free coaching
-
ఉచితంగా పాలిసెట్ కోచింగ్
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలను పెంచే దిశగా సాంకేతిక విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాలిసెట్కు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ను అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలతో కూడిన వాల్ పోస్టర్ను విడుదల చేసింది. దీని ద్వారా విస్తృత స్థాయిలో విద్యార్థుల్లో అవగాహన కల్పించనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు అత్యధికంగా రూ.9.02 లక్షలు ప్యాకేజీలను దక్కించుకోవడంపై ప్రచారం చేపడుతూ విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే ఉన్నత విద్య, నైపుణ్యా శిక్షణ కార్యదర్శి కోన శశిధర్, సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ జి.గణేష్ కుమార్, కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. -
పాలిసెట్ ఎంట్రన్స్కు ఫ్రీ కోచింగ్
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్–2023 ఎంట్రన్స్ టెస్ట్కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిటెక్నిక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పాలిసెట్ తొలివిడత కోచింగ్ ఈ నెల 17న ప్రారంభించగా.. 24వ తేదీ నుంచి మరో బ్యాచ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన ప్రతి విద్యారి్థకి ఇంగ్లి‹Ù, తెలుగు మీడియంలలో ఉచిత స్టడీ మెటీరియల్ కూడా అందిస్తున్నారు. మే 10న పాలిసెట్ మే 10న రాష్ట్రవ్యాప్తంగా 61 పట్టణాల్లోని 410 కేంద్రాల్లో పాలిసెట్–2023 నిర్వహిస్తున్నామని నాగరాణి పేర్కొన్నారు. పరీక్షకు సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన టెన్త్ సిలబస్ నుంచి గణిత శాస్త్రంలో 50 మార్కులు, భౌతిక శాస్త్రంలో 40 మార్కులు, రసాయన శాస్త్రంలో 30 మార్కులు మొత్తం కలిపి 120 మార్కులకు రెండు గంటల కాల పరిమితిలో పరీక్ష ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు రూ.100 ప్రవేశ రుసుమును సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్లో లేదాhttps:// polycetap.nic.in వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5గంటల లోపు చెల్లించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 176 ప్రైవేట్ పాలిటెక్నిక్లతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న బేతంచర్ల (నంద్యాల జిల్లా), మైదుకూరు (కడప జిల్లా), గుంతకల్లు (అనంతపురం జిల్లా) ప్రభుత్వ పాలిటెక్నిక్లలో ప్రవేశాలు పొందగలుగుతారని వివరించారు. బాలికల కోసం ప్రత్యేకంగా 10 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లు, 2 మైనారిటీ పాలిటెక్నిక్లు.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం 9 ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. స్కాలర్ షిప్ సదుపాయమూ ఉంది అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.50 వేల చొప్పున మూడు సంవత్సరాల ప్రగతి స్కాలర్ షి ప్ లభిస్తుందని నాగరాణి పేర్కొన్నారు. పాలిసెట్–2023 ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ స్కాలర్ షిప్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్లైన్ నంబర్లు 08645293151, 7901620551/557/567లలో సంప్రదించాలని సూచించారు. -
ఎస్సై, కానిస్టేబుల్ ఫిజికల్, మెయిన్స్కు ఉచిత కోచింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో బీసీ స్టడీ సర్కిల్స్లో కోచింగ్ తీసుకున్న 1237 మంది అభ్యర్థులు అర్హత సాధించారని టీఎస్బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.అలోక్ కుమార్ తెలిపారు. వారికి ఫిజికల్, మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం వచ్చే నెల 2 నుంచి ఉచిత కోచింగ్ ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 15 స్టడీ సర్కిళ్లుండగా.. హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం స్టడీ సర్కిళ్లలో 250 మందికి, మిగతా సర్కిళ్లల్లో 100 మందికి 90 రోజులపాటు కోచింగ్ ఇవ్వనున్నా రు. ప్రిలిమ్స్కు అర్హత సాధించి, స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకోని అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశం పొందిన అభ్యర్థులందరికీ స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారు. -
నవంబర్లో ఆకాష్ టాలెంట్ హంట్– 2022
లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది నిరుపేదలు, బాలికలకు ఉచితంగా జేఈఈ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు నవంబర్లో ఆకాష్ బైజూస్ జాతీయ టాలెంట్ హంట్ పరీక్ష–2022 (అంతే 2022) నిర్వహించనున్నట్లు ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గుదే సంజయ్గాంధీ తెలిపారు. ఆ పరీక్షకు సంబంధించి పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్గాంధీ మాట్లాడుతూ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా అందించే స్కాలర్షిప్లకు అదనంగా ఇవి అందించనున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణకు అర్హులను ఎంపిక చేసేందుకు నవంబర్ 5 నుంచి 13 వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో ఎంపిక చేసిన తేదీల్లో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు ఏదైనా సమయంలో ఒక గంట పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆఫ్లైన్ పరీక్షను ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలో 90 మార్కులు ఉంటాయని, 35 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయన్నారు. దేశ వ్యాప్తంగా 285 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా బిజినెస్ హెడ్ రవికిరణ్ ఏర్పుల, బ్రాంచి మేనేజర్ జి.గోపీనాథ్లు పాల్గొన్నారు. (క్లిక్: పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం.. అధికారులతో సీఎం జగన్) -
ఎంసెట్, నీట్, జేఈఈకి ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, నీట్, జేఈఈకి సన్నద్ధమవుతున్న విద్యార్థులకు టీ–శాట్ ద్వారా ఉచిత శిక్షణ కొనసాగుతుందని ఇంటర్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ సమయంలో 2020లో ప్రారంభించిన ఈ శిక్షణకు విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉందని, ఇప్పటికే 12 వేల మంది నమోదు చేసుకు న్నారని బోర్డ్ స్పష్టం చేసింది. జాతీయ పోటీ పరీక్షలపై సమగ్ర శిక్షణ ఇవ్వడమే కాకుండా, మోడల్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. టీ–శాట్ ద్వారా సాయంత్రం 6.30 గం టల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదు పాయాన్ని వినియోగించుకోవచ్చని సూచించింది. ఇంజనీరింగ్ పీజీసెట్– 2022 గడువు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఇంజనీరింగ్ పీజీసెట్ (టీఎస్ పీజీఈసీఈటీ– 2022) దరఖాస్తులకు అపరాధ రుసుము లేకుండా ఈనెల 30 వరకు గడువు పొడిగించి నట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. చివరి సంవత్సరం పరీక్షలు రాసే బీఈ, బీటెక్ విద్యార్థులు, వివిధ రకాల సెమిస్టర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా పీజీఈసెట్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 15లోగా విద్యార్థులందరికీ యూనిఫాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ జూలై 15లోగా యూనిఫాం అందజేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈమేరకు షెడ్యూల్ను రూపొందించి జిల్లా, మండల విద్యాశాఖాధికారులతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యా యులకు పంపింది. మొత్తం 33 జిల్లాల్లో 22,78,569 మంది విద్యార్థులున్నట్టు గుర్తించారు. వీరికి 67,75,522 మీటర్ల వస్త్రం అవసరమని అంచనా వేసి, ఈమేరకు ఆర్డర్లు ఇచ్చారు. మొదటి దశలో 24,69,214 మంది విద్యార్థులకు జూలై 4వ తేదీలోగా యూనిఫాం అందించాలని, మిగతా విద్యార్థులకు జూలై 15లోగా ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. కొత్తగా ప్రవేశం పొందే వారికి కూడా యూని ఫాం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని, ఈ ప్రక్రియ జూలై నెలాఖరుకల్లా పూర్తయ్యే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. (క్లిక్: గురుకులాల్లో మరో 1,000 కొలువులు!) -
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉచిత సాంకేతిక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ–హాస్టల్–భోజన వసతితో పాటు ఉద్యోగ కల్పనకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్స్ట లేషన్, సర్వీసు కోర్సుకు 6 నెలల శిక్షణ, దీనికి ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దొజి, క్విల్డ్బ్యాగ్స్ కోర్సుకు 6 నెలలు శిక్షణ, దీనికి 8వ తరగతి పాసై ఉండాలని తెలిపారు. అర్హతలు ► వయసు 18–25 ఏళ్ల లోపు వారై ఉండాలి ► ప్రస్తుతం చదువుకుంటున్న వారు అర్హులు కాదు. ► అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్, పాస్పోర్ట్ ఫొటోలు, ఆధా, రేషన్కార్డులు ఆసక్తి, అర్హతలున్న గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు ఈనెల 13న ఉదయం 10 గంటలకు భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలోని తమ సంస్థకు రావాలని స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థ డైరెక్టర్ కిశోర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (క్లిక్: బస్పాస్ చార్జీలు భారీగా పెంపు?) -
పోలీసు కొలువు కొట్టేలా!
