Gaganyaan
-
2027లో చంద్రయాన్–4
న్యూఢిల్లీ: చంద్రుడిపై శిలలను సేకరించి భూమిపైకి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్ను 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మిషన్లో భాగంగా రెండు వేర్వేరు ప్రయోగాలుంటాయన్నారు. ఎల్వీఎం–3 రాకెట్ ద్వారా ఐదు రకాల సాంకేతిక వస్తు సామాగ్రిని కక్ష్యలోకి పంపి, అక్కడే వాటిని అసెంబుల్ చేయిస్తారని వివరించారు. వచ్చే ఏడాది గగన్యాన్ మిషన్లో ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకలో ఇద్దరు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపి, తిరిగి సురక్షితంగా తీసుకువస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో గగన్యాన్ మానవరహిత మిషన్ లో భాగంగా వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపిస్తామన్నారు. దీంతోపాటు, 2026లో సముద్రయాన్లో భాగంగా ముగ్గురు శాస్త్రవేత్తలను 6 వేల మీటర్ల లోతులో సముద్రం అడుగు భాగానికి పంపిస్తామని వెల్లడించారు. వీరు సముద్రగర్భంలో వనరులు, కీలక, అరుదైన ఖనిజాల అన్వేషణతోపాటు, సముద్ర జీవజాలంపై పరిశోధనలు జరుపుతారని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 1969లో అవతరించగా మొదటి లాంఛ్ ప్యాడ్ రెండు దశాబ్దాల అనంతరం 1993లో కార్యరూపం దాల్చిందని చెప్పారు. మరో దశాబ్ద కాలం తర్వాత 2004లో రెండో లాంఛ్ ప్యాడ్ను నిర్మించామన్నారు. విస్తరణ, మౌలిక వనరుల కల్పన, పెట్టుబడుల విషయంలో ఇస్రో గణనీయమైన ప్రగతి సాధించిందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత అంతరిక్ష ఆర్థిక రంగ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుందని వివరించారు. దీనిని వచ్చే పదేళ్లలో 44 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లి, ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. -
గగన్యాన్ మిషన్లో పురోగతి
సూళ్లూరుపేట: భవిష్యత్తులో మానవ సహి త అంతరిక్ష ప్రయోగాలకు సన్నాహక ప్రా జెక్టుగా పేరొందిన గగన్యాన్–1 మిషన్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసింది. సంక్షిష్టమైన లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్ను క్రూ మాడ్యూ ల్తో విజయవంతంగా అను సంధానించింది. అనుసంధానం తర్వాత ఈ మాడ్యూల్ను మంగళవారం శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్సెంటర్కు తరలించినట్లు బెంగళూరులో ఇస్రో వారి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ బుధవారం ప్రకటించింది. మానవసహిత అంతరిక్ష ప్రయోగాల్లో తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఇస్రో తొలిసారిగా గగన్యాన్ పేరిట ఒక మానవరహిత ప్రయోగాన్ని చేపడుతున్న విషయం తెల్సిందే. ఈ మానవరహిత ప్రయోగం కోసమే తొలిసారిగా ఈ క్రూ మాడ్యూల్ను సిద్ధంచేస్తున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) లో రూపొందించిన క్రూ మాడ్యూల్ అప్రైటింగ్ సిస్టంను మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రపొల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ)లో ప్రొపల్షన్ సిస్టంతో అను సంధానించారు. క్రూ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం అనేది ఒక రియాక్షన్ కంట్రోల్ సిస్టం(ఆర్సీఎస్). అంటే క్రూ మాడ్యూల్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి స్వేచ్ఛగా వదిలేశాక భూమి దిశగా దిగొచ్చేటప్పుడు దాని వేగాన్ని నియంత్రించి పారాచూట్ల సాయంతో నెమ్మదిగా సముద్రం మీదకు దిగేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఇందులో ఇమ డ్చారు. కిందకు పడేటప్పుడు సూటిగా వచ్చేలా, అటు ఇటూ తిరక్కుండా, పల్టీలు కొట్టకుండా మూడురకాలుగా దాని భద్రతను చూడ టమే ఆర్సీఎస్ పని. వ్యోమనౌక నుంచి విడిపోయి అంతరిక్షంలోకి చేరుకునే టప్పు డు, తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు పారాచూట్లు విచ్చుకోకముందు ఆర్సీఎస్ను వాడతారు. -
చంద్రయాన్–4, గగన్యాన్పై ప్రత్యేక దృష్టి
తిరువనంతపురం/చెన్నై: చంద్రయాన్–4, గగన్యాన్ వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్గా నియమితులైన ప్రముఖ రాకెట్ సైంటిస్టు డాక్టర్ వి.నారాయణన్ చెప్పారు. ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. రాబోయే కాలంలో ఎన్నో ముఖ్యమైన మిషన్లు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను ఇస్రో చైర్మన్గా, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్’ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ఇస్రోకు గతంలో ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు నేతృత్వం వహించారని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో తాను భాగస్వామి కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇదొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇస్రో చైర్మన్గా తన నియామకంపై తొలుత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు. అన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని, పీఎంఓ సమాచారం చేరవేస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో ఇస్రో చేపడుతున్న ప్రయోగాలన్నీ విజయవంతం అవుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రయోగం గగన్యాన్ అని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్–02ను ప్రయోగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అమెరికాకు చెందిన వాణిజ్యపరమైన ఉపగ్రహాన్ని ఇస్రో మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నామని, అలాగే గగన్యాన్లో భాగంగా రాకెట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రయాన్–4లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలు సేకరించి తీసుకురావాలని సంకల్పించామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ మొదలైందని తెలిపారు. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం మన లక్ష్యమని, ఇందుకు ప్రధాని మోదీ ఇప్పటికే అనుమతి మంజూరు చేశారని వి.నారాయణన్ చెప్పారు. ఈ స్పేస్ స్టేషన్లో ఐదు మాడ్యూల్స్ ఉంటాయని, ఇందులో మొదటి మాడ్యూల్ను 2028లో ప్రయోగించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. నారాయణన్కు అభినందనల వెల్లువ ఇస్రో చైర్మన్గా నియమితులైన వి.నారాయణన్కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. తమిళనాడులో సాధారణ కుటుంబంలో జన్మించిన నారాయణన్ ఇస్రోకు చైర్మన్ కావడం సంతోషంగా ఉందన్నారు. నారాయణన్ నేతృత్వంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నాలుగు దశాబ్దాల అనుభవం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్ సమీపంలోని మేలకట్టు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో వి.నారాయణన్ జన్మించారు. తొమ్మిదో తరగతి వరకు ఆయనకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువులో రాణించారు. తమిళనాడులో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించారు. ఏఎంఐఈ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఐటీ–ఖరగ్పూర్లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చదివారు. 2021లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందారు. 1984లో ఇస్రోలో అడుగుపెట్టారు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో సేవలందించారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ అభివృద్ధికి కృషి చేశారు. ఎన్నో రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. రాకెట్, స్పేస్క్రాఫ్ట్ ప్రొపల్షన్ రంగంలో నారాయణన్కు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రయాన్–3 విజయానికి దోహదపడిన జాతీయస్థాయి నిపుణుల కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. ద్రవ, ఘన ఇంధన మోటార్లను రూపొందించడంలో నిపుణుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్పీఎస్సీ) డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ నెల 14న ఇస్రో చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. -
అంతరిక్ష కేంద్రం మీదుగా గగన్యాన్!
అంతరిక్షంలోకి చేరిన తొలి భారత వ్యోమగామిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించిన నలభై ఏళ్లకు మరో భారతీయుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టడం గర్వకారణమే. మానవ సహిత అంతరిక్ష యాత్ర (గగన్ యాన్ ) కోసం భారత్ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. బెంగళూరులో వీరికి రష్యా ఆధ్వర్యంలో శిక్షణ నడుస్తోంది. శుక్లాను ఐఎస్ఎస్ పైకి పంపే విషయాన్ని ప్రకటిస్తూ ఇస్రో ఆయన్ని గగన్ యాత్రి అని పిలిచింది. దీంతో ఈయనకూ, మనం సమీప భవిష్యత్తులో చేపట్టే గగన్ యాన్కూ సంబంధం ఉన్నట్లు స్పష్టమైంది. ఐఎస్ఎస్, గగన్ యాన్ రెండూ వేర్వేరు రకాల అంతరిక్ష యాత్రలు. కాకపోతే ఐఎస్ఎస్ అనుభవాలు గగన్ యాన్ కూ ఉపయోగపడవచ్చునని ఇస్రో భావిస్తూండవచ్చు.1969లో మనిషి తొలిసారి జాబిల్లిపై అడుగు పెట్టింది మొదలు మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు బోలెడన్ని జరిగాయి. భూమి చుట్టూ తిరుగు తున్న స్పేస్స్టేషన్లకు వ్యోమగాములను పంపుతూనే ఉన్నాం. ఇలాంటి ప్రయోగాలకు సాధారణంగా శక్తిమంతమైన రాకెట్లను వాడుతూంటారు. అంతరిక్ష నౌక ఐఎస్ఎస్కు అనుసంధానమై కొన్ని రోజులు లేదా వారాలపాటు ఉంటుంది. ఆ తరువాత భూమికి తిరిగి వస్తుంది. 1970లలో సోవియట్ ‘సాల్యూట్’, అమెరికా ‘స్కైలాబ్’ ప్రయోగా లతో అంతరిక్ష కేంద్రాల యుగం ప్రారంభమైంది. తరువాతి కాలంలో సోవియట్ యూనియన్ మరింత పెద్దదైన మిర్ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చివరగా అమెరికా, రష్యా, యూరప్ సంయుక్తంగా ఐఎస్ఎస్ను నిర్మించాయి. చైనా తియాన్ గాంగ్ పేరుతో ప్రత్యేకంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని పదేళ్లుగా నిర్మిస్తోంది. 2035 కల్లా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తామని భారత్ కూడా సంకల్పించడం విశేషం.భూ కక్ష్యలో తిరిగే అంతరిక్ష కేంద్రాన్ని చేరాలంటే శక్తిమంతమైన రాకెట్లు, మానవులను మోసుకెళ్లగల సామర్థ్యమున్న మంచి అంతరిక్ష నౌక అవసరం. ఇందుకు సోవియట్ యూనియన్ ‘సోయుజ్’, అమె రికా స్పేస్ షటిల్స్ తయారు చేసుకున్నాయి. ముప్ఫై ఏళ్లుగా వీటినే వాడుతున్నాయి. స్పేస్ షటిల్ రాకెట్ మాదిరిగా నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. అంతరిక్ష నౌక మాదిరిగా సమాంతరంగానూ దూసు కెళ్లగలదు. విమానం మాదిరి ల్యాండ్ కూడా కాగలదు. అయితే 2003లో స్పేస్ షటిల్ కొలంబియా ప్రమాదానికి గురై అందులో భారతీయ సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా మరణించింది మొదలు స్పేస్ షటిల్ల యుగం క్రమేపీ అంతరించింది. 2011 నాటికి పూర్తిగా నిలిపివేశారు. ఆ తరువాత కొన్నేళ్లకు ‘నాసా’ రష్యా తయారీ సోయుజ్ సాయంతో ఐఎస్ఎస్కు సరుకులు, వ్యోమగాములను రవాణా చేయడం మొదలుపెట్టింది. ప్రైవేట్రంగ ప్రవేశం...అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ కంపెనీలు పాల్గొనడం స్పేస్ షటిల్ కార్యక్రమం ముగిసిన తరువాతే మొదలైంది. దీర్ఘకాలిక అవస రాలను దృష్టిలో పెట్టుకుని నాసా అమెరికన్ కంపెనీల నిధులు, టెక్నా లజీల సాయంతో అంతరిక్ష రవాణా వ్యవస్థలను నిర్మించుకుంది. ఈ క్రమంలోనే ఐఎస్ఎస్కు సరుకులు, సిబ్బందిని రవాణా చేసే పని ప్రైవేట్ కంపెనీల పరమైంది. ఈ విధానం పుణ్యమా అని స్పేస్ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్(యూఎల్ఏ) వంటి పలు ప్రైవేట్ కంపె నీలు అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాయి. 2012 నుంచి తన ఫాల్కన్ రాకెట్ల ద్వారా పలు మార్లు ఐఎస్ఎస్కు సరుకులు రవాణా చేసిన తరువాత స్పేస్ఎక్స్ 2020లో మొదటిసారి సిబ్బంది రవాణా బాధ్యతను నిర్వర్తించింది. ఇంకోవైపు యూఎల్ఏ కూడా తన అట్లాస్ వీ రాకెట్ ద్వారా పలు కార్గో ట్రిప్లు విజయవంతంగా పూర్తి చేసి సిబ్బంది రవాణ చేపట్టింది. ఈ ఏడాది జూన్ లో భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ను ఐఎస్ఎస్కు మోసుకెళ్లిన స్టార్ లైనర్ యూఎల్ఏ తయారీనే. అయితే ఐఎస్ఎస్ చేరిన తరువాత ఈ స్టార్ లైనర్ మళ్లీ భూమ్మీదకు వచ్చే స్థితిలో లేనట్లు స్పష్టమైంది. థ్రస్టర్లలో సమస్యలు రావడంతో అది ఐఎస్ఎస్తోనే ఉండిపోయింది. శుభాంశూ శుక్లాను ఐఎస్ఎస్కు చేర్చే బాధ్యతను ఇస్రో ప్రైవేట్ కంపెనీ ‘ఆక్సియామ్ స్పేస్’కు అప్పగించింది. వాణిజ్య స్థాయిలో వ్యోమగాముల రవాణా చేపట్టగల సత్తా దీనికి ఉందని నాసా స్వయంగా సర్టిఫై చేసి ఉండటం గమనార్హం. అయితే ఆక్సియామ్కు సొంతంగా రాకెట్లు లేవు. స్పేస్ఎక్స్పై ఆధారపడుతోంది. 2021 మే నుంచి ఇప్పటివరకూ ఆక్సియామ్ మూడుసార్లు ఐఎస్ఎస్కు సిబ్బంది, సరుకులను రవాణా చేసింది. శుక్లాను మోసుకెళ్లడం నాలుగో మిషన్ అవుతుంది. కానీ ఆక్సియామ్, ఇస్రోల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందానికి లోబడి శుక్లా ఐఎస్ఎస్కు వెళతారా? లేక ఇస్రో – నాసాల ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా (సర్వీస్ ఛార్జీలు ఉన్నా లేకున్నా) వెళతారా? అన్నది స్పష్టం కాలేదు. 1984లో భారత్, సోవి యట్ యూనియన్ల మైత్రీ బంధానికి ప్రతీకగా రాకేశ్ శర్మ సోవియట్ అంతరిక్ష కేంద్రం సాల్యూట్కు వెళ్లారు. ఈ యాత్ర, శిక్షణలకు సంబంధించి సోవియట్ యూనియన్ కు భారత్ డబ్బు ఏమీ చెల్లించలేదు. సాల్యూట్ తరువాత వచ్చిన మిర్ పైకి సోవియట్ యూనియన్ 13 దేశాలకు చెందిన 104 మంది వ్యోమగాములను తీసుకెళ్లింది. 2001లో మిర్ కూలిపోయే ముందు వరకూ ఈ యాత్రలు జరిగాయి. చాలా యాత్రలకు ఆయా దేశాలు డబ్బులు చెల్లించడం గమనార్హం. 1990–2000 మధ్యకాలంలో నిర్మాణమైన ఐఎస్ఎస్లో భారత్కు భాగస్వామ్యం లేదు. వ్యోమగామిని పంపే అవకాశమూ రాలేదు. అప్పట్లో ఇస్రో, నాసాల మధ్య సంబంధాలు అంత బాగా లేవు. రష్యా నుంచి మనం క్రయోజెనిక్ ఇంజిన్లు తెచ్చుకోవడంపై పెద్ద వివాదమే నడుస్తుండేది. ఇస్రో కూడా తన ఉపగ్రహ కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. పైగా వనరుల కొరత ఇస్రోను బాధిస్తూండేది. ఇస్రో అజెండాలోకి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం చేరే సమయానికి ఐఎస్ఎస్ను సందర్శించే వారి జాబితా పెరిగిపోయింది. గత పాతికేళ్లలో 23 దేశాలకు చెందిన 280 మంది వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చారు. వీరిలో కొంతమంది రెండు, నాలుగు సార్లు కూడా వెళ్లడం గమ నార్హం. సునీతా విలియమ్స్నే ఉదాహరణగా తీసుకుంటే, ఆమె ఐఎస్ఎస్కు వెళ్లడం ఇది మూడోసారి. అమెరికా, రష్యాల వ్యోమగాములు సుమారు 220 మంది ఐఎస్ఎస్ వెళ్లిన వారిలో ఉండగా... మిగిలిన వాళ్లు జపాన్ , కెనెడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, యూకే, బెల్జియం, స్పెయిన్, స్వీడన్ , నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , బెల రూస్, మలేషియా, దక్షిణాఫ్రికా, కొరియా, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈలకు చెందినవారు. ఈ జాబితాలో 13 మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. ఆక్సియామ్ చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలోనూ నలుగురు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు.2018లో ఇస్రో గగన్యాన్పై పని మొదలుపెట్టినప్పుడు భార తీయ వ్యోమగామిని ఐఎస్ఎస్పైకి పంపాలన్న ఆలోచన లేదు. ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను యూరీ గగారిన్ స్పేస్ సెంటర్కు శిక్షణ కోసమని పంపారు. రష్యా అంతరిక్ష ప్రయోగసంస్థలతో కుదిరిన ఒప్పందంలోనూ మానవ సహిత అంతరిక్ష యానా నికి సంబంధించిన శిక్షణ ప్రస్తావన మాత్రమే ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ 2022లో భారత స్వాతంత్య్ర 75 సంవత్సరాల వేడుకల సందర్భంగా గగన్ యాన్ గడువు ఆచరణ సాధ్యం కానంత తక్కువ సమయానికి కుదించడంతో పరిస్థితి మారిపోయింది. అందుకేనేమో... ఏడాది తరువాత ఐఎస్ఎస్ ఆలోచన వచ్చింది. మోదీ అమెరికా పర్య టన సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు. అయితే గగన్ యాన్ యాత్ర కోసం ఐఎస్ఎస్కు వెళ్లాల్సిన అవసరమేదీ లేదు కానీ అంతరిక్ష యాత్రకు సంబంధించి వాస్తవిక అనుభవం గడించేందుకు మాత్రం ఉపయోగపడుతుంది. ఏమైనప్పటికీ... అంతరిక్షంలోకి చేరిన తొలి వ్యోమగామిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించిన నలభై ఏళ్లకు మరో భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నాడంటే, అది మనందరికీ గర్వకారణమే.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నాసా ప్రయోగానికి ‘గగన్యాన్’ వ్యోమగామి
