ESI Hospital
-
Korutla: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
కోరుట్ల: నాలుగేళ్లలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది కోరుట్లకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బెజ్జారపు వేణు–మాధవిల కూతురు మౌనిక. ఆమె 2013లో ఎం.ఫార్మసీలో గోల్డ్మెడల్ సాధించింది. మౌనిక వివాహం సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేఖర్తో జరిగింది. అనంతరం మళ్లీ చదువుపై దృష్టిపె ట్టి, 2019లో వీఆర్వో ఉద్యోగం సాధించింది. ఆ జాబ్ చేసూ్తనే అదే ఏడాది ఫార్మసిస్ట్ పోస్టుకు ఎంపికైంది. ప్రస్తుతం హై దరాబాద్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్గా పని చేస్తోంది. 2022 డిసెంబర్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకుంది. 6 నెలల కష్టపడి చదివి, పరీక్ష రాయగా శుక్రవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. ఆమె రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. తన భర్త శేఖర్ ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఉద్యోగాలు సాధించానని తెలిపింది. -
కాకినాడలో శరవేగంగా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం
-
ESI Hospital: రోగి సహాయకురాలిపై ఈఎస్ఐ క్యాంటిన్ సిబ్బంది లైంగికదాడి
హైదరాబాద్: ఈఎస్ఐసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి సహాయకురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. బీహెచ్ఈఎల్ ఆర్సీ పురానికి చెందిన యువకుడు అనారోగ్యంతో సనత్నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కళాశాల బోధన ఆసుపత్రిలో చేరాడు. అతడికి సహాయంగా అతడి సోదరి(19) అక్కడే ఉంటూ సేవలు అందిస్తోంది. ఈ నెల 16న రాత్రి భోజనం చేసేందుకు క్యాంటిన్కు వచ్చి తిరిగి వార్డుకు వెళుతుండగా క్యాంటీన్లో పనిచేసే షాబాబ్ (33) అనే వ్యక్తి ఆమెను వెంబడించి ల్యాబ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు షాబాద్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ఈఎస్ఐ ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడ్డ యువకుడి అరెస్ట్
హైదరాబాద్: ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ రోగి సోదరిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిఫ్ట్లో ఆమెను బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు షాబాద్ అనే యువకుడు. మూడు రోజుల నుంచి పరారీలో ఉన్న షాబాద్ను ఎస్ఆర్ నగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తన సోదరుడి చికిత్స కోసం కర్ణాకట నుంచి ఈఎస్ఐ ఆసుపత్రికి యువతి రాగా, అక్కడ ఈ దారుణం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల యువతి.. సోదరుడు జారి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే అతన్ని నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేర్పించారు. అతడికి సాయంగా ఉండేందుకు అతని సోదరి ఆసుపత్రికి రాగా, క్యాంటీన్లో పని చేసే షాబాద్ ఆమెపై కన్నేశాడు. ఆమెతో మాటలు కలుపుతూ పరిచయం పెంచుకున్నాడు. అయితే ఆమె లిఫ్ట్లో వెళుతున్నప్పుడు బలవంతంగా రెండో అంతస్తులోని చీకటి ప్రదేశానికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. -
గుడ్న్యూస్! శంషాబాద్లో ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్రం ఆమోదం
కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకుగాను రాష్ట్రంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఎట్టకేలకు ఏడాదిన్నరకు మోక్షం లభించింది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 190వ ఈఎస్ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 ఈఎస్ఐ వంద పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నామని, రాష్ట్రంలోని శంషాబాద్లో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించనున్నామని అధికారికంగా ప్రకటించారు. దీంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ శివారులో గగన్పహాడ్, కాటేదాన్, సాతంరాయి పారిశ్రామికవాడలతోపాటు కొత్తూరు, నందిగామ, బాలా నగర్, షాద్నగర్ పారిశ్రామిక వాడలకు శంషాబాద్ చేరువలో ఉంది. దీనికితోడు నగర శివారులోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగు రోడ్డు వంటి అనువైన అనుసంధాన రహదారులు, రైల్వే కనెక్టివిటీ ఉంది. (చదవండి: నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు) -
చందాదారులకు శుభవార్త.. ఈఎస్ఐలో 24/7 మందులు!
సాక్షి, హైదరాబాద్: కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) చందాదారులకు శుభవార్త. ఇప్పటివరకు కేవలం ఓపీ పనివేళల్లోనే ఈఎస్ఐ నాచారం ఆస్పత్రిలో రోగులకు మందులు లభిస్తుండగా అతిత్వరలో ప్రతిరోజూ 24 గంటలపాటు అక్కడ మందులు లభించనున్నాయి. ఇందుకోసం నాచారం ఆస్పత్రిలో 24 గంటలపాటు మందులు అందించేలా ఒక మెడికల్ స్టాల్ను కార్మిక శాఖ ఏర్పాటు చేయనుంది. ఈఎస్ఐ ఖాతాదారుల డిమాండ్కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్మిక సంక్షేమ, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఇటీవల జరిగిన ఈఎస్ఐ అధికారుల సమావేశంలో వెల్లడించారు. మందుల కొనుగోలుకు ఇప్పటికే రూ. 37 కోట్లు విడుదల చేశామన్నారు. ముందుగా నాచారం ఆస్పత్రిలో 24/7 మందుల పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత మరో రెండు ఈఎస్ఐ ఆస్పత్రుల్లోనూ దీన్ని అమలు చేసేందుకు కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు జ్వరం మొదలు బీపీ, షుగర్, హృద్రోగాలకు సంబంధించిన మందులను ప్రధాన ఆస్పత్రులతోపాటు క్షేత్రస్థాయిలోని డిస్పెన్సరీల్లోనూ ప్రత్యేక కోటా కింద కేటాయించి నిల్వలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని కార్మిక శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఈఎస్ఐ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు మరో మూడు ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీలు ఉండగా వాటికి అదనంగా 25 ప్యానెల్ క్లినిక్లు ఉన్నాయి. ఈఎస్ఐ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో దాదాపు అన్ని రకాల రోగులకు మందులను పంపిణీ చేస్తున్నారు. -
మీకు తమాషాగా ఉందా.. మంత్రి హరీశ్రావు స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/రామచంద్రాపురం: ‘కార్పొరేట్ ఆస్పత్రిలో మాదిరిగా అన్ని సౌకర్యాలున్నాయి. 55 మంది డాక్టర్లు.. 56 మంది నర్సులు పనిచేస్తున్నారు. కానీ, బెడ్ ఆక్యుపెన్సీ రేషియో మాత్రం 25 శాతమా? జనవరిలో 24 శాతం, ఫిబ్రవరిలో 29 శాతం, జూన్లో 49 శాతం.. డాక్టర్లు ఫుల్.. పేషెంట్లు నిల్’అంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ.20.50 కోట్లతో ఆధునీకరించిన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రి భవనాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం వైద్యుల పనితీరుపై హరీశ్రావు సమీక్షించారు. ఆయా వైద్య విభాగాల అధిపతులతో ముఖాముఖి నిర్వహించి వైద్యుల పనితీరు తక్షణం మెరుగుపరుచుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. ముగ్గురు గైనకాలజిస్టులు నెల మొత్తానికి చేసిన డెలివరీలు కేవలం మూడు. ఎంబీబీఎస్లు పనిచేసే పీహెచ్సీల్లో రోజుకు నాలుగైదు డెలివరీలు అవుతున్నాయి. నలుగురు వైద్యులు నాలుగేళ్లుగా విధులకు హాజరుకావడం లేదు. అయినా ఎందుకు పేరోల్ (వేతనాల జాబితా)లో ఉంచారు’అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్మికులకు అధునాతన వైద్యం అందించేందుకు శంషాబాద్లో మరో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వైద్యులతో ముఖాముఖి సాగిందిలా.. మంత్రి: నమస్కారం డాక్టర్ పద్మజగారూ.. గైనకాలజీ విభాగంలో ఎంతమంది ఉన్నారు.. జూలైలో ఎన్ని డెలివరీలు చేశారు. డాక్టర్ పద్మజ: ముగ్గురు డాక్టర్లం ఉన్నాం సర్, మూడు ఆపరేషన్లు చేశాం. మంత్రి: నీ వేతనం ఎంత చెప్పమ్మా.. నాకు నెలకు రూ.రెండు లక్షలు.. మీకు ఎంత? డాక్టర్ పద్మజ: రూ.1.90 లక్షలు సర్. మంత్రి: ముగ్గురు గైనకాలజిస్టులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలున్నా పనిచేయకపోతే మిమ్మల్ని ఏమనాలి? డాక్టర్ పద్మజ: గతంలో ఇక్కడ బాగా పనిచేశాం సర్. ప్రస్తుతం ఆస్పత్రిలో బ్లడ్ నిల్వలు లేవు. మంత్రి: నార్మల్ డెలివరీ చేయడానికి బ్లడ్ ఎందుకమ్మా? అవసరం పడితే పక్కనే ఉన్న పటాన్చెరు ఏరియా ఆస్పత్రిలో భారీగా రక్తం నిల్వలున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నెలకు 700 డెలివరీలు చేస్తున్నారు. అనస్తీషియా డాక్టర్ ఉన్నారు. జనరల్ సర్జన్ ఉన్నారు. గైనకాలజిస్టులున్నారు. కానీ, ఒక్క డెలివరీ చేయకపోతే అందరూ ఎందుకమ్మా? డాక్టర్ పద్మజ: ఇకపై బాగా పనిచేస్తాం సర్, డెలివరీలు చేయడం ప్రారంభిస్తాం. మానవత్వం ఉండాలి మంత్రి: ఆర్థోపెడిక్ విభాగంలో ఎంతమంది ఉన్నారు? జూలైలో ఎన్ని ఆపరేషన్లు చేశారు. డాక్టర్ నీరజ: ఒక్క ఆపరేషన్ కూడా చేయలేదు సర్. మంత్రి : అల్ట్రాసౌండ్ ఉంది. డిజిటల్ ఎక్స్రే ఉంది. రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. అన్ని ఆధునిక సౌకర్యాలున్నాయి. కానీ, జూలైలో ఒక్క ఆపరేషనూ చేయలేదు. ఓ ప్రైవేటుకు ఆస్పత్రికి వెళ్దాం. అక్కడ రోజుకు ఎన్ని ఆపరేషన్లు అవుతున్నాయో చూద్దాం. రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారు. కార్మికుల కోసం కనీసం పనిచేయరా? మానవత్వం ఉండాలమ్మా.. డాక్టర్ నీరజ : ఇకపై చేస్తాం సర్.. ఇది కూడా చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్! -
మెడికల్ చెకప్కి వెళ్లిన ఛటర్జీకి అవమానం!... ముఖం మీదే చెప్పులు విసిరి.....
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో కూడా సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు సుమారు రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పార్థ ఛటర్జీని అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని మెడికల్ చెకప్ కోసం జోకాలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఐతే అక్కడ ఛటర్జీకీ ఊహించని అవమానం ఎదురైంది. ఐఎస్ఒఐ ఆస్పత్రి వెలుపల ఒక మహిళ ఛటర్జీ ముఖం పైనే చెప్పులు విసిరి ఘోరంగా అవమానించింది. ఆ తర్వార సదరు మహిళ మాట్లాడుతూ...తాను మందులు కొనుక్కోవడానకి ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది. ఫ్లాట్లు, ఏసీ కార్లు కొనుక్కునేందుకు అతను పేదలను దోచుకుంటున్నాడని విమర్శించింది. ఇలాంటి వాళ్లను కాళ్లుచేతులు కట్టి వీధుల్లోకి ఈడ్చుకెళ్లాలంటూ.. తిట్టిపోసింది. అంతేకాదు ఆ చెప్పుల ఇక తాను ధరించను అంటూ ఛటర్జీ మండిపడింది. మరోవైపు తృణమాల్ కాంగ్రెస్ ఛటర్జీని సస్సెండ్ చేయడమే కాకుండా బెంగాల్ మంత్రివర్గం నుంచి తొలగించింది. (చదవండి: Partha Chatterjee: మమత కేబినెట్లో కీలక మార్పులు.. ఒక్కరికి ఒకే పదవి!) -
ఈఎస్ఐలో కోవిడ్ చికిత్స
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాప్తి తీవ్ర మవుతున్న సమయంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) అప్రమత్తమైంది. వైరస్ బారిన పడుతున్న ఈఎస్ఐ చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సేవలందించేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కోవిడ్–19 చికిత్స కోసం ప్రత్యేక విభాగాలను తెరవాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆస్పత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కోవిడ్–19 ఇన్ పేషంట్ (ఐపీ) సేవలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఎస్ఐ ప్రాంతీయ సంచాలకులు (ఆర్డీ), డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్), ఈఎస్ఐ మెడికల్ కళాశాలల డీన్లకు తాజాగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని కోవిడ్–19 ప్రత్యేక ఆస్పత్రిగా మార్చారు. ఇక్కడ సాధారణ సర్వీసులు కొనసాగిస్తూనే, కరోనా బాధితులకు చికిత్స అందిస్తారు. ఇందుకోసం 50 సాధారణ, 54 వెంటిలేటర్, ఆక్సిజన్తో కూడిన బెడ్లు, 21 వెంటిలేటర్, ఆక్సిజన్తో కూడిన ఐసీయూ బెడ్లు కేటాయించారు. ఇప్పటికే చికిత్సలు ప్రారంభించా రు. మరోవైపు నాచారం ఈఎస్ఐతో పాటు జీడిమెట్లలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రిలోనూ కోవిడ్ చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఈఎస్ఐ చందాదారులకు, ఈఎస్ఐ కార్డుదారులకే సేవలందిస్తారు. డిస్పెన్సరీల్లో కోవిడ్–19 కిట్లు! రాష్ట్రంలో 21 లక్షల మంది ఈఎస్ఐ చందాదారులున్నారు. వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 80 లక్షల మంది లబ్ధిదారులున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 110 ఈఎస్ఐ డిస్పెన్సరీల ద్వారా చందాదారులకు ఉచిత వైద్య సేవలందుతున్నాయి. ప్రస్తుతం ఈ డిస్పెన్సరీల్లో జనరల్ చెకప్ సేవలు, అవసరమైన వారికి మందులు అందిస్తున్నారు. తాజాగా కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు కోవిడ్–19 కిట్లు అందించే అంశాన్ని ఈఎస్ఐసీ పరిశీలిస్తోంది. పాజిటివ్ వచ్చి లక్షణాలున్న బాధితులకు సమీప డిస్పెన్సరీల్లోని వైద్యుల సలహా తీసుకుని మాత్రలు వేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అదేవిధంగా సాధారణ లక్షణాలతో ఉన్న వారికి కోవిడ్–19 కిట్ను అందించే ఏర్పాట్లు చేయాలని డీఐఎంఎస్లకు ఈఎస్ఐసీ ఆదేశించింది. -
కరోనా కాటుకు బలి.. తీరిగ్గా 15 నెలల తర్వాత సమాచారం.. తీరని క్షోభ
సాక్షి, యశవంతపుర: బెంగళూరులోని రాజాజీనగర ఈఎస్ఐ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం రెండు కుటుంబాలకు తీవ్ర ఇబ్బంది తెచ్చిపెట్టింది. కరోనాతో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను తీరిగ్గా 15 నెలల తరువాత వారి కుటుంబాలు తీసుకెళ్లాలని సమాచారం ఇచ్చారు. వివరాలు.. చామరాజపేటకు చెందిన మహిళ (40), కేపీ అగ్రహారకు చెందిన వ్యక్తి (35)లు 2020 జూలైలో కరోనాతో ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజులకే మరణించారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో కొత్తగా మార్చురీని నిర్మించి, పాత మార్చురీని ఉపయోగించడం మానేశారు. పై ఇద్దరి మృతదేహాలు పాత మార్చురీలో ఉన్నట్లు సిబ్బంది ఇటీవల గుర్తించి వారి బంధువులకు తీసుకెళ్లాలని సమాచారం పంపారు. కానీ బీబీఎంపీ రికార్డుల్లో అప్పట్లోనే వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించినట్లు, అంత్యక్రియలు పూర్తయి డెత్ సర్టిఫికెట్ జారీచేసినట్లు ఉంది. ఇప్పుడీ మానసిక క్షోభ ఏమిటని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి ఈ అమానుషంపై విచారణ చేయాలని మాజీ మంత్రి సురేశ్కుమార్ కార్మిక శాఖ మంత్రి శివరామ్ హెబ్బార్ను డిమాండ్ చేశారు. నిర్లక్యం వహించిన బీబీఎంపీ, ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
రూ. 46 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలే..!
