ICC World Cup
-
వరల్డ్ కప్ ఎవరు గెలిచారు? అదేంటి.. నెక్స్ట్ ఇయర్ కదా..!
బాలీవుడ్ కా బెస్ట్ ఫ్రెండ్ ఓరీ.. అవును మరి.. ఇతడు బాలీవుడ్లోని సెలబ్రిటీలందరికీ బాగా కావాల్సినవాడు, అత్యంత సన్నిహితుడు. హిందీ చిత్రసీమలో ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే అందరి కన్నా ముందే అక్కడ వాలిపోతుంటాడు. అందరితోనూ ఫోటోలు దిగుతుంటాడు. తాజాగా ఇతడు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. ఇతడి అసలు పేరు ఒర్హాన్ అవత్రమణి. శుక్రవారం నాడు హిందీ బిగ్బాస్ 17వ సీజన్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్బాస్ చెప్పాడో మరేంటో కానీ అతడిని సాదరంగా ఆహ్వానించిన హౌస్మేట్స్ అతడికి ఘనంగా వెల్కమ్ చెప్తూ పార్టీ ఇచ్చారు. బతకడానికి శ్వాస తీసుకుంటా అతడి కోసం ర్యాప్ సాంగ్ రాసి పాడుతుంటే ఓరీ మాత్రం బోర్గా ఫీలై వాష్రూమ్ ఎక్కడుందని అడిగి అక్కడి నుంచి జారుకున్నాడు. హౌస్లో ఒక్కరోజు అయినా ఉన్నాడో లేదో కానీ రకరకాల డ్రెస్సులు మార్చాడు. ఇంటిసభ్యులు అతడి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేశారు. నువ్వు బతకడానికి ఏం పని చేస్తావ్? అని అడిగితే.. చిల్ అవుతా, శ్వాస తీసుకుంటా అని సరదాగా సమాధానం చెప్పాడు ఓరీ. మరో కంటెస్టెంట్ అభిషేక్ కుమార్.. వరల్డ్ కప్ ఎవరు గెలిచారు? అని ఆతృతగా అడిగాడు. నువ్వు ఉండాల్సినవాడివే దీనికి ఓరీ.. అదేంటి? వరల్డ్ కప్ వచ్చే ఏడాది కదా! అని బదులిచ్చాడు. ఇది చూసిన జనాలు.. 'గొప్పోడివయ్యా.. పోయినవారం అందరూ టీవీలకు అతుక్కుపోయి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తే అది జరిగిందన్న విషయం కూడా తెలియదా?', 'క్రికెట్ మీద ఎంత ఆసక్తి లేకపోయినా కనీసం ప్రపంచకప్ ఎవరు గెలిచారనేది కూడా పట్టించుకోలేదంటే నువ్వు ఉండాల్సినవాడివే..', సమాధానం తెలిసినా కావాలనే చెప్పలేదేమో' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓరీ శనివారం ముంబైలో జరిగిన పార్టీలో చిల్ అవుతూ కనిపించాడు. దీంతో అతడు బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక క్రికెట్ ప్రపంచకప్లో భారత్పై ఆస్ట్రేలియా పైచేయి సాధించిన సంగతి తెలిసిందే! #Orry brings entertainment in the house, Promo #BiggBoss17 pic.twitter.com/7KZ0IEeS2H — The Khabri (@TheKhabriTweets) November 25, 2023 చదవండి: యానిమల్లో రణ్బీర్కు సోదరిగా నటించిందెవరో తెలుసా? హీరోయిన్ కంటే తక్కువేం కాదు! -
వాళ్లు అందుకే గెలిచారు: సుప్రీం మాజీ జడ్జి కట్జూ సంచలన వ్యాఖ్యలు
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ (World cup 2023) ఫైనల్లో భారత జట్టు ఓటమిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే టీమిండియా ఘోర ఓటమిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతుండగా, వింత వాదనతో ఈ జాబితాలో మార్కండేయ కట్జూ చేరారు. ఆయన చెప్పిన కారణం వింటే నెటిజన్లు షాకవుతున్నారు. మహాభారత కాలంలో ఆస్ట్రేలియా ఆనాటి పాండవులు తమ అస్త్రాలు భద్రపరుచుకునే కేంద్రంగా ఉండేది. అప్పట్లో దాన్ని 'అస్త్రాలయ' అని పిలిచేవారు. వారు (ఆస్ట్రేలియా) ప్రపంచకప్ గెలవడానికి ఇదే అసలు కారణం అంటూ జస్టిస్ మార్కండేయ కట్జూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్ల ఒక రేంజ్లో స్పందించారు. ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేని అతని విచిత్రమైన సిద్ధాంతంపై నెటిజన్లుమండిపడుతున్నారు. ధన్యవాదాలు సార్...మీరు కామెడీ చేసి చాలా రోజులైందంటూ ఒక యూజర్ విమర్శించారు. దుబాయ్ని మిస్టర్ దూబే, ఈజిప్ట్ (హిందీలోమిస్ర్) మిశ్రా రూపొందించారు, ఇజ్రాయెల్ను యాదవులు, బహ్రెయిన్ను బ్రహ్మ దేవుడు, సౌదీ అరేబియాను సరస్వతి దేవి సృష్టించారా? అంటూ మరొక వినియోగదారుడు జస్టిస్ కట్జూపై మరొక యూజర్ ధ్వజమెత్తారు. Australia was the storage centre of the 'Astras' of Pandavas. It was called 'Astralaya'. This is the real reason why they won the World Cup. — Markandey Katju (@mkatju) November 20, 2023 కాగా గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటి మొదలు పేలవమైన బ్యాటింగ్, ఫీల్డింగ్లో స్లిప్-అప్ల వరకు, అన్ని మ్యాచ్లోనూ అజేయంగా నిలిచిన రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు చివరికి ట్రోఫీని అందుకునే అదృష్టాన్ని దక్కించుకోలేకపోవడంపై నిపుణులుమొదలు సామాన్యుడి దాకా అనేక విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా వ్యవహరించిన కట్జూ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయానికి కారణాలను చెప్పిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జస్టిస్ కట్జూ 1970 నుండి 1991 వరకు అలహాబాద్ హైకోర్టులో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఏప్రిల్ 2006లో భారత సుప్రీంకోర్టు జడ్జికావడానికంటే ముందు వివిధ ఉన్నత స్థానాల్లో పనిచేశారు. సెప్టెంబర్, 2011లో పదవీ విరమణ చేశారు. -
ICC World Cup 2023: ఒక రోజు హోటల్ అద్దె లక్షన్నర
అహ్మదాబాద్ పంట పండింది. ఆదివారం జరగనున్న ఇండియా– ఆస్ట్రేలియా వరల్డ్కప్ వన్డే క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా ఆ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియం జాతీయ, అంతర్జాతీయ విమానాలు అభిమానులతో దిగనున్నాయి. మరి హోటల్ రూమ్లు? టికెట్లు? ఏవీ దొరకట్లేదు. రేట్లు చూస్తే గుండె గుభేల్స్. ప్రతి విశేషమూ వైరలే. ‘ఆల్ రోడ్స్ లీడ్ టు అహ్మదాబాద్’. క్రికెట్ జ్వరం, క్రికెట్ జలుబు, క్రికెట్ దగ్గు, క్రికెట్ కలవరింతలు, క్రికెట్ స్లీప్ వాక్... ఇవన్నీ ఉన్నవారు లేనివారు కూడా అహ్మదాబాద్కు చలో అంటున్నారు. అక్కడ లక్ష మంది పట్టే స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్స్. ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మనవాళ్లు ఫైనల్స్. ఇది నేరుగా చూడ దగ్గ మేచ్యే గాని... టీవీలలో చూడ మ్యాచ్ కాదే... కాదు కాకూడదు అనుకుంటే మరి అహ్మదాబాద్ వెళ్లుట ఎటుల? వెళ్లెను పో అక్కడ ఆశ్రయం పొందుట ఎటుల? పొందెను పో టికెట్ సాధించుట ఎటుల?.. అన్నట్టుగా అందరూ సతమతమవుతున్నారు. అందరి దగ్గరా డబ్బులు ఉన్నాయి. కాని ఫ్లయిట్ టికెట్లు లేవు. ఒకప్పుడు ఢిల్లీ అహ్మదాబాద్ ఫ్లయిట్ టికెట్ మహా అయితే 4000. ఇప్పుడు 2500. అహ్మదాబాద్లో అత్యంత ఖరీదైన హోటల్లో రూమ్ అరవై వేలు దాకా ఉంటుంది. కాని ఇప్పుడు మామూలు హోటల్లో కూడా లక్షన్నర అడుగుతున్నారు. ఇస్తామన్నా దొరకడం లేదు. స్టేడియంలో అడుగు పెట్టడానికి 2000 టికెట్ 34 వేలకు అమ్ముతున్నారు. 2500 టికెట్ 42 వేలు. పదివేల టికెట్ అయితే లక్షా అరవై రెండు వేలు. మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా అభిమానులు నేరుగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండటం వల్ల అక్కడ స్ట్రీట్ ఫుడ్డు, రెస్టరెంట్ బిజినెస్, క్యాబ్ల వాళ్లు ఆటోల వాళ్లు అందరూ రాత్రికి రాత్రి కుబేరులు అయ్యేలా ఉన్నారు. గుడ్. నగరాలకు ఇలాంటి జ్ఞాపకాలు ఉండాలి. 100 కోట్ల జాతకం ఎలా ఉందో! చూడండి తమాషా. ‘ఆస్ట్రోటాక్’ యాప్ ప్రవేశపెట్టి, దేశ విదేశాలలో ఉన్న భారతీయులు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నట్టుగా జ్యోతిష్యుణ్ణి బుక్ చేసుకునేలా చేసి కోట్లు గడించిన ఆ యాప్ ఫౌండర్ పునీత్ గుప్తాకు ఫైనల్స్ జాతకం ఏమిటో కచ్చితంగా తెలియదు. ‘రేపు ఇండియాదే గెలుపు. మా ఆస్ట్రోటాక్ జోస్యం నిజం అవుతుంది చూడండి’ అనట్లేదు అతడు. ‘ఇండియా కనుక కప్పు గెలిస్తే మా యాప్ యూజ్ చేసేవారికి 100 కోట్లు పంచుతా’ అంటున్నాడు. 2011లో ఇండియా వరల్డ్ కప్లో గెలిచినప్పుడు తాను కాలేజీ చదువులు చదువుతున్నానని, ఇప్పుడు సంపాదించాను కనుక ఆ సంతోషాన్ని 100 కోట్లు పంచి పంచుకుంటానని అంటున్నాడు. ఏమో మన జాతకం ఎలా ఉందోనని ఆస్ట్రోటాక్ యూజర్లు ఆశగా చూస్తున్నారు. ఇతగాడు ఇలాంటి వాగ్దానాలు చేస్తుంటే మనవాళ్లు కప్పు కొడితే ఫలానా బీచ్లో బట్టలు విప్పుతానని ఒక హీరోయిన్ హల్చల్ చేసింది. ఇక మొక్కులు, పొట్టేళ్లు ఎంతమంది అనుకున్నారో తెలియదు. కమాన్ ఇండియా! జాతకం తిరగరాయి. -
కెప్టెన్ల ఫోటో షూట్: దీని వెనుక సంచలన స్టోరీ, కనీవినీ ఎరుగని అద్భుతం
వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (నవంబరు 19, ఆదివారం) జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోవరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ల ఫొటో షూట్ ఆకర్షణీయంగా నిలిచింది. అసలీ ఫోటో షూట్ ఎక్కడ? దీని వెనుక ఉన్న కథ ఏంటి? తెలుసుకుందాం రండి..! అహ్మదాబాద్ లోని చారిత్రక ప్రదేశం 'అదాలజ్ మెట్ల బావి' వద్ద ఇరు జట్ల సారధులు అదాలజ్ వావ్ను సందర్శించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. దిదీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ, బీసీసీఐ, గుజరాత్ టూరిజం విభాఘం తమ ఎక్స్( ట్విటర్)లో పోస్ట్ చేశాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి అహ్మదాబాద్కు ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ జిల్లాకి సమీపంలోని అదాలాజ్ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెట్ల బావి ఉంది. గుజరాత్లో మార్వాడీ భాషలో, స్టెప్వెల్ను ‘వావ్’ అంటారు. ఇలాంటి ఇక్కడ చాలా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి అదాలజ్ ని వావ్? Rohit Sharma, the captain of the Indian #Cricket Team, and Pat Cummins, the captain of the Australian Cricket Team, visited #AdalajStepwell. They were mesmerized by the architectural marvel of the stepwell and overwhelmed by the warm hospitality of #Gujarat. VC: @ICC pic.twitter.com/93MncfCIUR — Gujarat Tourism (@GujaratTourism) November 18, 2023 అదాలజ్ ని వావ్ అదాలజ్ ని వావ్ లేదా అదాలజ్ స్టెప్వెల్ ను 1499లో తన భర్త జ్ఞాపకార్థం వాఘేలా రాజవంశం అధినేత వీర్ సింగ్ భార్య రాణి రుదాదేవి నిర్మించారు. ఇదొక అద్భుతంగా శిల్పాలతో నిండివున్న ఈ కట్టడం ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప అద్భుతానికి గొప్ప నిదర్శనం. గుజరాత్లోని అత్యుత్తమ స్మారక కట్టడాలలో ఒకటిగా నిలిచిన ఈ మెట్ల బావి ఐదు అంతస్తుల లోతులో ఉంటుంది. తూర్పు ప్రవేశం నుండి బావి వరకు మొదటి అంతస్తులో ఉన్న పాలరాతి స్లాబ్పై అదాలజ్ స్టెప్వెల్ చరిత్రను సంస్కృతంలో ఒక శాసనం లిఖించారు. భర్త చివరి కోరిక కోసం, భార్య ప్రాణత్యాగం పురాణాల ప్రకారం, 15వ శతాబ్దంలో,రణవీర్ సింగ్ అప్పట్లో దండై దేశ్ అని పిలిచే ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడ ఎపుడూ విపరీతమైన నీటి ఎద్దడి ఉండేది. కేవలం వర్షాలే ఆధారం. దీంతో అతిపెద్ద, లోతైన బావిని నిర్మించమని ఆదేశించాడు. కానీ అది పూర్తి కాకముందే, పొరుగున ఉన్న ముస్లిం పాలకుడు మహమ్మద్ బేగ్డా దండాయి దేశ్పై దండెత్తాత్తుతాడు. ఈ యుద్ధంలో వీర్ సింగ్ అసువులు బాస్తాడు. దీంతో అప్పటి సంప్రదాయం ప్రకారం అతని భార్య రాణి సతీసహగమనం కోసం సిద్ధమవుతుండగా, బేగ్డా ఆమెను వివాహం చేసుకోవాలను కుంటున్నట్లు చెప్తాడు. అయితే ఈ ప్రాంత రక్షణ, భర్త చివరి కోరికను నెరవేర్చాలనే ఆశయంతో ఇక్కడ ముందుగా మెట్ల బావి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే షరతుతో అతని ప్రతిపాదనను అంగీకరిస్తుంది. ఫలితంగా రికార్డు సమయంలో స్టెప్వెల్ నిర్మాణానికి పూనుకుంటాడు. కానీ రాణి పథకం వేరే ఉంటుంది. ఇది పూర్తికాగానే ప్రార్థనలతో మెట్ల బావికి ప్రదక్షిణలు చేసి, ఆతరువాత బావిలోకి ప్రాణ త్యాగం చేస్తుంది. ఈ సంఘటనలు బావి గోడలపై చిత్రీకరించి ఉన్నాయి. ఈ బావి ప్రత్యేకలు ఏంటంటే సంవత్సరాల తరబడి నీటి ఎద్దడి కారణంగా నీటి మట్టంలో కాలానుగుణ హెచ్చుతగ్గుల స్థాయిలోని భూగర్భ జలాలకోసం ఇంత లోతుగా దీన్ని నిర్మించారు. సోలంకి నిర్మాణ శైలిలో ఇసుకరాయితో నిర్మించబడిన అదాలజ్ మెట్ల బావి పైభాగంలో అష్టభుజాకారంలో 16 స్తంభాలు, 16 ప్లాట్ఫారమ్లతో ఉంటుంది. మూడు మెట్ల మార్గాలు భూగర్భంలో కలుస్తాయి. 16 మూలల్లో దేవతలతోపాటు, పలు విగ్రహాలు చెక్కారు. దేవతలు ఇక్కడికి నీరు నింపడానికి వస్తుంటారని గ్రామస్తుల నమ్మకం. అలాగే యాత్రికులు, వ్యాపారులకు ఆశ్రయం ఇచ్చింది. బావి అంచున ఉన్న చిన్న చిన్న నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలు దుష్టశక్తుల నుండి స్మారక చిహ్నాన్ని కాపాడుతాయని స్థానికులు నమ్ముతారు. అష్టభుజి పైకప్పు తో తక్కువ గాలి లేదా సూర్యకాంతి ల్యాండింగ్లోకి ప్రవేశించి, లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ బయట కంటే చల్లగా ఉండటానికి కారణమని ఆర్కిటెక్చర్, ఆర్కియాలజీ రంగంలోని నిపుణులు అంచనా. భయంకరమైన ఎండాకాలంలో కూడా ఇక్కడి ఉష్ణోగ్రత బయటకంటే దాదాపు ఐదు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఇంకా అమీ ఖుంబోర్ (ప్రాణాదార నీటికి ప్రతీకాత్మక కుండ) , కల్పవృక్షం (జీవిత వృక్షం) ఏక శిలా విగ్రహాలు, పై అంతస్తులలో ఏనుగులు (3 అంగుళాలు (76 మిమీ) చెక్కడాలు. మజ్జిగ చిలకడం, స్త్రీల అలంకరణ, రోజువారీ పనుల దృశ్యాలతోపాటు నృత్యకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శన లాంటివి ఇక్కడి గోడల నిండా కనిపిస్తాయి. మేస్త్రీలకు మరణ శిక్ష బావికి సమీపంలో దొరికిన సమాధుల ద్వారా ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ బావిని నిర్మించిన ఆరుగురు మేస్త్రీలవే సమాధులే. వారి నిర్మాణ శైలి, నిర్మాణ నైపుణ్యానికి, ప్రతిభకు ముగ్దుడైన బేగ్డా ఇలాంటిదే మరొక బావిని నిర్మించగలరా అని మేస్త్రీలని అడిగాడట. దానికి సరే అని వారు సమాధానం చెప్పడంతో వారికి మరణశిక్ష విధించాడు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కట్టడం మరొకటి ఉండకూడదని భావించాడట. -
World Cup 2023: లక్కీ పోజులు సరదా సెంటిమెంట్లు
అమితాబ్ ఇరకాటంలో పడ్డారు. ‘నేను చూడకపోతే ఇండియా గెలుస్తుంది’ అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనను మొహమాట పెడుతోంది. ‘ఆస్ట్రేలియాతో ఇండియా ఫైనల్స్ చూడకండి సార్’ అని అందరూ ఆయనతో మొరపెట్టుకుంటున్నారు. న్యూజీలాండ్తో జరిగిన సెమీఫైనల్స్లో మనం గెలవాలని ఒక అభిమాని 240 అగరుబత్తులు వెలిగించాడు. క్రికెట్ అంటే ఒక పిచ్చి. వెర్రి. అభిమానులకే కాదు ఆటగాళ్లకు బోలెడన్ని సెంటిమెంట్లు. రేపు ఫైనల్స్. ప్రతి ఫ్యామిలీ ఇందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు, సరదా విశ్వాసాల స్పెల్ చూద్దామా.. ‘జులాయి’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ కోసం పబ్కు వెళ్లిన అల్లు అర్జున్కు అక్కడ ఒంగి నీలుక్కుపోయి నిలబడి ఉన్న సప్తగిరి కనపడతాడు. ‘వీడేంటి ఇలా?’ అని అడుగుతాడు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్ని. ‘వీడా... ఇందాక వీడు ఇలా నిలుచున్నప్పుడు ధోని ఫోర్ కొట్టాడు. సెంటిమెంట్గా బాగుంటుందని అలా ఉంచేశాం’ అంటాడు ప్రదీప్. మనవాళ్ల సెంటిమెంట్స్ ఇలా ఉంటాయి. 1970ల నుంచి క్రికెట్ను విపరీతంగా ఫాలో అవుతూ స్టేడియంలకు వెళ్లి మరీ మ్యాచ్లు చూసిన ఒక తెలుగు అభిమాని తన సెంటిమెంట్లు ఇలా చెప్పుకొచ్చారు– ‘మా నాన్న క్రికెట్ చూసేటప్పుడు మా అమ్మను పక్కన కూచోబెట్టుకొని ఇవాళ నీకు వంట లేదు అనేవారు. ఆయనకు అదొక సెంటిమెంట్ అమ్మ పక్కనుంటే గెలుస్తుందని. నేను ఆ తర్వాత మ్యాచ్లు చూస్తున్నప్పుడు మధ్యలో మా అమ్మ వచ్చి పలకరిస్తే మనం ఓడిపోతామని సెంటిమెంట్ పడింది. అందుకని మ్యాచ్ ఉన్న రోజు మా అమ్మకు ఉదయాన్నే చెప్పేసేవాణ్ణి ఇవాళ పలకరించవద్దని. పెద్దవాళ్లు కదా. ఊరికే ఉండరు. ఒక్కోసారి మర్చిపోయి వచ్చి పలకరిస్తుంది. ఇంకేముంది... మ్యాచ్ హరీ’... ఎనభైల్లో ఊరూ వాడా క్రికెట్ ఫీవర్ మొదలయ్యింది. హైస్కూళ్లకు వ్యాపించింది. 1990లు దాటాక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇళ్ల కప్పుల మీదకు యాంటెన్నాలు లైవ్ టెలికాస్ట్లు మొదలయ్యాయి. ఒక నెల్లూరు వాసి ఇలా చెప్పాడు– ‘మా ఫ్రెండ్స్లో నలుగురైదుగురి ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాని ఎందుకనో విజయ్గారి ఇంట్లో చూస్తేనే ఇండియా గెలుస్తుందనే నమ్మకం ఏర్పడింది. దాంతో ఇండియా మేచ్ ఉన్న ప్రతిసారీ వాడింట్లో చేరి కిష్కిందకాండ చేసేవాళ్లం. ఇదేం గోలరా... ఇంకెక్కడా టీవీలు లేవా అని వాళ్లమ్మ మొత్తుకునేది. అదో సరదా’... అయితే ప్రతి గ్రూప్లో మచ్చనాలుకోడు ఒకడు ఉంటాడు. వాడు ‘ఫలానా వాళ్లు పోతారు’ అంటే గ్యారంటీగా పోతారు. వాడు తక్కిన రోజుల్లో ఎంత ప్రేమాస్పదమైన ఫ్రెండ్ అయినా క్రికెట్ వచ్చే రోజుల్లో అందరికీ కంటగింపు అవుతాడు. ‘మా ఫ్రెండ్ శేషుగాడు ఇలాగే ఉండేవాడు. మేమందరం ఉదయాన్నే లైవ్ చూడ్డానికి ఎగ్జయిట్ అవుతుంటే ఇండియా ఢమాల్ అనేవాడు. ఇండియా అలాగే పోయేది. అందుకని మ్యాచ్లు జరిగే కాలంలో వాడు కనిపిస్తే రాళ్లెత్తి కొట్టి మరీ తరిమేసేవాళ్లం’ అంటాడొక అభిమాని నవ్వుతూ. అభిమానులు మందుబాబులైతే వాళ్ల సెంటిమెంట్లకు కూడా లెక్కే లేదు. ‘మనకు అలవాటైన బార్లో మిగిలిన రోజుల్లో ఎక్కడైనా సరే కూచుంటాం. కాని ఇండియా మ్యాచ్ ఉన్న రోజు మాత్రం నాకొక పర్టిక్యులర్ సీట్లో కూచుని చూస్తే గెలుస్తామని సెంటిమెంట్. అక్కడే కూచునేవాణ్ణి. బార్వాళ్లు కూడా నా సీట్ నాకే అట్టి పెట్టేవాళ్లు. అంతేనా? గ్లాస్లో మందైపోతే వికెట్ పడిపోతుందని ఒక సెంటిమెంట్. అందుకే మందైపోయేలోపు ఒక పెగ్ రెడీగా పెట్టుకునేవాణ్ణి’ అని తెలియచేశాడు ఆ క్రికెట్ నిషా అభిమాని. అదేముంది... ఆటగాళ్లకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. టెస్ట్ మేచ్ల రోజుల్లో బాగా బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా ఆ ప్లేయర్లు ఆ డ్రస్సుల్ని వాష్ చేయకుండా మేచ్ అయ్యేంతవరకూ అవే డ్రస్సుల్ని వేసుకునేవారు. ‘నిన్న రాత్రి ఫలానా సినిమా చూసి నిద్రపోయి ఉదయం బ్రహ్మాండంగా ఆడాను. అందుకే మళ్లీ అదే సినిమా చూసి ఆడతాను అనుకునే వరకు క్రికెటర్ల సెంటిమెంట్లు ఉంటాయి’ అని ఒక క్రికెటర్ తెలిపాడు. ‘పూజ చేసి సాంబ్రాణి కడ్డీలు గుచ్చి రెండు రోజులుగా ఉంచిన అరటి పండును బౌలర్ శ్రీశాంత్ వికెట్లు పడతాయన్న నమ్మకంతో తినడం చూశానని’ ఆ క్రికెటర్ చెప్పాడు. సునీల్ గవాస్కర్కు గురువారం గండం ఉండేది. 1980లో రెండు వరస గురువారాల్లో ఇద్దరు అనామక బౌలర్లకు వికెట్స్ ఇచ్చి సున్నాకు ఔట్ అయ్యాడతడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్కు చేతిలో ఉన్న బ్యాట్ను గిర్రున తిప్పితే బాగా కొడతాననే నమ్మకం ఉండేది. అతని మ్యాచులు చూస్తే బ్యాట్ హ్యాండిల్ని తిప్పడం కనిపిస్తుంది. మొహిందర్ అమర్నాథ్ ఎర్ర కర్చీఫ్ను జేబులో పెట్టుకుని ఉండేవాడు. సచిన్కు ముందు ఎడమ కాలు ప్యాడ్ కట్టుకుంటే కలిసొస్తుందని నమ్మకం. జహీర్ ఖాన్ పసుపు రంగు చేతిగుడ్డను జేబులో పెట్టుకునేవాడు. బౌలర్ అశ్విన్ అయితే ఒకే బ్యాగ్ను అన్ని మ్యాచ్లకు తెచ్చేవాడు. అది అతని లక్కీ బ్యాగ్. ఇక అజారుద్దీన్ తావీజ్ లేకుండా మ్యాచ్ ఆడడు. 1987 వరల్డ్ కప్లో జింబాబ్వే మీద కపిల్ దేవ్ బ్యాటింగ్కు దిగే సమయానికి ఇండియన్ ఆటగాళ్లు ఆశలు వదలుకుని డ్రస్సింగ్ రూమ్ బయటకు వచ్చి నిలబడ్డారు. కపిల్ దేవ్ బాదడం మొదలు పెట్టాడు. అంతే టీమ్ మేనేజర్ మాన్ సింగ్ ఎక్కడి వాళ్లను అక్కడే నిలబడమన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్ను పాస్కు వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా చాలా సెంటిమెంట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమితాబ్కు తాను మేచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుంది అనే సెంటిమెంట్ ఉంది. మరోవైపు ఫైనల్స్కు ఆహ్వానం ఉంది. వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. మరోవైపు అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్లు చెప్పుకుంటున్నారు. 2011 నుంచి వరల్డ్ కప్ పోటీల్లో హోస్ట్ కంట్రీలే గెలిచాయి కాబట్టి ఈసారి హోస్ట్ కంట్రీ ఇండియా గెలుస్తుందని ఒక సెంటిమెంట్. మరోవైపు 2019 వరల్డ్ కప్ సమయంలో చంద్రయాన్–2 ఫెయిల్ అయ్యింది. ఇండియా కప్ కోల్పోయింది. 2023లో చంద్రయాన్ –3 సక్సెస్ అయ్యింది. అంటే మనం వరల్డ్ కప్ గెలుస్తామని ఒక సెంటిమెంట్. కాని ఆట ఎప్పుడూ టీమ్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది... సెంటిమెంట్స్ మీద కాదు. కాకుంటే కొంచెం అదృష్టం కలిసి రావాలంతే. ఆ అదృష్టం కోసం అభిమానుల ఆకాంక్షే సెంటిమెంట్ల రూపంలో బయటకు వస్తుంది. ఈసారి భారత్ గెలవాలని... అందుకు అందరి సెంటిమెంట్లు పని చేయాలని కోరుకుందాం. -