సాక్షి, హైదరాబాద్: పోలీసు కావడం కొందరి కల.. మరికొందరి ఆశ... ఇంకొందరి ఆశయం... సామాజిక, ఆర్థిక కారణాల నేపథ్యంలో ఆసక్తి ఉన్నప్పటికీ అనేక మంది ఎంపిక పరీక్షలకు దూరంగా ఉండిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు విభాగం ఎంపిక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ పేరుతో ఉచిత శిక్షణ ఇస్తోంది. 2016లో పశ్చిమ మండలంలో ప్రారంభమైన ఈ విధానం 2018లో అయిదు సెంటర్లలో 5 వేల మందికి విస్తరించింది. ప్రస్తుత సీపీ సీవీ ఆనంద్ ఆలోచన మేరకు ఈసారి నగరంలోని 11 సెంటర్లలో తొలి దశలో 7500 మందికి జరుగుతోంది. జేసీపీ ఎం.రమేష్, అదనపు డీసీపీ పరవస్తు మధుకర్స్వామి నేతృత్వంలో ఇవి సాగుతున్నాయి. అనూహ్య స్పందనతో ఎంపిక పరీక్ష... సబ్– ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ వంటి పోలీసు పరీక్ష హాజరవ్వాలనే ఆసక్తి, అర్హతలు ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడాన్ని నగర పోలీసు విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రైవేట్ సంస్థలకు దీటుగా అన్ని అంశాల్లోనూ తర్ఫీదు ఇస్తోంది. ఈ నేపథ్యంలో గణనీయమైన పోటీ ఏర్పడటంతో తొలిసారిగా ఎంపిక పరీక్ష నిర్వహించారు. మొత్తం 21 వేల మంది హాజరుకాగా వడపోత తర్వాత తొలి దశలో 7,500 మందిని ఎంపిక చేసి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇండోర్ ట్రైనింగ్గా పిలిచే ఆంగ్ల, కరెంట్ అఫైర్స్, తెలంగాణ చరిత్ర సహా మొత్తం 12 అంశాలతో పాటు అవుట్ డోర్ ట్రైనింగ్ దేహ దారుఢ్యం, వ్యాయామం వంటివీ ఈ శిక్షణలో భాగంగా నిష్ణాతుల పర్యవేక్షణలో సాగుతున్నాయి. పేదలకు ఉచితంగా భోజనం వసతి.. ఈ శిక్షణలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ సైతం అందించార. సిటీ పోలీసుల ప్రీ– రిక్రూట్మెంట్ ట్రైనింగ్కు హాజరవుతున్న వారిలో నిరు పేదలూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ మండలంలోని ఆయా ప్రాంతాలకు చెందిన వారికి ఉచితంగా భోజన సౌకర్యాన్నీ కల్పించారు. మిగిలిన వారికి హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో రూ.5 భోజనం అందిస్తున్నారు. దేశ దారుఢ్య పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా ఆయా జోన్లలో ఉన్న గ్రౌండ్స్లో ప్రతి రోజూ ఉదయం దేహ దారుఢ్య పరీక్షలకు సంబంధించి 800 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, షార్ట్పుట్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు లోటుపాట్లు గుర్తించి సరి చేస్తూ అభ్యర్థులను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి వారం పరీక్షలు నిర్వహణ.. గతంలో జరిగిన పోలీసు శిబిరాల్లో శిక్షణ తీసుకుని ఎంపికైన వారి ద్వారానూ ఈ శిక్షణలు జరుగుతున్నాయి. అభ్యర్థుల శక్తిసామర్థ్యాలు వారిలో ఉన్న లోపాలు గుర్తించడానికి ప్రతి ఆదివారం మాక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా వెనుకబడిన వారిని గుర్తిస్తున్నారు. వీరికి సంబంధించి ప్రత్యేక రికార్డులు నిర్వహిస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టే ట్రైనర్లు అదనపు శిక్షణ ఇస్తున్నారు. ఇలా దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభాపాటవాలు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని మరే ఇతర పోలీసు విభాగం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టట్లేదు. డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఆశయం, కొత్వాల్ సీవీ ఆనంద్ ఆలోచనతోనే యువతకు ఈ అవకాశం వచ్చింది. ప్రతి అభ్యర్థిపైనా ప్రత్యేక శ్రద్ధ భద్రాచలం నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటూ శిక్షణ తీసుకుంటున్నా. ఎస్సై, కానిస్టేబుల్ రెండు పోస్టులకు అప్లై చేశా. ట్రైనింగ్ కూడా ఆ కోణంలోనే సాగుతోంది. కాస్లులో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరి మీదా శ్రద్ధ తీసుకుంటున్నారు. మధ్యాహ్నం ఉచిత భోజనం కూడా అందిస్తున్నారు. సిటీ పోలీసులు పీఆర్టీ క్యాంప్లో ఇప్పటి వరకు చాలా సబ్జెక్టు నేర్చుకున్నా. ఈ సదావకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. – రిహానా, పరేడ్గ్రౌండ్స్ క్యాంప్ అభ్యర్థిని \టార్గెట్ 30 శాతం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు, సూచనల మేరకు పకడ్బందీగా శిక్షణ ఇస్తున్నాం. ప్రతి సబ్జెక్టును అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలు బోధిస్తున్నారు. గతంలో నిర్వహించిన పీఆర్టీకి హాజరైన అభ్యర్థుల్లో 20 శాతం మంది ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈసారి కనీసం 30 శాతం మంది విజయం సాధించాలనే లక్ష్యంతో శిక్షణ ఇస్తున్నాం. – పరవస్తు మధుకర్ స్వామి, అదనపు డీసీపీ (చదవండి: జిల్లాలకు 4.20 లక్షల టన్నుల యూరియా) -
ఎస్సీ యువతకు ఉచితంగా గ్రూప్స్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగాలను ఎస్సీ యువత దక్కించు కునేలా కోచింగ్ సదుపాయం కల్పించాలని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎంపిక చేసిన ఎస్సీ యువతకు గ్రూప్–1, 2, 3, 4ల కోసం ఫౌండేషన్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రతి జిల్లాలో 75 మంది నుంచి 150 మందిని ఎంపిక చేసి వారికి 300 గంటల పాటు 33 కేంద్రాల ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ప్రకటించింది. గ్రూప్–1 నుంచి గ్రూప్ –4 వరకు ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే వారికి అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఇండియన్ ఎకానమీ, కరెంట్ ఎఫైర్స్ సిలబస్లో 300 గంటల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పొందాలనుకునే యువత రూ.3 లక్షల వార్షిక ఆదాయానికి లోబడి ఉండాలని, ఈనెల 8న జిల్లాల వారీగా ఇచ్చే నోటిఫికేషన్తో శిక్షణ ప్రక్రియ మొదలవుతుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెల్లడించారు. శిక్షణ కార్యక్రమం సమయంలో ఎంపికైన అభ్యర్థులకు భోజనం, టీ ఖర్చుల కోసం ప్రతిరోజు రూ.75 చెల్లించనున్నట్లు తెలిపారు. రూ.1,500 విలువైన స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తామన్నారు. http://tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ షెడ్యూల్ ఇలా.. ఈనెల 8న శిక్షణకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 9 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. 19న అభ్యర్థులు డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. 20న మెరిట్ లిస్ట్ను డీఎస్సీడీవో కార్యాలయాల్లో పెట్టి, ఎంపికైన అభ్యర్థులకు ఫోన్ల ద్వారా సమాచారం అందిస్తారు. 22న అభ్యర్థుల అర్హత పత్రాలను వెరిఫికేషన్ చేసి, 25 నుంచి శిక్షణాæ తరగతులను ప్రారంభిస్తారు. -
కోచింగ్.. స్టైపెండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రూ.50 కోట్ల వ్యయంతో 16 స్టడీ సర్కిళ్లతోపాటు 103 స్టడీ సెంటర్లలో 1.25 లక్షల మందికి ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్ కూడా ఇవ్వాలని నిర్ణయిం చింది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ అందించే శిక్షణలో బీసీ వర్గాలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీ లకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక 1.25 లక్షల మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రవేశ పరీక్ష కోసం ప్రతిష్టాత్మక ‘అన్ అకాడమీ’తో ఒప్పందం కుదుర్చుకున్నామని గంగుల తెలిపారు. ‘16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25వేల మందికి నేరు గా, మరో 50వేల మందికి హైబ్రిడ్ మోడ్ (ఆన్లైన్/ ఆఫ్లైన్ విధానం)లో శిక్షణ ఇస్తాం. అలాగే 103 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో దాంట్లో 500 మందికి తగ్గకుండా 50వేల మందికి శిక్షణ ఇస్తాం. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 16న ఉద యం 11 గంటలకు ఆన్లైన్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉం టుంది. దీనికోసం బుధవారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈనెల 16 ఉదయం 10 గంటల వరకూ రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుం ది. మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ఏ ఉద్యోగం కోసం కోచింగ్ ఇవ్వాలో నిర్ణయిస్తారు. అధిక మార్కులు సాధించిన వారిని గ్రూప్–1 శిక్షణకు ఎంపిక చేసి మెటీరియల్తోపాటు నెలకు రూ.5వేల చొప్పున ఆరు నెలలపాటు స్టైపెండ్ ఇస్తాం. మిగతావారిని మెరిట్ ఆధారంగా గ్రూప్–2, 3, 4, కానిస్టేబుల్, ఎస్సై వంటి ఇతర శిక్షణలకు ఎంపిక చేస్తాం. వీరికి 3 నెలల శిక్షణలో నెలకు రూ.2వేల స్టైపెండ్ ఇస్తాం. అలాగే, కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారికి ఉచిత శిక్షణతోపాటు స్టైపెండ్ ఇస్తాం. ఈనెల 20 లేదా 21 నుంచి క్లాసులు ప్రారంభిస్తాం’ అని మంత్రి చెప్పారు. 100 మార్కులకు పరీక్ష ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను https://studycircle. cgg.gov.in/, https://mjpabcwreis. cgg. gov.in/, https://unacademy.com/ scholarship/tsgovt&scholarship& test తోపాటు బీసీ సంక్షేమ శాఖ వెబ్సైట్లోనూ చేసుకో వచ్చని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. 90 నిమిషాలపాటు నిర్వహిం చే ఈ పరీక్షలో 5 విభాగాలు ఉంటాయని, మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. నెగె టివ్ మార్కులు ఉండే ఈ పరీక్షలో టాంపరిం గ్కు అవకాశం ఉండదన్నారు. మెరిట్ అభ్యర్థులకు తాము సైతం 20వేలు విలువ చేసే స్టడీ మెటీరియ ల్ను ఇస్తామని ‘అన్ అకాడమీ’ ప్రతినిధి చెప్పారు. -
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
-
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణాలో వివిధ శాఖల్లో 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెరలేచిన నేపథ్యంలో వెనుక బడిన తరగతికి చెందిన నిరుపేదలకు ఉచితంగా శిక్షణనిచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సమాయత్తమైంది. దాదాపు లక్షా 25వేలమందినిరుపేద ఉద్యోగుల శిక్షణ నిమిత్తం సమగ్ర కార్యాచరణను రూపొందించింది. బీసీ స్టడీ సెంటర్ల ద్వారా బీసీ విద్యార్థులతోపాటు, పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులను ఆయా పోటీ పరీక్షలకు తీర్చిదిద్దనుంది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం సాక్షి.కామ్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీ స్టడీ సెంటర్ పేరుతో 100 కొత్త కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మరో యాభై అటువంటి కేంద్రాలు ఒక వారంలో సిద్ధం కానున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రూపు-1, గ్రూపు-2 లాంటి పోటీ పరీక్షలతోపాటు, పోలీసు, రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు, డీఎస్సీ, క్లరికల్ తదితర పోటీ పరీక్షలకు కూడా ఉచితంగా శిక్షణ యిస్తామన్నారు. ఇందుకుగాను స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా వెంకటేశం స్పష్టం చేశారు. ఏప్రిల్ 16 న స్క్రీనింగ్ టెస్ట్ అలాగే కోచింగ్కు ఎంపికకు సంబంధించిన పరీక్ష ఏప్రిల్ 16న జరగనుందని, ఈ పరీక్షకు ఒక గంట ముందు కూడా రిజిస్ట్రేషన్లు అంగీకరిస్తామని ఆయన తెలిపారు. ఫలితాలను వెంటనే అన్లైన్లో ప్రకటిస్తామని చెప్పారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ద్వారా వారు ఏ కోర్సుకు శిక్షణకు అర్హులో నిర్ణయించి, వారికి కౌన్సిలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా శిక్షణ డిజిటల్ మీడియా ద్వారా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. మెటీరియల్ అంతా సిద్ధంగా ఉంచామనీ, అలాగే వీడియోల ద్వారా ట్రైనింగ్ ఉంటుందన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అన్అకాడమీ, బైజూస్ లాంటి సంస్థలతో టైఅప్ కోసం ప్రయత్నిస్తున్నామని వెంకటేశం తెలిపారు. ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందేవారు సందేహాల నివృత్తి కోసం ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కావచ్చని కూడా బుర్రా వెల్లడించారు. అలాగే ఫిట్నెస్ పరీక్షలు లాంటి కొన్ని తప్పనిసరి పరీక్షలకు, శిక్షణకు ఫిజికల్గా కూడా ఆన్లైన్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుర్రా వెంకటేశం కోరారు. -
పోలీస్ పరీక్షల ఉచిత శికణకై ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్
సాక్షి, హైదరాబాద్: పోలీసు పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు నగర పోలీసు విభాగం ప్రీ–రిక్రూట్మెంట్ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు అర్హతలు, ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరింది. యువత నుంచి భారీగా స్పందన రావడంతో మొత్తం 20,733 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఉచిత శిక్షణకు అర్హులను ఎంపిక చేసేందుకు తొలిసారిగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. మంగళవారం నగరంలోని ఐదు జోన్లలోని 36 కేంద్రాల్లో తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో ఈ పరీక్ష జరుగనుంది. అర్థమెటిక్, రీజనింగ్ 100 మార్కులు, జనరల్ స్టడీస్ 100 మార్కులకు దీనిని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, దరఖాస్తు చేసుకున్న వారు విధిగా హాజరుకావాలని నగర పోలీసులు కోరుతున్నారు. హాల్ టికెట్లను లింకు రూపంలో ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు పంపించారు. సమాచారం అందని వారు పోలీసు అధికారిక వెబ్సైట్, సోషల్మీడియా ప్లాట్ఫామ్స్తో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లలోనూ సంప్రదించాలి. (చదవండి: సాఫీ జర్నీకి సై... అందుబాటులోకి మరో మూడు రోడ్లు) -
ఐబీపీఎస్ పరీక్షలకు ఎస్టీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన స్టడీ సర్కిల్లో ఐబీపీఎస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ సంయుక్త సంచాలకుడు సముజ్వల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలల పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు studycircle.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల అర్హతలో మెరిట్ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తామని, మొత్తం వంద మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. మూడోవంతు సీట్లు మహిళలకు కేటాయించామన్నారు. వివరాలకు 6303497606 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. -
Telangana: ఎంసెట్, నీట్, జేఈఈ విద్యార్థులకు ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, నీట్, జేఈఈలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులతో పాటు ప్రైవేటు కళాశాలల వారు కూడా వినియోగించుకోవాలని కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో షార్ట్ టైం ఆన్లైన్ కోచింగ్ను మంత్రి ప్రారంభించారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. http://tscie.rankr.io లింక్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ పొందవచ్చని తెలిపారు. -
సర్కారు కొలువుకు ఉచిత శిక్షణ