న్యూఢిల్లీ: భారత్, అమెరికా ఉమ్మడిగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే దిశగా ముందడుగు పడింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగంలో పాలుపంచుకొనేందుకు ‘గగనయాన్’ మిషన్ వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లనున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్యాన్ ప్రయోగం కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిని ఐఎస్ఎస్కు పంపిచనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అమెరికాలో పర్యటించారు. ఉమ్మడి అంతరిక్ష ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చర్చించారు. ఉమ్మడి స్పేస్ మిషన్లలో భాగంగా 2024లో భారత వ్యోమగామిని ఐఎస్ఎస్కు పంపిస్తామని బైడెన్ ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు గగన్యాన్ మిషన్ కోసం భారత వైమానిక దళం నుంచి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములకు ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో అస్ట్రోనాట్స్ ట్రైనింగ్ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. -
‘ మోదీ అంతరిక్షంలోకి వెళ్లే ముందు.. మణిపూర్ వెళ్లాలి’
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. అంతరిక్షంలో వెళ్లే ముందు ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లిరావాలని అన్నారు. 2025లో భారత్ ప్రయోగించనున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’లో ప్రధాని మోదీని పంపిస్తామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపినట్లు ఓ మీడియా సంస్థ నివేదికను వెల్లడించింది.'Before he goes into space, the non-biological PM should go to Manipur': Jairam RameshRead @ANI Story | https://t.co/TSJfrNXiVO#JairamRamesh #PMModi #ManipurViolence pic.twitter.com/H8cumSd55V— ANI Digital (@ani_digital) July 4, 2024 దీనిపై జైరాం రమేష్ గురువారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ‘ప్రధాని మోదీ అంతరిక్షంలోకి వెళ్లేముందు. ఆయన మణిపూర్ రాష్ట్రానికి వెళ్లిరావాలి’ అని అన్నారు.‘ప్రధాని మోదీకి అనేక బాధ్యతలు ఉన్నప్పటికీ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్యాన్ అభివృద్ధిలో ఆయన్ను భాగస్వామిని చేయటంలో ఆసక్తిగా ఉన్నాం. ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) వ్యోమగామి శిక్షణ అందించటంలో సహకరిస్తాం. అంతరిక్షంలోకి ప్రధానిని పంపించే సత్తా సాధిస్తే.. మనందరికీ చాలా గర్వంగా ఉంటుంది’ అని సోమనాథ్ తెలిపినట్లు మీడియా నివేదికలో పేర్కొంది. -
గఘనయానులు...
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్లో పాల్గొనబోతున్న వ్యోమగాములంతా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులే. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాన్షు శుక్లా వృత్తిరీత్యా యుద్ధపైలెట్లు. వీరంతా గగన్యాన్ కోసం ఇప్పటికే రష్యాలో వ్యోమగాములుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. భారత్లోనూ ఇస్రో వీరికి కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తమ నలుగురు యుద్ధవిమాన పైలెట్లు గగన్యాన్లో భాగస్వాములు కావడం తమకెంతో గర్వకారణమని భారత వాయుసేన పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ‘సూపర్ ఫోర్’ గురించి... ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ భారత వాయుసేనలో యుద్ధవిమానాన్ని సుదీర్ఘకాలంపాటు నడిపిన అనుభవం ఉన్న పైలెట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈ నలుగురిలో ఒక్కడిగా ఎంపికయ్యారు. కేరళలోని తిరువజియాడ్లో 1976 ఆగస్ట్ 26న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో శిక్షణ పూర్తిచేసుకుని అక్కడే ‘స్క్వాడ్ ఆఫ్ హానర్’ను సాధించారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్విసెస్ స్టాఫ్ కాలేజీలో, తాంబరం ఎఫ్ఐఎస్లో చదువుకున్నారు. తర్వాత ఈయన 1998 డిసెంబర్19న ఇండియన్ ఎయిర్ఫోర్స్లో యుద్ధవిమాన పైలెట్గా విధుల్లో చేరారు. సుఖోయ్30ఎంకేఐ, మిగ్–21, మిగ్–29 ఇలా పలు రకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన దిట్ట. మొత్తంగా 3,000 గంటలకుపైగా యుద్ధవిమానాలను నడిపారు. కీలకమైన సుఖోయ్–30 స్క్వాడ్రాన్కు కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఎ’ కేటగిరీ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా, టెస్ట్ పైలెట్గా అనుభవం గడించారు. గగన్యాన్లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. నాయర్ భార్య లీనా మలయాళ సినీపరిశ్రమలో నటిగా పేరొందారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. గత నెల 17వ తేదీన వీరి వివాహం జరిగింది. ‘ మా ఆయనకు తొలి ఇండియన్ ఆస్ట్రోనాట్ వింగ్స్ దక్కడం కేరళ రాష్ట్రానికే గర్వకారణం’ అని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. వీళ్ల కుటుంబం కేరళలోని పాలక్కడ్ జిల్లా నెన్మరలో నివసిస్తోంది. నాయర్ను ఆస్ట్రోనాట్గా ప్రధాని ప్రకటించగానే నెన్మరలో పండగ వాతావరణం నెలకొంది. అజిత్ కృష్ణన్ అజిత్ కృష్ణన్ 1982లో చెన్నైలో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏలో శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని స్వోర్డ్ ఆఫ్ ఆనర్ పొందారు. రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించారు. ఈయన తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డీఎస్ఎస్సీలోనూ చదువుకున్నారు. 2003 జూన్లో భారత వాయుసేనలో పైలెట్గా చేరారు. ఫ్లయింగ్ ఇన్స్టక్టర్గా, టెస్ట్ పైలెట్గా ఉంటూ 2,900 గంటలపాటు యుద్ధ విమానాలను నడిపారు. సుఖోయ్, మిగ్, జాగ్వర్, డోర్నియర్, ఏఎన్–32 రకం విమానాలను నడిపారు. ఈ మిషన్లో అవసరం మేరకు గ్రూప్ కెప్టెన్ గా ఉంటారు. అంగద్ ప్రతాప్ అంగద్ ప్రతాప్ 1982లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏ పూర్వ విద్యార్ధే. 2004 డిసెంబర్లో భారత వాయుసేన దళాల్లో చేరారు. టెస్ట్ పైలెట్గా, ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా సేవలందించారు. దాదాపు 2,000 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. సుఖోయ్ 30 ఎంకేఐ, మిగ్–21, మిగ్–29, హాక్, డోర్నియర్, ఏఎన్–32సహా ఎన్నో రకాల విమానాలను సమర్థవంతంగా నడిపారు. గగన్యాన్ మిషన్లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. శుభాన్షు శుక్లా వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 1985లో జన్మించారు. ఎన్డీఏలో శిక్షణ పూర్తిచేసుకుని 2006 జూన్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పైలెట్గా చేరారు. ఫైటర్ కంబాట్ లీడర్గా, టెస్ట్ పైలెట్గా 2,000 గంటలపాటు యుద్ధవిమనాలు నడిపారు. భారత వాయుసేనలోని దాదాపు అన్నిరకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన నైపుణ్యం సాధించారు. ఈ నలుగురికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ సంస్థలో సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. గగన్యాన్లో ఈయన వింగ్ కమాండర్గా వ్యవహరిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత ‘సూపర్ ఫోర్’
తిరువనంతపురం: భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి తెర లేచింది. మన అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మిషన్లో పాల్గొని రోదసిలోకి వెళ్లున్న నలుగురు భారత వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతికి పరిచయం చేశారు. ఇందుకోసం ఎంపికైన గ్రూప్ కెపె్టన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా పేర్లను ఆయన స్వయంగా ప్రకటించారు. వీరు నలుగురూ భారత వాయుసేనకు చెందిన ఫైటర్ పైలట్లే. కేరళలోని తుంబలో ఉన్న విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వారికి ప్రతిష్టాత్మకమైన ‘ఆస్ట్రోనాట్ వింగ్స్’ను మోదీ ప్రదానం చేశారు. అనంతరం భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. దేశ అమృత తరానికి వారు అత్యుత్తమ ప్రతినిధులంటూ ప్రశంసించారు. ‘‘ఈ నలుగురు వ్యోమగాముల పేర్లు భారత విజయగాథలో శాశ్వతంగా నిలిచిపోతాయి. నాలుగు దశాబ్దాలుగా దేశం కంటున్న కలను వారు నిజం చేయనున్నారు’’ అంటూ కొనియాడారు. ‘‘వీళ్లు కేవలం నలుగురు వ్యక్తులో, నాలుగు పేర్లో కాదు. 140 కోట్ల మంది భారతీయుల కలలకు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవనున్న నాలుగు ప్రబల శక్తులు!’’ అన్నారు. గగన్యాన్ మిషన్ పూర్తిగా దేశీయంగా రూపుదిద్దుకుని మేకిన్ ఇండియాకు తార్కాణంగా నిలిచిందంటూ హర్షం వెలిబుచ్చారు. ఏ విధంగా చూసినా ఇది చరిత్రాత్మక మిషన్ అని చెప్పారు. ‘‘గతంలో భారతీయ వ్యోమగామి వేరే దేశం నుంచి విదేశీ రాకెట్లో రోదసీలోకి వెళ్లొచ్చారు. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత భారత్ అంతరిక్షంలో అడుగు పెట్టబోతోంది. ఈసారి టైమింగ్, కౌంట్డౌన్, రాకెట్తో సహా అన్నీ మనం స్వయంగా రూపొందించుకున్నవే. గగన్యాన్ మిషన్లో వినియోగిస్తున్న ఉపకరణాల్లో అత్యధికం భారత్లో తయారైనవే. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న స్వావలంబనకు తార్కాణమిది’’ అన్నారు. ఈ అమృత కాలంలో భారత వ్యోమగామి దేశీయ రాకెట్లో చంద్రునిపై దిగడం ఖాయమని జోస్యం చెప్పారు. అంతరిక్ష శక్తిగా భారత్ భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న ప్రగతి యువతలో శాస్త్రీయ జిజ్ఞాసను ఎంతగానో పెంపొందిస్తోందని, 21వ శతాబ్దిలో మనం ప్రపంచశక్తిగా ఎదిగేందుకు బాటలు పరుస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ఇస్రో సాధించిన పలు ఘన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘తొలి ప్రయత్నంలోనే అరుణగ్రహం చేరి అతి కొద్ది దేశాలకే పరిమితమైన అరుదైన ఘనత సాధించాం. ఒకే మిషన్లో 100కు పైగా ఉపగ్రహాలనూ రోదసిలోకి పంపాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా రికార్డు సృష్టించాం. ఆదిత్య ఎల్1ను భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టాం. ఇలాంటి విజయాలతో భావి అవకాశాలకు ఇస్రో సైంటిస్టుల బృందం నూతన ద్వారాలు తెరుస్తోంది. ఫలితంగా అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ వాణిజ్య హబ్గా మారనుంది. మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ రానున్న పదేళ్లలో ఐదింతలు పెరిగి 44 బిలియన్ డాలర్లకు చేరనుంది’’ అని చెప్పారు. ఇస్రో అంతరిక్ష మిషన్లలో మహిళా సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని మోదీ అన్నారు. చంద్రయాన్ మొదలు గగన్యాన్ దాకా ఏ ప్రాజెక్టునూ మహిళా శక్తి లేకుండా ఊహించుకోలేని పరిస్థితి ఉందన్నారు. 500 మందికి పైగా మహిళలు ఇస్రోలో నాయకత్వ స్థానాల్లో ఉన్నారంటూ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్, సీఎం పినరాయి విజయన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, సైంటిస్టులు తదితరులు పాల్గొన్నారు. వారిది మొక్కవోని దీక్ష గగన్యాన్కు సన్నద్ధమయ్యే క్రమంలో నలుగురు వ్యోమగాములూ అత్యంత కఠోరమైన శ్రమకోర్చారంటూ మోదీ ప్రశంసించారు. ‘‘అత్యంత కఠినమైన శారీరక, మానసిక పరిశ్రమతో పాటు యోగాభ్యాసం కూడా చేశారు. ఆ క్రమంలో ఎదురైన ఎన్నో సవాళ్లను మొక్కవోని పట్టుదలతో అధిగమించారు. రోదసి మిషన్ కోసం తమను తాము పరిపూర్ణంగా సన్నద్ధం చేసుకున్నారు’’ అన్నారు. వారు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు 13 నెలలు రష్యాలోనూ శిక్షణ పొందారు. మానవసహిత గగన్యాన్ మిషన్లో భాగంగా 2025లో ముగ్గురు వ్యోమగాములను రోదసిలో ని 400 కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్ష్యలోకి పంపి 3 రోజుల తర్వాత సురక్షితంగా వెనక్కు తీసుకురావాలన్నది ఇస్రో లక్ష్యం. ఇది విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. గగన్యాన్ మిషన్కు రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. హాయ్ వ్యోమమిత్రా గగన్యాన్ మిషన్ ప్రగతిని విక్రం సారబాయి స్పేస్ సెంటర్లో మోదీ సమీక్షించారు. మిషన్కు సంబంధించిన పలు అంశాలను సోమనాథ్తో పాటు ఇస్రో సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. మానవసహిత యాత్రకు ముందు గగన్యాన్లో భాగంగా రోదసిలోకి వెళ్లనున్న హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్రతో సరదాగా సంభాషించారు. మహిళ ఎందుకు లేదంటే... గగనయాన్ మిషన్కు ఎంపికైన నలుగురిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం ఆసక్తికరంగా మారింది. అంతరిక్ష యాత్రకు వ్యోమగాముల ఎంపిక ప్రక్రియే అందుకు కారణమని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మిషన్లకు టెస్ట్ పైలట్ల పూల్ నుంచి మాత్రమే వ్యోమగాముల ఎంపిక జరుగుతుంది. అత్యున్నత వైమానిక నైపుణ్యంతో పాటు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ నిబ్బరంగా వ్యవహరించగల సామర్థ్యం టెస్ట్ పైలట్ల సొంతం. గగన్యాన్ మిషన్కు ఎంపిక జరిపిన సమయంలో భారత టెస్ట్ పైలట్ల పూల్లో ఒక్క మహిళ కూడా లేరు. దాంతో గగన్యాన్ మిషన్లో మహిళా ప్రాతినిధ్యం లేకుండాపోయింది. భావి మిషన్లలో మహిళా వ్యోమగాములకు స్థానం దక్కుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. 3 ప్రాజెక్టులు జాతికి అంకితం సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో చేపట్టనున్న భారీ రాకెట్ ప్రయోగాల నిమిత్తం సుమారు రూ.1,800 కోట్లతో నిర్మించిన మూడు ఇస్రో సెంటర్లను మోదీ తుంబా నుంచి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లో పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ భవనం, ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్లో సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ భవనం, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ట్రైనోసిక్ విండ్ టన్నెల్ భవనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిద్వారా ఏటా 8 నుంచి 15 పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలతో పాటు మొదటి ప్రయోగ వేదికపై ఒకేసారి రెండు రాకెట్లను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది -
‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ టెస్టు సక్సెస్
