Extramarital affairs
-
భార్య వేరే వ్యక్తితో సంబంధమే భర్తకు శాపంగా మారింది..!
ఆమదాలవలస: మండలంలోని బొబ్బిలిపేట సమీపంలో గత నెల 25వ తేదీ రాత్రి జరిగిన గురుగుబిల్లి చంద్రయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. హత్య కేసులో రాజకీయ కోణం లేదని, కేవలం వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని, ఇందులో ప్రమేయమున్న 10 మందిని శనివారం అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకనంద తెలిపారు. ఈ మేరకు ఆమదాలవలస పోలీస్స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. గరుగుబల్లి చంద్రయ్య భార్య ఈశ్వరమ్మకు అదే గ్రామానికి చెందిన చింతాడ బాలమురళీకృష్ణకు కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. విషయం తెలుసుకున్న భర్త చంద్రయ్య భార్యను మందలించి సెల్ఫోన్ వాడకుండా కట్టుదిట్టం చేయడంతో పాటు బాలమురళీకృష్ణతో ఉన్న ఆర్థిక లావాదేవీలను కూడా నిలుపుదల చేశాడు.దీంతో కక్షపెంచుకున్న బాలమురళీకృష్ణ చంద్రయ్యకు తెలియకుండా మరొక ఫోన్తో ఈశ్వరమ్మతో రహస్య సంభాషణలు సాగించేవాడు. ఈ క్రమంలో తమకు అడ్డంగా ఉన్న చంద్రయ్యను చంపాలనే ఉద్దేశంతో తన సోదరుడు, శ్రీనివాసచార్యులపేటకు చెందిన గురుగుబిల్లి అరవింద్ సాయం తీసుకున్నాడు. అతను తన స్నేహితులైన బూర్జ మండలం ఉప్పినవలసకు చెందిన వంశీ, గణేష్లను కూడా రంగంలోకి దించాడు. వీరంతా కలిసి చంద్రయ్యను హతమార్చడానికి బొబ్బిలిపేట సమీపంలో చెరువు వద్ద రెండు రోజులు మాటువేసినా ఫలితం లేకపోయింది. ఈ 25న చంద్రయ్య ఇంటి వద్ద బయలుదేరిన వెంటనే భార్య ఈశ్వరమ్మ చెరువు వద్ద ఎదురుచూస్తున్న బాలమురళీకృష్ణకు ఫోన్ చేసి చెప్పింది. స్కూటీపై వస్తున్న చంద్రయ్యను వీరంతా అడ్డగించి బీరు సీసాలు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువులోకి ఈడ్చుకెళ్లి తుప్పల చాటున పడేశారు. అదే రోజు రాత్రి భార్య ఈశ్వరమ్మ ముందుగా భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మళ్లీ అర్ధరాత్రి సమయంలో తన భర్త శవంగా పొలాల్లో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఆమదాలవలస సీఐ పి.సత్యనారాయణ, ఎస్ఐ ఎస్.బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణలో బొబ్బిలిపేటకు చెందిన చింతాడ బాలమురళీకృష్ణ ప్రథమ నేరస్తుడుగా, ఉప్పినవలసకు చెందిన గొల్లపల్లి వంశీ, సవలాపురం గణేష్, బొబ్బిలిపేటకు చెదిన చంద్రయ్య భార్య జి.ఈశ్వరమ్మలను తదుపరి నేరస్తులుగా, సవలాపురం ప్రవీణ్, బొమ్మాలి శ్రీవర్థన్(శివ), బొమ్మాలి ఉమామహేష్, ఈసర్లపేటకు చెందిన యర్లంకి కృష్ణ, శ్రీనివాసాచార్యులపేటకు చెందిన గురుగుబెల్లి అరవింద్లతో పాటు మరో మైనర్కు కూడా నేరంలో ప్రమేయమున్నట్లు గుర్తించారు. వీరందరినీ అరెస్టు చేసి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసిన తక్కువ సమయంలో మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, డీఎస్పీ వివేకానంద అభినందించారు. -
వివాహేతర సంబంధానికి అత్త అడ్డుగా ఉందని...
పర్వతగిరి: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని ఓ కోడలు తన అత్తకు కూల్డ్రింక్లో విషం కలిపి తాగించింది. అత్త చికిత్స పొందుతూ మృతిచెందగా, తన తల్లిని చంపిందని భార్యపై భర్త శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండాలో చోటుచేసుకుంది. స్థానికులు, హెడ్కానిస్టేబుల్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన భూక్య మంజుల, దేవేందర్ భార్యాభర్తలు. మంజుల మూడేళ్లుగా వరంగల్లోని పెరుకవాడకు చెందిన సారయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం అత్త భూక్య గమ్మి(55)కి తెలిసి పలుమార్లు వారించింది. దీంతో మంజుల తన ప్రేమకలాపాలకు అత్త గమ్మి తరచూ అడ్డు వస్తుందని గతంలో రెండు సార్లు తలపై గాయం చేయగా, మరోసారి చేయి విరగ్గొట్టింది. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీన మంజుల తన అత్త గమ్మికి థమ్సప్లో పురుగుల మందు కలిపి తాగించింది. కొద్ది సేపటి అనంతరం గమ్మి కిందపడి కొట్టుకుంటుండగా కుమారుడు దేవేందర్ చూసి స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించగా ఆయన సూచన మేరకు తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. మెరుగైన చికిత్స కోసం వరంగల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించే క్రమంలో శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. దేవేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నల్లగొండ టూటౌన్ సీఐ డానియల్ పై వివాహేతర సంబంధం ఆరోపణలు
-
ప్రాణం తీస్తున్న ప్రేమ
ప్రేమ, దాని కారణంగా వివాహేతర సంబంధాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. హత్యలు,ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. కిడ్నాపులకు దారితీస్తున్నాయి. ప్రేమ కారణంగా గత పదేళ్లలో లక్షకుపైగా హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి.⇒ దేశంలో ప్రేమ, తత్సంబంధ కారణాల వల్ల 201322 మధ్య ఆత్మహత్య చేసుకున్నవారు 74,180⇒ మొత్తం ఆత్మహత్యల్లో ప్రేమ కారణంగా జరిగినవి 76.1%⇒ వివాహేతర సంబంధాల వల్ల జరిగిన ఆత్మహత్యలు 13.3% ⇒ ప్రేమ కారణంగా హత్యకు గురైనవారు 30,012⇒ మొత్తం హత్యల్లో అక్రమ సంబంధాల కారణంగా జరిగినవి 46.6%⇒ పెళ్లిళ్ల కోసం చేసిన కిడ్నాపులు 2.8 లక్షలు⇒ పరువు హత్యలు 517ఆధారం: నేషనల్ర్ కైమ్ రికార్డ్స్ బ్యూరో -
వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం
కాబూల్: అఫ్గానిస్తాన్లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్జాదా హెచ్చరించారు. -
మరిదితో వివాహేతర సంబంధం... మరికొందరితో చనువుగా ఉంటోందని....
పోలవరం రూరల్: కొత్తరామయ్యపేట పునరావాస కేంద్రంలో మేడూరి దుర్గ (28) అనే వివాహిత హత్య కేసులో నిందితుడిని మంగళవారం పోలవరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలవరం డీఎస్పీ కార్యాలయంలో హత్యకు సంబంధించిన కారణాలను విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.సురేష్కుమార్ రెడ్డి వివరించారు. కొత్తరామయ్యపేట పునరావాస కేంద్రం ప్రాంతానికి చెందిన మేడూరి దుర్గ (28)కు, సమీప బంధువు, వరుసకు మరిది అయిన మేడూరి ప్రసాద్ మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే నెల రోజుల నుంచి దుర్గ వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు అనుమానంతో ప్రసాద్ ఆమెతో గొడవ పడుతున్నాడు. ఆదివారం రాత్రి ప్రసాద్ దుర్గకు అనేకమార్లు ఫోన్ చేయగా, దుర్గ వేరే వారితో మాట్లాడుతుడంతో ఫోన్ కలవలేదు. ఫోన్ తీయడం లేదనే కోపంతో ప్రసాద్ దుర్గ ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. వెంటనే ప్రసాద్ తన వెంట తెచ్చుకున్న చాకుతో దుర్గ కంఠం కోసి, ఇంటి వెనుక వైపున మామిడి తోట నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే గాయం తీవ్రంగా కావడంతో దుర్గ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రసాద్ హత్య చేసిన అనంతరం దుర్గ ఫోన్ను తీసుకుని వెళ్లిపోయాడు. సమీపంలోని మొక్కజొన్న చేలో ప్రసాద్ బట్టలు, ఫోన్, చాకు దాచి ఉంచాడు. ఘటన జరిగిన వెంటనే పోలవరం సీఐ కె.మధు బాబు, ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్, సిబ్బంది సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్తో పరిశీలించారు. మృతురాలి ఫోన్ కనబడకపోవడంతో అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఘటన జరిగిన రెండు రోజుల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో వాస్తవాలు తెలిశాయన్నారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేయడంపై జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించినట్లు చెప్పారు. ఈ కేసులో నిందితుడిని త్వరితగతిన పట్టుకున్నందుకు రివార్డులు కూడా ప్రకటిస్తామని డీఎస్పీ తెలిపారు. -
ఇంకోసారి నా భర్తతో కనిపిస్తే..
యశవంతపుర: భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికెళ్లిన భార్య, ఆమె బంధువులు గొడవకు దిగారు. బెంగళూరులో మారుతీ లేఔట్ దొడ్డగుబ్బి మెయిన్రోడ్డులో ఈ ఘటన జరిగింది. వివరాలు.. ఓ మహిళ ఇంటి నిర్మాణానికి కంకర, ఇసుకను శరణ్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసింది. ఈ సమయంలో పరిచయం పెరిగి అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి శరణ్ భార్య సుమంత ఆ మహిళను మందలించడంతో ఆమె శరణ్తో మాట్లాడటం మానేసింది. అయితే కొంతకాలంగా ఇద్దరూ తిరిగి దగ్గరయ్యారు. ఒక మాల్కు వెళ్లారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న రాత్రి 11:30 గంటలకు కెంపరాజు, శరత్లతో కలిసి సుమంత, ఆ మహిళ ఇంటికి వెళ్లి కిటికీ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మరోసారి తన భర్తతో కనిపిస్తే బాగుండదని హెచ్చరించింది. వారి దాడి వల్ల తనకు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు మహిళ కొత్తనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆమె ఆరోపించింది. గొడవ చేసిన వీడియోలను సాక్ష్యంగా ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయింది. -
మహిళా కానిస్టేబుల్తో పోలీసు ప్రేమాయణం.. వివాహేతర బంధం చివరకు..
సాక్షి, చైన్నె : వివాహేతర సంబంధం ఇద్దరు పోలీసులను బలిగొంది. తనను విస్మరిస్తున్నాడన్న ఆగ్రహంతో ప్రియుడైన పోలీసుపై ఆగ్రహంతో మహిళా కానిస్టేబుల్ తన ఇద్దరు పిల్లలతో బలవన్మరణానికి పాల్పడింది. విచారణకు భయపడి ఆ పోలీసు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మదురై సమీపంలోని తిరుపాలైకు చెందిన సుబ్బురాజ్ (40)కు తూత్తుకుడికి విలాతి కులం చెందిన జయలక్ష్మి(37)తో వివాహమైంది. వీరికి పవిత్ర(11), కాళి ముత్తు(9) పిల్లలు. జయలక్ష్మి మదురైలో రైల్వేలో పోలీసుగా పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న కానిస్టేబుల్ చొక్కలింగం(47)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసి జయలక్ష్మికి సుబ్బురాజ్ విడాకులు ఇచ్చేశాడు. చొక్కలింగం భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా ఆరు సంవత్సరాలుగా జయలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ క్రమంలో జయలక్ష్మిని తిరుచ్చికి, చొక్కలింగంను సెంగోట్టైకి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. సెంగోట్టైకి వెళ్లిన తర్వాత చొక్కలింగం ముఖం చాటేశాడు. దీంతో మనస్తాపానికి గురైన జయలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం సాయంత్రం మదురై– తిరుచ్చి ఇంటర్ సిటీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో చొక్కలింగం చైన్నె – తిరుచెందూరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. -
భర్త హత్య కేసులో భార్య, ప్రియుడి అరెస్టు
తమిళనాడు: ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని సిత్తేరి రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన విఘ్నేష్ (24) శ్రీపెరంబుదూరు సమీపంలోని ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య యామిని (22). ఆదివారం రాత్రి ఇంటిలో నుంచి బయటకు వెళ్లిన విఘ్నేష్ సోమవారం ఉదయం సిత్తేరి మామిడి తోట సమీపంలో హత్యకు గురయ్యాడు. అరక్కోణం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో విఘ్నేష్ బంధువైన తండలం ప్రాంతానికి చెందిన సతీష్ (24) ప్రమేయం ఉన్నట్లు తేలింది. విఘ్నేష్ ఇంటికి వెళ్లి వచ్చే సమయంలో యామినితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో అడ్డు తొలగించుకునేందుకే విఘ్నేష్ను హత్య చేసినట్లు సతీష్ తెలిపాడు. కాగా సతీష్కు సహకరించిన యామిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
వీడిన మర్డర్ మిస్టరీ
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళంలోని ఓ వైద్యుని ఇంటిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఓ కొలిక్కి తెచ్చారు. తన వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తోందని, ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఆ ఇంటి పనిమనిషి కొట్టు చిట్టెమ్మ ఈ నెల 14న అర్ధరాత్రి తోటి పనిమనిషి తాళ్లవలస రాజును హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. దీనికి సంబంధించిన విషయాలను టౌన్ సీఐ సన్యాసినాయుడు శుక్రవారం విలేకరులకు వివరాలు వివరించారు. ఆ మేరకు.. విశ్రాంత వైద్యుడు గొల్ల జగన్నాథం గత నాలుగేళ్లుగా విశాఖపట్నంలోనే కుటుంబంతో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళంలోని పెదపాడు వీరన్నషెడ్ వద్ద ఉన్న ఇల్లు ఖాళీగా ఉంచకూడదని ఎంతో నమ్మకంగా తన వద్ద ఉన్న పనిమనుషులు చిట్టెమ్మ, రాజులను అక్కడే ఉంచి ఇంటి బాగోగులు వారికే అ ప్ప గించారు. వీరిలో చిట్టెమ్మ ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉండేదని, దీంతో రాజు ఆమెను పలుమార్లు మందలించేదని పోలీసులు తెలిపారు. గడిచిన ఆది వారం ఇలిసిపురంలో గల తన బంధువుల ఇంటికి వెళ్లిన రాజు సోమవారం సాయంత్రానికి ఆ ఇంటికి వచ్చింది. అదేరోజు రాత్రి భోజనాలు అనంతరం మరోసారి చిట్టెమ్మతో వివాహేతర సంబంధాలపై ఇద్దరూ గొడవ పడ్డారు. ప్రతి విషయానికి నన్ను బెదిరిస్తావా అంటూ కోపోద్రిక్తమైన చిట్టెమ్మ అక్కడే ఉన్న చెక్క పేడుతో రాజు తలపై బలంగా మోదింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. చిట్టెమ్మ తన బట్టలకు అంటిన రక్తం, చెక్కపేడును ఎవ్వరికీ కనిపించకుండా వేరే ప్రదేశంలో పడేసి అదే రోజు పరారైనట్లు సీఐ తెలిపారు. క్లూస్టీం పరిశీలన అనంతరం చిట్టెమ్మను నగర శివారు ప్రాంతంలో రూరల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఆమెను రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
వివాహేతర సంబంధం.. ప్రేమలతకు ఐదేళ్ల జైలు శిక్ష
వరంగల్ లీగల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త అడ్డు తొలగించేందుకు హత్యా యత్నానికి పాల్పడిన మహిళకు జైలు శిక్ష పడింది. భర్తపై హత్యాయత్నం నేరంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఇల్లందుల ప్రేమలతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ బుధవారం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసులు తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ముత్తారం గ్రామానికి చెందిన ఇల్లందుల చొక్కయ్య, ప్రేమలత దంపతులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రేమలత అదే గ్రామానికి చెందిన కడారి వీరభద్రయ్యతో కలిసి తిరుగుతోందని, ఇది సరైంది కాదని చొక్కయ్య ఫిర్యాదు మేరకు గ్రామ పెద్దమనుషులు ప్రేమలతను మందలించారు. అయినా ఆమెలో మార్పు రాలేదు. పైగా తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రేమలత ప్రణాళిక వేసుకుంది. ఏప్రిల్ 24, 2014 అర్ధరాత్రి నిద్రిస్తున్న చొక్కయ్యపై గొడ్డలితో దాడి చేసింది. తలకు, చేతులకు, ఛాతిపై గాయాలై విపరీతంగా రక్తం కారుతుండగా... చొక్కయ్య గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు రావడంతో ప్రేమలత పారిపోయింది. క్షతగాత్రుడిని స్థానికులు అర్ధరాత్రి ముల్కనూరులోని ఓ హాస్పిటల్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలిసి ముల్క నూరులో ఉన్న చొక్కయ్య సోదరి పుల్ల స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు నేరం రుజువుకావడంతో ప్రేమలతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి శ్రీనివాసులు తీర్పు వెల్లడించారు. కేసును పోలీసు అధికారులు సతీశ్కుమార్, ఎం.మహేందర్ పరిశోధించగా.. లైజన్ ఆఫీసర్ డి.వెంకటేశ్వర్లు విచారణ పర్యవేక్షించారు. సాక్షు్యలను కానిస్టేబుల్ ఎ.రవి కోర్టులో ప్రవేశపెట్టగా.. ప్రాసిక్యూషన్ పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.భద్రాద్రి కేసు వాదించారు. -
వివాహేతర సంబంధాలకు అసలు కారణాలు ఇవే..