సాక్షి, సిద్దిపేట : సర్కార్ ఉద్యోగం సాధిస్తే జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. అందులోనూ పోలీస్ ఉద్యోగమంటే యువతకు ఎంతో క్రేజీ. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసుకున్న, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పోలీస్ కానిస్టేబుల్ శిక్షణను అందించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు కోసం జిల్లా కేంద్రాల్లోని జూనియర్ కళాశాలలను ఎంపిక చేసింది. టీశాట్, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, విద్యాహెల్ప్ లైన్ల సహకారంతో నిర్వహించనున్న ఈ శిక్షణకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పీటీసీ)గా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో పీటీసీని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ కోఆర్డినేటర్గా వ్యవహరించగా అందులో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్స్, స్టూడెంట్ కౌన్సిలర్లు శిక్షణలో భాగస్వాములు కానున్నారు. చక్కని స్పందన ఇంటర్ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిక్షణకు జిల్లాలోని విద్యార్థుల నుంచి చక్కని స్పందన లభిస్తుంది. 100మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణను అందించాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన, ద్వితీయ సంవత్సరం చదువుతున్న అర్హులైన విద్యార్థులతో పాటు మోడల్ స్కూల్స్, రెసిడెన్సియల్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 20 పోలీస్ ట్రైనింగ్ శిక్షణా కేంద్రాల్లో సిద్దిపేట జిల్లా నుంచి ఉత్తమ స్పందన లభించినట్లు తెలుస్తుంది. మొత్తంగా 300లకు పైగా విద్యార్థులకు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలు అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారై ఉండాలి. వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుషులు 167.5 సెం. మీ ఎత్తు, చాతి 86.3 సె.మీతో పాటు గాలి పీల్చినపుడు అదనంగా 3 సెం. మీలు ఉండాలి. మహిళలు 156.7 సెం. మీ ఎత్తు, 80 సెం.మీ చాతి గాలిపీల్చినపుడు 3 సె.మీ అదనంగా కలిగి ఉండాలి. నేడే ఎంపికలు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గురువారం ఉదయం 10 గంటల నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శారీరక ధృడత్వ పరీక్షలను నిర్వహించి ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు తమ టెన్త్, ఇంటర్, ఆధార్కార్డు జిరాక్స్లను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మున్సిపల్ శాఖ సహకారంతో మైదానాన్ని శుభ్రం చేశారు. ఎంపికల కోసం పోలీసు శాఖ సహకారాన్ని తీసుకుని అభ్యర్థుల చాతి విస్తీర్ణం, ఎత్తు, బరువులను కొలవనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి అవసరమైన శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నారు. శిక్షణ ఉదయం 6 నుంచి 7గంటల వరకు ఫిజికల్ ప్రాక్టీస్ ఉంటుంది. అనంతరం తరగతులను నిర్వహించి సిలబస్లోని అంశాలను వివరిస్తారు. రోజువారి క్యాలెండర్ను రూపొందించి తరగతులను నిర్వహిస్తారు. అధ్యాపకులు, పోలీస్శాఖ వారిచే స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలను ఇప్పిస్తారు. దాతలు సహకరిస్తే ట్రాక్షూట్, టీషర్ట్లతో పాటు స్టడీ మెటీరియల్ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. పక్షం రోజులకోసారి గెస్ట్ లెక్చర్లతో ఉపన్యాసాలు ఉంటాయి. సిలబస్ పూర్తయ్యేంత వరకు లేదా త్వరలో ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే వరకు శిక్షణను అందించనున్నారు. -
డిఎస్సీ కోసం ఉచిత శిక్షణా తరగతులు
సాక్షి, నంద్యాల : ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న ఆకాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, పేద విద్యార్థులకు భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపీఎస్సి నిర్వహించు గ్రూప్ -2, 3, 4, వీఆర్ఓ పరీక్షలకు, రైల్వే శాఖ నిర్వహించు గ్రూప్-సి, డి, పోలీసు ఉద్యోగాలకు, డీఎస్సీ పరీక్షలకు ఈ నెల 29నుంచి నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్ వారు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ నెల 29న సోమవారం నాడు ఉదయం 9 గంటలకు శోభా హోటల్ పక్కన గల శ్రీ వెంకటేశ్వర (యస్.వి) డిగ్రీ కాలేజిలో, బస్స్టాండ్ పక్కన గల చిన్మయ హైస్కూల్లో తరగతులు ప్రారంభమవుతాయి. తెల్ల రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులు నేరుగా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించినా వారికి మరొక అవకాశం కల్పించబడను. అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి తరగతులకు తప్పక హాజరు కాగలరని సంస్థ నిర్వాహకులు కుమార్ తెలిపారు. అభ్యర్థులకు సంస్థ నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించి, శిక్షణా కాలంలో మెటీరియల్ అందిస్తారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వారికి మరొక అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.krishnamma.org వెబ్సైట్లో లేదా సంస్థ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందింస్తారు. రెండవ బ్యాచ్ కోసం గ్రూప్స్ ఉద్యోగాలకు ఈ నెల 29న సోమవారం తరగతులు ప్రారంభమవుతాయి. రైల్వే, పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలకు 28వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్సైట్ను కానీ, సంస్థ కార్యాలయాన్ని కానీ సందర్శించాలని తెలిపారు. చిరునామా- శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ జూనియర్ కాలేజి వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 99850 41168 నెంబర్ను సంప్రదించగలరు. -
సివిల్స్ కోచింగ్కు కటాఫ్ మార్కులు
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్లో ఉచిత కోచింగ్ ఇప్పించేందుకు అభ్యర్థుల ఎంపికలో కటాఫ్ మార్కులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కటాఫ్ మార్కులు లేకుండా ఆయా సంక్షేమ శాఖలు నిర్ణయించిన ప్రకారం టార్గెట్ వరకు మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల నుంచి మొత్తం 3,850 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. కోచింగ్ కోసం మూడు నెలల క్రితం ఎంట్రెన్స్ పరీక్ష రాశారు. పరీక్ష రాసిన నెల రోజుల తరువాత ఫలితాలు ప్రకటించారు. అయితే రెండు నెలలుగా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. కటాఫ్ మార్కులపై తేల్చని ప్రభుత్వం.. మొత్తం 150 మార్కులకు పరీక్ష పెట్టారు. ఇందులో ఎన్ని మార్కుల వరకు కటాఫ్ పెట్టాలనే విషయంలో ప్రభుత్వం తేల్చుకోలేకపోతున్నది. దాదాపు 95శాతం మందికి వందలోపు మార్కులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సివిల్స్కు కోచింగ్ తీసుకునే వారు 80 శాతం మార్కులతో ఎంట్రెన్స్ పాస్ అయితే ఆలోచించవచ్చునని, అలా కాకుండా 50 శాతం లోపు మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేస్తే ఫలితాలు రావడం లేదనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద కోచింగ్ కోసం ప్రభుత్వం కోచింగ్ సెంటర్లకు తొమ్మిది నెలలకు కలిపి సుమారు రూ. 40 కోట్లు ఖర్చుచేస్తున్నది. అందుకని కటాఫ్ కనీస మార్కులు ఎంత పెట్టాలనే విషయం తేల్చుకోలేకపోతున్నది. దీనిపై ఈనెల 26న సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో అన్ని సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనూ ఎటూ తేల్చలేదు. ఇప్పటికే రెండు నెలల నుంచి పరీక్షలు రాసిన 45,447 మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్, దివ్యాంగులకు 0.3శాతం రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సి ఉంది. దీనిపైనా కసరత్తు జరుగుతోంది. గత సంవత్సరం బీసీలకు మహిళా రిజర్వేషన్, కటాఫ్ మార్కులు అమలు చేయాలనుకుంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చివర్లో ఆ ప్రతిపాదన విరమించుకొని మెరిట్ ప్రకారం ఇచ్చారు. సివిల్స్కు ఎంపిక కావడం లేదని.. సివిల్స్లో ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా.. తగిన ఫలితాలు రావడం లేదు. మూడు సంవత్సరాలుగా సంవత్సరానికి 3,850 మందికి కోచింగ్ ఇప్పిస్తున్నా ఒక్కరు కూడా ఎంపిక కాలేదు. అందువల్ల కటాఫ్ మార్కుల అంశం తెరపైకి వచ్చింది. రెండు నెలలుగా ఎదురు చూపులు సివిల్స్ శిక్షణకు ఎంట్రెన్స్ ఫలితాలు ప్రకటించి రెండు నెలలైనా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటి నుంచి కోచింగ్ ప్రారంభిస్తారో వెల్లడించలేదు. సరైన శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్ను ఎంపిక చేసి విద్యార్థులను అందులో చేర్పించాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం ఆయా సంక్షేమ శాఖల నుంచి ఉన్నతాధికారులతో కమిటీలు వేసి దేశ వ్యాప్తంగా పంపించి రిపోర్టులు తెప్పించింది. రిపోర్టు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద ఉంది. ఇంకా ఈ రిపోర్టుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. -
పోటీ ప్రపంచమిది..పోరాడితే విజయం మీది..