గీసుకొండ: కరోనా రక్కసి ఓ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. ఓ వ్యక్తి ఏకంగా రూ.46 లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణాలు దక్కలేదు. పైగా కుటుంబం మొత్తం కుదేలైంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారానికి చెందిన పోలెబోయిన రాజన్బాబు (45) ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వలస వెళ్లాడు. నగరంలోని కూకట్పల్లిలో నివాసం ఉంటూ ఐరన్, సిమెంట్ వ్యాపారంతో పాటు జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల రాజన్బాబు, భార్య, ఇద్దరు కుమారులకు కరోనా వైరస్ సోకింది. అందరూ హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రాజన్బాబు ఆరోగ్యం క్షీణించడంతో ముందుగా స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. హైదరాబాద్లోని మియాపూర్, సాగర్ రింగ్రోడ్డు, జేఎన్టీయూ హౌసింగ్ బోర్డు కాలనీలో గల మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం రోజుకు రూ.లక్షకు పైగా వెచ్చించారు. ప్రాణాలు దక్కితే చాలు అని ఖర్చుకు వెనుకాడలేదు. డబ్బుల కోసం ఫ్లాట్ను అమ్మేశారు. కాగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డబ్బు తీసుకుంటూనే రాత్రిపూట ఆక్సిజన్ తీసివేస్తున్నట్లు గుర్తించారు. ఇష్టానుసారంగా డబ్బులు గుంజుతూ.. సరైన వైద్యం అందించడం లేదని అక్కడి నుంచి హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున రాజన్బాబు మృతి చెందాడు. మొత్తంగా చికిత్స కోసం ఫ్లాట్ అమ్మగా వచ్చిన డబ్బుతో పాటు ఇతరత్రా అన్నీ కలిసి రూ.46 లక్షలు వెచ్చించినా ఆయన ప్రాణాలు దక్కలేదు. భార్య, ఇద్దరు కుమారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటీవల రాజన్బాబు తల్లి, సోదరి కూడా కరోనాతో మృతి చెందారు. కరోనా కాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలికావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. -
కార్మికులకు మెరుగైన వైద్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కార్మికులకు ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గుణదల మోడల్ డిస్పెన్సరీలో ఆన్లైన్ విధానాన్ని సోమవారం కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మితో కలిసి మంత్రి జయరాం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కార్మికుల సొమ్మును కూడా దోచుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సొమ్మును వారి వైద్యం, సంక్షేమం కోసమే ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా కార్మికులు వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే.. రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందనే నమ్మకంతో సీఎం వైఎస్ జగన్.. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందే అవకాశాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ ఇప్పుడు ప్రతి ఒక్క జబ్బును ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమంతో పాటు విద్య, ఆరోగ్యానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్లైన్ సేవల విధానాన్ని 78 డిస్పెన్సరీలు, 4 ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అమలు చేస్తామన్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ ఎల్ఎస్బీఆర్ కుమార్, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, ప్రాంతీయ సంచాలకులు కాశీనాథన్ పాల్గొన్నారు. -
ఈఎస్ఐలోనే అచ్చెన్నకు వైద్య పరీక్షలు
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడుకి అదే ఈఎస్ఐ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇది యాధృచ్చికమే అయినప్పటికీ ఆయనకు చేదు అనుభవమే. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ పరీక్షలకు కేటాయించడంతో ఇతర వైద్య సేవలను ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. దీంతో కోర్టుకు హాజరు పరచడానికి ముందు అచ్చెన్నాయుడును ఈఎస్ఐ ఆసుపత్రి క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. అక్కడ ఆర్ఎంఓ డాక్టర్ శోభ పర్యవేక్షణలో వైద్యులు ఆయనకు బీపీ, సుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా టెస్ట్ కోసం స్వాబ్ సేకరించారు. మిగిలిన ఆరుగురికి కూడా వైద్య పరీక్షలు చేశారు. ఇదిలా ఉండగా తనకు ఇటీవల పైల్స్ సర్జరీ జరిగిందని, కారులో ఉదయం నుంచి కూర్చొని ప్రయాణించడం వల్ల సర్జరీ జరిగిన చోట నొప్పిగా ఉందని అచ్చెన్నాయుడు చెప్పడంతో ప్రభుత్వాసుపత్రికి చెందిన సర్జన్ పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ సాధారణ స్థితిలోనే ఉన్నట్టు నిర్ధారించారు. (చదవండి : టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్) రెండు ఎఫ్ఐఆర్లు.. ► ఈఎస్ఐ స్కామ్లో ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో అచ్చెన్నాయుడితో సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వారిని రోడ్డు మార్గంలో విజయవాడ గొల్లపూడిలోని రీజినల్ ఆఫీసుకి తరలించారు. ► శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులు వారందరినీ ప్రాథమికంగా ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని సుమారు గంటసేపు ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం అచ్చెన్నాయుడు, రిటైర్డ్ డైరెక్టర్ చింతల కృష్ణప్ప రమేష్ కుమార్పై ఒక ఎఫ్ఐఆర్, మిగతా ఐదుగురు నిందితులు ఈటగాడి విజయకుమార్, జనార్థన్, ఇవన రమేష్బాబు, ఎంకేపీ చక్రవర్తి, గోనెవెంకట సుబ్బారావుపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులతో న్యాయవాదుల వాగ్వాదం ► ఏసీబీ రీజినల్ కార్యాలయంలో అచ్చెన్నాయుడుని కలిసేందుకు వచ్చిన న్యాయవాదులు ఏసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమను లోపలికి అనుమతించాలంటూ హడావుడి చేశారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులే బెయిల్ పిటిషన్ కాగితాలు లోపలకు తీసుకెళ్లి అచ్చెన్నాయుడితో సంతకాలు పెట్టించుకొని వచ్చి న్యాయవాదులకు అందజేశారు. ఏం జరుగుతుందో చూద్దాం.. ► లోపలికి వెళ్తున్నా.. ఏం జరుగుతుందో చూద్దాం.. అంటూ ఈఎస్ఐ స్కామ్లో అరెస్టైన అచ్చెన్నాయుడు గొల్లపూడిలోని ఏసీబీ రీజినల్ కార్యాలయం వద్ద మీడియా వద్ద ముక్తసరిగా వ్యాఖ్యానించారు. ఏసీబీ అధికారులు రమ్మన్నారని, అందువల్ల ఇక్కడికి వచ్చానని తెలిపారు. అధికారులు తనను ఇంతవరకు ప్రశ్నించలేదని, బయటకు వచ్చాక అన్ని విషయాలు చెబుతానన్నారు. -
వంద పడకల ఈఏస్ఐ ఆసుపత్రికి కార్మిక శాఖ అమోదం
-
డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోళ్లు వద్దు
సాక్షి, అమరావతి: కార్మిక రాజ్యబీమా ఆస్పత్రుల (ఈఎస్ఐ)లో ఇకపై డిస్ట్రిబ్యూటర్ల నుంచి మందుల కొనుగోళ్లు చేయకూడదని, ఉత్పత్తి దారుల (మాన్యుఫాక్చరర్స్) నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోళ్లు చేయడం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు జరిగి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నేరుగా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేయడం వల్ల నాసిరకం మందులు సరఫరా అయ్యే అవకాశం ఉండదని, అలా చేస్తే వారిని బాధ్యులు చేయవచ్చునని, పైగా తక్కువ ధరలకే వచ్చే అవకాశం ఉందని అధికారుల అభిప్రాయం. డిస్ట్రిబ్యూటర్ల నుంచి గానీ, వ్యక్తుల నుంచి గానీ, ఏజెంట్ల నుంచి గానీ కొనుగోలు చేస్తే నాసిరకం మందులు సరఫరా అయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాంటి వారి నుంచి కొనుగోలు చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేవలం ఉత్పత్తి దారుల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ అధికారులు మాత్రం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నేడో రేపో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.300 కోట్ల వరకు మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో గత మూడు మాసాలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కె.రాజేంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేశారు. విచారణ పూర్తికావడంతో త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు తెలిసింది. కొంతమంది అధికారులతో పాటు ఒకరిద్దరు ప్రముఖ కాంట్రాక్టర్లు, తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఓ మంత్రి కొడుకు మందుల కొనుగోళ్ల అవినీతిలో కీలక పాత్ర పోషించినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. మంత్రి కొడుకు చిన్న చిన్న స్లిప్పుల్లో సంతకాలు చేసి ఇచ్చినా కూడా దాని ఆధారంగా నామినేషన్ కింద మందులు సరఫరా చేశారని వెల్లడైంది. వంద రూపాయల సరుకు సరఫరా చేస్తే, వెయ్యి రూపాయలకు చేసినట్టు చూపించారు. పైగా రూపాయి మాత్రను పది రూపాయల రేటుకు కొనుగోలు చేసినట్టు కూడా విచారణాధికారుల దృష్టికి వచ్చిందని తెలిసింది. ఇదిలా ఉండగా, ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల అక్రమాలపై తెలంగాణ ఏసీబీ అధికారులు బుధవారం ఏపీ ఈఎస్ఐ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణలో అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్ల పాత్ర ఇక్కడ కూడా ఉండటంతో విచారణలో భాగంగా ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. -
ఈఎస్ఐ కాలేజీకి ‘సూపర్’ సొగసులు
సాక్షి, హైదరాబాద్: సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి సేవలు విస్తృతం కానున్నాయి. ఈఎస్ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆస్పత్రికి అనుబంధంగా కేంద్ర ప్రభు త్వం 2016లో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో కారి్మక కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుతుండగా.. తాజాగా ఈ కాలేజీలో డీఎన్బీ (డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డు) కోర్సులు ప్రారంభించేందుకు కేంద్రం ఆమో దం తెలిపింది. ఇప్పటివరకు యూజీ కోర్సులతో కొనసాగుతున్న ఈ కాలేజీలో ఇకపై డీఎన్బీ కోర్సులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన ఈఎస్ఐసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డీఎన్బీ పరిధిలో అన్నీ సూపర్ స్పెషాలిటీ కోర్సులే కావడంతో సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో కారి్మకులకు ఆధునిక సేవలు అందనున్నాయి. వీటితోపాటు స్పెషల్ పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రుల్లో డీఎన్బీ, స్పెషల్ పీజీ కోర్సులు ప్రారంభిస్తున్న వాటిలో మొదటిది సనత్నగర్ ఈఎస్ఐ కాలేజీనే కావడం విశేషం. కొత్త కోర్సును వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు అధికారు లు చర్యలు వేగవంతం చేశారు. 2019–20 వార్షిక సంవత్సరం బడ్జెట్లో సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రికి రూ.180 కోట్లు కేటాయించగా.. కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.200 కోట్లకు పెంచింది. -
కడవరకూ జగన్తోనే ఉంటాం: ఎంపీ భరత్రామ్
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఈఎస్ఐ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. అన్ని విభాగాల్లో శిథిలావస్థకు చేరిన గదులను చూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్థన్ను కలిసి ట్రామాకేర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. పేపర్మిల్లు, ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులను సేకరించి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఆసుపత్రి ఫొటోలు తీయించి అభివృద్ధి చేసిన తరువాత తిరిగి ఫొటోలు తీస్తామన్నారు. కడవరకూ జగన్తోనే ఉంటాం... వైఎస్సార్ సీపీ ఎంపీలు బీజేపీకి టచ్లో ఉన్నారంటూ ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్రామ్ స్పందించారు. సుజనాచౌదరి మైండ్ గేమ్ ఆడుతున్నారని, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూర్చున్న ఎంపీలను చూసి వైఎస్సార్ సీపీ ఎంపీలు టచ్లో ఉన్నారనుకుంటున్నారని పేర్కొన్నారు. నిజమైన వైఎస్సార్ సీపీ ఎంపీలు కడవరకూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటారన్నారు. 22 మంది ఎంపీలూ జగన్ నాయకత్వంలో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారక్ప్రసాద్, ఆర్ఎంవో డాక్టర్ రామకృష్ణ, సివిల్ సర్జన్లు కోటేశ్వరరావు, పద్మావతి, ప్రదీప్, రామారావు తదితరులు పాల్గొన్నారు. సెగ్మెంట్కు మొబైల్ వాటర్ ట్యాంక్ రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక మొబైల్ వాటర్ట్యాంకు ఉండే బాగుంటుందని దానిపై ఆలోచించాలని ఎంపీ మార్గాని భరత్రామ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లను ఆదేశించారు. శనివారం స్థానిక మార్గాని ఎస్టేట్స్లో ఆయన కార్యాలయంలో ఎంపీ ల్యాడ్స్పై పార్లమెంటు పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ డీఈలతో సమీక్షించారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మొబైల్ వాటర్ ట్యాంకర్ ఉంటే ఆ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా గ్రామంలో మంచినీటి సమస్య వస్తే నీరు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. మొబైల్ ట్యాంకులు సులువుగా చిన్న వీధులలో మలుపు తిరగడానికి అవకాశం ఉంటుందన్నారు. వాటర్ హెడ్ ట్యాంకులు పైపులైను నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలని, వాటికి కొంత సమయం పడుతుందని ఈలోపు వాటర్ ట్యాంకులు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీర్లు ఈ విషయంపై ఏవిధంగా చేస్తే బాగుంటుందో చెప్పాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ఎంపీ ఆరాతీయగా గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని డీఈలు తెలిపారు. ప్రస్తుతం వాటి నిర్మాణాలకు పరిపాలనా పరమైన ఆమోదాలు వచ్చాయన్నారు. సమావేశంలో పార్లమెంటు పరిధిలోని డీఈలు ఎస్.రవికుమార్, సీహెచ్ రమేష్, పి.శ్రీనివాస్, ఎంఎస్ స్వామి పాల్గొన్నారు. -
ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యం అందట్లేదని రోగులు ఆవేదన
-
నామినేషన్పై మందుల కొను‘గోల్మాల్’
