. - జీడీఎస్పీ., గుణదల హైడ్రోసీల్, హెర్నియా... ఈ ఆపరేషన్లకూ అంగస్తంభనకూ ఎలాంటి సంబంధం లేదు. అంగస్తంభనకు కావాల్సిన నరాలు అంగంలో చాలా లోపలికి ఉంటాయి. మీకు ఆపరేషన్ వృషణాల దగ్గర చేస్తారు. దీని వల్ల సెక్స్ చేయడానికి ఇబ్బంది అయ్యే అవకాశమే లేదు. పిల్లలు పుట్టకపోవడం అనేది కూడా జరగదు. నిజానికి మీ సమస్యకు ఆపరేషన్ చేయించుకోకపోతేనే చాలా ప్రమాదం. సర్జరీ తర్వాత సమస్యలన్నీ తొలగి, అంతా నార్మల్ అయిపోతుంది. కాబట్టి నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి. నా వయసు 40. మూడేళ్లుగా షుగర్వ్యాధితో బాధపడుతున్నాను. ప్రస్తుతం చక్కెరపాళ్లు కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ రెండు మూడు నెలల నుంచి మూత్రంలో మంట, పురుషాంగం చివరిభాగంలో చర్మంపై పగుళ్లు వస్తున్నాయి. సెక్స్ చేసేటప్పుడు పురుషాంగం చివరన ఉన్న చర్మం మంటపుడుతోంది. దాంతోపాటు సెక్స్ సమయంలో పురుషాంగం చివర ఉన్న చర్మం వెనక్కిపోవడం లేదు. నా సమస్యకు సరైన మార్గాన్ని సూచించండి. - ఎస్.ఆర్.ఎస్.ఎమ్., నెల్లూరు షుగర్ వ్యాధి ఉన్నవారిలో పురుషాంగం చివరన ఉన్న చర్మంపై పగుళ్లు రావడం, ఇన్ఫెక్షన్ రావడం, తెల్లగా పాలిపోయినట్లుగా కావడం వంటి సమస్యలు చాలా సాధారణం. ఈ సమస్యను బెలనోఫ్తైస్ అంటారు. సాధారణంగా యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ క్రీమ్లతో ఇది తగ్గిపోతుంది. కాకపోతే పదే పదే వస్తుండటంతో పాటు... ప్రధానంగా చర్మం వెనక్కిపోకుండా సెక్స్లో సమస్యగా మారిన వారు దీనికోసం సున్తీ (సర్కమ్సిషన్) ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. అదేవిధంగా షుగర్ ఉన్న పేషెంట్స్లో యూరిన్లో ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తున్నా కూడా సున్తీ ఆపరేషన్ను సూచిస్తాం. ఈ ఆపరేషన్ తర్వాత మీరు పేర్కొన్న సమస్యలన్నీ దూరం కావడం వల్ల నిశ్చింతగా సెక్స్లో పాల్గొనవచ్చు. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ తుంటి ఎముక ఫ్రాక్చర్, సర్జరీ తప్పదా? మా చిన్నమ్మగారి వయసు 77 ఏళ్లు. ఆమె ఆర్నెల్ల క్రితం బాత్రూమ్లో జారిపడింది. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఆయన ఎక్స్-రే తీసి, తుంటి ఎముక ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పడంతో మేం ఆమెను ఆర్థోపెడిక్ సర్జన్ వద్దకు తీసుకెళ్లాం. ఆమెకు మేజర్ సర్జరీ అవసరమనీ, దానికి సంబంధించిన అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా వివరించారు. మా కుటుంబ సభ్యులమంతా ఆ రిస్క్ ఫ్యాక్టర్లు విన్న తర్వాత చాలా ఎక్కువగా ఆందోళన పడ్డాం. కొందరు సన్నిహితుల సలహా మేరకు ఆమెను ఇంగ్లిష్ వైద్యులకు బదులుగా సంప్రదాయ వైద్యం చేస్తూ, ఎముకలను సరిచేసే వారిదగ్గరకు తీసుకెళ్లాం. వారేదో బ్యాండేజీ లాంటిది కట్టి, బెడ్రెస్ట్ తీసుకొమ్మని సలహా ఇచ్చారు. ఒక మూడు నెలల్లో ఆమె లేచి తిరుగుతుందని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆమె మంచం దిగలేపోతోంది. పైగా ఎప్పుడూ మంచం మీదే పడుకొని ఉండటం వల్ల వీపు మీద అంతటా పుండ్లు (బెడ్సోర్స్) వచ్చాయి. ఈ దశలో మాకు తగిన సలహా ఇవ్వమని ప్రార్థన. - వెంకటదుర్గారావు, విజయవాడ తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడం అన్నది పెద్ద వయసువారిలో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఆ వయసువారు సాధారణంగా డయాబెటిస్, గుండెజబ్బులతో బాధపడుతుంటారు. తుంటిఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు చాలా సందర్భాల్లో శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. అయితే ఆ వయసు వారిలో శస్త్రచికిత్స అంటే ప్రపంచంలోని ఉత్తమమైన ఆసుపత్రికి వెళ్లినా ఆ వయసుకు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్లు ఉండనే ఉంటాయి. అయితే ఆ రిస్క్ ఫ్యాక్టర్లకు జడిసి మీరు ఆపరేషన్ చేయించుకోకపోతే మున్ముందు మరింత తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుత సమస్యకు వస్తే ఆమె మళ్లీ లేచి నిలబడి తిరగాలంటే శస్త్రచికిత్స తప్పనిసరి. కాకపోతే ఆర్నెల్ల కిందటితో పోలిస్తే ఈసారి రిస్క్ మరింత పెరుగుతుందని గుర్తించండి. ప్రమాదం జరిగినపుడు సాధ్యమైనంత త్వరలో శస్త్రచికిత్స చేయిస్తే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్ను కలవండి. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ పిల్లల కోసంమీరంత నిరాశ పడనక్కరలేదు! నా వయసు 26 ఏళ్లు. నేను రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాను. నాకు పెళ్లయి నాలుగేళ్ల అవుతోంది. గత మూడేళ్లుగా పిల్లలు కావాలని కోరుకుంటున్నాను. అయితే నాకు పీరియడ్స్ నాలుగైదు నెలలకొకసారి వస్తున్నాయి. డాక్టర్ను కలిశాను. స్కానింగ్ తీసి పాలీ సిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారు. నాకు ఎప్పటికైనా పిల్లలు పుడతారా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరి, హైదరాబాద్ పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్యను చాలా మంది మహిళల్లో మేం రోజూ చూస్తుంటాం. మీకు పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్య ఉంది కాబట్టి ఇలా రుతుస్రావం క్రమంగా రాదు. దాంతో మీలో అండాలు ఉత్పత్తి అయ్యే సంఖ్య కూడా బాగా తగ్గుతంది. ఫలితంగా మీలో గర్భధారణకు చాలా టైమ్ పట్టవచ్చు. మొట్టమొదట మీరు చేయాల్సిన పని... మీరు ఒకవేళ ఎక్కువ బరువు ఉంటే దాన్ని క్రమంగా తగ్గించుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చేసుకోండి. ఇదే జరిగితే...మీలో రుతుస్రావం క్రమబద్ధంగా రావడం మొదలవుతుంది. ఇక మీ ఆహారంలో ముదురాకుపచ్చటి తాజా ఆకుకూరలు చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పిజ్జా, బర్గర్, బేకరీ ఐటమ్స్ వంటి జంక్ఫుడ్ను పూర్తిగా మానేయండి. ఈరోజుల్లో మీలో అండం ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు చాలా మంది మందులు, వైద్యప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. మొదట టాబ్లెట్స్తో ప్రారంభించి, చికిత్సకు మీరు స్పందిస్తున్న తీరు ఆధారంగా క్రమంగా మీకు గొనాడోట్రాపిన్ ఇంజక్షెన్ ఇవ్వడం వంటివి చేస్తాం. లేదా మందులూ, గొనాడోట్రాపిన్ ఇంజెక్షన్ కలిపి కాంబినేషన్లలో కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీలాంటి వారిలో చాలామంది చాలా ప్రాథమిక చికిత్సకే బాగా స్పందిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఒవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాం. ఐవీఎఫ్ అనే అధునాతన చికిత్స చాలా కొద్దిమందికి మాత్రమే అవసరమవుతుంది. మీరు అప్పుడే అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకు పిల్లలు పుట్టేందుకు చాలా అవకాశాలే ఉన్నాయి. ఇక మీకు పీసీఓఎస్ ఉందంటే దీంతోపాటు దీర్ఘకాలంలో డయాబెటిస్, యుటెరైన్ క్యాన్సర్, గుండెసమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మీరు మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోండి. సరైన చికిత్స తీసుకుంటూ క్రమబద్ధంగా రుతుస్రావం జరిగేలా చూసుకుంటే చాలా సమస్యలు వాటంతట అవే చక్కబడతాయి. -
హోమియోవిధానం ద్వారా వెన్నునొప్పి నివారణ, చికిత్స