సాక్షి, గుంటూరు డెస్క్: భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయి. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. ఇరు కుటుంబాల పెద్దలు సర్ది చెప్పడంతో కొద్దికాలంగా దంపతులు కలిసే కాపురం చేస్తున్నారు. పుట్టింటి వద్ద ఉన్న రెండేళ్ల కాలంలో ఓ యువకుడితో ఆమెకు వివాహేతర బంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యువకుడు ఇంటికి వచ్చిపోతుండటం, భార్య తరచూ ఎక్కడికో వెళ్లి వస్తుండటంతో అనుమానం వచ్చిన భర్త ఆమెను పద్ధతి మార్చకోవాలని హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య, ప్రియుడితో కలిసి హత్య చేయించింది. అనుమానమే పెనుభూతమై.. ఉపాధి కోసం ముగ్గురు పిల్లలతో పట్టణానికి వచ్చారు ఆ దంపతులు. ఇద్దరూ రోజువారీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అధిక సంతానానికి తోడు భర్త మద్యానికి బానిస కావడంతో ఖర్చులు పెరిగాయి. వీరుంటున్న ఇంటి పక్కనే భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరి ఇబ్బందుల్ని గుర్తించి ఆమె పలుమార్లు డబ్బుసాయం అందించింది. దీంతో ఎక్కువసార్లు భార్య ఆ ఇంటికి వెళ్లేది. ఇది గమనించిన భర్త తన భార్య కూడా తప్పు చేస్తోందనే అనుమానం పెంచుకున్నాడు. నిజం చెప్పాలంటూ భార్యను పలుమార్లు బెదిరించాడు. చివరకు మద్యంలో విషం కలుపుకుని తాగి చనిపోయాడు. ఫలితంగా భార్యాపిల్లలు రోడ్డున పడ్డారు. వివాహేతర సంబంధంతో అలజడి భార్యను దూరం పెట్టిన ఓ భర్త సహ ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రహస్యంగా ఆ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం సహజీవనం చేస్తున్న యువతి ప్రియుడికి తెలిసింది. తాను ప్రేమించిన యువతి డబ్బు మోజులో తనను మోసం చేసిందని స్నేహితులకు చెప్పుకుని ఏడ్చాడు. మిత్రుడి బాధను చూసి అంతా కలిసి స్కెచ్ వేశారు. ఉద్యోగిని మందు పార్టీకని పిలిచి అందులో విషం ఇచ్చి చంపేశారు. పోస్టుమార్టంలో అసలు నిజం వెలుగుచూసి వారందరూ అరెస్ట్ అయ్యారు. ఇక్కడ మృతుడి భార్య ఒంటరిదై పోయింది. ప్రేమించిన యువతి మోసంతో యువకుడు కటకటాలపాలయ్యాడు. ఇవి మానవ సంబంధాల్ని దెబ్బతీస్తున్న కొన్ని ఘటనలు. మన మధ్యే జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలకు వెనుక ఉన్న యథార్థ గాథలు..! సమాజంలో బంధాలు, అనుబంధాలకు ఎంతో విలువ ఉంది. కొన్ని సందర్భాల్లో అత్యాశ, అనుమానం, వ్యామోహం ఈ విలువలను దిగజార్చేలా చేస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు, కొన్నిచోట్ల పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు సైతం వివాహేతర సంబంధాల వల్ల విచ్చినమవుతున్నాయి. హద్దులు దాటాక ఊహించని పరిణామాలు జరిగి వ్యక్తుల జీవితాలు, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రస్తుతం కాలంలో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇందుకు వివాహేతర సంబంధాలే కారణం కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అక్రమ సంబంధాలు, ఆస్తికోసం అడ్డు వస్తున్నారని భార్య లేదా భర్త ఒకరినొకరు చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రపంచంలోనే ఆదర్శ కుటుంబ వ్యవస్థ కలిగిన దేశం మనది. నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశించి చేసుకున్న పెళ్లినాటి ప్రమాణాలు పటాపంచలవుతున్నాయి. ఫలితంగా ప్రాణంగా ప్రేమించిన వారు.. జీవితాంతం తోడుండాల్సిన వారే తోడేళ్లవుతున్నారు. బంధం బలపడాలంటే.. ♦దాంపత్యంలో దాపరికాలు ఉండకుండా చూసుకోవాలి. ♦పొరపాట్లు జరిగినా.. అనుమానాలు.. అవమానాలు ఎదురైనా ధైర్యంగా ఉండాలి. ♦భార్యాభర్తలు ప్రతిరోజు కొంత సమయం ఒకరికొకరు కేటాయించుకోవాలి. ♦ బాధ్యతల్లో పడి ప్రేమించే వారిని ఒంటరిగా వదిలేయకూడదు. ♦మనస్పర్థలు వచ్చినా కూర్చుని మాట్లాడుకోవాలి. ♦ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా అపోహలు తొలిగే ప్రయత్నం రెండువైపులా జరగాలి. ♦ఎవరి తప్పు ఉందో తెలుసుకుని సున్నితంగా పరిష్కరించుకోవాలి. ♦మరోమారు అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. ♦పిల్లల ముందు అస్సలు గొడవ పడరాదు. ♦ఎవరైనా మనసును ప్రభావితం చేస్తుంటే సున్నితంగా తిరస్కరించాలి. ♦తనకు జీవిత భాగస్వామి, పిల్లలు ఉన్నారని, కుటుంబ బాధ్యత ఉందని గుర్తెరగాలి. ♦వివాహేతర సంబంధాలు ఆర్థిక, సామాజిక, శారీరక, మానసిక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని గమనించాలి. చదవండి: యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఆదర్శమైన ఆ ఐదుగురు దంపతులు... గుండె గుడిలో లక్ష్మీదేవి నిండిపోయి ఉంటుందని చాటుతూ వక్షస్థలంపై చోటిచ్చిన లక్ష్మీనారాయణుల్లా.. దేహంలో సగభాగం పార్వతీ అంటూ అర్ధనారీశ్వురుడైన గౌరీశంకరుల్లా.. దంపతుల ఇద్దరి మాట ఒకటేనంటూ సతీ సరస్వతిని నాలుకపై నిలిపిన బ్రహ్మదీసరస్వతుల్లా.. జీవకోటిని మేల్కొపుతూ పరుగులు పెట్టే భర్తను అనుసరించే భార్య ఛాయాదేవి, సూర్యుడిలా.. సర్దుకుపోయేతత్వం ఉన్న రోహిణిచంద్రుడిని ఆదర్శంగా తీసుకుని అందంగా, ఆనందంగా తీర్చుదిద్దుకోవాలి. మొత్తం మీద భార్య నుంచి భర్తకు కావాల్సింది ఉపశమనం, సాంత్వన, పోషణ, కాని భార్యకు భర్త నుంచి కావాల్సింది అనుక్షణం సం‘రక్షణ’ ఒక్కటే. పెళ్లినాటి ప్రమాణాలు, నియమాలు, ఒప్పందాలను మర్చిపోకుండా మంచి సమాజం కోసం కుటుంబాన్ని ఆదర్శవంతంగా కొనసాగించినపుడే ఆ దాంపత్యంలో ఆనందం చిరస్థాయిగా ఉంటుంది. నమ్మకంతో మెలగాలి దంపతులు ఒకరిపై మరొకరు నమ్మకంతో మెలగాలి. దంపతుల మధ్య దాపరికాలు ఉండకూడదు. సోషల్ మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలి. వృత్తికి, కుటుంబానికి సమపాళ్లలో సమయం కేటాయించాలి. భార్యాభర్తలు ఇంట్లో ఉన్నప్పుడు వ్యాయామం, భోజనం, అల్పాహారం కలిసి చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. పండుగలు, వారంతపు సెలవుల్లో ఒక రోజు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు కేటాయించడం ద్వారా అంతరాలు తొలగిపోయి అనుబంధం బలపడుతుంది. -డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మానసిక వ్యాధి వైద్య నిపుణుడు, జీజీహెచ్, గుంటూరు -
చంపుతాడని చంపేశాడు
నిజాంసాగర్: అన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం బయటికి తెలియడంతో తనను ఎక్కడ చంపేస్తాడోనన్న భయంతో అన్ననే మట్టుపెట్టాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని అంతాపూర్లో జరిగింది. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్రెడ్డి శనివారం తెలిపిన వివరాలిలా.. అంతాపూర్ గ్రామనికి చెందిన మక్కల్ వాడి గంగాధర్(27).. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో చిన్నమ్మ వద్దనే పెరిగాడు. చిన్నమ్మ కుమారుడు గంగాధర్, మక్కల్వాడి గంగాధర్ సొంత అన్నదమ్ముళ్లలా పెరిగారు. మక్కల్వాడి గంగాధర్కు వివాహమైంది. భార్య రేణు, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇతను కూలి పనుల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో వరుసకు వదిన అయిన రేణుతో గంగాధర్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారం క్రితం ఇంటికి వచ్చిన మక్కల్వాడి గంగాధర్.. ఇది గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తనను అన్న చంపేస్తాడేమోనని భయపడి ముందుగా అతడినే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 9న మధ్యాహ్నం 2 గంటలకు మక్కల్వాడి గంగాధర్ వంట చెరుకు కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. తమ్ముడు గంగాధర్ బైక్పై అతడి వద్దకు వచ్చి, పొలానికి వెళ్దామని చెప్పాడు. జుక్కల్ మండలంలోని హంగర్గ శివారులోగల కర్ణం గుట్టకు తీసుకువెళ్లాడు. అక్కడ మాటు వేసి ఉన్న తన మిత్రులు అశోక్, బాలాజీలు మక్కల్వాడి గంగాధర్పై బండరాళ్లతో దాడి చేశారు. కుప్పకూలిన అతని తలపై ముగ్గురూ కలిసి రాళ్లతో కొట్టి చంపి నీటి గుంటలోకి తోసివేసి ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం వేళ అన్న కనిపించడం లేదంటూ గంగాధర్ గ్రామస్తులకు తెలిపాడు. హంగర్గ శివారు ప్రాంతానికి వెళ్లినవారికి నీటి గుంటలో మక్కల్వాడి గంగాధర్ మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. బిచ్కుంద సీఐ కృష్ణ, జుక్కల్ ఎస్సై మురళి ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించి విచారణ జరిపారు. గంగాధర్పై అనుమానంతో విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు
దొర్నిపాడుకు చెందిన ఓ మహిళను వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం జంగాలపల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా భర్త వేధింపులు తాళలేక పిల్లలతో వచ్చి పుట్టినింట్లో జీవనం సాగిస్తున్న ఆమె మరో వ్యక్తితో తప్పటడుగులు వేసింది. విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించడంతో ఫ్యాన్కు ఉరేసుకుని వందేళ్ల జీవితానికి 25 ఏళ్లకే ముగింపు పలికింది. ఫలితంగా ఇద్దరు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. ఇటీవల ఆళ్లగడ్డ పట్టణంలోని యేసునాథపురానికి చెందిన ఓ వివాహిత ప్రియు డి మోజులో పడి భర్తను హత్య చేసింది. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కర్నూలు నగరం బంగారుపేటలో నివాసముంటున్న ఓ మహిళ తన భర్త మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కొంతకాలంగా మధనపడుతుండేది. భర్తలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి వేరే మహిళ మాయలో పడటం..తల్లి బలవన్మరణం చెందడంతో వారి ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడూనీడగా ఉండాల్సిన భార్యాభర్తలు వివాహేతర సంబంధాలతో విడిపోతున్నారు. ఒక్కోసారి జీవితాలను అర్ధంతరంగా చాలిస్తూ అభం శుభం తెలియని పిల్లల్ని అనాథలను చేసి వెళ్తున్నారు. కృష్ణగిరి(కర్నూలు జిల్లా): క్షణికావేశంలో తల్లిదండ్రులు చేసే తప్పుల వల్ల వారి జీవితాలు నాశనమవుతుండగా వారి పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రాం.. సామాజిక మాధ్యమం ఏదైనా వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి మరింత దగ్గర చేస్తున్నాయి. ఇవి ఒక్కోసారి కాపురాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాలకు దారి తీసి భార్యను కడతేర్చే భర్తలు, ప్రియుడి కోసం భర్తను బండరాళ్లతో మోదే భార్యలు ఎక్కువైపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు వివాహేతర సంబంధాలకు వారధిగా మారుతున్నాయని తాజాగా విడుదలైన సర్వే వెల్లడించింది. వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ఏటా మూడు వేల మంది హత్యకు గురవుతున్నారు. కట్టుబాట్లను దాటిన ఇష్టాలు, బంధాలను బలి కోరే సంబంధాలు, నైతికం కాని స్నేహాలు జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. దారి తప్పుతున్న దంపతులు పిల్లల బతుకులను చేతులారా ధ్వంసం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలతో వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఆదర్శ దాంపత్యాలు అడుగడుగునా కనిపిస్తున్నా.. ఎక్కడో ఓ చోట విషపు గుళికలా ఇలాంటి వివాహేతర సంబంధాలు తారస పడుతున్నాయి. ఒక్కసారి పట్టు తప్పితే ఆ తప్పులకు మూల్యంగా ప్రాణాలే పోతున్నాయి. అనాథలవుతున్న పిల్లలు వివాహేతర సంబంధాలు భార్యాభర్తల గొడవలతో ముగిసిపోవు. వాటి ప్రభావం పిల్లలపై అధికంగా పడుతోంది. ఎదిగే వయసులో తల్లిదండ్రులు గొడవ పడటం చూసిన పిల్లల మనసులు తీవ్రంగా గాయపడతాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు ఆ కారణంతో జైలుకు వెళ్లడం వంటి ఘటనలతో చిన్నారుల బాల్యంపై మరక పడుతోంది. అది జీవితకాలం వెంటాడుతోంది. తల్లిదండ్రుల సంరక్షణలో చక్కగా నవ్వుతూ బతకాల్సిన పిల్లలు ఇలా ఏడుస్తూ రోజులు లెక్కపెట్టాల్సి వస్తోంది. వివాహేతర సంబంధాలకు కారణాలు ♦సంపాదనే ధ్యేయంగా చూసుకుని సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం ♦దంపతుల మధ్య తరచూ పడే చిన్నపాటి గొడవలను పెద్దవి చేసుకోవడం ♦భార్యాభర్తల విషయాల్లో కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం ♦బయటవారితో కేటాయించిన సమయం.. లైఫ్పార్టనర్తో గడపకపోవడం ♦పెచ్చుమీరిన ఆన్లైన్ స్నేహాలు ♦చెడు వ్యసనాలకు బానిస కావడం ♦బలహీన మనస్తత్వాలు తప్పనిసరిగా పాటించాల్సినవి ♦దాంపత్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి ♦బకరినొకరు అర్థం చేసుకోవాలి.. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి ♦ఆకర్షణలు తాత్కాలికమే గానీ శాశ్వతం కావనే నిజాన్ని గ్రహించాలి ♦నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వాలి ♦దాంపత్య జీవితంలో భాగస్వామికి అన్ని విషయాల్లో తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి చదవండి: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగిందంటే.. చట్టం ద్వారా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు చట్టం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలే తప్ప నేరాలకు పాల్పడకూడదు. కౌన్సెలింగ్ ద్వారా చాలామంది దంపతులు మళ్లీ ఒక్కటై సంతోషంగా ఉంటున్నారు. ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోకూడదు. – కల్లా మహేశ్వరరెడ్డి, డోన్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పిల్లలపై ఎక్కువ ప్రభావం వివాహేతర సంబంధాల వల్ల కలిగే దుష్ఫరిణామాలు పిల్లలపైనే ఎక్కువ ప్రభావితం చూపుతాయి. పెద్దలు చేస్తున్న తప్పిదాలను గమనిస్తూ చిన్నారులు మానసిక క్షోభకు గురవుతారు. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. – మహేశ్వరప్రసాద్, వైద్యాధికారి, కృష్ణగిరి జీవితాలను నాశనం చేసుకోవద్దు మానవ సంబంధాల్లో అత్యంత ప్రమాదకరమైనది వివాహేతర సంబంధం. దీని వల్ల రెండు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకునే ప్రమాదముంది. వ్యామోహం సరదాగా ప్రారంభమై చివరకు జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. మా వద్దకు వచ్చే భార్య, భర్తల తగాదాల్లో అధికశాతం ఇలాంటి కేసులే. ఇప్పటికే ఎంతో మందికి కౌన్సెలింగ్ చేసి జీవితాలను నిలబెట్టాం. – యుగంధర్, సీఐ, వెల్దుర్తి -
ఐటీ సిటీలో అతి పెద్ద సమస్య .. అక్రమసంబంధాలతో 981 జంటలు..
