idly
-
ఆ రేంజ్ ధర పలికే ఇడ్లీలా..?
ఇడ్లీ(Idli) అనగానే చీప్ ధరలో దొరికే బ్రేక్ఫాస్ట్గా భావిస్తాం. అయితే ఈ సౌత్ ఇండియన్ వంటకం హోటల్ రేంజ్ని బట్టి ధరలు కూడా వేరేలెవల్లో ఉంటాయి. అయితే విలాసవంతమైన హోటల్లో దొరికే ఇడ్లీ టేస్ట్ మతిపోయేలా ఉంటుందనుకుంటున్నారా...?. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకో ఈ వైరల్ వీడియోని చూస్తే మీకే తెలుస్తుంది. బెంగుళూరు వ్లాగర్(Bengaluru Vlogger) వీధుల్లో ఉండే హోటల్లో(roadside shop) దొరికే రూ. 5ల ఇడ్లీ నుంచి విలాసవంతమైన ప్యాలెస్లో దొరికే రూ. 5 వేల రూపాయల వరకు వివిధ ధరలు పలికే ఇడ్లీనే టేస్ట్ చేశాడు. పైగా వాటికి టేస్ట్కి రేట్స్ కూడా ఇచ్చాడు. ఆ వీడియోలో ముందుగా వీధులలో అమ్మే రూ. 5ల ఇడ్లీని తినేందుకు సాదాసీదాగా వెళ్లి టేస్టీ చేసి చూశాడు. రుచి అదుర్స్ అంటూ పదికి తొమ్మిదన్నర మార్కులు వేశాడు. ఆ తర్వాత ప్రముఖ రామేశ్వరం కేఫ్(Rameshwaram cafe)లోని రూ. 50ల ఇడ్లీని టేస్ చేయడానికి వెళ్లాడు. అయితే ఈ ఇడ్లీ టేస్ట్కి ఏడున్నర మార్కులు వేశాడు. తాజ్ హోటల్(Taj Hotel)లో ఇడ్లీని టేస్ట్ చేయగా అక్కడ దానిని చక్కగా ప్లేట్లో తీసుకురావడం తోపాటు నైఫ్, ఫోర్క్లు ఇచ్చారు. వాటితో అక్కడ ఇడ్లీని తినడం ఇబ్బందిగా అనిపించినా.. అలా తినక తప్పలేదు. అయితే అక్కడ టేస్ట్కి నాలుగున్నర మార్కులే వేశాడు. ఇక చివరగా ఓ లగ్జరీయస్ ప్యాలెస్లో ఇడ్లీ తినడానికి వెళ్లాడు. అక్కడ ఇడ్లీ ఖరీదు ఏకంగా రూ. 5వేల రూపాయలు. 23 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ ఇది. పాపం అన్ని డబ్బులు వెచ్చించినా..కొద్దిగా మాత్రమే తినగలిగాడు. ఇక నావల్ల కాదంటూ వదిలేశాడు. ఫైనల్గా రూ. 5 ఇడ్లీనే చాలా టేస్ట్గా ఉందని చెప్పడం విశేషం. అయితే నెటిజన్లు రుచి అనేది రేంజ్ హోటల్ని బట్టికాదు..చేసే విధానం పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిగ్గా రుచి బాగుంటుందని కొందరూ, మరీ రూ. 5 కోట్ల రూపాయల ఇడ్లీని ఎప్పుడూ తింటావ్ అని కామెంట్లు చేస్తూ పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Cassy Pereira (@cassiusclydepereira) (చదవండి: సోనాలి బింద్రే మెరిసే చర్మం రహస్యం..ఆ భారతీయ సంప్రదాయ మొక్క..! ) -
మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా!