సాక్షి, నంద్యాల : ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న ఆకాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, పేద విద్యార్థులకు భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపీఎస్సి నిర్వహించు గ్రూప్ -2, 3, 4, వీఆర్ఓ పరీక్షలకు, రైల్వే శాఖ నిర్వహించు గ్రూప్-సి, డి, పోలీసు ఉద్యోగాలకు, డీఎస్సీ పరీక్షలకు ఈ నెల 13నుంచి నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్ వారు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ నెల 13న సోమవారం నాడు ఉదయం 9 గంటలకు శోభా హోటల్ పక్కన గల శ్రీ వెంకటేశ్వర (యస్.వి) డిగ్రీ కాలేజిలో, బస్స్టాండ్ పక్కన గల చిన్మయ హైస్కూల్లో తరగతులు ప్రారంభమవుతాయి. తెల్ల రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులు నేరుగా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించినా వారికి మరొక అవకాశం కల్పించబడను. అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి తరగతులకు తప్పక హాజరు కాగలరని సంస్థ నిర్వాహకులు కుమార్ తెలిపారు. అభ్యర్థులకు సంస్థ నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించి, శిక్షణా కాలంలో మెటీరియల్ అందిస్తారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వారికి మరొక అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.krishnamma.org వెబ్సైట్లో లేదా సంస్థ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందింస్తారు. రెండవ బ్యాచ్ కోసం గ్రూప్స్ ఉద్యోగాలకు ఆగస్ట్13వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి. రైల్వే, పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలకు ఆగస్ట్ 14వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్సైట్ను కానీ, సంస్థ కార్యాలయాన్ని కానీ సందర్శించాలని తెలిపారు. చిరునామా- శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ జూనియర్ కాలేజి వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 99850 41168 నెంబర్ను సంప్రదించగలరు. -
ఉచిత శిక్షణా తరగతులకు జూలై 29న ప్రవేశ పరీక్ష
సాక్షి, నంద్యాల : ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపీఎస్సి నిర్వహించు గ్రూప్ -2, 3, 4, వీఆర్ఓ పరీక్షలకు, రైల్వే శాఖ నిర్వహించు గ్రూప్-సి, డి, పోలీసు ఉద్యోగాలకు, డీఎస్సీ పరీక్షలకు ఈ నెల 29(జూలై)న నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్ వారు ఉచిత శిక్షణా తరగతులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ నెల 29(జూలై)న ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు శోభా హోటల్ పక్కన గల శ్రీ వెంకటేశ్వర (యస్.వి) డిగ్రీ కాలేజిలో పరీక్షకు తప్పక హాజరు కాగలరని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టుకు 150 మార్కులకు పరీక్ష జరుగును. కట్ ఆఫ్ 100 మార్కులుగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంత నిరుపేద అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము. వంద మంది అభ్యర్థులను పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ప్రకారం ఎంపిక చేసి వారికి ఉచిత శిక్షణ, భోజన వసతి, స్టయిఫండ్తో పాటు మెటీరియల్ను అందజేస్తారు. మహిళా అభ్యర్థులకు 33 శాతం మేర రిజర్వేషన్లు కల్పించడమైనది. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ప్రతి నెలా 1000 రుపాయలు స్టయిఫండ్గా అందజేయుదురు. తెల్ల రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత శిక్షణకు అర్హులు. కట్ ఆఫ్ మార్కులు సాధించని అభ్యర్థులకు సంస్థ నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తుందని సంస్థ కార్యదర్శి తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి www.krishnamma.org వెబ్సైట్లో లేదా సంస్థ కార్యాలయంలో జూలై 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన మరో 50 మందికి అదనంగా భోజన వసతి, స్టయిఫండ్ కల్పిస్తామన్నారు. రెండవ బ్యాచ్ కోసం గ్రూప్స్ ఉద్యోగాలకు ఆగస్ట్ 5వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి. రైల్వే, పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలకు ఆగస్ట్ 6వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్సైట్ను కానీ, సంస్థ కార్యాలయాన్ని కానీ సందర్శించాలని తెలిపారు. చిరునామా- శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ జూనియర్ కాలేజి వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 99850 41168, 99850 36121 నెంబర్లను సంప్రదించగలరు. -
పోటీపరీక్షలకు స్టయిఫండ్, వసతితో ఉచిత శిక్షణ
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : నేడు దేశంలో పెరుగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాలు ఎటువంటి జవాబుదారీతనం వహించట్లేదు. అడపాదడపా నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ సరైన శిక్షణ లేక యువత నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నారు. ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు ఆగస్ట్ 4వ తేదీన, ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను ఆగస్ట్ 6న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల నందు అర్హత పరీక్షను జూలై 30 తేదీన పరీక్ష రాయదలచిన వారు www.krishnamma.org వెబ్సైట్ నందు పేర్లు నమోదు చేసుకొనగలరు. మరింత సమాచారం కోసం 99850 36121 నెంబర్ను సంప్రదించగలరు. -
ప్రభుత్వ ఉద్యోగాలకు భోజన వసతితో కూడిన ఉచిత శిక్షణ
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : నేడు దేశంలో పెరుగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాలు ఎటువంటి జవాబుదారీతనం వహించట్లేదు. అడపాదడపా నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ సరైన శిక్షణ లేక యువత నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నారు. ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 22వ తేదీన, ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 24న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్ను సంప్రదించగలరు. -
గ్రూప్స్ కోసం వసతి, స్టయిఫండ్తో కూడిన ఉచిత శిక్షణ
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : నేడు దేశంలో పెరుగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాలు ఎటువంటి జవాబుదారీతనం వహించట్లేదు. అడపాదడపా నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ సరైన శిక్షణ లేక యువత నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నారు. ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 22వ తేదీన, ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 24న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 36121 నెంబర్ను సంప్రదించగలరు. -
శ్రీ క్రిష్ణమ్మ చెంతన..నిరుద్యోగులకు వంతెన..
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. కొంత మంది యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ పోటీపరీక్షల కోసం యువకులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. నంద్యాలలోని శ్రీ నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 16 తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 18న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస నగర్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్ను సంప్రదించగలరు. -
ఇచట నిరుద్యోగులు...ఉద్యోగులుగా..
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. కొంత మంది యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ పోటీపరీక్షల కోసం యువకులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా తోడు కావడంతో వివేకానందుల వారి ఆలోచనలకు ప్రాణం పోశారు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఆ శిక్షణలో రాటుదేలిన పలువురు నేడు అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు. నంద్యాలలోని నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 16న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 18న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్ను సంప్రదించగలరు. -
వారే ఒక సైన్యం
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. కొంత మంది యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ పోటీపరీక్షల కోసం యువకులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా తోడు కావడంతో వివేకానందుల వారి ఆలోచనలకు ప్రాణం పోశారు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఆ శిక్షణలో రాటుదేలిన పలువురు నేడు అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు. నంద్యాలలోని నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 16న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 18న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్ను సంప్రదించగలరు. -
ఒక్క రూపాయి..
నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. దేన్నీ అపాత్రాధానం చేయకూడదని, వాటి విలువ పుచ్చుకునేవారికి తెలియాలనే ఉద్ధేశ్యంతో విద్యాదానమైనా, అన్నదానమైనా ఒక్క రూపాయి మాత్రమే తీసుకోవాలని తన శిష్యులకు ఉపదేశించారు. మరి వారి ఆశయాలను నెరవేర్చే శిష్యులు ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ, ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రం వివేకానందుల వారి ఆలోచనలకు ప్రాణం పోస్తుంది. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఆ శిక్షణలో రాటుదేలిన పలువురు నేడు అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు. నంద్యాలలోని నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 6న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం టెట్, డీఎస్సీ తరగతులను జూలై 8న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్ను సంప్రదించగలరు. -
సూపర్ 50
అది 2002వ సంవత్సరం. బీహార్ రాష్ట్రంలో పాట్నలో ఆనంద్ కుమార్ అనే మధ్యతరగతి గణిత ఉపాధ్యాయుడు సూపర్ 30 ప్రోగ్రామ్కు నాంది పలికాడు. వారికి శిక్షణ ఇస్తూ ఎందరో ఐఐటీయన్లను తయారు చేశాడు. 2018వ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అరుణాచలేశ్వర్ అనే కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు సూపర్ 50 ప్రోగ్రామ్ను తెరపైకి తెచ్చాడు. పేద విద్యార్థుల కలలను సాకారం చేస్తూ వీరు ఐఐటీకి ఉచిత తరగతులను నిర్వహిస్తున్నారు. బ్యాచ్కు 50 మంది మాత్రమే శిక్షణకు అర్హులు. అందుకే సూపర్ 50గా నామకరణం చేశారు. ప్రతి పేద విద్యార్థి కల ప్రభుత్వ ఉద్యోగం సాధించటం. అందుకోసం అప్పుచేసి వేలకు వేలు కోచింగ్ సెంటర్లకు ఫీజుగా చెల్లిస్తూ, అరకొర వసతులతో, పస్తులతో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు యువత. వీరందరికీ ఒక మంచి భవిష్యత్తును నిర్మించాలనుకుని నడుం కట్టింది ఓ స్వచ్ఛంద సంస్థ. వీరికి ఉచిత తరగతులు నిర్వహిస్తూ, వసతితో కూడిన భోజన సౌకర్యం కల్పిస్తూ తమ సేవలందిస్తుంది. ఇప్పటిదాకా వంద మంది యువతీ, యువకులు వీరి శిక్షణను ఉపయోగించుకొని ఉద్యోగాలను సాధించారు. సాక్షి, నంద్యాల : నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూన్ 29న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం టెట్, డీఎస్సీ తరగతులను జూన్ 30న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్ను సంప్రదించగలరు. శ్రీ మేథ్ అరుణాచల అకాడమీ వారి ఆధ్వర్యంలో బైపీసీ విద్యార్థులకు నీట్ తరగతులను, ఎంపీసీ విద్యార్థులకు ఐఐటీ(జేఈఈ) తరగతులను ఐదు నెలల పాటు ఉచితముగా నిర్వహిస్తామని అకాడమీ డైరెక్టర్ అరుణాచలేశ్వర్ పత్రికా పకటనలో తెలిపారు. ప్రతి పేద విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు. అర్హత గల పేద విద్యార్థులకు ఉచిత వసతి కూడా కల్పించబడును. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ మేథ్ అరుణాచల అకాడమి. నేషనల్ కాలేజ్ వెనుక, నంద్యాల. మరింత సమాచారం కోసం 70130 00437, 95819 30435 నెంబర్లను సంప్రదించగలరు. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా తరగతులు
ప్రతి పేద విద్యార్థి కల ప్రభుత్వ ఉద్యోగం సాధించటం. అందుకోసం అప్పుచేసి వేలకు వేలు కోచింగ్ సెంటర్లకు ఫీజుగా చెల్లిస్తూ, అరకొర వసతులతో, పస్తులతో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు యువత. వీరందరికీ ఒక మంచి భవిష్యత్తును నిర్మించాలనుకుని నడుం కట్టింది ఓ స్వచ్ఛంద సంస్థ. వీరికి ఉచిత తరగతులు నిర్వహిస్తూ, వసతితో కూడిన భోజన సౌకర్యం కల్పిస్తూ తమ సేవలందిస్తుంది. ఇప్పటిదాకా వంద మంది యువతీ, యువకులు వీరి శిక్షణను ఉపయోగించుకొని ఉద్యోగాలను సాధించారు. సాక్షి, నంద్యాల : నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడునని, కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూన్ 15వ తేదీ తరగతులు నిర్వహిస్తామని, ఉపాధ్యాయ పరీక్షల కోసం టెట్, డీఎస్సీ తరగతులను జూన్ 21వ తేదీన తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడునని, అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహిస్తామని, శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కొరకు 99850 41168 నెంబర్ను సంప్రదించగలరు. -
మైనార్టీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సాక్షి సిటీబ్యూరో: మైనార్టీ విద్యార్థులకు సివిల్ సర్వీస్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఏటా వంద మందిని ఎంపిక చేసి వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం మే 8వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి.. 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఖమ్మం, రంగారెడ్డి మినహా మిగతా ఎనిమిది పాత జిల్లాల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఉన్నతమైన శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఓ కమిటీని వేసి నగరంలోని ఐదు ప్రముఖ ఐఏఎస్ స్టడీ సర్కిళ్లను ఎంపిక చేశారు. స్టైఫండ్, మెటీరియల్ కూడా.. ఎంపికైన విద్యార్థులకు కోచింగ్కు అయ్యే ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. పైగా ఉపకార వేతనం కూడా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. లోకల్ విద్యార్థికి రూ.2500, నాన్ లోకల్ విద్యార్థికి రూ.5 వేలు ఇవ్వనున్నారు. దీంతో పాటు స్టడీ మెటీరియల్ కొనుగోలుకు అదనంగా రూ.3500 ఇస్తారు. కోచింగ్ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.1.51 లక్షలు వెచ్చించనుంది. మైనార్టీల ప్రగతికి తోడ్పాటు ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థుల కోసం ప్రవేశపేట్టిన సివిల్ సర్వీస్ కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థులకు నగరంలోని టాప్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ ఇవ్వలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి.– ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్,సీఈడీఎం డైరెక్టర్ -
టెట్ పాసైన గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఒంగోలు సెంట్రల్: గత ఏడేళ్లలో టెట్లో అర్హత సాధించి 2018 డీఎస్సీ పరీక్ష రాయబోయే గిరిజన యువతీ, యువతకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇన్చార్జి అధికారి బి.శివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు, వెంకటాచలం మండలంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో 2 నెలల పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తూ శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 26న నెల్లూరు ఐటీడీఏ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రంతో అభ్యర్థులు రావాలని సూచించారు. ఇతర వివరాలకు 81878 99877 సెల్ నంబర్ను సంప్రదించాలని కోరారు. -
15 నుంచి టెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
కడప, వైవీయూ : కడపలోని శ్రీసాయి బ్రహ్మేంద్ర ఎడ్యుకేషనల్ అండ్ కెరీర్ గైడెన్స్ సెంటర్లో టెట్ అభ్యర్థులకు ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఉచిత ఆడియో క్లాసులు నిర్వహిస్తున్నట్లు సంస్థ సమన్వయకర్త ఎస్.మహమ్మద్ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీషు గ్రామర్, సైకా లజీ సబ్జెక్టులకు సంబంధించి ఈ ఉచిత తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ పేర్లను సంస్థ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9618299345 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
గ్రూప్–2 మెయిన్స్కు ఉచిత కోచింగ్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఎస్సీ, బీసీ–సీ కులాలకు చెందిన అభ్యర్థులకు గ్రూప్–2 మెయిన్స్కు ఉచిత కోచింగ్ను ఇప్పించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ప్రకాష్రాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోచింగ్కు గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఒకటిన్నర నెలల పాటు తిరుపతిలోని డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, శ్రీ విద్య ఐఏఎస్ అకాడమీలో శిక్షణ ఇస్తామని తెలిపారు. దరఖాస్తు ఫారాలు, పూర్తి వివరాలను http;//www.chittor.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా పొందిన దరఖాస్తును పూర్తి చేసి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ నెల 31వ తేదిలోగా అందించాలన్నారు. అభ్యర్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలని, కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల లోపు ఉండాలన్నారు. దరఖాస్తుకు గ్రూప్–2 ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్, పొందిన మార్కుల జాబితా నకలు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, తెల్లరేషన్ కార్డు/ ఆదాయ ధృవీకరణ పత్రం, విభిన్న ప్రతిభావంతులైతే 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలను జతచేసి అందించాలన్నారు. -