ఇది సంపన్నుల నుంచి కూలీ కుటుంబాలకు వరకూ వేధిస్తున్న సమస్య. మూడో వ్యక్తి ప్రవేశం కాపురాల్లో చిచ్చు రేపుతోంది. ఇది దాడులకు, తీవ్ర నేరాలకు దారి తీస్తోంది. ఫలితంగా తల్లీతండ్రి విడిపోతే పిల్లలు అనాథలు కావడం మరింత విషాదమవుతోంది. నేటి ఆధునిక సమాజంలో సోషల్ మీడియా ద్వారా దాంపత్య బంధానికి తీవ్ర ప్రమాదం ఎదురవుతోంది. సాక్షి, బెంగళూరు: వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు, ప్రతిష్టకు పోయి విడాకులు తీసుకోవడంతో పాటు మరో ప్రధాన సమస్య సంసారాలను కకావికలం చేస్తోంది. వివాహేతర సంబంధాలు పచ్చని బంధాలను విచ్ఛిన్నం చేయడం వల్ల కుటుంబాల్లో అశాంతి ప్రబలుతోంది. తద్వారా విడాకులకు దారితీస్తున్న కేసులు నగరంలో రోజురోజుకు తీవ్రతరమౌతున్నాయి. సోషల్ మీడియా ఆజ్యం అక్రమ సంబంధాలకు అతిగా సోషల్ మీడియా వినియోగమే కారణమనేది రూఢీ అవుతోంది. ఇందులో ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో పాత మిత్రులు, గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకుని దగ్గర కావడం వల్ల కాపురాలు ఇట్టే కూలిపోవడం పెరిగింది. దంపతుల మధ్య సఖ్యత లోపించడం, కొన్ని వ్యక్తిగత సమస్యలతో మూడో వ్యక్తితో శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల చివరికి నష్టమే జరుగుతోంది. వనితావాణికి తాకిడి బెంగళూరులో గత మూడున్నర ఏళ్లలో అక్రమ సంబంధాల వల్ల విడాకుల దశకు చేరుకున్న 981 జంటలు వనితా సహాయవాణి కేంద్రాన్ని ఆశ్రయించాయి. వివాహానికి ముందు, తరువాత అక్రమ సంబంధం ఉందని తెలిసి దంపతులు విడిపోతున్న ఉదంతాలు ఎక్కువైయ్యాయి. కోర్టులో విచారణ దశలో ఉన్న వేలాది విడాకుల కేసుల్లో 50 శాతానికి పైగా మూడో వ్యక్తి ప్రమేయమే కారణమని మహిళా సహాయవాణి కౌన్సిలర్ ఒకరు తెలిపారు. స్కూల్ మీటింగ్ అని గోవాకు బెంగళూరులో వివాహిత ఉపాధ్యాయురాలు ఫేస్బుక్లో పరిచయమైన రాజస్థాన్కు చెందిన వ్యక్తితో స్నేహంగా ఉంటోంది. అతను టికెట్ పంపండంతో ఆమె విమానంలో గోవాకు వెళ్లింది. మూడురోజులపాటు స్కూల్ మీటింగ్ అని చెప్పి వెళ్లిన భార్యపై అనుమానంతో భర్త స్కూల్కి వెళ్లి ఆరా తీశాడు. అసలు గుట్టు బయటపడింది. భర్త విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. చదవండి: (400 ఏళ్ల క్రితమే పక్కా ప్లాన్తో బెంగళూరు నిర్మాణం.. నేటి దుస్థితికి కారణాలేంటి?) ప్రశ్నించిన భార్యపై దాడి కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగి ఒకరు 34 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ కార్యక్రమంలో పరిచయమైన మరో మహిళతో అతడు సంబంధం నెరపసాగాడు. ఇది తెలిసి భార్య ప్రశ్నించడంతో విచక్షణారహితంగా దాడి చేసి ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆమె మహిళా పోలీస్స్టేషన్ను ఆశ్రయించింది. కుటుంబాన్ని ముక్కలు చేసుకోవద్దు 2019 నుంచి 2022 జూలై వరకు 638 మంది జంటలు న్యాయ కోసం వనితా సహాయవాణి గడపతొక్కాయి. పెళ్లికి ముందే మరొకరితో సంబంధం ఉందని మరో 323 మంది ఫిర్యాదు చేశారు. గత ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు నెలల్లో 86 మంది దంపతుల సమస్య పరిష్కారానికి సహాయవాణిని ఆశ్రయించినట్లు కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. విలువైన కుటుంబ సంబంధాలను ముక్కలు చేసుకోవద్దని ఆమె జంటలకు సూచించారు. ఉన్నతాధికారి బండారం ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తోటి మహిళా అధికారితో వివాహేతర సంబందం కలిగి ఉన్నారు. నిత్యం మొబైల్లో చాటింగ్ చేసేవాడు. అనుమానం వచ్చిన భార్య అతను నిద్రలోకి జారుకున్న అనంతరం మొబైల్ను పరిశీలించగా బండారం వెలుగుచూసింది. దీంతో ఆ భర్తతో ఉండలేనంటూ ఆమె విడాకులు ఇవ్వడానికి కోర్టును ఆశ్రయించింది. -
ఛీ..ఛీ.. పాడు బుద్ధి.. వివాహేతర సంబంధాల మోజులో..
కొందరు తల్లిదండ్రులు వక్రబుద్ధితో వివాహేతర సంబంధాలు నెరపుతున్నారు. ఆకర్షణకులోనై ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కటకటాల్లోకి వెళ్తున్నారు. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. పిల్లలను అనాథులుగా మార్చుతున్నారు. కష్టాలకొలిమిలోకి నెట్టేస్తున్నారు. భవిష్యత్ను అంధకారంగా మార్చుతున్నారు. మేమేమి చేశాం పాపం అంటూ పిల్లలు గోడువెళ్లబోస్తున్నారు. దీనికి ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనం. విజయనగరం క్రైమ్: డెంకాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు పదేళ్లుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. భార్య ఇటీవల ఓ ఫార్మాకంపెనీలో హెల్పర్గా చేరినప్పటి నుంచి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరపుతోంది. విషయం భర్తకు తెలిసింది. నిలదీయడంతో భర్తను హతమార్చేందుకు పూనుకుంది. ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి మట్టుబెట్టింది. దీనిని ఆటో ప్రమాదంగా చిత్రీకరించింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపడంతో అసలు విషయాన్ని అంగీకరించింది. ఆమె జైలుకెళ్లింది. తండ్రి హత్యకు గురయ్యారు. వీరి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అనాథులుగా మారారు.’ ‘నెల్లిమర్ల మిమ్స్లో గుమస్తాగా పనిచేస్తున్న భర్తను ప్రియుడి మోజులో పడిన భార్య మట్టుబెట్టేందుకు స్కెచ్ గీశారు. ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి హతమార్చారు. మృతదేహాన్ని రైలుపట్టాల మధ్యన పడేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో అల్లుడ్ని చంపేందుకు అత్త కూడా రూ.40వేలు కిరాయిలో తనవంతు రూ. 20వేలు ఇచ్చేందుకు సహకరించడం విశేషం. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. తల్లి, అమ్మమ్మ జైలు పాలయ్యారు. చిన్నవయసులోనే పిల్లల పరిస్థితిని తలచుకున్నవారికి కన్నీరు ఉబుకుతోంది.’ వివాహేతర సంబంధాలు ఉసురు తీస్తున్నాయి. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో హత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అడ్డుతొలగించుకుంటే అంతా మనమేనన్న భ్రమను కల్పిస్తున్నాయి. చివరకు కుటుంబంలో ఒకరిని పొట్టనపెట్టుకుంటున్నాయి. పోలీసుల విచారణలో దొరికి, చివరకు జైలు గోడల మధ్యన నలిగిపోయేలా చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే కడుపున పుట్టిన పదేళ్లలోపు చిన్నారులు అనాథలైపోతున్నారు. ఆప్యాయంగా పిలవడానికి నాన్న ఉండడు. అన్నం పెట్టేందుకు అమ్మ దొరకదు. రక్తకన్నీరు కారుస్తూ, చిరుప్రాయంలోనే మనసులో బలమైన గాయాలు తగిలి, నలిగిపోతున్నారు. ఏం చేయాలో తెలియని స్ధితిలో నరకయాతన అనుభవిస్తున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబ బాంధవ్యాలను నాశనం చేస్తున్నాయి. ఏకంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు జిల్లాలో వరసగా చోటుచేసుకోవడంతో జిల్లావాసులు ఉలిక్కిపడుతున్నారు. ఇటువంటి విషసంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబాలను అనాథలను చేయకండి వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోతుందన్నది అందరికీ తెలిసిందే. తెలిసి తప్పుచేస్తే ఆ కుటుంబ పెద్దలపై ఆధారపడిన పిల్లలు, వృద్ధులు అనాథలైపోతారన్న విషయాన్ని గుర్తెరగాలి. వివాహేతర సంబంధాల పేరుతో హత్యలకు పాల్పడితే సహించేది లేదు. తీవ్రమైన చర్యలు ఉంటాయన్నది వాస్తవం. – ఎం.దీపిక, ఎస్పీ, విజయనగరం ఇదొక మానసిక రుగ్మత వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమనేది మానసిక రుగ్మత. చట్టబద్ధమైన వైవాహిక జీవితం మాత్రమే ఆచరించాలి. క్షణిక ఆకర్షణకు, విపరీత ధోరణుల వైపు మరలడం వల్ల వారి జీవితం పాడవ్వడమే కాకుండా, ఇరువురి కుటుంబాలు సమస్యల్లో చిక్కుకుంటాయి. సెల్, ఇంటర్నెట్ వాడకం పెరిగింది. కొత్త స్నేహాలు, అర్ధరాత్రుల వరకూ చాటింగ్లు, పరిచయాలు.. ప్రేమ ముసుగులో వివాహేతర సంబంధాలు చోటుచేసుకుంటున్నాయి. చివరకు కలిసి ఉండాల్సిన జీవితాలను కడతేర్చుకుంటున్నారు. చెడుస్నేహాలు, వ్యామోహాలు తగ్గించుకోవాలి. లేకుంటే కుటుంబం నడిసంద్రంలో నావలా తయారవుతుంది. – డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం -
వివాహేతర సంబంధం.. తల్లీ కూతుళ్లతో..!
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఇటీవల జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసును విచారణ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. దానికి సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా పోలీసులు మీడియాకు తెలిపారు. వివరాలు: జిల్లాలోని చేగుంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన శంభుని యాదమ్మ, తన కూతురు సంతోష కలిసి ఏప్రిల్ 10న చేగుంటకు వెళ్లారు. కానీ వారు తిరిగి ఇంటికి రాలేదు. సన్నిహితులు, బంధువులను సంప్రదించినా వారి ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో యాదమ్మ భర్త దగ్గరలోని పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. కాగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వడియారం అటవీ ప్రాంతంలో రెండు గుర్తు తెలియని డెడ్ బాడీలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. ఇక దాంతో పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకునారు. ఆ డెడ్ బాడీలను యాదమ్మ, సంతోషగా గుర్తించారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వడియారం గ్రామానికే చెందిన నగేశ్పై పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో నగేశ్ను అదుపులోకి తీసుకొని పోలీసులు తమ శైలిలో విచారించగా ఆ ఇద్దరు తల్లీకూతుళ్లను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్యకు గల కారణాలు: కొన్నాళ్ల క్రితం నగేశ్కు తల్లీ కూతుళ్లతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక ఈ క్రమంలో వారు నగేశ్ను తరచూ డబ్బులు ఇవ్వాలని వేధించసాగారు. తాము అడిగినంత ఇవ్వకపోతే తనపై కేసు కూడా పెడతామని బెదిరించారు. అయితే నగేశ్ మాత్రం ఎలాగైనా వారి పీడ తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ప్లాన్ ప్రకారం యాదమ్మతో పాటు తన కుమార్తె సంతోషను వడియారం అటవీ ప్రాంతానికి రావాల్సిందిగా కోరాడు. తల్లీ కూతుళ్లు అక్కడికి వెల్లి నిందితుడితో కలిసి మద్యం సేవించారు. ఇక ఆ మత్తులోనే నగేశ్ తల్లీ కూతుళ్లను గొంతు నులిమి హత్య చేశాడు. విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం..
గొల్లపల్లి (కరీంనగర్ ): ఓ వివాహిత మరొకరితో వివా హేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి మందలించినా ఆమెలో మార్పు రాలేదు. భార్య చేసిన మోసం అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఆమె వివాహిత ప్రియుడు, కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి, గొడవ చేయడంతో ఇక బతకొద్దని నిర్ణయించుకొని, తనువు చాలించాడు. మృతుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన జేరిపోతుల హన్మాండ్లు–దేవమ్మ దంప తులకు ముగ్గురు కుమారులు. వీరి చిన్న వయసు లోనే తండ్రి చనిపోయాడు. తల్లి దేవమ్మే పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు గంగాధర్(35)కు పదేళ్ల కిందట తిరుపతమ్మతో పెళ్లి జరిపించింది . వీరికి ప్రమోద్ సంతానం. కాగా తిరుపతమ్మ పెళ్లయిన రెండేళ్లకే అనారోగ్యంతో మృతి చెందింది. తర్వాత గంగాధర్ పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన మమతను రెండో వివాహం చేసుకున్నాడు. గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ, సామాజిక కా ర్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకున్నా డు. కానీ పెళ్లి జరిగి, ఆరేళ్లయినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో మమత జేరిపోతుల అభిషేక్ అనే ఎదురింటి యువకుడితో వివా హేతరం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలి సిన భర్త పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు ఆమె ను హెచ్చరించాడు. అయినా మమత ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అభిషేక్తోపాటు అతని కు టుంబసభ్యులను మందలించాడు. ఈ నెల 11న మమత తన ప్రియుడితో కలిసి గంగాధర్కు పట్టుబడింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరి గింది. గత శనివారం రాత్రి అభిషేక్, అతని కుటుంబసభ్యులు గంగాధర్ ఇంటికి వచ్చి గొడవ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆదివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి,∙తల్లి దేవమ్మ బోరున విలపించింది. అక్రమ సంబంధం మానుకోవాలని ఎన్నిసార్లు మందలించినా కోడలు వినలేదని తెలిపింది. ఆమె ప్రియుడు, కుటుంబసభ్యులు తమను చంపేస్తామని బెదించారని, అందువల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మమత, అభిషేక్లపై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. అయితే దేవమ్మ తన కుమారుడి మృతికి అభిషేక్ తల్లి లక్ష్మి, తండ్రి కిష్ఠయ్య, జేరిపోతుల రాకేశ్, మహేశ్, శంకర్, అతని భార్య అమ్మాయిలు కూడా కారణమని చెప్పిందన్నారు. విచారణలో నిజమని తేలితే అందరిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఎస్పీ ప్రకాశ్ బాధితుల ఇంటికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యులను మంత్రి కొప్పుల ఈశ్వర్, డీసీసీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్ పరామర్శించారు. -
వివాహేతర సంబంధం.. ఉదయం 5 గంటలకు దారికాచి
సాక్షి, సారంగాపూర్(కరీంనగర్): జిల్లాలో మరో హత్య జరిగింది. మూఢనమ్మకాలు, పాతకక్షల నేపథ్యంలో గతనెల 20న జిల్లా కేంద్రంలోని టీఆర్నగర్కు చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా చంపిన ఘటనను మరువక ముందే ఈ హత్య జరగడంతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో లచ్చనాయక్ తండాకు చెందిన భూక్య లక్ష్మణ్ (24) చనిపోయాడు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్ కథనం ప్రకారం.. లక్ష్మణ్ గ్రామంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 5 గంటలకు సేవాలాల్ భవనంలో మైక్ ఆన్ చేసేందుకు బయలు దేరాడు. తన ఇంటి ఎదుట నుంచి వెళ్తున్న లక్ష్మణ్పై భూక్య సురేందర్ రాడ్డుతో దాడి చేశాడు. తలపై బలంగా బాదడంతో లక్ష్మణ్ కుప్పకూలి, అక్కడికక్కడే మృతిచెందాడు. రక్తం చిమ్మి సమీప ఇంటిగోడలపై పడింది. తనకు రామ్, లక్ష్మణ్ కవల పిల్లలని, ఇద్దరికీ వివాహాలు చేయాలని అనుకుంటున్న తరుణంలో ఇలా హత్యకు గురయ్యాడని మృతుడి తల్లి అమ్మి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని సమాచారం. నిందితుడితోపాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చదవండిః కామాంధుడిని ఎన్కౌంటర్ చేయండి.. తల్లడిల్లిపోతున్న దీక్షిత తల్లిదండ్రులు -
మరిదితో వెళ్లిపోయి.. మూడో భర్త ముందు పతివ్రతనే అని..
సాక్షి, చెన్నై(తమిళనాడు): తనను అనుమానించిన మూడో భర్త ముందు తాను పతివ్రతనే అని నిరూపించుకునేందుకు ఓ తల్లి కసాయిగా మారింది. తన రెండో భర్తకు పుట్టిన ఆడబిడ్డను కడతేర్చింది. చెన్నైలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ విస్మయపరిచింది. వివరాలు.. తూత్తుకూడికి చెందిన పాల్ వణ్ణన్ కొన్నేళ్ల క్రితం భార్య జయలక్ష్మితో చెన్నైకు వచ్చాడు. వీరికి నిత్య అనే కుమార్తె ఉంది. కొన్నాళ్ల అనంతరం భర్త, కుమార్తెను వదిలిపెట్టి మరిది దురైరాజ్తో జయలక్ష్మి ముంబైకు పారిపోయింది. అక్కడ పెళ్లి చేసుకున్న వీరికి పవిత్ర(10) కుమార్తె ఉంది. ఏడేళ్ల క్రితం జయలక్ష్మిని వదిలిపెట్టి దురైరాజ్ పత్తాలేకుండా పోయాడు. తర్వాత కొద్ది రోజులు ముంబైలో ఉన్న జయలక్ష్మి కుమార్తె పవిత్రతో కలిసి చెన్నై తిరువొత్తియూరుకు వచ్చేసింది. ఇక్కడ ఓ లారీడ్రైవర్ను మూడో వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె భానుప్రియ(06), కుమారుడు భూపాలన్(05) ఉన్నారు. కాగా ఇటీవల మూడో భర్త పద్మనాభన్ జయలక్ష్మిపై అనుమానంతో గొడవపడే వాడు. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి భర్తతో గొడవపడి, అతడి ఆదేశాల మేరకు నిద్రలో ఉన్న రెండో భర్త దురైరాజ్కు పుట్టిన పవిత్రపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. తాను ఏ తప్పు చేయలేదంటూ ప్రతిజ్ఞ చేసింది. ఆతర్వాత కాసేపటికి మేల్కొన్న ఈ కసాయి తల్లి మంటల్లో కాలుతున్న బిడ్డను రక్షించే ప్రయత్నం చేసింది. స్థానికులతో కలసి కీల్పాకం ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ పవిత్ర మృతి చెందింది. సోమవారం పోలీసుల దర్యాప్తులో జయలక్ష్మి మూడు పెళ్లిల భాగోతం వెలుగు చూసింది. దీంతో ఆమెను, మూడో భర్తను అరెస్టు చేశారు. కాగా వీరికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలుగా రోడ్డున పడ్డారు. భార్యను హత్య చేసిన భర్త తిరువొత్తియూరుః ఇంటిని తన పేర రాసి ఇవ్వమంటూ గొడవ చేయడంతో భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. వివరాలు.. చెన్నై తండయార్ పేటకు చెందిన దళపతి (52). ఇతను నౌకలోపని చేస్తూ ఉన్నాడు. అతని భార్య షణ్ముఖప్రియ (49). వీరి కుమారుడు ఇలంపరిధి (28). విదేశాల్లో నౌకలో పని చేస్తూ ఉన్నాడు. మరో కుమారుడు అరుణ్ (26) ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. కుమార్తె అనిత (26)కు వివాహమై భర్తతో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దళపతి, షణ్ముఖ ప్రియా మధ్య గొడవ ఏర్పడింది. ఆ సమయంలో షణ్ముఖ ప్రియా భర్త పేరులో ఉన్న ఇంటిని తనకు రాసివ్వాలని కోరింది. ఆగ్రహం చెందిన దళపతి వంట గదిలో ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన షణ్ముఖప్రియను ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు దళపతి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. -
వివాహేతర సంబంధమే కారణమా? భర్త మెడకు చున్నీ బిగించి..
సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్): నిద్రిస్తున్న భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అజాంపుర కాలనీలో మంగళవారం వెలుగు చూసింది. తాగి వచ్చి వేధిస్తుండడంతో తానే చంపేశానని భార్య చెబుతుండగా, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే చంపేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. అజాంపుర కాలనీలో నివాసముండే అఫ్రోజ్ ఖాన్ (37)కు భార్య ఫర్జానా బేగం, కుమారుడు ఉన్నారు. ఫర్జానా మొదటి భర్తను వదిలేసి, అఫ్రోజ్ను రెండో పెళ్లి చేసుకుంది. అఫ్రోజ్ ఖాన్ గతంలో ఆటో నడిపే వాడు. కొద్ది రోజుల నుంచి అల్లం, వెల్లుల్లి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, రోజూ మద్యం సేవించి వచ్చి భార్యను వేధిస్తున్నట్లు తెలిసింది. విసిగి పోయిన ఫర్జానా సోమవారం అర్ధరాత్రి సమయంలో భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. సమాచారమందుకున్న పోలీసులు మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ సోమనాథం, ఎస్హెచ్వో మధుసూదన్ పరిశీలించారు. రోజు మద్యం సేవించి తనను వేధించడంతోనే హత్యకు పాల్పడినట్లు ఫర్జానా చెబుతోంది. అయి తే, వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనే కారణంతోనే హత్చ చేసినట్లు అఫ్రోజ్ బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య ఒక్కరే హత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ సోమనాథం తెలిపారు. చదవండి: యువతి ఫొటోలతో న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ.. -
వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను
సాక్షి, హన్వాడ(మహబూబ్నగర్): భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసి నిలదీయడంతో, ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన సంఘటన సోమవారం ఉద యం మండలంలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన మొద్దు వెంకటేష్(37)కు బుద్దారం గ్రామానికి చెందిన మాధవితో పదేళ్ల క్రి తం వివాహం జరిగింది. కాగా భార్య నాగర్కర్నూల్కు చెందిన జంగం రమేష్ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన భర్త వెంకటేష్ మందలించాడు. దీంతో భార్య భర్తను ఎలాగైనా అంతమొందించాలనే నిశ్చయించుకుంది. పొలం పనులకు వెళ్లి వచ్చిన భర్త ఆదివారం రాత్రి ఎప్పటిలా భోజ నం చేసి నిద్రకు ఉపక్రమించాడు. అప్పటికే ప్రణాళిక రచించిన భార్య మాధవి రమేష్తో కలి సి భర్త వెంకటేష్ గొంతునులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి నాయినోనిపల్లి శివారులో ప్రధాన రహదారిపై వేసి రోడ్డు ప్రమాద ంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమ ంలో పెట్రోలింగ్లో ఉన్న హన్వాడ పోలీసులు ప్ర ధాన రహదారిపై వారిని గుర్తించారు. మృతదేహా న్ని వదిలి పారిపోతుండగా వెంబడించి పట్టు కుని ఠాణాకు తరలించారు. వెంకటేష్కు భార్యతోపాటు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఈ ఘటనపై వెంకటేష్ తమ్ముడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. -
భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి
సాక్షి, మహదేవపూర్(వరంగల్): అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చేలా చేసింది. మండంలంలోని కాళేశ్వరం పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 8న అన్నారం గ్రావిటీ కెనాల్లో లభ్యమైన గుర్తుతెలియని మహిళా శవం కేసును ఛేదించినట్లు జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. అయితే, అంతకుముందే కాళేశ్వరం పోలీస్స్టేషన్లో మహిళ అదృశ్యమైన కేసు ఉంది. ఆ దిశగా పోలీస్లు విచారణ చేపట్టగా గురువారం ఉదయం మహదేవపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామశివారులో వాహన తనిఖీలు చేస్తుండగా కారులో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాళేశ్వరం పోలీస్స్టేషన్ పరిధిలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన రేగుల సౌజన్యతో భర్త రేగుల తిరుపతి భూపాలపల్లికి వెళ్లడానికి ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మైదబండాకు చెందిన తన బావమరిది ఎర్రం సురేష్ కారు అద్దెకు తీసుకుని వెళ్తూ మార్గమధ్యలో సౌజన్య స్నేహితురాలైన వెంకటేశ్వరిని కారులో ఎక్కించుకుని వెళ్లారు. అయితే తిరుపతికి భార్య సౌజన్యపై అనుమానం ఉండడంతో ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం తిరుగు ప్రయాణంలో మెడిపల్లి అటవీ ప్రాంతంలో భార్య సౌజన్యను వివస్త్రను చేసి ఆమె మెడకు తాడు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని అన్నారం గ్రావిటీ కాల్వలో పడేసి ఆమె దుస్తులు మంథని శివారు ప్రాంతం భట్టుపల్లి వద్ద దహనం చేసి పారిపోయినట్లు నేరం ఒప్పుకున్నారు. మృతురాలికి పాప, బాబు ఉన్నారు. ఇదివరకే తిరుపతిపై వరకట్నం కేసు, మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు పేరుతో డబ్బులు సంపాదించిన కేసులు ఉన్నాయని ఏఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ సమీక్షలో మహదేవపూర్ డీఎస్పీ బోనాల కిషన్, సీఐ కిరణ్, ఎస్సై రాజ్కుమార్, కాళేశ్వరం ఎస్సై ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. చదవండి: మరదలిని లోబర్చుకుని.. భార్యకు పిల్లలు పుట్టకుండా చేసి -
మరదలిని లోబర్చుకుని.. భార్యకు పిల్లలు పుట్టకుండా చేసి
సాక్షి, నల్లగొండ: మహిళను వేధింపులకు గురిచేసిన ఐదుగురిపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన మహేశ్వరం సువర్ణను హైదరాబాద్లోని మీర్పేటకు చెందిన సంపూర్ణచారికి ఇచ్చి 30 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కట్నంగా ప్లాటు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. వివాహమైన తర్వాత మూడేళ్ల వరకు వారి సంసారం సాఫీగా జరిగింది. ఈ క్రమంలో జీవనోపాధి కోసం సంపూర్ణచారి అనంతారం అత్తగారింటికి వచ్చి సువర్ణ సోదరి సరస్వతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పథకం ప్రకారం సంపూర్ణచారి సువర్ణను ఇబ్బందులకు గురి చేస్తూ గర్భం దాల్చకుండా చేసి పిల్లలు పుట్టరనే నెపంతో ఇద్దరితో కలిసి ఉంటానని నమ్మించి సరస్వతిని పెళ్లిచేసుకున్నాడు. తనను మంచిగా చూసుకుంటానని మోసం చేశాడని, ఆత్మహత్య చేసుకోవాలని తనపై పలుమార్లు దాడి చేశారని భర్త సంపూర్ణచారిపై సువర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. చదవండి: రహస్యంగా ఫోన్కాల్స్.. ఎన్నిసార్లు చెప్పినా మారని కోడలు.. చివరకు -
ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి..
సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక): గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షునితో పాటు మరో మహిళ హత్యకు గురయ్యారు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్ తాలూకా చందాపురలోని రామయ్య లేఔట్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హతులను నారాయణస్వామి (42), కావ్య (32)గా గుర్తించారు. వీరిద్దరూ సమీపంలోని చిక్కహాగడె గ్రామానికి చెందినవారు. భర్తకు విషయం తెలిసి.. నారాయణ స్వామి కావ్య ఇంటికి వచ్చి ఉండగా, కావ్య భర్తకు ఈ విషయం తెలిసింది. ఆవేశం పట్టలేక ఇంటికి చేరుకొని ఇంటి ముందు నారాయణ స్వామిని, ఇంటిలో ఉన్న కావ్యను కత్తితో నరికి చంపి పరారయ్యాడు. అతనితో పాటు ఆటోలో వచ్చిన మరో ముగ్గురు కూడా ఈ హత్యాకాండలో పాల్గొన్నట్లు సూర్యనగర పోలీసులు తెలిపారు. కావ్య తల్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా చేరుకుని పరిశీలించారు. పాత కక్షలా, లేక ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా? అని ఆరా తీశారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న భర్త, ఇతరుల కోసం గాలిస్తున్నారు. చదవండి: మందు కొట్టి.. ఫ్యామిలీని బలిపెట్టాడు -
పక్కా ప్లాన్.. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని.. ముగ్గురు ప్రియులతో కలిసి..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్నగర్): ఓ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ముగ్గురు ప్రియులతో కలిసి పథకం ప్రకారం భర్తను భార్య చంపేసినట్టు ఎనిమిది నెలల తర్వాత బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన చెరువుమీది పర్వతాలు (27) కు ఉదండాపూర్లోని యాదమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భార్య పలువురితో వివాహేతర సంబంధాలు కొనసాగించేది. ఈ క్రమంలో భర్త ఓ ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయి ఇంట్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించి ప్రియులతో కలిసి హత్య చేసేందుకు యాదమ్మ పథకం పన్నింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి ముగ్గురు ప్రియులతో కలిసి భర్త పర్వతాలుకు ఆమె అతిగా మద్యం తాపించింది. అపస్మారక స్థితికి చేరుకున్నాక చున్నీతో గొంతును బిగించి చంపేశారు. ఏమీ తెలియనట్టు లబోదిబోమంటూ మరుసటిరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేపట్టారు. చివరకు యాదమ్మతో పాటు పోలేపల్లికి చెందిన ఎన్నన్గండ్ల శివలింగం, ఎన్నన్గండ్ల మల్లేష్, గడ్డపు నాగరాజులను నిందితులుగా గుర్తించారు. ఈ మేరకు నలుగురిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి మొబైల్ ఫోన్ల్ను కోర్టుకు స్వాధీనం చేసినట్టు సీఐ రమేశ్బాబు తెలిపారు. (చదవండి: మానేరు వాగు గల్లంతు ఘటన: స్పందించిన కేటీఆర్..) -
టీడీపీ నేత ‘సంబంధం’ బట్టబయలయిందని...
తాడేపల్లిరూరల్: తన వివాహేతర సంబంధం బట్టబయలయిందని ఆగ్రహించిన ఓ టీడీపీ నాయకుడు మరో ఇద్దరితో కలసి మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డీఎస్పీ రాంబాబు శనివారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామానికి చెందిన కూరపాటి శేషుకు మతిస్థిమితం లేదు. గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్లో నిర్మించిన ఓ కొత్త భవనంలో ఎవరూ లేకపోవడంతో అక్కడే నివాసముంటున్నాడు. హైదరాబాద్లో ఉండే ఇంటి యజమాని రెండు ఫ్లోర్లు కలిగిన ఆ నివాసాన్ని తెనాలి మండలానికి చెందిన తెలుగు యువత మాజీ అధ్యక్షుడు శాఖమూరు బాబూ సురేంద్రకు అద్దెకు ఇచ్చాడు. ఆయన రెండో ఫ్లోర్ను శ్రీకాంత్ అనే మరో వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. పెంట్హౌస్ను లక్ష్మీకాంత్రెడ్డికి అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ రోజు శాఖమూరు బాబూ సురేంద్ర తన గర్ల్ ఫ్రెండ్ను గదికి తీసుకొచ్చాడు. ఆ సమీపంలోనే ఉన్న కూరపాటి శేషు గమనించి గది బయట గడియ పెట్టి పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగలకొట్టి కేకలు వేశాడు. దాంతో చుట్టుపక్కల వారు వచ్చి శాఖమూరు బాబూ సురేంద్ర రోజుకొక అమ్మాయిని తీసుకొస్తున్నాడని ఇంటి యజమానికి ఫిర్యాదు చేశారు. దీంతో పైముగ్గురూ శేషుకుమార్ను విచక్షణా రహితంగా రాడ్తో కొట్టి చంపి సురేంద్ర ఇన్నోవా కారులో వారు నివాసముంటున్న ఇన్నర్ రింగ్రోడ్ దగ్గర నుంచి 6 కిలోమీటర్లు తీసుకొచ్చి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. అయితే శేషుకుమార్ వివరాలు తెలియక తికమకపడుతున్న పోలీసులకు.. ఓ వలంటీర్ అతని వివరాలను అందజేశాడు. ఇద్దరు నిందితులతో నార్త్జోన్ డీఎస్పీ రాంబాబు ఆ దిశగా విచారణ ప్రారంభించిన పోలీసులు వీరు ముగ్గురే చంపారని నిర్ధారణ కావడంతో లక్ష్మీకాంత్రెడ్డి, శ్రీకాంత్ను ఇన్నర్ రింగ్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు శాఖమూరు బాబూ సురేంద్ర పరారీలో ఉన్నాడు. అమర్తలూరులో అతని కారును, వేరే వ్యక్తి వద్ద ఉంచిన అతని సెల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, బాబూ సురేంద్ర తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ముఖ్య అనుచరుడు కావడంతో అతడ్ని కేసులో నుంచి తప్పించేందుకు మంగళగిరి, తెనాలి టీడీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పోలీసులు ప్రలోభాలకు లొంగకుండా బాబూ సురేంద్రను నిందితుడిగా చేర్చి గాలింపు చర్యలు చేపట్టారు. -
వివాహేతర సంబంధం: మైనర్ బాలుడే నిందితుడు
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరు బనశంకరిలోని యారబ్నగరలో మహిళా టైలర్ అఫ్రినా ఖానం (28) హత్య కేసు మిస్టరీ వీడింది. మంగళవారం ఆమె ఇంట్లో చొరబడిన దుండగుడు కత్తెరతో పొడిచి చంపి, మృతదేహంపై బట్టలు వేసి నిప్పుపెట్టి పరారయ్యాడు. భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా పలు వాస్తవాలు బయటపడ్డాయి. ఆమె బంధువైన పీయూసీ విద్యార్థే (17) నిందితుడని తేలింది. అఫ్రినా ఇంటి పక్కనే నిందితుని కుటుంబం కొత్త ఇల్లు కడుతోంది. అబ్బాయి ఆమె ఇంటికి వచ్చి వెళ్తూండగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లి జీవిద్దామని హతురాలు ఆ అబ్బాయిని ఒత్తిడి చేయగా, అతడు నిరాకరించాడు. అంతేగాక డబ్బు ఇవ్వాలని ఆమెను అతడు పీడించాడు. దీంతో గొడవ జరిగింది, అబ్బాయి కత్తెర తీసుకుని ఆమెను పొడిచి చంపి పరారయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. చదవండి: Shocking: పట్టపగలు ఇంట్లో ప్రవేశించి.. మహిళను.. -
కుమార్తెతో మద్యం తాగించి లైంగిక దాడి.. ప్రియురాలితో వీడియో
మార్కాపురం: కన్న కుమార్తె పైనే లైంగిక దాడికి పాల్పడ్డాడో తండ్రి. పైగా బలవంతంగా కుమార్తెతో మద్యం తాగించి.. లైంగిక దాడి వ్యవహారాన్ని తన ప్రియురాలితో వీడియో తీయించాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ డాక్టర్ కిషోర్కుమార్ తెలిపారు. సర్కిల్ కార్యాలయంలో ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వోద్యోగి.. వైఎస్సార్ జిల్లాలో పని చేస్తున్నాడు. భార్య, కుమార్తె ఉన్నారు. ఇతను బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఆ ఉద్యోగి తన 15 ఏళ్ల కుమార్తెను గత నెల 25న తన ఉద్యోగం చేస్తున్న ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ తన ప్రియురాలితో కలిసి మద్యం తాగి.. కుమార్తెకు కూడా బలవంతంగా మద్యాన్ని తాగించాడు. ఆపై కుమార్తెపై లైంగిక దాడి చేస్తూ ప్రియురాలితో సెల్ఫోన్తో వీడియో తీయించాడు. ఈ ఘటన గురించి బాధిత బాలిక ఇంటికొచ్చాక తన తల్లితో చెప్పింది. చదవండి: (ఫేస్బుక్ ప్రేమ.. యువకుడి చేతిలో మోసపోయి) అదే రోజు పట్టణ పోలీస్ స్టేషన్లో తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో పట్టణ శివారులోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ నాగరాజు చెప్పారు. నిందితుడి వద్ద ఉన్న సెల్ ఫోన్, అందులోని వీడియో, ఫొటోలను సీజ్ చేసినట్టు తెలిపారు. -
పెళ్లై, ఇద్దరు పిల్లలు.. ప్రియుడితో పరార్.. చివరికి..
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): ప్రియుడి చేతిలో మోసపోయిన కోల్కతాకు చెందిన ఓ వివాహిత ఎంవీపీ పోలీసుల సంరక్షణలో ఉంది. పోలీసులు అడిగిన పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో.. ఆమెను కేజీహెచ్లోని ‘సఖి వన్స్టాప్’ సెంటర్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివీ.. కోల్కతాకు చెందిన వివాహిత నీలిమా ఖతూన్ ఎంవీపీకాలనీ డబుల్ రోడ్డులో ఏడుస్తూ అనుమానాస్పద స్థితిలో ఉండటాన్ని స్థానికులు గమనించారు. వైఎస్సార్సీపీ స్థానిక నాయకుడు ఉమ్మిడి కల్యాణ్కు వారు సమాచారం ఇచ్చారు. ఆయన.. ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఏ వివరాలు చెప్పలేకపోవడంతో ఎంవీపీ పోలీసుస్టేషన్కు అప్పగించారు. అనంతరం ఆ యువతి పోలీసుల విచారణలో తనకు పెళ్లి అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. ‘నాది కోల్కతా. గతంలో భర్త, తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్లోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేశాను. ఆ సమయంలో పరశురాం అనే వ్యక్తితో పరిచయం అయింది. ఆయన నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. నన్ను కోల్కతా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా పరశురాంతో ఫోన్లో మాట్లాడేదాన్ని. ఈ క్రమంలో పరశురాం వారం రోజుల కిందట నన్ను విశాఖ తీసుకొచ్చాడు. పిల్లలను చూడాలని అతనికి చెప్పగా.. అతనితో గొడవ జరిగింది. రెండు రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పరశురాం ఎంవీపీ డబుల్రోడ్డులో నన్ను వదిలేసి వెళ్లిపోయాడు’ అని పోలీసులు విచారణలో నీలిమా తెలిపింది. తన తల్లిదండ్రుల చిరునామా, పరశురాం ఏం చేస్తుంటాడు, ఎక్కడుంటాడు.. అనే వివరాలను ఆమె వెల్లడించలేకపోతోంది. దీంతో ఎంవీపీ పోలీసులు దర్యాప్తు నిమిత్తం కేజీహెచ్లోని సఖి వన్స్టాప్ సెంటర్కు తరలించారు. ఆమె చిరునామా తెలిసిన అనంతరం భర్త, తల్లిదండ్రులకు తెలియజేస్తామన్నారు. వారి నుంచి పూర్తి వివరాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు చేపడతామని ఎంవీపీ సీఐ రమణయ్య వెల్లడించారు. చదవండి: ప్రియుడిని చొక్కా పట్టి ఈడ్చుకెళ్లిన ప్రియురాలు -
కన్నతల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని..