మన శరీరంలో వెన్నెముక నిర్మాణం చాలా విశిష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. ఒకపక్క అనేక వర్టిబ్రే అనే ఎముకలు ఒకదానితో ఒకటి అనుసంధానితమవుతూనే... మరో పక్క అందులోని ఖాళీలో వెన్నుపామును కప్పి రక్షిస్తుంటాయి. ఆ వెన్నుపాములోంచి అనేక నరాలు మళ్లీ పూర్తి వెన్నెముకగా వర్ణించేదానిలో 32 - 34 చిన్న విడి ఎముకల మధ్య భాగాల్లోంచి బయటికి వస్తూ ఉంటాయి. ఆ నరాలపై ఒత్తిడి పడకుండా ఎముకకూ, ఎముకకూ మధ్య మృదువైన డిస్క్లు ఉంటూ వాటిని కాపాడుతుంటాయి. వీటిలో ఏ భాగాలైనా భౌతిక అరుగుదల వల్లగానీ, ప్రమాదానికి లోనవడం వల్లగానీ అరిగినట్లయితే వెన్నెముకతో పాటు అనేక శరీర భాగాలు అంటే పిరుదులు, తొడలు, పిక్కలు వంటి చోట్ల తీవ్రమైన నొప్పి, మంట, తిమ్మిర్లు కనిపిస్తుంటాయి. వెన్నెముక అమరిక సరిగా లేకపోయినా, లేదా వెన్నుపాము ఉన్నచోట లేకుండా పక్కకు జరిగినా వెన్నునొప్పి వస్తుంది. నాడీ వ్యవస్థకూడా దెబ్బతింటుంది. వెన్నునొప్పి వచ్చినవారు నరకం అనుభవిస్తారు. ఈ నొప్పి బాధితులు సరిగా కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు, ముందుకు ఒంగలేరు. జీవితాంతం నొప్పి నివారణ మందులు వాడాల్సిందేనా లాంటి వ్యాకులతతో కుంగిపోతారు. సర్జరీతో సమస్య పరిష్కారమవుతుందని కొందరు డాక్టర్లు భరోసా ఇస్తారు. కానీ వెన్నెముకకు సర్జరీ అంటే ప్రతివారూ ఆందోళన చెందుతారు. ఈ తరహా వెన్నునొప్పుల నివారణ, చికిత్సలకు హోమియో వైద్యవిధానం ఒక వరం. ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా వీటిని తేలిగ్గా తగ్గించవచ్చు. వెన్నునొప్పికి కారణాలు వయసుతో పాటు వచ్చే మార్పులు, బరువు పెరగడం, పరిమితికి మించి బరువులు మోయడం, కండరాల బలహీనత, పొగతాగడం, గంటల తరబడి భంగిమ మారకుండా, అపసవ్య భంగిమలో కూర్చోవడం, ఎక్కువసేపు వాహనాలు నడపడం, సరైన పోషకాలు గల ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ డి3, బి12, క్యాల్షియం లోపాలు, ఏదైనా ప్రమాదంలో వెన్నుపూసకు దెబ్బ తగలడం, వెన్నెముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పులకు ప్రధాన కారణాలు. వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు ఎక్స్రే ఆఫ్ లంబార్ జాయింట్ సైనోవియల్ ఫ్లుయిడ్ ఎగ్జామినేషన్ ఎమ్మారై / సీటీస్కాన్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ హెచ్ఎల్ఏ బి27 రక్త, మూత్ర పరీక్షలు నివారణ మంచి పోషకాలతో కూడిన సరైన ఆహారం, మంచి ఆహారపు అలవాట్లు, సరైన నిద్ర, సరైన వ్యాయామంతో పాటు మానసిక సమస్యలైన డిప్రెషన్, ఆందోళన, ఆత్రుత, వ్యాకులత నుంచి దూరంగా ఉండటం. అస్క్యులస్ హిప్: కూర్చుని ఉండి... నిల్చునేటప్పుడు, ఒంగి లేచేటప్పుడు తీవ్రంగా నొప్పి రావడం, మిగతా సమయాల్లో బలహీనమైన నొప్పి ఉండటం, రక్తనాళాలు ఉబ్బడం, సిరల సమస్యలు ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. రస్టాక్స్: హోమియో వైద్య విధానంలో వెన్నునొప్పితో రోగి వచ్చినప్పుడు ఏ వైద్యుడైనా ముందుగా ఆలోచించే మందు ఇదే. నడుము నొప్పులు విశ్రాంతి సమయంలో ఎక్కువగా ఉండి, కదిలినప్పుడు/నడిచినప్పుడు తగ్గుతాయి. ఎన్వైయూ లాంగ్వా మెడికల్ సెంటర్ వారి పరిశోధనల్లో రస్టాక్స్ మందును ఎలుకలు, మానవులపై ప్రయోగించినప్పుడు కీళ్లవాతం, దీర్ఘకాలిక నడుమునొప్పి తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. బ్రయోనియా ఆల్బ్: చిన్న కదలికలతో నొప్పి తీవ్రంగా ఉండి, పూర్తి విశ్రాంతితో ఉపశమనం ఉంటుంది. రస్టాక్స్ అనే మందుకు వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల సైనోవియమ్, కండరాలు, కీళ్ల మీద ఉండే సిరస్ లేయర్ అరుగుదల ఏర్పడటం వల్ల వెన్నునొప్పి వస్తుంది. చిరాకు, కోపం, విసుగు, అతిదాహం ఉన్న రోగులకు ఇది మంచిది. కాల్కేరియా ఫ్లోర్: నడుంనొప్పి తీవ్రమైన మంటతో వస్తుంది. రోగికి చలనం, నడవడం విశ్రాంతినిస్తుంది. డిస్క్ కంప్రెషన్, వెన్నుపూసకు దెబ్బతగలడం, డిస్క్బల్జ్, విటమిన్ డి3 లోపం, క్యాల్షియమ్ లోపాలతో వచ్చే దీర్ఘకాలిక నడుం నొప్పికి ఈ మందు బాగా పనిచేస్తుంది. రస్టాక్స్ మందు పనిచేయని వారిలో దీన్ని వాడి ఉపశమనం సాధించవచ్చు. హైపరికం: ప్రమాదాలు (యాక్సిడెంట్స్), కిందపడటం, నరాల మీద ఒత్తిడి పడి నాడీమండలంలో తేడాలు రావడం, నొప్పి నడుము నుంచి కాళ్ల వరకు పాకడం, తిమ్మిర్లు, మంట, అతితీవ్రమైన నొప్పితో రోగి నిలబడటం/కూర్చోవడం కష్టం కావడం, దీర్ఘకా లిక సయాటికా వంటి వాటికి ఇది అద్భుత ఔషధం. సిమిసిఫ్యూగా: ఇది స్త్రీల సంబంధ నొప్పులకు అద్భుతమైన ఔషధం. రోగి మానసికంగా బలహీనంగా ఉండి, రుతుసమస్యలతో బాధపడుతుంటారు. నెలసరికి ముందు నొప్పి అతిగా వేధిస్తుంది. కోబాల్టమ్: వృత్తిసంబంధ కారణాలతో దీర్ఘకాలం పాటు కుర్చీలో కూర్చొని ఉండేవారికి (ఉదా:సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, క్లర్కులు, కూర్చుని పనిచేసే వృత్తుల్లో ఉండేవారు, ఊబకాయంతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధం. చికిత్స వెన్నునొప్పితో బాధపడేవారికి లక్షణాలను బట్టి ఈ కింది మందులను ఉపయోగిస్తారు. అవి... డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ (తెలంగాణ) -
వెంటాడుతున్న అలజడి
మరో మూడు కేసుల్లో స్వైన్ఫ్లూ నిర్ధారణ నాలుగు చేరిన కేసుల సంఖ్య చికిత్స పొందుతున్న బాధిత రోగులు {పభుత్వాస్పత్రిలో వెంటిలేటర్ల పెంపు విశాఖ మెడికల్: స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. రెండు రోజుల క్రితం ఒకరికి వ్యాధి నిర్ధారణ కావడంతో ఉలికిపడిన విశాఖవాసులకు శుక్రవారం మరో మూడు కేసులకూ పాజిటివ్ రావడం కలవరపరిచింది. అబిద్నగర్కు చెందిన వృద్ధునికి..నగరానికి చెందిన 52ఏళ్ల మహిళతోపాటు విజయనగరం జిల్లా భోగాపురం మహిళ(32)కి వ్యాధి నిర్ణారణయింది. వీరంతా ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. దీంతో విశాఖలోనే కాకుండా జిల్లాలోనూ ఈ వ్యాధిపట్ల అప్రమత్తం పెరిగింది. మాస్కులు ధరించకుండా ఎవరూ బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఆస్పత్రుల ఏరియాలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. శుక్రవారం స్వైన్ఫ్లూ అనుమానిత లక్షణాలతో ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. టౌన్కొత్తరోడ్డు ప్రాంతం నుంచి 56 ఏళ్ల మహిళతో పాటు గాజువాకకు చెందిన 38 ఏళ్ల వ్యక్తిలో స్వైన్ఫ్లూ అనుమానిత లక్షణాలుండడంతో ఆస్పత్రిలో చేర్చారు. అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న విజయనగరానికి చెందిన 41 ఏళ్ల మహిళను గురువారం రాత్రి ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చేర్చుకున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాంబశివరావు తెలిపారు. శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఆమెను వెంటిలేటర్పై నుంచి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇదే ఆస్పత్రిలో మూడు రోజుల కిందట చేరిన పలాసకు చెందిన 50ఏళ్ల వృద్ధుడికి స్వైన్ఫ్లూ లేనట్టు నిర్థారణ నివేదిక రావడంతో డిస్చార్జ్ చేసినట్టు తెలిపారు. కేజీహెచ్లో శుక్రవారం కొత్తగా అనుమానిత కేసులేవీ నమోదు కాలేదు. వ్యాధి అనుమానిత లక్షణాలతో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో నాలుగేళ్ల బాలుడికి స్వైన్ఫ్లూ వ్యాధి నిర్థారణయింది. పెదవాల్తేర్ ఆదర్శనగర్కు చెందిన మరో బాలుడుకి వ్యాధి లేదని నివేదిక అందినట్లు వైద్యవర్గాలు చెప్పాయి. పిల్లల వార్డులో మరో ముగ్గురు చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో గురువారం రాత్రి చేర్చుకున్న విషయం తెలిసిందే. పిల్లల వార్డులో వారం రోజుల కిందట చేరిన బాధితురాలికి స్వైన్ఫ్లూ వ్యాధి కాదని నిర్థారణయింది. వ్యాధి నిరోధక చర్యలు ముమ్మరం స్వైన్ఫ్లూ నియంత్రణకు జిల్లా యంత్రంగం చర్యలు ముమ్మరం చేసింది. శుక్రవారం నుంచి క్లస్టర్ స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ (ఆశా నుంచి ఆరోగ్యకార్యకర్త స్థాయి వరకు)సిబ్బంది ర్యాలీలు చేపట్టింది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులపై ప్రధానంగా దృష్టి పెట్టింది. బస్సు, రైలు, విమాన