చెన్నై: భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్యాన్ మిషన్లో మరో ముందడుగు పడింది. గగన్యాన్ ప్రయోగంలో భాగంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే ఎల్వీఎం3 లాంచ్ వెహికల్ తయారీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఈ లాంచ్ వెహికల్కు గుండెకాయ లాంటి ‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో బుధవారం వెల్లడించింది. తమ పరీక్షలో క్రయోజనిక్ ఇంజన్ పూర్తి సంతృప్తికరమైన పనితీరు కనబర్చిందని, అంతరిక్ష యాత్రలకు అర్హత సాధించిందని వెల్లడించింది. గగన్యాన్ యాత్రకు ఈ ఇంజన్ అనువైందని తేలినట్లు స్పష్టం చేసింది. పలు రకాల కఠిన పరీక్షల తర్వాత ఈ క్రయోజనిక్ ఇంజిన్ భద్రతా ప్రమాణపత్రాన్ని పొందిందని పేర్కొంది. మానవ రహిత గగన్యాన్–1 యాత్రను 2024లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే మానవ సహిత యాత్ర చేపట్టనున్నారు. ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేర్చి, మళ్లీ క్షేమంగా వెనక్కి తీసుకురావడం గగన్యాన్ మిషన్ లక్ష్యం. మొత్తం మూడు రోజుల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగంలో వ్యోమగాములను ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో అంతరిక్షంలోకి చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజనిక్ దశలు ఉంటాయి. ఈ క్రయోజనిక్ దశలో లాంచ్ వెహికల్ను గమ్యస్థానానికి చేర్చడంలో సీఈ20 ఇంజిన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఇంజన్పై ఏడో వాక్యూమ్ టెస్టును ఈ నెల 14న తమిళనాడు మహేంద్రగిరిలోని హై ఆలి్టట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. గగన్యాన్ మిషన్లో ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించామని బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ యాక్సెపె్టన్స్ టెస్టులు, ఫైర్ టెస్టులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. -
స్పేస్ రిఫార్మ్ ఇయర్గా 2024–25
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్), ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) ఆధ్వర్యంలో రాబోయే 14 నెలల్లో 30 ప్రయోగాలను నిర్వహించనున్నారు. 2024–25 ఆర్థిక ఏడాదిని గగన్యాన్ సంవత్సరంగా ప్రకటించి 7 గగన్యాన్ ప్రయోగాత్మక పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక రచించారు. అలాగే, స్కైరూట్ ఎయిరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన విక్రమ్–1టీబీడీ పేరుతో 4 ప్రయోగాలు, అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన అగ్నిబాన్–టీబీడీ పేరుతో 3 ప్రయోగాలు చేయనున్నారు. ఇస్రో పీఎస్ఎల్వీ సిరీస్లో 8 ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే ఈ ఏడాది జనవరి 1న పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగాన్ని పూర్తి చేశారు. వీటి తరువాత పీఎస్ఎల్వీ సీ58, సీ59, సీ61, సీ62, సీ63, పీఎస్ఎల్వీ ఎన్1, ఎన్2 పేరుతో 8 ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. జీఎస్ఎల్వీ సిరీస్లో ఈ నెల 17న జీఎ‹Üఎల్వీ ఎఫ్14, తరువాత ఎఫ్15, ఎఫ్16, ఎఫ్17 ప్రయోగాలను చేయడానికి సంసిద్ధమవుతున్నారు. ఎ‹Üఎస్ఎల్వీ సిరీస్లో డీ3, ఎస్1, ఎస్2 పేరుతో 3 ప్రయోగాలు, ఎల్వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా ఒక ప్రయోగంతో కలిసి ఈ ఏడాదిలో 30 ప్రయోగాలు చేయనున్నారు. కాబట్టి ఈ ఏడాదిని ‘స్పేస్ రిఫార్మ్ ఇయర్’గా ఇస్రో ప్రకటించింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో భాగంగా మార్చిలోపు అగ్నిబాన్, ఎస్ఎస్ఎల్వీ డీ3 ప్రయోగాలు చేయనున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి దాకా 26 ప్రయోగాలు చేయడానికి ఇస్రో ప్రణాళిక రచించింది. ఈ ఏడాది గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన 7 ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమైతే 2025 ఆఖరికి మానవుడిని అంతరిక్షంలోకి పంపించి క్షేమంగా భూమికి తీసుకువచ్చేందుకు ఇస్రోసమాయత్తమవుతోంది. -
‘గగన్యాన్’కు రెడీ
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిని గగన్యాన్ ప్రాజెక్టు సంవత్సరంగా పరిగణిస్తోందని, మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నామని సతీశ్ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలిపారు. శుక్రవారం షార్లో 75వ గణతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2025 నాటికి మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్–3, ఆదిత్య ఎల్–1 ప్రయోగాలతో 2023 ఇస్రో చరిత్రలో గుర్తుండిపోతుందన్నారు. ఈ ప్రయోగాలకు సంబంధించి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం ఇస్రోకు గిఫ్ట్ అని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్డే ఉత్సవాల్లో చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని పంపిన ఎల్వీఎం మార్క్–3 రాకెట్, ల్యాండర్, రోవర్ను ప్రదర్శించడం అభినందనీయ మన్నారు. కొత్త ఏడాదికి కానుకగా పీఎస్ఎల్వీ సీ58 ప్రయోగం నిర్వహించామని తెలిపారు. ఫిబ్రవరి రెండోవారంలో ఇన్శాట్–3 డీఎస్ ప్రయోగం నిర్వహించనున్నామని, ఈ ఏడాది మరో పది ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు. విద్యార్థులంతా స్పేస్ సైన్స్పై అవగాహన పెంచుకుని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. దేశంలో సామాన్యులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞా నాన్ని, సైన్యానికి విలువైన సమాచారాన్ని అందజేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇస్రో ఈ ఏడాది నుంచి వాణిజ్యపరంగానే కాకుండా ప్రైవేట్ స్పేస్ సంస్థలకు చెందిన ప్రయోగాలూ చేపడుతుందని రాజరాజన్ వెల్లడించారు. -
2040 కల్లా చందమామపై భారత వ్యోమగామి: ఇస్రో
తిరువనంతపురం: 2040 ఏడాదికల్లా చంద్రుడిపై భారతీయ వ్యోమగామి అడుగుపెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ మంగళవారం చెప్పారు. ‘‘వ్యోమగాములుగా తీర్చిదిద్దేందుకు నలుగురు భారత వాయుసేన పైలట్లను ఎంపికచేశాం. వారికి శిక్షణలో కొనసాగుతోంది. వ్యోమగాములను ముందు లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లోకి ప్రవేశపెట్టి సురక్షితంగా హిందూ మహాసముద్ర జలాల్లో దించుతాం’’ అని వెల్లడించారు. ‘‘గగన్యాన్ కోసం మనుషులు ప్రయాణించే హెచ్ఎల్వీఎం3 వ్యోమనౌక, క్రూ మాడ్యుల్ ఉండే ఆర్బిటల్ మాడ్యూల్, సరీ్వస్ మాడ్యల్, ప్రాణాధార వ్యవస్థలు కావాలి. ముందు మానవరహిత ప్రయోగాలను పూర్తిచేయాలి. ఒకే పోలికలు ఉండే రెండు మానవరహిత మిషన్లు(జీ1, జీ2), ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ పరీక్ష తదితరాలను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. చంద్రుడిని చేరాక సురక్షితంగా తిరిగొచ్చేందుకు వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యుల్(సీఎం) తయారీ, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది తప్పించుకునే క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్)లనూ అభివృద్ధిచేసుకోవాల్సి ఉంది’’ అని సోమనాథ్ చెప్పారు. -
గగన్యాన్లో మహిళా పైలట్లకు ప్రాధాన్యం
తిరువనంతపురం: గగన్యాన్ మిషన్లో భాగంగా చేపట్టే మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో మహిళా పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలకే ఇస్రో ప్రాధాన్యం ఇస్తుందని, భవిష్యత్తులో మహిళా వ్యోమగాములనే అంతరిక్షంలోకి పంపుతామని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రయోగించే మానవ రహిత గగన్యాన్ అంతరిక్ష నౌకలో మనిషిని పోలిన మహిళా హ్యూమనాయిడ్ను ఇస్రో పంపుతుందని తెలిపారు. 2025 నాటికి మానవ సహిత మిషన్ను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ కక్ష్యలోకి పంపుతామని, అది మూడు రోజుల తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి చేరుకుంటుందని వివరించారు. ప్రస్తుతానికి మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు దొరకనందున ఎయిర్ ఫోర్స్ ఫైటర్ టెస్ట్ పైలట్లనే అంతరిక్ష యాత్రకు ఎంపిక చేస్తున్నాం. మహిళా పైలట్లు అందుబాటులోకి వస్తే వారినే ఎంపిక చేసుకుంటాం. ఆ తర్వాత మహిళా సైంటిస్టుల వంతు. అప్పుడిక మహిళలకు ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’ అని సోమనాథ్ చెప్పారు. 2035 నాటికి పూర్తి స్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. శనివారం గగన్యాన్ యాత్రలో సన్నాహక పరీక్షల్లో భాగమైన క్రూ ఎస్కేప్ మాడ్యూల్ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. -
ISRO: ‘గగన’ విజయం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): మానవసహిత అంతరిక్ష ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ఆ ప్రయత్నంలో తొలి విజయం సాధించింది. విజయసోపానాల్లో తొలిమెట్టుగా భావిస్తున్న గగన్యాన్ ప్రాజెక్టు సన్నాహకాల్లో భాగంగా ఇస్రో చేపట్టిన మానవరహిత క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్) పరీక్ష విజయవంతమైంది. సతీష్ దవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక ఇందుకు వేదికైంది. ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 10 గంటలకు గగన్యాన్ టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) వాహకనౌకను విజయవంతంగా పరీక్షించారు. దాదాపు 16.9 కి.మీ.ల ఎత్తులో అందులోంచి క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్లు విడిపోయి వేర్వేరు పథాల్లో ప్రయాణించి బంగళాఖాతంలో సురక్షితంగా పడ్డాయి. క్రూ ఎస్కేప్ మాడ్యూల్ను డ్రోగ్ పారాచూట్లు సురక్షితంగా సముద్రజలాలపై ల్యాండ్ అయ్యేలా చేశాయి. మానవసహిత ప్రయోగాలు చేపట్టినపుడు అందులోని వ్యోమగాములను క్రూ మాడ్యూల్ ఎలా సురక్షితంగా బయటపడేయగలదన్న అంశాన్ని పరీక్షించేందుకే ఈ ఎస్కేప్ మాడ్యూల్ పరీక్ష చేశారు. 17 కిలోమీటర్ల ఎత్తుకెళ్లి తిరిగి సముద్రంలోకి .. టెస్టు వెహికల్ (టీవీ–డీ1) ప్రయోగాన్ని 10.10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు. ఇందులో భాగంగా సింగిల్ స్టేజీ ద్రవ ఇంధర రాకెట్(టీవీ–డీ1)పై క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్లను అమర్చారు. రాకెట్ను ప్రయోగించాక అత్యవసర స్థితి(అబార్ట్)ను సిములేట్ చేశారు. దీంతో రాకెట్ 11.7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్లు వేరువడటం ప్రారంభమైంది. రాకెట్ 16.6 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకున్నాక క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్లు రాకెట్ నుంచి విడివడి వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తూ బంగాళాఖాతంలో పడ్డాయి. అయితే క్రూ ఎస్కేప్ మాడ్యూల్ను సేకరించే ఉద్దేశంతో అది సురక్షితంగా సముద్రంలో పడేలా తొలుత రెండు డ్రోగ్ పారాచూట్లు విచ్చుకుని నెమ్మదిగా కిందకు దిగేందుకు సాయపడ్డాయి. తర్వాత మరో పెద్ద పారాచూట్ విచ్చుకుని ల్యాండింగ్ను దిగి్వజయం చేసింది. సమీప సముద్ర జలాల్లో ప్రత్యేక లాంచీలో వేచి ఉన్న కోస్టల్ నేవీ బలగాలు ఆ మాడ్యూల్ను సురక్షితంగా శ్రీహరికోటకు చేర్చారు. అయితే మానవ సహిత గగన్యాన్ ప్రయోగాలు భవిషత్తులో చేయడానికి ఇలాంటి ప్రయోగాలు మరో మూడు చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నాలుగోసారి క్రూ మాడ్యూల్లో వ్యోమగాములను పోలిన బొమ్మలను అమర్చి క్రూ ఎస్కేప్ మాడ్యూల్ను పరీక్షిస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత 2024 చివర్లో లేదా 2025 ప్రథమార్ధంలో మానవ సహిత ప్రయోగాలు చేయనున్నారు. గగన్యాన్ టీవీ–డీ1 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆనందం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మిషన్ డైరెక్టర్ శివకుమార్, డైరెక్టర్ సునీల్, వీఎస్ఎస్సి డైరెక్టర్ ఉన్ని కృష్ణన్నాయక్, డైరెక్టర్ నారాయణ పాల్గొన్నారు. గగన్యాన్ సాకారం దిశగా మరింత చేరువకు: ప్రధాని మోదీ ‘టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ–డీ1)’ పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించడంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘ ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టు సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు’ అంటూ వారిని అభినందిస్తూ ప్రధాని మోదీ శనివారం ట్వీట్లు చేశారు. మొదట తడబడినా.. మొదట శుక్రవారం రాత్రి ఏడింటికి మొదలైన 13 గంటల కౌంట్డౌన్ శనివారం ఉదయం 8 గంటలకు ముగిశాక ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో శనివారం తెల్లవారుజామున వర్షం పడడంతో వాతావరణం అనుకూలించని కారణంగా కౌంట్డౌన్ సమయాన్ని మరో 30 నిమిషాలు పెంచారు. తర్వాత 15 నిమిషాల వ్యవధిలోనే అంటే 8.15 గంటలకు రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేసి 8.45గంటలకు కౌంట్డౌన్ మొదలు పెట్టారు. హఠాత్తుగా ఇంజన్ను మండించే ప్రక్రియలో లోపం తలెత్తింది. దీంతో రాకెట్ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లకుండా ఆగిపోయింది. దీంతో ప్రయోగాన్ని ఆటో మేటిక్ లాంచ్ సీక్వెన్స్లోని ఆన్ బోర్డు కంప్యూటర్ ఆపేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రయోగం వాయిదా వేసినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అయితే దీన్ని సవాల్గా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తల టైగర్ సేఫ్టే బృందం వెంటనే లాంచ్ ప్యాడ్ వద్దకు వెళ్లి సాంకేతిక లోపాన్ని సరిచేసింది. దీంతో మళ్లీ 9.33 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించారు. ఎట్టకేలకు 10.03 గంటలకు గగన్యాన్ టీవీ–డీ1 విజయవంతంగా ప్రయోగించారు. 10 నిమిషాల 10 సెకన్లలో మొత్తం ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. -
ఇస్రో బృందానికి సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: టెస్ట్ వెహికల్ ఫ్లైట్ టీవీ-డీ1 సక్సెస్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందానికి సీఎం అభినందనలు తెలిపారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో మరింత ఎత్తైన కక్ష్యలోకి ఇస్రో దూసుకెళ్లోందంటూ సీఎం జగన్ కొనియాడారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్యాన్ మిషన్లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’(టీవీ-డీ1) ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్ల సాయంతో కిందకు సురక్షితంగా ల్యాండ్(సముద్రంలోకి) అయ్యింది. గగన్యాన్లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం సక్సెస్ కావడం పట్ల.. ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: ఇస్రో ‘గగన్యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్ -
ఇస్రో టీమ్ కు సీఎం జగన్ అభినందనలు
-
గగన్ యాన్ టెస్ట్ లాంచ్ విజయవంతం
-
ఇస్రో గగన్ యాన్ ప్రయోగం..దూసుకెళ్లిన TV-D1 రాకెట్
-
సాంకేతిక లోపంతో గగన్ యాన్ TV D1 ప్రయోగం నిలిపివేత
-
‘గగన్యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్