సాక్షి, మద్నూర్(నిజామాబాద్): మరొకరితో సన్నిహితంగా ఉంటోందని కుటుంబసభ్యులు గొంతు కోసి మహిళపై హత్యాయత్నం చేసిన ఘటన మండలకేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. మద్నూర్లో గోసం లక్ష్మికి గతంలోనే వివాహం జరుగగా భర్త వదిలివేశాడు. దీంతో లక్ష్మి తన కొడుకు రవి, తమ్ముడు ప్రవీణ్లతో కలిసి మండలకేంద్రంలో నివసిస్తోంది. ఈక్రమంలో లక్ష్మి మరొకరితో సన్నిహితంగా ఉండటం కొడుకు, తమ్ముడు జీర్ణించుకోలేకపోయారు. మంగళవారం తెల్లవారుజామున వారు నిద్రపోతున్న లక్ష్మిపై కత్తితో దాడిచేసి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగు, పొరుగు వాళ్లు ఇంట్లోకి వచ్చారు. వెంటనే నిందితులు పారిపోయారు, బాధితురాలిని నిజామాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాధితురాలి కూతురు శీరిష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
పెళ్లికి ముందే సహ జీవనం, సిటీకి తీసుకెళ్లి కాపురం పెడితే..
నోయిడా: వివాహేతర సంబంధాలు, సహజీవనం ఈరోజుల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ రెండింటి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడితే, సహజీవనం వంటి సంబంధాలు వారి జీవితాలను నట్టేట ముంచుతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఏమాత్రం మార్పు లేదు. ఓ యువకుడి మోజులో పడి తను ప్రేమించిన వ్యక్తిని ఆ యువతి చేతులారా చంపుకున్న ఘటన నోయిడాలో కలకలం రేపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ముఖేష్ అనే 22 ఏళ్ల యువకుడు ఓ యువతిని ప్రేమించి కొన్ని సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. సొంత ఊరును సైతం వదిలి ఇద్దరూ నోయిడాలో కాపురం పెట్టారు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోకపోయినప్పటికీ భార్యాభర్తల్లానే కలిసి జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట జీవితంలోకి అంకుష్ అనే యువకుడి రాకతో వీరి జీవితాలు తలకిందులయ్యాయి. తన ఇంటి పక్కన ఉండే అంకుష్తో ముఖేష్ భార్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంత కాలం వాళ్లిద్దరూ ముఖేష్ కళ్లుగప్పి వారి సంబంధాన్ని కొనసాగించారు. అయితే ఇటీవల ముఖేష్కు ఈ విషయం తెలియడంతో తాను పెళ్లి చేసుకోకపోయినప్పటికీ భార్యలా చూసుకుంటున్న తనను కాదని అంకుష్తో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేకపోయాడు. ఇంట్లో తమ ఇద్దరు పిల్లలున్న సంగతి కూడా మరచి ఇదేం పనంటూ ఆ యువతిని మందలించాడు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఈ విషయాన్ని తన ప్రియుడు అంకుష్కు చెప్పింది. అంతే కాక ముఖేష్ అడ్డు తొలగించుకోవాలని అంకుష్కి చెప్పడంతో ముఖేష్ హత్యకు ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా ముఖేష్పై లేని ప్రేమను నటించి అతడికి ఆమె మద్యం తాగించింది. మత్తులో తూలిపోయిన ముఖేష్ నిద్రలోకి జారుకోగానే ప్రియుడు అంకుష్కి ఫోన్ చేసింది. అంకుష్ ఆమె ఇంటికి రాగానే ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న ముఖేష్ను హతమార్చారు. ఇక మరుసటి రోజు తెల్లవారుజామున ముఖేష్ ఇంటి నుంచి పెద్దగా కేకలు విన్పించడంతో ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. దీనితో ఆ యువతి మొసలి కన్నీరు కార్చుతూ రాత్రి మద్యం తాగి మత్తులో నిద్రపోయిన ముఖేష్ ఉదయాన్నే ఇలా చనిపోయి కనిపించాడని నాటకమాడింది. పోలీసులతో కూడా ఇదే కట్టుకథను చెప్పి నమ్మించసాగింది. అయితే.. ఆ యువతి ప్రవర్తనపై పోలీసులకు అనుమానమొచ్చింది. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తమ శైలిలో పోలీసులు విచారించడంతో ముఖేష్ను తన ప్రియుడు అంకుష్తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. -
నల్గొండ: టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడి హత్య
సూర్యాపేట రూరల్: జిల్లాలో సంచలనం సృష్టించిన రాజునాయక్తండా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లూనావత్ శంకర్నాయక్ హత్యోదంతం చిక్కుముడి వీడుతున్నట్లు తెలుస్తోంది.వివాహేతర సంబంధాలు సాగిస్తున్న ఇద్దరు యువకులను పంచాయితీలో మందలించినందుకే కక్ష పెంచుకుని మరికొందరి సహకారంతో శంకర్నా నాయక్ను పథకం ప్రకారం మట్టుబెట్టినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అందరితో కలివిడిగా.. రాజునాయక్ తండాలో ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురైన లూనావత్ శంకర్నాయక్ ఉన్నత విద్యావంతుడు. ఎల్ఎల్బీ పూర్తి చేసి గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో సర్పంచ్గా పోటీచేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. మూడేళ్లుగా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. శంకర్నాయక్ అందరితో కలివిడిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటు పడుతుండేవాడు. గ్రామంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్నాడు. సరికాదన్నందుకే కక్ష పెంచుకుని.. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అదే గ్రా మానికి చెందిన ఇద్దరు మహిళలతో కొంతకాలంగా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే, వీరి వివాదం రెండు మాసాల క్రితం పంచాయితీ పెద్దల వరకు వచ్చింది. అయితే గ్రామంలో పెద్ద మనిషిగా ఉంటున్న శంకర్నాయక్ వివాహేతర సంబంధాలు సాగిస్తున్న సదరు యువకులను పంచాయితీలో అందరిముందు మీరు అనుసరిస్తున్న తీరు తప్పని గట్టిగానే మందలించినట్లు తెలిసింది. రెండు పర్యాయాలు జరిగిన పంచాయితీలో సైతం శంకర్నాయక్ ఆ యువకులను తప్పుబట్టడడంతోనే కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో.. శంకర్నాయక్ హత్యోదంతాన్ని నిశితంగా పరిశీలిస్తే దుండగులు పక్కా ప్రణాళికతోనే తమ పథకాన్ని అమలుచేసి మట్టుబెట్టినట్లు అవగతమవుతోంది. కొద్ది రోజులుగా శంకర్నాయక్ కదలికలను గమనిస్తూ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి శంకర్నాయక్ తన సోదరుడి ఇంటికి వెళ్లడాన్ని గమనించిన దుండగులు మాటేసి హత్య చేసినట్లు ఘటన స్థలాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. శంకర్నాయక్ నాయక్ ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వస్తుండడాన్ని తెలుసుకుని, అదే సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి దారుణానికి తెగబడినట్లు అర్థమవుతోంది. లొంగిపోయిన నలుగురు నిందితులు రాజునాయక్తండా టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లునావత్ శంకర్నాయక్ హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్న ట్లు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున సదరు నిందితులు నేరుగా పోలీస్స్టేషన్కు వచ్చి తామే హత్య చేసినట్లుగా ఒప్పుకుని లొంగిపోయినట్లు తెలిసింది. కాగా, ఈ విషయాన్ని ఎస్ఐ లవకుమార్ ధ్రువీకరించలేదు. అయితే, శంకర్ నాయక్ హత్యోదంతంలో నలుగురు యువకులే పాల్గొన్నారా..? విద్యుత్ సరఫరా నిలిపివేయడం, హత్య అనంతరం నిందితులు పారిపోయేందుకు సహకరించింది ఎవరు..? ఈ కేసులో సూత్ర, పాత్రధారులపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పలువురిపై హతుడి భార్య ఫిర్యాదు తన భర్తను రాజునాయక్తండాకు గ్రామానికి చెందిన సైదా, లునావత్ తార, భూక్యా సురేష్, భూక్యా చందర్, మహేందర్, రమావత్ శ్వేత, లునావత్ పాండునాయక్లే హత్య చేశారని ఆరోపిస్తూ హతుడు శంకర్నాయక్ భార్య భారతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ విఠల్రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లవకుమార్ తెలిపారు. చదవండి: సైనెడ్తో కుక్కను చంపి.. తర్వాత ప్రియుడితో కలిసి -
అనుమానాగ్నిలో బంధాలు భస్మీపటలం
నాతి చరామి అంటూ పెళ్లి పీటలపై ఒకరి కొకరు తోడుగా నూరేళ్లూ కలసి జీవిస్తామని చేసిన ప్రమాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఆలుమగల మధ్య కాపురాలు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. సంసారాలు శ్మశానాలుగా మారిపోతున్నాయి. నిత్యం అనుమానాగ్ని జ్వాలల్లో రగిలిపోతూ భార్యను నిర్దాక్షిణ్యంగా నరికి చంపుతున్న భర్తలు, వివాహేతర సంబంధాలకు అడ్డు అని భర్తలను చంపడానికి కూడా వెనుకాడని భార్యలు... గుంటూరు నగరంలో మంగళవారం వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు నానాటికీ దిగజారిపోతున్న భార్యాభర్తల బంధానికి అద్దం పడుతున్నాయి. భార్యను చంపిన భర్త సాక్షి, పట్నంబజారు(గుంటూరు): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త హత్య చేసిన ఘటన గుంటూరు నగరంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పట్టాభిపురం పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తుఫాన్నగర్లో నివాసం ఉండే మాలంపాటి వీరాంజనేయులు కార్పెంటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి 14 సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన కోటేశ్వరి (36)తో వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల బాబు ఉన్నాడు. కరోనా సమయంలో భార్యాభర్తలు కంచికచర్లలోని కోటేశ్వరి పుట్టింటికి వెళ్లారు. 20 రోజుల తరువాత వీరాంజనేయులు తిరిగి గుంటూరుకు వచ్చేయగా, కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో కోటేశ్వరి అక్కడే ఉండిపోయింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకోగా, కొద్ది రోజుల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో సర్దిచెప్పి కాపురానికి పంపారు. ఈ క్రమంలో వీరాంజనేయులు భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తల మధ్య తిరిగి వివాదం చోటుచేసుకుంది. ఈ సమయంలోనే వీరాంజనేయులు కోటేశ్వరి తలను గోడకేసి కొట్టి గొంతు నులిమి హతమార్చాడు. గతంలో పాతగుంటూరులో నివాసం ఉండే వీరాంజనేయులు, కోటేశ్వరి కొద్ది కాలం క్రితమే తుఫాన్నగర్లో ఇల్లు కట్టుకుని వచ్చారు. విషయం తెలుసుకున్న పట్టాభిపురం పీఎస్ ఎస్హెచ్వో జి.పూర్ణచంద్రరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి మంగిశెట్టి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చదవండి: (స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై) భర్తను హతమార్చిన భార్య పట్నంబజారు(గుంటూరు): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన గుంటూరులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. గుంటూరు అరండల్పేట పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక రాజీవ్గాంధీనగర్లో నివాసం ఉండే పీకే మరియదాసు (40) మార్బుల్ పని చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. అతనికి 22 ఏళ్ల క్రితం మరియమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు మిర్చియార్డులో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా తెనాలి మండలం పెరవలి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అనిల్తో మృతుడి భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సోమవారం రాత్రి మరియమ్మ కుమారుడు మిర్చియార్డుకు పనికి వెళ్లాడు. ఆ తరువాత అనిల్ వారి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మరియదాసు మద్యం సేవించి నిద్రిస్తుండగా అనిల్, మరియమ్మ కలిసి మృతుడి గొంతుకు తాడు బిగించి, రోకలిబండతో తలపై తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం వారిద్దరూ అక్కడినుంచి పరారయ్యారు. తెల్లవారుజాము సమయంలో మరియమ్మ తన కుమారుడు సుధాకర్కు ఫోన్ చేసి తండ్రి మరియదాసు యాక్సిడెంట్ అయి ఇంట్లో పడి ఉన్నాడని చెప్పింది. సుధాకర్ విషయాన్ని బంధువులకు తెలియజేయగా, వారు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. అరండల్పేట పోలీసుస్టేషన్ ఎస్హెచ్వో బత్తుల శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి తలపై ఉన్న గాయాలను చూసి అనుమానం వచ్చిన ఎస్హెచ్వో శ్రీనివాసరావు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న మరియమ్మ, అనిల్ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు పాల్పడినట్లు అంగీకరించారు. మృతుడి సోదరుడు కాంతారావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (కన్నా..నీ వెంటే మేమంతా..!) -
సైనెడ్తో కుక్కను చంపి.. తర్వాత ప్రియుడితో కలిసి
సాక్షి, గుంటూరు: అనుమానాస్పదంగా మృతి చెందిన భాష్యం బ్రహ్మయ్య కేసు మిస్టరీని పెదకూరపాడు పోలీసులు ఛేదించారు. సైనేడ్ కారణంగానే మృతి చెందినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మృతుడి భార్య, ప్రియుడు కలసి ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేల్చి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ విశాల్గున్నీ వివరాలు వెల్లడించారు. పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరు గ్రామంలో హోటల్ నిర్వాహకుడు భాష్యం బ్రహ్మయ్య (45) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి భార్య సాయికుమారి ప్రియుడు అశోక్రెడ్డి కలసి బ్రహ్మయ్యను హతమార్చాలని నిర్ధారించుకొని పథకం వేశారు. హత్య చేసినా నిందితులను ఎవరూ గుర్తించరని భావించి మచిలీపట్నంకు చెందిన తోకడా పవన్ కుమార్, షేక్ షరీఫ్లను రెండు నెలల క్రితం కలసి రూ.10 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ తీసుకున్న అనంతరం నిందితులు ఇద్దరూ పలుమార్లు రెక్కీ నిర్వహించారు. చదవండి: (ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య) పక్కా పథకం ప్రకారం ఈ నెల 4న బ్రహ్మయ్య హోటల్ వ్యర్థాలను గ్రామ శివారులో పడేసేందుకు వెళ్లగా అక్కడే కాపుకాచి ఉన్న నిందితులు బలవంతగా బ్రహ్మయ్యకు సైనేడ్ అనే పటాస్ ద్రావణం తాగించి హతమార్చారు. బ్రహ్మయ్య హత్యకు ముందు ప్రయోగాత్మకంగా ఓ కుక్కకు సైనెడ్ పెట్టి చంపారు. అయితే ఈ కేసు మిస్టరీని ఛేదించిన తుళ్ళూరు డీఎస్పీ, సత్తెనపల్లి రూరల్ సీఐ, పెదకూరపాడు ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో క్రైమ్స్ ఏఎస్పీ ఎస్వీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చదవండి: (కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!) -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
సాక్షి, హుబ్లీ: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడితో హతుడి భార్య వివాహేతర సంబంధం గుట్టు ఈ హత్యతో బట్టబయలైంది. ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా అంచటగేరి నివాసి అక్షతకు హావేరి జిల్లా హానగల్ నివాసి జగదీష్తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నాలుగు నెలల క్రితం అక్షతకు ఓ మగబిడ్డ జన్మించింది. ఈక్రమంలో భార్య, బిడ్డలను చూడటానికి వచ్చిన భర్త దారుణ హత్యకు గురయ్యాడు. (మంజీరలో ఏఓ గల్లంతు?) ఈ కేసు కూపీ లాగిన సీఐ రమేష్ గోకాక్ అక్షత కాల్ డేటాను తెలుసుకొని ఆమె ప్రియుడు కాశప్పను అదుపులోకి తీసుకుని పోలీసు పద్ధతిలో విచారించగా అసలు విషయం నిగ్గు తేలింది. అక్షత ప్రియుడు కాశప్ప స్వగ్రామం బాదామి తాలూకా బండకేరి. ఇతడు గత ఐదేళ్ల నుంచి కేఈబీ లైన్మెన్గా ఉంటూ అంచటగేరిలో అక్షత ఇంటి ఎదుట ఇల్లు తీసుకొని ఉండేవాడు. వీరి మధ్య గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నెలకొంది. అంతేగాక నాలుగు నెలల క్రితం కాశప్పకు మరో యువతితో వివాహమైంది. (పదేళ్ల బాలికపై పూజారి అఘాయిత్యం) తమ వివాహేతర సంబంధం కొనసాగాలంటే అడ్డుగా ఉన్న భర్త జగదీష్ను చంపేయాలని ఇద్దరూ పథకం వేశారు. ఆ క్రమంలోనే భార్య, బిడ్డను చూసేందుకు వచ్చిన జగదీష్కు మంగళవారం కాశప్ప మందుపార్టీ ఇచ్చి ఊరు చివరలోని చెన్నాపుర క్రాస్ వద్ద తలపై బండరాయిని ఎత్తి వేసి హత్య చేసి పరారయ్యాడు. కొన్ని గంటల్లోనే కేసు మిస్టరీని చేధించిన పోలీసులు గురువారం నిందితులను జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. -
జంట హత్యల కేసులో.. మాజీ ఎమ్మెల్యే వ్యూహకర్త
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో వెలుగు చూసిన జంట హత్యల కేసులో అధికార పక్షం బిజూ జనతాదళ్ నాయకుడు, శాసన సభ మాజీ సభ్యుడు అనుప్ కుమార్ సాయి వ్యూహాత్మక హంతకుడిగా ఛత్తీస్గఢ్ పోలీసులు పేర్కొన్నారు. ఆయనను రాయఘర్ కారాగారానికి తరలించారు. కల్పన దాస్ (32), ఆమె కుమార్తె ప్రభాతి దాస్ (14)లను పకడ్బందీ వ్యూహంతో ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆధారాలతో నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ మంజూరు చేసేందుకు రాయిఘర్ కోర్టు నిరాకరించింది. నిందితుడి ఆచూకీ గుర్తింపు, సాక్షాధారాల సేకరణ వగైరా అనుబంధ కార్యాచరణలో ఛత్తీస్గఢ్ పోలీసులు అహర్నిశలు శ్రమించినట్లు రాయిఘర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ సింగ్ విలేకరులకు వివరించారు. తొలి భర్తతో విడాకులు పొందిన కల్పన దాస్ నిందితుడు అనుప్ కుమార్ సాయితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. క్రమంగా వైవాహిక బంధంగా మలుచుకునేందుకు ఆమె విఫలయత్నం చేసింది. వివాహానికి అంగీకరించని నిందితుడు అనుప్ కుమార్ ఆమె అడ్డు తొలగించుకునేందుకు వ్యూహ రచన ప్రారంభించాడు. వ్యూహం ప్రకారం తన డ్రైవర్ బర్మన్ టొప్పొ సహకారంతో ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు హమీర్పూర్ అటవీ ప్రాంతంలో తల్లీకూతుళ్లను హతమార్చాడు. బలమైన ఇనుప కడ్డీతో తల్లీకూతుళ్లను చావగొట్టి హత్య చేశారు. అనంతరం కారుతో మృతదేహాల్ని తొక్కించి దుర్ఘటనగా చిత్రీకరించి మృతదేహాల్ని పాతిబెట్టినట్లు ఎస్పీ వివరించారు. 2016వ సంవత్సరం నుంచి నిందితుల ఆచూకీ కోసం ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 700 మందిని పోలీసులు ప్రశ్నించారు. మొదటి భర్త సునీల్ శ్రీవాస్తవ్తో విడాకులు తీసుకున్న కల్పనా దాస్, బీజేడీ నాయకుడు అనుప్ సాయితో కాపురం కొనసాగించారు. 2011వ సంవత్సరం నుంచి 2016వ సంవత్సరం వరకు భువనేశ్వర్లో మూడంతస్తుల భవనంలో కలిసి జీవించారు. క్రమంగా పెళ్లి చేసుకోవాలని కల్పన ఒత్తిడి తేవడంతో ఛత్తీస్గఢ్ ప్రాంతం దేవాలయంలో వివాహం చేసుకుంటానని అనుప్ కుమార్ నమ్మించి తల్లీబిడ్డలతో బయలుదేరి అటవీ ప్రాంతంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. చదవండి: క్షమాపణ కోరడం, కాళ్లు పట్టుకోవడం జరగదు: చిన్మయి డ్రైవర్ అరెస్టు మాజీ ఎంఎల్ఏ అనుప్ కుమార్ సాయి డ్రైవర్ బర్దన్ టొప్పొను పోలీసులు శనివారం రాత్రి ఆయన నివాసంలో అరెస్టు చేశారు. దాదాపు 18 గంటల నిరవధిక విచారణలో నిందిత మాజీ ఎంఎల్ఏ అనుప్ కుమార్ సాయి తన డ్రైవర్కు సంబంధించిన సమాచారం బహిరంగపరిచారు. ఈ సమాచారం ఆధారంగా డ్రైవర్ను అరెస్టు చేసినట్లు రాయఘర్ ఎస్పీ సంతోష్ సింగ్ తెలిపారు. కల్పన దాస్, ఆమె కుమార్తె ప్రభాతి దాస్ను హత్య చేయడంలో మాజీ ఎంఎల్ఏ అనుప్ కుమార్కు డ్రైవర్ బర్దన్ టొప్పొ పూర్తి సహకారం అందజేశాడని ఎస్పీ వివరించారు. -
వివాహేతర సంబంధం.. పాముకాటుతో..