రాగులతో మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రాగులు చాలామంచిది. కాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. రాగులతో పసందైన వంటకాలను తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. అయితే రాగులను నానబెట్టి,మొలకలొచ్చాక, వేయించి పౌడర్ చేసుకొన వాడితేమరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు రాగులను అనేక రూపాల్లో తీసుకోవచ్చు. రాగి జావ, రాగి పిండితో దోసెలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. అలాగే రాగులతో మురుకులను కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాగులను మొలకలు వచ్చేలా చేసి వాటిని ఎండబెట్టి, లైట్గా వేయించి పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికీ రుచీ పెరుగుతుంది. పోషకాలూ పెరుగుతాయి. రాగుల మొలకలతో పిండిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.రాగుల మొలకలతో పిండి తయారీరాగులను రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి. ఆ తరువాత వీటిని శుభ్రంగా కడగాలి. ఎక్కువ సార్లు దాదాపు నాలుగు నుంచి పదిసార్లు , తెల్ల నీళ్లు వచ్చేదాకా కడుక్కోవాలి. కడిగిన రాగులను జాలీలో వేసుకొని నీళ్లు మొత్తం వాడేలా చూసుకోవాలి. తరువాత వీటిని పల్చని కాటన్ వస్త్రంలో(కాటన్ చున్నీ, చీర అయితే బావుంటుంది)వేసి మూట కట్టి, లైట్గా నీళ్లు చిలకరించి ఒక జాలీ గిన్నెలో పెట్టి, జాగ్రత్తగా వంట ఇంటి కప్బోర్డులో(గాలి, వెలుతురు తగలకుండా) పెట్టుకోవాలి. రెండు రోజులకు రాగులు మొలకలు భలే వస్తాయి. మూటలోంచి మొలకలు తెల్లగా బయటికి వచ్చేంత పెరుగుతాయి. వీటిని జాగ్రత్తగా తీసుకొని తడి ఆరేలాగా ఎండబెట్టుకోవాలి. ఆరిన తరువాత వీటిని నూనె లేకుండా ఉత్తి మూకుడులో వేగించుకోవాలి. మాడకుండా గరిటెతో తిప్పుతూ సన్నని సెగమీద కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. అంటే కమ్మని రాగుల మొలకల పిండి రెడీ.ఈ పిండిని జావ, దోసెలు, చపాతీలు తయారీలో వాడుకోవచ్చు. ఇంకా రాగిమొలకలతో చేసిన పిండిలో కొద్దిగా పుట్నాల పొడి, బెల్లం, నెయ్యి కలిపి సున్ని ఉండలుగా చేసి పిల్లలకు రోజుకు ఒకటి పెడితే మంచి శక్తి వస్తుంది.రాగి ఇడ్లీరాగుల పిండిలో గోధు రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎండు మిర్చి,, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి. కొత్తమీర కూడా కలుపుకోవచ్చు.రాగులతో ఉపయోగాలురాగులు బలవర్దకమయిన ఆహారం. ఇతర ధాన్యాల కంటే రాగుల్లో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఎక్కువ. నానబెట్టి, మొలకెత్తడంవల్ల పోషకాలు మరింత పెరుగుతాయి కొవ్వు కంటెంట్ తగ్గుతుంది. ఈ పిండితో చేసిన ఉగ్గును శిశువులకు కూడా తినిపించవచ్చు.బీపీ మధుమేహం, కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం లాంటి సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. చిన్నపిల్లల్లో ఎముకల వృద్ధికి, అనీమియా నివారణలో ఉపయోగపడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి -
'కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా?
ఇడ్లీ అనంగానే తేలిగ్గా అరిగిపోయే వంటకం. చాలా సులభంగా జీర్ణమయ్యే అల్పాహారం కూడా. పేషెంట్లే కాదు, సామాన్య ప్రజల వరకు అందరూ బ్రేక్ఫాస్ట్ మొదటగా ఈ రెసిపీకే ప్రాధాన్యత ఇస్తారు. అంతలా ఇడ్లీలు అందరి మనసులో దోచుకున్న గొప్ప ప్రసిద్ధ వంటకంగా పేరుగాంచింది. అయితే వీటిని పలు రకాలుగా చేస్తారు. ఆయా ప్రాంతాల వారీగా చేసే విధానం మారుతుంటుంది. అందులోకి ఆరోగ్య స్ప్రుహతో మరింత ఆరోగ్యవంతంగా ఆస్వాదించే వైరైటీ ఇడ్లీలు కూడా మన ఆహారంలో భాగమైపోతుండటం మరింత విశేషం. అయితే ఇడ్లీలకే కింగ్గా పిలిచే వెరైటీ ఇడ్లీ వంటకం గురించి విన్నారా..?.ఇడ్లీలకే రాజుగా పేరుగాంచిన ఈ వంటకం కేరళలోని పాలక్కాడ్లోని గ్రామానికి చెందింది. ఈ ఇడ్లీలు మనం తినే ఇడ్లీలకు చాలా విభిన్నంగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు ఆకృతి పరంగా పెద్దవిగానూ మల్లెపువ్వులా మృదువుగా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తయారు చేసే విధానం కూడా అత్యంత విభిన్నంగా ఉంటుంది. పాలక్కాడ్లోని రామస్సేరి గ్రామం కింగ్ ఆఫ్ ఇడ్లీలకు పేరుగాంచింది. ఈ ఇడ్లీలనే తినేందుకు పర్యాటకులు ఈ గ్రామానికి తరలి వస్తుంటారా..!. వీటిని పాన్కేక్ మాదిరిగా తయారు చేస్తారు.తయారు చేయు విధానం..మట్టికుండపై ఒక గుడ్డ కప్పి ఆవిరిపై ఉడకబెడతారు. 200 ఏళ్ల క్రితం తమిళనాడు, కాంచీపురం, తిరుపూర్, తంజావూర్ వంటి ప్రాంతాల నుంచి కొన్ని ముదలియార్ కుటుంబాలు కేరళకు రావడంతో ఈ వంటకం పుట్టుకొచ్చిందని స్థానికులు చెబుతుంటారు. వాళ్లంతా బతుకుదెరువు కోసం రామస్సేరి అనే చిన్న గ్రామానికి వచ్చి స్థిరపడటంతో ఈ వంటకం ఉనికిలోకి వచ్చిందని ఓ కథనం. ఆయా కుటుంబాల్లో మగవాళ్లంత చేనేత కార్మికులు కాగా, మహిళలు రుచికరంగా వంట చేసేవారట. అలా ఈ రామస్సేరి ఇడ్లీలు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఇడ్డీని తయారు చేసేందుకు ఉపయోగించే మెష్క్లాత్ ఇడ్డీని సమానంగా ఉడికేలా చేయగా, స్లీమింగ్ కోసం ఉపయోగించే మట్టికుండా ఆ ఇడ్లీలకు ఒక విధమైన రుచిని అందిస్తాయి. తయారీ..కావాల్సిన పదార్థాలు..కప్పుల బియ్యం (ఇడ్లీ బియ్యం మరియు ముడి బియ్యం)ఉరద్ పప్పు 1 కప్పు నీరు 1 కప్పు మెంతు గింజలు 1 స్పూన్ తగినంత ఉప్పునాలుగు గంటలు పైనే నానబెట్టిటన మినపప్పు, బియ్యం, మెంతులు కలిపి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఉప్పు వేసి కనీసం ఓ పది నుంచి 12 గంటలు వదిలేయాలి. ఆ తర్వాత ఇడ్లీల్లా మట్టిప్లేటులో పెద్ద మొత్తంలో పరుచుకుని మట్టికుండపై ఉడికిస్తే.. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రామస్సేరి ఇడ్లీలు రెడీ..!.(చదవండి: -
'ఖుష్బు ఇడ్లీ' గురించి విన్నారా..? ఆ పేరు వెనకున్న స్టోరీ ఇదే..!
తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీని పలుచోట్ల వివిధ రకాల పేర్లుతో పిలవడం గురించి విన్నాం. కానీ మరీ ఇలా ఓ ప్రముఖ నటి పేరుమీదుగా బ్రేక్ఫాస్ట్ని పిలవడం గురించి విని ఉండరు. ఈ ఇడ్లీ తమిళనాట బాగా ఫేమస్. కోలివుడ్ చెందిన ప్రముఖ నటి ఖుష్బు పేరు మీదుగా అక్కడ ఇడ్లీ వంటకం ఉంది. అసలు ఆ బ్రేక్ఫాస్ట్కి ఆ పేరు ఎలా వచ్చింది..? దీని వెనుక దాగున్న స్టోరీ ఏంటంటే..?.భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్ఫాస్ట్లలో ఒకటి ఇడ్లీలు. ఇవి అత్యంత మృదువుగా మెత్తటి ఇడ్లీలా ఉంటాయి. సింపుల్గా చేసే ఈ అల్పాహారాన్ని దక్షిణ భారతదేశంలో ఓ గిన్నె సాంబార్, చట్టితో సర్వ్ చేస్తారు. దక్షిణ భారత సాంప్రదాయ వంటకమే ఈ ఇడ్లీ. అయితే తమిళనాట పేరుగాంచిన 'ఖుష్బూ ఇడ్లీ' తయారీ మాత్ర డిఫెరెంట్గా ఉంటుంది. ఇది మిగతా ఇడ్లీల కంటే పువ్వులా కోమలంగా తెల్లటి మల్లెమొగ్గల్లా అందంగా ఉంటాయి. నోట్లే వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి. అంతలా సుకుమారంగా ఉంటాయి ఈ ఇడ్లీలు. అదీగాక తమిళనాడులో ఒకప్పుడూ అత్యంత అందమైన హీరోయిన్గా ఖుష్బు ఓ వెలుగు వెలిగింది. ఆమె కూడా బొద్దుగా అందంగా ఉంటుంది. ఈ ఇడ్లీలు కూడా చక్కగా ప్లవ్వీగా మల్లెపువ్వులా ఆకర్షణీయంగా ఉండటంతో ఆ నటి పేరు మీదగా వాళ్లంతా ఈ ఇడ్లీని పిల్చుకుంటున్నారు. దీన్ని వాళ్లు మల్లిగే ఇడ్లీ లేదా మల్లిగై పూ ఇడ్లీ అని కూడా పిలుస్తారు. తమిళంలో మల్లిగె, మల్లిగై అంటే 'మల్లెపువ్వు' అని అర్థం. మల్లె పువ్వులా చాలా కోమలంగా ఈ ఇడ్లీలు ఉంటాయి. ఐతే ఈ ఇడ్లీ 'ఖుష్బూ ఇడ్లీ' పేరు మీదగానే ఎక్కువ ప్రజాధరణ పొందింది. ఎవరు తయారు చేశారంటే..?నాలుగు దశాబ్దాల క్రితం, ధనభాగ్యం అమ్మ ప్రస్తుత కరుంకలపాళయం ఈ ఖుష్బు ఇడ్లీలను తయారు చేయడం ప్రారంభించిందని చెబుతారు. ఈ అసాధారణమైన మృదువైన ఇడ్లీలు రాను రాను ఆహార ప్రియులకు ప్రీతికరమైనవిగా మారిపోయాయి. పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా ఆమె తన రెసిపీ తయారీ గురించి 20 కుటుంబాలకు తెలియజేసింది. వాళ్లంతా ఆమెకు సహాయం చేయడానికి వీలుకల్పించారు. అలా లగ్జరీ హోటళ్ల నుంచి చెఫ్లు కూడా ధనభాగ్యం అమ్మ చేసిన ప్రత్యేక ఇడ్లీల తయారీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా నేడు రోజుకు దాదాపు 10 వేలకు పైగా ఇడ్లీలు అమ్ముడవుతున్నాయి. ఖుష్బు ఇడ్లీ విలక్షణమైన ఆకృతి దాని పదార్థాల నుంచి వస్తుంది. ముఖ్యంగా సబుదానా, బియ్యం, మినప్పులతో ఈ ఇడ్లీని తయారు చేస్తారు. దీన్ని పులియబెట్టడం వల్ల మృదువుగా స్పాంజ్లా వస్తాయి.(చదవండి: ఆ ఏజ్లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి) -
మెనూ.. కొద్దిగా మారుద్దాం! అప్పుడే హ్యాపీగా తింటాం!!
బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తే... ‘అమ్మో! డెడ్లీ’ అంటారు పిల్లలు. కూరగాయలతో కూరలు వండితే... ‘అన్నీ పిచ్చి కూరలే’ అంటారు. అందుకే... జస్ట్ ఫర్ చేంజ్. కూరగాయలతో బ్రేక్ఫాస్ట్... ఇడ్లీతో ఈవెనింగ్ స్నాక్ చేద్దాం. హ్యాపీగా తినకపోతే అడగండి.వీట్ వెజిటబుల్ దోసె..కావలసినవి..గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు;ఉప్పు – పావు టీ స్పూన్;నీరు – పావు కప్పు;టొమాటో ముక్కలు – పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు;క్యారట్ తురుము – పావు కప్పు;పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు;నూనె – 6 టీ స్పూన్లు.తయారీ..– ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.– ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.– ఇప్పుడు పెనం వేడి చేసి దోసెలు పోసుకోవడమే. ఈ దోసెలు ఊతప్పంలా మందంగా ఉండాలి.– మీడియం మంట మీద కాలనిస్తే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కాల్చి తీస్తే హోల్ వీట్ వెజిటబుల్ దోసె రెడీ.చిల్లీ ఇడ్లీ..కావలసినవి..ఇడ్లీ ముక్కలు – 2 కప్పులు;రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్లు;తరిగిన అల్లం – 2 టీ స్పూన్లు;తరిగిన వెల్లుల్లి– 2 టీ స్పూన్లు;తరిగిన పచ్చి మిర్చి – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు;టొమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్లు;చక్కెర– అర టీ స్పూన్;వినెగర్– టీ స్పూన్;సోయాసాస్ – టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 3 టేబుల్ స్పూన్లు.తయారీ..– పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఇడ్లీ ముక్కలు వేసి అంచులు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి.– ఇప్పుడు అదే పెనంలో మిగిలిన నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు, వేసి వేయించాలి.– ఇప్పుడు టొమాటో కెచప్, చక్కెర, వినెగర్, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.– ఉల్లిపాయ, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలిపితే చిల్లీ ఇడ్లీ రెడీ. దీనిని వేడిగా సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! -
కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీ చేయనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో దిగనున్నారు. భారతీయ మూలాలు ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించడం విశేషం. ఆమె నేపథ్యం వచ్చేటప్పటికీ..ఆమె తల్లి తమిళనాడుకి చెందిన భారతీయురాలు, తండ్రి జమైకన్. ఆమె తల్లిదండ్రులిద్దరూ అమెరికాకి వలస వచ్చారు. అయితే కమలా హారిస్ ఆహార్యం ఎల్లప్పుడూ తన పూర్వీకులను ప్రతిబింబించేలా ఉండటం గర్వించదగ్గ విషయం. అదీగాక కమల హారిస్ చిన్నతనంలో తన తల్లి, చెల్లితో కలిసి తరుచుగా చెన్నై రావడంతో తన మూలాలను ఎన్నటికీ మరచిపోలేదని అంటోంది. అంతేగాదు 2020లో కమలా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా తమిళనాడు ప్రజలు ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలో ఉందని తెలిసి మరింత సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాదు కమలా హారిస్ ట్రంప్పై విజయం సాధించాలంటూ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేయడం విశేషం. ఇక ఆమె తరుచుగా బహిరంగా ప్రచారాల్లో భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. అంతేగాదు ఒకానొక ఇంటర్వ్యూలో తమ ఇంట్లో ఎలాంటి ఆహారం ఉంటుందో వివరిస్తూ..