సాక్షి, శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్యాన్ మిషన్లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’(టీవీ-డీ1)ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్ల సాయంతో కిందకు సురక్షితంగా ల్యాండ్(సముద్రంలోకి) అయ్యింది. గగన్యాన్లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం సక్సెస్ కావడం పట్ల.. ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. #WATCH | Sriharikota: ISRO launches test flight for Gaganyaan mission ISRO says "Mission going as planned" pic.twitter.com/2mWyLYAVCS — ANI (@ANI) October 21, 2023 గగన్యాన్ టెస్ట్ లాంచ్ విజయవంతం అయ్యిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. టీవీ-డీ1 మిషన్ను విజయవంతంగా పరీక్షించాం. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగాం. తొలుత సాంకేతిక లోపం రాగానే వెంటనే గుర్తించాం. దాని సరిచేసి మళ్లీ ప్రయోగించాం. పారాచ్యూట్లు సమయానికి తెరుచుకున్నాయి. క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది అని వెల్లడించారాయన. టీవీ-డీ1 ఎందుకంటే.. గగన్యాన్కు ముందు ఇస్రో 4 పరీక్షలు నిర్వహించాలనుకుంది. అందులో టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్(టీవీ-డీ1) మొదటిది. 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ అది పరిమితస్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షిస్తున్నారు. దీని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతుంది. ఇందులో క్రూ(వ్యోమగాముల) ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ పరీక్షిస్తుంది. అంతరాయం తర్వాత.. తొలుత టీవీ-డీ1 ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకు చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించగా.. ఈ సన్నాహక పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. Reason for the launch hold is identified and corrected. The launch is planned at 10:00 Hrs. today. — ISRO (@isro) October 21, 2023 ఎందుకు కీలకం అంటే.. వ్యోమగాములతో వెళ్లే రాకెట్లో ఏదైనా లోపం ఎదురైతే వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో.. వారు కూర్చొనే క్రూ మాడ్యూల్ను రాకెట్ నుంచి వేరు చేసి, సురక్షితంగా కిందకి తీసుకురావాలి. దీన్ని క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్) అంటారు. అంటే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వ్యవస్థ సమర్థతను ఇప్పుడు పరీక్షిస్తున్నారు. క్రూ మాడ్యూల్ను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థలో పది పారాచూట్లు ఉంటాయి. Best wishes Team #ISRO! Moving one step closer to India’s first Human Space Mission, the critical phase of preparation begins for #Gaganyaan with first Test Vehicle Flight TV-D1 scheduled for October 21, 2023, at 0800 Hrs IST from the SDSC-SHAR Launchpad, Sriharikota. pic.twitter.com/QCu2dawts1 — Dr Jitendra Singh (@DrJitendraSingh) October 20, 2023 ప్రస్తుతానికి మానవరహితంగానే.. భవిష్యత్లో ఇవాళ ప్రయోగించిన క్రూ మాడ్యూల్లో వ్యోమగాములు పయనిస్తారు. కానీ, ఇవాళ మాత్రం మానవరహితంగానే ప్రయోగం జరిపింది ఇస్రో. గన్యాన్ ఉద్దేశం.. గగన్యాన్లో ముగ్గురు వ్యోమగాముల్ని 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. మూడు రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. నేటి పరీక్ష ఇలా జరిగింది.. రాకెట్ నింగిలోకి బయల్దేరాక ఇస్రో శాస్త్రవేత్తలు ‘అబార్ట్’ సంకేతాన్ని పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. సింగిల్ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని.. 531.8 సెకన్లలో(8.85 నిమిషాల్లో) పూర్తి చేశారు. -
సర్వం సిద్ధం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) శనివారం ఉదయం మొట్టమొదటగా ప్రయోగించనున్న గగన్యాన్ టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) ప్రయోగానికి శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు కౌంట్డౌన్ మొదలైంది. 12.30 గంటల కౌంట్డౌన్ అనంతరం శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దం చేశారు. షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి సింగిల్ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. 531.8 సెకన్లకు ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు. టీవీ–డీ1ను 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి రాకెట్ శిఖరభాగాన అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం భూమికి 17 కిలోమీటర్లు దూరంలో అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 ప్యారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో దించి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కోస్టల్ నేవీ సిబ్బంది ఒక ప్రత్యేక బోట్లో వేచి ఉండి సముద్రంలో క్రూమాడ్యూల్ పడిన తరువాత దాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. భవిష్యత్తులో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను పరిశీలించే ప్రయోగం ఇదే కావడం విశేషం. -
శనివారం గగన్ యాన్ ఎక్స్ పె రిమెంటల్ తొలి ప్రయోగం
-
2040నాటికి చంద్రునిపైకి వ్యోమగామి..సరికొత్త లక్ష్యాలతో భారత్
న్యూఢిల్లీ: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను (చంద్రయాన్-3) ల్యాండ్ చేసిన తొలి దేశంగా అవతరించిన ఇండియా అంతరిక్షం, పరిశోధనలు విషయంలో మరింత వేగం పెంచింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కార్ సరికొత్త వ్యూహంతో దూసుకుపోనుంది. 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపే లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఆదేశాలు జారీ చేశారని కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ గగన్యాన్ మిషన్ పురోగతి, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశాశం జరిగింది. ఈ సందర్బంగా మోదీ భవిష్యత్తు రోదసి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రానికి ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి సంబంధించిన ప్రణాళికలతో సహా సరికొత్త వ్యూహంతో సాగాలని ఆదేశించారు. సొంత 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (ఇండియన్ స్పేస్ స్టేషన్) ఏర్పాటుతోపాటు చంద్రునిపైకి తొలి భారతీయుడిని పంపడం లాంటి సరికొత్త ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఆయన కోరారు. అలాగే వీనస్,అంగారక గ్రహాలకు సంబంధించిన మిషన్లపై పనిచేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇస్రో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న స్పేస్ డిపార్ట్మెంట్ భారత భావి చంద్ర మిషన్ల కోసం రోడ్మ్యాప్ను అభివృద్ధి చేయాలని తదుపరి తరం లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)అభివృద్ధి, రిటర్న్ మిషన్లను చేపట్టడానికి సన్నద్ధం కావాలని ప్రధాని శాస్త్రవేత్తలకు సూచించారు. కొత్త లాంచ్ ప్యాడ్, మానవ-కేంద్రీకృత ప్రయోగశాలలు, అనుబంధ సాంకేతికతలను ఏర్పాటు చేయాలన్నారు. కాగా ఇస్రో ఆధ్వర్యంలో చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్నిచేపట్టింది. ఈ మిషన్లోపీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపించిన సంగతి తెలిసిందే. మరోవైపు గగన్యాన్ మిషన్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించిన తొలి మానవరహిత విమాన టెస్టింగ్ ఈనెల(అక్టోబర్) 21న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరగనుంది. గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది మానవ అంతరిక్ష యాత్రల నిర్వహణలో భారతదేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలవనుంది. ఈ మూడు రోజుల మిషన్లో 400 కి.మీ కక్ష్యలో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షయాత్ర చేయనున్నారు. కాగా గగన్యాన్ మిషన్ మనుషులను సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి మానవ రేటింగ్ పొందిన ప్రయోగ వాహనం. ఇది అంతరిక్షంలోని వ్యోమగాములకు భూమి తరహా పర్యావరణాన్ని అందించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, అత్యవసర ఎస్కేప్ సదుపాయంతోపాటు పలు క్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధి చేయనుంది. మానవ అంతరిక్ష విమాన మిషన్ ప్రయోగంలో ముందుగా మిషన్ సాంకేతిక సంసిద్ధత స్థాయిలను ప్రదర్శించనున్నామని అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ డెమోన్స్ట్రేటర్ మిషన్లలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ), ప్యాడ్ అబార్ట్ టెస్ట్ (పీఏటీ) టెస్ట్ వెహికల్ (టీవీ) విమానాలు ఉన్నాయి. టీవీ-డీ1 పరీక్ష వాహనం ఈ అబార్ట్ మిషన్ కోసం అభివృద్ధి చేసిన ఏక దశ లిక్విడ్ రాకెట్. పేలోడ్లలో క్రూ మాడ్యూల్ (సీఎం), క్రూ ఎస్కేప్ సిస్టమ్లు (సీఈఎస్) వాటి వేగవంతమైన సాలిడ్ మోటార్లతో పాటు సీఎం ఫెయిరింగ్ (సీఎంఎప్), ఇంటర్ఫేస్ అడాప్టర్లు ఉంటాయి. ఈ ఫ్లైట్ గగన్యాన్ మిషన్లో మాదిరి మ్యాక్ నంబర్ 1.2కి అనుగుణంగా ఆరోహణ పథంలో అబార్ట్ స్థితిని అనుసరిస్తుంది. సిఎంతో కూడిన సీఇఎస్ పరీక్ష వాహనం నుండి సుమారు 17 కి.మీ ఎత్తులో వేరు అవుతుంది. తదనంతరం అబార్ట్ సీక్వెన్స్ స్వయంప్రతిపత్తితో పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పడు సీఈఎస్ని వేరు చేయడం, పారాచూట్ల శ్రేణిని మోహరించడం మొదలవుతుంది చివరకు శ్రీహరికోట తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో సురక్షిత టచ్డౌన్తో ప్రయోగం ముగుస్తుంది’అని అంతరిక్ష సంస్థ వెల్లడించింది. TV-D1 Flight Test: The test is scheduled for October 21, 2023, at 0800 Hrs. IST from the First launchpad at SDSC-SHAR, Sriharikota. It will be a short-duration mission and the visibility from the Launch View Gallery (LVG) will be limited. Students and the Public can witness… pic.twitter.com/MROzlmPjRa — ISRO (@isro) October 17, 2023 -
అక్టోబర్ 21న తొలి టెస్ట్ ఫ్లైట్.. గగన్యాన్పై మోదీ సమీక్ష
అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టులో కీలకమైన తొలి ఫైట్ టెస్ట్ వెహికల్ అబోర్ట్ మిషన్-(టీవీ-డీ1)ను అక్టోబర్ 21న ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఫైట్ టెస్ట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశ్యం.. TV-D1 క్రూ మాడ్యూల్ను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపడం, తిరిగి దానిని భూమికి తీసుకురావడం. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్లను రాకెట్ సాయంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వ చ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడ్నుంచి వ్యోమగాములు పారాచూట్ల సాయంతో శ్రీహరి కోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. 🚨 ISRO's Gaganyaan mission first flight test TV-D1 is scheduled on 7-9 am October 21, 2023. pic.twitter.com/i1SJgVm0HZ — Indian Tech & Infra (@IndianTechGuide) October 16, 2023 ఎల్వీఎం3 రాకె ట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యుల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదిలో ప్రయోగించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. మూడు అన్ క్రూడ్ మిషన్లతో సహా దాదాపు 20 ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా గన్యాన్ మిషన్ పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మిషన్ సంసిద్ధత, భారత అంతరిక్ష ప్రయోగాల భవిష్యత్తుపై ఇస్రో చైర్మన్ సోమనాథ్తోపాటు ఇతర అధికారులతో సమీక్ష జరిగింది. -
గగన్యాన్లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పరీక్షలకు సిద్ధమైంది. ఈ మిషన్లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి మానవరహిత ఫ్లైట్ టెస్ట్ల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరుకి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్–1(టీవీ–డీ1)ను ప్రయోగించనుంది. మానవ రహిత ప్రయోగాలతో సామర్థ్య నిర్ధారణ చేస్తే మానవసహిత ప్రయోగాలకు సోపానం కానున్నాయి. గగన్యాన్ మిషన్లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అంతరిక్షం నుంచి వ్యోమగాములను తిరిగి భూమిపైకి సురక్షితంగా దిగడానికి క్రూ ఎస్కేప్ వ్యవస్థ సాయపడుతుంది. డీవీ–డీ1ను ప్రయోగించడంలో పీడన రహిత క్రూ మాడ్యుల్ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్లను రాకెట్ సా యంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వ చ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడ్నుంచి వ్యోమగాములు పారాచూట్ల సాయంతో శ్రీహరి కోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. ఎల్వీఎం3 రాకె ట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యుల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది. -
రోదసీలోకి మనిషిని పంపడంపై ఇస్రో దృష్టి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): రానున్న రెండు మూడేళ్లలో రోదసీలోకి వ్యోమగాములను పంపించి వారిని సురక్షితంగా భూమి పైకి తెచ్చే గగన్యాన్–1(మ్యాన్ మిషన్) ప్రయోగాన్ని నిర్వహించే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ మూడో వారంలో గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంగా పిలవబడే ఒక ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రుడిపై పరిశోధనలను విజయవంతంగా చేసిన అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు గగన్యాన్ ప్రయోగాన్ని నిర్వహించే పనిలో అనేక ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్థారించుకుంటున్నారు. ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా గగన్యాన్ ప్రయోగాన్ని నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. ఎల్వీఎం3 రాకెట్ ద్వారా 8,200 కిలోలు బరువున్న క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టం పేరుతో ప్రయోగాన్ని నిర్వహించే యత్నం చేస్తున్నారు. 3.25 వెడల్పు, 3.58 పొడవుతో క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను రూపొందించారు. ఈ మాడ్యూల్ను లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టి ఏడు రోజుల తర్వాత మళ్లీ కిందకు.. అంటే భూమికి సురక్షితంగా తీసుకొచ్చే ప్రక్రియను నిర్వహిస్తారు. చంద్రయాన్–3లో విక్రమ్ ల్యాండర్ను దిగిన చోటు నుంచి మరో చోటుకు తరలించే ప్రయత్నాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించడంతో, భవిష్యత్తులో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపి తిరిగి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని వారు చెప్పిన విషయం తెలిసిందే. క్రూమాడ్యూల్ సిస్టంను కూడా లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపి తిరిగి భూమికి తీసుకొచ్చే సమయంలో మిషన్ విఫలమయ్యే పరిస్థితి సంభవిస్తే.. వ్యోమగాములు సురక్షితంగా బయటపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్థారించుకునేందుకు గగన్యాన్ ప్రయోగాత్మక ప్రయోగం ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా రెండు ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాలు చేశాక గగయాన్ సిరీస్లో మ్యాన్ మిషన్ ప్రయోగానికి సిద్ధమవుతామని ఇస్రో శాస్త్రవేత్తలంటున్నారు. వ్యోమగాములను రోదసీలోకి పంపి తిరిగి క్షేమంగా తీసుకురావడమే ఇస్రో ముందున్న లక్ష్యమని వారు చెబుతున్నారు. -
ఇస్రో అదుర్స్.. మానవరహిత గగన్యాన్ మిషన్!