కేంద్రాల్లో స్వైన్ఫ్లూ వ్యాధి వ్యాప్తిపై తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. బస్సు, రైలు, విమానయాన కేంద్రాల వద్ద తనిఖీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనుంది. వ్యాధి అ నుమానిత లక్షణాలు గల వారికి సలహా లు, సూచనలిచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పా టు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల న్నింటిలోనూ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. శనివారం కలెక్టరేట్లో డ్వాక్రా మహిళలు, విద్యా శాఖ, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ముఖ్య అధికారులతో కుటుంబ సంక్షేమ కార్యాలయం సమన్వయకర్త డాక్టర్ అరుణదేవి చర్చించనున్నారు. కేజీహెచ్, ఛాతి ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించే విషయమై శుక్రవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఛాతి ఆస్పత్రి స్వైన్ఫ్లూ వార్డులో మరో రెండు వెంటిలేటర్ల ఏర్పాటు చేయాలని, వీటిని ఈఎన్టీ ఆస్పత్రి నుంచి తరలించాలని నిర్ణయించారు. స్వైన్ఫ్లూ అనుమానిత రోగుల గొంతు నుంచి లాలాజల నమూనాలను సేకరించే విషయంలో కేజీహెచ్లోని టెక్నికల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వైరస్ను అడ్డుకునేందుకు ఎన్-95 మాస్క్ల కొరత ఉన్నందున కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. సమావేశంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మదుసూధనబాబుతో పాటు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ సోమరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.సరోజీని, ఛాతి, ఈఎన్టీ ఆస్పత్రుల సూపరిటెండెంట్లు డాక్టర్ సాంబశివరావు, కృష్ణకిషోర్, జిల్లా స్వైన్ఫ్లూ నోడల్ అధికారి ఎల్బిఎస్ దేవి, కేజీహెచ్ నోడల్ అధికారి డాక్టర్ ఇందిరాదేవి, మైక్రోబయాలజీ సహాయ ప్రొఫెసర్లు డాక్టర్ శివకల్యాణి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
స్వైన్ ఫ్లూ నిర్ధారణకు ఏపీలో ల్యాబ్లు లేవు
వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడి హైదరాబాద్: ప్రాణాంతక స్వైన్ఫ్లూ (హెచ్1ఎన్1)లాంటి వైరస్లు సోకితే నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ల్యాబొరేటరీలు లేవని ఆరోగ్య సంచాలకులు డా. అరుణకుమారి చెప్పారు. రక్తనమూనాలను హైదరాబాద్కు పంపాల్సిందేనని తెలిపారు. గురువారం ఆమె వైద్యవిద్య సంచాలకులు డా. శాంతారావు, ఆరోగ్యశాఖ అదనపు సంచాలకులు డా. గీతాప్రసాదినిలతో కలసి స్వైన్ఫ్లూ నివారణకు తీసుకుంటున్న చర్యలపై విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్వైన్ఫ్లూ కేసులు నమోదైతే ఆ నమూనాలను హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో నిర్ధారణ చేస్తున్నామన్నారు. ఏపీలో స్వైన్ఫ్లూ వైరస్ ప్రమాదం లేదని తెలిపారు. అయినా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెలలో 19 మంది రక్త నమూనాలను సేకరించగా 12 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్టు తేలిందని చెప్పారు. వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందారని అరుణకుమారి పేర్కొన్నారు. -
అధిక బరువు... ప్రాణానికి ముప్పు!
ఓ సంగీత కోకిల మూగబోయింది. చక్రి ఓ సెలబ్రిటీగా మనకు కనిపించే ఉదాహరణ. కానీ ఎందరెందరో తమ తమ కెరియర్లలో నిలకడగా విజయాలు సాధిస్తూ ఉండే ఉంటారు. వారిలో కొందరు చక్రిలా స్థూలకాయంతో బాధపడుతూ ఉంటారు. చక్రికి వచ్చిన పరిస్థితి వారికి రాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరిచేందుకే ఈ ప్రత్యేక కథనం. చాలా హిట్ సినిమాల సంగీత దర్శకుడు చక్రి. నలభై ఏళ్లకే ఆయనకు నూరేళ్లు నిండాయి. అకస్మాత్తుగాగుండెపోటుతో చనిపోయారు. కానీ... అందరూ చెప్పుకుంటున్నట్లు మరణానికి కారణం గుండెపోటే అయినా ఆ గుండెపోటును ప్రేరేపించింది మాత్రం ఆయన స్థూలకాయమే. నలభై ఏళ్లకే ఎన్నెన్నో సూపర్హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం చేసి ఇప్పటికీ కెరియర్లో సక్సెస్ఫుల్గా ఉన్నారంటే... జీవించి ఉంటే మరెన్ని ఆణిముత్యాలను అందించేవారో. కానీ అకస్మాత్తుగా ఆ సంగీతఝరి ఆగిపోయింది. భారతీయులలో స్థూలకాయం... భారతీయుల్లో బీఎమ్ఐ విలువ 25 - ఆపైన ఉంటే స్వల్ప స్థూలకాయం ఉన్నట్లే. ఒకవేళ బీఎమ్ఐ విలువ 30 - ఆపైన ఉంటే అధిక స్థూలకాయం ఉన్నట్టుగా పరిగణించాలి. భారతీయుల్లో స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి బీఎమ్ఐతో పాటు నడుము చుట్టుకొలత, నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మొదలైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నడుము చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లు. ఇక నడుం-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి. బరువు పెరగకుండా ఉండటానికి మార్గాలు అధిక బరువు (బీఎమ్ఐ 23 - 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్ఐ 25 - 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్), ఆహారంలో కొవ్వు పాళ్లు తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వేళకు తినడం, తక్కువ మోతాదుల్లో తినడం, చిరుతిండ్లకు, కూల్డ్రింక్స్కు, ఆల్కహాల్కు దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇది అధిక బరువు ఉన్నవారికే గాక... అందరికీ ఆరోగ్యాన్నిచ్చే ప్రక్రియ. అయితే ఒకవేళ బీఎమ్ఐ 30 - ఆపైన ఉంటే డైటింగ్, వ్యాయామం వంటి మామూలు మార్గాలు పనిచేయవు. స్థూలకాయం కాస్మటిక్ సమస్య కాదు.. అది ప్రమాదకరం చాలామంది అనుకుంటున్నట్లుగా స్థూలకాయం కాస్మటిక్ సమస్య కాదు. ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులకు అది మూలకారణం. ఉదాహరణకు డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసే స్లీప్ ఆప్నియా, డిప్రెషన్ వంటి దాదాపు 65 రకాల వ్యాధులకు అదే అంతర్గత (అండర్లైయింగ్) కారణం. సాధారణ ప్రజలతో పోలిస్తే స్థూలకాయుల్లో ఆయుఃప్రమాణం 5 నుంచి 20 ఏళ్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రాణానికి ముప్పు వచ్చే అవకాశాలు 50 శాతం నుంచి 100 శాతం వరకు ఉంటాయి. సంగీత దర్శకుడు చక్రి విషయంలో జరిగిందిదే. కొందరు స్థూలకాయంతో ఆరోగ్య సమస్యలు ఏమొస్తాయిలే అనీ, ఒక వయసు తర్వాత పొట్ట రావడం మామూలే అని అనుకుంటారు. నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా లావెక్కిపోయి వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడమే అత్యంత ప్రమాదకరం. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టు కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తలో కొవ్వు శాతం పెరగడం (హైపర్లిపిడిమియా) వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. కాబట్టి పొట్ట పెరుగుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ను సంప్రదించాలి. ఒక వ్యక్తి స్థూలకాయుడా... కాదా అని నిర్ణయించడం ఎలా? సాధారణంగా ఒక వ్యక్తి స్థూలకాయుడా, కాదా అని నిర్ధారణ చేయడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ) అనే ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. దీన్ని కొలిచే పద్ధతి ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాములలో కొలవాలి. ఆ విలువను అతడి ఎత్తు స్క్వేర్తో భాగించాలి. స్క్వేర్ అంటే అదే సంఖ్యను మళ్లీ అదే సంఖ్యతో గుణించడం. ఈ ఎత్తు విలువను మీటర్లలో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 120 కిలోలు. అతడి ఎత్తు 1.7 మీటర్లు. అప్పుడు అతడి బీఎమ్ఐ విలువ ఎంత అంటే... 120 / 1.7 ్ఠ 1.7 = 41.52 కి.