జైపూర్ : రాజస్తాన్ లో దారుణం జరిగింది. ఒక మహిళ తన అత్తని పాము కాటుతో చంపిన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్తాన్లోని జున్ జున్ జిల్లాలోని ఒక గ్రామంలో గతేడాది జూన్2న జరుగగా... నిందితులను ఈనెల(జనవరి) 4న అరెస్ట్ చేశారు. వివరాలు.. రాజస్తానన్లోని జునుజ్జును జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సుబోధ్ దేవి కోడలు అల్పనాతో కలిసి నివాసం ఉంటుంది. అల్పనా భర్త, సచిన్ భారత సైన్యంలో పని చేస్తున్నారు. దీంతో ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నారు. సుబోధ్ దేవి భర్త రాజేష్ కూడా ఉద్యోగ రిత్యా కుటుంబానికి దూరంగా ఉన్నారు. కాగా, అల్పనాకు జైపూర్కు చెందిన మనీష్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారు పదే పదే ఫోన్లు మాట్లాడుకోవడం గమనించిన సుబోధ్ దేవి.. కోడలు అల్పనాను మందలించింది. అయితే తన వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందో అని భయపడినా అల్పనా.. అత్తను చంపాలని కుట్ర పన్నింది. ప్రియుడు మనీష్తో కలిసి ఎవరూ ఊహించని విధంగా అత్త సుబోధ్ దేవిని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. జూన్ 2, 2019 న వారు సుబోధ్ దేవిని పాము కాటుతో చంపారు. అయితే, ఆమె మరణించిన నెలన్నర తరువాత, అల్పానా అత్త తరుపు బంధువులకు ఆమెపై అనుమానం వచ్చింది. సుబోధ్ దేవిని అల్పనానే హత్య చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బలమైన సాక్ష్యాలను కూడా అందించారు. అల్పనా, మనీష్ మాట్లాడుతుకున్న ఫోన్ నంబర్లను కూడా పోలీసులకు ఇచ్చారు. హత్య జరిగిన రోజు రెండు నంబర్ల మధ్య 124 కాల్స్, అల్పనా, మనీష్ స్నేహితుడు కృష్ణ కుమార్ మధ్య 19 కాల్స్ వచ్చాయి. కొన్ని మెసేజ్లు కూడా ముగ్గురి మధ్య షేర్ అయ్యాయి. విచారణ చేపట్టిన పోలీసులు.. అల్పనా, మనీష్తో పాటు కృష్ణ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. -
వివాహేతర సంబంధం: గదిలో అఘాయిత్యం
-
ఆడ బిడ్డల ఆర్తనాదాలు
సాక్షి, హైదరాబాద్: నేరం..ఈ ఏడాది రాష్ట్రంపై పడగ విప్పింది. ప్రశాంత జీవనాన్ని తన ఉనికితో ఉలికిపాటుకి గురిచేస్తూ మానవత్వాన్ని మృగ్యం చేసింది. మానవ సంబంధాల విలువల్ని తుంచు తూ వికృత చేష్టలతో మనిషంటే ఓ భరోసా అన్న నమ్మకాన్ని సడలించింది. అవినీతి కేసులు, వివాహేతర సంబంధాలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, ఎన్కౌంటర్లు, హత్యలతో అన్ని రకాల నేరాలకూ రాష్ట్రం ఆలవాలమైంది. రాజధానిలో చోటుచేసుకు న్న కొన్ని నేరాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. వరుసగా వెలుగుచూసిన అత్యాచారాలు, హత్యలతో ఒక దశలో మహిళలు, చిన్నారుల రక్షణ సందేహం లో పడింది. ముఖ్యంగా ‘దిశ’కేసులో నిందితులు ఆమెను చంపిన తీరు..దేశవ్యాప్త ఉద్యమానికి దారి తీసింది. అదేరోజు వరంగల్లో మానస, అదేవారంలో ఆసిఫాబాద్లో ‘సమత’ అత్యాచారం అ నంతరం దారుణహత్యలకు గురయ్యారు. జూన్లో వరంగల్లో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి హత్య తో ప్రజలు కోపంతో రగిలిపోయారు. మరోవైపు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హా జీపూర్లో శ్రీనివాసరెడ్డి.. ముగ్గురు మైనర్లపై అ త్యాచారం జరిపి, తన వ్యవసాయబావిలో పూడ్చి న ఘటన కలకలం రేపింది. ఈ ఏడాది జరిగిన నేరాలన్నింటినీ సింహావలోకనం చేసుకుంటే... ► కోస్టల్బ్యాంక్ డైరెక్టర్, ఎన్ఆర్ఐ, ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం (55) జనవరి 31న హత్యకు గురయ్యారు. తెలంగాణలో హత్యచేసి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్లో వదిలివేశారు. తెలంగాణకు కేసు బదిలీఅయ్యాక ప్ర ధాన నిందితుడు రాకేశ్రెడ్డి, అతని అ నుచరులను అరెస్టు చేశారు. సహకరిం చిన ఇద్దరు పోలీసులపై వేటుపడింది. ► డేటా చౌర్యం కేసులో మాదాపూర్లోని ఐటీ గ్రీడ్ కార్యాలయాన్ని మార్చి 8న పోలీస్ లు సీజ్ చేశారు. ఈ కేసు తెలంగా ణ, ఏపీలో సంచలనం సృష్టిం చింది. రెండు తెలుగు రా ష్ట్రాల రాజకీయ పార్టీల తో ముడిపడి ఉన్న కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చే సింది. దర్యాప్తు కొనసాగుతోంది. ► యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో సైకో శ్రీనివాస్ రెడ్డి ముగ్గు రు బాలికలను అపహరించి అత్యాచారం చేసి న విషయం ఏప్రిల్ 26న వెలుగుచూసింది. ఊరికి రవాణా సదుపాయం లేకపోవడంతో లిఫ్ట్ ఇస్తానని చెప్పి, బాలికలను తన వ్యవసా య బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి అక్కడే మృతదేహాల్ని పాతిపెట్టాడు. ► టీవీ9 యాజమాన్య బదిలీ విషయంలో పలు అడ్డంకులు సృష్టించిన కేసులో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్పై మే 9న పోలీసులు కేసు లు నమోదు చేశారు. టీవీ9 చానల్ను ఏబీసీఎల్ నుంచి అలందా మీడియాకు బదిలీ కా కుండా నటుడు శివాజీతో ప లు నకిలీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్, శివాజీలపై కేసు నమోదైంది. ఈ కేసులో నిం దితులిద్దరూ పోలీసులకు చిక్కకుండా పరారవడం, అపుడప్పుడూ వీడియోలు విడుదల చేయడం సంచలనం రేపింది. ► హన్మకొండ కుమార్పల్లిలో తల్లిపక్కనే నిద్రపోతున్న 9 నెలల పసిపాపను ప్రవీణ్ అనే యువకుడు జూన్ 30న ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, చంపేశాడు. పోలీసులు ఫాస్ట్ట్రాక్ కోర్టు లో 48 రోజుల్లో నిందితుడి నేరం నిరూపిం చారు. అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆపై దాన్ని హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. ► కుమరంభీం జిల్లా సార్సాల అటవీ అధికారిణి అనితపై కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీటీ సీ సభ్యుడు కోనేరు కృష్ణారావు తన అనుచరులతో జూన్ 30న దాడి చేశారు. ► పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టు లు జూలై9న అపహరించి కాల్చిచంపారు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్తకొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ► జూలై 10న ఏసీబీ దాడుల్లో కేశంపేట తహసీల్దార్ వి.లావణ్య వద్ద ఏకంగా రూ.93 లక్షల నగదు 40 తులాల బంగారం లభించింది. ► ఎంసెట్ పేపర్ లీకేజీలో సీఐడీ పోలీసులు జూలై 16న చార్జిషీటు దాఖలు చేశారు. ► భద్రాద్రి జిల్లా గుండాలలో జూలై 31న ఎన్కౌంటర్లో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లింగన్న మరణించాడు. ► ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య,కుటుంబ సమస్యల కారణంగా కోడెల హైదరాబాద్లోని సొంతింట్లో ఆగస్టు 16వ తేదీన ఉరేసుకుని మరణించారు. ► ఈఎస్ఐలోని ఐఎంఎస్ కుంభకోణంలో 700 కోట్ల మేరకు అవతవకలు ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 29న మాజీ డైరెక్టర్ దేవికారా ణి, మాజీ జేడీ పద్మలను ఏసీబీ అరెస్టు చేసిం ది. ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు. ► హయత్నగర్లో..ప్రియుడు శశికుమార్ బ్లాక్మెయిలింగ్కు తలొగ్గిన కీర్తి అనే యువతి అక్టోబరు 28న తల్లి రజితను చంపి, శవాన్ని మాయం చేసిన ఘటన వెలుగుచూసింది. ► అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని భూవివాదంలో కూర సురేశ్ నవంబరు 4న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. విజయారెడ్డి అక్కడికక్కడే మరణించగా, నిందితుడు సురేశ్, డ్రైవర్ గురునాథం, అ టెండర్ చంద్రయ్య తరువాత మరణించారు. ► కాచిగూడలో హంద్రీనీవా– ఎంఎంటీఎస్ రైళ్లు కాచిగూడలో నవంబరు 11న ఎదురెదురుగా ఢీకొన్నాయి. 8 మంది గాయపడ్డారు. లోకోపైలెట్ చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మరణించాడు. ► ఆసిఫాబాద్ జిల్లాలో సమతపై ముగ్గురు టేకు చెక్కల స్మగ్లర్లు నవం బరు 24న లైంగికదాడి చేసి, కత్తితో గొంతుకోసి చంపారు. దీనిపై ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ► రాష్ట్రంలో ఒకేరోజు వెటర్నరీ వైద్యురాలు దిశ, వరంగల్లో డిగ్రీ విద్యార్థిని మానసలు నవం బరు 27 అపహరణకు గురై అత్యాచారం అనంతరం హత్యకు గురయ్యారు. ► దిశ కేసులో నిందితులు నలుగురు ఎన్కౌంటర్లో మరణించారు. డిసెంబరు 6న చటాన్పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నిందితు లు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీ న్, చింతకుంట చెన్నకేశవులు పోలీసులపై దాడి చేసి, తుపాకులు లాక్కున్నారు. పోలీ సుల ఎదురుకాల్పుల్లో నలుగురు హతమయ్యారు. దీనిపై సిట్ విచారణ నడుస్తోంది. -
ప్రేమ హత్యలే అధికం!