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టబోయే గగన్యాన్ మిషన్ మానవరహితమనే ప్రకటన వెలువడింది. ఇందుకోసం ప్రత్యేక మహిళా రోబోట్ 'వ్యోమిత్ర'ను పంపనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అక్టోబర్ రెండవ వారంలో ట్రయల్ స్పేస్ ఫ్లైట్ను ప్రయోగిస్తామని చెప్పారు. తదుపరి మిషన్లో మహిళా రోబో "వ్యోమిత్ర"ను అంతరిక్షంలోకి పంపనున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా గగన్యాన్ ప్రాజెక్టు ఆలస్యం అయిందని చెప్పారు. రెండో మిషన్లో భాగంగా పంపే మహిళా రోబోట్ మానవునితో సమానంగా మాట్లాడుతుందని చెప్పారు. అంతా సవ్యంగా సాగితే ముందుకు వెళతామని అన్నారు. చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరడం ఎంతో ఉపషమనం కలిగించిందని చెప్పారు. ప్రయోగాన్ని దగ్గర నుంచి చూసినవారు ఆందోళనకు గురయ్యారు. భూ కక్ష్య నుంచి చంద్రుని కక్ష్యకు ప్రయోగం చేరినప్పుడు తాను మొదటిసారి ఆందోళన చెందినట్లు చెప్పుకొచ్చారు. అంతరిక్ష రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ చేయూతనిచ్చారని అన్నారు. దాదాపుగా 2019 వరకు శ్రీహరికోట సందర్శనార్థం మూసి ఉండేది.. కానీ ప్రస్తుతం మీడియాకు, విద్యార్థులను ఆహ్వానిస్తోందని చెప్పారు. ఆ సంపద ఈ దేశ ప్రజలదని పేర్కొన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని మొదటి దేశం భారత్ అని అన్నారు. గగన్యాన్ ఉద్దేశం: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఆఖరు నాటికి గగన్యాన్ ప్రయోగంలో భాగంగా మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇందులో 400 కి.మీ కక్ష్యలో ముగ్గురు సభ్యులను మూడు రోజులపాటు అంతరిక్ష ప్రయాణాన్ని చేపట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. భారతీయ సముద్ర జలాల్లో ల్యాండ్ చేయడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావాలని భావిస్తున్నారు. ఎల్వీఎం3ని లాంచ్ వెహికిల్గా ఉపయోగించనున్నారు. ఇదీ చదవండి: PM Modi Gets Emotional: చంద్రయాన్ 3 విజయోత్సవాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం.. -
‘గగన్యాన్’లో మరో కీలక పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి మరో కీలక పరీక్ష విజయవంతమైంది. ఈ నెల 8వ తేదీన డ్రోగ్ ప్యారాచూట్లకు ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో శుక్రవారం తన వెబ్సైట్లో పేర్కొంది. గగన్యాన్ మిషన్లో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సురక్షితంగా భూమికి చేరుకునేందుకు డ్రోగ్ ప్యారాచూట్ విస్తరణ పరీక్షల అవసరం ఉందని తెలిపింది. క్రూ మాడ్యూల్ను స్థిరీకరించడానికి, రీ–ఎంట్రీ సమయంలో దాని వేగాన్ని తగ్గించి సురక్షితంగా తీసుకురావడానికి ఈ ప్యారాచూట్ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించింది. గగన్యాన్ క్రూ మాడ్యూల్ మందగింపు వ్యవస్థ కోసం సంక్లిష్టమైన ప్యారాచూట్ స్వీకెన్స్లో మొత్తం 10 వరకు ఉంటాయని పేర్కొంది. గగన్యాన్ ప్రయోగంలో క్రూ మాడ్యూల్ను అంతరిక్షంలోకి పంపించి, దానిని మళ్లీ భూమి మీదకు తీసుకువచ్చేందుకు, సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు ఈ ప్యారాచూట్లు కీలక పాత్ర పోషిస్తాయని, అందుకు వీటి పనితనాన్ని పరీక్షించుకుని నిర్ధారించుకుంటున్నామని ఇస్రో వివరించింది. -
గగన్యాన్ మాడ్యూల్ ప్రొపల్షన్ పరీక్షలు విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో గగన్యాన్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం (జీఎంపీఎ‹)తో మరో రెండు హాట్ టెస్ట్లను విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో ప్రకటించింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్(ఎస్ఎంపీఎస్)ను బెంగళూరులోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, వలియామల, తిరువనంతపురంలలో డిజైన్ చేసి, అభివృద్ధి పరిచారు. ఈ తరహాలో మొదటి హాట్ టెస్ట్ను ఈనెల 19న నిర్వహించారు. పేజ్–2 టెస్ట్ సిరీస్లో రెండు, మూడు హాట్ టెస్ట్లను బుధవారం చేపట్టి వాటి సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. 723.6 సెకెండ్ల పాటు సాగిన ప్రారంభ హాట్టెస్ట్ ఆర్బిటల్ మాడ్యూల్ ఇంజెక్షన్, 100 ఎన్ థ్రస్ట్లు లిక్విడ్ అపోజిమోటార్ (ఎల్ఏఎం) ఇంజిన్ల కాలిబ్రేషన్ బర్న్ను ప్రదర్శించారు. నాన్ అపరేషన్ ఇంజిన్ను గుర్తించి, వేరు చేయడానికి కాలిబరేషన్ బర్న్ అవసరమైంది. లామ్ ఇంజిన్ల రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లు ఊహించిన విధంగా పనిచేయడంతో ఈ పరీక్షలు విజయవంతమై’నట్లు ఇస్రో ప్రకటించింది. -
గగన్యాన్ ఎస్ఎంపీఎస్ పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట: గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రపొల్షన్ సిస్టం (ఎస్ఎంపీఎస్)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రోకు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఈ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్టుగా గురువారం ఇస్రో ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్షలో 440 ఎన్ థ్రస్ట్తో ఐదు లిక్విడ్ అపోజి మోటార్ ఇంజిన్లు, 100 ఎన్ థ్రస్ట్తో 16 రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్ట్ర్లను పరీక్షించారు. గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్కు 440 ఎన్ ఇంజిన్లు మిషన్ ఆరోహణ దశలో ప్రధాన చోదకశక్తిని అందిస్తాయి. సుమారు 250 సెకెండ్లపాటు నిర్వహించిన పరీక్షలో లిక్విడ్ అపోజి మోటార్ ఇంజిన్లు, రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లను పరీక్షించి సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. -
గగన్యాన్.. క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం ఆపరేషన్ విజయవంతం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది చివరి నాటికి గగన్యాన్ ప్రయోగాన్ని నిర్వహించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ)లో క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిçస్టం ఆపరేషన్ను శనివారం విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు ఇస్రో శనివారం తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. క్రూమాడ్యూల్ సిస్టంను 602.94 సెకన్ల పాటు మండించి పరీక్షించారు. ఈ పరీక్ష సమయంలో క్రూమాడ్యూల్లోని పారామీటర్లు అన్నీ శాస్త్రవేత్తలు ఊహించిన విధంగా పనిచేశాయి. దీంతో గగన్యాన్ ప్రయోగానికి గ్రీన్సిగ్నల్ వచ్చినట్టైంది. క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టంలో భాగంగా మొత్తం 14 రకాల పరీక్షలను నిర్వహించారు. వీటిని విజయవంతంగా పరీక్షించడంతో గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న గగన్యాన్ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమవుతోంది. అయితే ముందుగా రెండు, మూడుసార్లు మానవ రహిత గగన్యాన్ ప్రయోగాన్ని నిర్వహించాకే మానవ సహిత ప్రయోగానికి సిద్ధమవుతామని ఇస్రో పేర్కొంది. ఇందులో భాగంగా పలు రకాల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఆర్ఎల్వీ పరీక్ష విజయవంతం
సూళ్ళూరుపేట/సాక్షి బెంగళూరు: గగన్యాన్ ప్రాజెక్టు పరిశోధనా పరీక్షల్లో భాగంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటనామస్ ల్యాండింగ్ మిషన్(ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్) రాకెట్ ప్రయోగ పరీక్షలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కుందాపురం సమీపంలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్)లో ఈ పరీక్ష చేపట్టారు. భారత వైమానిక దళానికి సంబంధించిన చినోక్ అనే హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ రాకెట్ను ఉదయం 7.10 గంటలకు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్లోని మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్ కమాండ్ ఆధారంగా రాకెట్ తిరిగి 7.40 గంటలకు భూమిపై నిర్దేశిత ప్రాంతంలో క్షేమంగా ల్యాండయ్యింది. ముందస్తుగా సిద్ధం చేసి రూపొందించిన నేవిగేషన్, గైడెన్స్, నియంత్రణ వ్యవస్థల సహాయంతో ఈ మానవ రహిత లాంచింగ్ వాహనం ఎలాంటి ఆటంకం లేకుండా భూమిపైకి చేరింది. ఈ ప్రయోగంలో ఇస్రోతోపాటు డీఆర్డీవో, భారత వైమానిక దళం కూడా భాగస్వామిగా మారింది. ప్రపంచంలోనే మొదటిసారిగా హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ లాంటి రాకెట్ను ఆకా«శంలో వదిలి, తిరిగి విజయవంతంగా భూమి మీదకు చేర్చిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆర్ఎల్వీ ప్రాజెక్టు నిర్వహణ బృందాన్ని ఆయన అభినందించారు. 2016 మే 23న ఆర్ఎల్వీ–టీడీ పేరుతో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024 ఆఖరుకు గగన్యాన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించిన ఇస్రోకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రయోగ రాకెట్ ల్యాండ్ అయిన దృశ్యం -
మానవ సహిత గగన్యాన్.. ఎల్వీఎం–3 ద్వారా రోదసిలోకి మనుషులు
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఆఖరు నాటికి గగన్యాన్ ప్రయోగంలో భాగంగా మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ వెల్లడించారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని స్పేస్ సెంట్రల్ స్కూల్ మైదానంలో గురువారం గణతంత్ర వేడుకల అనంతరం భాస్కర్ అతిథి భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గగన్యాన్కు సంబంధించి ఇప్పటికే పలు రకాలుగా భూస్థిర పరీక్షలు నిర్వహించామని చెప్పారు. దీనికి సంబంధించి 2022లో తొమ్మిది రకాల సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్లు నిర్వహించామన్నారు. మరో 30 రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ ఏడాది ఆఖరు నాటికి క్రూ మాడ్యూల్తో ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ముందు రెండుసార్లుగా మానవ రహిత ప్రయోగాలను నిర్వహించాక 2024 ఆఖరు నాటికి ఎల్వీఎం–3 భారీ రాకెట్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇందుకు ఇస్రోలో అన్ని సెంటర్లు దీనిపై దృష్టిసారించి పనిచేస్తున్నాయన్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకుని దీనికోసం ఇస్రోలో ప్రతిఒక్కరు కృషిచేస్తున్నారని రాజరాజన్ చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే 2024లో గగన్యాన్ ప్రయోగంలో మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 2023లో 11 ప్రయోగాలు లక్ష్యం ఇక ఈ ఏడాది 11 ప్రయోగాలు లక్ష్యంగా ఇప్పటినుంచే పనిచేస్తున్నామని రాజరాజన్ తెలిపారు. ఇందులో ఈ ఏడాది పీఎస్ఎల్వీ సిరీస్లో ఐదు రాకెట్లు, ఎల్వీఎం–3లో రెండు, జీఎస్ఎల్వీ సిరీస్లో రెండు, ఎస్ఎస్ఎల్వీ సిరీస్లో రెండు ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలియజేశారు. ఇందులో ఫిబ్రవరి మూడో వారంలో ఎస్ఎస్ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్) డీ2 ప్రయోగాన్ని నిర్వహించిన అనంతరం ఐదు పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలతో పాటు సూర్యుడిపై పరిశోధనకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నామన్నారు. ఎల్వీఎం–3 రాకెట్ల ద్వారా వన్వెబ్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను, చంద్రయాన్–3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాజరాజన్ చెప్పారు. అలాగే, జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా నావిగేషన్, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నామని కూడా తెలిపారు. మరోవైపు.. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పీఐఎఫ్) భవనం నిర్మాణం పూర్తిచేసి విజయవంతంగా ట్రయల్ రన్ను నిర్వహించామని.. రెండో ప్రయోగ వేదికకు సంబంధించి సెకండ్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ను కూడా అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. పీఎస్ఎల్వీ సీ55 ఇంటిగ్రేషన్తో సెకండ్ అసెంబ్లింగ్ బిల్డింగ్ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మొత్తం మీద షార్లోని అన్ని సదుపాయాలను ఉపయోగించి ఈ ఏడాది 11 ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. తద్వారా ఈ ఏడాది కూడా స్పేస్ రీఫార్మ్ ఇయర్గా చెప్పుకోవచ్చునని ఆయన తెలిపారు. చివరగా.. ప్రైవేట్ ప్రయోగాల విషయంలో ఎవరైనా స్టార్టప్ కంపెనీలతో వస్తే ప్రయోగాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. -
గమనించాల్సిన సైన్సు పరిణామాలు