దక్షిణ భారతీయ వంటకాలైన అన్నం, పెరుగు, బంగాళాదుంప కూర, పప్పు, ఇండ్డీ సాంబార్ తింటూ పెరిగాననని సగర్వంగా చెప్పింది. ఆమెకు భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమే అమెరికాలో ఉండే భారతీయ అమెరికన్ కమ్యూనిటీలకు దగ్గర చేసింది. అంతేగాదు తన బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ సాంబార్ తప్పనిసరిగా ఉంటుందని కూడా చెప్పారు కమలా హారిస్. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నప్పటికీ తన దేశ సంస్కృతిని, మూలాలను వదిలిపెట్టలేదు. అది కేవలం భోజనపరంగానే కాదు ఆహార్యం పరంగా కూడా పెద్ద బొట్టు, విభూతి పెట్టుకుని కనిపిస్తూ తరుచుగా వార్తల్లో నిలుస్తుంటారు కమలా హారిస్. దటీజ్ ఇండియన్ కదా..!(చదవండి: టీ అమ్మే వ్యక్తి కూతురు సీఏ అయ్యింది..ఏడుస్తూ తండ్రిని..!) -
కొబ్బరితో కార్న్ ఇడ్లీ..రుచి మాత్రమే కాదు, చాలా బలం కూడా
కోకోనట్ – కార్న్ ఇడ్లీలు తయారీకి కావల్సినవి: మొక్కజొన్న నూక – 2 కప్పులు,కొబ్బరి పాలు – 1 కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – 1 టేబుల్ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్ చాయ పప్పు – 1 టీ స్పూన్,వేరుశనగలు – పావు కప్పు అల్లం తురుము – 2 టీ స్పూన్లు,పచ్చిమిర్చి –2 (చిన్నగా తరగాలి) ఉప్పు – తగినంత,బేకింగ్ సోడా – 1 టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా నూనె వేడి చేసుకుని అందులో వేరుశనగలు, శనగపప్పు, చాయ పప్పు, ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. అందులో మొక్కజొన్న నూక వేసుకుని నిమిషం పాటు గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిపాలు, బేకింగ్ సోడా కలుపుకుని ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. అనంతరం ఇడ్లీ రేకుకు నెయ్యి రాసుకుని.. కొద్దికొద్దిగా మిశ్రమం వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇవి బలానికి బలాన్నీ, రుచికి రుచినీ అందిస్తాయి. -
24 క్యారెట్స్ బంగారంతో చేసిన ఇడ్లీ.. మన హైదరాబాద్లోనే
హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్.. ఇలా ఎన్నో ప్రత్యేకమైన వంటలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఫేమస్ డిషెస్లో మరో కొత్త రకం వంటకం యాడ్ అయ్యింది. అదే గోల్డ్ ఇడ్లీ.. ఈ డిష్ ఇప్పుడు సిటీ అంతటా హాట్టాపిక్గా మారింది. అసలు ఈ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటి? దీని ధరెంత అన్నది ఈ స్టోరీలో తెలసుకుందాం.. సాధారణంగా ప్లేటు ఇడ్లీ ఎంత ఉంటుంది? మహా అయితే రూ.30-50 వరకు ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో అయితే కనీసం రూ.500 వరకు ఉంటుంది. కానీ ఈ గోల్డ్ ఇడ్లీ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.. ఎందుకంటే ఈ ఇడ్లీ ధర ఏకంగా 1200 రూపాయలు. అంత స్పెషల్ ఏముంటుందబ్బా? అదేమైనా బంగారంతో చేశారా ఆని ఆలోచిస్తున్నారా? నిజమే మరి. ఇది బంగారు ఇడ్లీనే. 24 క్యారెట్స్ గోల్డ్ ఇడ్లీ అన్నమాట. బంగారు పూత పూసిన ఈ ఇడ్లీని గులాబీ రేకులతో చాలా కలర్ఫుల్గా గార్నిష్తో చేసి సర్వ్ చేస్తారు. ఈ డిఫరెంట్ ఇడ్లీని టేస్ట్ చేయాలంటే మాత్రం బంజారాహిల్స్లోని కృష్ణ ఇడ్లీ అండ్ దోస కేఫ్కు వెళ్లాల్సిందే. అక్కడ గోల్డ్ ఇడ్లీనే కాదండోయ్.. బంగారు దోశ, గులాబ్ జామూన్ బజ్జీ, మలై ఖోవా గులాబ్ జామున్ వంటి వెరైటీ నోరూరించే వంటలెన్నో ఉన్నాయి. ఇంకెందుకు లేటు ఈసారి బ్రేక్ ఫాస్ట్కి బంగారు వంటలను ఓ పట్టు పట్టండి. View this post on Instagram A post shared by Pooja♡ (@foodnlifestyleby_pooja) View this post on Instagram A post shared by Krishna’s Idli and dosa (@krishna_idli_dosa) -
హైదరాబాదీ రికార్డు.. ఏడాదిలో రూ.6 లక్షల ఇడ్లీలు!