సాక్షి, అమరావతి: దేశంలో అధిక శాతం హత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 28% హత్యలు ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి. 2001-2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు మూడో అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలే. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధిక శాతం ప్రేమ వ్యవహారాలవే ఉన్నాయి. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో స్థానంలో ప్రేమ హత్యలున్నాయి. 2001లో దేశవ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదుకాగా, 2017లో 21% తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షతో చేసే హత్యలు 4.3% తగ్గగా, ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యలు 12% తగ్గాయి. 2016లో 71 పరువు హత్య కేసులు నమోదు కాగా, 2017లో 92 కేసులు నమోదయ్యాయి. -
పర స్త్రీ వ్యామోహంలో.. ప్రాణాలు కోల్పోయాడు
సాక్షి, మనుబోలు: భార్యాబిడ్డలను నిర్లక్ష్యం చేసి పర స్త్రీ వ్యామోహంలో పడిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం నెల్లూరు జిల్లా మండలంలోని పిడూరుమిట్టలో ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడి భార్య కథనం మేరకు.. మండలంలోని పిడూరుమిట్టకు చెందిన ఆలకుంట వీరరాఘవులు (25) జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య సుభాషిణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు ఏడాది క్రితం వీరరాఘవులు పని నిమిత్తం నెల్లూరుకు చెందిన వెంకటేశ్వర్లు ద్వారా తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం బట్టుపల్లి వద్ద ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనికి వెళ్లాడు. నెల రోజులు అక్కడ పని చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడూ తిరిగి అక్కడికి వెళ్లి వస్తుండే వాడు. ఈ క్రమంలో 3 నెలలుగా వీరరాఘవులు ఇంటికి రాకపోవడంతో భార్య సుభాషిని ఆరా తీసింది. వీరరాఘవులు బట్టుపల్లి గ్రామంలో కిరాణా కొట్టు నిర్వహిస్తున్న ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో సుమారు నెల క్రితం వీరరాఘవులు బట్టుపల్లికి చెందిన మహిళతో కలిసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో ఆమె భర్త గంగాధర్ వీరరాఘవులు భార్య సుభాషిణికి ఫోన్చేసి విషయాన్ని చెప్పి, తన భార్యను అప్పగించమని చెప్పు, లేదంటే నీ పిల్లలను ఎత్తుకెళ్లిపోతానని బెదిరించాడు. ఈ విషయం సుభాషిని ఫోన్ ద్వారా భర్త వీరరాఘవులుకు చెప్పింది. అదేం లేదు.. అతని భార్యను అతనికి అప్పగించేశానని చెప్పాడు. ఆ తర్వాత సుభాషిణి తన భర్తకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కలవలేదు. ఈ నెల 9వ తేదీ ఉదయం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒళ్లంతా దెబ్బలతో ఉన్న వీరరాఘవుల్ని పిడూరుమిట్టలోని సుభాషిని ఇంట్లో వదిలి వెళ్లారు. సుభాషిని భర్తను ఆరాగా తీయగా బట్టుపల్లికి చెందిన వివాహితను తీసుకుని నెల రోజుల క్రితం నెల్లూరుకు వచ్చానని, 15 రోజులు ఉండి, ఆమె తన భర్త వద్దకు వెళ్లిపోయిందని వీరరాఘవులు తెలిపాడు. ఆమె సెల్ఫోన్, కొద్దిగా బంగారం తన వద్ద ఉండిపోవడంతో వాటిని ఇస్తానని ఫోన్లో చెప్పగా బట్టుపల్లికి తీసుకుని రమ్మందని తెలిపిందని తెలిపాడు. తాను ఫోన్, బంగారం ఇచ్చేందుకు ఈ నెల 7వ తేదీన బట్టుపల్లికి వెళ్లగా ఊరి బయట ఆమెను కలవగా ఇంతలో ఆమె భర్త గంగాధర్ వచ్చి ఇద్దరూ కలిసి కర్రలతో తీవ్రంగా కొట్టారని తెలిపాడు. తీవ్రంగా గాయపడిన భర్తను సుభాషిణి చికిత్స నిమిత్తం మొదట గూడూరు, నెల్లూరు ఆస్పత్రుల్లో వైద్యం చేయించి, మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నై ప్రభుత్వాస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వీరరాఘవులు మృతి చెందాడు. దీంతో తన భర్త మరణానికి కారణమైన బట్టుపల్లికి చెందిన గంగాధర్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని ఆదివారం మనుబోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధి కాదని, మహబూబ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు
హైదరాబాద్ : కట్టు కున్న భార్యే ప్రియుడి తో కలసి భర్త హత్యలో భాగమైన సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చోటుచేసుకుంది. రూరల్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఇస్మాయిల్ కు హైదరాబాద్ లోని కిషన్ బాగ్ కు చెందిన అనిస్ భేగం తో ఏడాది క్రితం వివాహం జరిగింది. కాగా అనిస్.. కిషన్ బాగ్ కు చెందిన సయ్యుద్ జహీర్ తో వివాహం కంటే ముందు నుండి అక్రమ సంబంధం కొనసాగించిందని సీఐ తెలిపారు. ఇస్మాయిల్ హత్య చేయడానికి నెల రోజుల నుంచే అతని మిత్రుడి తో కలసి రెక్కీ నిర్వహించారని అందులో భాగంగానే ఈనెల 16న మద్యం తాగించి క్రికెట్ బ్యాట్ తో తలపై కొట్టి చంపారని ఆయన తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా హంతకులను పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. హత్య జరిగిన వారం రోజులలోనే హంతకులను పట్టుకోవడంతో ఏసీపీ సురేందర్ సిబ్బందిని అభినదించారు. హంతకులు వాడిన బ్యాట్తో పాటు రెండు సెల్ ఫోన్లు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. -
‘ఛీ.. రజాక్ ఇలాంటోడా?’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ మరొకసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పటికే టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ మతాన్ని ప్రస్తావించి విమర్శలపాలైన రజాక్.. తాజాగా పాక్ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు, ముఖ్యంగా మహిళలు మండిపడుతున్నారు. ఇంటర్వ్యూలో రజాక్ మాట్లాడుతూ.. ‘నేను సంప్రాదయబద్దంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సుమారు ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలను పెట్టుకున్నాను. అది కూడా ఏడాదిన్నర కాలంలోనే ఇదంతా జరిగింది. నాకు ఇది తప్పనిపించడం లేదు’ అని పేర్కొన్నాడు. ఇక అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెను దుమారమే రేగుతోంది. రజాక్పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘గొప్ప ఆటగాడివనే గౌరవం ఉండేది.. ఈ రోజుతో అది పోయింది’, ‘ఛీ.. రజాక్ ఇలాంటోడా?’అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాను తనకు రెండు వారాలు అప్పగిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్గా తీర్చిదిద్దుతానని, షమీ ముస్లిం కాబట్టే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని రజాక్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఆడే రోజుల్లో వివాదాల జోలికి వెళ్లకుండా మిస్టర్ పర్ఫెక్ట్గా పేరుతెచ్చుకున్న రజాక్ గత కొద్ది రోజులగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. -
వివాహేతర సంబంధం: మహిళపై మరో మహిళ దాడి
సిరిసిల్ల : తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో ఓ మహిళను మరో మహిళ చితకబాదింది. ఈ సంఘటన సిరిసిల్లా జిల్లాలోని రుద్రంగిలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దరావతు రాజుకు అదే ప్రాంతానికి చెందిన పుర్భన్ వివాహమైంది. అయితే కొంతకాలం కిందట కలికోట గ్రామానికి చెందిన మరో మహిళతో రాజుకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలియడంతో తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయవ్వపై పుర్బన్ ఆమె కుమారుడు దాడికి దిగారు. కిందపడేశి కొట్టి, నడిరోడ్డుపై మెడకు తాడుతో ఉరి వేసే ప్రయత్నం చేశారు. స్థానికులు అడ్డుకుని వారిని పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడ్డ కలికోటకు చెందిన సాయవ్వను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వివాహేతర సంబంధం : మహిళపై మరో మహిళ దాడి
-
ఒక భర్త సరిపోడా.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్ : పెళ్లి అయిన తర్వాత వేరే అబ్బాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అమ్మాయిలను చూసి సిగ్గుపడుతున్నా అంటూ ఓ తెలుగమ్మాయి ఫేస్ బుక్లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. యువతి వీడియోలో ఏం చెప్పిందంటే.. 'పెళ్లి అయి భర్త ఉన్నా, వేరే అబ్బాయిలతో సంబంధం పెట్టుకుని భర్తను చంపుతున్న ఆడవాళ్లను ఇటీవలి కాలంలో మనం చాలా చూస్తున్నాం. నాకొచ్చిన కొన్ని ఆలోచనలు మీకు చెబుతున్నా, నా మాట తీరు బాగాలేక పోతే క్షమించండి. పెళ్లి కాని వాళ్లు ఇలా మాట్లాడాలో లేదో కూడా తెలియదు. కాని పరిస్థితులు డిమాండ్ చేయడంతో మాట్లాడుతున్నా, తప్పదు ఎవరో ఒకరు ఇలా మాట్లాడాలి. లేకపోతే మిగతా ఆడవాళ్లకు కూడా చెడ్డ పేరు వస్తోంది. పెళ్లి అయిపోయి పక్కదారి పడుతున్న ఆడవాళ్లు భర్త ఉండగా మరో అబ్బాయితో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. నాకొచ్చిన డౌటే అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా' అని వివాహేతర సంబంధం పెట్టుకున్నవారిపై నిప్పులు చెరిగారు. ఒక భర్త సరిపోడా.. ఎంత మంది కావాలి.. భర్తలను మోసం చేస్తున్న ఆడవాళ్లను మాత్రమే అడుగుతున్నా. మీకు ఒక భర్త సరిపోడా. ఎంత మంది కావాలి. గత మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో 10 మంది భర్తలను చంపేశారు. జీవితాంతం కలిసి ఉంటానని ప్రామిస్ చేసిన భర్తని బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపేస్తున్నారు. మీలాంటి ఆడవాళ్ల వల్ల మిగతా ఆడవాళ్లకు చెడ్డ పేరు వస్తోంది. ఎవరో బయట వ్యక్తితో సంబంధం పెట్టుకుని భర్తను చంపేయాలనే ఆలోచన వచ్చినప్పుడు కొద్దిసేపు ఆలోచించండి. మీరు చేసేది తప్పా, ఒప్పా అని. ఎవరి కోసమో భర్తను చంపి. ప్రేమించిన వాడితో వెళ్లిపోవాలని ఆలోచనకు వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. భర్తను చంపి ప్రేమించినవాడితోనైనా సంతోషంగా ఉంటారా. భర్తను చంపితే జైలుకు వెళతారు. మీ ఫ్యామిలీకి, నీకు చెడ్డపేరు వస్తుంది. పాడు పని చేసినందుకు తల ఎత్తుకు తిరుగగలవా? మన దేశంలో ఆడవాళ్లకు ఎంతో విలువుంది. ఆ విలువ మీలాంటి వారి వల్ల పోతోంది. భర్తను మోసం చేయడం తప్పుకాదా.. మీ కోరికలను తీర్చుకోవడం కోసం. ఇలాంటి పని చేస్తారా. ప్రేమించిన వాడి కోసం భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని బయటకు వెళ్లి చచ్చిపోయిన వాళ్లను చాలామందిని చూశా. మీ భర్తను చంపేస్తున్నావు. నువ్వు జైలుకెళ్లి కూర్చుంటున్నావు. మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాన్నను ఎందుకు చంపేశావు అమ్మ అని అడిగితే పిల్లలకు ఏం సమాధానం చెబుతారు. ఈ రోజుల్లో తల్లి అనే పదానికి అర్థం లేకుండా పోతోంది మీలాంటి వారి వల్ల. ఇటీవల ప్రేమికుడితో అసభ్యంగా ఉన్న వీడియోలను భర్తకు పంపించి, ఆయన మరణానికి కారణం అయింది ఓ యువతి. భర్త ఇష్టం లేకపోతే ఎటైనా వెళ్లిపోండి. శరీర సుఖాల కోసం ఎదుటి వారితో ఆడుకోవద్దు. పెళ్లి అయిన అబ్బాయిలు కూడా భార్యల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు. కానీ, ఎదుటి వారి జీవితాలతో ఆడుకునేలా ఉండొద్దు. అబ్బాయిలకి కూడా నాదో ప్రశ్న.. పెళ్లి అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అబ్బాయిలకి కూడా నాదో ప్రశ్న. పెళ్లి చేసుకొని భర్తనే చంపిన ఆమె, నీకంటే మంచోడు దొరికితే నిన్ను కూడా చంపేయదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి ఎంత ఆలోచించినా ప్రయేజనం లేదు. ఇకముందు అలాంటి సంఘటనలు జరగకుండా చూద్దాం అంటూ వీడియోలో ఆ యువతి మాట్లాడారు. సంబంధిత వార్త : ప్రియుడితో భార్య పెళ్లి, భర్త ఆత్మహత్య.. వీడియో వైరల్ -
వివాహేతర సంబంధాలపై యువతి ఆగ్రహం
-
అక్రమ సంబంధానికి అడ్డొస్తోందని హత్య
-
అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి
► హత్యచేశారంటున్న మృతురాలి తల్లిదండ్రులు ► కేసు నమోదు చేసిన పోలీసులు ► వివాహేతర సంబంధమే కారణమా? ఎచ్చెర్ల క్యాంపస్: కుశాలపురం పంచాయతీ నవభారత్కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని పైడి హారతి(15) ఉరిపోసుకొని మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రులు శ్రీరామూర్తి, లక్ష్మి మాత్రం తమ కుమార్తె హత్యకు గురైందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎచ్చెర్ల పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పొందూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన పైడి శ్రీరాంమూర్తి నవభారత్లో సొంతంగా ఇల్లు నిర్మించుకొని గత 20 ఏళ్లగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న పరిశ్రమలో ఈయన పనిచేస్తుండగా, ఇతని భార్య స్థానికంగా ఉన్న హోటల్లో పనిచేస్తుంది. వీరికి హారతి అనే కుమార్తె, ఆరువ తరగతి చదువుతున్న కుమారుడు భరత్ ఉన్నారు. శ్రీకాకుళంలోని వరం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హారతి తొమ్మిదవ తరగతి చదువుతుంది. మంగళవారం మధ్యాహ్నం గణితం వార్షిక పరీక్ష సైతం రాయవల్సి ఉంది. ఈలోగా ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శ్రీరాంమూర్తి ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న కోరాడ గోవిందరావు అనే వివాహితుడు టాటా ఏస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు హారతితో గత ఏడాది నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు ప్రచారం ఉంది. విజయనగరానికి చెందిన 35 ఏళ్లు ఉన్న గోవిందరావు గత కొన్నేళ్ల నుంచి ఈ ప్రాంతంలో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదవ తరగతి విద్యార్థినితో అక్రమ సంబంధం కొనసాగించటంతో తరచూ శ్రీరాంమూర్తి, గోవిందరావు కుటుంబాల మధ్య వివాదాలు జరిగేవి. గోవిందరావు అతని భార్య జ్యోతి సైతం తరచూ ఈ విషయంపై గొడవులు పడేవారు. భార్యకు విడాకులు ఇచ్చి మైనర్ బాలిక హారతిని వివాహం చేసుకునేందుకు గోవిందరావు సిద్ధపడ్డాడన్న ఆరోపణలు స్థానికంగా ఉన్నాయి. అయితే హారతి మంగళవారం మధ్యాహ్నం 9వ తరగతి గణితం పరీక్ష రాయవల్సి ఉంది. పరీక్షకు వెళతానని తల్లిదండ్రులకు ఉదయం చెప్పింది. తల్లిద్రండులు పనికి వెళ్లిపోయిన తర్వాత వరండాలో శ్లాబు హుక్కు ఉరిపోసుకొంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు వేలాడివున్న హారతిని కిందకు దించారు. అప్పటికే మృతి చెంది ఉంది. గోవిందరావు లేదా ఆయన భార్య హత్య చేసి ఉరిపోసుకున్నట్టు వేలాడదీసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ నిర్థారణ విభాగం, జేఆర్ పురం సీఐ రామకృష్ణ, ఎచ్చెర్ల ఎస్సై సందీప్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీరాంమూర్తి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోరాడ గోవిందరావును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మృతిపై స్పష్టత వస్తుందని ఎస్ఐ సందీప్కుమార్ చెప్పారు. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
హత్య చేసి బెడ్రూమ్లో పూడ్చి..
♦ పాతబస్తీలో ఎన్ఆర్ఐ యువకుడి దారుణ హత్య ♦ వివాహేతర సంబంధాలే కారణమని అనుమానాలు ♦ హతుడి స్నేహితుడి సమాచారంతో వెలుగులోకి.. ♦ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్ హైదరాబాద్: వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఓ ఎన్ఆర్ఐ దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు నిర్మాణంలో ఉన్న ఇంటి పడకగదిలో మృతదేహాన్ని పాతిపెట్టారు. హతుడి స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని వెలికితీసిన ఫలక్నుమా పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. గురువారం ఉదయం హత్య వెలుగులోకి రాగా.. రాత్రికి పోలీసులు కేసు ఛేదించారు. దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ కథనం ప్రకారం.. విచ్చలవిడిగా వివాహేతర సంబంధాలు... ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇమ్రాన్(35) అబుదాబిలోని నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఆబుదాబిలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇతని పెద్దమ్మ కుటుంబం చాంద్రాయణగుట్టలో ఉంటోంది. ఇమ్రాన్ అబుదాబి నుంచి వచ్చినప్పుడల్లా బహుమతులు.. విందులతో పెద్దమ్మ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో పెద్దమ్మ కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఖతర్లో ఆర్మీ ఉద్యోగిగా ఉన్న పెద్దమ్మ కుమారుడు సయీద్ బిన్ సాబెత్ బారాబూద్ భార్య ఫాతిమాతోనూ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని సయీద్ సోదరుడు సైఫ్(22) గమనించి.. విషయాన్ని సోదరుడికి తెలిపాడు. అవివాహిత అయిన సయీద్ సోదరినీ ఇమ్రాన్ వేధించడం మొదలుపెట్టడంతో ఇమ్రాన్ను మట్టుబెట్టాలని సయీద్, సైఫ్ నిర్ణయించుకున్నారు. సయీద్ భార్యతో ఫోన్ చేయించి.. ఇమ్రాన్ అబుదాబి నుంచి వచ్చిన విషయం సయీద్, సైఫ్ తెలుసుకున్నారు. హత్య పథకాన్ని అమలు చేయడానికి బండ్లగూడ ఫారూఖ్నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 4న సాయంత్రం ఇమ్రాన్కు ఫాతిమాతో ఫోన్ చేయించి పిలిపించారు. ఫలక్నుమా రైతుబజార్కు వచ్చిన ఇమ్రాన్ ఫాతిమాతో కలసి ఫారూఖ్నగర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కాపుకాసిన సయీద్, సైఫ్ కారం కలిపిన నీళ్ళను ఇమ్రాన్పై పోసి.. కత్తులతో గొంతు కోసి హతమార్చారు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఆధారాలు లేకుండా శుభ్రం చేశారు. స్నేహితుడి సాయంతో తరలించి.. మరుసటి రోజు శవాన్ని వేరే ప్రాంతానికి తరలించి మాయం చేయాలని భావించి.. స్నేహితుడు హాశంఅలీ(25) సాయం తీసుకున్నారు. రాత్రి టాటా సుమోలో శవాన్ని తీసుకుని చాంద్రాయణగుట్టలో నిర్మాణంలో ఉన్న సయీద్, సైఫ్ ఇంటికి తీసుకువచ్చారు. దీని పడకగదిలో గొయ్యి తీసి అందులో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. తర్వాత సయీద్ దుబాయికి వెళ్లిపోయాడు. హతుడి స్నేహితుడి సమాచారంతో.. ఫాతిమా ఫోన్ చేసినప్పుడు ఇమ్రాన్ స్నేహితుడు సర్వర్తో కలసి ఉన్నాడు. సర్వర్తో కలిసే రైతుబజార్కు వెళ్ళాడు. అక్కడ నుంచి సర్వర్ను పంపేసిన ఇమ్రాన్ ఫాతిమాతో వెళ్లిపోయాడు. ఇమ్రాన్ ఇంటికి రాకపోవడంతో అతడి తల్లి అఫ్షా.. సర్వర్ను ప్రశ్నించింది. ఫాతిమా విషయం చెప్పడంతో అఫ్షా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా.. ఫలక్నుమా రైతుబజార్ వద్ద సీసీ కెమెరాల ఫీడ్ను పరిశీలించిన పోలీసులు.. ఇమ్రాన్ ఓ మహిళతో కలసి వెళ్తున్నట్లు గుర్తించి లోతుగా దర్యాప్తు చేశారు. సాంకే తిక ఆధారాలు, ఇతర అంశాలను బట్టి గురువారం ఉదయానికి ఇమ్రాన్ హత్యకు గురైనట్లు నిర్ధారించుకున్నారు. దీంతో సాయంత్రానికి సైఫ్, హాషంలను అరెస్టు చేశారు. వీరి నుంచి హత్యకు వినియోగిం చిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఫాతిమా కోసం ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. దుబాయ్ పారిపోయిన నిందితుడు సయీద్ కోసం పోలీసులు ఎల్వోసీ జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. -
తులగాంలో హత్య
వివాహేతర సంబంధమే కారణం! పోలీసుల అదుపులో నిందితుడు శ్రీకాకుళం జిల్లా : తులగాం గ్రామంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యూడు. దీనికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పాలకొండ డీఎస్పీ ఆదినారాయణ, పాతపట్నం సీఐ బీఎస్ఎస్ ప్రకాష్, స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరరావు మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శ్రీకాకుళం క్లూస్టీం సీఐ డి.కోటేశ్వరరావు హత్య జరిగిన ప్రదేశంలో నమోనాలు సేకరించారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ తెలిపిన వివరాలు.. తులగాం గ్రామానికి చెందిన కమడాన లక్ష్మీనారాయణ అదే గ్రామానికి చెందిన మెడతాల సంజీవరావును(36) హత్య చేశాడు. సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో పొలం పని చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్న సంజీవరావును పథకం ప్రకారం లక్ష్మీనారాయణ మాటు వేసి వెనుక నుంచి కర్రతో బలంగా కొట్టాడు. దీంతో సంజీవరావు పడిపోవడంతో కొంత దూరం ఈడ్చుకొని వెళ్లి తలపై కత్తితో కొట్టి హత్య చేశాడు. తన భార్యతో సంజీరావు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నందునే హత్య చేసినట్టు లక్ష్మీనారాయణ అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. అరుుతే లక్ష్మీనారాయణకు ఇంకెవరైనా సహకరించారా? అన్న కోణంలో విచారణ చేపడుతున్నామని చెప్పారు. మృతుని భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రైనీ ఎస్ఐ వై.సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య విజయలక్ష్మి, కుమార్తె భవాని, కుమారుడు మణికంఠ ఉన్నారు. -
మేనమామను హత్య చేసిన మేనల్లుడు
కత్తులతో దాడిచేసి హత్య మృతుని తల్లి బంధువులే సహకరించారని భార్య ఫిర్యాదు గుంటూరు రూరల్ : ఆస్తి వివాదం, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో మేనల్లుడు మేనమామను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన నగరంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సంఘటనా స్థలిలో మృతుని భార్య గుంజి ఆదిలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం శివనాగరాజు కాలనీ సెల్ టవర్ ప్రాంతానికి చెందిన గుంజి రాంబాబు(35) ఆటో తోలుకుని జీవిస్తుంటాడు. అతనికి భార్య ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల రోజులుగా రాంబాబుకు అతని తల్లికి, అక్కకు, ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం జరుగుతోంది. దీంతో ప్రతి రోజు ఇంటికి వచ్చి వాళ్లు ఆతనితో వాదులాడుతుండేవారు. ఈ నేపథ్యంలో ఓ చోరీ కేసులో అరెస్టయిన రాంబాబు మేనల్లుడు తమ్మిశెట్టి శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితం బెయిల్పై ఇంటికి వచ్చాడు. శ్రీనివాస్, రాంబాబు తల్లి, అక్క, మరో మహిళతో కలిసి మంగళవారం రాత్రి తమ ఇంటికి వచ్చి తన భర్త రాంబాబుతో వాదులాడుతుండగా శ్రీనివాస్ ఓ భారీ కత్తిని తీసుకుని రాంబాబును పొడిచేందుకు సిద్ధమయ్యాడని, తాను రెండుసార్లు అడ్డగించానని ఆదిలక్ష్మి తెలిపింది. దీంతో తనను నెట్టి తన భర్త రాంబాబును రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి, రాంబాబు తల్లి, మరోమహిళ తన భర్త చేతులు వెనుకకు విరిచి పట్టుకోగా శ్రీనివాస్ కత్తితో ఛాతీ, పొట్ట భాగాల్లో విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యాడని ఆదిలక్ష్మి చెప్పింది. తీవ్రగాయాలైన తన భర్త అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడని వాపోయింది. విషయం తెలిసి ఏఎస్పీ వెంకటప్పలనాయుడు,అరండల్పేట సీఐ శివప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి చేరుకున్నారు. హత్యజరిగిన తీరును స్థానికులను, మృతుని భార్యను అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..