వరల్డ్ కప్ ఫైనల్ పోరు: ఆనంద్ మహీంద్ర వీడియో గూస్ బంప్స్ ఖాయం!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final) పోరు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ కోసం IAF తమ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ దృశ్యం తనకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే 123 వేలకు పైగా వ్యూస్ని సాధించేసింది. అటు ఫ్యాన్స్తో పాటు, ఇటు దేశ వ్యాప్తంగా ఈ ఫైనల్ దంగల్ క్రేజ్ అలా ఉంది మరి. ఈమ్యాచ్కు సంబంధించి శుక్ర, శనివారాల్లో ఎయిర్షో రిహార్సల్స్ ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.మోటెరాలోని టెక్ మహీంద్రా ఇన్నోవేషన్ సెంటర్ను పర్యవేక్షిస్తున్న తమ ఉద్యోగి ఈ క్లిప్ తీశారని ట్వీట్ చేశారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు రంగాలకు ప్రముఖులు కూడా ఈ మ్యాచ్కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు గోల్బల్ పాప్ సింగర్ దువా లిపా (Dua Lipa) ఫైనల్ క్లాష్కు ముందు ప్రదర్శన ఇవ్వనుందట. టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకుంది. ప్రపంచకప్ టైటిల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడ నుండటం ఇది రెండోసారి. ఈ సిరీస్లో ఓటమి అనేదే లేకుండా రికార్డుల మీద రికార్డులతో దూసుకుపోతోంది. టీమిండియా రికార్డ్ గెలుపు కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. Spoiler alert! My colleague @manishups08 who’s overseeing the Tech Mahindra Innovation Centre at Motera took this clip of the IAF practising their drill for the World Cup final… Goosebumps inducing….🇮🇳 pic.twitter.com/HQvQIzZVpf — anand mahindra (@anandmahindra) November 17, 2023 -
ICC World Cup 2023: అంతిమ సమరం కోసం...
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడేందుకు భారత క్రికెట్ జట్టు గురువారం అహ్మదాబాద్ నగరానికి చేరుకుంది. విమానాశ్రయంలో భారత జట్టుకు ఘనస్వాగతం లభించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా జట్టుతో భారత్ తలపడుతుంది. ఫైనల్ వేదికపై ఎయిర్ షో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎయిర్ షో నిర్వహించేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథ మహారథులు, లక్ష మంది ప్రేక్షకులు విచ్చేసే మ్యాచ్ వేదికపై ఐఏఎఫ్కు చెందిన ‘ది సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్’ ఎయిర్ షోతో మ్యాచ్కు ముందే కనువిందు చేయనుంది. దీనికి సంబంధించిన రిహార్సల్స్ను నేడు, రేపు స్టేడియంపై చేస్తారని గుజరాత్కు చెందిన డిఫెన్స్ ప్రొ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వైమానిక విన్యాసాలతో అలరించడం సూర్యకిరణ్ టీమ్కు కొత్తేం కాదు. దేశవ్యాప్తంగా ఎయిర్ షోలు ఈ జట్టే చేస్తుంది. మొత్తం తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు నింగిలో తమ వైమానిక విన్యాసంతో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేస్తాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా పది నిమిషాల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. -
World Cup 2023: సారీ సఫారీ... ఆసీస్ ఎనిమిదోసారి
ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం అనుకున్న విజయం... కానీ ఆపై ప్రతీ బంతి ప్రమాదకరంగా మారి వికెట్ కాపాడుకుంటే చాలనే స్థితి... టెస్టు మ్యాచ్ తరహా సీమ్ బౌలింగ్... టెస్టుల్లాగే ఫీల్డింగ్ ఏర్పాట్లు... ఒక వన్డే మ్యాచ్లో ఇవన్నీ కనిపించాయి... పేరుకే తక్కువ స్కోర్ల మ్యాచే కానీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలు... అదీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరు... అది కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ అంటే అనూహ్యానికి లోటుండదు... తొలి ఇన్నింగ్స్ స్కోరుతో 1999 ప్రపంచకప్ సెమీస్ను గుర్తుకు తెచి్చన పోరు చివరకు ఆసీస్ పరమైంది... ప్రమాదాన్ని తప్పించుకొని ఎట్టకేలకు గట్టెక్కిన ఆ్రస్టేలియా ఆదివారం అహ్మదాబాద్లో జరిగే తుది పోరులో భారత్తో ‘ఢీ’కి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్... 11.5 ఓవర్లలోనే స్కోరు 24/4... ఇక ఆట ముగిసినట్లే అనిపించింది... కానీ ఆసీస్ పట్టు విడిచింది. మిల్లర్ అద్భుత సెంచరీతో స్కోరు 212 వరకు చేరింది... ఎలా చూసినా సునాయాస లక్ష్యమే... ఆసీస్ అంచనాలకు తగినట్లుగా 6 ఓవర్లలో 60/0... ఇలాంటి తరుణంలో సఫారీ బౌలర్ల జోరు మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఒక్క సింగిల్ తీయడానికి కూడా ఆసీస్ బ్యాటర్లు బెదిరే స్థితి వచి్చంది... స్పిన్తో కేశవ్ మహరాజ్, షమ్సీ భయపెట్టించేశారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్పై పరుగులు చేయలేక కంగారూలపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు స్మిత్ కూడా కీలక స్థితిలో చెత్త షాట్తో పరిస్థితిని దిగజార్చాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో చివరి వరుస బ్యాటర్లు సాహసాలు చేయలేదు. ఆఖరికి మరో 16 బంతులు మిగిలి ఉండగా మాజీ చాంపియన్ విజయ తీరం చేరింది. చివరి వరకూ పోరాడినా... కీలకదశలో క్యాచ్లు వదిలేసి... మరోసారి దురదృష్టాన్ని భుజాన వేసుకొని తిరిగిన దక్షిణాఫ్రికా సెమీస్కే పరిమితమై నిరాశగా ని్రష్కమించింది. కోల్కతా: ఐదుసార్లు వరల్డ్కప్ విజేత ఆ్రస్టేలియా మరో టైటిల్ వేటలో ఫైనల్కు చేరింది. ఆదివారం భారత్తో తుది సమరంలో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆ్రస్టేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్స్లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించగా... హెన్రీ క్లాసెన్ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు...హాజల్వుడ్, ట్రవిస్ హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడైన ఆటతో ఆసీస్ విజయానికి పునాది వేయగా... స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో భారత్తో ఆ్రస్టేలియా తలపడుతుంది. మిల్లర్ మినహా... ఈడెన్ గార్డెన్స్లోనే భారత్తో మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదిస్తూ కుప్పకూలిన అనుభవంతో కావచ్చు దక్షిణాఫ్రికా బ్యాటింగ్కు మొగ్గు చూపింది. అయితే మబ్బులు పట్టిన వాతావరణంలో ఈ నిర్ణయం కలిసి రాలేదు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీ జట్టు 12 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయింది. బవుమా (0), డి కాక్ (3), మార్క్రమ్ (10), డసెన్ (6) విఫలమయ్యారు. ఈ స్థితిలో జట్టు కుప్పకూలుతుందేమో అనిపించినా... క్లాసెన్, మిల్లర్ కలిసి ఆదుకున్నారు. కొద్దిసేపు మ్యాచ్కు వాన అంతరాయం కలిగించినా... ఆట కొనసాగిన తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 70 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఐదో వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం తర్వాత పార్ట్టైమ్ బౌలర్ ట్రవిస్ హెడ్ సఫారీలను దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్లాసెన్, జాన్సెన్ (0)లను పెవిలియన్ పంపడంతో జట్టు వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిల్లర్ ఒక్కడే బాధ్యతను తీసుకున్నాడు. జంపా బౌలింగ్లోనే అతను నాలుగు సిక్సర్లు బాదటం విశేషం. మిల్లర్కు కొయెట్జీ (19) కొద్దిసేపు సహకరించాడు. కమిన్స్ వేసిన 48వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్గా మలచిన మిల్లర్ 115 బంతుల్లో శతకం సాధించగా, ఇదే షాట్తో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. కలిసొచి్చన శుభారంభం... స్వల్ప లక్ష్యమే అయినా ఆ్రస్టేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అదే చివరకు ఆ జట్టు విజయానికి పునాది వేసింది. హెడ్, వార్నర్ పోటీపడి పరుగులు సాధించడంతో 6 ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేసింది. రబడ బౌలింగ్లోనే వార్నర్ 3 సిక్స్లు బాదాడు. అయితే వరుస ఓవర్లలో వార్నర్, మార్‡్ష (0)లను అవుట్ చేసి సఫారీ కాస్త పైచేయి ప్రదర్శించింది. కొయెట్జీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది హెడ్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. హెడ్ క్రీజ్లో ఉన్నంతసేపు ఆసీస్ ధీమాగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లు షమ్సీ, మహరాజ్లతో బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత కంగారూల్లో తడబాటు మొదలైంది. ఈడెన్ పిచ్పై అనూహ్యంగా టర్న్ అవుతున్న బంతి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆసీస్ ఒక్కో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించింది. తన తొలి బంతికే హెడ్ను మహరాజ్ బౌల్డ్ చేయగా... షమ్సీ బౌలింగ్లో లబుõÙన్ (18), మ్యాక్స్వెల్ (1) అనవసరంగా చెత్త షాట్లు ఆడి వికెట్లు సమరి్పంచుకున్నారు. దాంతో సఫారీలు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్గ్లిస్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్కు 37 పరుగులు జోడించి స్మిత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే కొయెట్జీ అద్భుత బౌలింగ్తో తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపడంతో పరిస్థితి మళ్లీ మారింది. అయితే స్టార్క్ (16 నాటౌట్), కమిన్స్ (14 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ అభేద్యంగా 22 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) కమిన్స్ (బి) హాజల్వుడ్ 3; బవుమా (సి) ఇన్గ్లిస్ (బి) స్టార్క్ 0; డసెన్ (సి) స్మిత్ (బి) హాజల్వుడ్ 6; మార్క్రమ్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 10; క్లాసెన్ (బి) హెడ్ 47; మిల్లర్ (సి) హెడ్ (బి) కమిన్స్ 101; జాన్సెన్ (ఎల్బీ) (బి) హెడ్ 0; కొయెట్జీ (సి) ఇన్గ్లిస్ (బి) కమిన్స్ 19; కేశవ్ మహరాజ్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 4; రబడ (సి) మ్యాక్స్వెల్ (బి) కమిన్స్ 10; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–22, 4–24, 5–119, 6–119, 7–172, 8–191, 9–203, 10–212. బౌలింగ్: స్టార్క్ 10–1–34–3, హాజల్వుడ్ 8–3–12–2, కమిన్స్ 9.4–0–51–3, జంపా 7–0–55–0, మ్యాక్స్వెల్ 10–0–35–0, హెడ్ 5–0–21–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) మహరాజ్ 62; వార్నర్ (బి) మార్క్రమ్ 29; మార్‡్ష (సి) డసెన్ (బి) రబడ 0; స్మిత్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 30; లబుõÙన్ (ఎల్బీ) (బి) షమ్సీ 18; మ్యాక్స్వెల్ (బి) షమ్సీ 1; ఇన్గ్లిస్ (బి) కొయెట్జీ 28; స్టార్క్ (నాటౌట్) 16; కమిన్స్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 17; మొత్తం (47.2 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–60, 2–61, 3–106, 4–133, 5–137, 6–174, 7–193. బౌలింగ్: జాన్సెన్ 4.2–0–35–0, రబడ 6–0–41–1, మార్క్రమ్ 8–1–23–1, కొయెట్జీ 9–0–47–2, షమ్సీ 10–0–42–2, మహరాజ్ 10–0–24–1. 8: వన్డే ప్రపంచకప్లో ఫైనల్ చేరడం ఆస్ట్రేలియా జట్టుకిది ఎనిమిదోసారి. గతంలో ఆ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో ఏడుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. 5: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదో సెమీఫైనల్ ఆడిన దక్షిణాఫ్రికా ఐదుసార్లు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. 1992లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999లో ఆ్రస్టేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ను దక్షిణాఫ్రికా ‘టై’ చేసుకుంది. అయితే ‘సూపర్ సిక్స్’ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు ఆ్రస్టేలియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. 2007లో ఆ్రస్టేలియా చేతిలోనే సెమీఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా... 2015లో న్యూజిలాండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఓడిపోయింది. 1: భారత గడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ఆ్రస్టేలియాకిదే తొలిసారి కావడం విశేషం. 1996లో భారత్ వేదికగా జరిగిన టైటాన్ కప్లో దక్షిణాఫ్రికా చేతిలో మూడుసార్లు ఓడిన ఆస్ట్రేలియా.. తాజా ప్రపంచకప్లో లీగ్ దశలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆ్రస్టేలియా ఓడించింది. 2: వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్స్ జరగనుండటం ఇది రెండోసారి. 1996, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా... ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
ICC World Cup: అఫ్గాన్ తీన్మార్...
ఇకపై తమ జట్టును కూనగా పరిగణించాల్సిన అవసరం లేదని అఫ్గానిస్తాన్ చాటి చెప్పింది. మేటి జట్లపై తాము సాధిస్తున్న విజయాలు గాలివాటమేమీ కాదని తమ నిలకడైన ప్రదర్శనతో నిరూపించింది. మూడోసారి వన్డే ప్రపంచకప్లో ఆడుతున్న అఫ్గానిస్తాన్ ఈసారి తమకంటే అన్ని విభాగాల్లో ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టిస్తూ ఔరా అనిపించింది.డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను కంగుతినిపించిన ఉత్సాహంతో 1992 విశ్వవిజేత పాకిస్తాన్ జట్టును కూడా మట్టికరిపించిన అఫ్గానిస్తాన్ జట్టు తాజాగా 1996 ప్రపంచ చాంపియన్ శ్రీలంకను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పుణే: ప్రత్యర్థి జట్టు గత రికార్డు ఎలా ఉంటేనేమి తమదైన రోజున సమష్టిగా గర్జిస్తే అద్భుత ఫలితం సాధించవచ్చని వన్డే ప్రపంచకప్ టోరీ్నలో అఫ్గానిస్తాన్ జట్టు మూడోసారి నిరూపించింది. భారీ అంచనాలు పెట్టుకోకుండా ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ మూడో సంచలన విజయంతో అలరించింది. 1996 ప్రపంచ చాంపియన్ శ్రీలంక జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో హష్మతుల్లా షాహిది నాయకత్వంలోని అఫ్గానిస్తాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి అబ్బురపరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (60 బంతుల్లో 49; 5 ఫోర్లు), కెపె్టన్ కుశాల్ మెండిస్ (50 బంతుల్లో 39; 3 ఫోర్లు), సమరవిక్రమ (40 బంతుల్లో 36; 3 ఫోర్లు), తీక్షణ (31 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫజల్హక్ ఫారూఖీ (4/34) శ్రీలంక జట్టును దెబ్బ తీశాడు. ఒకదశలో 134/2తో పటిష్టస్థితిలో కనిపించిన శ్రీలంక నిసాంక అవుటయ్యాక తడబడింది. 107 పరుగుల తేడాలో ఏడు వికెట్లు కోల్పోయింది. కెరీర్లో 100వ వన్డే ఆడిన రషీద్ ఖాన్ ఒక వికెట్ తీయగా, మరో స్పిన్నర్ ముజీబ్కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్ 45.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గుర్బాజ్ (0) డకౌట్కాగా... రహ్మత్ షా (74 బంతుల్లో 62; 7 ఫోర్లు), హష్మతుల్లా షాహిది (74 బంతుల్లో 58 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలతో అఫ్గానిస్తాన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. హష్మతుల్లా, అజ్మతుల్లా నాలుగో వికెట్కు అజేయంగా 111 పరుగులు జోడించడం విశేషం. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిపోయిన అఫ్గానిస్తాన్... రెండో మ్యాచ్లో 69 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను ఓడించి బోణీ కొట్టింది. మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 149 పరుగుల తేడాతో ఓడిపోయి... నాలుగో మ్యాచ్లో విజృంభించి 1992 విశ్వవిజేత పాకిస్తాన్పై ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది. అనంతరం అదే ఉత్సాహంతో శ్రీలంకను కూడా మట్టికరిపించి అఫ్గానిస్తాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మూడోసారి వన్డే వరల్డ్కప్లో ఆడుతున్న అఫ్గానిస్తాన్ ఒకే ప్రపంచకప్లో మూడు విజయాలు సాధించడం ఇదే ప్రథమం. 2015 ప్రపంచకప్లో ఒక మ్యాచ్లో నెగ్గిన అఫ్గానిస్తాన్... 2019 ప్రపంచకప్లో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఈ ప్రపంచకప్లో మాత్రం అఫ్గానిస్తాన్ తమ కంటే మెరుగైన జట్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్ మిగిలిన మూడు మ్యాచ్లను నెదర్లాండ్స్ (నవంబర్ 3న), ఆ్రస్టేలియా (నవంబర్ 7న), దక్షిణాఫ్రికా (నవంబర్ 10న) జట్లతో ఆడుతుంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 46; దిముత్ కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫారూఖీ 15; కుశాల్ మెండిస్ (సి) నజీబుల్లా (సబ్) (బి) ముజీబ్ 39; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్ 36; అసలంక (సి) రషీద్ ఖాన్ (బి) ఫారూఖీ 22; ధనంజయ డిసిల్వా (బి) రషీద్ ఖాన్ 14; ఎంజెలో మాథ్యూస్ (సి) నబీ (బి) ఫారూఖీ 23; చమీర (రనౌట్) 1; తీక్షణ (బి) ఫారూఖీ 29; కసున్ రజిత (రనౌట్) 5; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–22, 2–84, 3–134, 4–139, 5–167, 6–180, 7–185, 8–230, 9–239, 10–241. బౌలింగ్: ముజీబ్ ఉర్ రెహ్మాన్ 10–0–38–2, ఫజల్లఖ్ ఫారూఖీ 10–1–34–4, నవీన్ ఉల్ హక్ 6.3–0–47–0, అజ్మతుల్లా ఒమర్జాయ్ 7–0–37–1, రషీద్ ఖాన్ 10–0–50–1, నబీ 6–0–33–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (బి) మదుషంక 0; ఇబ్రహీమ్ జద్రాన్ (సి) కరుణరత్నే (బి) మదుషంక 39; రహ్మత్ షా (సి) కరుణరత్నే (బి) రజిత 62; హష్మతుల్లా షాహిది (నాటౌట్) 58; అజ్మతుల్లా (నాటౌట్) 73; ఎక్స్ట్రాలు 10; మొత్తం (45.2 ఓవర్లలో మూడు వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–0, 2–73, 3–131. బౌలింగ్: మదుషంక 9–0–48–2, రజిత 10–0–48–1, మాథ్యూస్ 3–0–18–0, చమీర 9.2–0–51–0, తీక్షణ 10–0–55–0, ధనంజయ డిసిల్వా 4–0–21–0. -
WC 2023: పాక్ బౌలర్లను చితకబాదిన లంక బ్యాటర్లు.. ఫ్యాన్స్ సందడి
-
నానో టెక్నాలజీపై కృషికి ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కిన గౌరవం
-
ICC World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్లకు స్పాన్సర్ల క్యూ..