సాక్షి, అమరావతి : కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) పరిధిలోని ఆస్పత్రుల్లో మరో భారీ కుంభకోణానికి అధికారులు తెరతీశారు. గత ప్రభుత్వ హయాంలో మందుల కొనుగోళ్లలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరిగాయని తేలడంతో ఓ వైపు విజిలెన్స్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తుంటే మరోవైపు ఈఎస్ఐ పరిధిలోని ఆస్పత్రుల్లో కనీస మందులు లేక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ ఏమీ పట్టని అధికారులు తాము అనుకున్నదే రూలు అన్నట్టు వందల కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు మార్గం సుగమం చేశారు. పారదర్శకంగా మందుల కొనుగోలు జరగాలంటే ఇ–ప్రొక్యూర్మెంట్ పద్ధతి సరైనదని భావించిన అధికారులు కొత్త సర్కారు రాగానే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. అప్పటి కార్మిక శాఖ అధికారిగా ఉన్న ఐఏఎస్ అధికారి మాధవీలత ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే కొద్ది రోజులకే ఆమె కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఆ తర్వాత లావణ్యవేణి అనే మరో అధికారి ఈ శాఖకు వచ్చారు. ఈమె ఆధ్వర్యంలో టెండర్లు పూర్తి చేసి, ఎల్1గా నిలిచిన కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తీరా ఎల్1గా నిలిచిన కంపెనీలపై ఫిర్యాదులున్నాయని, మామూలు ధరల కంటే ఎక్కువ రేటు ఉందని ఇ–ప్రొక్యూర్మెంట్ విధానాన్ని నిలిపివేశారు. నామినేషన్ కింద మందుల సరఫరాకు అనుమతి ఇచ్చేందుకు ఈఎస్ఐ డైరెక్టరే కొన్ని కంపెనీలను ఎంపిక చేశారు. నామినేషన్ కింద అయితే భారీగా డబ్బులొస్తాయని భావించిన అధికార వర్గాలు ఈ విధానానికి తెరలేపాయని సమాచారం. ఇదే సమయంలో తక్కువ ధరకు మందులు ఇస్తామని చెప్పిన కంపెనీలు ఎందుకు ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో పాల్గొన లేదన్నదానికి అధికారుల నుంచి జవాబు లేదు. దీంతో రెండు మాసాల పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కసరత్తు చేసిన ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల విధానం మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ధరలు మామూలుగా ఉన్నాయన్న కమిటీ ఇ–ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యాక రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు రాగానే రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) కొనుగోలు చేసే మందుల ధరకూ, ఈఎస్ఐ ఇప్రొక్యూర్మెంట్లో కోట్ చేసిన ధరలకూ బేరీజు వేయాలని ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. చంద్రశేఖర్, రామకృష్ణ, గాంధి అనే ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీ సుమారు 265 రకాల మందుల ధరలను పరిశీలించింది. ఈఎస్ఐ టెండర్లలో పాల్గొన్న కంపెనీలు వేసిన ధరలకూ, ఏపీఎంఎస్ఐడీసీ ధరలకూ తేడా లేదని తేల్చింది. ఇలాంటప్పుడు ఇ–ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అమలు చేయాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నామినేషన్ ద్వారా కొనుగోళ్లవైపే మొగ్గు చూపారు. ఇప్పటికే ఏఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలో కూడా నిర్ణయించి వారికి జిల్లాల వారీగా మందుల ఇండెంట్ ఇచ్చారు. తొలి దశలో సుమారు రూ.40 కోట్లతో మందులు కొనుగోలు చేయనున్నారు. ధరలు ఎక్కువని ఇస్తున్నాం ఇ–ప్రొక్యూర్మెంట్ టెండరులో ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే నామినేషన్ కింద ఇస్తున్నాం. ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేసే మందులు అదే ధరకు వచ్చినా వాటినెవరైనా తింటారా? మా రోగులు అలాంటి మాత్రలు తినరు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు లేని విషయం వాస్తవమే. అందుకే నామినేషన్ కింద ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తున్నాం. పైగా ఈఎస్ఐ మందుల టెండర్లలో పాల్గొన్న కంపెనీల ద్వారా మందులు కొంటే రూ.230 కోట్లు నష్టం వస్తుంది. – సామ్రాజ్యం, ఈఎస్ఐ డైరెక్టర్ -
వరంగల్లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్లో ఈఎస్ఐ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ అన్నారు. సంపర్క్ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు. సాక్షి, న్యూశాయంపేట: దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్లో ఈఎస్ఐ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ అన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన సంపర్క్ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా హన్మకొండ రాంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సంపర్క్ అభియాన్, జనజాగరణ సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలో వచ్చిన వందరోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజామోదం లభించిందని చెప్పారు. కశ్మీర్ భారత్లో అంతర్భాగమని ఇందులో వేరే దేశం జోక్యాన్ని సహించేది లేదన్నారు. కశ్మీర్తో పాటు, దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ రాబోయే రోజుల్లో అధికారంలో వస్తుందని, రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలచుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని, కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం కేంద్రమంత్రికి మెమోరండం సమర్పించింది. సంపర్క్ అభియాన్ భాగంగా కాకతీయ మాజీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ వంగాల గోపాల్రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, ప్రముఖ కవి రచయిత ప్రొఫెసర్ రామాచంద్రమౌళిలను కలుసుకున్నారు. సభలో రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, మాజీ మేయర్ టి.రాజేశ్వర్రావు, పార్టీ అర్బన్, రూరల్జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, ఎడ్ల అశోక్రెడ్డి, నాయకులు డాక్టర్ విజయలక్ష్మి, రావుల కిషన్, మల్లాది తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలి చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాలో ఉన్న నిరుద్యోగుల కోసం భారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి కేంద్ర మంత్రిని కోరారు. గతంలో ఉన్న ఆజంజాహి మిల్లు మూత పడడంతో వేలాది మందికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఆసియాలోనే పెద్ద మార్కెట్ ఉన్న వరంగల్లో స్పైసెస్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని, ఉన్న స్పైసెస్ బోర్డును తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సాధుల దామోదర్, తోట నర్సింహరావు, కొత్త కిషోర్కుమార్, సారయ్య, గౌరిశెట్టి శ్రీనివాస్, రాజు, దేశబత్తుల రమేష్, పోతుకుమారస్వామి, బిజెపీ నాయకులు రావు పద్మారెడ్డి, ఎడ్ల అశోక్రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ధర్మారావు, వన్నాల శ్రీరాములు, వంగాల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనకు మద్దతుగా నిలవాలి వరంగల్: దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ పాలనకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ అన్నారు. వరంగల్లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సోమవారం వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అర్టికల్ 371ను రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాలపై ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సంపర్క్ అభియాన్, జనజాగరణ్ కార్యక్రమాలు నిర్విహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా వరంగల్ పట్టణంలో మేధావులను, కవులను, వ్యాపార, వాణిజ్య వర్గాలను కలుసుకున్నామని చెప్పారు. -
నీ వెంటే నేను..
నాగేశ్వరరావు, నాగరత్నం దంపతులు. వీరుఅనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఈఎస్ఐఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో భర్త ఆదివారం రాత్రి కన్నుమూశాడు. ఆయన మృతదేహాన్ని కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎస్ఆర్నాయక్ నగర్లోని నివాసానికి తరలించారు. భర్తను కడసారి చూసేందుకు భార్య ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో వస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. ఈ ఘటన కుటుంబసభ్యులనుకలచి వేసింది. కుత్బుల్లాపూర్: అనారోగ్యంతో మృతి చెందిన భర్తను కడసారి చూపు చూసేందుకు అంబులెన్స్లో వస్తూ మార్గమధ్యలోనే భార్య మృతి చెందిన విషాద సంఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎస్ఆర్ నాయక్నగర్లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కోడేరు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (70), నాగరత్నం(65) దంపతులు బతుకుదెరువు నిమిత్తం 20 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి కుత్బుల్లాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మూడు రోజుల క్రితం భార్యాభర్తలిరువురూ అనారోగ్యానికి గురికావడంతో వారిని ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి నాగేశ్వరరావు మృతి చెందాడు. మృతదేహాన్ని ఎస్ఆర్ నాయక్నగర్లోని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు కడసారి చూపు కోసం నాగరత్నంను అంబులెన్స్లో ఇంటికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. ఓ వైపు తండ్రి.. మరో వైపు తల్లి ఒకేసారి కన్నుమూయడంతో వారి కుమారులు కన్నీటి పర్యంతమయ్యారు. కడసారి చూపు కోసం వస్తున్న ఆమె భర్తను చూడకుండానే కన్ను మూయడంతో ఎస్ఆర్ నాయక్ నగర్లో విషాదం నెలకొంది. సుభాష్నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుని గా కొనసాగుతున్న గుబ్బల లక్ష్మీనారాయ ణ మాజీ ఎమ్మెల్యే, కూన శ్రీశైలంగౌడ్కు సన్నిహితుడు. వీరి మరణ వార్త విన్నవెంటనే శ్రీశైలంగౌడ్ అక్కడికి వచ్చి కుటుంబసభ్యులను ఓదార్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.ఎస్.వాసు, మాజీ కౌన్సిలర్ రంగారావు, పలు పార్టీల నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
జిల్లాకో ఈఎస్ఐ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటికే 400 జిల్లాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులను తెరిచి కార్మిక కుటుంబాలకు అత్యాధునిక వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సనత్నగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించతలపెట్టిన ఓపీడీ భవనానికి బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈఎస్ఐ ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొత్తగా నిర్మించనున్న ఓపీడీ భవనాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.124 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్లాకులో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. కారి్మకుల సంఖ్య తక్కువ ఉన్న చోట్ల ఈఎస్ఐ లబ్ధిదారులు కాని వారికి కూడా సేవలు అందించనున్నట్లు వివరించారు. దేశంలోని 40 కోట్ల మంది అసంఘటిత రంగ కారి్మకులకు నెలవారీగా రూ.3,000 పింఛను అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రకటించాలి సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రకటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. వైద్య సేవల రంగంలో కేంద్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈఎస్ఐకి సంబంధించిన పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈఎస్ఐ ఆసుపత్రుల పనితీరు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మెరుగ్గా ఉందని కితాబిచ్చారు. రాష్ట్రంలో 18 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐ పరిధిలో ఉన్నారని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తెలిపారు. -
గంటపాటు లిఫ్టులో నరకం
సాక్షి, ఆరిలోవ(విశాఖపట్నం) : హెల్త్సిటీ ఈఎస్ఐ ఆస్పత్రిలో బుధవారం లిఫ్ట్ మొరాయించింది. కింద నుంచి పైఅంతస్తుకు రోగులు, వారి బంధువులు వెళుతుండగా మధ్యలో నిలిచిపోయింది. దీంతో లిఫ్టులో ఉన్నవారు హాహాకారులు చేశారు. సుమారు గంటపాటు నరకం చూశారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో రెండు లిఫ్ట్లున్నాయి. వాటిలో ఇప్పటికే ఒకటి మొరాయించి మూలకు చేరింది. ఉన్నది కూడా ఇప్పుడు మొరాయించింది. ఉదయం 10 గంటల సమయంలో ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ నమోదు చేసుకొని మూడో ఫ్లోర్లో ఉన్న వైద్యులను కలవడానికి కొందరు రోగులు, వారికి తోడుగా వచ్చిన బంధువులు లిఫ్ట్లో వెళ్లదలచారు. చిన్న లిఫ్ట్ కావడంతో దానిలో నలుగురు మాత్రమే పట్టే సామర్థ్యం ఉంది. కానీ ముగ్గురు రోగులతో పాటు మరో నలుగురు వారి సహాయకులు (మొత్తం ఏడుగురు) లిఫ్ట్లో ఎక్కేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వారు ఎక్కిని వెంటనే లిఫ్ట్ తలుపులు మూసుకొన్నాయి. ఒక్క అడుగు పైకి లేచి లిఫ్టు అక్కడే నిలిచిపోయింది. ఆ తలుపులు తెరుచుకోలేదు. దీంతో లోపల ఉన్నవారంతా పెద్ద కేకలు పెడుతూ రక్షించడంటూ బయట ఉన్నవారిని వేడుకున్నారు. దీంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువలు లిఫ్ట్ వద్దకు పారొచ్చారు. లిఫ్ట్ తలుపులు తెరవడానికి నానా హైరాన పడ్డారు. బోల్టులు విప్పినా తలుపులు తెరుచుకోలేదు. ఇనుప రాడ్లు తీసుకొచ్చి సిబ్బంది తలుపులు బద్దలుగొట్టడానికి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. లిఫ్ట్ లోపలకు ఆక్సిజన్ మరో పక్క లోపల ఉన్నవారికి గాలి ఆడక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అసలే చిన్న లిఫ్ట్లో ఏడుగురు ఉన్నారు. అప్పటికే సుమారు గంట నుంచి లోపల ఉండిపోయారు. లోపల ఉక్కపోతతో పాటు ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వైద్యుల సలహాతో సిబ్బంది ఆక్సిజన్ సిలిండరు తీసుకొచ్చి లిఫ్ట్ లోపలకు పైపు ద్వారా పంపించారు. దీంతో లోపల ఉన్నవారికి ఊరట కలిగింది. అయినా బయటపడతామోలేదోనని కేకలు వేస్తున్నారు. కొంతసేపటికి మొదటి ఫ్లోర్లోకి కొందరు వెళ్లిరాడ్లు, రెంచీలు సహాయంతో పైనుంచి లిఫ్ట్ బోల్టులు విప్పి తలుపులు పక్కకు నెట్టారు. అప్పుడు గాని లోపల ఉన్నవారు బయటకు రావడానికి వీలుపడలేదు. ఈతతంగమంతా సుమారు గంటకు పైగా పట్టింది. లిఫ్ట్లో ఉన్నవారంతా క్షేమంగా బయటకు రాగలగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నానా హైరానాతో సిబ్బంది ప్రత్యామ్నాయ చర్యలతో వారిని క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా అభినందించారు. అనంతరం పాడయిన ఆ లిఫ్ట్ ఎవరూ ఎక్కకుండా మూసేశారు. -
నిర్మల్ పై మనసు పెట్టమ్మా.!