కొత్త ఏడాదిలో శాస్త్ర విజ్ఞాన పరంగా చాలా అంశాలు ఆసక్తిగా నిలుస్తున్నాయి. కోవిడ్కు ముక్కు ద్వారా వేసుకునే టీకాతో పాటు, అధిక ఉష్ణోగ్రతల్లోనూ స్థిరంగా ఉండే టీకా రానున్నాయి. మొత్తంగానే కోవిడ్ పీడ విరగడైందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ తొలి ప్రయత్నంలో భాగంగా ఆదిత్య–ఎల్1ను ఈ ఏడాదే ప్రయోగించనున్నారు. ‘ఇస్రో’ ఈ ఏడాదిలోనే చంద్రయాన్–3ను కూడా ప్రయోగించనుంది. అణు విద్యుత్తు రంగంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు పని చేయనున్నాయి. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టనున్న డిజిటల్ రూపాయి ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. కొత్త సంవత్సరంలో అప్పుడే నాలుగైదు రోజులు గడిచిపోయాయి. కాకపోతే ఫీలింగ్ మాత్రం గత ఏడాది జనవరి మాదిరిగానే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావంతో కోవిడ్ ఇంకోసారి విజృంభిస్తుందేమో అన్న బెంగ గత ఏడాదిదైతే, కొత్త రూపాంతరంతో ఏం చిక్కు వస్తుందో అన్న భయం ఈసారి వెంటాడుతోంది. సమస్య కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఆరోగ్య వ్యవస్థ మొత్తానికీ సవాలు విసరగలగటం ఆందోళ నకరం. కాకపోతే దేశం ఇప్పటికే సంసిద్ధమై ఉన్న కారణంగా కొంచెం నింపాదిగా ఉండవచ్చు. అయితే ఈ ఏడాది ప్రశ్న కోవిడ్ ఇంకోసారి విజృంభిస్తుందా, లేదా? అన్నది కాదు. ఈ పీడ శాశ్వతంగా విరగడ అవుతుందా, కాదా? అన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియాసస్ మాత్రం కొంత ఆశావహంగానే ఉన్నారు. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో కోవిడ్ శని వదిలిందని ప్రకటించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. జనవరిలోనే జరిగే డబ్ల్యూహెచ్ఓ అత్యవసర కమిటీ సమావేశాల్లోనే ఈ అంశంపై చర్చ జరగనుంది. వేడిలోనూ పనిచేసే టీకా కోవిడ్–19 ప్రపంచానికి ముప్పు అన్న హెచ్చరికను డబ్ల్యూహెచ్ఓ తొలగించినప్పటికీ వైరస్తో ప్రమాదం లేదని అర్థం కాదు. ఇప్పటికే ఉన్న అనేకానేక శ్వాసకోశ సంబంధిత వ్యాధుల జాబితాలోకి ఇది కూడా చేరిపోయి అప్పుడప్పుడూ అక్కడక్కడా వచ్చిపోతూ ఉంటుంది. ఆరోగ్య వ్యవస్థలు మాత్రం నిత్యం ముంగాళ్లపై ఉండా ల్సిన పరిస్థితి. అదే సమయంలో శాస్త్రవేత్తలు కొత్త టీకాలు, చికిత్స లను కనుక్కునే ప్రయత్నాల్లో ఉంటారు. భారత దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సీన్ (ముక్కు ద్వారా తీసు కునేది) అందరి దృష్టిలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో, బూస్టర్ డోసుగా వాడేందుకు ఈ టీకాకు అనుమతులు లభించాయి. ఈ టీకా వేయడం మొదలుపెడితే విస్తృత సమాచారం అందుబాటులోకి వస్తుంది. తద్వారా టీకా సామర్థ్యం ఏమిటన్నదీ తెలిసిపోతుంది. ఈ ఏడాది గమనించాల్సిన ఇంకో కోవిడ్ వ్యాక్సీన్ వేడిని కూడా తట్టుకునే రకానిది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు లోని స్టార్టప్ కంపెనీ మైన్వాక్స్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం... ఈ టీకా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా రూపాంతరితాలను నాశనం చేయగల యాంటీబాడీలను తయారు చేయగలదని తేలింది. చండీగఢ్లోని సీఎస్ఐఆర్–ఐఎంటెక్తోపాటు, ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రిపేర్డ్నెస్లలో ఈ టీకాను పరీక్షించారు. మానవ ప్రయోగాలు ఈ ఏడాది ప్రారంభం కావచ్చు. ఇప్పటివరకూ తయారైన టీకాలను రిఫ్రిజరేటర్లలో భద్రపరచాల్సిన అవసరముండగా... కొత్త టీకా అధిక ఉష్ణోగ్రతల్లోనూ స్థిరంగా ఉంటుంది. దీనివల్ల ఎంతో ప్రయోజన ముంటుందన్నది తెలిసిన విషయమే. ఆదిత్యుడి పైకి చూపు ఈ ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అందరూ ఎదురు చూస్తున్న ప్రయోగాల్లో ఆదిత్య–ఎల్1 ముఖ్యమైందని చెప్పాలి. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ తొలి ప్రయత్నమిది. సుమారు 400 కిలోల బరువుండే ఈ ఉపగ్రహంలో స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధం చేసిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ను ఏర్పాటు చేశారు. శ్రీహరికోట నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే దీని ప్రయోగం జరిగే అవ కాశం ఉంది. కరోనాగ్రాఫ్తోపాటు ఆదిత్య–ఎల్1లో ఇంకో ఆరు పేలోడ్స్ ఉంటాయి. భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు శూన్యంగా ఉండే లగ్రానిగన్ పాయింట్ (ఎల్1)లో ఉంటూ ఈ ఉపగ్రహం సూర్యుడిని పరిశీలిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలోనే చంద్రయాన్–3ను కూడా ప్రయోగించ నుంది. చంద్రుడి ఉపరితలం పైకి సురక్షితంగా దిగడాన్ని పరీక్షించేం దుకు చంద్రయాన్–2 ఉపయోగపడగా, తాజాగా చంద్రయాన్–3లో ఒక లాండర్, ఓ రోవర్ రెండూ ఉంటాయి. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా వీటిని జాబిల్లిపైకి చేర్చనున్నారు. మళ్లీ గగన్యాన్ మిస్? ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో గగన్యాన్ ఒకటి. అయితే అది ఈ ఏడాది కూడా డెడ్లైన్ను అందుకోకపోవచ్చు. 2018 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ‘‘భరత మాత ముద్దుబిడ్డ ఒకరు 2022 లేదా అంతకంటే ముందుగానే భారతీయ రాకెట్లో అంతరిక్షంలోకి ఎగురు తారు’’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఇటీవల లోక్సభలో ఒక ప్రకటన చేస్తూ, గగన్యాన్ను 2024 నాలుగో త్రైమాసికంలో ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలపడం ప్రస్తావించాల్సిన అంశం. సిబ్బంది తప్పించు కునేందుకు అవసరమైన వ్యవస్థ, పారాషూట్ ఆధారంగా వేగాన్ని తగ్గించుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్ల విషయంలో జాప్యం జరగడం వల్ల గగన్యాన్ మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయో గాలు ఈ ఏడాది చివరిలో జరగవచ్చు. 2024 రెండో త్రైమాసికంలో సిబ్బంది లేకుండా ఒక ప్రయోగాన్ని నిర్వహించి ఆ తరువాత అసలు ప్రయోగం చేపట్టవచ్చు. గగన్యాన్లో పాల్గొనే వ్యోమగాముల ఎంపిక ఇప్పటికే జరిగిపోయింది. వీరు రష్యాలో తొలిదశ శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం బెంగళూరులో ఇతర శిక్షణలు పొందుతున్నారు. చిన్న అణు రియాక్టర్లకు సమయం? ఈ ఏడాది దేశంలో అణు విద్యుత్తు రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లకు సంబంధించి కొంత కదలిక కనిపించవచ్చు. కాలుష్య రహిత విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడటం వల్ల, పైగా ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ప్రపంచస్థాయిలో విద్యుత్తు రంగం తీరుతెన్నులు మారి పోయాయి. భారీస్థాయి అణు రియాక్టర్ల మాదిరిగా కాకుండా, 300 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను ఫ్యాక్టరీల్లో తయారు చేసే సౌలభ్యం ఉంది. పెద్ద రియాక్టర్లనైతే విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేసే స్థలంలోనే అమర్చాల్సి ఉంటుంది. దీనివల్ల నిర్మాణానికి చాలా సమయం పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల తయారీలో ప్రైవేట్ కంపెనీలకూ అవ కాశం కల్పించేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. డిజిటల్ రూపాయి కూడా.. రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తేనుండటం ఈ ఏడాది ఎదురు చూడాల్సిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానపరమైన అంశాల్లో ఒకటి. దీంతోపాటు జన్యుమార్పిడి ఆవాల పంట క్షేత్ర ప్రయోగాలు, జీ20 అధ్యక్ష స్థానంలో భాగంగా చేపట్టనున్న సైన్స్ డిప్లొ మసీ, కృత్రిమ మేధ రంగాల్లోని మార్పులనూ నిశితంగా చూడాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో డిజిటల్ రూపాయి ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. భౌతిక రూపాయి కున్నంత భద్రత, ఫీచర్లు, నమ్మకం డిజిటల్ రూపాయికీ ఉంటాయని ఆర్బీఐ చెబుతోంది. గోప్యత ఎంత వరకన్నది ఒక సందేహమే. ఈ ఏడాది జరగనున్న జీ20 సమావేశాలు భారతదేశంలో జరుగుతున్న సైన్స్, టెక్నాలజీ ఇన్నొవేషన్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు చక్కటి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. జీ20 సభ్యదేశా లన్నింటికీ మరింత దగ్గరయ్యేందుకు సైన్స్ డిప్లొమసీని ఉపయోగించు కోవాలి. ఇందులో భాగంగానే కోయంబత్తూరు, లక్ష్యద్వీప్, అగర్తలా, ఇండోర్, రాంచీ, సిమ్లా, డయూ, ఇటానగర్, దిబ్రూఘర్లలో శాటి లైట్ ఈవెంట్లు, సైన్స్ శాఖల మంత్రుల సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే... వీటిల్లో ఏ ఒక్కటీ సైన్సు, టెక్నాలజీలకు హబ్ అయిన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లేదా అహ్మదాబాద్లలో నిర్వ హించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం! దినేశ్ సి. శర్మ. వ్యాసకర్త సైన్సు అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో). -
Integrated Main Parachute Airdrop Test: ‘గగన్యాన్’లో ముందడుగు...
న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవసహిత అంతరిక్ష కార్యక్రమం ’గగన్యాన్’కు ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే మన ఆస్ట్రొనాట్లను సురక్షితంగా భూమ్మీదికి తిరిగి తీసుకొచ్చేందుకు వాడబోయే పారాచూట్లను విజయవంతంగా పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్ మెయిన్పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ)గా పిలిచే ఈ పరీక్షను ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైర్ రేంజ్ (బీఎఫ్ఎఫ్ఆర్) నుంచి విక్రం సారాబాయి స్పేస్ సెంటర్ పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు. పరీక్షలో భాగంగా ఐదు వేల కిలోలున్న డమ్మీ పేలోడ్ను 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్–76 విమానం ద్వారా జారవిడిచారు. తర్వాత ప్రధాన పారాచూట్లను తెరిచారు. ‘‘పేలోడ్ వేగాన్ని అవి సురక్షిత వేగానికి తగ్గించాయి. మూడు నిమిషాల్లోపే దాన్ని భూమిపై సురక్షితంగా లాండ్ చేశాయి. నిజానికి ప్రధాన పారాచూట్లలో ఒకటి సకాలంలో తెరుచుకోలేదు. ఇది కూడా మంచి ఫలితమేనని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే అంతిమంగా పూర్తిగా లోపరహితమైన పారాచూట్లను గగన్యాన్ కోసం సిద్ధం చేయగలుగుతాం’’ అని సారాబాయ్ సెంటర్ పేర్కొంది. ‘‘గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలో మొత్తం 10 పారాచూట్లుంటాయి. ముందుగా అపెక్స్ కవర్ సపరేషన్ పారాచూట్లు రంగంలోకి దిగుతాయి. తర్వాత రాకెట్ వేగాన్ని బాగా తగ్గించడంతో పాటు దాని దిశను స్థిరీకరించే డ్రాగ్ పారాచూట్లు విచ్చుకుంటాయి. నిజానికి ఆస్ట్రొనాట్లు సురక్షితంగా దిగేందుకు రెండు ప్రధాన పారాచూట్లు చాలు. ముందు జాగ్రత్తగా మూడోదాన్ని కూడా సిద్ధంగా ఉంచనున్నాం’’ అని ఇస్రో వివరించింది. డీఆర్డీఓతో కలిసి ఈ పారాచూట్లను రూపొందించారు. -
ISRO: జూన్లో చంద్రయాన్ 3
న్యూఢిల్లీ: చందమామపై శోధనకు ఉద్దేశించిన చంద్రయాన్–3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్లో ఉంటుందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ ఎస్.సోమ్నాథ్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో సోమ్నాథ్ మాట్లాడారు. ‘ గగన్యాన్ ప్రాజెక్ట్ కోసం తొలి రోదసీనౌక పరీక్షను వచ్చే ఏడాది తొలినాళ్లలో చేపడతాం. లాంచ్ వెహికల్ మార్క్–3 ద్వారా చంద్రయాన్–3ను ప్రయోగిస్తాం. పలుమార్లు మానవరహిత వాహకనౌక పరీక్షల తర్వాత 2024 చివరికల్లా భారతీయ వ్యోమగాములు విజయవంతంగా కక్ష్యలో అడుగుపెట్టేలా చేస్తాం. 2019 సెప్టెంబర్లో విక్రమ్ ల్యాండర్ను చంద్రుడిపై దింపేందుకు చేసిన చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైంది. ఈసారి అలా జరగబోదు. ఇది భిన్నమైన ఇంజనీరింగ్. ఉపరితలంపై ల్యాండర్ దిగేటపుడు పాడవకుండా ఉండేందుకు శక్తివంతమైన కాళ్లు సిద్ధంచేస్తున్నాం. ఈ ప్రక్రియలో ఏవైనా పొరపాట్లు జరిగితే, ప్రయోగం సజావుగా సాగేందుకు ‘మరో పరిష్కారం’ రంగంలోకి దిగుతుంది. ‘చంద్రుడిని చేరే క్రమంలో ఎంత ఎత్తులో ప్రయాణించాల్సి రావచ్చు? చంద్రుడి ఉపరితలంపై సమస్యలు లేని స్థలాల గుర్తింపు వంటి అంశాల్లో మరింత స్పష్టత సాధిస్తున్నాం’ అని అన్నారు. -
గగన్యాన్ తొలి ప్రయోగంపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం 2024లో ఉంటుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించారు. 2022లోనే చేపట్టాల్సిన ఈ ప్రయోగంపై కరోనా ప్రభావం పడిందన్నారు. రష్యాలో వ్యోమగాముల శిక్షణ కూడా కరోనా వల్లే వాయిదా పడిందన్నారు. ‘‘గగన్యాన్ మిషన్ తొలి ప్రయోగ పరీక్ష ఈ ఏడాది చివర్లో ఉంటుంది. అంతరిక్ష నౌకను 15 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగిస్తారు. క్యాప్సూల్ను పారాచ్యూట్ల సాయంతో భూమిపైకి తీసుకొస్తారు. రెండోసారి అంతరిక్ష నౌకను మరింత ఎత్తుకు తీసుకెళ్తారు’’ అని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది చేపట్టే మరో యాత్రలో మహిళ ముఖ కవళికలుండే వ్యోమ్ మిత్ర అనే హ్యూమనాయిడ్ను పంపిస్తామని మంత్రి తెలిపారు. ఇదీ చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన 'విచిత్ర జీవి': వీడియో -