న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమవుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023 మ్యాచ్లను స్పాన్సర్ చేసేందుకు కంపెనీలు భారీ ఎత్తున క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 26 స్పాన్సర్లు, 500 ప్రకటనకర్తలు నమోదు చేసుకున్నట్లు టీవీ, డిజిటల్ ప్లాట్ఫామ్లలో మ్యాచ్ల ప్రసార హక్కులను దక్కించుకున్న డిస్నీ స్టార్ స్పోర్ట్స్ విభాగం హెడ్ సంజోగ్ గుప్తా తెలిపారు. వీటిలో చాలా స్పాన్సర్లు టీవీ, డిజిటల్ ఫార్మాట్లను ఎంచుకోగా, కొన్ని కంపెనీలు కేవలం డిజిటల్ లేదా టీవీని మాత్రమే ఎంచుకున్నట్లు ఆయన వివరించారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా నిర్వహించే 48 మ్యాచ్లను డిస్నీ స్టార్ తమ టీవీ చానళ్లు, ఓటీటీ ప్లాట్ఫాం డిస్నీప్లస్ హాట్స్టార్లో ప్రసారం చేయనుంది. వరల్డ్ కప్ మ్యాచ్లు తొమ్మిది భాషల్లో 100 పైచిలుకు కామెంటేటర్స్తో డిస్నీప్లస్ హాట్స్టార్లో ప్రసారం కానున్నాయి. వీటిలో తెలుగు, తమిళం తదితర భాషలు కూడా ఉన్నాయి. పన్నెండేళ్ల తర్వా త వరల్డ్ కప్ మ్యాచ్లకు భారత్ ఆతిథ్యమిస్తోంది. భారత్పై అంచనాలు.. పండుగ సీజన్ దన్ను ఆసియా కప్లో భారత మెరుగైన పనితీరు, పండుగ సీజన్, భారత్ టీమ్పై భారీ అంచనాలు తదితర సానుకూలాంశాల కారణంగా అడ్వరై్టజర్లు భారీగా ఆసక్తి చూపుతున్నట్లు గుప్తా చెప్పారు. అన్ని కేటగిరీల కంపెనీలూ స్పాన్సర్ చేసేందుకు లేదా ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. సాధారణంగా పండుగ సీజన్లో కంపెనీలు ప్రకటనలపై భారీగా వెచ్చిస్తుంటాయని తెలిపారు. స్పాన్సర్ల జాబితాలో కోకాకోలా, ఫోన్పే, మహీంద్రా అండ్ మహీంద్రా, డ్రీమ్11, హెచ్యూఎల్, హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్నాడ్ ఇండియా, బుకింగ్డాట్కామ్, పీటర్ ఇంగ్లాండ్, కింగ్ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మాండెలీజ్, ఎమిరేట్స్, డయాజియో, ఎంఆర్ఎఫ్, లెండింగ్కార్ట్, బీపీసీఎల్, హెర్బాలైఫ్, హయర్, యాంఫీ, గూగుల్ పే, పాలీ క్యాబ్, అమూల్, విడా, అమెజాన్ మొదలైన సంస్థలు న్నాయి. కోకా–కోలా, ఫోన్పే, హెచ్యూఎల్ వంటి పలు కంపెనీలు ఇటు టీవీ, అటు డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనూ స్పాన్సర్ చేస్తున్నాయి. అనువైన ప్యాకేజీలు.. ప్రకటనకర్తల బడ్జెట్, అవసరాలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను రూపొందించినట్లు గుప్తా చెప్పారు. ‘పండుగ సీజన్ సందర్భంగా.. ఎవరైనా అడ్వరై్టజరు దీపావళి సమయంలో ఎక్కువ మంది కస్టమర్లు తమ ఉత్పత్తులపై మక్కువ చూపుతారనే ఉద్దేశంతో పండుగకి ముందు ఓ రెండు వారాలపాటు ప్రకటనలు ఇవ్వదల్చుకున్నారనుకుందాం. కాస్త ప్రీమియం చెల్లించి ఆ వ్యవధిలో మాత్రమే తమ ప్రకటనలను ప్రసారం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా వారికోసం కస్టమైజ్డ్ ప్యాకేజీని అందిస్తున్నాం’ అని తెలిపారు. వరల్డ్ కప్లో మరింత మంది ప్రకటనకర్తలు భాగమయ్యేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లో ‘‘సెల్ఫ్–సర్వ్ ఫ్రేమ్వర్క్’ను ప్రవేశపెట్టినట్లు గుప్తా తెలిపారు. ఏజెన్సీలు, అడ్వరై్టజర్లు సేల్స్ టీమ్స్ జోక్యం లేకుండా, తమకు అవసరమైన వాటిని స్వయంగా బుక్ చేసుకునే వీలుంటుందని వివరించారు. -
2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ఇంక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి వుంది. ఒక పక్క మెగా టోర్నమెంట్ మరోపక్క దసరా-దీపావళి పండుగలు. దీంతో అటు ఫ్యాన్స్, ఇటు వ్యాపారవేత్తల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే ఈ ఏడాది ODI (వన్ డే ఇంటర్నేషనల్) పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ప్రకటనల ద్వారా భారీ ఆదాయం సమకూరనుందని పరిశ్ర వర్గాల అంచనా. ప్రపంచ కప్ 2023 డిజిటల్ ఆదాయాలు ఈ సంవత్సరం గణనీయంగా పెరుగుతాయని, మునుపటి ఎడిషన్తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పెరగవచ్చట. దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తుందని అంచనా. 2019 ప్రపంచ కప్లో ఖర్చు చేసిన దాని కంటే రెట్టింపు ఖర్చుపెట్టనున్నారనే అంచనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పండుగ కాలంలో ప్రకటనల ఖర్చులు 15 శాతం పెరుగు తాయని విక్రయదారులు భావిస్తున్నారు. అటు ఫ్యాన్స్కు ,ఇటు ప్రకటనదారులకు పండగే 2022తో పోల్చితే 2023లో పండుగ కాలంలో ప్రకటన ఖర్చు కనీసం 10-15 శాతం పెరుగుతుందని యాడ్ ఏజెన్సీ పల్ప్ స్ట్రాటజీ వ్యవస్థాపకుడు , ఎండీ అంబికా శర్మ తెలిపారు. రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ చాలా మంది వీక్షకులకు, ప్రకటనదారులకు ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఏడాదికి మొత్తం యాడ్ ఖర్చులో 40-45 శాతం పండుగ కాలంలోనే జరుగుతుంది. క్రికెట్కు రోజుకు రోజుకు పెరుగుతున్న ఆదరణ, అందులోనూ ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్లో వస్తున్న ప్రపంచ కప్ ద్వారా టీవీ ,డిజిటల్ ప్లాట్ఫారమ్లలో కలిపి రూ. 2,000-2,200 కోట్ల ప్రకటనల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. .2019 క్రికెట్ వరల్డ్ కప్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆధారిత ఆదాయం రూ. 400-రూ. 500 కోట్ల లోపే. డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా క్రికెట్కు భారీ క్రేజ్ క్రికెట్ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో క్రికెట్కు భారీ క్రేజ్ ఏర్పడింది. డిజిటల్ ఛానెల్లలో తక్కువ ధరలు అనేక బ్రాండ్స్ను ప్రమోట్ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈనేపథ్యంలోనే క్రికెట్ వరల్డ్ కప్ 2023 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వచ్చిన డిజిటల్ యాడ్స్ రెవెన్యూ దీనికి ఉదాహరణ. 2023 క్రికెట్ వరల్డ్ కోసం డిజిటల్పై యాడ్ రేట్ వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 230-250 పరిధిలో ఉంది. 2019 ఎడిషన్లో ప్రతి వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 140-150తో పోలిస్తే 60 శాతం ఎక్కువ (CPM). ప్రపంచ కప్ కోసం ఈ ఏడాది టీవీలో ప్రకటనల ఖర్చు 20 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. అందులోనూ భారతదేశం-పాకిస్థాన్ మ్యాచ్అంటే ఆ క్రేజే వేరు. ఇలాంటి ప్రీమియం మ్యాచ్ల కోసం 10 సెకనుల రేట్లు దాదాపు రూ. 30 లక్షలు. ప్రపంచ కప్ సానుకూల ప్రభావంతో సహా 2023లో ప్రకటనల పరిశ్రమ మొత్తం వృద్ధి రేటు 8-9 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఎలారా క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తౌరానీ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎక్కువ శాతం వృద్ధి వస్తుందని అంచనా. క్యూ కట్టిన దిగ్గజ స్సాన్సర్లు అక్టోబరు 5 నుండి షురూ కానున్న ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 అధికారిక ప్రసార భాగస్వామి, స్ట్రీమింగ్ భాగస్వామి అయిన డిస్నీ స్టార్ ఇప్పటివరకు టోర్నమెంట్ కోసం 21 మంది స్పాన్సర్లు , 500 కంటే ఎక్కువ మంది ప్రకటనదారులు సైన్ అప్ చేసారు. మహీంద్రా & మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, MRF టైర్స్, Dream11, Booking.com, వంటి కొన్ని టోర్నమెంట్ స్పాన్సర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ కోసారి పురుషుల జాతీయ జట్లు పోటీ పడే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంటు-2023 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజా 13వ ఎడిషన్ను భారతదేశం హోస్ట్ చేస్తోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5న ప్రారంభమై వచ్చే నెల(నవంబర్) 19న ముగుస్తుంది. -
PAK vs NZ: ఉప్పల్ స్టేడియంలో పాక్, న్యూజిల్యాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ (ఫోటోలు)
-
డిస్నీ స్టార్లో క్రికెట్ వరల్డ్ కప్ స్పాన్సర్గా మహీంద్రా
న్యూఢిల్లీ: డిస్నీప్లస్ హాట్స్టార్లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ల ప్రసారానికి అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించనున్నట్లు ఆటోమేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఒక ప్రకటనలో తెలిపింది. కీలక టార్గెట్ మార్కెట్లలోని వినియోగదారుల దృష్టిలో పడేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వివరించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ కోసం మహీంద్రా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఎస్యూవీలు, ట్రాక్టర్ బ్రాండ్లకు..భారతీయ క్రికెట్ స్ఫూర్తికి మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని సంస్థ ఈడీ రాజేశ్ జెజూరికర్ చెప్పారు. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. -
అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను భయపడ్డాను: గంభీర్
Gautam Gambhir reveals the only time when he felt pressure: టీ20 వరల్డ్కప్-2007.. సౌతాఫ్రికా గడ్డపై దాయాది పాకిస్తాన్తో ఫైనల్లో 54 బంతుల్లో 75 పరుగులు.. టాప్ స్కోరర్గా నిలిచి జట్టు విశ్వవిజేతగా అవతరించడంలో కీలక పాత్ర.. వన్డే ప్రపంచకప్-2011లోనూ అలాంటి ఫలితమే పునరావృతం.. సొంతగడ్డపై శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. 275 పరుగుల లక్ష్యం స్టార్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్.. సచిన్ టెండుల్కర్ 18 పరుగులకే వెనుదిరగడం టీమిండియా అభిమానులను ఉసూరుమనిపించింది. కానీ తానున్నానంటూ ఆ వన్డౌన్ బ్యాటర్ ఫ్యాన్స్ ఆశలకు ఊపిరినిచ్చాడు. అప్పుడలా.. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న వేళ 122 బంతులు ఎదుర్కొని విలువైన 97 పరుగులు సాధించాడు.. ఇక ఐదో స్థానంలో వచ్చిన నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 91 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్తో భారత్ను మరోసారి జగజ్జేతగా నిలిపాడు. ఈ రెండు సందర్భాల్లో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ.. ఒత్తిడిని అధిగమించిన ఆ బ్యాటర్ మరెవరో కాదు గౌతం గంభీర్. ఐసీసీ ఈవెంట్లలో తన అద్భుత ఇన్నింగ్స్తో జట్టును విజయపథంలో నడపడంలో ముందుండి కోట్లాది మంది అభిమానానికి గౌతీ పాత్రుడయ్యాడు. అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్లలో రాణించిన ఈ స్టార్ ఓపెనర్ తీవ్రమైన ఒత్తిడికి లోనైన సందర్భంగా ఒకటే ఒకటి ఉందట. 2014 ఐపీఎల్ సందర్భంగా తన ప్రదర్శన తనకే సిగ్గు అనిపించిందట. ‘‘నా జీవితంలో నేను అత్యంత ఒత్తిడికి గురైన సందర్భం అదే. 2014లో దుబాయ్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా ఉన్న సమయంలో మూడుసార్లు వరుసగా డకౌట్ అయ్యాను. నాలుగో మ్యాచ్ అంటే నాకు కాస్త భయం వేసింది. నా బదులు మనీశ్ పాండేను ఓపెనింగ్ చేయమని అడిగాను. నాలో ఉన్న భయం కారణంగానే.. నేను మూడోస్థానంలో బ్యాటింగ్కు వస్తానని చెప్పాను. నిజానికి నాలో ఉన్న భయం కారణంగానే నేను అతడిని ప్రమోట్ చేశాను. ఈ పని చేసినందుకు నేను సిగ్గుపడుతున్నానని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఆ మ్యాచ్లో మనీశ్ పరుగుల ఖాతా తెరవలేదు. నేను ఒక్క పరుగు చేసి అవుటయ్యాను. ఆ తర్వాత మనీశ్ను పిలిచి ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పాను. ఇంకెప్పుడూ అలా చేయనని చెప్పా.. అదే నేనే ఇన్నింగ్స్ ఆరంభిస్తానని చెప్పాను. ఎప్పుడూ లేనిది ఆరోజు నేను తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఆ తర్వాతి మ్యాచ్లో కేన్ రిచర్డ్సన్ బౌలింగ్లో మొదటి బంతికే ఫోర్ కొట్టాను. నా ఐపీఎల్ కెరీర్ పొడిగించుకోవడంలో ఆ ఒక్క బౌండరీ ఎంతగా ఉపయోగపడిందో మాటల్లో చెప్పలేను’’ అని గౌతం గంభీర్ రెవ్స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో తన చేదు అనుభవం గురించి వెల్లడించాడు. ఇక ఐపీఎల్-2014లో గంభీర్ సేన చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: అయ్యో రాయుడు.. తొలి మ్యాచ్లోనే ఇలా? వీడియో వైరల్ -
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 ట్రోఫీ ఫొటోలు చూశారా
-
కోహ్లీ కొట్టుడు మొదలు పెడితే వరల్డ్ కప్ మనదే
-
టీమిండియా విజయానికి అదానీ ప్రచారం
దేశంలోని టాప్ బిలియనీర్లలో ఒకరు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ భారత్ క్రికెట్ జట్టుకు మద్దతుగా నిలిచారు. రాబోయే ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో భారత్ విజయానికి మద్దతుగా 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టు హీరోలతో కలిసి 'జీతేంగే హమ్' ప్రచారాన్ని ప్రారంభించారు. "భారత క్రికెట్ అభిమానులను ఏకం చేస్తుంది. #JeetengeHum పేరుతో ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో టీమ్ ఇండియాకు మద్దతు ఇస్తుంది. విజయం కోసం జట్టులో తపనను, మనోధైర్యాన్ని పెంచుతుంది" అని ఈ క్యాంపెయిన్ గురించి అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రెండు లక్షణాలు ఉండాలి ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ‘దేశంలో విస్తృతమైన భావోద్వేగాలను ప్రేరేపించే శక్తి క్రికెట్కు ఉంది. పుట్టుకతోనే ఎవరూ లెజెండ్లు కారు.. స్థిరత్వం, పట్టుదలతో కృషి చేసిన లెజెండ్లుగా ఎదుగుతారు. 1983లో ప్రపంచకప్ గెలిచిన జట్టుకు ఉన్న ఈ రెండు లక్షణాలు వచ్చే వరల్డ్ కప్లో ఆడే జట్టుకూ ఉండాలి’ అన్నారు. చరిత్ర పునరావృతం కావాలని కాంక్షిస్తూ రాబోయే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో నాలుగు దశాబ్దాల క్రితం 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సంతకం చేసిన ప్రత్యేక బ్యాట్ను కపిల్ దేవ్ అదానీకి బహూకరించారు. ‘2023 ODI ప్రపంచ కప్లో టీమిండియా విజయానికి మద్దతుగా అదానీ గ్రూప్తో ఏకం కావడం గౌరవంగా భావిస్తున్నాం’ అని కపిల్ దేవ్ అన్నారు. ఈ ప్రచారం త్వరలో డిజిటల్ విషెంగ్ వేదికను పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీమిండియాకు తమ శుభాకాంక్షలను, సందేశాలను ఇక్కడ తెలియజేయవచ్చు. Honoured by the presence of the Heroes of India's 1983 World Cup triumph on Adani Day. Their grit and resilience inspired an entire generation of Indians to think big. Privileged to join them in wishing our team victory at the 2023 Cricket World Cup. #JeetengeHum pic.twitter.com/bUTEQJCNOD — Gautam Adani (@gautam_adani) June 24, 2023 -
వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల
మెన్స్ క్రికెట్ వరల్డ్కప్ 2023 (వన్డే ఫార్మాట్) క్వాలిఫయర్స్ షెడ్యూల్ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం (మే 23) విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 5-5 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. జింబాబ్వే, వెస్టిండీస్, ద నెదార్లండ్స్, నేపాల్, యునైటెడ్ స్టేట్స్ జట్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. తొలి దశలో ప్రతి జట్టు తమ గ్రూప్లో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూప్ల్లో టాప్ 3 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు గ్రూప్ దశలో ఎదురుపడని జట్లతో తలపడతాయి. సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్లు అయిపోయే సరికి టాప్ 2 ప్లేసెస్లో ఉన్న జట్లు భారత్ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి. కాగా, భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్కు 8 జట్లు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. The @ICC Men’s Cricket World Cup Qualifier 2023 Match Schedule is now available 🎉🤩 👇 Check it out 👇#RoadToCWC23 | #CWC23 | #VisitZimbabwe pic.twitter.com/Mu31QRdRdR — Zimbabwe Cricket (@ZimCricketv) May 23, 2023 చదవండి: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజీలో బద్దలైన రికార్డులివే -
హైదరాబాద్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు డేట్ ఫిక్స్
-
హైదరాబాద్ లో ఇండియా, పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్
-
ఇండియా - పాక్ మెగా ఫైట్కి స్పాట్ ఫిక్స్
-
డక్వర్త్ రూపంలో అదృష్టం.. ఐసీసీ వరల్డ్కప్ క్వాలిఫయర్కు అర్హత
నేపాల్ క్రికెట్ జట్టుకు డక్వర్త్ లూయిస్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఐసీసీ వరల్డ్కప్ క్వాలియర్కు అర్హత సాధించాలంటే యూఏఈతో మ్యాచ్లో నేపాల్కు విజయం తప్పనిసరి అయింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ ఆసిఫ్ ఖాన్ 42 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో భారీ స్కోరు చేసింది. అర్వింద్ 94 పరుగులు చేయగా.. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 63 పరుగులతో రాణించడంతో యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.వర్షం ఎంతకు తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిని అమలు చేశారు. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నేపాల్ జట్టు చేయాల్సినదానికన్నా తొమ్మిది పరుగులు ఎక్కువగా చేయడంతో ఆ జట్టు గెలిచినట్లు ప్రకటించారు. బీమ్ షార్కీ 67 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఆరిఫ్ షేక్ 52, గుల్షన్ జా 50 నాటౌట్, కుషాల్ బుర్తెల్ 50 పరుగులు రాణించారు. ఈ మ్యాచ్కు ముందు నేపాల్ నాలుగో స్థానంలో ఉండగా.. యూఏఈ ఆరో స్థానంలో ఉంది. ఇప్పటికే స్కాట్లాండ్, ఒమన్లు 2023 వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించాయి. తాజాగా డక్వర్త్ లుయీస్ పద్దతిలో యూఏఈపై విజయం సాధించిన నేపాల్ మూడో స్థానానికి చేరుకొని మూడో జట్టుగా 2023 క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. ఇక జింబాబ్వే వేదికగా జూన్లో ఐసీసీ వరల్డ్కప్ క్వాలిఫయర్ పోటీలు జరగనున్నాయి. ఇక ఐసీసీ వన్డే వరల్డ్కప్కు ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో టీమిండియా అర్హత దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్లు తాము ఆడే వన్డే సిరీస్ల్లో విజయాల ద్వారా అర్హత సాధించే అవకాశం ఉంది. THE NEPALI RHINOS ARE GOING TO ZIMBABWE! Congratulations to our fearless team on qualifying for the CWC Qualifier, and a great thanks for your love and support! Keep supporting us, and believe that #weCAN!#CWCL2 #NEPvUAE pic.twitter.com/DelaYOttX4 — CAN (@CricketNep) March 16, 2023 చదవండి: క్రికెట్పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాధారణ స్కోరుకే పరిమితం.. ఢిల్లీ టార్గెట్ 148 -
ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి.. పాకిస్తాన్పై సెంచరీతో మెరిసి!