సాక్షి, నిర్మల్: ఈ ప్రాంతవాసుల రవాణా సౌకర్యం మెరుగు పర్చేందుకు ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్లను కలుపుతూ రైల్వేలైన్ నిర్మించాలని ఉమ్మడి జిల్లాకు చెందిన అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్లు కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందట ఢిల్లీలో అప్పటి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభును కలిశారు. ఈ రైల్వేలైన్ నిర్మాణంలో సగం వాటా భరిస్తామంటూ సీఎం కేసీఆర్ స్వయంగా ఇచ్చిన లేఖను ఆయనకు అందించారు. రాష్ట్రం సగం ఖర్చుకు ముందుకు రావడంతో కేంద్రం కూడా వెంటనే పచ్చజెండా ఊపింది. దాదాపు రూ.2,720 కోట్లతో నిర్మాణానికి ముందుకు వచ్చింది. కానీ.. ఇప్పటి వరకు రైల్వేశాఖ ఒక్కపని కూడా చేపట్టలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ(మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్) కూడా కుదుర్చుకోలేదు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఏడాది క్రితం సికింద్రాబాద్, నాందేడ్లలో పలుమార్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో రాష్ట్ర ఎంపీలు భేటీ అయ్యారు. ఇందులో ఆర్మూర్ – నిర్మల్ –ఆదిలాబాద్ లైన్ నిర్మాణాన్నీ లేవనెత్తారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటామని అప్పట్లో చెప్పినా.. ఇప్పటికీ ముందడుగు పడలేదు. ఎప్పటి నుంచో ఉంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అగ్రభాగాన ఉన్న ఆదిలాబాద్కు హైదరాబాద్ నుంచి నేరుగా రైల్వేలైన్ నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్ధాల క్రితం నుంచి ఉంది. ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే పీవీ నర్సింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. రాష్ట్ర రాజధాని సమీపంలోని పటాన్చెరువు నుంచి ఆదిలాబాద్కు వయా ఆర్మూర్, నిర్మల్ మీదుగా పారిశ్రామిక–వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ రైల్వేలైన్ వేయాలని నిర్ణయించారు. 2009 రైల్వే బడ్జెట్లోనే లైన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ రహదారి వెంట ఈ లైన్ నిర్మించాలన్న ప్రతిపాదనలూ చేశారు. కొన్నేళ్లకు సర్వే కూడా పూర్తిచేశారు. తీరా.. 317 కిలోమీటర్ల దూరభారంగా ఉన్న ఈ లైన్ నిర్మాణానికి రూ.3,771కోట్లు పెట్టడం లాభదాయకం కాదేమో.. అంటూ అప్పట్లో రైల్వేశాఖ చేతులెత్తేసింది. ఆ తర్వాత ఏళ్లు గడిచిపోయాయి. ఈ లైన్నిర్మాణం మూలనపడింది. మళ్లీ రెండున్నరేళ్ల కిందట అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్లు పట్టుబట్టి సీఎం కేసీఆర్ను సగం వాటా భరించేందుకు ఒప్పించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్రం రైల్వేమంత్రి సురేశ్ప్రభుతోనూ పచ్చజెండా ఊపించారు. ఈసారి పటాన్చెరు నుంచి కాకుండా పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేమార్గంలో ఉన్న ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు 137కి.మీ. రైల్వేలైన్ వేస్తే సరిపోతుందని తేల్చారు. కేంద్రం 2017లో పచ్చజెండా ఊపినా రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత ఈ అంశంపై ఎలాంటి స్పందన కూడా చూపలేదు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడల్లా రైల్వేలైన్ తెరపైకి వస్తూనే ఉంది. ఈఎస్ఐ కూడా.. రైల్వేలైన్తో పాటు జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందటే అప్పటి కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను కలిసి విన్నవించారు. ఈ మేరకు ఆయన నిర్మల్లో ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు భైంసాలో డిస్పెన్సరీ మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం ఈఎస్ఐ అధికారులు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇక్కడి అధికారులు స్థానిక డీఎంహెచ్వో కార్యాలయ భవనాన్ని చూపించారు. దానిపై ఈఎస్ఐ అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత దత్తాత్రేయ మంత్రి పదవీ నుంచి దిగిపోవడంతో ఫైల్ పెండింగ్లో పడింది. మళ్లీ దీనిపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఢిల్లీకి వెళ్లి కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ను కలిసి ఆస్పత్రి ఏర్పాటుపై వివరించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినా ఇప్పటికీ ఈఎస్ఐ ఆస్పత్రి కోసం ముందడుగు పడలేదు. దీంతో పాటు బాసర్, భైంసాల మీదుగా బోధన్, బాన్సువాడల నుంచి సరిహద్దులో జాతీయ రహదారి నిర్మాణం పెండింగ్లోనే ఉంది. జిల్లాకు రావాల్సిన కేంద్రీయ విద్యాలయం ఇప్పటికీ ఊసు లేదు. ఈసారి ఆదిలాబాద్ నుంచి బీజేపీకే చెందిన ఎంపీ సోయంబాపురావు ఉండటంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈసారైన కేంద్రం జిల్లాపై కరుణించాలని జిల్లావాసులు కోరుతున్నారు. రైల్వేలైన్ కోసం కృషి చేస్తా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు రైల్వేలైన్ నిర్మాణం విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను. త్వరలోనే రైల్వేలైన్ నిర్మాణంపై కదలిక తీసుకువచ్చేలా, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేయించడంపైనా కృషిచేస్తాను. దీంతో పాటు ఇతర కేంద్ర పథకాలను తీసుకువచ్చేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను. – సోయం బాపురావు, ఎంపీ, ఆదిలాబాద్ -
నేనే సీనియర్ని.. ఆ సీటు నాది!
సాక్షి, అమరావతి: విజయవాడలోని కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో గతంలో ఇన్చార్జి డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ కె.రమేష్కుమార్ సోమవారం హల్చల్ చేశారు. తానే సీనియర్నని, తనకు కోర్టు ఆర్డర్ ఉందంటూ డైరెక్టర్ కుర్చీ లాక్కుని కూర్చున్నారు. అంతేగాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులను కార్యాలయంలో ఉంచడంతో అక్కడి సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ డా.విజయకుమార్ తన సీటులోకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. రెండేళ్ల కిందట డా.రమేష్కుమార్ ఇక్కడ ఇన్చార్జి డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో మందుల కొనుగోళ్లకు సంబంధించి ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో కేసులు నమోదై ఉన్నాయని, విజిలెన్స్ విచారణ కూడా జరుగుతోందని అధికారవర్గాలు తెలిపాయి. అనంతరం ఆయనను అక్కడి నుంచి తొలగించి తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రికి పంపారు. తాజాగా సోమవారం తనకు కోర్టు ఆర్డర్ ఉందంటూ డైరెక్టర్ సీటులో కూర్చోవడంతో ఉదయం నుంచి సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులను సంప్రదించకుండానే.. వాస్తవానికి ఎవరైనా కోర్టు ఆర్డరు తీసుకొచ్చినా దానిని ప్రభుత్వానికి పంపాలి. అక్కడ ఆ కోర్టు ఆర్డరును ఆమోదించి, సదరు వ్యక్తికి ప్రత్యేక ఆర్డర్ ఇస్తారు. ఈ ఆర్డరు తీసుకున్నాక ఆ సీటులో కూర్చోవాలి. కానీ డా.రమేష్కుమార్ ప్రభుత్వాన్నిగానీ, ఉన్నతాధికారులనుగానీ సంప్రదించకుండా నేరుగా వచ్చి కార్యాలయంలోని సీటును ఆక్రమించుకోవడంతో ఈ గందరగోళం నెలకొంది. దీనిపై అటు ప్రభుత్వ ఉన్నతాధికారులుగానీ, కార్మిక ముఖ్య కార్యదర్శిగానీ స్పందించకపోవడంతో వివాదం సోమవారం సాయంత్రం వరకూ కొనసాగుతూనే ఉంది. సంతకాల కోసం నా దగ్గరికే రావాలి తన విధులకు ఎవరూ అడ్డు రాకూడదని, సంతకాల కోసం తన వద్దకే రావాలని డా.రమేష్కుమార్ హుకుం జారీచేయడంతో సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుత డైరెక్టర్గా ఉన్న డా.విజయకుమార్ను చాంబర్లోకి కూడా రానివ్వలేదు. ఉన్నతాధికారులు తక్షణమే దీనిపై స్పందించాలని సిబ్బంది కోరుతున్నారు. -
కాకినాడలో దారుణం
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి ఘోరంగా హత్య చేశారు. మృతదేహంపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఆరేళ్ల కిందట ఇదే ప్రదేశంలో ఓ యువకుడు యువతిపై అత్యాచారం చేసి ఘోరంగా హత్య చేశాడు. ఇన్నేళ్ల తర్వాత ఇదే ప్రదేశంలో మరో ఘోరం చోటుచేసుకుంది. పీలేరులో మరో మహిళ పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు మండలం వరంపాటి వారిపల్లిలో మరో మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. మృతురాలు వరలక్ష్మి అనే వివాహితగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే వరలక్ష్మీ హత్యకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. -
ఈఎస్ఐ ఆస్పత్రిలో వసతులు మృగ్యం
కృష్ణాజిల్లా, ఇబ్రహీంపట్నం: అసంఘటిత రంగ కార్మికులకు ఆరోగ్య భరోసా కల్పించాల్సిన ఈఎస్ఐ వైద్యశాలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నం మండలంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో కార్మికులు పనిచేస్తున్నారు. సుమారు 6వేల మంది కార్మికుల కుటుంబాలకు విస్తృతమైన ఆరోగ్యసేవలు అందిచాల్సిన వైద్యశాలలో పర్మినెంట్గా వైద్యుడు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్చార్జి డాక్టర్లతో కాలం నెట్టుకొస్తున్నారు. మందులు, సదుపాయాలు సక్రమంగా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అరకొర వసతులు.. పరిసర గ్రామాల నుంచి ఈఎస్ఐ వైద్యశాలకు రోజుకు 200 మంది రోగులు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు. సోమవారం రోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. రోగులకు వైద్యసేవలు అందించేందుకు అందుబాటులో వైద్యులు లేరు. మధుమేహ పరీక్షలు, జ్వరం, జలుబు, వంటి వ్యాధులకు వైద్యపరీక్షలు సిబ్బందే నిర్వహిస్తారు. ఎక్స్రే సదుపాయం ఇక్కడలేదు. రోగి నిల్చోలేని పరిస్థితిలో కూర్చునేందుకు కనీసం బెడ్లు లేవు. ఉన్న ఒక్క బెడ్డుపై ఇద్దరు ముగ్గురిని ఉండాల్సిందే. పరిశ్రమల్లో జరిగే ప్రమాద సంఘటనల్లో కార్మికులు గాయపడితే సకాలంలో వైద్యులు అందుబాటులో లేక ప్రాణాప్రాయ స్థితిలోకి చేరుకుంటున్నారు. అధికసంఖ్యలో కార్మికులు.. ఎన్టీటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 2,500, కొండపల్లి ఐడీఏలో మరో 2వేల మంది, కార్వీలో 1,800మంది, ఆప్మెల్ సంస్థలో సుమారు 500 మంది చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో మరో 300మంది కార్మికులు ఉంటారు. వీరందరికి కార్మికశాఖ ఈఎస్ఐ కార్డులు మంజూరు చేసింది. కుటుంబానికి ఇద్దరు చొప్పున వేసినా 15వేల మంది వైద్య సహాయానికి ఆధారపడి ఉన్నారు. కార్మికులకు అనుగుణంగా సదుపాయాలు పెంచాలని కోరుతున్నారు. ఇన్చార్జి వైద్యులే దిక్కు.. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఉన్నత విద్యనభ్యసించేందుకు దీర్ఘకాలిక సెలవుపెట్టి నాలుగునెలల క్రితం వెళ్లారు. ఈ నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, భీమవరం, ప్రాంతాలకు చెందిన వైద్యులను రోజుకొకరిని ఇన్చార్జులుగా నియమించారు. ఇతర ప్రాంతాల నుంచి వైద్యులు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో అందుకోలేక సెలవులు పెడుతున్నారు. కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహించాల్సిన సమయానికి రాలేకపోతున్నారు. వైద్యసిబ్బంది రోగులకు పరీక్షలు నిర్వహించి సాధారణ మందులు ఇచ్చి పంపుతున్నారు. కొన్ని కేసులను గుణదలలోని ఈఎస్ఐ వైద్యశాలకు పంపుతున్నారు. కార్మికుల డిమాండ్లు.. కార్మికవాడగా అభివృద్ధి చెందిన ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో కనీసం 50పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు ఎక్స్రే, ఈసీజీ, అత్యవసర విభాగం నెలకొల్పాలని కోరుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి నాలుగు వేల మందికి ఒకరు చొప్పున మరో ఇద్దరు వైద్యులను నియమించాలని అంటున్నారు. షిప్టుల ప్రకారం 24గంటలు అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. డాక్టర్లు అందుబాటులో లేరు మండలంలో సుమారు 6వేల మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఈఎస్ఐ ఆస్పత్రికి పరిగెత్తాల్సిందే. అయితే సమయానికి వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఇన్చార్జి డాక్టర్లతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. – కొండపల్లి అప్పారావు, కార్మిక సంఘం నాయకుడు -
ఈఎస్ఐ వైద్యం.. భరోసాకు దూరం
సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్య సేవలు అధ్వానంగా మారుతున్నాయి. అనారోగ్యంతో ఈ ఆస్పత్రికి వస్తున్న రోగులు సరైన సేవలు అందక నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా ఇక్కడ డయాలసిస్ సేవల్ని ఉపసంహరించారు. దీంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా సేవలు నిలిపి వేస్తే ఎలా అని రోగులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు అందాలంటే రెండు నెలలపాటు నిరీక్షించాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. ఈ బాధలు భరించలేని కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అమీర్పేట్/సాక్షి, సిటీబ్యూరో:ఈఎస్ఐ ఆస్పత్రి అంటే ఓ భరోసా..ఓ ధైర్యం.. నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందుతుందనే నమ్మకం.. ఇప్పుడు సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి ఆపేరును చెరిపేసుకుంటోంది. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ ఆస్పత్రి కనీస భరోసా ఇవ్వలేకపోతోంది. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యపరికరాలు సమకూర్చుకుని రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి వైద్యసేవలను విస్మరిస్తుంది. తాజాగా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందించే ఏజేన్సీ పనితీరు సరిగా లేదని పేర్కొంటూ ఆ సేవలను నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ముందస్తు సమాచారం కూడా లేకుండా సేవలను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని రోగులు, వారి తరపు బంధువులు ప్రశ్నిస్తున్నారు. గడువున్నా..ఒప్పందం రదు... మూత్ర పిండాల పనితీరు దెబ్బతిన్న రోగులకు డయాలసిస్ చేస్తుంటారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో 1500 మంది బాధితులు వైద్యసేవలు పొందుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి కొందరికి వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంది. ఒక్కో బృందంలో 310 మందికి డయాలసిస్ చేస్తున్నా రు. ఈ సేవలను నెఫ్రోప్లస్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ సంస్థకు ఇచ్చిన గడువు ఇంకా కొంత కాలం ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ సంస్థతో సేవలను ఈఎస్ఐ రద్దు చేసుకుంది. ప్రత్యామ్నాయంగా డయాలసిస్ కోసం నగరంలో ఐదు ఆసుపత్రులను ఎంపిక చేసింది. అక్కడకు వెళ్లాలని రోగులకు సూచిం చింది. అకస్మా త్తుగా సేవలను ఎత్తివేయడంపై రోగులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే డయాలసిస్ కాంటాక్ట్ దక్కించుకున్న సంస్థ పనితీరు సరిగా లేనందు వల్లే సేవలను ఉపసంహరించుకున్నట్లు ఈఎస్ఐసీ సూపర్స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తి ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా ఐదు ఆస్పత్రులను ఇందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంఆర్ఐకి రెండు నెలలు... ఆస్పత్రిలో ఆరు సూపర్ స్పెషాలిటీ విభాగాలతో పాటు 16 సాధారణ చికిత్సల విభాగాలు ఉన్నాయి. సుమారు 380 పడకలు ఉన్న ఈ ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 500 మంది రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో నిత్యం 350 మందికిపైగా చికిత్స పొందుతుంటారు. క్షతగాత్రులతో పాటు తల నొప్పి, వెన్ను పూస నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న బాధితులు ఉంటారు. వీరిలో చాలా మందికి సీటీ, ఎంఆర్ఐ టెస్టులు అవసరం ఉంటుంది. వైద్యులు రాసిన చీటీ తీసుకుని ఎంఆర్ఐ విభాగానికి వెళ్తే..రెండు నెలల తర్వాత రావాల్సిందిగా సూచిస్తున్నారు. అప్పటికే వ్యాధి తీవ్రత మరింత ముదిరి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. చేసేది లేక కొంత మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రిలో రెండు అధునాతన ఎంఆర్ఐ మిషన్లు ఉన్నా సకాలంలో సేవలు అందకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
ఆసుపత్రికి ఆ స్థలం అనువుగా లేదు
ఢిల్లీ : విశాఖపట్నం జిల్లా షీలానగర్లో 500 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 8.59 ఎకరాల భూమి అనువుగా లేదని కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ బుధవారం రాజ్య సభలో వెల్లడించారు. షీలానగర్లో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందా? అలాంటి పరిస్థితులలో ఉత్తరాంధ్రలోని లక్ష మందికి పైబడి ఉన్న కార్మికులు శిధిలమైన భవనంలో ఉన్న ప్రస్తుత ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇంకా ఎంత కాలం వైద్య సేవలను పొందాల్సి ఉంటుంది? అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కార్మిక మంత్రి సవివరంగా జవాబిచ్చారు. విశాఖపట్నంలో 500 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం ఈఎస్ఐకి షీలానగర్లో రాష్ట్ర ప్రభుత్వం 8.59 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. అయితే ఈ భూమి ఆస్పత్రి నిర్మాణానికి అనువు కాదని తేలింది. దీనికి ప్రత్యామ్నయంగా విశాఖపట్నంలో ఏదైనా అభివృద్ధి చెందిన ప్రాంతంలో 10 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ఈఎస్ఐ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి తగిన భూమిని ఇంకా కేటాయించాల్సి ఉంది. అంతే తప్ప ఈఎస్ఐ ఆస్పత్రి భవన నిర్మాణ ప్రాజెక్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలగలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఉన్న విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ) ఆవరణలోని భవనం శిధిలావస్థకు చేరిన దృష్ట్యా దీనిని ఆస్పత్రి సేవలను అద్దెకు తీసుకున్న భవనంలోకి మార్చినట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అంతర్జాతీయ కార్గో టెర్మినల్ కార్యకలాపాలు నవంబర్ 2017 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమైనట్లు పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు బుధవారం రాజ్య సభలో ప్రకటించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్, అలైడ్ సర్వీసెస్ కంపెనీ ఆధ్వర్యంలో కార్గో టెర్మినల్ కార్యకలాపాల నిర్వహణ జరుగుతున్నట్లు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి చెప్పారు.అంతర్జాతీయ కార్గో ఆపరేషన్స్కు అవసరమైన ట్రక్-డాక్ ఏరియా, కార్గో స్టోరేజ్ స్థలం, కోల్డ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్స్, ఎక్స్-రే స్క్రీనింగ్ మెషీన్, ఎక్స్ప్లోజివ్ డిటెక్టర్ మెషీన్ వంటి అన్ని వ్యవస్థల ఏర్పాటు జరిగినట్లు మంత్రి తెలిపారు. అన్ని రకాల కార్గో, బల్క్ కార్గో కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన రీతిలో కార్గో టెర్మినల్ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఏటా 20,00 మెట్రిక్ టన్నుల కార్గో ఎగుమతి, దిగుమతి సామర్ధ్యం కలిగి ఉన్న ఈ టెర్మినల్లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 170 మెట్రిక్ టన్నుల కార్గో ఎగుమతులు, 155 మెట్రిక్ టన్నుల కార్గో దిగుమతి జరిగింది. పెరిగే అవసరాలకు అనుగుణంగా టెర్మినల్ సామర్ధ్యాన్ని పెంచడం జరుగుతుందని మంత్రి తెలిపారు. -
ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు ఎప్పుడో..?
మార్కాపురం: డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణంలో ఈఎస్ఐ వైద్యశాల ఏర్పాటు కలగా మారుతోంది. మార్కాపురం రెవెన్యూ అధికారులు హాస్పిటల్ కోసం పట్టణ నడిబొడ్డున కంభం సెంటర్లో ఉపయోగంలో లేని రోడ్డు భవనాల శాఖ కార్యాలయాన్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఈఎస్ఐ అధికారులకు గత ఏడాది జూన్లో సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి ఫైనల్ చేస్తే ఆ భవనాన్ని ఈఎస్ఐ వైద్యశాలకు కేటాయిస్తారు. అయితే ఈఎస్ఐ అధికారులు ఎప్పుడు వస్తారో తెలియలేదు. గత ఏడాది నుంచి అప్పుడోస్తాం, ఇప్పుడోస్తామంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఈఎస్ఐ అధికారులు రాకపోవటంతో ఖాళీగా ఉన్న ఈ భవనంలో పలువురు తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం పట్టణంలో సుమారు 40 పలకల ఫ్యాక్టరీల్లో, గనుల్లో కలిపి 4 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 1500 మంది కార్మికులకు ఫ్యాక్టరీల యజమానుల ద్వార ఈఎస్ఐ వైద్యశాలలో సభ్యత్వం ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్లో కార్పొరేట్ వైద్యం ఉచితంగా లభిస్తోంది. మార్కాపురంలో వైద్య సదుపాయాలు లేకుంటే ఈఎస్ఐ ఒప్పందం చేసుకున్న లింక్ హాస్పిటల్స్ విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, ఒంగోలు, హైదరాబాదుల్లోని కార్పొరేట్ వైద్యశాలలకు రిఫర్ చేస్తారు. దీని వల్ల వలన ఉన్నతమైన చికిత్స కార్మికులకు దక్కుతుంది. పలకల కార్మికులతో పాటు డివిజన్లోని వివిధ షాపుల్లో, పప్పుల, బొరుగుల బట్టీల్లో, బలపాల ఫ్యాక్టరీలు, వస్త్ర దుకాణాల్లో కలిపి సుమారు 4వేల మంది వరకు పనిచేస్తుంటారు. వీరిలో కొంత మందికి మాత్రమే యజమానులు కార్మికులుగా గుర్తించి ఈఎస్ఐలో నమోదు చేయించారు. యజమాని కార్మికునిగా గుర్తిస్తే ప్రతి ఏటా ప్రభుత్వానికి సభ్యత్వం చెల్లించాలి. యజమాని వాటా 4.75 శాతం, కార్మికుని వాటా 1.25 శాతంగా ప్రభుత్వానికి చెల్లించాలి. జిల్లాలో మార్కాపురం, చీరాల, మార్టూరుల్లో ఈఎస్ఐ వైద్యశాలలు ఉన్నాయి. డివిజన్ కేంద్రమైన మార్కాపురంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే కార్మికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈఎస్ఐ హాస్పిటల్ కోసం ఇక్కడి కార్మికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. -
నిర్మల్ ఈఎస్ఐని వేగవంతం చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్కు కేటాయించిన ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ను రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోరారు. బుధవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన ఇంద్రకరణ్రెడ్డి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే నిర్మల్లోని ఏరియా ఆస్పత్రిలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆయన కేంద్ర మంత్రికి అందజేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్రం అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో తదుపరి చర్యలను వేగవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్సింగ్ను కలిసి కందులను కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రం ఇదివరకే కొంత మేరకు పంట కొనుగోలు చేసినా, రాష్ట్రంలో భారీ స్థాయిలో పంట సాగుచేసినందువల్ల మిగిలిపోయిన పంటను కూడా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. -
తల్లీబిడ్డలను కలిపిన డీఎన్ఏ
సాక్షి, హైదరాబాద్: ఆ తల్లీ బిడ్డలను డీఎన్ఏ పరీక్ష కలిపింది. ఎవరి పిల్లలు వారికి దక్కడంతో వారం రోజులుగా తల్లడిల్లిన ఆ తల్లుల కళ్లల్లో ఆనందం వ్యక్తమైంది. హైదరాబాద్లోని ఏఎస్ఆర్ నగర్కు చెందిన శివకుమార్ భార్య అఖిల, ఎల్బీ నగర్కు చెందిన మహేశ్ సతీమణి మనీషారాణి ప్రసవం కోసం ఇటీవల నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరారు. నవంబర్ 29న ఒకే సమయంలో వేర్వేరుగా ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చారు. ప్రసూతి విభాగంలోని కిందిస్థాయి సిబ్బంది శిశువులకు కట్టిన ట్యాగ్ను పరిశీలించకుండానే ఒకరి బిడ్డను మరొకరికి అప్పగించారు. బంధువులకు అనుమానం వచ్చి ఆందోళనకు దిగడంతో అప్రమత్తమైన ఆస్పత్రి వైద్యులు అదే రోజు శిశువులకు రక్త పరీక్ష నిర్వహించి, వారి తల్లులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలపై తమకు నమ్మకం లేదని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని శిశువుల తల్లిదండ్రులు పట్టుబట్టడంతో ఆ మేరకు డిసెంబర్ ఒకటో తేదీన శిశువులు, తల్లిదండ్రుల నుంచి రక్తపు నమూనాలు సేకరించారు. బుధవారం ఉదయం డీఎన్ఏ ఫలితాలు వచ్చాయి. రిపోర్టు ఉన్న సీల్డ్ కవర్ను ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ, శిశువుల తల్లిదండ్రుల సమక్షంలో తెరిచి, అందులో ఏముందనేదీ బయటికి చదివి వినిపించారు. ముందస్తుగా అప్పగించినట్లు ఎవరి శిశువు వారి చెంతే ఉన్నట్లుగా రిపోర్టులో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అప్రమత్తమయ్యాం: ఈఎస్ఐ మెడికల్ సూపరింటెండెంట్ ఆస్పత్రి కి ంది స్థాయి సిబ్బంది పొరపాటు వల్ల చిన్నారుల తారుమారు జరిగిందని నాచారం ఈఎస్ఐ మెడికల్ సూపరెండెంట్ డాక్టర్ పద్మజ చెప్పారు. తల్లిదండ్రులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పట్టు పట్టడంతో రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. ఎవరి పిల్లలు వారి వద్దనే ఉన్నట్లు తేలిందని చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగరాదు ఆస్పత్రిలో చిన్నారుల తారుమారు ఘటనపై చిన్న చిన్న పొరపాట్లే తప్పిదాలకు దారి తీస్తుంది. ఈ విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. – ఎమ్మెల్యే ప్రభాకర్ ఎంతో ఆవేదన చెందాం తమకు కొడుకు పుట్టాడని ఎంతో సంతోషపడ్డాము. ఇంతలోనే శిశువుల తారుమారు ఘటన తమను ఎంతో ఆవేదనకు గురిచేసింది. వారం రోజులుగా మానసిక ఆందోళనకు గురయ్యాం. చివరకు మా పిల్లలు మా దగ్గర ఉన్నారనే విషయం తెలియడంతో సంతోషంగా ఉంది. – అఖిల, మనీషారాణి -
ఆ చిన్నారులు మారలేదు
-
అమ్మ ఒడికి చేరిన ఆ చిన్నారులు!