సాకారం దిశగా గగనయానం.. ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట: ఇస్రో గండరగండులు ఇకపై అంతరిక్షంలో విహరించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానవ సహిత ప్రయోగాలే లక్ష్యంగా ఈ ఏడాది చివరికి లేదా 2023 ప్రథమార్థంలో గగన్యాన్–1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేసేందుకు పలు రకాల భూస్థిర పరీక్షలు చేసి రాకెట్ సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా ఇస్రో సన్నద్ధమవుతోంది. గగన్యాన్–1కు సంబంధించి తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని స్ప్రాబ్ విభాగంలో ఈ నెల 13న ఎస్–200 (ఘన ఇంధన మోటార్) భూస్థిర పరీక్షను ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. భారీ రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లు, రెండో దశలో ఉపయోగించే ఎల్–110 సామర్థ్యంతో పాటు సుమారు 3.5 టన్నుల బరువు గల క్రూ మాడ్యూల్ (వ్యోమనాట్స్ గది)ను పంపించి మళ్లీ దాన్ని తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో సొంతంగా తయారు చేసుకుంది. క్రూ మాడ్యూల్ను విజయవంతంగా ప్రయోగించి పారాచూట్ల సాయంతో తిరిగి తీసుకొచ్చే విషయంలోనూ విజయం సాధించారు. దిగ్విజయంగా.. ప్యాడ్ అబార్ట్ టెస్ట్.. మానవ సహిత ప్రయోగాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు 2018 జూలై 4న ‘ప్యాడ్ అబార్ట్ టెస్ట్’ అనే ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగంలో 259 సెకన్ల పాటు రాకెట్ను నాలుగు దశల్లో మండించి రెండు కిలోమీటర్ల మేర అంతరిక్షం వైపునకు తీసుకెళ్లి పారాచూట్ల ద్వారా క్రూ మాడ్యూల్ను బంగాళాఖాతంలోకి దించారు. అక్కడ రెండు చిన్నపాటి పడవల్లో ఇస్రో శాస్త్రవేత్తలు దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 720 సెకన్లపాటు మండించి.. గగన్యాన్–1 ప్రయోగానికి సంబంధించి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్ దశను తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్లో ఈ ఏడాది జనవరి 12న భూస్థిర పరీక్ష నిర్వహించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. క్రయోజనిక్ మోటార్లో 12 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని నింపి 720 సెకన్ల పాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించారు. ఈ ఇంజన్ను మరోమారు 1,810 సెకన్ల పాటు మండించి పరీక్షించేందుకుగాను మరో నాలుగు పరీక్షలను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఆర్ఎల్వీ టీడీ ప్రయోగమూ విజయవంతం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 2016 మే 23న రీయూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్(ఆర్ఎల్వీ–టీడీ)ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ తరహా రాకెట్ 12 టన్నుల బరువుతో పయనమై 56 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాక శిఖర భాగాన అమర్చిన 550 కిలోల బరువుగల హైపర్ సోనిక్ ఫ్లైట్ను విడుదల చేసింది. ఆ ఫ్లైట్ 65 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి వచ్చేందుకు రన్ వే సౌకర్యం లేకపోవడంతో ప్రయోగాత్మకంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 450 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దిగ్విజయంగా దించారు. దానికి ఇండియన్ కోస్టల్ గార్డ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు సముద్రం మీద విండ్ మెజర్మెంట్, షిప్ బర్న్ టెలీమెట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు. వ్యోమనాట్స్ను రోదసిలో వదిలిపెట్టి మళ్లీ క్షేమంగా తెచ్చేందుకు ఉపయోగపడే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ–టీడీ) ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకున్నారు. (క్లిక్: తమిళనాడులో సబ్వేరియంట్ బీఏ.4 రెండో కేసు) -
గగన్యాన్ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నాం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్ట్ పనులు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చేపడుతున్నారని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలిపారు. బుధవారం షార్లోని స్పేస్ సెంట్రల్ స్కూల్లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. రాజరాజన్ జాతీయ జెండాను ఎగు రవేశారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ షార్ లో కోవిడ్ కారణంగా రెం డేళ్లుగా ప్రయోగాల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. షార్లోని ప్రయోగ వేదికలను గగన్యాన్ ప్రాజె క్ట్తో పాటు చంద్రయాన్–3 ప్రయోగానికి సంబం ధించి అనేక ప్రయోగాత్మక పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్ట్లకు సంబంధించి మౌలిక సదుపాయాలను నిర్దేశించిన సమయంలో పూర్తిస్థాయిలో సంసిద్ధం చేసేందుకు పని చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఘన ఇంధన మోటార్లు ఉత్పత్తి, ప్రయోగ పరీక్షలను చేస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ, కనెక్టివిటీ నినాదంతో ఇస్రో పని చేస్తోందని చెప్పారు. నేడు దేశంలో 850 చానల్స్ చూడగలుగుతున్నామంటే అది ఇస్రో చేస్తున్న ప్రయోగాల వల్లేనన్నారు. దేశ సరిహద్దుల్లో చొరబాట్లు, ఉగ్రవాదుల కదలికలు వంటి వాటిని టెక్నాలజీ ద్వారా కనిపెట్టగలుగుతున్నామన్నారు. -
‘వికాస్ ఇంజన్’ సామర్థ్య పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్యాన్–1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్ ఇంజన్ సామర్థ్య పరీక్ష విజయవంతమైంది. ఈ నెల 20న తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ (ఐపీఆర్సీ)లో నిర్వహించిన సామర్థ్య పరీక్షను వివరాలను ఇస్రో అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. మానవరహిత ఉపగ్రహాల ప్రయోగాన్ని నిర్వహించే ముందుగా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాలు పరీక్షలను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తారు. ముందుగా క్రయోజనిక్, వికాస్ ఇంజన్ల పనితీరును, సామర్థ్యాన్ని పరీక్షించుకుంటారు. గగన్యాన్–1 ప్రాజెక్ట్ కోసం వికాస్ ఇంజన్ అర్హతను నిర్ధారించేందుకు దీర్ఘకాలిక పరీక్ష అవసరం ఉందని, వాటిని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. ఆ మేరకు ముందుగా రాకెట్లోని ఇంధన దశలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. గగన్యాన్–1 ప్రయోగాన్ని జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రెండు సార్లు వికాస్ ఇంజన్లను పరీక్షించారు. వికాస్ ఇంజన్ను 25 సెకన్ల పాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. -
గగన్యాన్–1 క్రయోజనిక్ ఇంజన్ పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్యాన్–1కు సంబంధించి క్రయోజనిక్ ఇంజన్ దశను తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్లో బుధవారం సాయంత్రం విజయవంతంగా పరీక్షించారు. సుమారు 12 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని నింపి 720 సెకండ్లపాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఆశించిన లక్ష్యాలను చేరుకునే దిశగా పరీక్ష విజయవంతమైంది. గగన్యాన్–1 ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్నిరకాల పరీక్షలను ముందస్తుగా చేయడంలో భాగంగా క్రయోజనిక్ ఇంజన్ల పనితీరును సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఈ ఇంజన్ను మరోమారు 1,810 సెకండ్లపాటు మండించి పరిశీలన జరిపేందుకు మరో నాలుగు పరీక్షలను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. గగన్యాన్–1 ప్రోగ్రామ్ కోసం క్రయోజనిక్ ఇంజన్ అర్హతను పూర్తి చేయడానికి రెండు స్వల్పకాలిక పరీక్షలు, ఒక్క దీర్ఘకాలిక పరీక్ష చేయాల్సి ఉంది. వాటిని కూడా విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందిస్తోంది. – సూళ్లూరుపేట -
నూతన సంవత్సరంలో నింగికి నిచ్చెనలు
కొత్త సంవత్సరంలో నింగిని మరింత లోతుగా శోధించేందుకు భారత్ సిద్ధమవుతోంది. 2022లో వివిధ అంతరిక్ష ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి, అగ్రరాజ్యాలకే పరిమితమైన ఘనతను భారత్కు కూడా కట్టబెట్టాలని ఇస్రో (ఇండియన్ స్పేస్రీసెర్చ్ ఆర్గనైజేషన్) పట్టుదలగా కృషి చేస్తోంది. గతంలో కరోనా కారణంగా నిలిచిపోయిన కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా సరికొత్త ప్రయోగాలను కూడా చేపడతామని ఇస్రో వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2022ను అంతరిక్ష నామ సంవత్సరంగా మార్చేందుకు ఇస్రో చేపట్టనున్న కీలక ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి... గగన్ యాన్ అంతరిక్షంలోకి భారత వ్యోమగాములను తొలిసారి సొంతంగా పంపేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకోసం ముందుగా ఇస్రో మానవ రహిత యాత్రను చేపట్టనుంది. క్రూ ఎస్కేప్సిస్టం పనితీరు పరిశీలనకు, గగన్ యాన్ మానవ రహిత మిషన్ కోసం 2022 ద్వితీయార్ధంలో ఇస్రో ఒక టెస్ట్ వెహికిల్ ఫ్లైట్ను నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. దీని అనంతరం ఏడాది చివరిలో మరోమారు మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది. ఈ రెండు మిషన్లు విజయవంతంగా పూర్తైతే అప్పుడు నింగిలోకి వ్యోమగాములను పంపుతారు. ఇందుకోసం ముగ్గురు భారతీయ వాయు సేన అధికారులను ఎంచుకొని శిక్షణ ఇస్తారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి నలుగురిని ఎంపిక చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే వీరి వివరాలు బహిర్గతం కాలేదు. మానవ సహిత గగన్ యాన్ను 2023లో ఎలాగైనా పూర్తి చేయాలని పనిచేస్తున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేందర్సింగ్ చెప్పారు. లో ఎర్త్ ఆర్బిట్లోకి దేశీయ లాంచ్ వెహికిల్ ద్వారా మనుషులను పంపి, తిరిగి దిగ్విజయంగా భూమికి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆదిత్య మిషన్ సూర్యుడిపై అధ్యయనానికి భారత్ తొలిసారి ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఆదిత్య ఎల్1 మిషన్ను చేపట్టింది. 2021లో ఆరంభించాలనుకున్నా, కోవిడ్ కారణంగా వాయిదా పడింది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్ 1 పాయింట్(లాంగ్రేజియన్ పాయింట్) చుట్టూ ఉండే కక్ష్యలోకి ఈ మిషన్ను ప్రవేశపెడతారు. మార్స్ ఆర్బిటర్ తర్వాత ఇస్రో చేపట్టే రెండో హైప్రొఫైల్ స్పేస్ మిషన్ ఇదే కావడం విశేషం చంద్రయాన్ 3 2008లో ఆరంభించిన చంద్రయాన్కు కొనసాగింపుగా 2022 మూడో త్రైమాసికంలో ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ చేపట్టనుంది. చంద్రయాన్ విజయవంతమైన తర్వాత చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైంది. ప్రయోగించిన లాండర్, రోవర్లు చంద్రుడిపై పడిపోయాయి. కానీ ఆర్బిటర్ మాత్రం ఇంకా భద్రంగానే ఉంది. దీన్ని చంద్రయాన్ 3లో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది. ఎస్ఎస్ఎల్వీ లో ఎర్త్ ఆర్బిట్ (భూ ఉపరితలం నుంచి 160 కి.మీ. – 2 వేల కి.మీ. ఎత్తు లోపు ఉపగ్రహాలు సంచరించే కక్ష్య)లో ఉప గ్రహాలను ప్రవేశపెట్టే మిషన్ల విషయంలో భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఇస్రో ఒక స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ని అభివృద్ది చేస్తోంది. ఈ వెహికిల్ను 2022 తొలి త్రైమాసికంలో ప్రయోగిస్తారు. సుమారు 500 కిలోలను 500 కిలోమీటర్ల కక్ష్యలోకి తీసుకుపోయే పేలోడ్ సామర్ధ్యం దీని సొంతం. పీఎస్ఎల్వీతో పోలిస్తే ఇది చిన్న, తేలికపాటి ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి తీసుకుపోగలదు. దీని అభివృద్ధికి కేంద్రం రూ. 169 కోట్లు కేటాయించింది. ఈ వెహికిల్ ఒకేమారు పలు నానో, మైక్రో ఉపగ్రహాలను మోయగలదు. 2021–23 కాలంలో నాలుగు దేశాలతో ఉపగ్రహ ప్రయోగాలకు సంబం ధించి ఇస్రో ఆరు ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా సంస్థకు సుమారు 13.2 కోట్ల యూరోల ఆదాయం సమకూరుతుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
గగన్యాన్ మిషన్ లాంచ్పై స్పష్టత..!
భారత్ మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం గగన్యాన్ మిషన్ను ఇస్రో పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. మిషన్లో భాగంగా వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు రష్యాలోని మాస్కో సమీపంలో ఉన్న జైయోజ్డ్నీ గోరోడోక్ నగరంలో ఏడాది శిక్షణా కోర్సు కూడా పూర్తి చేసుకున్నారు. కాగా తాజాగా గగన్యాన్ మిషన్పై కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్ స్పందించారు. 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో గగన్యాన్ మిషన్ను ప్రయోగిస్తామని జీతేంద్ర సింగ్ బుధవారం రోజున వెల్లడించారు. చదవండి: ఐపీఎల్ ప్రియులకు ఎయిర్టెల్ శుభవార్త! తొలుత గగన్యాన్ మిషన్ను 2022లో లాంచ్ చేయాలని ఇస్రో భావించగా కరోనా రాకతో మిషన్ ముందడుగు వేయలేదన్నారు. ఫిక్కి నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా స్పేస్ టెక్నాలజీ పార్టనర్షిప్పై జరిగిన వెబినార్లో కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్ తెలిపారు. అంతేకాకుండా అంతరిక్ష రంగంలో స్టార్టప్ ప్రాముఖ్యత ఎంతగానో ఉందన్నారు. గగన్మిషన్ ద్వారా భారత వ్యోమగాములను లో ఎర్త్ ఆర్బిట్ చేర్చనుంది. గగన్యాన్ మిషన్లో భాగంగా ఇస్రో మానవ సహిత అంతరిక్షయాత్ర కోసం వాడే లిక్విడ్ ప్రోపెలెంట్ వికాస్ ఇంజన్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. చదవండి: SpaceX Inspiration4: బ్రాన్సన్, బెజోస్లది ఉత్తుత్తి ఫీట్.. స్పేస్ ఎక్స్ పెనుసంచలనం, ఇదీ అసలైన ఛాలెంజ్! -
ఇస్రో టెస్ట్పై స్పందించిన ఎలన్ మస్క్..!