ఐర్లాండ్ క్రికెట్లో ఓ శకం ముగిసింది. దిగ్గజ ఆల్రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్ అంతర్జాతీయ క్రికెట్కు మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐర్లాండ్ చారిత్రాత్మక విజయాలు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన అతడిని గత ఏడాది కాలంగా సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేయలేదు. దీంతో టీ20 వరల్డ్కప్-2022 టోర్నీలో ఆడాలని ఉన్నప్పటికీ.. సెలక్టర్ల ఆలోచన వేరే విధంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తన రిటైర్మెంట్ ప్రకటనలో వెల్లడించాడు కెవిన్. కాగా 2006 నుంచి 2021 వరకు 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో కెవిన్ ఒబ్రెయిన్ ఎన్నో సంచలన విజయాలు నమోదు చేశాడు. పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అవేమిటో పరిశీలిద్దాం. అంతర్జాతీయ క్రికెట్లో ఐరిష్ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ సాధించిన విజయాలు: ►ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్కప్ ఈవెంట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ భారత్ వేదికగా సాగిన వన్డే వరల్డ్కప్-2011 సందర్భంగా కెవిన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 50 బంతుల్లో శతకం పూర్తిచేసుకున్నాడు. మొత్తంగా 113(63 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో) పరుగులు సాధించాడు. కొండంత లక్ష్యం ముందున్న సమయంలో టాపార్డర్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైన వేళ నేనున్నాంటూ కెవిన్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి అద్భుత సెంచరీతో మెరిశాడు. దీంతో మేటి జట్టు అయిన ఇంగ్లండ్ విధించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఐర్లాండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ►మొదటి, ఏకైక బ్యాటర్! అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో శతకం నమోదు చేసిన మొదటి, ఏకైక ఐర్లాండ్ ఆటగాడిగా కెవిన్ ఒబ్రెయిన్ ఘనత సాధించాడు. డబ్లిన్ వేదికగా 2018లో పాకిస్తాన్తో మ్యాచ్లో అతడు 118 పరుగులు చేశాడు. #OnThisDay in 2018, Kevin O’Brien became Ireland’s first Test centurion 🌟 He hit a glorious 118 against Pakistan in Dublin. Watch the moment 📽️ pic.twitter.com/x7lJdltWrs — ICC (@ICC) May 14, 2021 ►అరుదైన రికార్డు మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించిన ఏకైక ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఒబ్రెయిన్. పదహారేళ్ల తన సుదీర్ఘ కెరీర్లో వన్డేల్లో రెండు, టీ20లలో ఒకటి, టెస్టుల్లో ఒక శతకం సాధించాడు. 2013లో అవార్డు ఐర్లాండ్ జట్టులో కీలక ఆటగాడైన కెవిన్ ఒబ్రెయిన్ తన అద్భుత ఆట తీరుతో.. 2013లో ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు. మూడో ఆటగాడిగా.. 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి.. తన కెరీర్లో మొత్తంగా 152 వన్డేల్లో భాగమైన కెవిన్ 141 ఇన్నింగ్స్లో 3619 పరుగులు చేశాడు. తద్వారా ఐర్లాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్గా నిలిచాడు. ఈ ఫార్మాట్లో కెవిన్ అత్యధిక స్కోరు 142. సెంచరీలు రెండు. టీ20లలోనూ... 2008లో స్కాట్లాండ్తో మ్యాచ్లో పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు కెవిన్ ఒబ్రెయిన్. మొత్తంగా 103 ఇన్నింగ్స్ ఆడి 1973 పరుగులు చేశాడు. తద్వారా టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఐర్లాండ్ బ్యాటర్గా నిలిచాడు. పొట్టి క్రికెట్లో కెవిన్ అత్యధిక స్కోరు 124. బౌలర్గానూ.. కుడిచేతి వాటం గల బ్యాటర్ అయిన కెవిన్ ఒబ్రెయిన్ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్బౌలర్ కూడా. వన్డే క్రికెట్లో అతడు 116 ఇన్నింగ్స్లో 114 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/13. తద్వారా ఐర్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఘనత. ఇక టీ20 ఫార్మాట్లో 52 ఇన్నింగ్స్లో కెవిన్ 58 వికెట్లు కూల్చి.. ఈ ఘనత సాధించిన మూడో ఐర్లాండ్ బౌలర్గా నిలిచాడు. వీటితో పాటు కెవిన్ ఒబ్రెయిన్ పేరిట ఉన్న మరిన్ని రికార్డులు ►వన్డే ఫార్మాట్లో మొదటి బంతికే వికెట్ తీసిన 16వ ఆటగాడు కెవిన్ ఒబ్రెయిన్(ఇంగ్లండ్ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ వికెట్) ►ప్రపంచకప్ టోర్నీలో అలెక్స్తో కలిసి ఆరో వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు(ఇంగ్లండ్ జట్టు మీద) ►ఐర్లాండ్ వన్డే జట్టు నాలుగో కెప్టెన్గా కెవిన్ ఒబ్రెయిన్ ►ఐర్లాండ్ టీ20 జట్టు రెండో సారథిగా కెవిన్ ఒబ్రెయిన్ -వెబ్డెస్క్ చదవండి: ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు Kohli- Rohit: కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్ శర్మ అలా కాదు! అతడు ఉన్నాడంటే.. -
ఆటకు గుడ్బై చెప్పిన ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం.. సెలక్టర్ల వల్లేనంటూ!
Kevin O Brien: ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ ఒబ్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్కు గుడ్బై చెప్పాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ తర్వాత ఆట నుంచి వైదొలుగుదామని భావించినప్పటికీ.. గత కొన్ని రోజులుగా తనను సెలక్టర్లు పక్కనపెట్టారన్న 38 ఏళ్ల కెవిన్.. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా మంగళవారం సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. అందరికీ ధన్యవాదాలు! ‘‘ఐర్లాండ్ జట్టుకు ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఈ ప్రయాణంలో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నాను. నాతో పనిచేసిన కోచ్లు.. సిబ్బందికి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించిన అడీ బిరెల్, ఫిల్ సిమ్మన్స్కు ప్రత్యేక కృతజ్ఞతలు. క్రికెటర్గా నా ప్రయాణంలో వెన్నంటి నిలిచిన నా కుటుంబ సభ్యులకు థాంక్యూ. నేను ఆటలో బిజీగా ఉన్న సమయంలో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్న నా భార్య రూత్ అనీకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అంటూ కెవిన్ తన నోట్లో పేర్కొన్నాడు. 2006లో ఎంట్రీ ఇచ్చి! కాగా బ్యాటింగ్ ఆల్రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్ 2006లో ఇంగ్లండ్తో వన్డే మ్యాచ్తో ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.. టెస్టు క్రికెట్లో ఐర్లాండ్ జట్టు అసోసియేట్ మెంబర్షిప్ పొందడంలోనూ కీలకంగా వ్యవహరించాడు. ఇక 2008లో టీ20 ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చి.. మొత్తంగా 109 మ్యాచ్లు ఆడాడు. గతేడాది అక్టోబరు(వరల్డ్కప్)లో కెవిన్ తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడిని సెలక్టర్లు పరిమిత ఓవర్ల జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో కెవిన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పడం గమనార్హం. టెస్టుల్లో.. ఇదిలా ఉంటే.. 2018లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన కెవిన్.. 2019లో లార్డ్స్ మైదానంలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. మొత్తంగా మూడు టెస్టులాడిన అతడు 258 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 118. వన్డేల్లో ఇలా వన్డేల విషయానికొస్తే.. 152 మ్యాచ్లు ఆడి 3619 పరుగులు(అత్యధిక స్కోరు 142) చేశాడు. పొట్టి ఫార్మాట్లో ఒక సెంచరీ(124 పరుగులు) నమోదు చేశాడు. కెవిన్ తన కెరీర్లో మొత్తం నాలుగు శతకాలు(టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో రెండు, టీ20లలో ఒకటి) బాదాడు. బౌలర్గా అరుదైన ఘనత ఇక రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన కెవిన్.. వన్డేల్లో 114 వికెట్లు తన ఖాతాలో వేసుకుని.. ఐర్లాండ్ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్కప్ టోర్నీలో వేగవంతమైన సెంచరీ(50 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్లతో శతకం.. మొత్తంగా 113 పరుగులు) సాధించిన బ్యాటర్గానూ చరిత్రకెక్కాడు. 2011 ప్రపంచకప్ సందర్భంగా బెంగళూరులో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఈ ఫీట్ నమోదు చేశాడు. చదవండి: Kohli- Rohit: కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్ శర్మ అలా కాదు! అతడు ఉన్నాడంటే.. Thanks ☘️ pic.twitter.com/E4335nE8ls — Kevin O'Brien (@KevinOBrien113) August 16, 2022 -
ICC WC 2023: హమ్మయ్య.. టీమిండియాకు ఆ సమస్య తీరిపోయింది! ఇక..
ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం.. మాంచెస్టర్... ఇంగ్లండ్.. 2019 ప్రపంచకప్ టోర్నీ.. జూలై 9.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్. టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కూడా 28 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో కెప్టెన్ విలియమ్సన్ 76, రాస్ టేలర్ 74 పరుగులతో రాణించి న్యూజిలాండ్ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అత్యధికంగా భువనేశ్వర్ కుమార్కు మూడు వికెట్లు దక్కాయి. బుమ్రా, హార్దిక్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. టాపార్డర్ టపటపా.. ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ సహా అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం ఒక్కో పరుగు చేసి అవుటయ్యారు. టాపార్డర్ కకావికలం కావడంతో భారం మొత్తం మిడిలార్డర్పై పడింది. ఈ క్రమంలో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్కు దిగిన పంత్ 32, దినేశ్ కార్తిక్ 6 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా 32 పరుగులతో రాణించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ధోని అర్ధ శతకం, రవీంద్ర జడేజా 77 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో 18 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమి పాలై టీమిండియా ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు ఇంగ్లండ్తో మ్యాచ్లోనూ.. 2022.. అదే ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం.. అదే నెల.. కాకపోతే తేదీ వేరు.. సందర్భం, ప్రత్యర్థి జట్టూ వేరు.. కానీ టాపార్డర్ వైఫల్యం మాత్రం రెండు మ్యాచ్లలోనూ ఒకేలా ఉండటం గమనార్హం. జూలై 17.. 2019 నాటి సెమీస్ జట్టులో భాగమైన రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండగా.. కోహ్లి, పంత్, పాండ్యా, జడేజా, చహల్ వంటి ప్లేయర్లు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మూడో వన్డే ఆడిన జట్టులో ఉన్నారు. ఇంగ్లండ్ విధించిన 260 పరుగుల లక్ష్య ఛేధనలో భాగంగా టాపార్డర్ గతంలో మాదిరిగానే మరోసారి తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 17, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకటి, విరాట్ కోహ్లి 17 పరుగులకే పెవిలియన్ చేరారు. చదవండి: India Vs West Indies 2022: విండీస్తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! రిషభ్ పంత్- హార్దిక్ పాండ్యా(PC: BCCI) నేనున్నానంటూ పంత్.. జత కలిసిన పాండ్యా సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న వేళ నేనున్నాంటూ రిషభ్ పంత్ అభయమిచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అతడు 113 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచిన పంత్కు హార్దిక్ పాండ్యా తోడయ్యాడు. ఆరోస్థానంలో బరిలోకి దిగిన అతడు 55 బంతుల్లో 71 పరుగులు చేశాడు. వీరిద్దరి వీర విహారంతో 5 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్ సేన వన్డే సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఈసారి మిడిలార్డర్ రాణించింది. 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦! Dressing room reactions & emotions after #TeamIndia's ODI series triumph against England at Manchester.👏 👏 - By @RajalArora Watch this special feature 🎥 👇 #ENGvIND https://t.co/D1Og2z9fOh pic.twitter.com/2P2X2WQTUV — BCCI (@BCCI) July 18, 2022 గతంలో.. నిజానికి మెజారిటీ మ్యాచ్లలో టాపార్డర్ విజయవంతమైన ఇన్నింగ్స్ ఆడటంతో మిడిలార్డర్ను పెద్దగా పరీక్షించాల్సిన అవసరం రాలేదనే చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కీలక బ్యాటర్ కోహ్లి తరచుగా విఫలమవుతున్నాడు. రోహిత్ సైతం గత కొన్ని మ్యాచ్లలో తన ఇన్నింగ్స్ను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ప్రపంచకప్-2023.. ఆ సమస్య తీరినట్లే! ఇదిలా ఉంటే.. పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్గా నియమితుడైన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ప్రపంచకప్-2023 టోర్నీకి ముందే మిడిలార్డర్ను పటిష్టం చేసే అంశంపై దృష్టి సారిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్కు తోడు పంత్, హార్దిక్ పాండ్యా రాణించడం.. సూర్యకుమార్ కూడా మెరుగైన ఇన్నింగ్స్ ఆడుతున్న నేపథ్యంలో మిడిలార్డర్ సమస్య తీరినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెస్టు క్రికెట్లో ఒంటిచేత్తో గెలిపించగల సత్తా పంత్ సొంతం. ఓల్డ్ ట్రఫోర్డ్ మ్యాచ్తో వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసిన ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్ వన్డే ఫార్మాట్లోనూ మెరుగ్గా రాణించగలనని నిరూపించాడు. నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. ఇక రీఎంట్రీలో అదరగొడుతున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆరో స్థానానికి తానే సరైనోడినని నిరూపించుకుంటున్నాడు. ఇక కేఎల్ రాహుల్ వన్డే ఫార్మాట్లో మిడిలార్డర్లోనూ రాణించగలడు. ఒకవేళ అనువభవజ్ఞుడైన ధావన్ రోహిత్కు జోడీగా ఓపెనింగ్కు దిగితే.. రాహుల్ ఐదో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఇక రాహుల్ ఏదేని కారణాల వల్ల జట్టుకు దూరమైనా.. ఐదో స్థానం కోసం శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా పోటీపడే అవకాశం ఉంది. కాబట్టి పంత్, పాండ్యా నిలకడగా రాణిస్తే మిడిలార్డర్ సమస్య కొంతమేర తీరినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ICC WC: కోహ్లి కెప్టెన్సీలో గనుక నేను ఆడి ఉంటే.. ఇండియా 3 ప్రపంచకప్ టైటిళ్లు గెలిచేది! -
కోహ్లి కెప్టెన్సీలో గనుక నేను ఆడి ఉంటే.. ఇండియా 3 ప్రపంచకప్లు గెలిచేది!
Sreesanth: టీమిండియా ఐసీసీ టోర్నీ గెలిచిన రెండు సందర్భాల్లో జట్టులో భాగమై మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన టీమిండియాలో అతడు సభ్యుడు. అయితే, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా శ్రీశాంత్ కెరీర్ మసకబారిపోయింది. #OnThisDay in 2007! The @msdhoni-led #TeamIndia created history as they lifted the ICC World T20 Trophy. 🏆 👏 Relive that title-winning moment 🎥 👇 pic.twitter.com/wvz79xBZJv — BCCI (@BCCI) September 24, 2021 ఈ నేపథ్యంలో నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్.. దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టినా.. జాతీయ జట్టులో పునరాగమనం చేయలేకపోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో అతడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. Etched in our memories FOREVER! ☺️ ☺️ 🗓️ #OnThisDay in 2011, #TeamIndia won the ODI World Cup for the second time. 🏆 🙌 pic.twitter.com/HcsrWzJGJ1 — BCCI (@BCCI) April 2, 2022 ఇదిలా ఉంటే.. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి సారథిగా విజయవంతమైనా.. పలు చిరస్మరణీయ విజయాలు అందించినా.. మేజర్ టోర్నీ మాత్రం గెలవలేకపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీశాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నేనే గనుక జట్టులో ఉండి ఉంటే! టైమ్స్ నౌతో మాట్లాడిన శ్రీశాంత్.. ‘‘ఒకవేళ నేను విరాట్ కెప్టెన్సీలో గనుక ఆడి ఉంటే.. కచ్చితంగా 2015, 2019, 2021 వరల్డ్కప్ టైటిల్ గెలిచేవాళ్లం’’ అని వ్యాఖ్యానించాడు. ఇక యార్కర్లు సంధించడంలో ప్రావీణ్యం ఉన్న ఈ 39 ఏళ్ల బౌలర్.. టెన్నిస్ బాల్తో యార్కర్లు వేయడం తన కోచ్ ప్రాక్టీసు చేయించారని తెలిపాడు. పరిస్థితులకు తగ్గట్లుగా... బ్యాటర్ ఆటతీరును సరిగ్గా అంచనా వేయగలిగితే యార్కర్లు వేయడం సులువేనని శ్రీశాంత్ పేర్కొన్నాడు. ఈ విషయంలో బుమ్రా కూడా ఇదే చెబుతాడని పేర్కొన్నాడు. కాగా యార్కర్లు వేయడంలో స్పెషలిస్టు అయిన జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం టీమిండియాలో పేస్ దళానికి నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్ట్ల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. ఇక 2007 టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో ఫైనల్లో శ్రీశాంత్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, మ్యాచ్ ఆఖరి ఓవర్లో పాక్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ ఆడిన స్కూప్ షాట్కు శ్రీశాంత్ పట్టిన క్యాచ్తో ఇండియా విజయం ఖరారైన దృశ్యాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోయాయి. ఇక 2011 వన్డే ప్రపంచకప్లో శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్లో శ్రీశాంత్ ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి 52 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. చదవండి: India Vs West Indies 2022: విండీస్తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! Virat Kohli: ఒక్క 20 నిమిషాలు చాలు.. కోహ్లి సమస్యను పరిష్కరిస్తా! నేను కూడా ఆ ఇబ్బంది ఎదుర్కొన్నా! -
WC 2023: టాప్లోకి దూసుకువచ్చిన బంగ్లాదేశ్.. ఏడో స్థానంలో రోహిత్ సేన!
ICC ODI WC Super League Standings: వెస్టిండీస్తో వన్డే సిరీస్లో అదరగొట్టిన బంగ్లాదేశ్ ఐసీసీ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. విండీస్తో రెండో వన్డేలో విజయంతో సిరీస్ను కైవసం చేసుకున్న బంగ్లా.. మొత్తంగా 130 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా 2020-23గానూ ఇప్పటి వరకు బంగ్లాదేశ్ పందొమ్మిది మ్యాచ్లు ఆడి.. 13 గెలిచింది. ఈ నేపథ్యంలో టాప్లోకి దూసుకువచ్చింది. కాగా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్.. టెస్టు, టీ20 సిరీస్లను కోల్పోయినప్పటికీ వన్డే సిరీస్ను మాత్రం ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తేడాతో కైవసం చేసుకుంది. TOSS🪙: Captain @nicholas_47 is second best at toss today. 🇧🇩 have sent West Indies in to 🏏 in this 2nd One-Day International at Providence stadium 🇬🇾. #WIvBAN pic.twitter.com/AyYdD0vxJR — Windies Cricket (@windiescricket) July 13, 2022 Not the #MenInMaroon day at the office. Well played to 🇧🇩 @BCBtigers #WIvBAN pic.twitter.com/gj6rJ26tM0 — Windies Cricket (@windiescricket) July 13, 2022 ఇక ఇంగ్లండ్ 18 మ్యాచ్లకు గానూ 12 గెలిచి 125 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్ వరుసగా టాప్-5లో స్థానం దక్కించుకున్నాయి. మరోవైపు తాజాగా బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ కోల్పోయిన పరాజయాల సంఖ్య 14కు చేరింది. దీంతో ఆడిన 22 మ్యాచ్లలో కేవలం ఎనిమిది మాత్రమే గెలుపొందిన విండీస్ జట్టు ఆరోస్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్తో మొదటి వన్డేలో అదరగొట్టిన టీమిండియా ఏడో స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఆసీస్తో వన్డే సిరీస్ రద్దు చేసుకున్న దక్షిణాఫ్రికా పదకొండో స్థానానికి పడిపోయి పదమూడింటిలో కేవలం 4 విజయాలతో పదకొండో స్థానంలో నిలిచింది. కాగా ప్రపంచకప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించాలంటే ఆయా జట్లు టాప్-8లో నిలవాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. కాగా ఐసీసీ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే జట్టు గణాంకాలతో సంబంధం లేకుండా నేరుగా అర్హత సాధిస్తుంది. ఈసారి భారత్ ఈ ఈవెంట్ను హోస్ట్ చేస్తోంది. ఇక టాప్-8లో అడుగుపెట్టిన జట్లతో పాటు క్వాలిఫైయర్ రౌండ్లో విజయం సాధించిన రెండు జట్లు ప్రపంచకప్ రేసులో నిలుస్తాయి. చదవండి: Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! Virat Kohli: అప్పుడు నేను, సచిన్, ద్రవిడ్! ఇప్పుడు కోహ్లి వంతు.. ఇక ముందు కూడా! -
WC 2023: దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి అవుట్?!
ICC ODI World Cup 2023: దేశవాళీ టీ20 క్రికెట్ లీగ్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రొటిస్ ప్రపంచకప్-2023 టోర్నీ అర్హత అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను రద్దు చేసుకునే పరిస్థితులు తలెత్తిన తరుణంలో వరల్డ్కప్ ఈవెంట్లో నేరుగా అడుగుపెట్టే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు ప్రొటిస్ జట్టు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే, తమ దేశంలో కొత్తగా టీ20 దేశవాళీ క్రికెట్ లీగ్ నేపథ్యంలో షెడ్యూల్ను మార్చాల్సిందిగా దక్షిణాఫ్రికా బోర్డు.. ఆసీస్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. అస్సలు కుదరదు! కానీ, ఇప్పటికే కంగారూల క్యాలెండర్ వివిధ అంతర్జాతీయ మ్యాచ్లతో బిజీగా ఉన్న కారణంగా రీషెడ్యూల్ చేసేందుకు వీలుపడదని ఆసీస్ బోర్డు స్పష్టం చేసింది. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రొటిస్ బోర్డు ఆసీస్తో వన్డే సిరీస్ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ వన్డే వరల్డ్కప్ సూపర్లీగ్ పాయింట్ల పట్టికలో పదకొండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు మెగా ఈవెంట్ ఎంట్రీ సంక్లిష్టతరం కానుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్ రేసు నుంచి ప్రొటిస్ జట్టు అవుట్?! సూపర్లీగ్లో టాప్-8లో నిలిచిన జట్లు ఈ ఈవెంట్కు నేరుగా అర్హత సాధిస్తాయి. దక్షిణాఫ్రికా పరిస్థితి ఇలా ఉంటే ఆస్ట్రేలియా ఇప్పటికే 70 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. జింబాబ్వేతో టూర్ నేపథ్యంలో మరో మూడు వన్డేలు ఆడనుంది కూడా! దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు చేసుకున్న కారణంగా కంగారూలకు పెద్దగా నష్టమేమీ లేదు! ఈ విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ మాట్లాడుతూ.. ‘‘జనవరిలో జరగాల్సిన వన్డే సిరీస్ నుంచి దక్షిణాఫ్రికా తప్పుకోవడం నిరాశ కలిగించింది.అయితే, మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ మాత్రం యథావిథిగా జరుగుతుంది. మా షెడ్యూల్ బిజీగా ఉన్న కారణంగానే వన్డే సిరీస్ను రీషెడ్యూల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు. పూర్తిగా తప్పుకొన్నట్లేనా? కాదు! మొత్తం 13 దేశాలు పాల్గొనే ఈ సూపర్ లీగ్లో 12 ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన దేశాలతో పాటు నెదర్లాండ్స్ పోటీ పడనుంది. ఈ క్వాలిఫికేషన్ రౌండ్కు నెదర్గాండ్స్ గతంలోనే అర్హత సాధించింది. 2015-17లో నిర్వహించిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ సూపర్ లీగ్లో విజేతగా నిలవడం ద్వారా నెదర్లాండ్స్ వరల్డ్కప్- 2023 క్వాలిఫికేషన్ రేసులో నిలిచింది. మరో రెండు దేశాల కోసం క్వాలిఫికేషన్ రౌండ్ నిర్వహిస్తున్నారు. ఇక ఆతిథ్య దేశం భారత్ ప్రపంచకప్-2023కి నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో టాప్-8 స్థానాల్లో ఉన్న మరో ఏడు పూర్తిస్థాయి సభ్య దేశాలు కూడా పోటీకి నేరుగా క్వాలిఫై అవుతాయి. కాబట్టి దక్షిణాఫ్రికా గనుక టాప్-8లో స్థానం దక్కించుకోలేకపోతే నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోతుంది. ఇందుకోసం అసోసియేట్ దేశాలతో క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ రౌండ్లో విజయం సాధించిన రెండు జట్లు రేసులో నిలుస్తాయి. చదవండి: IND VS ENG 1st ODI: రోహిత్ శర్మ భారీ సిక్సర్.. బంతి తగిలి చిన్నారికి గాయం Jasprit Bumrah: ఇంగ్లండ్ బ్యాటర్లను ఉతికి ‘ఆరే’సిన బుమ్రా.. అద్భుతం అంటూ వారిని ట్రోల్ చేసిన భార్య సంజనా! -
ODI WC 1975: జగజ్జేత.. నాడు విండీస్ను గెలిపించింది ఎవరో తెలుసా?