సాక్షి, హైదరాబాద్: నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చిన్నారులు తారుమారైన వ్యవహారం సుఖాంతమైంది. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా ఎవరి చిన్నారులను వారి తల్లిదండ్రులకు అధికారులు బుధవారం అప్పగించారు. ఈ వ్యవహారంలో ఎవరి పోలికలు ఉన్న పిల్లలు వారికే చెందడం గమనార్హం. ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు తారుమారు కావడంతో వివాదం తలెత్తింది. చిన్నారులు తారుమారు కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. తమ బిడ్డను తమకు అప్పగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వివాదానికి తెరదించేందుకు ఆస్పత్రి అధికారులు డీఎన్ఏ పరీక్షలను ఆశ్రయించారు. డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు చిన్నారులను ఈఎస్ఐ ఆస్పత్రి సంరక్షణలో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు డీఎన్ఏ పరీక్ష ఫలితాలు వచ్చాయి. వీటి ఆధారంగా తారుమారైన ఇద్దరు శిశువుల తమ తల్లుల ఒడికి చేరుకున్నారు. -
ఆస్పత్రిలో చిన్నారుల తారుమారు
నాచారం:నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బుధవారం ఉదయం జన్మించిన చిన్నారులు తారుమారు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెలితే... బుధవారం ఉదయం ఏఎస్రావునగర్కు చెందిన శివకుమార్, అఖిల దంపతులు, ఎల్బీనగర్కు చెందిన మహే ష్, మనీషారాణి దంపతులు డెలివరీ నిమిత్తం నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి వచ్చారు. అఖిల, మనీషారానిలకు ఆపరేషన్ చేయగా ఇద్దరు మగ శిశువులు జన్మించినట్లు కిందిస్థాయి సిబ్బంది తల్లిదండ్రులకు తెలిపారు. ఇద్దరు చిన్నారులకు పుట్టగానే ట్యాగ్లు వేసి అఖిలకు బిడ్డను చూపించారు. అంతలో మరొకరు వచ్చి ఈ శిశువు మీ శిశువు కాదు పొరపాటు జరిగిందంటూ మరో శిశువును అప్పగించారు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగారు. మొదట చూపిన శిశువే తమ శిశువని వాగ్వాదానికి దిగడంతో ఆస్పత్రిలో గందరగోళం నెలకొంది. ఆస్పత్రి వైద్యులు, ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని అంగీకరిస్తూ ఎవరి శిశువును వారికి అప్పగిస్తామని చెప్పి చిన్నారులు, వారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రుల, చిన్నారుల రక్త పరీక్షలు సరిపోయాయని ఎవరి శిశువును వారికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. అయినా తల్లిదండ్రులకు చిన్నారుల విషయంలో అనుమానం ఉండటంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పట్టుబట్టారు. ఇందుకు వైద్యులు అంగీకరించడంతో వారు శాంతించారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాం కింది స్థాయి సిబ్బంది (ఆయాలు) నిర్లక్ష్యం కారణంగా శిశువుల మార్పిడి జరిగింది. శిశువుల చేతికి ఉన్న ట్యాగ్ల ఆధారంగా ఎవరి శిశువులను వారికి అప్పగించాం. అయితే ఈ విషయం లో తల్లిదండ్రులకు అనుమానం వ్యక్తం చేయడంతో రక్త పరీక్షలు నిర్వహించగా, చిన్నారులు వారి తల్లిదండ్రులు నమూనాలు సరిపోయాయి. అయినా వారు అంగీకరించ నందున గురువారం సీసీఎంబీలో చిన్నారులకు డీఎన్ఏ పరీక్ష లు నిర్వహించి ఎవరి శిశువులను వారికి అప్పగిస్తాం. ప్రస్తుతం శిశువులు, తల్లులు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. – ఈఎస్ఐ ఎంఎస్ డాక్టర్ పద్మజ -
మల్టీ స్పెషాలిటీ ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించండి
హిందూపురం అర్బన్: హిందూపురం ప్రాంతంలో వివిధ పరిశ్రమల్లో పని చేసే 25 వేల మంది కార్మికులకు అనుగుణంగా 30 పడకల మల్టీ స్పెషాలిటీ ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేసి మెరుగైన వైద్యసేవలు అందించాలని బీజేపీ నాయకులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కోరారు. ఈమేరకు శుక్రవారం ఆ పార్టీ హిందూపురం నాయకులు హైదరాబాద్లో కేంద్రమంత్రి దత్తాత్రేయను కలిసి వినతిపత్రం అందజేశారు. హిందూపురంలో 24,500 మంది కార్మికులకు ఈఎస్ఐ కార్డులు ఉన్నా వారికి ఇన్పేషెంట్ సౌకర్యం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న డిస్పెన్సరీలో ప్రతిరోజు 300 మంది వైద్యసేవలు పొందుతున్నా అవసరమైన వైద్యులు కరువయ్యారని తెలిపారు. కొట్నూరు, హిందూపురం డిస్పెన్షరీలు ఒకే అద్దెభవనంలో కొనసాగుతున్నాయని వివరించారు. ఇందుకు మంత్రి దత్తాత్రేయ సానూకులంగా స్పందించి త్వరలోనే హిందూపురం సందర్శించి ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు రమేష్రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారధి, జిల్లా కార్యదర్శి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రణరంగంగా ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి
-
శంషాబాద్లో భారీ అగ్నిప్రమాదం
- గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి దగ్ధం - సురక్షితంగా బయటపడిన 30 మంది శంషాబాద్ (రాజేంద్రనగర్): రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ఆరంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 30 మంది ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.దాదాపు రూ.కోటి కి పైగా ఆస్తి నష్టం జరి గిందని అంచనా. ఇక్కడి మధురానగర్ కాలనీలో ఫిరంగి నాలాను ఆనుకొని ఈ భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఈఎస్ఐ ఆస్పత్రి ఉండగా, ఒకటో అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు అనుపమ లాడ్జిని నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఐదున్నర ప్రాంతంలో కాలనీలోని 11 కేవీ వైరు.. ఎల్టీ వైరుపై పడటంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఈఎస్ఐ ఆస్పత్రిలో వైర్లు దగ్ధమై పొగలు రావడంతో యజమాని, సెక్యూరిటీ గార్డు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. మొదటి అంతస్తులోని లాడ్జి రిసెప్షన్ గది కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉన్న మందులతో పాటు ఇతర సామగ్రి, రికార్డులు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటల సెగలు పైకి ఎగబాకుతుండడంతో లాడ్జి గదు ల్లో ఉన్న సుమారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నాలుగు ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తేవడంతో వారంతా బయటకు వెళ్లారు. -
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో విశేష ప్రజాదరణ పొందిన బీజేపీ.. ఇక తెలంగాణలోనూ బలోపేతంపై దృష్టి సారించనున్నట్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. యూపీ ఫలితాలే బీజేపీపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మున్ముందు తెలంగాణలోనూ పార్టీని పటిష్టపరచడానికి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో సమావేశం కానున్నట్టు తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. గోదావరి ఖనిలో బొగ్గు గని కార్మికులకు పీఎఫ్, పింఛన్లు సకాలంలో అందడానికి కోల్ ఇండియాకు సంబంధించిన సబ్ రీజినల్ ఆఫీస్ను అక్కడ ఏర్పాటు చేసి, రీజినల్ ఆఫీసును హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీబీనగర్లో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయండి.. యాదాద్రి భువనగిరిలో 550 పరిశ్రమల్లో సుమారు 22 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించడానికి చౌటుప్పల్ లేదా బీబీనగర్లో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయను ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రితో ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమై వినతి పత్రాన్ని సమర్పించారు. -
2 నెలలు ఆగి రండి!
అత్యవసర పరీక్షలపై సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ ⇒ సిటీస్కాన్, ఎంఆర్ఐలకూ నెలల తరబడి ఆగాల్సిందే ⇒ రిపోర్టుల కోసం మరో పక్షం రోజుల నిరీక్షణ ⇒ ఆ లోపు వ్యాధి ముదిరితే అంతే సంగతి! వరంగల్లోని భారత్ గ్యాస్ కార్యాలయంలో పని చేస్తున్న భాస్కర్.. ఇటీవల అకస్మాత్తుగా ఎడమ కాలి స్పర్శ కోల్పోయాడు. స్థానిక ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు అత్యవసరంగా ఎంఆర్ఐ పరీక్ష చేయించాలని చెప్పారు. దీంతో జనవరి 30న హుటాహుటిన హైదరాబాద్ సనత్నగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రికి వచ్చాడు. అత్యవసరమైనప్పటికీ ఫిబ్రవరి 21 వరకు ఎంఆర్ఐ తీసేందుకు వీలు లేదని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. వారు చెప్పినట్లే గతనెల 21న ఎంఆర్ఐ పరీక్ష చేయించాడు. కాని రిపోర్టులు మాత్రం భాస్కర్ చేతికందలేదు. దీంతో చికిత్స చేయించుకోవాల్సిన సమయంలో ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నాడు. రిపోర్టు రానిదే చికిత్స చేయలేమని వైద్యులు తేల్చి చెప్పడంతో భయాందోళన చెందుతున్నాడు. ఉప్పల్కు చెందిన ఎన్.మల్లారెడ్డి వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాడు. పక్షం రోజుల క్రితం నిలబడలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించగా అత్యవసరంగా ఎంఆర్ఐ తీయించమని చెప్పాడు. దీంతో ఎంఆర్ఐ పరీక్ష కోసం కౌంటర్ వద్దకు వెళితే.. మే 24వ తేదీన వచ్చి పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.వెన్నునొప్పి తీవ్రం కావడం, నడవలేని పరిస్థితి ఏర్పడడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. సాక్షి, హైదరాబాద్: జబ్బు చేసి దవాఖానకు వెళ్తే.. ఖాళీ లేదు మళ్లీ రండి అంటే..? వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలంటే.. ‘రెండు నెలల తర్వాత..’ అని తిప్పి పంపిస్తే.. ఆ రోగి పరిస్థితి ఏమిటి? హైదరాబాద్లోని కార్మిక ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న దుస్థితి ఇది. చికిత్స కోసం వందల కిలోమీటర్ల నుంచి వస్తున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి నరకం చూపిస్తోంది. అత్యవసర పరీక్షలు తక్షణమే చేయాల్సిందిగా వైద్యులు సూచనలు చేస్తుండగా.. ఆస్పత్రిలో మాత్రం పరీక్షలు చేసేందుకు నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. రెండు నెలల తర్వాత.. వ్యాధి నిర్ధారణలో ఎంఆర్ఐ, సిటీస్కాన్ పరీక్షలు కీలకం. ఈ పరీక్షల ఆధారంగా వచ్చే ఫలితాలను బట్టి రోగులకు చికిత్స మొదలుపెడతారు. ఈ పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవి. దీంతో ఈ పరీక్షలు అవసరమున్న కార్మికులు అత్యాధునిక పరికరాలు ఉన్న సనత్నగర్ ఆస్పత్రిలో సంప్రదిస్తారు. కాని ఇక్కడ పరీక్షలు నిర్వహించడానకే నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు. అత్యవసర కేటగిరీలో వచ్చే పేషంట్లను కూడా రెండు నెలల తర్వాత వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్పత్రి కావడంతో పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ.. పరీక్షలు చేయడానికి రెండు నెలల తర్వాత రమ్మనడంపై కార్మిక కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షల ఫలితాల సంగతీ అంతే! సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఒక ఎత్తయితే.. వాటి తాలూకు రిపోర్టులు తీసుకోవడం మరో ఎత్తు. పేషంట్లు నిర్దేశిత తేదీల్లో వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నా.. రిపోర్టులు పొందాలంటే వారం నుంచి పక్షం రోజులు ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిందే. రిపోర్టులు రాకపోవడంతో చికిత్స ప్రారంభించలేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆస్పత్రిని నమ్ముకుని వచ్చిన రోగి ప్రాణాలమీదకు వస్తోంది. ఎంఆర్ఐ, సిటీస్కాన్ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉందని, గతంలో ఆరుగురు పని చేస్తుండగా ప్రస్తుతం నలుగురే ఉన్నారని, రెండు రాష్ట్రాల నుంచి పేషంట్లు అధికంగా రావడంతో జాప్యం జరుగుతోందని ఆ విభాగ అధికారి స్వర్ణలత ‘సాక్షి’కి తెలిపారు. -
సిరిసిల్ల ఈఎస్ఐలో వసతులు కల్పించాలి
కేంద్ర మంత్రి దత్తాత్రేయకు విన్నవించిన పొన్నం సాక్షి, న్యూఢిల్లీ: సిరిసిల్లలోని ఈఎస్ఐ ఆస్పత్రి నిర్లక్ష్యానికి గురవుతోందని, సిబ్బంది, మౌలిక వసతుల కొరత వేధిస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మంగళవారం కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా ఉన్న కార్మికులు, చిరుద్యోగులకు వరంగా ఉన్న ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన దత్తాత్రేయ... ఆస్పత్రిని 100 పడకలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు. సిబ్బంది భర్తీ చేసేందుకు, మౌలిక వసతుల ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. -
మూడు నెలల ఆడశిశువు విక్రయం!