సాక్షి, హైదరాబాద్: అల్పాహారాల్లో ఇడ్లీకున్న క్రేజే వేరు. ఆ క్రేజే ఓ రికార్డును సృష్టించింది. హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఈ రికార్డు సృష్టించినట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. ఆయన ఇడ్లీపై తన ఇష్టాన్ని ఓ రేంజ్లో చూపించాడు. గత ఏడాది కాలంలో రూ.6 లక్షలు కేవలం ఇడ్లీల కోసమే ఖర్చు చేశాడు. తన కోసం, స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం.. ఏడాది మొత్తంలో 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. తాను ప్రయాణించిన వివిధ ప్రదేశాల్లో కూడా ఆయన ఇడ్లీ జపమే చేసినట్లు స్విగ్గీ తన నివేదికలో వెల్లడించింది. ఇడ్లీ క్రేజ్కు సంబంధించిన ఇలాంటి విశేషాలెన్నో స్విగ్గీ వివరించింది. ఇటీవల ప్రపంచ ఇడ్లీ దినోత్సవం పురస్కరించుకుని ఇడ్లీ ఆర్డర్లపై నిర్వహించిన అధ్యయనంతో ఓ నివేదికను సంస్థ విడుదల చేసింది. చాలాచోట్ల డిన్నర్గా కూడా.. గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్లను పంపిణీ చేసినట్టు నివేదిక తెలిపింది. వినియోగదారుల్లో ఈ వంటకానికి ఇప్పటికీ ఉన్న విపరీతమైన క్రేజ్కు ఇది సూచికగా పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. అత్యధిక ఇడ్లీలను ఆర్డర్ చేసిన మొదటి మూడు నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. కొల్కొతా, కొచ్చి, ముంబై, కోయంబత్తూర్, పుణే, వైజాగ్, ఢిల్లీ నగరాలు ఆ తర్వాత ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, ముంబై వాసులు డిన్నర్గానూ ఇడ్లీని ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. కారం, నెయ్యి ఇడ్లీకి హైదరాబాద్ జై బెంగళూరు వాసులు రవ్వ ఇడ్లీలు, చెన్నై వాసులు నెయ్యి, పొడి ఇడ్లీలు ఇష్టపడుతుండగా.. హైదరాబాదీలు కారం పొడి, నెయ్యితో కూడిన ఇడ్లీని ఇష్టపడుతున్నారని తేలింది. ఇక ముంబయి వాసులు ఇడ్లీ..వడ కాంబినేషన్కు జై కొడుతున్నారు. అయితే అల్పాహారాల ఆర్డర్స్లో మసాలా దోశ ఫస్ట్ ప్లేస్లో నిలవగా ఇడ్లీ రెండోస్థానంలో ఉంది. -
బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం మిషన్ ...
-
Recipes: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా
Millet Recipes In Telugu: ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకునేందుకు ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నాం. పండగ సందడిలో క్యాలరీలను పట్టించుకోకుండా నోటికి రుచించిన ప్రతివంటకాన్ని లాగించేశాం. ఇప్పుడు ఒక్కసారిగా చప్పగా ఉండే మిల్లెట్స్ తినాలంటే కష్టమే. అయినా కూడా క్యాలరీలు తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే ‘సిరి’ ధాన్యాలను నోటికి రుచించేలా ఎలా వండుకోవాలో చూద్దాం.... కొర్రల ఇడ్లీ కావలసినవి: కొర్రలు – మూడు కప్పులు మినపగుళ్లు – కప్పు మెంతులు – రెండు టీస్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: కొర్రలు, మినపగుళ్లు, మెంతులను శుభ్రంగా కడిగి కొర్రలను విడిగా, మినపగుళ్లు, మెంతులను కలిపి ఐదుగంటలు నానబెట్టాలి కొర్రలు, మినపగుళ్లు చక్కగా నానాక కొద్దిగా నీళ్లు పోసుకుని విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ రెండిటినీ కలిపి కొద్దిగా ఉప్పు వేసి పులియనియ్యాలి పులిసిన పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకుని ఆవిరి మీద ఉడికించాలి. వేడివేడి కొర్రల ఇడ్లీలు సాంబార్, చట్నీతో చాలా బావుంటాయి. మిల్లెట్ హల్వా కావలసినవి: కొర్రలు – కప్పు బెల్లం – కప్పు జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను కిస్మిస్లు – టేబుల్ స్పూను నెయ్యి – పావు కప్పు యాలకులపొడి – పావు టీస్పూను. తయారీ: ముందుగా కొర్రలను మరీ మెత్తగా కాకుండా బరకగా పొడిచేసుకుని పక్కన పెట్టుకోవాలి మందపాటి బాణలిలో బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు మరిగించి పొయ్యిమీద నుంచి దించేయాలి మరో బాణలిలో నెయ్యివేసి వేడెక్కనివ్వాలి. నెయ్యి కాగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు వేసి బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించి పక్కనపెట్టుకోవాలి ఇదే బాణలిలో కొర్రల పొడి వేసి ఐదు నిమిషాలు వేయించాలి వేగిన పొడిలో నాలుగు కప్పులు నీళ్లుపోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి నీళ్లన్నీ ఇగిరాక బెల్లం నీళ్లను వడగట్టి పోయాలి కొర్రలు, బెల్లం నీళ్లు దగ్గర పడేంత వరకు ఉడికించాలి. నెయ్యి పైకి తేలుతున్నప్పుడు యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు వేసి కలిపి దించేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Dussehra 2022 Sweet Recipes: బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్ఫ్లోర్తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా Papaya Halwa Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా! -
Recipe: పన్నీర్ వెజిటబుల్ ఇడ్లీ, కోకోనట్ పాన్కేక్ తయారు చేసుకోండిలా!