గ్రూప్–2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్ : రాయలసీమ జిల్లాలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాల్లో గ్రూప్–2 ప్రిలిమ్స్లో ఎంపికైన ఎస్సీ కులాలు, బీసీ–సీ విద్యార్థులకు మెయిన్స్ పరీక్షకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ స్పెషల్ ఆఫీసర్ విజయ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈనెల 31లో అందజేయాలని తెలిపారు. మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. వీరికి తిరుపతిలోని డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, శ్రీ విద్యా ఐఏఎస్ అకాడమిలో శిక్షణ ఇస్తారని వివరించారు. కుటుంబ వార్షికాదాయం రూ. 2 లక్షలలోపు ఉండాలని వివరించారు. గ్రూప్–2 ప్రిలిమ్స్ హాల్టికెట్ నంబరు, ప్రిలిమ్స్లో పొందిన మార్కులు, కుల ధ్రువీకరణపత్రం, తెల్లరేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణపత్రం, నివాస ధ్రువీకరణపత్రం, 40 శాతంపైన వికలత్వం ఉన్న దివ్యాంగులు ధ్రువీకరణపత్రం జత చేయాలని సూచించారు. హెల్ప్లైన్ నంబరు 1800–425–1877 ఫోన్ చేసి మరింత సమాచారం పొందవచ్చునని తెలిపారు. -
పీజీ తెలుగు ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ
కర్నూలు సిటీ: రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఎంఏ తెలుగుపై ఆసక్తి ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ప్రవేశ పరీక్షపై ఉచితంగా శిక్షణ ఇస్తామని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా.ఎన్ రంగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల28వ తేదీ నుంచి తెలుగు అధ్యాపకులు కె.రామలింగారెడ్డి, డా.ఎన్.బి లోకరాజు శిక్షణ ఇస్తారన్నారు. స్థానిక డాక్టర్స్ కాలనీ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో తరగతులుంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్చే ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఈనెల 27వ తేదీలోగా కాలేజీలో అందజేయాలని సూచించారు. -
పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ
అనంతపురం కల్చరల్ : లయన్స్ క్లబ్ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి స్థానిక లిటిల్ఫ్లవర్ పాఠశాలలో ఆర్ఆర్బీ, గ్రూప్-3 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు లయన్స్క్లబ్ మహిళా విభాగం నిర్వాహకురాలు విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు 40 రోజుల పాటు జరిగే ఉచిత శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నేడు గ్రూప్–2లో ఉచిత శిక్షణకు ఎంపికలు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్–2లో ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఈ నెల 19, 20వ తేదీల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ–వెలుగు పీడీ రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్కార్డులతో హాజరుకావాలన్నారు. ఎంపికైన వారికి హైదరాబాద్ నుంచి ప్రముఖ అధ్యాపకులచే ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా ఉచిత శిక్షణ తరగతులు ఇస్తామన్నారు. వివరాలకు 08518–277499, 8522083879, 8341581022, 9177016174 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
20న తిరుపతిలో స్క్రీనింగ్ టెస్ట్
అనంతపురం ఎడ్యుకేషన్ : గ్రూప్–1 (ప్రిలిమ్స్), గ్రూప్–2 నియామకపు పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు తిరుపతి బాలాజీనగర్లోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని ఆయన కోరారు. -
గ్రూప్స్కు చేయూత
ఉచితంగా శిక్షణ శిక్షకులుగా ఉద్యోగులు హిందూ రీడింగ్ రూం కమిటీ, ఆల్ ఇండియా సంఘ మిత్ర స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. నగరంలోని పలు కోచింగ్ సెంటర్లు గ్రూప్లకు శిక్షణ ఇస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్న తరుణంలో విశాఖ పాతనగరంలోని హిందూ రీడింగ్ రూం కమిటీ, ఆల్ ఇండియా సంఘ మిత్ర స్పోర్ట్స్ ఫౌండేషన్లు సంయుక్తంగా యువతకు ఉచితంగా వివిధ పోటీ పరీక్షలకు శి„ý ణ ఇస్తున్నాయి. గడిచిన ఆరు నెలలుగా గ్రూప్ 1, 2, 3, 4 పోటీ పరీక్షలతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచితంగా శి„ý ణ పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో డి.నంద, శ్రీకాంత్ అనే యువకులకు ఉద్యోగాలు లభించాయి. ఇక్కడ శిక్షణ పొందేందుకు దూర ప్రాంతాల వారు సైతం ముందుకు వస్తున్నారు. ఈ శిక్షణా శిబిరంలో కమర్షియల్ టాక్స్ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లాభాపేక్ష లేకుండా ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ వివిధ సబ్జెక్టులలో శిక్షణ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 6 గంటల వరకూ రీడింగ్ రూంలోని లైబ్రరీలో ఏర్పాటు చేసిన పోటీ పరీక్షల పుస్తకాలను చదువుకొంటూ, నోట్స్లను తయారు చేసుకుంటూ విద్యార్థులు పూర్తి స్థాయిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. పదిహేను మంది విద్యార్థులతో ప్రారంభమైన శిక్షణ నేడు 80 విద్యార్థులకు చేరుకుంది. –పాతపోస్టాఫీసు లాభాపేక్ష లేకుండా ఉచిత శిక్షణ కమర్షియల్ టాక్స్ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎటువంటి రుసుం తీసుకోకుండానే పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను విద్యార్థులకు అందిస్తున్నారు. శ్రీనివాసరావు (డీసీటీవో)–ఆధునిక చరిత్ర డి.రాంబాబు (డీసీటీవో–అనకాపల్లి)–చరిత్ర, కరెంట్ ఎఫైర్స్ సిహెచ్.గోవిందు (జూనియర్ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్)–మెంటల్ ఎబిలిటీ యల్లాజీరావు(లేబర్ ఆఫీసర్–విజయనగరం)–జనరల్ సైన్స్ దేముడుబాబు (ఉపాధ్యాయుడు–పెందుర్తి)–జాగ్రఫీ వీరితో పాటు మరికొందరు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడమే లక్ష్యం విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పించడమే లక్ష్యంగా గ్రూప్స్తో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన సిద్దార్థ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ పొందినవారిలో సుమారు 150 మంది ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్నారు. సివిల్స్పై యువతలో ఉన్న అపోహలు తొలగించి కుల, మత, వర్గ బేధాలు లేకుండా ఎవరైనా శిక్షణ పొంది మంచి ఉద్యోగాన్ని పొందవచ్చని నిరూపించడమే ధ్యేయంగా శిక్షణ ఇస్తున్నాం. –తమ్మిరెడ్డి శివశంకర్,డిప్యూటీ కమర్షియల్ టాక్స్ కమిషనర్–విశాఖపట్నం విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాం శిక్షణార్థం వస్తున్న విద్యార్థులందరికీ సొంత నిధులతో ఉచితంగా ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలతో పాటు స్టడీ మెటీరియల్ను అందిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు ఎన్ఏడీ కొత్తరోడ్డులో ఉన్న బొత్స స్క్వేర్లో ఉచిత వసతిని కల్పించాం. ఈ ఉచిత శిక్షణ ఎల్లకాలం కొనసాగుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నాం. శిక్షణ పొందాలనుకున్న విద్యార్థులు 94403 95763, 88852, 83225 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. –పాండ్రంగి రుక్మాకరరావు–ఆల్ ఇండియా సంఘమిత్ర స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సివిల్స్ సాధించడమే లక్ష్యం రీడింగ్ రూంలో ఉచితంగా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వచ్చి గ్రూప్స్నకు శిక్షణ పొందుతున్నాను. శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ను కూడా ఉచితంగా అందించారు. లైబ్రరీలోని పుస్తకాలను చదువుకొంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. –బి.కష్ణవేణి–అలమండ మంచి శిక్షణ ఇస్తున్నారు వేలాది రూపాయల ఖర్చయ్యే గ్రూప్స్ శిక్షణను ఉచితంగా అందించడం ఆనందంగా ఉంది. నాన్న చనిపోయిన తరువాత అమ్మ టైలరింగ్ చేస్తూ నన్ను చదివించింది. అమ్మ రుణం తీర్చుకోడానికైనా గ్రూప్స్లో విజయం సాధిస్తాను. ఇక్కడకు రాకముందు బ్యాంకులకు సంబంధించిన పరీక్షలు రాశాను. ఇక్కడకు వచ్చిన తరువాత గ్రూప్స్ ఎలాఅయినా పాస్ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. –మీసాల భానుశ్రీ,విశాఖపట్నం శివశంకర్ మాస్టారే స్ఫూర్తి నాన్న కూలీపని చేసి నన్ను డిగ్రీ వరకూ చదివించారు. ఒకసారి శివశంకర్ మా ఊళ్లో చిన్న సమావేశం ఏర్పాటు చేసి గ్రూప్స్ గురించి తెలియజేయడంతో పాటు విశాఖపట్నం రీడింగ్ రూంలో ఇస్తున్న ఉచిత శిక్షణ గురించి తెలియజేయడంతో ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుతున్నాను. ఆయనే చెప్పకుండా ఉంటే ఈ శిక్షణ శిబిరం గురించి తెలిసేదికాదు. ఎం.తిరుపతిరావు,గుడ్డిప గ్రామం,రావికమతం మండలం సివిల్స్లో విజయం సాధిస్తాను శివశంకర్ ఇచ్చిన స్ఫూర్తితో గ్రూప్ 1లో విజయం సాధించాలన్న పట్టుదలతో శిక్షణ పొందుతున్నాను. గతంలో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నా.. ఇక్కడ ఇస్తున్న శిక్షణ ఎంతో మెరుగ్గా ఉంది. నాలాంటి వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది. పి.సురేష్–విశాఖపట్నం ఉద్యోగం సాధించాను ఇంజినీరింగ్ విభాగంలో ఉన్న నేను వివిధ పోటీ పరీక్షలకు ఇతర కోచింగ్ సెంటర్లద్వారా వెళ్లినా ఫలితం దక్కలేదు. శివశంకర్ స్ఫూర్తితో గత ఆరు నెలలుగా ఇక్కడే శిక్షణ పొందాను. ప్రస్తుతం కువైట్లోని ఓ ప్రైవేటు కంపెనీ పెట్టిన పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించుకున్నాను. దినసరి కూలీగా పనిచేసి నా భవిష్యత్తు గురించి కలలు నా తండ్రి కలలు నెరవేర్చాను. శ్రీకాంత్–విశాఖపట్నం -