విచారణ జరుపుతున్న ఐసీడీఎస్ అధికారులు హైదరాబాద్: మూడు నెలల పసిగుడ్డును బేరానికి పెట్టాడో తండ్రి. మధ్యవర్తి ప్రమేయంతో శిశువును అడిగిన వారికి అప్పగించాడు. స్థానికుల ఫిర్యాదుతో ఐసీడీఎస్ అధికారులు శనివారం దీనిపై విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో బిడ్డను విక్రయించి నట్టు వారు అంచనాకు వచ్చారు. కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్కి చెందిన మాలోత్ రవీందర్నాయక్కు మెదక్జిల్లా రామాయంపేట మండలం కౌడిపల్లి గ్రామానికి చెందిన అంజలితో 2014లో పెళ్లయింది. వీరికి మొదటి కాన్పు(2015)లో కుమార్తె జన్మించింది. ఈ ఏడాది మార్చి 14న రెండో కాన్పులోనూ ఆడ బిడ్డే పుట్టింది. సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో అంజలి ప్రసవించిన సమయంలో వీరికి రామాయంపేట లక్ష్మీపురం గ్రామానికి చెందిన రజితతో పరిచయమైంది. తనకు పిల్లలు లేరని, మీ బిడ్డను ఇస్తే పెంచుకుంటానని రజిత వారితో చెప్పింది. అనంతరం వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి వెళ్లిపోయారు. కాగా, ఏప్రిల్ 10న వారి బంధువు మధు మధ్యవర్తిత్వంతో రజితకు చిన్నారిని రవీందర్ అప్పగించాడు. స్థానికులు శిశువును విక్రయించారని ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చారు. స్పందించిన ఐసీడీఎస్ మేడ్చల్ సూపర్వైజర్ స్పందన, చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా అధికారి లావణ్యరెడ్డి శనివారం రవీందర్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. బిడ్డను ఎందుకు విక్రయించారని నిలదీయగా తెలిసినవారికి దత్తత ఇచ్చానని ఒకసారి.. పిల్లలు లేరని ఓ మహిళ విలపించడంతో ఆమెకు ఇచ్చానని మరోసారి.. పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అంజలి... తనకేమీ తెలియదని, తన భర్త ఇవ్వమంటే బిడ్డను ఇచ్చానని చెప్పింది. దంపతులు విచారణకు సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిస్తున్నారని ఐసీడీఎస్ అధికారులు వెల్లడించారు. దీనిపై స్థానిక పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. -
ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలి
శ్రీకాకుళం: జిల్లాలో కార్మికులందరికీ ఉపయోగపడేలా ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలని ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర నేత చౌదరి పురుషోత్తంనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని వైఎస్సార్ కల్యాణమండపంలో ఆదివారం సీఐటీయూ 9వ జిల్లా మహాసభ (రెండరోజు) జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐటీయూ పోరాటాలకు కార్మికులంతా అండగా నిలవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న స్కీంవర్కర్లు, అంగన్వాడీలతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తోందని విమర్శించారు. బీడీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. పోరాటాలు, ధర్నాలు, బంద్లను అణచివేసేందుకు ముందస్తుగా సెక్షన్ 30 ని అమలు చేయడం సరికాదన్నారు. సెప్టెంబర్ 2న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు కార్మికులంతా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ముందుగా సీఐటీయూ జెండాను సీనియర్ నాయకుడు వీజీకే మూర్తి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింగరావు, నాగమణి, డి.గోవిందరావు, ఎన్.తిరుపతిరావు, ఎన్.షణ్ముఖరావు, గురివినాయుడు, అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
దత్తాత్రేయతో ఇంద్రకరణ్రెడ్డి భేటీ
హైదరాబాద్: కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదివారం భేటీయ్యారు. ఈ భేటీలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు సబ్ రీజనల్ ఈపీఎఫ్ ఆఫీస్ను ఏర్పాటుచేయాలని ఇంద్రకరణ్ విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని దత్తాత్రేయ తెలిపినట్లు సమాచారం. -
బీసీల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్
♦ హెల్త్ సిటీగా విశాఖ : సీఎం ♦ విజయవాడలో జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణ విజయవాడ (భవానీపురం)/ సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళిక కోసం బడ్జెట్లో రూ.8,700 కోట్లు కేటాయింపులు చేశామని చెప్పారు. మహాత్మా జ్యోతిబా పూలే 190వ జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఏర్పాటుచేసిన పూలే విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. విశాఖలోని ఏయూ కాన్వొకేషన్ హాలులో నిర్వహించిన పూలే జయంతి ఉత్సవంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలసి పాల్గొన్నారు. విజయవాడ, విశాఖల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం జ్యోతిబా పూలే స్ఫూర్తితో, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విధానాలతో పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. బీసీ హాస్టళ్లను పూర్తిగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తున్నామని తెలిపారు. విశాఖ హనుమంతవాక వద్ద రూ.565 కోట్లతో 1,300 పడకల సామర్థ్యంతో నిర్మించిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్ (విమ్స్)ను చంద్రబాబు ప్రారంభించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో దీనిని తీర్చిదిద్దుతామన్నారు. హెల్త్ సిటీగా విశాఖను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇలావుండగా నక్కపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు రూ.18 లక్షల చెక్ను బుచ్చిరాజుపాలెం వద్ద సీఎం పంపిణీ చేశారు. విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్టు వరకు సీఆర్డీఏ ఏర్పాటు చేసిన గ్రీనరీ, నూతన టెర్మినల్ పనులను సోమవారం ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈఎస్ఐ ఆస్పత్రికి శంకుస్థాపన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఉపయోగపడే విధంగా 300 పడకల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన ఈఎస్ఐ ఆస్పత్రిని సీఎం అభ్యర్థన మేరకు 500 పడకల సామర్ధ్యానికి పెంచడంతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. తుంగ్లాంలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. ఆరోగ్యశ్రీయే స్ఫూర్తి: వెంకయ్యనాయుడు సుమారు పదేళ్లుగా రాష్ర్టంలో నిరుపేదలకు ఎంతగానో ఉపయోగ పడుతున్న ఆరోగ్యశ్రీ పథకం స్ఫూర్తిగా జాతీయ ఆరోగ్య బీమా పథకాన్ని దేశ వ్యాప్తంగా ఈ ఏడాది నుంచే అమలు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రపంచంలో ప్రతి 10వేల మందికి 20 మంది డాక్టర్లుంటే..మన దేశంలో ఆరుగురే ఉన్నారన్నారు. ప్రభుత్వాస్పత్రు ల్లో వైద్యసేవలు ఘోరంగా ఉండడం వల్లే 67 శాతం మంది ప్రైవేటు, ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు. -
ఈఎస్ఐ ఆస్పత్రి త్వరలో నాచారం తరలింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎస్ఐ సనత్నగర్ ఆస్పత్రిని నాచారం తరలింపు ఖాయమైంది. ఈ మేరకు ఈఎస్ఐ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గురువారం ఎంవోయూ కుదిరింది. అయితే ఈ విషయాన్ని 12న కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంయుక్తంగా ప్రకటించే అవకాశం ఉంది. సనత్నగర్లోని ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిర్వహణ కోసం రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిని కార్పొరేషన్కు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నాచారం ఆస్పత్రిని రాష్ట్ర కార్మికశాఖకు అప్పగించనున్నారు. ఈ మేరకు సనత్నగర్ ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఉద్యోగులు త్వరలో నాచారం ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. -
ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం
హైదరాబాద్: నగరంలోని నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో శుక్రవారం ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన మజ్జిగ రజిత(24), సమ్మయ్య(29) దంపతులు బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. 2010లో వీరి వివాహం జరుగగా.. మొదటి కాన్పుగా లాస్యశ్రీ(3) జన్మించింది. రెండో కాన్పు కోసం రజిత గురువారం ఈఎస్ఐ ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం ఉదయం నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అందులో ముగ్గురు మగ శిశువులు, ఒక ఆడ శిశువు ఉన్నారు. వీరంతా 1.6-1.75 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ లీనా కనుంగో మాట్లాడుతూ ఈఎస్ఐ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఒక మహిళకు ఆపరేషన్ చేసి నలుగురు పిల్లలకు జన్మనివ్వడం జరిగిందన్నారు. 76 గంటల పాటు శిశువులను ఐసీయూలో ఉంచాలని చెప్పారు. కాగా ఒకే కాన్పులో నలుగురు శిశువులు పుట్టడం పట్ల తండ్రి సమ్మయ్య ఆనందం వ్యక్తం చేశారు. సమ్మయ్య విద్యానగర్లోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్నాడు. -
ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం
-
2006 కేసులో కేసీఆర్ను విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ 2006లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులో సీబీఐ ఆయనను విచారించింది. నిర్మాణ కాంట్రాక్టును కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కు కాకుండా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు కేటాయించిన ఈ కేసులో దర్యాప్తు సంస్థ సోమవారం కేసీఆర్ను ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. 2006లో యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కాంట్రాక్టు ఇచ్చారన్నాయి. నిర్మాణ పనుల్లో నాణ్యత లేదంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ ప్రారంభించడంతో ఉద్యోగ రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) 2007-08లో విచారణ చేపట్టిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నాసిరకం పనుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అనుమానిస్తున్నట్లు చెప్పాయి. ఈ కేసులో ఏపీ ఫిషరీస్కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూర్యనారాయణపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆయన ఇప్పటికే భారీగా అక్రమాస్తులను కూడబెట్టిన కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్కు ప్రైవేటు కార్యదర్శిగా ఉన్న నాటి ఈఎస్ఐసీ డెరైక్టర్ జనరల్, కంట్రోలర్ ఆఫ్ ఫైనాన్స్ను కూడా సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది. -
నవ్యాంధ్రలో 150 పడకల ESI ఆసుపత్రి
-
పాత కార్మిక చట్టాలను ప్రక్షాళన చేస్తాం
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, విజయవాడ : పాత కార్మిక చట్టాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, పది మంది కార్మికులు పని చేసే సంస్థనూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చేలా కొత్త చట్టాలు చేస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం గుణదలలో కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐ) ఉప ప్రాంతీయ కార్యాలయం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ పరిధిలో 59 కోట్ల మంది ఉన్నారని, వారి కుటుంబసభ్యుల సంక్షేమం, ఆరోగ్యం, సాం ఘిక భద్రత కల్పించేందుకు కార్మిక శాఖ ప్రయత్నిస్తోందన్నారు. ఉప ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 9.68 లక్షల మంది కార్మిక కుటుం బాలు ఆధారపడి ఉన్నాయని, కృష్ణా, గుంటూ రు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలు ఈ కార్యాలయ పరిధిలోకి వస్తాయని ఆయన వివరించారు. ఈ-బిజ్ విధానం ద్వారా కార్మికుల వివరాలను సమోదు పక్రియ చేపడతామన్నారు. దీని ద్వారా కార్మికుడు ఎక్కడ పని చేసి నా అతను పని చేసిన కాలానికి సంబంధించి ఈపీఎఫ్ తదితర మొత్తాలు వెంటనే తీసుకునే వీలుంటుందని తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కొద్ది కాలంలోనే దేశంలో అభివృద్ధి రేటు 7.3 శాతానికి పెరిగిందని, దేశం ఇదే తరహాలో అభివృద్ధి చెందితే చైనాను అధిగమించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఈఎస్ఐ డెరైక్టర్ జనరల్ ఎ.కె.అగర్వల్ మాట్లాడుతూ ఈఎస్ఐ హస్పటల్లో లేని వైద్య సేవలను కార్పొరేట్ హస్పటల్ ద్వారా అందజేస్తున్నామని అన్నారు. కార్మికులు ఈఎస్ఐపై అవగాహన పెంచుకుని మెరుగైన వైద్య సేవలు పొదాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ కార్మికులు ఈఎస్ఐ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలుపొందటం తమ హక్కుగా భావించాలన్నారు. సీఐటీయూ నేతల విన్నపం ఈఎస్ఐ హాస్పటల్లో కనీస సౌకర్యాలు లేవం టూ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ఆధ్వర్యం లో పలువురు సీఐటీయూ నేతలు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. హాస్పటల్లోఎంఆర్ఐ, సీటీ స్కాన్, అల్ట్రాస్కాన్ పరీక్షలు చేసే యంత్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వార్డుల్లో తనిఖీలు మంత్రి దత్తాత్రేయ ఈఎస్ఐ హాస్పటల్లోని వార్డుల్లో పర్యటించి రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. క్యాంటిన్ సౌకర్యం లేదని ఒక మహిళా రోగి మంత్రి దృష్టికి తీసుకువచ్చింది. హాస్పటల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని పలువురు రోగులు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కె.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, కార్పొరేటర్ అపర్ణ, ఈఎస్ఐ రీజినల్ డెరైక్టర్ చిన్మయబోస్, డెప్యూటీ డెరైక్టర్ ఎస్.కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు యూవీ శ్రీనివాసరాజు, లాకా వెంగళరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
'హైదరాబాద్ కంటే మెరుగ్గా బెజవాడలో..'
హైదరాబాద్: హైదరాబాద్ లో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి కంటే మెరుగైన ఆసుపత్రిని విజయవాడలో ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. కార్మిక రాజ్య బీమా సంస్థ ఉప ప్రాంతీయ కార్యాలయ నూతన భవనాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు శనివారం విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఈఎస్ఐ ఆస్పత్రి గవర్నమెంట్ ఆస్పత్రి కంటే మెరుగ్గా ఉండాలని సూచించారు. దేశ అభివృద్ధిలో కార్మిక శాఖ కీలకమైందన్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ప్రావిడెన్స్ ఫండ్ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రంలో కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. దేశంలో కార్మిక చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాగా, విజయవాడలోని గేట్ వే హోటల్లో మహిళా పారిశ్రామిక నేతల సదస్సుకు వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ప్రత్యేక హోదా కల్పించలేని వెంకయ్యనాయుడు అంటూ వామపక్షాల ఆధ్వర్యంలో హోటల్ ఎదుట ధర్నా నిర్వహించారు. దాంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
సొమ్మసిల్లి పడిపోయిన కేంద్ర మంత్రి దత్తన్న
విశాఖపట్నం: సాక్షాత్తు కేంద్ర మంత్రి అల్పాహారంలేక సొమ్మసిల్లిపడిపోయిన సంఘటన ఆదివారం విశాఖలో జరిగింది. ఉదయమే విమానంలో విశాఖ వచ్చిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్కు వెళ్లారు. అటునుంచి నేరుగా పోర్టు ప్రాంగణంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి సందర్శనకు వెళ్లారు. ఎక్కడా ఆయన అల్పాహారం స్వీకరించలేదు. ప్రొటోకాల్ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో షుగర్ లెవెల్స్ పడిపోయి దత్తాత్రేయ సొమ్మసిల్లారు. వెంటనే గుర్తించిన పార్టీ నేతలు ఆయనను గదిలోకి తీసుకువెళ్లి సపర్యలు చేశారు. అల్పాహారం చేయలేదని తెలుసుకుని అందించారు. ఈ విషయమై ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అధికారులు, ఆస్పత్రి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతని ఈఎస్ఐ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ రాధాకృష్ణపై మండిపడ్డారు. అల్పాహారం ఏర్పాటు చేయాల్సిందిగా తమకు చెప్పలేదంటూ రాధాకృష్ణ కూడా అంతేస్థాయిలో సమాధానమివ్వడంతో వారిమధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. -
సీఆర్డీఏ పరిధిలో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి
తిరుపతి : గుంటూరు, విజయవాడ నగరాల (కొత్త రాజధాని) మధ్య ఆధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ (ఈఎస్ఐ) ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తిరుపతిలోని ఈఎస్ఐ ఆస్పత్రిని మంత్రి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తూ ఈఎస్ఐ ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్నంలో అవసాన దశలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రిని 200 పడకలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విజయనగరంలో అసంఘటిత రంగ కార్మికులు అధికంగా ఉన్నారని, వీరి సౌకర్యార్థం అక్కడున్న ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలుగా తీర్చిదిద్దుతామన్నారు. తిరుపతిలోని ఈఎస్ఐ ఆస్పత్రిని సైతం 100 పడకలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, వృత్తి విద్యా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి 5 కోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
సొత్తు కోసమే చంపేశారు..