హెల్తీ బ్రేక్ఫాస్ట్ పన్నీర్ వెజిటబుల్ ఇడ్లీ, కోకోనట్ పాన్కేక్ ఇలా తయారు చేసుకోండి! పన్నీర్ వెజిటబుల్ ఇడ్లీ తయారీకి కావలసినవి: ►పన్నీర్ తురుము – అరకప్పు ►క్యారట్ తురుము – పావు కప్పు ►క్యాబేజీ తరుగు – పావు కప్పు ►సూజీ రవ్వ – అరకప్పు ►పెరుగు – కప్పు ►శనగపిండి – అరకప్పు ►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ►ఒక గిన్నెలో సూజీ రవ్వ, శనగపిండి, పెరుగువేసి కలపాలి. ►దీనిలో పావు కప్పు నీళ్లు కలిపి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ►నానిన పిండిలో మిగతా పదార్థాలు, ఉప్పు వేసి చక్కగా కలపాలి. ►ఇడ్లీ పాత్రలో ఈ పిండిని వేసి ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికించి, కొబ్బరి చట్నీ లేదా సాంబార్తో సర్వ్ చేసుకోవాలి. కోకోనట్ పాన్కేక్ తయారీకి కావలసినవి: ►కొబ్బరి పాలు – ముప్పావు కప్పు ►పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ►గుడ్లు – రెండు ►పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►బటర్ – రెండు టేబుల్ స్పూన్లు ►గోధుమ పిండి – కప్పు ►వంటసోడా – మూడు టీస్పూన్లు ►ఉప్పు – అరటీస్పూను ►నూనె – అరకప్పు ►మేపుల్ సిరప్ – పావు కప్పు. కోకోనట్ పాన్కేక్ తయారీ: ►గిన్నెలో కొబ్బరిపాలు, పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి. ►మరో గిన్నెలో గుడ్లసొనను బీట్ చేయాలి. ►బటర్ను కరిగించి గుడ్ల సొనలో వేసి మరోసారి బీట్ చేయాలి. ►ఇప్పుడు కొబ్బరిపాల మిశ్రమంలో గుడ్లసొన, బటర్ మిశ్రమాన్ని వేసి చక్కగా కలపాలి. ►మరో గిన్నెలో గోధుమపిండి, వంటసోడా, ఉప్పు వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కూడా కొబ్బరిపాల మిశ్రమంలో వేసి కలపాలి. ►స్టవ్ మీద పాన్పెట్టి టేబుల్ స్పూను నూనెవేసి పాన్ మొత్తం రాయాలి. ►నూనె వేడెక్కిన తరువాత పావుకప్పు మిశ్రమం వేసి నీటిబుడగలు లేకుండా అట్టులా పోసుకోవాలి. ►సన్నని మంట మీద రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో వేసి మేపుల్ సిరప్ చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా! Oats Uthappam Recipe: ఓట్స్ ఊతప్పం తయారీ విధానం ఇలా! -
అక్కడ తెలుగోడి నల్ల ఇడ్లీ ఎంత ఫేమసో..!!
-
రాగి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ... ప్రతి ఉదయం 10 వేలు!
రాగి ఇడ్లీ.. రవ్వ ఇడ్లీ.. నెయ్యి ఇడ్లీ.. కాంచీపురం ఇడ్లీ... జయలలిత ఇడ్లీ.. పూల సంతలాగా పండ్ల సంతలాగా ఇడ్లీల హోల్సేల్ సంత. తమిళనాడు ఈరోడ్లోని కరుంగల్ పాళ్యంలో దాదాపు స్త్రీలే నడిపే 35 హోటళ్ల సంత ఇది. రోజుకు 10 వేల ఇడ్లీలు అమ్ముతారు. పెళ్లిళ్ల సీజన్లో 40 వేల ఇడ్లీలు. నలభై ఏళ్ల క్రితం ఇద్దరు స్త్రీలు మొదలెట్టిన ఈ సంత నేడు దాదాపు స్త్రీల చేతుల మీదుగానే నడుస్తోంది. స్త్రీల చేతుల్లో తయారవుతున్న మల్లెపూల వంటి ఇడ్లీల విజయగాథ ఇది. రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి పసుపు కొనడానికి వర్తకులు ఈరోడ్కు వస్తారు. తమిళనాడులోని పెద్ద ఊరు అది. ఆ వర్తకం పని అయిపోతుంది. ఉదయాన్నే ఆటో మాట్లాడుకుని 150 రూపాయలు ఇచ్చి అక్కడికి 14 కిలోమీటర్లు ఉన్న కరుంగల్ పాళ్యానికి మరుసటి రోజు పొద్దున్నే వస్తారు. అక్కడ ఇడ్లీ సంత ఉంటుంది. ఉదయం 5 నుంచి తొమ్మిదిన్నర లోపు ముగిసిపోయే సంత. అనుక్షణం వేడి వేడి ఇడ్లీ ఈలోపు. రెండిడ్లీ 7 రూపాయలు. 