చెన్నై: భారత్ మానవసహిత అంతరిక్ష యాత్రకు గగన్యాన్ మిషన్ను ఇస్రో పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. మిషన్లో భాగంగా వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు రష్యాలోని మాస్కో సమీపంలో ఉన్న జైయోజ్డ్నీ గోరోడోక్ నగరంలో ఏడాది శిక్షణా కోర్సు కూడా పూర్తి చేసుకున్నారు. కాగా తాజాగా ఇస్రో మానవ సహిత అంతరిక్షయాత్ర కోసం గగన్యాన్ మిషన్లో వాడే లిక్విడ్ ప్రోపెలెంట్ వికాస్ ఇంజన్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేసింది. తమిళనాడులోని మహేంద్రగిరి సమీపంలోని ఇస్రో ప్రొపల్షన్ కంప్లెక్స్లో వికాస్ ఇంజన్ను 240 సెకండ్లపాటు విజయవంతంగా ఇస్రో పరిక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్లో పేర్కొంది. ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్లో భాగంగా వికాస్ ఇంజిన్పై మూడవ దీర్ఘకాలిక హాట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ఎలన్ మస్క్ బుధవారం ట్విటర్లో అభినందించారు. Congratulations! 🇮🇳 — Elon Musk (@elonmusk) July 14, 2021 -
గగన్యాన్ మిషన్ కోసం మరో కీలక ప్రయోగం: ఇస్రో
శ్రీహరికోట : మానవ సహిత యాత్ర కోసం భారత్ గగన్యాన్ మిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మిషన్ కోసం రష్యాలో ఒక సంవత్సరం పాటు భారత వ్యోమగాములు శిక్షణను కూడా పూర్తి చేశారు. గగన్ యాన్ మిషన్ కోసం మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేయాలని ఇస్రో భావిస్తోంది. గగన్యాన్ మిషన్తో డేటా వినిమయం జరపడం కోసం ప్రత్యేకంగా డాటా రిలే సాటిలైట్ను ప్రయోగించనుంది. గగన్యాన్ మిషన్కు ముందుగా ఈ శాటిలైట్ను ఇస్రో ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యోమగాములను లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)కు పంపడానికి ఉపయోగపడుతుంది. మొదటి దశలో భాగంగా ఈ మానవరహిత మిషన్ డిసెంబర్ నెలలో ప్రారంభించనున్నారు. గగన్యాన్ మిషన్లో భాగంగా వ్యోమగాములు వెళ్లే అంతరిక్ష నౌకకు డేటారిలే ఉపగ్రహంగా పనిచేస్తోందని, అందుకోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లకు ఆమోదం తెలిపిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. నిర్ణీత కక్షలో తిరిగే శాటిలైట్కు, భూమి మీద ఉండే గ్రౌండ్ స్టేషనుకు సరైన సంబంధం లేకుంటే శాటిలైట్ అందించే డేటా భూమి పైకి చేరదు. దీన్ని నిరోధించడానికి డేటా రిలే శాటిలైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా, నాసా మానవ సహిత అంతరిక్ష నౌకల కోసం, అత్యంత బలమైన డేటా రిలే ఉపగ్రహాన్ని కలిగి ఉంది. భూమిపై ఎలాంటి ప్రత్యేకమైన గ్రౌండ్ స్టేషన్ అవసరం లేకుండానే నిర్ణీత కక్షలో తిరిగే అన్ని ఉపగ్రహాలను ఈ డేటారిలే శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మారిషస్, బ్రూనై, ఇండోనేషియా, బియాక్లో ఉండే గ్రౌండ్ స్టేషన్లను ఇస్రో ఉపయోగిస్తుంది. గగన్యాన్ మిషన్ కోసం కోకో దీవుల్లో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు గత నెల ఇస్రో చైర్పర్సన్ కే శివన్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సీఎన్ఈఎస్తో గగన్యాన్ సహకారం కోసం ఒక ఒప్పందంపై ఇస్రో సంతకం చేసింది. చదవండి: షార్లో పాక్షిక లాక్డౌన్ -
గగన్యాన్కు ఫ్రాన్స్ సాయం
సాక్షి, బెంగళూరు: ఇస్రో తొలి మానవ సహిత ప్రయోగం (గగన్యాన్ మిషన్)కు ఫ్రాన్స్ సహకారం అందించనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఫ్రాన్స్ అంతరిక్ష పరిశోధన సంస్థ సీఎన్ఈఎస్ ఒప్పందం చేసుకున్నాయి. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం దేశానికి వచ్చిన ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి జీన్ యువేస్ లీ డ్రయాన్ చివరి రోజైన గురువారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు ఇస్రో చైర్మన్ శివన్ స్వాగతం పలికారు. ఇస్రో, సీఎన్ఈఎస్ సంస్థల మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఫ్రాన్స్లోని క్యాడమోస్ కేంద్రంలో భారత వ్యోమగాములకు, ఫ్లైట్ ఫిజీషియన్లకు, క్యాప్కామ్ మిషన్ కంట్రోల్ బృందాలకు శిక్షణ ఇస్తారు. మైక్రోగ్రావిటీ అప్లికేషన్లు, అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధికి సీఎన్ఈఎస్ సహకరిస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సీఎన్ఈఎస్ అభివృద్ధి చేసిన వ్యవస్థను భారత వ్యోమగాములు ఉపయోగించుకోవచ్చు. భారత వ్యోమగాములకు ఫైర్ ప్రూఫ్ క్యారీ బ్యాగ్లను కూడా సీఎన్ఈఎస్ సమకూరుస్తుంది. రోదసీయానంలో వ్యోమగాముల ఆరోగ్యం ఫ్లైట్ ఫిజీషియన్లు లేదా సర్జన్ల బాధ్యత. -
Gaganyaan Mission: మరో కీలక ముందడుగు
మాస్కో: భారత్ మానవసహిత అంతరిక్ష యాత్రకు గగన్యాన్ మిషన్ను ఇస్రో పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. అందుకుగాను మిషన్లో భాగంగా వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు, రష్యాలోని మాస్కో సమీపంలో ఉన్న జైయోజ్డ్నీ గోరోడోక్ నగరంలో ఏడాది శిక్షణా కోర్సును పూర్తి చేశారు. గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పూర్తి చేసిన భారతీయ వ్యోమగాములను సోమవారం కలిశానని రష్యన్ స్టేట్ స్పేస్ కార్పొరేషన్ అధిపతి డిమిత్రి రోగోజిన్ తెలిపారు. ఇరు దేశాల భవిష్యత్ ద్వైపాక్షిక అంతరిక్ష ప్రాజెక్టుల గురించి భారత రాయబారితో కూడా చర్చించామని ఆయన వెల్లడించారు. దీంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్కు సంబంధించిన ఒక కీలక అడుగుపడినట్టయింది. జూన్ 2019 లో భారత వైమానిక అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో, రష్యన్ లాంచ్ సర్వీస్ ప్రొవైడర్ గ్లావ్కాస్మోస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ శిక్షణకు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) చెందిన నలుగురు పైలట్లను ఎంపిక చేశారు. కోవిడ్-19 కారణంగా పైలట్ల శిక్షణకు కొంత బ్రేక్ పడింది. 2020 ఫిబ్రవరి 10న వీరి శిక్షణ మొదలైంది. వీరి శిక్షణానంతరం భారత్లో ఇస్రో తయారుచేసిన మాడ్యుల్లో సిములేషన్ ట్రయళ్లు జరపనున్నట్లు సమాచారం. గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం పదివేల కోట్లను కేటాయించింది. (చదవండి: 2022లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్ ) -
2022లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్
'ఫ్యూచర్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ ఏవియానిక్స్ ఇన్ ఇండియా' అనే అంశంపై యుపీఈఎస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన సమావేశంలో ఇస్రో చైర్మన్, కార్యదర్శి డాక్టర్ కే.శివన్ ప్రసంగించారు. ఈ సమావేశంలో డాక్టర్ కే.శివన్ రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రణాళిక గురించి మాట్లాడారు. అతను పేర్కొన్న ప్రాజెక్టులలో ఇస్రో యొక్క చంద్రయాన్-3 (మూన్ మిషన్ 3), ప్రతిష్టాత్మక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం(గగన్ యాన్) ఉన్నాయి. "తరువాతి దశాబ్దకాలంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) హెవీ-లిఫ్ట్ లాంచ్ వాహనంతో సహా అనేక అధునాతన సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకుంది. హెవీ-లిఫ్ట్ లాంచ్ వాహనం 16-టన్నుల పేలోడ్లను జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ కక్ష్యకు తీసుకువెళ్ళగలదు. ఇది ప్రస్తుత జీఎస్ఎల్వీ ఎంకే3 లిఫ్ట్ సామర్థ్యానికి నాలుగు రెట్లు ఎక్కువ, అలాగే పునర్వినియోగపరిచే ప్రయోగ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు” చైర్మన్ డాక్టర్ కే.శివన్ పేర్కొన్నారు. చంద్రయాన్-2 లోపాలను గుర్తించి తదుపరి మిషన్ లో అటువంటి తప్పిదాలు జరగకుండా ఉండటానికి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము. చంద్రయాన్-3 ప్రయోగాన్ని 2022 మొదటి భాగంలో చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. గగన్యాన్ రూపకల్పన చివరి దశలో ఉంది అన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి మానవరహిత మిషన్ ట్రయల్ జరుగుతుంది అని కే.శివన్ తెలిపారు. రాబోయే కాలంలో ఇస్రో ప్రణాళికలను వివరిస్తూ జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీఓ)కు పేలోడ్ సామర్ధ్యాన్ని 5 టన్నులకు పెంచేలా ప్రయోగాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెమీ-క్రియో ఇంజన్లు శక్తివంతమైనవని, పర్యావరణ అనుకూలమైనవని, తక్కువ ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు. మరింత శక్తివంతమైన బూస్టర్ దశల అవసరాన్ని శివన్ ప్రస్తావించారు. మరింత శక్తివంతమైన 2000 న్యూటన్ లిక్విడ్ ఆక్సిజన్, కిరోసిన్ ఇంజన్ల పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. చదవండి: దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్ కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్! -
అంతరిక్షానికి తీసుకెళ్లే వంటకాలు ఇవే!
మైసూరు: మనలో చాలా మందికి అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు అక్కడ ఏమి తింటారు అనే ప్రశ్నలు సాధారణంగా వస్తుంటాయి. అయితే వారికోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఆహార పదార్దాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా గగన్యాన్ వ్యోమగాముల కోసం ఇస్రో ప్రత్యేకంగా వంటకాలను తయారు చేస్తుంది. ఈ వంటకాలను మైసూరుకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (డిఎఫ్ఆర్ఎల్) మీల్స్ రెడీ టు ఈట్ ప్యాకింగ్ ఫుడ్ను సిద్ధం చేసింది.(చదవండి: లీకైన ఎంఐ11 స్మార్ట్ఫోన్ గ్లోబల్ ధరలు) ఆవకాయ పచ్చడి, చికెన్ బిర్యానీ, మూంగ్దాల్ హల్వా, దాల్ మక్ని, షాహి పన్నీర్, చికెన్ కోర్మా వంటి 40 ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసినట్లు ఒక డిఎఫ్ఆర్ఎల్ అధికారి తెలిపారు. అధికారి మాట్లాడుతూ... వ్యోమగాముల రుచి లేదా ఆహార ప్రాధాన్యతలు గురుంచి మాకు తెలియదు. ఎందుకంటే వారి ఇష్టానికి అనుగుణంగా కాకుండా ఇస్రో తెలిపిన మేరకు వీటిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. గగన్యాన్ కోసం ఎంపికైన 6గురు ఇచ్చిన జాబితాలో నుంచి ఆహార పదార్థాలను ఎంచుకోనున్నట్లు తెలిపారు. తర్వాత వారి అభిప్రాయం ఆధారంగా ఆహారం సర్దుబాటు చేయబడుతుంది అని అతను పేర్కొన్నారు. డిఎఫ్ఆర్ఎల్ శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను సిద్ద చేసి ప్యాక్ చేయడానికి ఒక సంవత్సరం పట్టింది. అలాగే ఈ వంటకాలు తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం వరకు పాడవ్వకుండా ఉంటాయి. వండాల్సిన అవసరం లేని పౌచ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. రోజూ సుమారు 2,500 కిలోల కేలరీలు శరీరానికి అందేలా మొత్తం డైట్ ప్లాన్ చేశారు. అలాగే ఆహారాన్ని వేడి చేయడం కోసం అంతరిక్షంలో ఉపయోగించగల ప్రత్యేక హీటర్ సిద్ధం చేసారు. వాటర్ బాటిళ్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్లు కూడా సిద్ధం చేసారు. -
బడ్జెట్ 2021: కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 15వేల స్కూళ్లు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. అలానే కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు.. 100 సైనిక్ స్కూళ్లు ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. గోవా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం 300 కోట్ల రూపాయలు కేటాయించారు. గగన్యాన్ మిషన్లో భాగంగా నలుగురు భారతీయ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. బడ్జెట్లో నిర్మల స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. స్టార్టప్లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతమిస్తామన్నారు. స్టార్టప్లకి టాక్స్ హాలీడేని మరో ఏడాది పొడిగించారు. లేహ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్కు 3వేల కోట్ల రూపాయలు.. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం 5వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు 1500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక మీదట 5 కోట్లు దాటిన లావాదేవీలన్నీ ఇకపై డిజిటల్ విధానంలోనే జరగాలని నిర్మలా సీతారామన్ సూచించారు. -
గగన్యాన్ మిషన్ మరింత ఆలస్యం
సాక్షి, బెంగళూరు: గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి ఆర్బిటల్ వ్యోమనౌకలో భారతీయ వ్యోమగాములను పంపనుంది. ఇండియన్ హ్యుమన్ స్పెస్ క్రాఫ్ట్ ప్రొగ్రామ్లో భాగంగా 2022 నాటికి భారతీయ వ్యోమగాములతో కూడిన ఆర్బిల్ స్పేస్ క్రాఫ్ట్ను కనీసం 7 రోజులు అంతరిక్షానికి పంపించడమే గగన్ యాన్ ప్రయోగం ఉద్దేశమని ఇస్రో తెలిపింది. తాజాగా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా భారతదేశపు మొదటి మానవ అంతరిక్ష మిషన్ గగన్యాన్ ఒక సంవత్సరం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికారులు తెలిపారు.(చదవండి: దేశీయంగా వ్యాక్సిన్కు అనుమతించండి) రెండు మానవ రహిత మిషన్లను డిసెంబర్ 2020, జూలై 2021లో నిర్వహిస్తామని... వ్యోమగాములతో కూడిన మిషన్ ను డిసెంబర్ 2021లో నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. గగన్యాన్ మిషన్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ లో భాగంగా ప్రాజెక్ట్ కోసం ఎంపికైన మనుషులకి ఈ మిషన్ ప్రయోగానికి ముందు రెండు అన్క్రూవ్డ్ మిషన్లు చేపడుతారు. కానీ "కోవిడ్ కారణంగా ఈ మిషన్ మరింత ఆలస్యం అవుతుంది" అని ఇస్రో చైర్మన్ కె.శివన్ స్పష్టం చేశారు. "మేము వచ్చే ఏడాది చివరలో లేదా తర్వాతి సంవత్సరంలో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అతను తెలిపారు. గగన్యాన్ మిషన్ లో భాగంగా ముగ్గురు సిబ్బందితో కూడిన వ్యోమనౌకని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (LEO)కు కక్ష్యలో ప్రవేశపెట్టడంతో పాటు, మిషన్ తరువాత వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం గగన్ యాన్ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. బెంగళూరు ప్రధాన కార్యాలయం ఇస్రో గత నెలలో హెవీ లిఫ్ట్ లాంచర్, జిఎస్ఎల్వి ఎంకెఐఐఐని గగన్యాన్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రయోగించినట్లు తెలిపారు. జిఎస్ఎల్వి ఎంకెఐఐఐలో హై థ్రస్ట్ సాలిడ్ ప్రొపెల్లెంట్ స్ట్రాప్-ఆన్ బూస్టర్స్ S200 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.