- భార్యను హతమార్చిన భర్త - భర్తపై కేసు నమోదు - పోలీసుల అదుపులో నిందితుడు కామేపల్లి : వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యను గొడ్డలితో కొట్టి చంపిన సంఘటన మండల పరిధిలోని పాతలింగాల గ్రామంలో బుధవారం జరిగింది. కామేపల్లి ఎస్సై ఇ.శ్రీనివాస్ కథనం ప్రకారం... ములకలపల్లి మండలం రాజుపేటకు చెందిన జగన్నాథ కృష్ణవేణి(33)కి పాతలింగాల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ జగన్నాథ వెంకన్నతో గత 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొంతకాలంగా వెంకన్న తాగుడుకు బానిసై, మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే భార్య కృష్ణవేణి భర్త వెంకన్నను తమ పద్ధతులను మార్చుకోవాలని ప్రాధేయపడింది. అయినా వెంకన్న తీరు మాత్రం మారలేదు. ఎలాగైనా భార్యను అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నాడు. దీంతో ఉదయమే మద్యం మత్తులో ఉన్న వెంకన్న భార్య కృష్ణవేణిని ఇంట్లో ఉన్న గొడ్డలితో తలపై బలంగా కొట్టాడు. దీంతో కృష్ణవేణి అక్కడికక్కడే మృతిచెందింది. పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై నిందితుడిని అదుపుతోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా సీఐ డి.రమేష్ కూడా కృష్ణవేణి హత్యకు గల కారణాలను గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
పాపం నందిని
చిన్నారిని హత్య చేసిన కర్కోటకుడు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల చిన్నారిని అంతమొందించాడో కర్కోటకుడు. హత్య చేసి హౌస్లో పడేశాడు. పాప హౌస్లో పడి చనిపోరుుందని తల్లిని నమ్మించాడు. పోలీసులు తమదైన శైలిలో విచా రించగా.. హత్యచేసి వాగులో పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. ఈ ఘటనతో చిట్యాల మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది. - నాలుగేళ్ల చిన్నారిని హత్య చేసిన కర్కోటకుడు - అంకుషాపూర్లో విషాదం చిట్యాల: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల చిన్నారిని అంతమొందించాడో కర్కోటకుడు. హృదయూలను కలిచివేసిన ఈ ఘటన చిట్యాల మండలంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్, ఎస్సై వెంకట్రావు కథనం.. మండలంలోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన జీడి పైడయ్యకు ఇదే మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన రాధతో ఇరువై ఏళ్ల క్రితం వివాహామైంది. ఆలస్యంగా కాన్పు కాగ నందిని (4) జన్మించింది. ఈ క్రమంలో కాలనీకి చెందిన వరుసకు మరిది అయిన జీడి రవి వదిన రాధతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నెల రోజుల క్రితం రాధ, ఆమె కుమార్తె నందినిని తీసుకెళ్లి కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజ్పల్లిలో ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఇద్దరు కూలీపనికి వెళ్తూ బతుకుతున్నారు. గత నెల 19న రాధ పొలం పనికి వెళ్లగా రవి ఇంటివద్దే ఉన్నాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఇంట్లో ఉన్న నందినిని హత్య చేసి ఇంట్లోని నీటిహౌస్లో పడేశాడు. పాప హౌస్లోపడి చనిపొయిందని తల్లి రాధను నమ్మించాడు. అదే రాత్రి పక్కనే గల మల్యాల చలివాగులో పాపను పూడ్చిపెట్టాడు. అయితే గత నెల 27న అంతకుముందే తన భార్య రాధ, కుమార్తె నందిని అదృశ్యమయ్యూరని, కాలనీకి చెందిన జీడి రవిపై అనుమానం ఉందని పైడయ్య ఫిర్యాదు చేశాడు. విచారణ కోసం రంగలంలోకి దిగిన పోలీసులు మంగళవారం కమలాపూర్లోని రవి, రాధలను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలీలో విచారించగా నందినిని హత్యచేసి వాగులో పూడ్చిపెట్టినట్లు రవి ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు వాగువద్దకు వెళ్లి నందిని మృతదేహాన్ని వెలికితీశారు. జమ్మికుంట తహశీల్దార్ రజిని, ఆర్ఐ సందీప్ల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టంనకు తరలించారు. నిందితులు రవి, రాధలపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్, ఎస్సై వెంకట్రావు వివరించారు. చిన్నారిని హత్య చేసిన ఘటన మండలంలో సంచలనం సృష్టించింది. -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
నా వయస్సు 29 ఏళ్లు. నేను మూడేళ్ల క్రితం ఓ మహిళతో శారీరకంగా కలిశాను. ఆమెకు హెచ్ఐవీ ఉందేమోననే అనుమానంతో ఆమెకు హెచ్ఐవీ పరీక్ష చేయించాను. వెస్ట్రన్బ్లాట్ పరీక్ష కూడా చేయించాను. అన్ని రిపోర్టులూ నెగెటివ్ వచ్చాయి. ఆ మహిళకూ, నా భార్యకు కూడా పరీక్షలు చేయించాను. ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. అయితే విండో పిరియడ్ అని ఒకటి ఉంటుందని, ఆ సమయంలో వ్యాధి ఉన్నా బయటపడదని స్నేహితులు అంటున్నారు. ఈ విండో పిరియడ్ అంటే ఏమిటి? ఎన్నాళ్లుంటుంది? వివరించండి. - పి.వి.ఆర్., రాజమండ్రి వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు హెచ్ఐవీ వస్తుం దేమో అని భయం ఉంటుంది. దానికి ప్రధాన కారణం... కండోమ్ లేకుండా సెక్స్లో పాల్గొనడం. కండోమ్ వాడితే ఈ సమస్యను చాలా సులువుగా ఎదుర్కోవచ్చు. కండోమ్ వాడకుండా సెక్స్లో పాల్గొంటే హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఆ వైరస్ల విండో పిరియడ్ కొన్ని వారాల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. ఇక విండో పీరియడ్ అంటే ఏమిటనే విషయానికి వస్తే - ఏదైనా వైరస్ను వాటి యాంటీబాడీస్ ద్వారా గుర్తిస్తాం. ఓ వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటి యాంటీబాడీస్ ఉత్పత్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ వ్యవధినే విండో పీరియడ్ అంటాం. ఈ విండో పీరియడ్లో యాంటీబాడీస్ ఉండవు. అయితే శరీరంలో వైరస్ మాత్రం ఉంటుంది. అలాంటప్పుడు ఆ వైరస్ ఉన్నవాళ్లతో సెక్స్లో పాల్గొంటే (యాంటీబాడీస్ పరీక్షలో హెచ్ఐవీ టెస్ట్ నెగెటివ్ అని వచ్చినా) ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ఆర్నెల్ల తర్వాత ఇద్దరికీ హెచ్ఐవీ పరీక్షలో నెగెటివ్ వస్తే దాదాపు వ్యాధి లేనట్లే అనుకోవచ్చు. ఇక కండోమ్ కంటే కూడా ఎలాంటి వివాహేతర సంబంధాలు లేకపోవడమే ముఖ్యం. అదే అన్నిటికంటే సురక్షితం. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్ -
వివాహేతర సంబంధాలతోనే వివాదాలు
సంతకవిటి : వివాహేతర సంబంధాల కారణంగానే గ్రామాల్లో గొడవలు ఏర్పడి క్రైం రేటు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ అభిప్రాయపడ్డారు. శనివారం సంతకవిటి పోలీస్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. తొలుత పోలీస్ క్వార్టర్స్లోకి వెళ్లి వర్షాలకు కారుతున్న గదులను పరిశీలించారు. 2003లో నిర్మాణం జరిగి ఉండడంతో మరో నాలుగేళ్ల వరకూ మరమ్మతులకు అవకాశం లేదన్నారు. అనంతరం పోలీస్స్టేషన్లోని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వివాహేతర సంబంధాల నేపథ్యంలో తలెత్తే వివాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివాహేతర సంబంధాల కారణంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు రావడమే కాకుండా, పిల్లల భవిష్యత్ నాశనం అవుతోందని..ఈ విషయూన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. ఇచ్ఛాపురం నుంచి విజయనగరం సరిహద్దు వరకూ హైవేలో నాలుగు పెట్రోలింగ్ బృందాలు తిరుగుతూ డ్రంక్ కమ్ డ్రైవ్ చేసేవారిని గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అలాగే పోలీసు విభాగంలో హైవేలో రెండు అంబులెన్స్లు నడుపుతున్నామన్నారు. జిల్లాలో శాంతి భద్రతులు అదుపులో ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. దోపిడీలు కూడా తగ్గాయన్నారు. ఇటీవల రెండు చోట్ల భారీ చోరీలు జరిగాయని, వాటికి పాల్పడిన నిందితుల ఆచూకీ కొలిక్కివచ్చిందన్నారు. జిల్లాలో 30 మంది కానిస్టేబుళ్ల కొరత ఉందన్నారు. పుల్లిట, తాలాడ గ్రామాల్లో మాజీ నేరస్తుల కుటుంబాలపై దృష్టిసారించి వారిలో మార్పునకు ప్రయత్నిస్తున్నామని, వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఎస్ఐ పి.సురేష్బాబు ఉన్నారు. -
పోలీస్శాఖకే ఒక మచ్చ
వివాహేతర సంబంధాలు ఎంతటి ఘాతుకానికి దారితీస్తాయో చిదంబరం అన్నామలైనగర్ పోలీస్స్టేషన్లో ఎస్గా పనిచేస్తున్న గణేష్ (31) హత్యోదంతం కలకలం రేపింది. ఇది అసెంబ్లీలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పోలీస్శాఖకే ఒక మచ్చగా మారడంతో ఎస్ఐ అంత్యక్రియలకు అధికారులు గైర్హాజరయ్యారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: పోలీస్శాఖలో చేరాలన్న తన కలను నెరవేర్చుకున్న గణేష్, ఎస్ఐ హోదాను నిం డా నాలుగేళ్లు కూడా అనుభవించకముందే హత్యకు గురయ్యూడు. నాలుగేళ్లలోనే ఉద్యోగం, పెళ్లి, చావు వెంటవెంటనే అన్నీ తరుముకు వచ్చాయి. చిదంబరం సమీపం సీ ముట్టలూరుకు చెందిన వనిత (నిందితురాలు), తయ్యాపురానికి చెందిన బేల్దారీ మేస్త్రీ కలైమణి ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి శబరి (7) అనే కుమారుడున్నాడు. మినీ బస్సులో కొడుకును స్కూలుకు వదిలి వచ్చే క్రమంలో బస్సు డ్రైవర్, కండక్టర్తో సహా మరికొంతమందితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముస్లిం యువతి వలె నల్లని ముసుగు ధరించి ఒక యువకునితో వెళుతుండగా ముస్లిం మహిళలు పట్టుకుని పోలీస్స్టేషన్లో అప్పగించారు. ఈ క్రమంలోనే 2011లో కిళ్లై పోలీస్స్టేషన్ ఎస్ఐగా ఉన్న గణేష్ వనిత అందాలకు దాసుడయ్యూడు. ఈ వ్యవహారం బయటపడితే కుటుంబ పరువు పోతుందని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. మెడికల్ సెలవు పెట్టిన ఎస్ఐ, వనితతో కలిసి అనేక విహార యాత్రలు చేశారు. ఖరీదైన కొత్త దుస్తులు కొనిచ్చారు. అంతేగాక తన ఎస్ఐ యూనిఫారాన్ని సైతం వనితకు తొడిగి ఆనందించారు. ఉల్లాసంగా గడుపుతున్న సమయాన్ని ఒకరికి తెలియకుండా ఒకరు సెల్ఫోన్లో చిత్రీకరించుకున్నారు. బ్రహ్మచారిగా అపార్టుమెంటులో ఒంటరిగా నివసిస్తున్న గణేష్, వనిత వ్యామోహంలో పూర్తిగా పడిపోయాడు. వీరిద్దరి వ్యవహారం వనిత భర్తకు తెలియడంతో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. భర్తకు విడాకులచ్చి వస్తే పెళ్లి చేసుకుంటానని వనితకు వాగ్దానం చేశాడు. ఒక ఎస్ఐ తనకు భర్త కాబోతున్నాడన్న ఆనందంలో నాలుగు నెలల క్రితం విడాకులు మంజూరు చేయించుకుని ఆమె గణేష్ పంచన చేరిపోయింది. మెడికల్ లీవు ముగించుకుని గత నెల 18న గణేష్ తిరిగి విధుల్లో చేరారు. పెద్ద కట్నంపై ఆశతో వళుదరెట్టైకి చెందిన సత్యను పెద్దల సమక్షంలో ఈనెల 9న పెళ్లి చేసుకున్నారు. గణేష్ మాటలను నమ్మి భర్తకు విడాకులిచ్చిన వనిత తాను దారుణంగా మోసపోయానని గుర్తించి కక్షపెంచుకుంది. ఆడి(ఆషాడ)మాసం కారణంగా ఎస్ఐ భార్య సత్య పుట్టింటికి వెళ్లి ఉండగా ఈనెల 22న వనిత గణేష్ అపార్టుమెంటుకు చేరుకుని మద్యం తాగించింది. తనకు దక్కని గణేష్ మరెవ్వరికీ దక్కరాదని తలచి మద్యం మత్తులో పడివున్న గణేష్ను వేటకొడవలితో గొంతుకోసి హతమార్చింది. గణేష్ను నేనే చంపేశాను, అతను నయవంచకుడురూ. అంటూ పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ప్రతిపక్షాల ప్రస్తావన-జయ జవాబు ఎస్ఐ గణేష్ హత్య, వనిత అరెస్ట్ గురువారం అసెంబ్లీలో ప్రధాన చర్చగా మారింది. ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల హతం కావడం పోలీస్ శాఖను బజారుకీడ్చిందంటూ డీఎండీకే సభ్యులు చంద్రకుమార్, సీపీఎం సభ్యులు బాలకృష్ణన్, సీపీఐ సభ్యులు పొన్నుపాండి, కాంగ్రెస్ సభ్యులు రంగరాజన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇందుకు సీఎం జయలలిత బదులిస్తూ, హతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా కేసులు బనాయించాలని ఆదేశించినట్లు చెప్పారు. మరోవైపు ఎస్ఐ గణేష్ భౌతికకాయానికి విళుపురం జిల్లా ఉళుందూర్పేటలోని స్వగ్రామంలో 23వ తేదీ సాయంత్రం పోలీసు సంప్రదాయం ప్రకారం తుపాకులతో గాలిలో 21 రౌండ్లు పేల్చగా అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు అధికారులు ఎవ్వరూ హాజరుకాకుండా అంత్యక్రియలను బహిష్కరించారు.