ఒకటి నుంచి నిరుద్యోగ యువతకు శిక్షణ
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ మచిలీపట్నం( చిలకలపూడి ) : నిరుద్యోగ ఎస్సీ యువతకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి వివిధ అంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. శిక్షణలో ఎక్కువమంది నిరుద్యోగులు ఉపయోగించుకొనేలా వారికి అవగాహన కల్పించాలని ఆయన చర్చి ఫాదర్లను కోరారు. బుధవారం ఆయన తన చాంబర్లో చర్చి ఫాదర్లతో సమావేశం నిర్వహించారు. ఈడీ మాట్లాడుతూ నిరుద్యోగ ఎస్సీ యువతీ, యువకులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఐదు నుంచి పదో తరగతి చదివిన ఎస్సీ యువకులకు వెల్డింగ్, ప్లంబింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్ తదితర అంశాలల్లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్మీడియట్ చదివిన యువకులకు రెస్టారెంట్లలో హోటల్ మేనేజ్మెంట్ రంగంలో శిక్షణ అందిస్తామన్నారు. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసినవారికి కాంట్రాక్టర్ ఎంటర్పెన్యుర్ డెవలప్మెంట్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ అంశంలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ మూడు అంశాలపై అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. వివరాల కోసం ఈ నెల 27న విజయవాడ లయోలా కళాశాలలో జరిగే యువసమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కువ మంది నిరుద్యోగ ఎస్సీ యువతీ, యువకులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చర్చి ఫాదర్లను కోరారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లావణ్య, సీనియర్ అసిస్టెంట్ దుర్గారావు, హోలీ బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఫౌండర్ వి.జాన్భాస్కరరావు, చర్చి ఫాదర్లు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఓబీసీలకు ఉచిత కోచింగ్
ఇప్పటివరకు ఉన్న రూ.20 వేల పరిమితిని ఎత్తివేసిన కేంద్రం న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే దళిత, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఇకపై ఉచిత కోచింగ్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న రూ. 20 వేల పరిమితిని ఎత్తివేస్తూ కోచింగ్ పథకాన్ని కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ సవరించింది. నాణ్యమైన శిక్షణనిచ్చే సంస్థలను ఎంపిక చేసి, వాటిలో చేరిన ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది. ‘ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణను ఉచితంగా అందించి, వారు మంచి ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సవరణ చేసింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు ఇచ్చే రూ.20 వేల పరిమితిని ఎత్తివేశారు. ఇకపై మొత్తం ఫీజు కేంద్రమే చెల్లిస్తుంది’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది,. సవరించిన నిబంధనల ప్రకారం.. కనీసం 5 నుంచి అత్యధికంగా 10 ప్రముఖ కోచింగ్ సెంటర్ల పేర్లను సూచించాలని రాష్ట్రాలను కేంద్రం కోరుతుంది. ఈ ప్రతిపాదనలను సెలక్షన్ కమిటీ పరిశీలిస్తుంది. గత రికార్డుల ఆధారంగా కోచింగ్ సెంటర్లను ఖరారు చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా శాఖలున్న సెంటర్లకు ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల లోపున్నవారికే పథకం వర్తిస్తుంది. ఉపకారవేతనం రూ.2,500 కు పెంపు పథకం మార్పులో భాగంగా కోచింగ్ తీసుకొనే అభ్యర్థులకు నెలనెలా ఇచ్చే ఉపకార వేతనాన్నీ పెంచారు. స్థానిక అభ్యర్థులకు రూ.1,500కు బదులు రూ.2,500 ఇస్తారు. ఇతరులకు రూ.3,000 బదులు రూ.5,000 అందిస్తారు. వైకల్యం ఉన్నవారికి రీడర్, ఎస్కాట్, హెల్పర్ అలవెన్స్లతో పాటు నెలకు రూ.2,000 స్పెషల్ అలవెన్స్ల కింద చెల్లిస్తారు. కోచింగ్ ఫీజుతో పాటు ఉపకార వేతనాన్నీ నేరుగా శిక్షణ కేంద్రాలకు అందిస్తారు. గ్రూప్-ఏ, బీ, యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలతో పాటు ఐఐటీ-జేఈఈ, సీశాట్ తదితర ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోచింగ్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఇవేకాకుండా శాట్, జీఆర్ఈ, జీమాట్, టొఫెల్ వంటి అర్హత పరీక్షలకు కూడా ఇది వర్తిస్తుంది. -
మైనార్టీలకు ఎస్సై మెయిన్స్కు ఉచిత శిక్షణ
హైదరాబాద్ : తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మెయిన్స్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ నీరజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన మైనార్టీ అభ్యర్ధులు ఉచిత శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్ధులు ఈ నెల 20 లోగా వెబ్సైట్ www.msc.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డెరైక్టర్ డి.కృష్ణ తెలిపారు. మెయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో ఉన్న ఎస్బీహెచ్ ఆర్సెటీ కేంద్రంలో ఈనెల 31 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కంప్యూటర్ బేసిక్స్ (30 రోజులు), బేసింగ్ ఫొటోగ్రాఫీ అండ్ వీడియోగ్రాఫీ (21 రోజులు), కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ బేసిక్ నెట్వర్కింగ్ (45 రోజులు) కోర్సుల్లో శిక్షణలు ఇస్తామన్నారు. 18 - 45 ఏళ్ల మధ్య వయసు కలిగి పదోతరగతి.. ఆపై చదివినవారు అర్హులని, ఆసక్తి ఉన్నవారు వెంటనే చిలుకూరు ప్రాంగణంలోని ఆర్సెటీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9000778300, 9985318452, 9866689089 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. -
పోలీసు ఉద్యోగాలకు పోలీస్ శాఖ ఉచిత శిక్షణ
యాకుత్పురా (హైదరాబాద్) : ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి తమ శాఖ ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు మీర్చౌక్ డివిజన్ ఏసీపీ ఎస్.గంగాధర్ సోమవారం వెల్లడించారు. డివిజన్లోని అర్హులైన అభ్యర్థులు డబీర్పురా పోలీస్స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ, కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కలిగి 167 సెం.మీ.ఎత్తున్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. డివిజన్ పరిధిలోని మొఘల్పురా, మీర్చౌక్, డబీర్పురా, రెయిన్బజార్ పోలీస్స్టేషన్ల పరిధిలో నివాసముండే అభ్యర్థులు ఈ నెల 5వ తేదీలోపు డబీర్పురా పోలీస్స్టేషన్లో దరఖాస్తులు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు డబీర్పురా (040-27854791), రెయిన్బజార్ (040-27854781), మీర్చౌక్ (040-27854797), మొఘల్పురా (040-27854783) స్టేషన్లలో సంప్రదించాలన్నారు. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
హైదరాబాద్ : నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కల్పించనున్నట్లు టెక్ మహీంద్రా ఫౌండేషన్ నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్మహీంద్రా ఫౌండేషన్ వారి సహకారంతో యుగాంతర్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన 18 నుంచి 27 సంవత్సరాలలోపు వయస్సు గల యువతి, యువకులకు మూడు నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ టైపింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి కోర్సులలో శిక్షణ అందించి శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూన్ 4వ తేదీ లోపు కూకట్పల్లి బస్టాప్ వద్ద గల శ్రీనివాస కాంప్లెక్స్లోని బాటాషోరూం పైన గల శిక్షణ శిబిరంలో గానీ, 8106630644 నెంబర్ను గానీ సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. -
ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ శిబిరం ముగింపు
టేకులపల్లి: ఖమ్మం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సింగరేణి కాలరీస్ కోయగూడెం ఓపెన్ కాస్టు ఆధ్వర్యంలో నెల రోజులుగా నిర్వహించిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఉచిత శిక్షణా శిబిరం సోమవారం ముగిసింది. ముగింపు సభలో ఇల్లెందు ఏరియా జీఎం వై.రాజేశ్వర్రెడ్డి, జడ్పీటీసీ లక్కినేని సురేందర్రావు, సర్పంచ్ ఇస్లావత్ పార్వతి తదితరులు పాల్గొని అంకితభావంతో కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విలువైన స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేశారు. ఇప్పటి వరకు సింగరేణి కార్మికుల పిల్లలకు మాత్రమే ఉచిత శిక్షణ ఇస్తుండగా... తొలిసారిగా కార్మికేతరుల పిల్లలకు ఈ శిక్షణ శిబిరం నిర్వహించడం విశేషం. -
బీపీవో ఉద్యోగాలకు ఓయూలో ఉచిత శిక్షణ
హైదరాబాద్ : నిరుద్యోగ అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్లోని ఆంధ్రమహిళా సభ, లిటరసీ హౌస్లో బీపీవో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు హౌస్ కార్యదర్శి బి. నాగలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులకు బీపీవో వాయిస్, నాన్ వాయిస్ కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు ఎన్సీవీటీ సర్టిఫికెట్ను అందజేస్తామని చెప్పారు. పూర్తి వివరాలు 93978 24542 నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.