గ్రా/మీ2. ఇప్పుడు ఈ విలువను బీఎమ్ఐ పట్టికతో సరిపోల్చుకుని మీరు ఏ స్థూలకాయ స్థాయిలో ఉన్నారో నిర్ణయించుకోవచ్చు. బీఎమ్ఐ లెక్కించి మీ స్థూలకాయ స్థాయి ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పట్టికలోని విలువలను ప్రమాణంగా తీసుకోండి. స్థూలకాయ స్థాయి భారతీయుల బీఎమ్ఐ విదేశీయుల బీఎమ్ఐ సాధారణ బరువు 18.50 - 22.99 18.50 - 24.99 అధిక బరువు 23.00 - 24.99 25.00 - 29.99 స్వల్ప స్థూలకాయం 25.00 - 29.99 30.00 - 34.99 అధిక స్థూలకాయం 30 - ఆపైన 35.00 - 39.99 వ్యాధిగ్రస్థ స్థూలకాయం - 40.00 -49.99 సూపర్ స్థూలకాయం - 50.00 - 59.99 సూపర్ సూపర్ స్థూలకాయం - 60.00 - ఆపైన బీఎమ్ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మనం తక్కువ స్థూలకాయ స్థాయిలో ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి శరీరంలో ఎంత కొవ్వు నిలువ ఉండాలనే అంశాన్ని (సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్) అనేక హార్మోన్లు నిర్ణయిస్తాయి. ఇందులో జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్లయిన గ్రెలిన్, జీఎల్పీ-1 అనేవి ప్రధానమైనవి. ఈ సెట్ పాయింట్ అనేది మన మనసు అధీనంలో ఉండదు. గ్రెలిన్ జీర్ణాశయం పైభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. ‘జీఎల్పీ-1’ అనే హార్మోన్ చిన్న పేగు చివరిభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కొంతమంది తక్కువగా తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. ఇంకొంతమంది ఎక్కువగా తింటున్నప్పటికీ సన్నగానే ఉంటారు. దీనికి కారణం... లావుగా ఉన్నవారిలో కొవ్వు సెట్పాయింట్ ఎక్కువగానూ, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్పాయింట్ తక్కువగానూ ఉంటుందన్నమాట. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కొవ్వు సెట్పాయింట్ పెరుగుతుంది. ఇది ఒకసారి పెరిగితే మళ్లీ తగ్గదు. బీఎమ్ఐ 30 - ఆపైన ఉంటే... బీఎమ్ఐ 30 - ఆపైన ఉంటే (అంటే అధిక స్థూలకాయానికి చేరితే) కేవలం డైటింగ్, వ్యాయామం వంటి ప్రక్రియల ద్వారా శాశ్వతంగా బరువు తగ్గించుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి వారిలో నూటికి నలుగురు మాత్రమే డైటింగ్, వ్యాయామాలతో బరువు తగ్గించుకోగలరు. ఎందుకంటే కొవ్వు సెట్ పాయింట్ పెరిగిపోయింది కాబట్టి. బీఎమ్ఐ 30 - ఆపైన ఉన్న వ్యక్తి డైటింగ్, వ్యాయామాలను మొదలుపెట్టిన వెంటనే ‘కొవ్వు సెట్ పాయింట్’ను నియంత్రించే హార్మోన్లు శరీరంలో ప్రతికూల మార్పులను తీసుకొస్తాయి. ఆకలిని పెంచే గ్రెలిన్ స్రావాలు పెరుగుతాయి కాబట్టి ఆకలి పెరుగుతుంది. ఆకలిని తగ్గించే జీఎల్పీ-1 తగ్గుతుంది. జీవక్రియలు మందగిస్తాయి. కాబట్టి బీఎమ్ఐ 30 - ఆపైన ఉన్నవారు డైటింగ్, వ్యాయామం కారణంగా మొదట కొంచెం బరువు తగ్గినప్పటికీ హార్మోన్ల ప్రభావం వల్ల ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వ్యవధిలో కోల్పోయిన బరువు మళ్లీ పెరుగుతారు. మరి పరిష్కారం ఏమిటి...? డైటింగ్, వ్యాయామం కొవ్వు సెట్పాయింట్ని మార్చలేవు. అందువల్ల బీఎమ్ఐ 30 - ఆపైన ఉన్నవారిలో... అంటే అధిక, వ్యాధిగ్రస్త, సూపర్, సూపర్సూపర్ స్థూలకాయం ఉన్నవారిలో డైటింగ్, వ్యాయమాలు శాశ్వతంగా బరువు తగ్గించలేవు. ఇలాంటి వారిలో బరువును నియంత్రించడానికి ఔషధాల పాత్ర కూడా చాలా పరిమితమే. ఒకవేళ వాటిని వాడినా... ఆపివేయగానే మళ్లీ బరువు పెరిగిపోతుంది. కాబట్టి శాశ్వతంగా బరువు తగ్గడానికీ, స్థూలకాయంతో వచ్చే అనర్థాలైన గుండెపోటు, డయాబెటిస్, అధికరక్తపోటు వంటి వాటిని తగ్గించుకుని, ఆయుఃప్రమాణాన్ని పెంచుకోడానికి అనువైన మార్గం ఒక్క బేరియాట్రిక్ సర్జరీ మాత్రమే. అయితే బేరియాట్రిక్ సర్జరీలను అందరికీ చేయరు. భారతీయులలో బీఎమ్ఐ 30 - ఆపైన ఉండి, షుగర్ లాంటి జబ్బులు ఉంటే వారికి బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. ఒకవేళ షుగర్ లాంటి జబ్బులేమీ లేకపోయినా బీఎమ్ఐ 35 - ఆ పైన ఉన్నవారు బేరియాట్రిక్ సర్జరీకి అర్హులవుతారు. బేరియాట్రిక్ సర్జరీలో రకాలు... బేరియాట్రిక్ సర్జరీలలో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, డియోడినల్ స్విచ్ వంటి అనేక ప్రక్రియలు ఉన్నాయి. వీటిని లాపరోస్కోపిక్ ప్రక్రియలో చేస్తారు. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ : ఈ ప్రక్రియలో జీర్ణాశయంలోని 80 శాతాన్ని తొలగిస్తారు. మిగిలిన సంచి పరిమాణం 60-120 మి.లీ. కావడంతో, ఏ కొంచెం తిన్నా కడుపు నిండిపోతుంది. గ్యాస్ట్రిక్ బైపాస్: ఈ ప్రక్రియలో జీర్ణాశయం పైభాగాన్ని కత్తిరించి ఒక చిన్న సంచిలా తయారు చేస్తారు. చిన్నపేగు మధ్యభాగాన్ని కత్తిరించి దాన్ని నేరుగా ఈ సంచికి కలుపుతారు. ఈ శస్త్ర చికిత్సలో జీర్ణమయ్యే ఆహారం చిన్న పేగుల్లోని మొదటి భాగమైన ‘డియోడినమ్’లోకి కాకుండా నేరుగా చిన్నపేగు మధ్యభాగంలోకి ప్రవేశిస్తుంది. దాంతో జీర్ణమయ్యే ఆహారం పేగుల్లోకి ఇంకడం తగ్గి పోతుంది. డియోడినల్ స్విచ్: ఈ ప్రక్రియలో తొలుత స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసి, చిన్న పేగు మొదటి భాగమైన డియోడినమ్ను కత్తిరించి, నేరుగా చిన్నపేగు చివరి భాగానికి కలుపుతారు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఇతర ప్రయోజనాలు బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్న వారిలో బరువు తగ్గడమే కాకుండా డయాబెటిస్ (షుగర్), హైబీపీ వంటి సమస్యలూ నయమయ్యే అవకాశం ఉంది. డయాబెటిస్ను నయం చేయడానికి మరికొన్ని ఆధునిక బేరియాట్రిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. అవి...మినీ గ్యాస్ట్రిక్ బైపాస్: ఇందులో జీర్ణాశయం పైభాగాన్ని ఒక పొడుగాటి సంచిలా కత్తిరించి, దానిని నేరుగా చిన్న పేగు మధ్య భాగానికి కలుపుతారు. ఫలితంగా ఆహారం... జీర్ణాశయం, చిన్న పేగు పైభాగాలను బైపాస్ చేసుకొని చిన్నపేగు మధ్యభాగంలోకి చేరుతుంది. ఈ ప్రక్రియలో ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజ లవణాల లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విత్ లూప్ డియోడినో-జిజినల్ బైపాస్ : ఈ ప్రక్రియలో తొలుత స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసి, చిన్న పేగు మొదటి భాగమైన డియోడినమ్ను కత్తిరించి, నేరుగా చిన్నపేగు మధ్యబాగానికి కలుపుతారు. ఇందులో ఖనిజ-లవణాల లోపాలు రావడం చాలా అరుదు. స్థూలకాయం లేకపోయినా మధుమేహం ఉన్నవారికి... స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విత్ డియోడినో - ఇలియల్ ఇంటర్-పొజిషన్: ఇందులో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసి, డియోడినమ్ మొదటి భాగాన్ని కత్తిరిస్తారు. దీన్నీ, చిన్నపేగు మధ్య భాగాన్నీ కలుపుతూ జీఎల్పీ-1 తయారు చేసే ఇలియల్ సెగ్మెంట్ను అతికిస్తారు. బీఎమ్ఐతో సంబంధం లేకుండానే మధుమేహం సమస్యతో బాధపడేవారికి ఇది మంచి చికిత్స. చివరగా: స్థూలకాయంతో బాధపడేవారు అకస్మాత్తుగా గుండెపోటుతోనో లేదా హైబీపీ వంటి ఇతరత్రా సమస్యలతో చనిపోతే అది మరణానికి తక్షణ కారణం కావచ్చు. కానీ ఆ కారణానికి దారితీసిన పరిస్థితులు మాత్రం స్థూలకాయంతో వచ్చిన అనర్థాలే. అందుకే మీ బీఎమ్ఐని పరీక్షించుకుని, అవసరమైతే డైటింగ్, వ్యాయామాలు చేసి బరువు నియంత్రించుకోండి. ఒకవేళ మీ బరువు అధిక స్థూలకాయం కంటే ఎక్కువగా ఉంటే బేరియాట్రిక్ నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకోండి. సంగీత దర్శకుడు చక్రి విషాద ఉదంతంతోనూ మనలో చాలామంది అప్రమత్తమై మన జీవన ఆయుఃప్రమాణాన్ని పెంచుకోవచ్చు. డాక్టర్ వి. అమర్ మినిమల్ యాక్సిస్ మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, సిటిజన్స్ హాస్పిటల్, శేరిలింగంపల్లి, హైదరాబాద్ -
మర్చిపోకుండా చికిత్స!