ICC ODI World Cup 1975 AUS Vs WI- Winner West Indies: క్రికెట్కు పుట్టినిల్లు ఇంగ్లండ్ అయినా.. మొట్టమొదటి వన్డే వరల్డ్కప్ సాధించి తన పేరును సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించుకున్న ఘనత మాత్రం వెస్టిండీస్కే దక్కింది. జగజ్జేత... ఈ మాట వింటుంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదా! మరి తొలిసారిగా సరిగ్గా ఇదే రోజు విండీస్ జట్టు క్రీడా ప్రపంచం చేత చాంపియన్గా నీరాజనాలు అందుకుంది. లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాను ఓడించి విశ్వ విజేతగా అవతరించింది. మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి తమ దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా చేసింది. ట్రోఫీతో విండీస్ కెప్టెన్ లాయిడ్ (PC: ICC) టోర్నీ సాగింది ఇలా! అది 1975.. పరిమిత ఓవర్ల ప్రపంచకప్ రేసులో ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఈస్ట్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తదితర 8 జట్లు పోటీ పడ్డాయి. జూన్ 7న ఇంగ్లండ్- ఇండియా మ్యాచ్తో లార్డ్స్ మైదానంలో ఆరంభమైన ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఏకంగా టీమిండియాపై 202 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ తూర్పు ఆఫ్రికాను 181 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆ తదుపరి మ్యాచ్లలో ఆస్ట్రేలియా పాకిస్తాన్ను 73 పరుగుల తేడాతో ఓడించగా.. వెస్టిండీస్ శ్రీలంకపై 9 వికెట్ల తేడా(236 బంతులు మిగిలి ఉండగా)తో గెలుపొందింది. అదే విధంగా.. జూన్ 11 నాటి మ్యాచ్లలో ఇంగ్లండ్ న్యూజిలాండ్ మీద 80 పరుగులతో, ఆస్ట్రేలియా శ్రీలంకపై 52 పరుగులతో, వెస్టిండీస్ పాకిస్తాన్ మీద ఒక వికెట్(రెండు బంతులు మిగిలి ఉండగా) తేడాతో, ఇండియా- తూర్పు ఆఫ్రికా మీద 10 వికెట్ల తేడాతో(181 బంతులు మిగిలి ఉండగా) జయభేరి మోగించాయి. ఆ తర్వాత జూన్ 14న జరిగిన మ్యాచ్లలో పాకిస్తాన్ శ్రీలంక మీద 192 పరుగులు, వెస్టిండీస్ ఆస్ట్రేలియా మీద 7 వికెట్లు(84 బంతులు మిగిలి ఉండగా), న్యూజిలాండ్ ఇండియా మీద 4 వికెట్లు, ఇంగ్లండ్ తూర్పు ఆఫ్రికా మీద 196 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటాయి. సెమీస్కు చేరిన జట్లు ఈ క్రమంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. మొదటి సెమీస్ మ్యాచ్లో భాగంగా ఇంగ్లండ్- ఆస్ట్రేలియా తలపడగా.. 188 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం ఆసీస్ను వరించింది. ఇక రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్ 119 బంతులు మిగిలి ఉండగానే కివీస్ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ జట్లు ఫైనల్కు అర్హత సాధించాయి. ఫైనల్లో టాస్ గెలిచి జూన్ 21న లార్డ్స్ మైదానంలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కంగారూ జట్టు కెప్టెన్ ఇయాన్ చాపెల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఆసీస్ బౌలర్లు చెలగరేగడంతో విండీస్ ఓపెనర్లు రాయ్ ఫ్రెడెరిక్స్, సర్ గోర్డాన్ గ్రీనిడ్జ్ వరుసగా 7, 13 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్డౌన్లో వచ్చిన అల్విన్ కల్లిచర్రాన్ 12 పరుగులు చేసి నిష్క్రమించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రోహన్ కన్హాయ్ 105 బంతుల్లో 55 పరుగులతో రాణించాడు. ఇతడికి జతకలిసిన కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ 85 బంతుల్లో 102 పరుగులు సాధించి విండీస్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. సర్ వివియన్ రిచర్డ్స్ 5 పరుగులకే అవుట్ కావడంతో మరోసారి నిరాశ ఆవహించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కీత్ బోయ్సే 34 పరుగులు చేయగా.. బెర్నార్డ్ జూలియన్ 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. డెరిక్ ముర్రే 14, వాన్బర్న్ హోల్డర్ 6(నాటౌట్) పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 60 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. చాపెల్ రనౌట్ కావడంతో ఇక లక్ష్య ఛేదనకు దిగిన చాపెల్ బృందానికి ఓపెనర్ అలన్ టర్నర్ 40 పరుగులు చేసి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ రిక్ మెకాస్కర్(7) విఫలం కాగా.. అర్ధ శతకం సాధించి ప్రమాదకరంగా మారుతున్న కెప్టెన్ ఇయాన్ చాపెల్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. రిచర్డ్స్, లాయిడ్ కలిసి రనౌట్ చేశారు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ పతనం ఆరంభమైంది. గ్రెగ్ చాపెల్ 15 పరుగులు చేసి రనౌట్ కాగా.. వాలర్డ్స్ , రోడ్ మార్ష్, రాస్ ఎడ్వర్డ్స్, గ్యారీ గిల్మోర్, మాక్స్ వాకర్, జెఫ్ థామ్సన్, డెనిస్ లిలీ వరుసగా 35,11,28,14,7,21,16 పరుగులు చేశారు. విండీస్ బౌలర్ల ధాటికి నిలకవలేక 58.4 ఓవర్లలో 274 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి చాంపియన్గా లాయిడ్ బృందం తద్వారా 17 పరుగుల తేడాతో ఆసీస్పై విజయం సాధించి వెస్టిండీస్ తొట్టతొలి చాంపియన్గా నిలిచింది. శతక వీరుడు విండీస్ కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించి మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు. ఆ తర్వాత 1979 వరకు వెస్టిండీస్ చాంపియన్గా కొనసాగడం విశేషం. ఇక వన్డే వరల్డ్కప్ను ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదుసార్లు, భారత్, వెస్టిండీస్ చెరో రెండుసార్లు, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్ ఒక్కోసారి గెలవగా.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాకు మాత్రం ఈ ఐసీసీ ట్రోఫీ ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. చదవండి: Ranji Trophy 2022: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్ సర్తో పాటు నా పేరు కూడా: యశస్వి -
హోల్డర్కు రెస్ట్.. నెదర్లాండ్స్, పాక్తో సిరీస్కు విండీస్ జట్టు ఇదే!
నెదర్లాండ్స్, పాకిస్తాన్తో పర్యటనల నేపథ్యంలో వెస్టిండీస్ తమ క్రికెట్ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమ్ను ఎంపిక చేసింది. ఐసీసీ ప్రపంచకప్ సూపర్లీగ్లో భాగంగా జరుగనున్న ఈ సిరీస్లతో పరిమిత ఓవర్ల కెప్టెన్గా నికోలస్ పూరన్ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇక పూరన్ నాయకత్వంలోని ఈ జట్టులో కొత్త ముఖాలు జేడెన్ సీల్స్, షెర్మోన్ లూయిస్, కీసీ కార్టీకి చోటు దక్కింది. జేడెన్, షెర్మోన్ ఫాస్ట్ బౌలర్లు కాగా.. కార్టీ బ్యాటర్. కాగా మే 31న నెదర్లాండ్స్తో విండీస్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022లో భాగమైన పూరన్, పావెల్, రొమారియో షెఫర్డ్ తదితరులు లీగ్ ముగిసిన వెంటనే జాతీయ జట్టుతో కలవనున్నారు. ఇక లక్నో సూపర్జెయింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న జేసన్ హోల్డర్కి మాత్రం సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. నెదర్లాండ్స్, పాకిస్తాన్తో వన్డే సిరీస్లకై వెస్టిండీస్ 15 మంది సభ్యులతో కూడిన జట్టు: 👉🏾నికోలస్ పూరన్(కెప్టెన్), షాయ్ హోప్(వైస్ కెప్టెన్), ఎన్క్రుమా బానర్, షామర్ బ్రూక్స్, కేసీ కార్టీ, అకీల్ హొసేన్, అల్జరీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, షెర్మోన్ లూయిస్, కైల్ మేయర్స్, అండర్సన్ ఫిలిప్, రోవ్మన్ పావెల్, జేడెన్ సీల్స్, రొమారియో షెఫర్డ్, హైడెన్ వాల్ష్ జూనియర్. వెస్టిండీస్ నెదర్లాండ్స్ టూర్ 2022 షెడ్యూల్: 👉🏾మే 31- మొదటి వన్డే- వీఆర్ఏ క్రికెట్ గ్రౌండ్- అమ్స్టెల్వీన్ 👉🏾జూన్ 2- రెండో వన్డే- వీఆర్ఏ క్రికెట్ గ్రౌండ్- అమ్స్టెల్వీన్ 👉🏾జూన్ 4- మూడో వన్డే-వీఆర్ఏ క్రికెట్ గ్రౌండ్- అమ్స్టెల్వీన్ వెస్టిండీస్ పాకిస్తాన్ టూర్ 2022 షెడ్యూల్ 👉🏾జూన్ 8- మొదటి వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి 👉🏾జూన్ 10- రెండో వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి 👉🏾జూన్ 12- మూడో వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి చదవండి👉🏾Jasprit Bumrah: నాకు అవన్నీ తెలుసు.. అయినా నేను అలాంటి వాడిని కాదు: బుమ్రా -
SA Vs Ban: సరికొత్త చరిత్ర.. వరల్డ్కప్ సూపర్ లీగ్ టాప్లో బంగ్లాదేశ్!
ICC Cricket World Cup Super League points table (Updated): ప్రొటిస్ గడ్డపై బంగ్లాదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణాయక మూడో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రొటిస్ జట్టును వారి సొంతగడ్డపై ఓడించి తొలిసారి 2–1తో సిరీస్ను సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ (5/35) దెబ్బకు ముందుగా దక్షిణాఫ్రికా 37 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బంగ్లా 26.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 156 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (87 నాటౌట్; 14 ఫోర్లు) మెరిశాడు. తస్కిన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇక ఈ అద్భుత విజయంతో ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ సూపర్ లీగ్లో బంగ్లాదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 18 మ్యాచ్లు ఆడిన బంగ్లా జట్టు... 12 విజయాలు సాధించి, ఆరింట ఓడి 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. PC: ICC మరోవైపు ఆడిన 15 మ్యాచ్లలో తొమ్మిదింట గెలిచి, 5 పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్ 95 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక టీమిండియా ఆడిన 12 మ్యాచ్లలో ఎనిమిది గెలిచి, నాలుగింట ఓడింది. తద్వారా 79 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అఫ్గనిస్తాన్, ఐర్లాండ్ వరుసగా 70, 68 పాయింట్లతో టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. ఇదిలా బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాభవం పాలైన దక్షిణాఫ్రికా టాప్-8లో చోటు దక్కించుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ప్రొటిస్ 49 పాయింట్లతో తొమ్మిదో స్థానానికే పరిమితమైంది. దీంతో వరల్డ్కప్-2023 టోర్నీకి అర్హత సాధించడంలో కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్నకు ముందుగా అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా ఈవెంట్కు భారత్ ఆతిథ్యమిస్తున్నందుకు వల్ల టీమిండియాకు నేరుగా అర్హత లభిస్తుంది. భారత్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్టు కూడా ఈ లీగ్లో భాగమై ఉంటుంది. చదవండి: PAK vs AUS: 20 పరుగుల వ్యవధిలో ఆలౌట్.. పేరును సార్థకం చేసుకున్న పాక్ జట్టు Team's celebration with "Amra korbo joy" song after the series win.#BCB #Cricket #SAvBAN pic.twitter.com/Qw7hva9BHb — Bangladesh Cricket (@BCBtigers) March 23, 2022 -
కపిల్లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్ గెలుస్తారు!
Balwinder Sandhu: ‘‘కపిల్లా బ్యాటింగ్ చేయండి.. కపిల్లా ఫీల్డింగ్ చేయండి. కపిల్లా కెప్టెన్సీ చేయండి. అప్పుడే వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్... 2023లో వన్డే ప్రపంచకప్ గెలవగలం’’- వరుస ఐసీసీ టోర్నీల నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రన్మెషీన్ విరాట్ కోహ్లి సహా భారత ఆటగాళ్లను ఉద్దేశించి 1983 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా సభ్యుడు బల్వీందర్ సంధు చేసిన వ్యాఖ్యలు ఇవి. అన్ని విభాగాల్లో రాణిస్తేనే ఐసీసీ టైటిల్ గెలుస్తారని.. అందుకోసం అలుపెరుగక కృషి చేయాలని సూచించారు. కాగా భారత్కు మొట్టమొదటి వరల్డ్కప్ అందించిన దిగ్గజ సారథి కపిల్ దేవ్ జీవితం ఆధారంగా.. 1983 వరల్డ్ కప్ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్లో 83 మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. డిసెంబరు 24న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ వీక్షించిన సందర్భంగా జీ న్యూస్తో ముచ్చటించిన సంధు.. భారత జట్టును ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇక కపిల్ దేవ్ మాట్లాడుతూ... ‘‘అప్పట్లో మాకు సోషల్ మీడియా లేదు. క్రీడాస్ఫూర్తిలో వివాదాలు కొట్టుకోపోయేవి. ప్రతి ఒక్కరు ఆటపై దృష్టి పెట్టి... కెరీర్లో ముందుకు వెళ్లేవారు. అయితే, చరిత్ర సృష్టించేవాళ్లు కూడా కావాలి కదా. ఆ చరిత్రను చెప్పేవాళ్లు కూడా కావాలి. ఆ మధుర జ్ఞాపకాలను వెండితెర మీద చూడటం సంతోషంగా ఉంది’’ అని ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. విమర్శలకు కృంగిపోతే ఏమీ సాధించలేమని.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు దరిచేరతాయని యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపారు. నాడు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు బలమైన విండీస్ను ఓడించి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: మ్యాచ్ చివరి బంతికి ఊహించని ట్విస్ట్ IPL 2022- SRH: సన్రైజర్స్ బ్యాటింగ్ కోచ్గా బ్రియన్ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ -
Ind Vs Sl: గంగూలీ, ద్రవిడ్.. వీరోచిత ఇన్నింగ్స్ గుర్తుందా!
వెబ్డెస్క్: 22 ఏళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు... టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఐసీసీ వన్డే వరల్డ్ కప్-1999లో ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ను క్రీడాభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. ఓపెనర్గా బరిలోకి దిగిన గంగూలీ 158 బంతుల్లో 183 పరుగులు చేస్తే... వన్డౌన్లో క్రీజులోకి వచ్చిన ద్రవిడ్... 129 బంతుల్లో 145 పరుగులు చేసి అదరగొట్టాడు. ఫలితంగా మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకపై 157 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టాంటన్ హీరోలు.. ఐసీసీ వన్డే వర్ల్డ్ కప్-1999లో భాగంగా ఇంగ్లండ్లోని టాంటన్లో జరిగిన మ్యాచ్లో, టాస్ గెలిచిన శ్రీలంక టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో, చమిందా వాస్ బౌలింగ్లో ఓపెనర్ సదగొప్పన్ రమేశ్ 5 పరుగులకే అవుట్ కాగా... ద్రవిడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే నిలకడగా ఆడుతున్న గంగూలీ చెలరేగి ఆడటం మొదలుపెట్టాడు. మరో ఎండ్ నుంచి సహకారం అందిస్తూనే.. ద్రవిడ్ సైతం దూకుడు ప్రదర్శిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. తొలిసారిగా.. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి 300 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా గంగూలీ- ద్రవిడ్ ద్వయం నిలిచింది. 44.5 ఓవర్లలో వీరిద్దరు 318 పరుగులు జోడించారు. గంగూలీ 17 ఫోర్లు, 7 సిక్సర్లు బాదగా, ద్రవిడ్ 17 ఫోర్లు, ఒక సిక్సర్తో అలరించాడు. ఇక విక్రమ సింఘే బౌలింగ్లో గంగూలీ పెవిలియన్ చేరడం, ముత్తయ్య మురళీధరన్ అద్భుత త్రోకు ద్రవిడ్ రనౌట్ కావడంతో సూపర్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్లో సచిన్ 2, అజయ్ జడేజా 5, రాబిన్ సింగ్ 0.. అత్యల్ప స్కోర్లకే పరిమితమై పూర్తిగా విఫలం కాగా, కెప్టెన్ అజారుద్దీన్ 12 పరుగులు(నాటౌట్) చేశాడు. లంక బౌలర్లలో ప్రమోద్య విక్రమ సింఘే అత్యధికంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రాబిన్ సింగ్ విశ్వరూపం ఇక శ్రీలంకకు 374 పరుగుల లక్ష్యం విధించిన భారత్.. రాబిన్ సింగ్ విశ్వరూపం ప్రదర్శించడంతో సునాయాసంగా విజయం సాధించగలిగింది.157 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో రాబిన్ సింగ్ 5 వికెట్లు పడగొట్టగా, శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, మొహంతి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఈ మెగా టోర్నీలో గ్రూపు స్టేజ్లో మూడు మ్యాచ్లు గెలిచిన భారత్.. సూపర్ 8లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ఆ ఏడాది ఆస్ట్రేలియా ప్రపంచకప్ విజేతగా నిలిచింది. చదవండి: World Cup Super League: భారీ విజయం.. టాప్లో బంగ్లాదేశ్! -
World Cup Super League: భారీ విజయం.. టాప్లో బంగ్లాదేశ్!
దుబాయ్: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్లో బంగ్లాదేశ్ అగ్రస్థానానికి చేరుకుంది. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుని పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక 2023 వరల్డ్ కప్నకు అర్హత సాధించే క్రమంలో ఇప్పటివరకు మొత్తంగా 8 వన్డేలు ఆడిన బంగ్లాదేశ్... ఐదింటిలో గెలుపొంది 50 పాయింట్లతో టాప్లో కొనసాగుతోంది. కాగా ఆడిన 9 మ్యాచ్లలో నాలుగింటిలో గెలుపొందిన ఇంగ్లండ్ 40 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... రన్రేట్లో వెనుకబడిన పాకిస్తాన్ 40 పాయింట్లతో మూడో ప్లేస్లో ఉంది. ఇక టీమిండియా విషయానికొస్తే... 6 వన్డేల్లో 3 గెలిచి, 3 ఓడి.. 29 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్కు తాజాగా సిరీస్ సమర్పించుకున్న శ్రీలంక.. ఇప్పటి వరకు ఆడిన ఐదింటిలోనూ ఓడిపోయి, బోణీ కొట్టలేక.. -2 పాయింట్లతో అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. ఇక ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్నకు అర్హత సాధిస్తాయి. కాగా ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్నందుకుగానూ టీమిండియాకు నేరుగా అర్హత లభిస్తుంది. టీమిండియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్ జట్టు కూడా ఈ లీగ్లో భాగమై ఉంటుంది. ఇక మంగళవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 103 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కర్టెసీ: ఐసీసీ చదవండి: BAN Vs SL: బంగ్లాదేశ్దే వన్డే సిరీస్; అలా అయితే ఇంకా సంతోషించేవాడిని! -
నన్ను, నా భార్యను చంపుతామని బెదిరించారు: డుప్లెసిస్
జోహన్నస్బర్గ్: ‘‘నన్ను, నా భార్యను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఘోరమైన విమర్శలు. శ్రుతిమీరిన కామెంట్లు. మళ్లీ ఇలా ఆడితే పరిస్థితి దారుణంగా ఉంటుందంటూ హెచ్చరికలు వచ్చాయి’’ అంటూ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 2011 నాటి చేదు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. వన్డే వరల్డ్కప్-2011లో భాగంగా బంగ్లాదేశ్లోని ఢాకాలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన డేనియల్ వెటోరి సారథ్యంలోని కివీస్ జట్టు నిర్దిష్ట 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసి ప్రొటిస్ టీమ్కు సవాల్ విసిరింది. అయితే లక్ష్యఛేదనలో తడబడ్డ దక్షిణాఫ్రికా 172 పరుగులకే చేతులెత్తేసి భారీ పరాజయం మూటగట్టుకుంది. 121 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో ఏబీ డివిలియర్స్ రనౌట్ కావడంతో పరిస్థితి దిగజారింది. మేజర్ టోర్నీలో న్యూజిలాండ్ ముందు తలవంచకతప్పలేదు. అంతేకాదు, డుప్లెసిస్, కివీస్ పన్నెండో ఆటగాడు కైల్ మిల్స్ను నెట్టివేయడం విమర్శలకు దారి తీసింది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత కూడా పడింది. ఈ విషయాలను గుర్తు చేసుకున్న డుప్లెసిస్ తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ నుంచి మా జట్టు నిష్క్రమించగానే విమర్శల జడి కురిసింది. కొంతమందైతే ఏకంగా చంపేస్తామంటూ బెదిరించారు. ఇలాంటి పరిణామాలు మనసును కుంగదీస్తాయి. ప్రతి ఒక్క ఆటగాడి జీవితంలో ఇలాంటివి సహజం. కానీ, కఠినంగా శ్రమిస్తే తప్పకుండా సత్ఫలితాలు పొందగలం. నేనూ అదే చేశాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న డుప్లెసిస్.. టోర్నీ వాయిదా పడటంతో స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్లలో అతడు 320 పరుగులు చేసి సత్తా చాటాడు. చదవండి: ఇండియాకు వచ్చెయ్ ప్లీజ్ .. పంత్ స్థానంలో ఆడు -
ప్రపంచకప్ సూపర్ లీగ్లో మెరుగుపడిన టీమిండియా స్థానం
ముంబై: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్లో టీమిండియా ఏడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1తేడాతో కైవసం చేసుకున్న భారత్.. 6 మ్యాచ్ల్లో 3 విజయాలు, 3 ఓటములతో 29 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ సిరీస్ చేజార్చుకున్నప్పటికీ.. పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు 9 మ్యాచ్ల్లో 4 విజయాలు, 5 ఓటములతో 40 పాయింట్లు దక్కించుకొని టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. ఈ జాబితాలో మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా(6 మ్యాచ్ల్లో 4గెలుపు, 2ఓటమి) కూడా 40 పాయింట్లు సాధించినప్పటికీ.. నెట్రన్రేట్లో ఇంగ్లాండ్ కన్నా వెనకబడి ఉండటంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు తలో 30 పాయింట్లు సాధించి 3 నుంచి 6 స్థానాల వరకు వరుసగా ఉన్నాయి. 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్న దాయాది పాక్ 20 పాయింట్లతో భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు బోణీ కొట్టాల్సి ఉంది. ఇదిలా ఉండగా పాయింట్ల పట్టికలో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు, భారత్ ఆతిధ్యమివ్వనున్న 2023 వరల్డ్ కప్కు అర్హత సాధిస్తాయి. టోర్నీకి ఆతిథ్యమిస్తున్నందుకు టీమిండియాకు నేరుగా అర్హత లభిస్తుంది. చదవండి: భారత ఉసేన్ బోల్ట్ శ్రీనివాస గౌడ మరో రికార్డు -
ప్రపంచకప్ నిర్వహణకు మేం సిద్ధం!