విజయవాడ సిటీ : నగరంలోని గుణదల ఈఎస్ఐ ఆస్పత్రి వెనుక వైపు, జియోన్ పాఠశాల సమీపంలో జరిగిన వల్లభనేని మాధురీ దేవి(65) హత్య కేసు మిస్టరీ వీడింది. గతంలో వారింట్లో కార్పెంటరీ పనులు చేసిన తోట్లవల్లూరు కనకదుర్గానగర్ కాలనీకి చెందిన అబ్దుల్ అజీజ్, తన స్నేహితుడు వాహిద్తో కలిసి నగల కోసమే ఆమెను హతమార్చినట్లు పోలీసులు నిర్థారించారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇద్దరినీ వేర్వేరుగా ఉంచి విచారణ జరుపుతున్నారని సమాచారం. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ‘సేఫ్ సిటీ’ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్న తరుణంలో సొత్తు కోసం హత్య చేయడాన్ని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితులను వారి ఇళ్ల వద్దనే అదుపులోకి తీసుకున్నారు. ఇతర కేసుల్లో వారి ప్రమేయంపై ఆరా తీస్తున్నట్టు చెపుతున్నారు. ముందస్తు పథకంతోనే నిందితులు ముందస్తు పథకంలో భాగంగానే సొత్తు కోసం మాధురీదేవిని హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గతంలో ఇక్కడ కార్పెంటరీ పనులు చేసిన సమయంలో పెద్ద మొత్తంలో నగలు, నగదు ఉండటాన్ని అజీజ్ గుర్తించాడు. అప్పటి నుంచి అవకాశం చూసుకొని దోపిడీకి పథకం రూపొందించుకున్నట్టు తెలిసింది. ఇందుకోసం తన స్నేహితుడైన వాహిద్ సహకారం తీసుకున్నట్టు చెపుతున్నారు. నగలు ఇచ్చేం దుకు ఆమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడిన నిందితులు..తాళాలు దొరక్క బీరువాలోని నగలు వదిలేసి వంటిపై నగలతోనే ఉడాయించారు. హత్య జరిగిందెప్పుడు? హత్య జరిగిన సమయంపై పోలీసులు తగిన నిర్థారణకు రాలేకపోతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిందితుడు వచ్చినట్టు కోడలు సరిత ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు గుర్తించారు. అదే సమయంలో పిల్లలను తీసుకొని సరిత బయటకు వెళ్తున్నప్పుడు లోపల మాధురీదేవి ఉయ్యాలలో కూర్చొని ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెపుతున్నారు. మరి ఆ గంట పాటు నింది తులు ఎక్కడ ఉన్నారనే దానిపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది తెలిస్తే హత్య వెనుకున్న ఇతర కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందనేది పోలీసు అధికారుల అభిప్రాయం. కోడలు సరిత సహా ఇంట్లోని వాళ్లందరూ బయటకు వెళ్లిన తర్వాతనే నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. అజీజ్ లోనికి వెళితే.. రెండో నిందితునిగా భావిస్తున్న వాహిద్ ఇతరులను గమనించేందుకు బయట ఉండొచ్చనే అభిప్రాయం పోలీసు అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. ఏం జరిగిందంటే.. జీయోన్ పాఠశాల సమీపంలోని సొంత ఇంటి కింది పోర్షన్లో మాధురీదేవి నివసిస్తున్నారు. పై పోర్షన్లో ఆమె కొడుకు సుజన్, కోడలు సరిత ఉంటున్నారు. మాధురీదేవి వద్దకు ఆదివారం మధ్యాహ్నం కార్పెంటరీ పనులు చేసే అబ్దుల్ అజీజ్ వచ్చాడు. ఎందుకొచ్చావని మాధురీదేవి ప్రశ్నించడంతో ‘మేకులు కొట్టేందుకు మీ కోడలు రమ్మంది’ అని అతడు బదులి చ్చాడు. ఇంటర్ కమ్ ఫోన్లో కోడలిని సంప్రదించిన మాధురీదేవి నిందితుడు అబద్దం చెబుతున్నట్లు నిర్ధారించుకొని వెనుదిరిగింది. సొత్తు కోసం అబ్దుల్ అజీజ్ బెదిరించగా ఆమె ప్రతిఘటించింది. అయితే అజీజ్, అతని స్నేహితుడు వాహిద్ సమీపంలోని వైరుతో ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఆమె కిందపడటంతో గాయపడి రక్తం స్రవించడంతో అనుమానం రాకుండా ఉండేందుకు సమీపంలోని దిండుతో శుభ్రపరిచారు. అనంతరం ఆమె వంటిపై ఉన్న బంగారు గాజులు, అందుబాటులోని నగదుతో ఉడాయించారు. అదే ఇంట్లోని పైభాగంలో ఉండే కోడలు పిల్లలతో కలిసి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చూడగా మాధురీదేవి కిందపడిపోయి కని పించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె మృతి చెందినట్టు నిర్థారించుకున్న తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలి కోడలు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. -
వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి
తల్లిదండ్రుల ఆందోళన ఆస్పత్రి సూపరింటెండెంట్కు ఫిర్యాదు నాచారం: నాచారం ఈఎస్ఐ వైద్యుల నిర్లక్ష్యంతో ఐదు నెలల చిన్నారి తమకు దూరమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...నాచారం ఇందిరానగర్కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, శైలజ దంపతులకు ఐదు నెలల క్రితం ఈఎస్ఐ ఆస్పత్రిలో పాప(సహస్ర) జన్మించింది. సహస్ర వారం రోజులుగా అస్వస్థతతకు గురికావడంతో సోమవారం నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు చిన్నారిని పరిశీలించి ఆమె ఆరోగ్యం క్షీణిం చిందని ఐసీయూలోకి మార్చారు. వివిధ రకాల పరీ క్షలు చేశారు. అనంతరం విధులకువచ్చిన వైద్యుడు పాప ఆరోగ్యం బాగానే ఉందంటూ జనరల్ వార్డ్కు పంపించారు. ఆ తరువాత అర గంటకు ఆ చిన్నారి ఆ రోగ్యం మరింత క్షీణించింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు అక్కడి నర్సులకు తెలిపారు. దీంతో ఓ నర్స్ డా క్టర్కు ఫోన్లో సమాచారం అందించారు. చిన్నారికి ఏ చికిత్స చేయాలో ఫోన్లోనే వారికి తెలిపారు. బుధవా రం తెల్లవారుజామున పాప ఆరోగ్యం మరింత క్షీణించడంతో లోటస్ ఆస్పత్రికిపంపుతున్నామని తల్లిదండ్రులకు తెలిపారు. అనంతరం ఓ ఇంజక్షన్ ఇచ్చారు. ఇం జక్షన్ ఇచ్చిన అరగంటకే చిన్నారి తుదిశ్వాస విడిచింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలను బలిగొందని, ఇం జక్షన్ వికటించి చిట్టి తల్లి మృతి చెందిందని ఆందోళన చేశారు. చిన్నారి మృతి చెందగానే ఆమెకు చికిత్స చేసి న వైద్యులు ఆస్పత్రి నుంచివెళ్లిపోయారని ఆరోపిం చారు. ఈమేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీల్ దేశ్పాండే వద్దకు వెళ్లి, పసిపాప మరణానికి కారణమైన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎంఎస్ విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు. -
ఈఎస్ఐ ఆస్పత్రి ఇంకెన్నాళ్లకు?
తాండూరు, న్యూస్లైన్: వేలాదిమంది కార్మికులు వైద్యసేవల కోసం అల్లాడుతున్నారు. అందుబాటులో కార్మిక బీమా ఆస్పత్రి లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక నిస్సహాయంగా గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో పరిశ్రమలున్న తాండూరు ప్రాంతంలో కార్మికులకు వైద్యసేవలు అందని ద్రాక్షగా మారాయి. తాండూరు అంటే గుర్తొచ్చేది జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధికెక్కిన షాబాద్ (నాపరాతి) బండలు. వందలాది నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కాకుండా మరో నాలుగు పెద్ద సిమెంట్ కర్మాగారాలూ తాండూరులో ఉన్నాయి. నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలతో బీడీల పరిశ్రమ, భవన నిర్మాణం తదితర రంగాల్లో సుమారు 15-20వేల మంది వరకూ కార్మికులు పనిచేస్తున్నారని అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో సుమారు 5వేలమంది కార్మికులు ఉంటే కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. కానీ తాండూరులో సంఘటిత, అసంఘటిత రంగాల్లో వేలాదిగా కార్మికులు పనిచేస్తున్నా కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటుకు నోచుకోవడం లేదు. ఆయా రంగాల నుంచి సర్కారుకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నా ఈ ప్రాంతంలో ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోవడం గమనార్హం. పలుమార్లు తాండూరులో పర్యటించి కార్మికుల వివరాలు సేకరించిన ఆ శాఖ అధికారులు వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పదేళ్లుగా హామీలు ఇవ్వడమే తప్ప ఇంతవరకూ ఆస్పత్రి అతీగతి లేదు. దీంతో గనులు, నాపరాతి పాలిషింగ్ యూనిట్లలో ప్రమాదాలకు గురవుతున్న కార్మికులు మృత్యువాత పడుతుండగా, పలువురు అంగవైకల్యానికి గురవుతున్నారు. జబ్బులు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక జీవితాలను వెళ్లదీస్తున్నారు. తాండూరులో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్కు గతంలోనే ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి విన్నవించారు. తాండూరు మండలంలోని చెన్గేష్పూర్ లేదా మల్కాపూర్ నుంచి గౌతాపూర్ మార్గంలో కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం ప్రతిపాదించారు. సుమారు 5ఎకరాల స్థలం ఇందుకు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయినా ఈ విషయంలో పురోగతి లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనైనా కార్మికులకు వైద్య సేవలందించాలని పలు కార్మిక సంఘాల నాయకులు కార్మిక శాఖ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి హామీ ఇచ్చినా చలనం లేని రాష్ట్ర సర్కార్ స్థానిక కార్మిక సంఘాల నాయకులు 2012 సంవత్సరంలో అప్పటి కేంద్ర కార్మిక మంత్రి మల్లికార్జున ఖర్గేను కలిసి ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు కోసం వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని సీసీఐ కార్మిక సంఘం నాయకుడు శరణు చెప్పారు. అయితే స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈఎస్ఐ ఆస్పత్రి అటకెక్కింది. -
వామ్మో..ఈఎస్ఐ ఆస్పత్రులా !
సూళ్లూరుపేట, న్యూస్లైన్ : కార్మికుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, వారి జీతంలో నుంచి కేటాయించిన మొత్తంతో నడుస్తున్న ప్రభుత్వ కార్మిక బీమా వైద్యశాలలు (ఈఎస్ఐ ఆస్పత్రి) సమస్యలకు నిలయంగా మారాయి. వైద్యాధికారుల నియామకంపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడంతో కార్మికులకు వైద్యసేవలు గగనమవుతున్నాయి. ఈ క్రమంలో వారికి ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవతున్నాయి. సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట ప్రాంతంలోని పారిశ్రామిక సెజ్ల్లో ఇటీవల కాలంలో 50 పరిశ్రమల వరకు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 25 వేల మంది వరకు పనిచేస్తుండగా, 13 వేల మందికి ఈఎస్ఐ కార్డులున్నాయి. కార్మికులతో పాటు వారి కుటుంబసభ్యులకు కలిపి సుమారు 92 వేల మందికి ఈఎస్ఐ వర్తిస్తుంది. వీరందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో సూళ్లూరుపేటలోని షార్ బస్టాండ్ సమీపంలో డిస్పెన్సరీ, సూళ్లూరుపేట-శ్రీహరికోటరోడ్డులో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశారు. కార్మికుల కష్టంతో నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందించలేకపోతున్నారు. డిస్పెన్సరీలో నలుగురు వైద్యులకు గాను కొద్దిరోజులు ముగ్గురే పనిచేశారు. ప్రస్తుతం కేవలం ఒకే డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ కూడా నెల్లూరు నుంచి డిప్యూటేషన్పై వచ్చివెళుతున్నారు. రోజుకు సుమారు రెండు వందల మందికి పైగా వైద్యసేవలు పొందేందుకు వస్తుండటంతో ఒక డాక్టర్ వైద్యసేవలు అందించలేకపోతున్నారు. రెండుపూట్ల నిర్వహించాల్సిన ఆస్పత్రిని మధ్యాహ్నం వరకే పరిమితం చేయడంతో పాటు ఆదివారం, ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో పూర్తిగా మూసేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులు, వారి కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లో మరీ దారుణం సూళ్లూరుపేటలోని ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్లో 13 మంది స్పెషలిస్టు డాక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సివిల్ సర్జన్లు వైద్యసేవలందించారు. గత నెలాఖరుదాకా 9 మంది డాక్టర్లు ఉండేవారు. వారిలో ఇద్దరు నవంబర్లో ఉద్యోగ విరమణ చేశారు. మిగిలిన ఏడుగురిలో నలుగురు డిప్యూటేషన్పై వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఒకరు మెటర్నటీ సెలవులో ఉన్నారు. విజయవాడ నుంచి డిప్యూటేషన్పై వచ్చి విధులు నిర్వర్తిస్తున్న ఓ డాక్టర్ నెలలో రెండు,మూడు సార్లు మాత్రమే వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్న ఒకరిద్దరు డాక్టర్లు అందిస్తున్న సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ ఆస్పత్రి నిర్వహణకు ఇన్చార్జిగా నియమించిన రామకృష్ణారెడ్డి తిరుపతి నుంచి ఎప్పడు వస్తారో, రారో తెలియని పరిస్థితి నెలకొంది. తగినంత పని, పర్యవేక్షించే వారు లేకపోవడంతో ఉన్న 40 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది మధ్యాహ్నానికే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. రోగులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన మందులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన వైద్యసేవలందించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ఆస్పత్రి విషయమే తెలియదు బి.బుజ్జమ్మ, కార్మికురాలు, సూళ్లూరు ఇక్కడ ఈఎస్ఐ ఆస్పత్రి ఉందనే విషయమే మాకు తెలియదు. ఈఎస్ఐ కార్డు మాత్రం ఉంది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేటు ఆస్పత్రికే వెళుతుంటాం. ఎప్పుడు వెళ్లినా డాక్టర్లుండరు మనోజ్, కార్మికుడు, దొరవారిసత్రం ఈఎస్ఐ డిస్పెన్సరీకి ఎప్పుడు వెళ్లినా డాక్టర్లుండరు. మధ్యాహ్నం పైన వెళితే తాళం వేసివుంటారు. డయగ్నోస్టిక్ సెంటర్లోనూ అదే పరిస్థితి. సెకండ్ షిప్ట్ డ్యూటీ చేసుకుని ఆస్పత్రికి వెళితే వెనక్కు రావాల్సిందే. -
‘ఈఎస్ఐ’ వేతన పరిమితి రూ. 25 వేలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రిలో సేవలు పొందేందుకు గాను ఉద్యోగుల వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి కె. సురేశ్ వెల్లడించారు. కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో నజన్గుడ్లో ఈఎస్ఐ ప్రాంతీయ వైద్య విభాగం, డయాగ్నాస్టిక్ కేంద్రాల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం, రామనగర జిల్లాలోని చెన్నపట్నలో ఈఎస్ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈఎస్ఐలో సేవలను మరింతగా పెంచనున్నట్టు చెప్పారు. వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచినట్టు తెలిపారు. -
తరలిపోయిన ఈఎస్ఐ ఆసుపత్రి
అమీర్పేట, న్యూస్లైన్: సనత్నగర్ కార్మిక బీమా వైద్యశాల (ఈఎస్ఐ) నాచారం ప్రాంతానికి తరలిపోయింది.ప్రస్తుతం ఇక్కడి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మంగళవారం నుంచి నాచారంలో విధులు నిర్వహించాలని అధికారికంగా సోమవారం ఆదేశాలు జారీచేశారు. కార్మికశాఖ నుంచి శనివారం అధికారికంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఆసుపత్రిని తరలించిన పక్షంలో అందరు ఉద్యోగులను ఒకేచోటికి మార్చాలని యూనియన్ నాయకులు, వైద్యులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఆసుపత్రి అధికారులు విషయాన్ని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డెరైక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగుల డిమాండ్ను పరిగణలోకి తీసుకుని అందరినీ ఒకేచోటకు పంపుతున్నట్లు తెలిపి.. ఆగస్టు 29లోపు సిబ్బంది నాచారం ఆసుపత్రిలో విధులు నిర్వహించాలని ఆదేశించారు. సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో కొనసాగుతున్న దాదాపు 10 విభాగాల్లోని ఉద్యోగులు విభాగానికి ఇద్దరు చొప్పున 27 తేదీ నుంచి నాచారం వెళ్లి విధులు నిర్వర్తించాలని పేర్కొంటూ ఓ జాబితాను తయారుచేసి ఉద్యోగులకు అందచేశారు. కాగా ఉద్యోగుల ఒత్తిడి మేరకు ఉన్నతాధికారులు మిగిలిన సిబ్బంది తరలింపునకు నెలరోజులు గడువు ఇచ్చారు. డిస్పెన్సరీ స్థాయి నుంచి 500 పడకల ఆసుపత్రిగా.. సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రికి సు మారు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. కేంద్ర కార్మికశాఖ రాష్ట్రంలోనే మొట్టమొదట 1965లో సనత్నగర్ ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసింది. అప్ప ట్లో ఇక్కడ కేవలం పదిమంది ఉద్యోగులు మాత్రమే పనిచేసేవారు. పరిశ్రమలు పెరగడంతో 30 పడకల ఆసుపత్రిగా మార్చారు. ప్రస్తుతం 500 పడకల ఆసుపత్రిగా ఎదిగింది. ఇక్కడ శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులతో కలి సి సుమారు 900 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ చారిత్రక ఆసుపత్రి మం గళవారం నుంచి ఈఎస్ఐ కార్పొరేషన్ టీచింగ్ ఆసుపత్రిగా కొనసాగనుంది.