నిర్ధారణ మతిమరుపును గుర్తించడానికి కొత్తగా పరీక్షలెందుకు... అనిపించడం సహజమే. కానీ శాస్త్రబద్ధంగా చికిత్స చేయాలంటే మతిమరుపును నిర్ధారించే పరీక్షలు చేయాల్సిందే. అవి ఏమిటంటే... * కుటుంబ చరిత్ర (రక్తసంబంధీకుల్లో ఎవరికైనా అల్జీమర్స్ ఉందేమోననే వివరాలు), ఆహారపు అలవాట్లు, మద్యపానం, ఇతర అనారోగ్యాలకు ఏవైనా మందులు వాడుతుంటే ఆ మందుల వివరాలను పరిశీలిస్తారు. రక్తపోటు, గుండె, ఊపిరితిత్తులు కొట్టుకునే వేగాన్ని గమనిస్తారు. సాధారణ ఆరోగ్యవివరాలను తెలుసుకుంటారు. వీటితోపాటు రక్తం, మూత్ర పరీక్షలు చేస్తారు. * కండరాల శక్తిని, కంటి కదలికలు, మాట, స్పర్శ, చర్యకు ప్రతిచర్యలు ఎలా ఉన్నాయనేది గమనిస్తారు. * నరాల వ్యాధి నిపుణులు... పార్కిన్సన్స్ (చేతులు, మెడ వణకడం), మెదడులో కణుతులు, మెదడులో నీరు చేరడం, జ్ఞాపకశక్తిని తగ్గించే ఇతర అనారోగ్యాలు, పక్షవాతం వంటివి ఉన్నాయేమోనని పరీక్షిస్తారు. సి.టి.స్కాన్, ఎమ్ఆర్ఐ పరీక్షలు చేసి బ్రెయిన్ ఇమేజింగ్ స్టడీ చేస్తారు. * మెంటల్ స్టేటస్ టెస్ట్లు... చిన్న చిన్న లెక్కలను పరిష్కరించడం, ఒక విషయాన్ని విడమరిచి చెప్పడం, రోగి చేత ఆ రోజు తేదీ, సమయం, తాను ఎక్కడున్నాననే వివరాలు చెప్పించడం, కొన్ని పదాల పట్టిక ఇచ్చి వాటిని తిరిగి చెప్పించడం వంటి పరీక్షలు చేస్తారు. * ఇంతగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మతిమరుపు ఉన్నట్లు నిర్ధారించి తగిన వైద్యం చేస్తారు. -
ఈ వ్యాధులున్నాయా... ఓ కన్నేయండి..!
అప్పటివరకూ మనకు ఎలాంటి వ్యాధీ లేదనుకుంటాం... ఏదో పరీక్ష చేయించుకోవడానికి వెళితే షుగర్ ఉన్నట్లు తేలుతుంది. అంతే... వెంటనే డాక్టర్ ఎందుకైనా మంచిదంటూ మరికొన్ని పరీక్షలతో పాటు కంటి పరీక్ష విధిగా చేయిస్తారు. అలాగే ఎందుకో అనుకోకుండా రక్తపోటు చూపించుకుంటారు. ఉండాల్సినదాని కంటే అది చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు పరీక్షల తర్వాత... రక్తపోటు ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యాక... డాక్టర్లు ముందుగా మూత్రపిండాలనూ, తర్వాత కంటినీ పరీక్షించి అక్కడి రక్తనాళాలు బాగున్నాయా, లేదా అని చూస్తారు. ఇలా... వచ్చిన వ్యాధి గుండెపోటు నుంచి మైగ్రేన్ వంటి తలనొప్పి వరకు ఏదైనప్పటికీ... కంటిపై అది తన దుష్ర్పభావాన్ని చూపవచ్చు. అందుకే, కొన్ని వ్యాధులు ఉన్నవారు విధిగా కన్ను విషయంలోనూ జాగ్రత్త వహించాలి. చాలా మందికి అంతగా తెలియని ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతూ తమ కళ్లను రక్షించుకునేందుకు ఉపకరించేదే ఈ ప్రత్యేక కథనం... మనలో ఎన్నో కణాలుంటాయి. ఆ కణాలన్నీ కలిసి కణజాలంగా ఏర్పడతాయి. ఆయా కణజాలాలు కొన్ని విధులు నిర్వహించడానికి ప్రత్యేకంగా కొన్ని అవయవాలుగా ఏర్పడతాయి. ఆ అవయవాలు ఒక వ్యవస్థలా రూపొంది కొన్ని జీవక్రియలు నిర్వహిస్తుంటాయి. మనకు ఏదైనా వ్యాధి వచ్చిందంటే చాలా సందర్భాల్లో అది ఆ అవయవానికో, ఆ అవయవం నిర్వహించే జీవవ్యవస్థకో పరిమితమవుతుందని అనుకుంటాం. ఉదాహరణకు థైరాయిడ్ అనే అవయవానికి ఏదైనా జబ్బు వస్తే అది థైరాయిడ్కే పరిమితం కాదు. అలాగే రక్తప్రసరణ వ్యవస్థలో ఏదైనా హెచ్చుతగ్గులు ఏర్పడితే అది అంతవరకే తన ప్రభావం చూపదు. కంటి మీదా దాని దుష్ర్పభావం కనిపించవచ్చు. అలా కంటిపై ప్రభావం కనిపించేందుకు ఆస్కారం ఉన్న కొన్ని జబ్బులు, వ్యవస్థలూ, ఆరోగ్య పరిస్థితులు ఉదాహరణకు... డయాబెటిస్ రక్తపోటు థైరాయిడ్ రక్తహీనత (అనీమియా) కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కొన్ని ట్యూమర్లు (గడ్డలు) కొన్ని రకాల ఆనువంశిక (హెరిడిటరీ) వ్యాధులు కొన్ని రకాల మందులు హార్మోన్లలో వచ్చే అసమతౌల్యతలు కొన్ని విటమిన్లు అధికంగా తీసుకోవడం... ఇవన్నీ కంటిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే కొన్ని వ్యాధులున్నవారు, కొన్ని మందులు, విటమిన్ సప్లిమెంట్లు తీసుకునేవారు విధిగా ఆ మందుల వల్ల కంటిపై దుష్ర్పభావం కలుగుతుందా అని అడిగి తెలుసుకోవాలి. అంతేకాదు కొన్ని లక్షణాలేమైనా కనిపించినప్పుడు విధిగా కంటి డాక్టరునూ సంప్రదించాలి. సోరియాసిస్ సోరియాసిస్ వ్యాధిలో చర్మం పొడిబారి పొట్టు రాలుతున్నట్లుగా ఉంటుంది. మన రోగ నిరోధకశక్తి మనకే ప్రతికూలంగా పనిచేయడంతో పాటు మరికొన్ని కారణాలతో వచ్చే ఈ జబ్బులో కన్ను కూడా ప్రభావితమవుతుంది. ఈ జబ్బు ఉన్నవాళ్లలో రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్ల్కెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్) కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్), కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం (కంజెంక్టివైటిస్), కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి లక్షణాలు కనిపించవచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... సోరియాసిస్కు ఇప్పుడు గతంలో కంటే అధునాతనమైన చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనే ఆధునిక తరహా చికిత్సలు. వీటిని తీసుకుంటూనే ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి. మియస్థేనియా గ్రేవిస్ ఇది నరాలకు, కండరాలకు వచ్చే జబ్బు. ఈ జబ్బు వల్ల కండరాలు క్రమంగా తమ శక్తిని కోల్పోయి ఒక దశలో పూర్తిగా చచ్చుబడిపోయినట్లుగా మారిపోతాయి. శక్తిహీనంగా తయారవుతాయి. ఈ వ్యాధి వల్ల కలిగే దుష్ర్పభావంతో చూపు కూడా దెబ్బతింటుంది. కంటిపై ఈ వ్యాధి కనబరిచే దుష్ర్పభావాలు... పై కనురెప్ప గాని లేదా కింది కనురెప్పగానీ వ్యక్తి ప్రమేయం లేకుండా దానంతట అదే మూసుకుపోవడం (టోసిస్) ఒకే వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం (డిప్లోపియా) పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... మియస్థేనియా గ్రేవిస్ జబ్బు ఉన్న వారు దాన్ని నియంత్రించుకునేందుకు... డాక్లర్లు సూచించిన స్టెరాయిడ్స్ క్రమం తప్పకుండా వాడాలి. ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనే మందులను వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మైగ్రేన్ ఇది ఒక రకం తలనొప్పి. మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి) ఉన్నవారిలో కంటికి సంబంధించి కనిపించే లక్షణాలు ఏమిటంటే... చూపు మసకగా అనిపించడం ఒక పక్క కన్నుగుడ్డులో తీవ్రమైన నొప్పి తాత్కాలికంగా చూపు తగ్గడం లేదా తాత్కాలికంగా ఏమీ కనిపించకపోవడం కంటి కండరాలకూ, కనురెప్పలకూ తాత్కాలికంగా పక్షవాతం రావడం. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... కొన్ని రకాల అంశాలు మైగ్రేన్ తలనొప్పిని తక్షణం ప్రేరేపిస్తాయి. ఉదా: కొన్ని రకాల సుగంధద్రవ్యాల వాసన లేదా అగరొత్తుల వంటి వాసనలు మైగ్రేన్ను ప్రేరేపించి తక్షణం తలనొప్పి వచ్చేలా చేస్తాయి. ఈ అంశాలను ‘ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్’ అంటారు. తమకు ఏ అంశం వల్ల అది వస్తుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. మైగ్రేన్కు డాక్టర్లు రెండు రకాల చికిత్సలు చేస్తారు. మొదటిది... తక్షణమే నొప్పి తగ్గేందుకు చేసే చికిత్స. రెండోది... దీర్ఘకాలంలో ఈ నొప్పి మళ్లీ మళ్లీ రాకుండా నివారించేందుకిచ్చే మందులతో చేసే చికిత్స. ఈ మందులను క్రమం తప్పకుండా వాడాలి. డయాబెటిస్ ఇటీవల మన సమాజంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి ఇది. పైగా ఈ వ్యాధి ఉన్నవారిలో కనీసం 20 శాతం మందిలో కంటిపై దాని తాలూకు దుష్ర్పభావం కనిపించే అవకాశం ఉంది. మధుమేహం వల్ల కంటికి వచ్చే వ్యాధులివే... డయాబెటిక్ రెటినోపతి: రెటీనా అనే కంటి వెనక ఉండే తెరపై పడే ప్రతిబింబం నుంచి మెదడుకు సిగ్నల్స్ అందడం వల్లనే మనకు చూపు అనే జ్ఞానం కలుగుతుందన్న విషయం తెలిసిందే. డయాబెటిస్ కారణంగా రక్తనాళాలు మొద్దుబారడం వల్ల రెటీనాకు అందాల్సినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందక క్రమంగా రెటీనా తన పనితీరును కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల దృష్టిలోపం కూడా రావచ్చు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. వాటి నరాలు స్పందనలు కోల్పోతున్నాయా అన్న అంశాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. గ్లకోమా: డయాబెటిస్ ఉన్నవారికి కంట్లో నల్లముత్యం లేదా నీటికాసులు అని పిలిచే గ్లకోమా రావచ్చు. కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ఒత్తిడి పెరిగి మనకు కనిపించే దృష్టి విస్తృతి క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా గ్లకోమా కండిషన్ ఉత్పన్నమైందా అన్న విషయం తెలుసుకోడానికి కంటి డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటరాక్ట్: కంట్లోని లెన్స్ పారదర్శకతను కోల్పోయే స్థితిని క్యాటరాక్ట్ అంటారన్న విషయం తెలిసిందే. డయాబెటిస్ ఉన్నవారిలో క్యాటరాక్ట్ వచ్చే అవకాశమూ ఉన్నందున సంబంధిత పరీక్షలూ చేయించుకోవాలి. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవాళ్లకు క్యాటరాక్ట్ పదేళ్ల ముందే వస్తుంది. ఆప్టిక్ న్యూరోపతీ: డయాబెటిస్ వల్ల నరాలు మొద్దుబారి తమ చైతన్యాన్ని కోల్పోతాయన్న విషయం తెలిసిందే. మిగతా నరాల విషయం ఎలా ఉన్నా చూపును ప్రసాదించే ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే జీవితం అంధకారమయ్యే ప్రమాదముంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పక కంటిపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెరపాళ్లను జాగ్రత్తగా నియంత్రించుకోవాలి క్రమం తప్పకుండా మందులు వాడాలి కంటి డాక్టర్నూ సంప్రదిస్తూ ఉండాలి అవసరాన్ని బట్టి లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. అధిక రక్తపోటు అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్నవారిలో అకస్మాత్తుగా చూపు మసకబారవచ్చు. లేదా చూపు కనిపించకపోవచ్చు. దీనికి అనేక కారణాలుంటాయి. రక్తపోటు కారణంగా... రెటీనాకు సంబంధించిన కేంద్ర రక్తనాళం (సిర) లేదా ఏదైనా రక్తనాళపు శాఖలో రక్తం గడ్డకట్టి అడ్డుపడవచ్చు. రెటీనాకు సంబంధించిన ప్రధాన ధమని లేదా ధమని శాఖలో రక్తం గడ్డకట్టి అడ్డుపవచ్చు. ఆప్టిక్ న్యూరోపతి అనే నరాల సంబంధమైన సమస్య రావచ్చు. కన్నులోని ఒక భాగమైన విట్రియల్ ఛేంబర్లో రక్తస్రావం కావచ్చు గ్లకోమా కూడా రావచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... రక్తపోటు ఉన్నవారు బీపీని అదుపులో పెట్టుకోవాలి ఉప్పు, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి కంటికి సంబంధించిన సమస్య వస్తే మందులు వాడటం లేదా లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. థైరాయిడ్ సమస్య గొంతు వద్ద ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకెళ్లే నాళం చుట్టూ ఉండే ప్రధాన గ్రంథి థైరాయిడ్. ఇది స్రవించే హార్మోన్ కారణంగా మన శరీరంలోని అనేక జీవక్రియలు సజావుగా జరుగుతాయి. దీనిలో ఏదైనా లోపం ఏర్పడితే దాని దుష్ర్పభావం కంటిపైనా పడవచ్చు. అప్పుడు కనిపించే లక్షణాలివే... కన్నుగుడ్డు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా కనిపించడం (ప్రాప్టోసిస్) ఒకే వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం (డిప్లోపియా) కంటికి రంగులను చూసే శక్తి క్షీణించడం (డిఫెక్టివ్ కలర్ విజన్) కన్ను పూర్తిగా పొడిబారిపోవడం (డ్రై ఐ) కార్నియాకు సంబంధించిన సమస్యలు రావచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... థైరాయిడ్ సమస్య ఉన్నవారు డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి అవసరాన్ని బట్టి స్టెరాయిడ్స్ తీసుకోవాలి కొన్ని ఇమ్యునో సప్రెసెంట్స్ వాడాలి అవసరాన్ని బట్టి రేడియోథెరపీ తీసుకోవాల్సిరావచ్చు. తప్పని పరిస్థితుల్లో ఆర్బిటోటమీ అనే శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చు. డిస్లిపిడేమియా రక్తంలో ఉండే కొన్ని రకాల కొవ్వు పదార్థాలు (ఉదా: కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ వంటివి) ఉండాల్సిన పాళ్లలో కాకుండా వేర్వేరు విలువలతో ఉండటం వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ కంటిచూపును ప్రభావితం చేసే అవకాశం ఉంది. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... కొవ్వులు అతి తక్కువగా ఉండి, పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి తమలోని కొవ్వులు దహనం అయ్యేలా వ్యాయాయం చేయాలి కొవ్వులను తగ్గించే మందులను వాడాలి. రక్తహీనత శరీరంలో దాదాపు ఐదు లీటర్ల వరకు రక్తం ఉంటుంది. రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలే శరీరంలోని అన్ని కణాలకూ అవసరమైన ఆక్సిజన్ను మోసుకెళ్తుంటాయి. ఈ ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువగా ఉండే కండిషన్ను రక్తహీనత (ఎనీమియా) అంటారు. కొందరిలో ఎర్రరక్తకణాల సంఖ్య తగినంతగా ఉన్నా ఆక్సిజన్ను మోసుకుపోయే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండవచ్చు. ఇలా రక్తహీనత ఉన్నవారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. రెటీనాపై రక్తస్రావం (రెటినల్ హేమరేజ్) కంటిలోని లెన్స్ పారదర్శకత కోల్పోవడం నరాల సమస్య వంటివి కనిపిస్తాయి. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... ఎనీమియాను తగ్గించే ఐరన్ టాబ్లెట్లు / మందులు వాడడం విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం. గుండెజబ్బులు కొన్ని రకాల గుండెజబ్బులు (కార్డియో వ్యాస్క్యులార్ డిసీజెస్) కూడా కంటిపై తన దుష్ర్పభావాన్ని చూపవచ్చు. దీని వల్ల కింద పేర్కొన్న ఈ లక్షణాలు కనిపించవచ్చు. అకస్మాత్తుగా చూపు కనిపించకపోవడం తాత్కాలికంగా చూపు కోల్పోవడం కంటి చూపునకు దోహదపడే నరానికి (ఆప్టిక్ నర్వ్కు) సంబంధించిన సమస్యలు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... అసలు సమస్యకు చికిత్స చేయించు కోవ డమే... గుండెజబ్బుల కారణంగా వచ్చే కంటి సమస్యలకు కూడా పరిష్కారం. అలాగే, దీనితో పాటు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్ కొలాజెన్ అనేది శరీరంలోని ఒక రకం ప్రోటీన్లతో కూడిన కణజాలం. మన రోగనిరోధక శక్తి మన కణజాలాన్నే శత్రువుగా పరిగణించి కొలాజెన్ అనే మన ప్రొటీన్లపై దాడి చేయడం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. వాటన్నింటినీ కలిపి కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్గా అభివర్ణిస్తారు. ఆ వ్యాధులు ఏమిటంటే... సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ) కీళ్లనొప్పులు (జాయింట్ పెయిన్స్) రుమటాయిడ్ ఆర్థరైటిస్ వెజెనెర్స్ గ్రాన్యులొమాటోసిస్ వంటి వ్యాధులు అన్నమాట. ఎస్ఎల్ఈ (లూపస్): లూపస్ అంటే ఉల్ఫ్ (తోడేలు) అని అర్థం. ముఖం మీద ముక్కుకు ఇరువైపులా మచ్చతో కనిపించే వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని సిస్టమిక్ లూపస్ అరిథమెటోసస్ (ఎస్ఎల్ఈ) అని చెబుతారు. లక్షణాలు ముక్కుపై నుంచి చెంపల పైన ఇరువైపులా మచ్చల్లా కనిపించే దద్దుర్ల (ర్యాష్) లాగా వస్తుంది. సూర్యకాంతి ప్రతిస్పందన (ఫోటో సెన్సిటివిటీ)తో ఈ ర్యాష్ మరింత పెరగవచ్చు. కాళ్లూ చేతులకు సంబంధించిన రెండు మూడు కీళ్లలో వాపు వస్తుంది. రుమటాయిడ్ జబ్బుల్లోలా లూపస్లో జాయింట్స్ వాపు వచ్చి జాయింట్స్ ఒంగిపోతాయి. అయితే... రుమటిజంలో లాగా ఈ ఒంపు వల్ల శాశ్వత అంగవైకల్యం రాదు. ఇలా కీళ్లు ఒంగిపోవడం అన్నది తాత్కాలికంగానే జరుగుతుంది. కొందరిలో డిప్రెషన్ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. వీరి సమస్యను మానసికమైన లేదా నరాలకు సంబంధించినదిగా పొరబాటుపడే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లలో ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి- లూపస్ వల్ల మెదడుపై ఏదైనా దుష్ర్పభావం పడిందేమో పరీక్షించాలి. కొందరిలో ఫిట్స్ కూడా రావచ్చు. పై వ్యాధి వల్ల కంటికి జరిగే దుష్పరిణామం ఏమిటంటే... అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరిగి (హేమరేజిక్ రెటినైటిస్) అంధత్వానికి దారితీయవచ్చు. కొందరిలో కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉండవచ్చు. కొందరిలో జుట్టు రాలిపోవచ్చు. మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. వీటన్నింటితో పాటు కళ్లకు సంబంధించి కన్ను పొడిబారడం (డ్రై ఐ), రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్), స్క్లెరా పొరకు ఇన్ఫ్లమేషన్, కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్) వంటి సమస్యలు రావచ్చు. పిల్లల్లోనూ... పిల్లల్లోనూ లూపస్ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అని అంటారు. పిల్లల్లో జ్వరం వచ్చి రెండు మూడు కీళ్లలో వాపు రావడం ద్వారా ఇది కనిపిస్తుంది. ఎండను చూడలేక బాధపడుతుండే పిల్లల విషయంలో జువెనైల్ లూపస్ ఉందేమోనని అనుమానించి పరీక్షలు చేయించడం ముఖ్యం. పిల్లల్లో వచ్చినప్పుడు (నియోనేటల్ లూపస్)- పుట్టుకతోనే గుండె కవాటాలలో లోపం (కంజెనిటల్ హార్ట్ బ్లాక్) రావచ్చు. ఇలా పిల్లల్లో లూపస్ వస్తే అది కళ్లపై దుష్ర్పభావం చూపుతుంది కాబట్టి స్కూళ్లకు వెళ్లే వయసు పిల్లల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్యపరీక్షలు, కంటి పరీక్షలు (మాక్యులార్ టెస్ట్) చేయించడం మంచిది. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... ప్రధానమైన సమస్యలైన ఎస్ఎల్ఈ, కీళ్లనొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి చికిత్స తీసుకోవడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలకూ తగిన చికిత్స తీసుకోవాలి. ఇక పిల్లల్లో జువెనైల్ సిస్టమిక్ లూపస్ను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ పిల్లలందరికీ కంటివైద్యుల ద్వారా తరచూ పరీక్షలు చేయించడం కూడా ఒక మంచి ఆలోచనే. పోషకలోపాలు మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు అనే పోషకాలు లోపించడం వల్ల కూడా కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి. అందుకే ఆయా విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. లేదా అన్ని విటమిన్లూ అందేలా సమతులాహారాన్ని తీసుకోవడం మంచిది. విటమిన్ లోపం- ఏర్పడే సమస్య విటమిన్ ఏ- కన్ను పొడిబారడం, రేచీకటి, అంధత్వం (కార్నియల్ బ్లైండ్నెస్) విటమిన్ బి1- కార్నియల్ అనస్థీషియా, కార్నియల్ డిస్ట్రొఫీ విటమిన్ బి2- చూపు మసక బారడం, ఫొటో ఫోబియా (వెలుగు చూడలేకపోవడం), కంజెంక్టివా పొరపై దురదలు, మంటలు విటమిన్ సి- కంజెంక్టివా పొరలో రక్తస్రావం, కనురెప్పలు, రెటీనా సమస్యలు. విటమిన్ డి- జోన్యులార్ క్యాటరాక్ట్, ఆప్టిక్ నర్వ్ వాపు చివరగా... పైన పేర్కొన్న వ్యాధులేగాక రకరకాల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్, పరాన్నజీవుల కారణంగా వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కళ్లు ప్రభావితమవుతాయి. ఇందులో అతి ముఖ్యమైనది - ఎయిడ్స్ వల్ల కంటిపై పడే దుష్ర్పభావం. అందుకే ఏదైనా బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, పరాన్నజీవుల (పారసైటిక్) ఇన్ఫెక్షన్ తర్వాత ఒకసారి కంటి డాక్టర్తో కూడా పరీక్ష చేయించుకోవడం మేలు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
సెల్యులైటిస్: ఈ ఎరుపూ, మెరుపూ డేంజరే!