దుబాయ్: ఎలాంటి అవాంతరం లేకుండా వచ్చే ఏడాది భారత్లో ఐసీసీ టి20 ప్రపంచకప్–2021ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని దేశాల్లాగే భారత్ కూడా కోవిడ్ కోరల్లో ఉన్నప్పటికీ టోర్నీ సమయానికల్లా పరిస్థితుల్లో మార్పు ఉండవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే మెగా ఈవెంట్ వచ్చే అక్టోబర్–నవంబర్ నెలల్లో జరగనుంది. ఏడాది కాలానికి కౌంట్డౌన్ను మొదలు పెడుతూ దుబాయ్లో ఐసీసీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో బోర్డు చీఫ్ దాదాతో పాటు కార్యదర్శి జై షా, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ ఐసీసీ ఈవెంట్ ఆతిథ్యం గొప్ప గౌరవమని అన్నారు. ‘నేను ఆటగాడిగా ఐసీసీ టోర్నమెంట్లను ఆస్వాదించాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రేక్షకులు ఎగబడి చూసే వినోదం, సందడి వాతావరణం నాకు తెలుసు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని అలాంటి సందడి తీసుకొస్తాం’ అని అన్నారు. ప్రేక్షకులు రావాలి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని మాట్లాడుతూ మెగా ఈవెంట్ ప్రేక్షకుల సమక్షంలో జరగాలని ఆశించారు. ‘ఇటీవల కొన్ని క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న టోర్నీలు, ఐపీఎల్ విజయవంతమైన అనుభవాలతో మెగా ఈవెంట్ కూడా జరుగుతుంది. 2016 తర్వాత భారత్లో జరిగే ఐసీసీ టోర్నీ కావడంతో ఈ ఈవెంట్పై ఎంతో ఆసక్తి నెలకొంది. అలాగే టోర్నీ సజావుగా జరిగేందుకు మేం కూడా భారత బోర్డుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, సమాలోచనలు చేస్తూనే ఉన్నాం. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో టోర్నీని ఆరోగ్య, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటాం’ అని సాహ్ని అన్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన పొట్టి మెగా ఈవెంట్ కరోనా వల్లే వాయిదా పడింది. దీంతో 2021 ఆసీస్లో, తదుపరి ఏడాది భారత్లో నిర్వహించే పరస్పర మార్పు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన బీసీసీఐ... పట్టుదలతో 2021 ఈవెంట్ను భారత్లోనే నిర్వహించేందుకు కార్యచరణతో ఉంది. ముందుగా భారత్లో జరగబోయే ముఖాముఖీ సిరీస్లపై దృష్టి సారించి అనంతరం బహుళ జట్లు పాల్గొనే ఈవెంట్లకు బాట వేయాలని బీసీసీఐ యోచిస్తోంది. మరో వైపు వరల్డ్ కప్ సమయానికి కూడా పరిస్థితులు మెరుగుపడకుండా కరోనా ప్రభావం కొనసాగితే టోర్నీ కోసం యూఏఈ, శ్రీలంకలను ప్రత్యామ్నాయం వేదికలుగా ఐసీసీ ఎంపిక చేసింది. -
బ్రెండన్ టేలర్ సెంచరీ వృథా
రావల్పిండి: బ్యాటింగ్లో సమష్టి ప్రదర్శన... బౌలింగ్లో షాహిన్ అఫ్రిది (5/49), వహాబ్ రియాజ్ (4/41) కచ్చితత్వం... వెరసి తొలి వన్డేలో జింబాబ్వేపై పాకిస్తాన్ 26 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల వరల్డ్ కప్ సూపర్ లీగ్లో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ 1–0తో ముందంజ వేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 281 పరుగులు సాధించింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (75 బంతుల్లో 58; 6 ఫోర్లు), హారిస్ సొహైల్ (82 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. చివర్లో ఇమాద్ వసీమ్ (26 బంతుల్లో 34 నాటౌట్; ఫోర్, 2 సిక్స్లు) ధాటిగా ఆడటంతో పాక్ స్కోరు 280 దాటింది. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ, చిసోరో రెండేసి వికెట్లు పడగొట్టారు. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ (117 బంతుల్లో 112; 11 ఫోర్లు, 3 సిక్స్లు) అద్భుత సెంచరీ చేసినా కీలకదశలో అవుటవ్వడం జింబాబ్వే విజయావకాశాలపై ప్రభావం చూపింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ టేలర్ ఐదో వికెట్కు మాధెవెరె (61 బంతుల్లో 55; 7 ఫోర్లు)తో 119 పరుగులు జోడించాడు. తొమ్మిది బంతుల వ్యవధిలో షాహిన్, రియాబ్ వీరిద్దరిని పెవిలియన్కు పంపించడంతో జింబాబ్వే కోలుకోలేకపోయింది. రెండో వన్డే ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది. -
టి20 ప్రపంచకప్పై డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో
దుబాయ్: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలలో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్కు అన్ని రకాలుగా అద్భుత ఆదరణ లభించింది. మెల్బోర్న్ మైదానంలో భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగిన ఫైనల్కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఈ టోర్నీ విజయగాథను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక డాక్యుమెంటరీ రూపంలో తీసుకొచ్చింది. ‘బియాండ్ ద బౌండరీ’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో 17 రోజుల పాటు సాగిన ప్రపంచకప్కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. (11 ఏళ్లకు వచ్చి ‘సున్నా’చుట్టి) ముఖ్యంగా అగ్రశ్రేణి జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ టోర్నీ సమయంలో చేసిన సన్నాహకాలు, నాకౌట్ దశలో చేరడంలో సాగిన వ్యూహ ప్రతివ్యూహాలు వంటి విశేషాలతో ఇది రూపొందింది. తొలిసారి ఒక ఐసీసీ టోర్నీకి అర్హత సాధించిన థాయిలాండ్ జట్టుపై కూడా ప్రత్యేక కథనం ఇందులో కనిపిస్తుంది. ‘100 శాతం క్రికెట్’ పేరుతో తాము మొదలు పెట్టిన ప్రాజెక్ట్లో భాగంగా దీనిని సిద్ధం చేసినట్లు ఐసీసీ సీఈఓ మను సాహ్నీ వెల్లడించారు. ఇంగ్లీష్తో పాటు మరో ఎనిమిది భాషల్లో సబ్టైటిల్స్తో శుక్రవారం ఈ డాక్యమెంటరీ ‘నెట్ఫ్లిక్స్’లో ప్రసారమవుతుంది. -
ప్రపంచకప్లో ఆడటమే నా లక్ష్యం
కొచ్చి : వన్డే ప్రపంచకప్-2023లో ఆడటమే తన లక్ష్యమని భారత వివాదస్పద క్రికెటర్ శ్రీశాంత్ స్పష్టం చేశాడు. రంజీల్లో రాణించి త్వరలోనే టీమిండియాకు ఎంపిక అవుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్పై బీసీసీఐ ఏడేళ్ల నిషేధాన్ని విధించింది. ఆ నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్తో ముగుస్తుండటంతో శ్రీశాంత్తో పాటు అతడి అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిషేధం ముగియగానే కేరళ తరుపున రంజీల్లో ఆడిస్తామని అక్కడి అసోసియేషన్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫిట్నెస్ పరీక్షలో నెగ్గితేనే రెగ్యులర్గా అవకాశాలు ఇస్తామని కేరళ జట్టు కోచ్ తెలిపారు. (శ్రీశాంత్.. నీ కోసమే వెయిటింగ్) కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన శ్రీశాంత్ తానేంటో నిరూపించుకుంటానని, తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందనే విషయాన్ని రుజువు చేసుకుంటానన్నాడు. ‘2023 వన్డే ప్రపంచకప్ను నేను ఆడగలనని బలంగా విశ్వసిస్తున్నా. నా లక్ష్యాలు ఎప్పుడూ అందనంత ఎత్తులో ఉంటాయి. వాస్తవానికి ప్రతి అథ్లెట్ టార్గెట్స్ కూడా అలానే ఉంటాయి. ఉండాలి కూడా. ఒకవేళ అథ్లెట్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటే సాధారణంగా మారిపోతాడు' అని 37 ఏళ్ల శ్రీశాంత్ పేర్కొన్నాడు. భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. (రాబిన్ ఊతప్పపై శ్రీశాంత్ ఆగ్రహం) -
ప్రపంచకప్ ఫైనల్ క్రెడిట్ ఎవరికి?.. రైనా క్లారిటీ!
ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలిచి తొమ్మిదేళ్లు పూర్తయింది. అయితే వన్డే ప్రపంచకప్ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్లలో ప్రపంచకప్ గెలవడంలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారు. దీనికి సమాధానం కష్టం ఎందుకుంటే ప్రతీ మ్యాచ్లో ఒక్కరే జట్టును గెలిపించలేదు. దీంతో ఫైనల్ వరకు క్రెడిట్ అందరి ప్లేయర్స్కు దక్కింది. అయితే ఫైనల్ గెలుపు మాత్రం ఒక్కరికే ఆపాదించడం కొందరికి నచ్చడం లేదు. దీనిపై గౌతమ్ గంభీర్ బహిరంగంగానే విమర్శలకు దిగాడు. తాజాగా ఫైనల్ గెలుపుపై టీమిండియా సీనియర్ ఆటగాడు, ఫ్యామిలీ మ్యాన్ సురేశ్ రైనా స్పందించాడు. ‘చిన్నప్పడు బ్యాట్ పట్టినప్పుడే అనుకున్నా ప్రపంచకప్ గెలిచే భారత జట్టులో సభ్యుడిగా ఉండాలని. ఆ కల నెరవేరి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఆ మ్యాచ్ తాలూకు జ్ఞాపకాలు నా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఫైనల్ వరకు మా ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే ఫైనల్ మ్యాచ్లో ఛేదనలో 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాం. అయితే ఈ క్రమంలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి జోడి మూడో వికెట్కు 83 పరుగులు నమోదుచేసి విజయానికి గట్టి పునాది వేశారు. నా దృష్టిలో టీమిండియా ప్రపంచకప్ ఫైనల్లో గెలవడంలో ఇదే టర్నింగ్ పాయింటని భావిస్తాను. ఒత్తిడిలోనూ వారిద్దరూ బాధ్యతాయుతంగా ఆడిన తీరు అద్భుతం. అయితే విరాట్ కోహ్లి ఔటైన తర్వాత యువరాజ్ రావాల్సింది కానీ ఇద్దరు లెప్టాండర్స్ అవుతుండటం, ముత్తయ్య మురళీధరన్ వంటి స్పిన్నర్ల బౌలింగ్లో సమర్థవంతంగా ఆడిన అనుభవం ఉండటంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఫైనల్ వంటి పోరులో మిడిల్ ఓవర్లలో వికెట్లు పడితే ఒత్తిడి పెరుగుతుంది. అయితే వికెట్లు పడకుండా, స్ట్రైక్ రొటేట్ చేస్తూ ధోని, గంభీర్లు చాలా బాగా ఆడారు. అయితే సెంచరీకి మూడు పరుగుల దూరంలో గంభీర్ వెనుదిరగడం నిరుత్సాహపరిచింది. యువరాజ్తో కలిసి ధోని టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే గంభీర్-కోహ్లిలు మూడో వికెట్కు మంచి భాగస్వామ్యం నమోదు చేయకుంటే టీమిండియా విజయం అంత సులభం అయ్యేది కాదని నా భావన’ అంటూ రైనా పేర్కొన్నాడు. చదవండి: ఆ ఒక్క సిక్సర్తో వరల్డ్ కప్ గెలవలేదు! వెస్టిండీస్ మురిసే.. స్టోక్స్ ఏడిచే ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను -
‘24 ఏళ్ల తర్వాత ఆసీస్ను ఓడించారు’
1987 తర్వాత జరిగిన నాలుగు ప్రపంచకప్లలో అస్ట్రేలియాతో ఐదు సార్లు తలపడిన టీమిండియా ఒక్కసారి కూడా గెలవలేదు. 2003 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో అప్పటి దాదా గ్యాంగ్ను ఘోరంగా దెబ్బ కొట్టింది పాంటింగ్ సేన. వెస్టిండీస్ వేదికగా 2007లో జరిగిన ప్రపంచకప్లో ఆసీస్తో తలపడే అవకాశం టీమిండియాకు రాలేదు. అంతేకాకుండా ఆ ప్రపంచకప్ టీమిండియాకు ఓ పీడకలగా మారింది. ఇక స్వదేశంలో 2011లో జరిగిన ప్రపంచకప్లో.. కొత్త సారథి.. ఉడుకు రక్తం.. కప్ గెలవాలనే కసితో బరిలోకి దిగింది భారత్. లీగ్ దశ బాగానే సాగింది. అసలు సిసలు పరీక్ష క్వార్టర్ ఫైనల్లోనే ఎదురైంది. గెలిస్తే సెమీస్కు.. ఓడితే ప్రపంచకప్లో టీమిండియా కథ కంచికే!! జగజ్జేతగా ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న ఆసీస్తో నాకౌట్ పోరుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సారథి రికీ పాంటింగ్ సెంచరీతో రెచ్చిపోగా.. బ్రాడ్ హాడిన్ అర్దసెంచరీతో అదరగొట్టాడు. చివర్లో డేవిడ్ హస్సీ మెరుపులు మెరిపించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, జహీర్, యువరాజ్లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సచిన్, గంభీర్లు అర్థసెంచరీలు సాధించడంతో ఓ స్థితిలో గెలుపు వైపు పయనించింది. కానీ పుంజుకున్న ఆసీస్ బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టడంతో 187 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ‘మహేంద్రుడు’ విఫలమైనా.. ‘యువరాజు’గెలిపించాడు ఛేదనలో ఎంఎస్ ధోని వికెట్ కూడా చేజార్చుకోవడంతో టీమిండియా గెలుపు కష్టంగా మారింది. అయితే వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. సురేశ్ రైనాతో కలిసి బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలో అర్థసెంచరీ సాధించిన యువీ టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఢిల్లీ వేదికగా 1987లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్లో గెలిచిన భారత్ అనంతరం దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్లో ఆసీస్పై విజయం సాధించింది. ఇక సెమీస్లో పాకిస్తాన్పై, ఫైనల్ పోరులో శ్రీలంకపై గెలిచి ప్రపంచకప్ను టీమిండియా ముద్దాడిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ జరిగి నేటికి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మ్యాచ్ విశేషాలను గుర్తుచేస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఆ ట్వీట్లో యువీ వీరోచిత ఇన్నింగ్స్ను ప్రత్యేకంగా హైలైట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ⭐ 57* runs ⭐ 65 balls ⭐ 8 fours#OnThisDay in 2011, a ferocious Yuvraj Singh took India to a five-wicket win against Australia in the @cricketworldcup quarter-final! This was their first #CWC win over Australia in 24 years 🤯 pic.twitter.com/7Qejhqr5fM — ICC (@ICC) March 24, 2020 చదవండి: గంభీర్ సాయం రూ. 50 లక్షలు కోహ్లితో పోల్చకండి -
‘నెత్తురు కక్కుకుంటూ ఒకరు.. కెన్యాపై మరొకరు’
సాక్షి, హైదరాబాద్ : మార్చి 20.. క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయే రోజు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో భాగంగా టీమిండియా రెండు కీలక మ్యాచ్ల్లో గెలిచింది ఇదే రోజు. ఈ రెండు సందర్భాల్లోనూ సెంచరీలతో గెలిపించి టీమిండియాను గట్టెక్కించిన ఇద్దరు లెజెండ్స్ను ఎవరూ మర్చిపోలేరు. ఇక ఆ ఇద్దరూ లెఫ్టాండర్స్ కావడం మరో విశేషం. సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్లే ఆ దిగ్గజ ఆటగాళ్లు. కీలక సందర్భాల్లో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన ఈ ప్లేయర్స్.. వేర్వేరు ప్రపంచకప్ టోర్నీల్లో ఒకే తేదీన సెంచరీలు సాధించి.. టీమిండియా ముందడుగు వేసేలా కీలక పాత్ర పోషించారు. 2003 ప్రపంచకప్.. అదే తొలి సెంచరీ లీగ్, నాకౌట్ దశలో పెద్ద జట్లకు షాక్ ఇచ్చిన కెన్యాతో టీమిండియా సెమీస్ పోరు. గెలిస్తే ముందుడుగు లేకుంటే పసికూన చేతిలో ఘోర అవమానం. ఈ సందర్భంలో కీలక సెమీస్లో అప్పటి సారథి సౌరవ్ గంగూలీ అన్నీ తానై పోరాడాడు. సచిన్ టెండూల్కర్ (83) సహాయంతో కెన్యాపై రెచ్చిపోయిన దాదా శతకం సాధించాడు. దీంతో నాకౌట్ దశలో సెంచరీ సాధించిన తొలి టీమిండియా బ్యాట్స్మన్గా దాదా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దాదా శతకం, సచిన్ అర్థశతకంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కెన్యా భారత బౌలర్లు జహీర్, నెహ్రా, సచిన్ ధాటికి విలవిల్లాడారు. దీంతో 46.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. సెమీస్లో 91 పరుగుల ఘన విజయంతో ఫైనల్లో టీమిండియా సగర్వంగా అడుగుపెట్టింది. కక్కుకుంటూనే పోరాడాడు.. 2011 ప్రపంచకప్ అనగానే మనకు గుర్తొచ్చే ఆటగాడు యువరాజ్ సింగ్. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీని టీమిండియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది ఈ స్టార్ ఆల్రౌండరే. ఇక వెస్టిండీస్తో జరిగిన నాకౌట్ మ్యాచ్లో భారత్ 51 పరుగులకే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఈ క్రమంలో ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి (59)తో యువీ ఓ యోధుడిలా పోరాడాడు. సెంచరీ సాధించి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యువరాజ్ పలుమార్లు వాంతులు చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో రక్తపు వాంతులు చేసుకున్నానని యువీ తర్వాత పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్లో యువీ సెంచరీ సహాయంతో టీమిండియా వెస్టిండీస్ ముందు 269 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటింగ్లో మెరిసన యువీ బంతితోనూ అదరగొట్టాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో 80 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా సెమీస్కు చేరుకుంది. ఆ తర్వాత సెమీస్లో ఆస్ట్రేలియా, ఫైనల్లో లంకపై గెలిచి ప్రపంచకప్ను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: చహల్ వేషాలు మాత్రం తగ్గలేదు.. ‘నేను పిచ్చి పనిచేస్తే మళ్లీ క్రికెట్ ఆడలేను’ -
బాధ్యతగా ఆడాలి: విలియమ్సన్
లండన్: బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో స్వల్ప వ్యవధిలో కోల్పోయిన వికెట్లతో ఇబ్బందులెదురయ్యాయని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెప్పాడు. బ్యాట్స్మెన్ మరింత బాధ్యతగా ఆడాల్సివుందని అన్నాడు. ‘ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఫీల్డింగ్ అద్భుతం. మొదట బంగ్లా చక్కగా బ్యాటింగ్ చేసింది. పిచ్ పరిస్థితుల దృష్ట్యా 250 మెరుగైన స్కోరే! దీంతో ఛేదనలో వికెట్లు కాపాడుకుంటే మంచిదని భావించాం. బ్యాటింగ్లో కష్టపడితేనే విజయం దక్కుతుంది. అయితే రెండు సార్లు స్వల్పవ్యవధిలో కోల్పోయిన వికెట్లతో కష్టాల్లో పడ్డాం. చివరకు విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’ అని విలియమ్సన్ అన్నాడు. బంగ్లాదేశ్తో బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో గట్టెక్కింది. మొదట బంగ్లాదేశ్ 49.2 ఓవర్లలో 244 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాస్ టేలర్ (91 బంతుల్లో 82; 9 ఫోర్లు) కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. పది ఓవర్లలోపే ఓపెనర్లు గప్టిల్ (25), మున్రో (24) వికెట్లను కివీస్ కోల్పోయింది. ఆ తర్వాత విలియమ్సన్ (40; 1 ఫోర్), టేలర్ మూడో వికెట్కు 105 పరుగులు జోడించారు. ఆ తర్వాత కివీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినా... చివర్లో టెయిలెండర్ సాన్ట్నర్ (17 నాటౌట్; 2 ఫోర్లు) పట్టుదలగా ఆడటంతో న్యూజిలాండ్ గట్టెక్కింది. -
శతకాలతో అదరగొట్టిన ధోనీ, రాహుల్
లండన్ : ఐసీసీ ప్రపంచకప్లో భాగంగా సోఫియా గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఎంఎస్ ధోనీ (113; 78 బంతుల్లో 8×4, 7×6), కేఎల్ రాహుల్ (108; 99 బంతుల్లో 12×4, 4×6) శతకాలతో అదరగొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత టాపర్డర్ విఫలమైంది. అనంతరం ఎంఎస్ ధోనీ, కేఎల్ రాహుల్లు క్రీజ్లో కుదురుకుని చివర్లో బ్యాట్ ఝళిపించడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలింగ్లో షకీబ్, రుబెల్ తలో రెండు, సబ్బీర్, సైఫుద్దీన్, ముస్తఫిజూర్ తలో వికెట్ తీశారు. -
కోహ్లి దళం... గెలుస్తుందా హృదయం?