చర్మానికి సోకే ఒక తరహా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో సెల్యులైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఈ కండిషన్లో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, ఎర్రగా కనిపిస్తూ, ముట్టుకుంటేనే నొప్పి (టెండర్నెస్)ని కలిగిస్తూ బాధాకరంగా మారిపోతుంది. ఇది కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఒకవేళ ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే మొదట కాలుకి మాత్రమే పరిమితమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరమంతటికీ పాకి ప్రాణాపాయానికి దారితీస్తుంది. కాబట్టి సెల్యులైటిస్ లక్షణాలు కనిపించినప్పుడు తక్షణం తప్పనిసరిగా తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సెల్యులైటిస్, దాని లక్షణాలు, దానివల్ల కలిగే పరిణామాల వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. సెల్యులైటిస్ సోకగానే కాలు బాగా వాచి, ఎర్రబారి (ఎరిథిమా), ముట్టుకుంటే మంట (ఇన్ఫ్లమేషన్)తో, లోపల వేడిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా ఇన్ఫ్లమేషన్తో సెల్యులైటిస్ కనిపించిందంటే అది కాస్త తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అంటే అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించినకొద్దీ సెల్యులైటిస్లోని ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంతో కలిసి లింఫ్నోడ్స్కూ వ్యాపిస్తుంది. సెల్యులైటిస్ కనిపించే సూక్ష్మక్రిములివే... నిజానికి సెల్యులైటిస్ అన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. కానీ ప్రధానంగా శరీరంలోని కింది భాగమైన కాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. సెల్యులైటిస్ సోకిన కాలు ఎర్రగా నునుపుదనంతో మెరుస్తూ కనిపిస్తుంది. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరి, అది సెకండరీ కండిషన్లో సెల్యులైటిస్కు దారితీవయచ్చు. ఇందుకు చాలారకాలైన సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) దోహదపడతాయి. అవి... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్ ఎస్పీపీ, బ్యాక్టీరియోడీస్ వంటివి ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధానమైన రకాలూ ఉన్నాయి. సెల్యులైటిస్ ఎలా వస్తుంది? సాధారణంగా మన చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ మనకు రక్షణ కలిగిస్తుందన్న విషయం తెలిసిందే. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలుగాని, చీరుకుపోయి గాని ఉన్నప్పుడు ఆ ప్రాంతం నుంచి బయటి సూక్ష్మజీవులు చర్మాన్ని దాటి లోపలి భాగాలకు వెళ్లగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియాపెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశిస్తుంది. దాంతో వెంటనే చర్మం తనను తాను రక్షించుకునే వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్)లో భాగంగా ఎర్రబారుతుంది. అది క్రమంగా సెల్యులైటిస్కు దారితీస్తుంది. లక్షణాలు ఏ చర్మపు రంగు మారడం: సెల్యులైటిస్ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. దాంతో అప్పటికే ఎర్రటి చర్మం కలవారు కొందరిలో దీన్ని గుర్తుపట్టడం కష్టమవుతుంది. అదే నల్లటి చర్మం కలవారిలో ఈ రంగు కారణంగా దీన్ని వెంటనే గుర్తుపట్టి, తగిన చికిత్స చేయడానికి వీలవుతుంది. వాపు: సాధారణంగా కాలివాపు పాదం నుంచి మొదలై పైకి వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలవుతుంది. ఏ కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది నునుపుదనాన్ని ఆపాదించుకుని మెరుస్తూ కనిపిస్తుంది. వాపుకారణంగా చర్మం బాగా బిగుసుకుపోయినట్లుగా ఉంటుంది. ఏ ముట్టుకుంటే మంట, నొప్పితో పాటు ఆ ప్రాంతంలో లోపల వేడిగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఏ ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలు, చలితో కూడిన జ్వరం వచ్చినట్లుగా అనిపించడం కూడా కనిపించవచ్చు. ఏ రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనడానికి సూచన. ఏ వాచిన కాలి భాగంలో ఉన్న పుండ్ల నుంచి పసుపు రంగుతో చీము స్రవిస్తుంటుంది. సెల్యులైటిస్కు దారితీసే పరిస్థితులు ఏ చర్మానికి గాయమై, అది దీర్ఘకాలికంగా ఉండటం. చర్మం చీరుకుపోయి ఆ గాయం చాలాకాలంగా మానకుండా ఉండటం. కాలికి పుండ్లు. ఏ కాలికి దీర్ఘకాలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి, అవి మానకుండా ఉండటం (ప్రధానంగా అథ్లెట్స్ ఫూట్ వంటివి) ఏ డయాబెటిస్ ఉన్నవారికి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు (వేరికోసిక్ వెయిన్స్ వంటివి) ఏ పెరిఫెరల్ వ్యాస్కులార్ డిసీజ్ వంటి జబ్బులు ఏ శరీరంలో లింఫ్ ప్రవాహం తగినంతగా లేకపోవడం ఏ దీర్ఘకాలికంగా కాలేయ జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో (క్రానిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్ కనిపించే అవకాశాలెక్కువ) ఏ స్థూలకాయంతో బాధపడేవారిలో ఏ ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ ఏచర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్- ఉదాహరణకు చికెన్పాక్స్, షింగిల్స్ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఏ దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా సెల్యులైటిస్ రావచ్చు ఏ ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కూడా ఒక్కోసారి సెల్యులైటిస్కు కారణం కావచ్చు. ఏ కాలిన గాయాలు చాలా సందర్భాల్లో సెల్యులైటిస్కు దారితీస్తాయి. ఏ చర్మంలో మనం ప్రవేశపెట్టే సూదులు (ఇంట్రావీనస్గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా), ట్యూబ్స్, ఆర్థోపెడిక్ కేసుల్లో చర్మం లోపల అమర్చే వస్తువుల వంటి వాటితో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏ చర్మంలోపల ఉండే ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల. ఏ కొన్ని కీటకాల కాటు తర్వాత (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల కూడా సెల్యులైటిస్ ప్రమాదం ఉంటుంది ఏ దీర్ఘకాలికంగా మందులు వాడుతూ ఉన్నవారిలో స్వాభావికంగా ఉండే వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడంతో సెల్యులైటిస్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. ఒకసారి సెల్యులైటిస్ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్’గా అభివర్ణిస్తారు. ఈ దశలో సెల్యులైటిస్కు సరైన చికిత్స తీసుకోకపోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్కు చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్ సెల్యులైటిస్ అంటారు. ఇక సెల్యులైటిస్ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూ పోతుంటే దాన్ని అసెండింగ్ సెల్యులైటిస్ అంటారు. మామూలుగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇది జరుగుతుంది. సాధారణంగా సెల్యులైటిస్ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటుంది. దీన్ని యూనిలేటరల్ సెల్యులైటిస్గా పేర్కొంటారు. అయితే రెండుకాళ్లకూ సెల్యులైటిస్ కనిపించడం ఒకింత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్ రావడాన్ని ‘బైలేటర్ కాంకరెంట్ సెల్యులైటిస్’ అంటారు. సాధారణంగా మన కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్ వస్తుంటుంది. నివారణ / చికిత్స ఒకసారి సెల్యులైటిస్ కనిపించాక దానికి చికిత్స చేయడమే మార్గం. అది రాకముందే కొన్ని జాగ్రత్తలతో దాన్ని నివారించుకోవచ్చు. ఉదాహరణకు కాలిపై ఎలాంటి దీర్ఘకాలికమైన గాయాలు, రంధ్రాలు, పుండ్లు లేకుండా చూసుకోవడం అవసరం. ఒకవేళ అలాంటివేవైనా ఉంటే అవి తగ్గేలా ముందే చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది సెల్యులైటిస్కు దారితీయవచ్చు. ఏ చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం (డ్రై స్కిన్): చర్మాన్ని ఆరోగ్యంగా, పొడిగా ఉంచుకోవడం వల్ల వీలైనంతగా సెల్యులైటిస్ను నివారించవచ్చు. సాఫ్ట్ పారఫిన్ను, లిక్విడ్ పారఫిన్ను సగం, సగం పాళ్లలో కలిపి, చర్మానికి ప్రధానంగా కాళ్లకు రాసుకోవడం వల్ల చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ఇలాంటి చర్యలతో సెల్యులైటిస్ను నివారించవచ్చు. ఏ వాచిన కాలిని కాస్త ఎత్తున ఉండేలా జాగ్రత్త తీసుకోవడం: మనం పడుకున్న సమయంలో సెల్యులైటిస్తో వాపు వచ్చిన కాలిని శరీర భాగం కంటే కాస్త ఎత్తున ఉండేలా చేయడటం ద్వారా కాస్త ఉపశమనం లభిస్తుంది. ఏ యాంటీబయాటిక్స్తో చికిత్స: స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ బ్యాక్టీరియాను తుదముట్టించే యాంటీబయాటిక్స్ మందులను నోటి ద్వారా తీసుకునేలా చేయడం లేదా నరానికి ఇంజెక్షన్ ద్వారా పంపితో చికిత్స చేస్తారు. ఏ వ్యాయామం: వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం. సెల్యులైటిస్ అన్నది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు కాబట్టి అది వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం కంటే చిన్న చిన్న జాగ్రత్తలతో అసలు రాకుండానే చూసుకోవడం చాలా మంచిది. నిర్వహణ: యాసీన్ కొన్ని జాగ్రత్తలు సెల్యులైటిస్ రాకుండా నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ కాలికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి ఏ కాలికి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా కాలి వేళ్లకు గోళ్లు తొలగించే సమయంలో గాయాలు కాకుండా చూసుకోవాలి ఏ కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్ మాత్రమే ధరించాలి. గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్ను బలవంతంగా ధరించకూడదు. షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి చేస్తుంటే ఆ పాదరక్షలను విసర్జించి, సౌకర్యంగా ఉండే వాటిని ఎంచుకోవాలి. అంతేతప్ప ఎంతో డబ్బుపోసి కొన్నాం కదా అని వాటినే బలవంతంగా ధరించడాన్ని కొనసాగించకూడదు. పాదరక్షల వల్ల కాలికి ఏదైనా గాయాలవుతున్నాయేమో తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పైన పేర్కొన్న లాంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కీటకాలు, జంతువులు కుట్టకుండా/కరవకుండా జాగ్రత్త వహించాలి. కాలిన గాయాలు అయినప్పుడు అవి పూర్తిగా తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలి. కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైనవారు మురికినీళ్లలోకి వెళ్లకూడదు. గాయమైన భాగాన్ని సముద్రపు నీటిలో ముంచకూడదు. అథ్లెట్స్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్కు, అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్కు తగిన చికిత్స తీసుకుని అవి పూర్తిగా తగ్గేలా చూసుకోవాలి. మనదేశంలో దీర్ఘకాలికంగా ఉండే వేరికోస్వెయిన్స్కు చికిత్స తీసుకోకుండా ఉండటం మామూలే. ఈ పరిస్థితి ఉన్నవారు తప్పనిసరిగా చికిత్స తీసుకుని, సెల్యులైటిస్ వంటి రిస్క్ను తగ్గించుకోవాలి.