ఔను... కప్ అంచనాల్లో కోహ్లి సేనకు సరిగ్గా సరిపోయే పదం ఇది. అదరగొట్టే ఆటకు తోడు సొంతగడ్డ కాబట్టి ఇంగ్లండ్ భీకరంగా కనిపిస్తోంది. అనూహ్యంగా పుంజుకొన్న ఆస్ట్రేలియా సరైన సమయానికి ఊపులోకొచ్చింది. ప్రపంచ అత్యుత్తమ ఓపెనర్లు, నంబర్వన్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి, విశేష అనుభవజ్ఞుడైన ధోనిలాంటి వికెట్ కీపర్ బ్యాట్స్మన్, పేస్ ఆల్రౌండర్లు, నాణ్యమైన పేస్ త్రయం, మణికట్టు స్పిన్నర్ల కూర్పు కారణంగా భారత్ మాత్రం మొదటి నుంచి ఒకే తరహా ప్రదర్శనతో పోటీలో ఉంది. ఈ జట్టు కప్ కొట్టాలంటే కావాల్సిందల్లా... అలసత్వానికి తావివ్వకుండా, చిన్నచిన్న లోపాలు సరిచేసుకుంటూ పోవడమే. ఈ క్రమంలో గత అనుభవాలు, మరీ ముఖ్యంగా ఇక్కడే జరిగిన 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పరాజయాన్ని గుణపాఠంగా తీసుకుని పొరపాట్లకు అవకాశం లేకుండా ముందుకెళ్లాలి. అన్ని రంగాల్లో బలంగా ఉన్నామని... నిలకడగా ఆడుతున్నామని... ఇలా పైకి ఎంత చెప్పుకొన్నా... 1983 నాటి (వేదిక ఇంగ్లండ్) సమష్టి గెలుపును మినహాయిస్తే విదేశంలో ప్రపంచ కప్ అనగానే టీమిండియా టైటిల్ నెగ్గే అవకాశాలు కొంచెం అనుమానమే అన్నట్లుంటాయి. 2003 (దక్షిణాఫ్రికా)లో ఫైనల్ చేరినా ఆటతీరులో ఆస్ట్రేలియాను అందుకోలేక చేతులెత్తేసింది. 2015 (ఆస్ట్రేలియా)లో సెమీఫైనల్స్లోనూ ఇదే పరిస్థితి. ఇవికాక విదేశాల్లో జరిగిన మిగతా కప్లలో మన ప్రదర్శన సాదాసీదానే. దీన్నిబట్టి చూస్తే ఇంగ్లండ్లో జరుగబోయే ప్రపంచకప్ టోర్నీలో కోహ్లి సేన కప్ సాధిస్తే చరిత్ర తిరగరాసినట్లే. ఈ నేపథ్యం లో భారత జట్టు బలాబలాలు, బలహీనతలు, సరిదిద్దు్దకోవాల్సిన లోపాలు ... ప్రత్యర్థులపై పైచేయికి ఏం చేయాలి? అనే దానిపై సభ్యుల వారీగా విశ్లేషణ... –సాక్షి క్రీడా విభాగం విరాట్ కోహ్లి బలాలు: భూతద్దం పెట్టి వెదికినా లోపాలు కనిపెట్టలేని టెక్నిక్, తిరుగులేని సాధికారత, దూకుడు కలగలిసిన బ్యాట్స్మన్. జట్టు బ్యాటింగ్ మూలస్తంభం. లక్ష్యాల ఛేదనలో మొనగాడు. కెప్టెన్గానూ బాధ్యతలు మోస్తున్నా ఆ ప్రభావం బ్యాటింగ్పై ఏమాత్రం లేనట్లు ఆడతాడు. బలహీనతలు: ఎప్పుడో ఒకసారి విఫలం కావడం తప్ప పెద్దగా ఏమీ లేవు. అయితే, ఈ వైఫల్యం కప్లో కీలక మ్యాచ్ల సందర్భంగా కాకుండా చూసుకోవాలి. ఏం చేయాలి?: సలహాలు ఇవ్వడంలో, వ్యూహాలు పన్నడం లో ధోని, రోహిత్ అండగా ఉంటారు కాబట్టి... అనవసర ఒత్తి డిని కొనితెచ్చుకోకుండా బ్యాటింగ్పై మరింత శ్రద్ధ చూపాలి. రోహిత్ శర్మ బలాలు: కుదురుకున్నాడంటే... ప్రపంచంలోనే ప్రమాదకర బ్యాట్స్మన్. ముఖ్యంగా వన్డేల్లో. ఓపెనర్గా అద్భుత రికార్డుంది. మైదానం నలువైపులా బంతిని బాదుతూ అతి భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. బలహీనతలు: అత్యున్నత శ్రేణి బౌలింగ్ను ఎదుర్కొనడంలో చేతులెత్తేస్తాడు. దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ ఇచ్చేస్తాడు. ఏం చేయాలి?: క్రీజులో దిగిన వెంటనే బాదేసేయాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలి. కాసేపు నిలిస్తే పరుగులు అవే వస్తాయని గ్రహించి సంయమనం చూపాలి. శిఖర్ ధావన్ బలాలు: జట్టులోని ఏకైక ఎడంచేతి స్పెషలిస్ట్ బ్యాట్స్మన్. ఇంగ్లండ్లో జరిగిన గత ఐసీసీ టోర్నీల్లో విశేషంగా రాణించాడు. బలహీనతలు: టెక్నిక్ గొప్పదేమీ కాదు. కొన్నిసార్లు తేలిగ్గా వికెట్ ఇచ్చేస్తాడు. శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేడు. తన వికెట్కు తానే విలువివ్వడం లేదన్నట్లు ఉంటుంది ఇతడి బాడీ లాంగ్వేజ్. ఏం చేయాలి?: రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో జరుగుతున్న ఈ ప్రపంచ కప్లో నిలకడ ముఖ్యమని తెలుసుకోవాలి. ఓపెనర్గా తాను నిలదొక్కుకుంటే జట్టుకు ఎంత ప్రయోజనమో గ్రహించి భారీ స్కోర్లకు ప్రయత్నించాలి. కేఎల్ రాహుల్ బలాలు: క్లాస్, మాస్ కలగలిసిన నాణ్యమైన బ్యాట్స్మన్. తనదైన శైలి షాట్లతో పరుగులు రాబడతాడు. భారీ స్కోర్లు చేయగలడు. బలహీనతలు: జట్టులో చోటు అనుమానాస్పదం కారణంగానో, మరే ఇతర అంశాల రీత్యానో మానసిక దృఢత్వం తక్కువ. ఏం చేయాలి?: ఓపెనింగ్ తప్ప మరే స్థానంలో ఆడలేనన్నది రాహుల్ ఉద్దేశంగా కనిపిస్తుంటుంది. ఆటతీరూ అంతే ఉంటుంది. ఈ భావన నుంచి అతడు బయటపడాలి. ఒకటి, రెండు మ్యాచ్లు విఫలమైనా స్థయిర్యం కోల్పోకుండా ఉండాలి. మహేంద్రసింగ్ ధోని బలాలు: వికెట్ల వెనుక మహా మేధావి. బ్యాట్స్మెన్ కదలికలను చదువుతూ బౌలర్లకు ఇతడిచ్చే సలహాలు మ్యాచ్లను మలుపు తిప్పుతాయి. ముఖ్యమైన మ్యాచ్ల్లో ఇతడు ఆడే ఇన్నింగ్స్లు జట్టు ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి. బలహీనతలు: బ్యాటింగ్లో... మరీ చెప్పుకోవాలంటే ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఎలా రాణిస్తాడనేది కీలకం. ఐపీఎల్ ఫామ్ ఎంతవరకు కొనసాగిస్తాడో చూడాలి. ఏం చేయాలి?: చివరి ప్రపంచ కప్ ఆడబోతున్నందున దానిని మరపురానిదిగా మార్చుకోవాలి. ఫినిషర్గా పూర్వ ఫామ్ను అందుకోవాలి. తను దూకుడుగా ఆడలేకపోయినా... హార్దిక్ పాండ్యా వంటి యువకులను స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించాలి. విజయ్ శంకర్ బలాలు: అచ్చం హార్దిక్లానే మూడు అంశాల్లోనూ ఉపయోగపడగల ఆటగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దింపాలని చూస్తున్నారు. ఇంగ్లండ్ వాతావరణం కలిసొస్తే బౌలింగ్లోనూ ప్రభావవంతం అవుతాడు. బలహీనతలు: బ్యాట్స్మన్గా, బౌలర్గా ఇతడి ప్రతిభపై భరోసా ఉంచలేని పరిస్థితి. ఒక మ్యాచ్లో రాణించకుంటే మళ్లీ అవకాశం వస్తుందో లేదో చెప్పలేం. ప్రస్తుత భారత జట్టులో ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం లేని ఏకైక ఆటగాడు. ఏం చేయాలి: ఇప్పుడు వేగంగా చేస్తున్న 40–50 పరుగులనే మరింత భారీ స్కోర్లుగా మలచాలి. క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ బౌలర్గానూ ఓ చెయ్యేస్తే జట్టు వనరులు మరింత మెరుగుపడతాయి. కేదార్ జాదవ్ బలాలు: మంచి బ్యాట్స్మన్. అనూహ్యంగా బౌలర్గానూ ఓ చేయి వేస్తున్నాడు. చివరి ఓవర్లలో భారీ షాట్లతో స్కోరు పెంచగలడు. ఐదో నంబరు బ్యాట్స్మన్గా స్థానం ఖాయం చేసుకున్నాడు. లక్ష్యం ఎంత ఉన్నా నిబ్బరంగా ఆడగలడు. బలహీనతలు: తొందరగా గాయపడే శరీరం జాదవ్ది. గత మూడేళ్లలో ఐపీఎల్ సహా సీజన్కు కనీసం ఒక సిరీస్కైనా ఇతడు ఈ కారణంగానే దూరమయ్యాడు. ఫిట్నెస్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. తాజాగా గాయం నుంచి కోలుకుంటూనే ప్రపంచ కప్కు వచ్చాడు. ఏం చేయాలి?: మెగా టోర్నీలో బంతితోనూ ఉపయోగపడగల విలువైన ఆటగాడు జాదవ్. జట్టు వ్యూహాల్లో కీలకం అవుతాడు కాబట్టి ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉండాలి. దినేశ్ కార్తీక్ బలాలు: రిజర్వ్ కీపర్ అయినా పరిస్థితులను బట్టి బ్యాట్స్మన్ గా నాలుగో స్థానంలో దింపగల సత్తా ఉన్నవాడు. మధ్య ఓవర్లలో కీలకమవుతాడు. బ్యాటింగ్ టెక్నిక్, దూకుడు రెండూ ఉన్నాయి. బలహీనతలు: మంచి ఫామ్లో ఉన్నప్పుడు అవకాశాలు రాకపోవడం, అంచనాలు పెరిగి అవకాశం వచ్చినపుడు విఫలమవడం కార్తీక్లోని లోపం. ఏం చేయాలి?: ప్రపంచ కప్లో చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి నాలుగో స్థానంలోనో, ధోని బదులుగానో కార్తీక్కు అవకాశం తప్పకుండా ఉంటుంది. దీనిని అతడు ఆత్మ విశ్వాసంతో తీసుకోవాలి. హార్దిక్ పాండ్యా బలాలు: హార్డ్ హిట్టర్. మంచి పేస్ ఆల్రౌండర్. దీంతో మూడో పేసర్ స్థానాన్ని ఇతడితో భర్తీ చేసే వీలు కలుగుతోంది. బలహీనతలు: పూర్తిగా కాకున్నా, గాయాల బెడద కొంత ఉంది. బౌలింగ్లో ఎక్కువ పరుగులు ఇవ్వకుండా చూసుకోవాలి. ఏం చేయాలి?: చేదు జ్ఞాపకాలు మర్చిపోయి... ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకున్న హార్దిక్ మంచి లయలో ఉన్నాడు. లోయరార్డర్లో స్కోరు పెంచే బాధ్యతను తీసుకోవాలి. రవీంద్ర జడేజా బలాలు: హార్దిక్ తర్వాత జట్టులో ఉన్న మరో ఆల్రౌండర్. చకచకా ఓవర్లు వేస్తాడు. బలహీనతలు: పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే బంతిని స్పిన్ చేయలేడు. వికెట్లు తీయలేకపోవడం మరో పెద్ద లోపం. ఏం చేయాలి?: పరుగులు నిరోధిస్తూనే వికెట్లు పడగొట్టాలి. బ్యాటింగ్లో మెరిపించాలి. ఫీల్డింగ్లో హార్దిక్తో కలిసి పరుగులు నిరోధించాలి. భువనేశ్వర్ బలాలు: 140 కి.మీ.పైగా వేగం కొనసాగిస్తూనే స్వింగ్ రాబట్టగల పేసర్. ప్రారంభ ఓవర్లలో వికెట్ తీస్తూ, చివరి ఓవర్లలో పరుగులు నిరోధిస్తాడు. ఇంగ్లండ్ వాతావరణంలో కీలకం కాగలడు. బలహీనతలు: ఇటీవల ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు. ఈ కారణంగానే ఆస్ట్రేలియా సిరీస్ లో టెస్టు ఆడే అవకాశం ఇవ్వలేదు. తర్వాత వన్డేల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు.ప్రస్తుతం ఫామ్ కొంత డోలాయమానంగా ఉంది. ఏం చేయాలి?: తన బౌలింగ్కు నప్పే ఇంగ్లండ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటే జట్టుకు మేలు అవుతుంది. యజువేంద్ర చహల్ బలాలు: మణికట్టు స్పిన్నర్. కప్లో మిగతా జట్లలో చాలావాటికి సవాల్ విసరగలడు. లయ దొరికితే చహల్ను తట్టుకోవడం కష్టం. బలహీనతలు: కొన్ని సిరీస్ల నుంచి చహల్ను ప్రత్యర్థులు చదివేస్తున్నట్లు కనిపిస్తోంది. అతడి బౌలింగ్ను తేలిగ్గా ఎదుర్కొంటుండటమే దీనికి నిదర్శనం. ఏం చేయాలి?: ప్రత్యర్థులు మెరుగైనంత మాత్రాన బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. చక్కటి వ్యూహాలతో వారిని కట్టడి చేయగలిగితే చహల్ విజయవంతమైనట్లే. కుల్దీప్ యాదవ్ బలాలు: ప్రపంచ కప్లో ఏకైక చైనామన్ బౌలర్. ప్రత్యర్థులకు ఇతడి బౌలింగ్ అర్ధమయ్యేలోపే చేయాల్సినంత నష్టం చేస్తాడు. గతేడాదిగా నిలకడగా రాణిస్తున్నాడు. బలహీనతలు: ఐపీఎల్లో వైఫల్యంతో కాస్త ఇబ్బందిపడ్డాడు. జట్టు నుంచి తప్పించడం మానసికంగా ప్రభావం చూపింది. ఏం చేయాలి?: అనవసర అంశాల జోలికి పోకుండా ఆటపై దృష్టి పెడితే బాగుటుంది. ఫీల్డింగ్లోనూ మెరుగుపడాలి. జట్టు యాజమాన్యం అండ ఉంది కాబట్టి మనో నిబ్బరంతో మైదానంలో రాణించాలి. జస్ప్రీత్ బుమ్రా బలాలు: యార్కర్లు, అంతుచిక్కని బంతుల కారణంగా ఈ కప్లో అందిరి కళ్లూ ఇతడి పైనే ఉన్నాయి. విశేషంగా రాణిస్తాడని అంచనాలు వేస్తున్నారు. ప్రశాంతంగా ఉంటూనే పని ముగిస్తాడు. బలహీనతలు: బౌలింగ్ పరంగా పెద్దగా పొరపాట్లు చేయకున్నా... చిన్నచిన్న తప్పులే బుమ్రాను విలన్ను చేస్తాయి. రెండేళ్ల క్రితం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ‘నో బాల్’ ఇలాంటిదే. ఏం చేయాలి?: పరిణతి సాధించిన బుమ్రా ప్రస్తుతం కెరీర్ అత్యున్నత స్థితిలో ఉన్నాడు. పరిపూర్ణ బౌలర్గా ఎదుగుతున్నాడు. కప్లో భారత బౌలింగ్ భారాన్ని మోస్తున్న స్పృహతో రాణిస్తే జట్టు అవకాశాలు మరింత పెరుగుతాయి. మొహమ్మద్ షమీ బలాలు: కచ్చితత్వంతో ఆరంభంలో, చివర్లో యార్కర్లతో చెలరేగే షమీని ఎదుర్కొనడం సవాలే. సరిగ్గా బంతులేస్తే బుమ్రా కంటే ఇతడే ప్రమాదకారి. బలహీనతలు: బైస్ రూపంలో కానీ, బ్యాట్స్మన్ ద్వారా కానీ పరుగులివ్వడం షమీ బలహీనత. గాయపడకుండా చూసుకోవడమూ ముఖ్యమే. ఏం చేయాలి?: షమీ ఇప్పుడు మెరుగుపడ్డాడు. గాయాల బెడద కూడా లేదు. బుమ్రాకు తోడుగా షమీ ప్రత్యర్థిపై విరుచుకుపడితే చాలావరకు బ్యాట్స్మెన్కు భారం తగ్గినట్లే. -
వరల్డ్ కప్ ఫేవరెట్ ఆ టీమే..!
సిడ్నీ: క్రికెట్ ప్రపంచ కప్ మహాసంగ్రామం ఆరంభమవడానికి కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అన్ని దేశాల జట్లు తుది ఎలెవెన్పై కసరత్తులు చేస్తోండగా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మాత్రం తమ ఫేవరెట్ జట్లు ఫలానా అని వెల్లడిస్తున్నారు. నిన్నటికి నిన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత నాసీర్ హుస్సేన్ ఇండియానే అత్యంత ప్రమాదకర జట్టని, దానికే కప్ గెలిచే అవకాశాలు ఎక్కువ అని తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జాబితాలో మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియాకు రెండు సార్లు వరల్డ్ కప్ అందించిన రికీ పాంటింగ్ చేరారు. ఈ సారి వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ అని పంటర్ పేర్కొన్నారు. అలాగే ఈ వరల్డ్ కప్లో సంచలనాలు నమోదవడానికి కూడా అవకాశాలున్నాయని, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ టీంలు ఆ కోవలోకి వస్తాయని ఆయన అన్నారు. ‘బలమైన బ్యాటింగ్ లైనప్తో ఇంగ్లండ్ బలంగా కనిపిస్తోంది. గత కొంత కాలంగా మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లండ్ టీం అంచనాలకు మించి రాణిస్తోంది. సొంత గడ్డపై ఆడుతుండడం ఆ జట్టుకు సానుకూల అంశం. అదే విధంగా 7వ నెంబర్ వరకు దాటిగా బ్యాటింగ్ చేయడం కలిసొచ్చే అంశం. అయితే ఇండియా, ఆస్ట్రేలియా రూపంలో ఇంగ్లండ్ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనవలసి ఉంది’అని ఈ మాజీ సారధి జోస్యం చెప్పాడు. మే 30వ తేదీ నుంచి వరల్డ్కప్ సమరం ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. -
రె‘ఢీ’
-
కుటుంబ సభ్యులతో మాల్దీవుల్లో ‘హిట్మ్యాన్’
టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాల్దీవుల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గుడుపుతున్నాడు. హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ 2019 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన హోరా హోరీ మ్యాచ్లో ఐపీఎల్ సీజన్12 కప్ని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దాడాడు. ఇటు ఐపీఎల్ విజయంతో మంచి జోష్లో ఉన్న హిట్మ్యాన్ రోహిత్ త్వరలో జరగబోయే వరల్డ్కప్కు ముందు భార్య రితికా, కూతురు సమారియాలతోపాటూ కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో పర్యటిస్తున్నాడు. ఫ్యామిలీ టూర్కు సంబంధించి ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. నాలుగుసార్లు ముంబైకి టైటిల్ అందించిన రోహిత్.. 2009లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు సభ్యుడిగా తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. రిక్కీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుకున్న రోహిత్ 2013లో తన జట్టుకు మొదటిసారి ట్రోఫీని అందించాడు. తర్వాత 2015లో ముంబైకి టైటిల్ అందించిన హిట్ మ్యాన్ 2017, 2019ల్లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ల్లో ఒక్క పరుగు తేడాతో తన జట్టును విజేతగా నిలిపాడు. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న #10YearChallenge (టెన్ ఇయర్ ఛాలెంజ్)లో భాగంగా రోహిత్కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 2009 ఐపీఎల్లో అప్పటి దక్కెన్ చార్జెస్ జట్టుకు ఆడిన రోహిత్ శర్మ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఇక 2019 ఐపీఎల్లో ముంబై జట్టుకు కెప్టెన్గా ఉండి ట్రోఫీ అందుకున్నాడు. 2009, 2019 ఫొటోలను జత చేసి షేర్ చేయడంతో ఆ ఫొటో ట్రెండ్ అవుతోంది. -
టీంఇండియా సెలక్టర్లపై అంబటి రాయుడు సెటైర్
-
విజేతలకు ప్రపంచకప్ నేరుగా చూసే అవకాశం
బెంగళూరు: త్వరలో జరుగనున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఐసీసీతో జతకట్టిన బ్రిటానియా యాజమాన్యం ‘బ్రిటానియా ఖావో... వరల్డ్ కప్ జావో’ స్లోగన్తో క్రికెట్ అభిమానులను ఆకర్షించే పనిలో పడింది. దీనిలో భాగంగా అదృష్టవంతులైన 100 మంది అభిమానులకు ఇంగ్లండ్లో జరుగనున్న ప్రపంచ కప్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు అయ్యే మొత్తం ఖర్చుల్ని బ్రిటానియా కంపెనీ భరించనుంది. 1999లోనూ ఇదే ఫార్ములాతో బ్రిటానియా ప్రజలకు చేరువైంది. కంపెనీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మళ్లీ ఈ ఏడాది అదే పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. దీని ప్రచార కార్యక్రమం మంగళవారం బెంగళూరులో జరిగింది. 1989 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్, రోజర్ బిన్నీ, సయ్యద్ కిర్మాణి, శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ అరుదైన అవకాశాన్ని పొందాలనుకునే వారు బ్రిటానియా ప్యాకెట్పై ఉన్న ప్రోమో కోడ్ను అందులో సూచించిన నంబర్కు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. లక్కీ డ్రాలో ఎంపికైన 100 మంది క్రికెట్ అభిమానులు నేరుగా మ్యాచ్ చూసే అవకాశాన్ని పొందుతారు. -
క్రికెట్ ఆడకపోవడమంటే పాక్కు లొంగిపోవడమే
-
అమెరికా క్రికెట్ కెప్టెన్గా ఇబ్రహీం ఖలీల్
వాషింగ్టన్: ఐసీసీ వరల్డ్ టి20 క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టుకు హైదరాబాద్కు చెందిన ఇబ్రహీం ఖలీల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వచ్చే నెల 19 నుంచి నార్త్ కరోలినాలో జరిగే ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల యూఎస్ఏ జట్టును సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ వెస్టిండీస్ క్రికెటర్ రికార్డో పావెల్ ప్రకటించారు. హైదరాబాద్ తరఫున సుదీర్ఘ కాలం రంజీ ఆడిన అనంతరం యూఎస్ఏ వలస వెళ్లిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ఖలీల్ ... గత ఏడాది నుంచి జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇంతకుముందు కూడా జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అతను, మరోసారి సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. టోర్నీలో భాగంగా కెనడా, పనామా, హోండురస్ జట్లతో అమెరికా తలపడుతుంది. ఇబ్రహీం ఖలీల్ ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో క్రిస్ గేల్ కెప్టెన్గా ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
చండిమల్పై ‘ట్యాంపరింగ్’ అభియోగం
సెయింట్ లూసియా: మళ్లీ ‘బాల్ ట్యాంపరింగ్’ కలకలం చెలరేగింది. ఈసారి వెస్టిండీస్ గడ్డపై శ్రీలంక బంతి ఆకారాన్ని మార్చినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్విట్టర్లో స్పందించింది. లంక కెప్టెన్ చండిమల్ ఐసీసీ ప్రవర్తన నియమావళిని అతిక్రమించాడని, లెవెల్ 2.2.9 ప్రకారం అతనిపై ‘బాల్ ట్యాంపరింగ్’ అభియోగం మోపుతున్నట్లు వెల్లడించింది. శుక్రవారం (రెండో రోజు ఆట) చివరి సెషన్లో చండిమల్ తన ఎడమ జేబులోంచి స్వీట్ ముక్కల్ని తీసి బంతిపై అదేపనిగా అదిమిపెట్టి రాసినట్లు వీడియో ఫుటేజ్లో కనబడినట్లు ఐసీసీ తెలిపింది. మరోవైపు చండిమల్ మాత్రం తాను బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశాడు. ఇకపై కఠిన వైఖరి: బాల్ ట్యాంపరింగ్కు పాల్పడితే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీ సూచనప్రాయంగా నిర్ణయించింది. వచ్చే నెలలో జరిగే వార్షిక సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇలాంటి అతిక్రమణలపై లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి మార్చి చర్యలు చేపట్టనుంది. అతిక్రమణ లెవెల్ 3కి చేరితే ఆటగాడిపై ఏకంగా నాలుగు టెస్టులు, లేదంటే 8 వన్డేల నిషేధం విధిస్తారు. లంకను ఆదుకున్న మెండిస్ వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంకను కుశాల్ మెండిస్ (85 బ్యాటింగ్) ఆదుకున్నాడు. 34/1 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక ఒక దశలో 48 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మెండిస్, కెప్టెన్ చండిమల్ (39) ఐదో వికెట్కు 117 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. కడపటి వార్తలందేసరికి శ్రీలంక 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. -
ఐపీఎలా... మజాకా!
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ధాటికి ఏకంగా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ కూడా దిగొచ్చింది. ఐపీఎల్కు, అంతర్జాతీయ సిరీస్లకు మధ్య 15 రోజుల వ్యత్యాసం ఉండాలన్న లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరడం... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఎప్పుడో ఖాయం చేసిన షెడ్యూల్ను కాదని తాజా మార్పులతో ఐసీసీ కొత్త షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్కు ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా మెగా ఈవెంట్ పోరును దక్షిణాఫ్రికా జట్టుతో ప్రారంభించనుంది. జూన్ 5న ఈ మ్యాచ్ జరుగుతుంది. ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమైతే జూన్ 2న ఈ మ్యాచ్ జరగాల్సింది. అయితే ఐపీఎల్–12 సీజన్ మార్చి 29న ప్రారంభమై మే 19న ముగియనుంది. దీంతో 15 రోజుల తేడా కోసం ప్రపంచకప్ మ్యాచ్ను మూడు రోజులు వెనక్కి జరపాల్సి వచ్చింది. విశ్వవ్యాప్తమైన ఆసక్తి ఉండే దాయాదుల సమరం జూన్ 16న జరుగుతుంది. ఓల్డ్ ట్రాఫర్డ్లో భారత్, పాకిస్తాన్లు అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మధ్య ఐసీసీ ఈవెంట్లలో భారత్ పోరు చిరకాల ప్రత్యర్థితోనే మొదలయ్యేది. 2015 వన్డే ప్రపంచకప్, 2017 చాంపియన్స్ ట్రోఫీల్లో పాక్తో జరిగిన తొలి మ్యాచ్తోనే టీమిండియా మెగా ఈవెంట్లకు శ్రీకారం చుట్టింది. అయితే ఈసారి ప్రపంచకప్ గ్రూప్ దశలో కాకుండా 1992 ప్రపంచకప్ జరిగినట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అంటే పాల్గొనే పది జట్లు తమ ప్రత్యర్థులను ఒక్కో మ్యాచ్లో ఢీకొనాల్సిందే. లీగ్ దశ ముగిశాక మొదట నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. అందుకే ఇంగ్లండ్, వేల్స్లో జరిగే ఈ ప్రపంచకప్ మే 30 నుంచి జూలై 14 వరకు సుదీర్ఘంగా 46 రోజుల పాటు జరుగనుంది. షెడ్యూల్ మార్పుపై సీనియర్ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ ‘వచ్చే ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 19 వరకు నిర్వహిస్తున్నాం. కానీ 15 రోజుల వ్యత్యాసం కావాలంటే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో జూన్ 2న మ్యాచ్ ఆడలేమని చెప్పాం. దీంతో మంగళవారం జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ల మీటింగ్లో దీనిపై తుదినిర్ణయం తీసుకున్నారు’ అని చెప్పారు. -
సఫారీలతో టీమిండియా తొలి ‘మెగా’ పోరు
కోల్కతా: వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం కోల్కతాలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సమావేశం నిర్వహించింది. దీనిలో భాగంగా మెగా టోర్నీకి సంబంధించి ప్రాథమిక షెడ్యూల్ను తాజాగా విడుదల చేయగా, పూర్తి షెడ్యూల్ను ఏప్రిల్ 30వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం టీమిండియా తన తొలిపోరులో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 2019, జూన్ 4వ తేదీన భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. ఈ జట్ల మధ్య జూన్2 వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉండగా, అందులో కొద్దిపాటి మార్పు చేశారు. ఐసీసీ సమావేశంలో భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కొన్ని మార్పుల్ని సూచించింది. ఐపీఎల్ 2019 సీజన్ ముగిసిన రెండు వారాల్లోపే ప్రపంచకప్లో టీమిండియా ఆడటం కష్టమని.. కనీసం 15 రోజులు గ్యాప్ ఉండాలంటూ గతంలో లోధా కమిటీ సూచించిన సూచనని ఇక్కడ బీసీసీఐ ప్రస్తావించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఐసీసీ.. భారత్ మొదటి మ్యాచ్ను రెండు రోజులు వెనక్కి నెట్టింది. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ప్రపంచకప్ జరగనుంది. బీసీసీఐ సూచించిన మార్పుల నేపథ్యంలో జూన్ 4కి భారత్-దక్షిణాఫ్రికాల మ్యాచ్ని మార్చనున్నారు. ఎందుకంటే.. 2019 ఐపీఎల్ సీజన్ మార్చి 29న మొదలై.. మే 19న ముగియనుంది. దీంతో.. 15 రోజుల గ్యాప్ తర్వాత ప్రపంచకప్లో టీమిండియా ఆడనుంది. -
ఏడేళ్ల క్రితం ధోనిసేన సగర్వంగా!
సాక్షి, ముంబై: సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజున (ఏప్రిల్ 2) టీమిండియా కెప్టెన్గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని కొట్టిన సిక్స్ను క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు. ఎందుకంటే అది భారత జట్టుకు వన్డే ప్రపంచ కప్ను అందించిన మధురక్షణం. 2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు మహేల జయవర్ధనే (103 నాటౌట్: 88 బంతుల్లో 13 ఫోర్లు) అజేయ శతకంతో 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 275 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను మలింగ డకౌట్ చేశాడు. ఆపై సచిన్ టెండూల్కర్ (18)ను ఔట్ చేసి మరోసారి దెబ్బకొట్టాడు మలింగ. అయితే వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన గౌతం గంభీర్ (97: 122 బంతుల్లో 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. కీలక ఇన్నింగ్స్తో భారత్ను ఆదుకున్నాడు. గౌతీ ఔటయ్యాక యువరాజ్ సింగ్ (21 నాటౌట్) సహకారంతో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీర విహారం చేశాడు. వన్డే ప్రపంచ కప్తో భారత క్రికెటర్లు (ఫైల్ ఫొటో) భారత్ విజయానికి నాలుగు పరుగులు కావాల్సిన సమయంలో కులశేఖర వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్ రెండో బంతిని 'బెస్ట్ ఫినిషర్' ధోని భారీ సిక్సర్గా మలిచి ప్రపంచ కప్ను అందించాడు. ఆ సిక్సర్ మాత్రం భారతీయుల గుండెల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. మహీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. 28 ఏళ్ల తద్వారా భారత్ మరోసారి ప్రపంచ కప్ కలను నెరవేర్చుకుంది. ధోని సిక్సర్ నేడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలిసారి కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983లో వన్డే వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. -
ఏడేళ్ల క్రితం ధోని సేన సగర్వంగా!
-
వెస్టిండీస్ శుభారంభం
హరారే: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో వెస్టిండీస్ శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో విండీస్ 60 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పై విజయం సాధించింది. ముందుగా వెస్టిండీస్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్మర్ (93 బంతుల్లో 127; 14 ఫోర్లు, 4 సిక్సర్లు), క్రిస్ గేల్ (91 బంతుల్లో 123; 7 ఫోర్లు, 11 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. అనంతరం యూఏఈ 50 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది. రమీజ్ షహజాద్ (107 బంతుల్లో 112 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో పోరాడినా జట్టును గెలిపించలేకపో యాడు. షైమాన్ అన్వర్ 64 పరుగులు సాధించగా...జేసన్ హోల్డర్ (5/53) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్లో జింబాబ్వే 2 పరుగులతో అఫ్గానిస్తాన్ను ఓడించింది. ముందుగా జింబాబ్వే 43 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ కాగా... అఫ్గానిస్తాన్ 49.3 ఓవర్లలో 194 పరుగులే చేయగలిగింది. ► 3 విండీస్ క్రికెటర్ గేల్ 11 వేర్వేరు దేశాలపై సెంచరీలు చేసిన మూడో క్రికెటర్గా గుర్తింపు పొందాడు. గతంలో సచిన్, ఆమ్లా మాత్రమే ఈ ఘనత సాధించారు. -
అఫ్గాన్కు స్కాట్లాండ్ షాక్
బులవాయో: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫేవరెట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్కు స్కాట్లాండ్ షాకిచ్చింది. తొలి మ్యాచ్లో బ్యాట్స్మన్ కాలమ్ మెక్లియోడ్ (146 బంతుల్లో 157 నాటౌట్; 23 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అతి పిన్న సారథి రషీద్ ఖాన్ నేతృత్వంలో అఫ్గాన్ మొదట 49.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. నబీ (92; 7 ఫోర్లు, 3 సిక్స్లు), నజీబుల్లా జద్రాన్ (67; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. వీల్, బెరింగ్టన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత స్కాట్లాండ్ 47.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి గెలిచింది. మెక్ లియోడ్కు బెరింగ్టన్ (67; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. మిగతా మ్యాచ్ల్లో ఐర్లాండ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై గెలుపొందగా, యూఏఈ కూడా డక్వర్త్ లూయిస్ పద్ధతిలోనే 56 పరుగుల తేడాతో పపువా న్యూగినియాపై నెగ్గింది. జింబాబ్వే శుభారంభం మరోవైపు ఆతిథ్య జింబాబ్వే తొలి మ్యాచ్లో 116 పరుగుల తేడాతో నేపాల్పై జయభేరి మోగించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 380 పరుగులు సాధించింది. బ్రెండన్ టేలర్ (91 బంతుల్లో 100; 7 ఫోర్లు, ఒక సిక్స్), సికిందర్ రజా (66 బంతుల్లో 123; 7 ఫోర్లు, 9 సిక్స్లు) ధాటిగా ఆడి సెంచరీలు చేయడం విశేషం. ఐదో వికెట్కు వీరిద్దరు 173 పరుగులు జోడించారు. అనంతరం నేపాల్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసి ఓడిపోయింది. ‘సెంచరీ హీరో’ సికిందర్ రజా బౌలింగ్లోనూ రాణించి మూడు వికెట్లు తీశాడు. సికిందర్ రజా -
ఫైనల్లో ఇంగ్లండ్
♦ సెమీస్లో దక్షిణాఫ్రికాపై చివరి ఓవర్లో విజయం ♦ మహిళల ప్రపంచకప్ బ్రిస్టల్: మహిళల ప్రపంచకప్లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ఫైనల్లో అడుగు పెట్టింది. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 218 పరుగులు చేసింది. వొల్వార్ట్ (100 బంతుల్లో 66; 8 ఫోర్లు), ఎం డు ప్రీజ్ (95 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తరఫున సారా టేలర్ (76 బంతుల్లో 54; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. హీథర్ నైట్ (56 బంతుల్లో 30; 2 ఫోర్లు), ఫ్రాన్ విల్సన్ (38 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా చివర్లో జెన్నీ గన్ (27 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా ఆడి విజయానికి సహకరించింది. దీంతో ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు సారా టేలర్కు లభించింది. -
‘సూపర్ సిక్స్’ దశకు భారత్
ఐర్లాండ్పై 125 పరుగులతో గెలుపు తిరుష్ కామిని అజేయ సెంచరీ కొలంబో: బ్యాటింగ్తోపాటు బౌలింగ్లోనూ మెరిపించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో ‘సూపర్ సిక్స్’ దశకు అర్హత సాధించింది. ఐర్లాండ్తో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో టీమిండియా 125 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్కిది వరుసగా మూడో విజయం. మొదట భారత్ 50 ఓవర్లలో రెండు వికెట్లకు 250 పరుగులు చేసింది. ఓపెనర్ తిరుష్ కామిని (146 బంతుల్లో 113 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ సెంచరీ చేయగా... మరో ఓపెనర్ దీప్తి శర్మ (128 బంతుల్లో 89; 10 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి తొలి వికెట్కు 174 పరుగులు జోడించింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో పూనమ్ (3/30), శిఖా పాండే (2/11), ఏక్తా బిష్త్ (2/15), దేవిక వైద్య (2/11) ఆకట్టుకున్నారు. సోమవారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్లో జింబాబ్వేతో భారత్ ఆడుతుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. లీగ్ దశ ముగిశాక ఆయా గ్రూప్ల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుతాయి. -
భారత్ శుభారంభం
తొలి మ్యాచ్లో శ్రీలంకపై విజయం రాణించిన దేవిక, మిథాలీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ కొలంబో: ఐసీసీ ప్రపంచకప్ మహిళల క్రికెట్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్లో టీమిండియా 114 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్ దీప్తి శర్మ ( 54; 4 ఫోర్లు, ఒక సిక్స్), దేవిక వైద్య (89; 11 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (70 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం శ్రీలంక 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 145 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్ రెండేసి వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఓడిపోయిన భారత్ ఈ మ్యాచ్లో మాత్రం ఆతిథ్య జట్టును తేలిగ్గా తీసుకోలేదు. తొమ్మిది పరుగుల వద్ద మోనా మేష్రమ్ (6) పెవిలియన్కు చేరుకున్నా... రెండో వికెట్కు దీప్తి శర్మ, దేవిక వైద్య 122 పరుగులు జోడించి భారత్కు గట్టి పునాది ఏర్పాటు చేశారు. దీప్తి అవుటయ్యాక మిథాలీతో కలిసి దేవిక 49 పరుగులు జతచేసింది. సెంచరీ దిశగా సాగుతున్న దశలో ప్రబోధిని బౌలింగ్లో దేవిక అవుటైంది. ఈ దశలో క్రీజులో వచ్చిన హర్మన్ప్రీత్ కౌర్ (20; 3 ఫోర్లు)తో కలిసి మిథాలీ వేగంగా పరుగులు చేసి భారత స్కోరును 250 పరుగులు దాటించారు. ‘విజయంతో టోర్నీని ఆరంభించినందుకు ఆనందంగా ఉంది. మొదట్లో నెమ్మదిగా ఆడినా... దేవిక, దీప్తి భాగస్వామ్యంతో తేరుకున్నాం. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో వేగంగా స్కోరు చేశాం’ అని కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. ఇతర లీగ్ మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా 63 పరుగుల తేడాతో పాకిస్తాన్పై, బంగ్లాదేశ్ 118 పరుగుల తేడాతో పాపువా న్యూ గినియాపై, ఐర్లాండ్ 119 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలిచాయి. -
వరల్డ్ కప్ కు ఇంగ్లండ్ అర్హత!
దుబాయ్:వచ్చే ఏడాది స్వదేశంలో జరుగునున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు అర్హత సాధించింది. ఐసీసీ మహిళల చాంపియన్స్షిప్ సిరీస్లో భాగంగా శనివారం కొలంబోలో శ్రీలంకతో జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 122 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 2017 మహిళల వరల్డ్ కప్లో నేరుగా అడుగుపెట్టబోతున్న రెండో జట్టుగా నిలిచింది. ఈ విజయం తరువాత ఇంగ్లండ్ 25 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా మహిళల జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఐఓసీ టైటిల్ గెలిచిన ఆసీస్ జట్టు 30 పాయింట్లతో వరల్డ్ కప్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ప్రస్తుతం 22 పాయింట్లతో ఉన్న వెస్టిండీస్ మహిళలు వరల్డ్ కప్ కు అర్హత సాధించే అవకాశానికి చేరువగా ఉన్నారు. ఇక్కడ టాప్-4లో ఉన్న జట్లే నేరుగా వరల్డ్ కప్కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఆ తరువాత ఉన్న మిగతా నాలుగు జట్లు వచ్చే ఏడాది జరిగి క్వాలిఫయర్ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. 2017 ఫిబ్రవరి 7 నుంచి 21 వరకూ ఆ నాలుగు జట్లు క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంది. -
భారత్-పాక్ మ్యాచ్కు వర్షం ముప్పు
కోల్ కతా: వరల్డ్ టీ 20లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య శనివారం ఈడెన్ గార్డెన్లో జరుగనున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కల్గించే అవకాశాలు కనబడుతున్నాయి. తొలుత ఈ రోజు ఉదయం నగరంలో భారీ వర్షం కురవడంతో పిచ్ను కవర్లతో కప్పి ఉంచాల్సి వచ్చింది. ఒక గంట పాటు వర్షం కురిసిన అనంతరం వాతావారణం మళ్లీ సాధారణ స్థాయికి రావడంతో మ్యాచ్ నిర్వాహకులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే టాస్ కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఆకాశం మరోసారి మేఘావృతం కావడంతో మ్యాచ్ నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దైన పక్షంలో ఇరు జట్లకు చెరో ఒక పాయింట్ లభిస్తుంది. ఇలా జరిగితే టీమిండియా జట్టుకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ఈ టోర్నీలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో దాదాపు మిగతా మ్యాచ్లను గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో మ్యాచ్ రద్దైతే అది కచ్చితంగా భారత జట్టు నాకౌట్ దశపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ పై గెలిచిన పాకిస్తాన్ సేఫ్ జోన్ లో ఉంది. -
వరల్డ్ కప్ కు యువ భారత జట్టు ఎంపిక
ముంబై: వచ్చే ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తున్న అండర్-19 వరల్డ్ కప్ లో పాల్గొనే యువ భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఈ మేరకు ఇషాన్ కిషన్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన క్రికెట్ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. యువ భారత క్రికెట్ జట్టు జాబితాను మూడు విడతలుగా రిలీజ్ చేశారు. ఇషాన్ కిషన్(కెప్టెన్), రిషబ్ పాంట్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ దీప్ లతో కూడిన జట్టును తొలుత విడుదల చేయగా, ఆ తరువాత అన్మూల్ ప్రీత్ సింగ్, ఆర్మాన్ జాఫర్, రికీ భూయ్, మయాంక దాగర్, జీషన్ అన్సారీ, మహిపాల్ లామ్రోర్, అవీష్ ఖాన్ ల పేర్లను విడుదల చేసింది. చివరగా సుభామ్ మావి, ఖలీల్ అహ్మద్, రాహుల్ బథామ్ ల పేర్లను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఖరారు చేసింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 14 వరకూ బంగ్లాదేశ్ లోని నాలుగు నగరాల్లో మొత్తం 8 వేదికల్లో పోటీలు జరుగనున్నాయి. స్థానిక కాలమాన ప్రకారం మ్యాచ్ లు ఉదయం గం.9.00.లకు ప్రారంభమవుతాయి. జనవరి 28 వ తేదీన భారత్ తన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతీ ఒక్క గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ లీగ్ కు అర్హత సాధిస్తాయి. టెస్టు హోదా ఉన్న 10 దేశాలే కాకుండా, మరో ఆరు సభ్య దేశాలు (ఆఫ్ఘనిస్తాన్, ఫిజీ, కెనడా, నమీబియా, నేపాల్, స్కాట్లాండ్) కూడా ఈ టోర్నికి అర్హత సాధించాయి. ముక్కోణపు సిరీస్ లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి ట్రోఫీని అందుకున్న అనంతరం భారత జట్టును ప్రకటించడం విశేషం.దాదాపు ముక్కోణపు సిరీస్ లో పాల్గొన్న సభ్యుల్నే వరల్డ్ కప్ కు ఎంపిక చేశారు. -
ఆసియా టి20 కోసం బిడ్స్ ఆహ్వానం
కరాచీ : వచ్చే ఏడాది జరిగే ఆసియా టి20 చాంపియన్షిప్ నిర్వహణ కోసం తమ సభ్య దేశాల నుంచి ఆసియన్ క్రికెట్ మండలి (ఏసీసీ) బిడ్స్ను ఆహ్వానించింది. సింగపూర్, మలేసియా, యూఏఈ, నేపాల్, ఖతార్ దేశాలను ఈ టోర్నీ జరిపేందుకు బిడ్స్ను దాఖలు చేయాల్సిందిగా సూచించినట్టు ఏసీసీ అధికారి ఒకరు తెలిపారు. అలాగే రెండేళ్లకోసారి జరిగే ఈ చాంపియన్షిప్ను టి20, వన్డే ఫార్మాట్లో జరపాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇందులో అసోసియేట్ సభ్య దేశాలు పాల్గొంటాయి. ఈ చాంపియన్షిప్లో జరిగే టి20 టోర్నీ.. ఐసీసీ వరల్డ్ టి20 జరిగే ఏడాదిలో, వన్డే ఫార్మాట్.. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఏడాదిలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.