150 ఖర్చు పెట్టుకొని మరీ వచ్చి ఆ ఏడు రూపాయల ఇడ్లీ తింటారు. కరుంగల్ పాళ్యం ఇడ్లీ అంటే అంత రుచి. అంత డిమాండ్. ఊళ్లో పొలిటికల్ పార్టీ మీటింగ్ ఉంటుంది. తమ కార్యకర్తల కోసం 200 ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్ కరుంగల్ పాళ్యంకు వెళుతుంది. ఇంట్లో శుభకార్యం ఉండి బంధువులు వస్తారు. టిఫిన్కు వంద ఇడ్లీలు అవసరం అవుతాయి. కరుంగల్ పాళ్యంకు వెళితే రెడీ. పెళ్లి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్లో పొంగల్, ఉప్మా మనం వొండుకుంటాం. ఇడ్లీ మాత్రం కరుంగల్ పాళ్యం నుంచి రావాల్సిందే. ఇంకా విశేషం ఏమిటంటే ఈరోడ్లో చాలా పెద్ద హోటళ్లు ఉన్నాయి. ఇవి ఉదయాన్నే కరుంగల్ పాళ్యం నుంచి హోల్సేల్లో ఇడ్లీ తెచ్చుకుని తమ చట్నీ, సాంబారులతో కస్టమర్లకు రెట్టింపు రేట్కు అమ్ముకుంటాయి. కరుంగల్ పాళ్యంలో రోజుకు ప్రతి ఉదయం 6 నుంచి 9 లోపు పదివేల ఇడ్లీలు అమ్ముతారు. ఎలక్షన్లు ఉన్నా, పెళ్ళిళ్ల సీజన్ అయినా ఈ సంఖ్య నలభై వేలు. మొత్తం 40 లోపు వరుస షాపులున్నాయి అక్కడ. మొత్తం స్త్రీలే నిర్వహిస్తారు. మగవాళ్లు సహాయం చేస్తారు. ఇడ్లీ ఉడికే పాత్రల్లో ఒకే సమయంలో ఇద్దరు ఆడవాళ్లు పిండి నింపడం ఇక్కడే చూస్తాం. ఇలాంటి ఇడ్లీ సంతను కూడా ఇక్కడే చూస్తాం. విఫలం నుంచి విజయం వైపు నిజానికి ఇది ఒక వైఫల్యం నుంచి మొదలైన విజయగాథ. నలభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో నేత పని కార్మికులు జీవించేవారు. ఆ సమయంలోనే ఈరోడ్లో మిషన్ క్లాత్ ఉత్పత్తి మొదలైంది. దాని దెబ్బకు నేత పని మూలపడింది. శ్రీరంగన్ అనే నేత కార్మికుడు ఎడ్ల బండి మీద సరుకులు వేసే కూలీగా మారాడు. ఇది అతని భార్య చెల్లమ్మాళ్ను బాధించింది. ఆమె అతనికి సహాయంగా నాలుగు డబ్బులు సంపాదించడం కోసం ఇంటి ముంగిట్లో ఉదయాన్నే ఇడ్లీలు వేయడం మొదలెట్టింది. ఆ రోజుల్లో ఆ ప్రాంతం పల్లె. ఎవరూ ఉదయం టిఫెన్ ఇడ్లీ తినేవారు కాదు. కాని చెల్లమ్మాళ్ చుట్టుపక్కల డాక్టర్లను కలిసింది. జబ్బు చేసిన వారిని ఉదయం ఇడ్లీ తినమని డాక్టర్లు చెప్పడం అప్పుడే మొదలైంది. ‘మా షాపు గురించి చెప్పండయ్యా’ అని చెల్లమ్మాళ్ వారిని కోరితే వారు సరేనన్నారు. అలా ఆమె ఇడ్లీలకు గిరాకీ మొదలైంది. ఆ సమయంలోనే మరో నేత కార్మికుని భార్య ధనపకియం కూడా ఇడ్లీ వేయడం మొదలెట్టింది. కాలక్రమంలో అక్కడి ఇడ్లీల రుచికి టౌన్ నుంచి వెతుక్కుంటూ రావడం మొదలెట్టారు. చెల్లమ్మాళ్కు ఐదుగురు కూతుళ్లు. అందరూ పెళ్లిళ్లు అయిన వెంటనే ఇడ్లీ అంగళ్లు తెరిచారు. ధనపకియం బంధువులు... అంతా కలిసి దాదాపు 40 అంగళ్లుగా అవి ఎదిగాయి. రుచికరమైన ఇడ్లీ తక్కువ ధర... ఈ మంత్రంతో వారు గెలిచారు. కరుణానిధి నుంచి జయలలిత వరకు ఈరోడ్కు రాజకీయ నాయకుడు ఎవరు వచ్చినా లేదా ఆ దారి మీదుగా వెళుతున్నా ఉదయాన్నే కరుంగళ్ పాళ్యం ఇడ్లీ తెప్పించుకుని లేదా ఆగి తినాల్సిందే. కరుణానిధి, జయలలిత ఇలా తిన్నవారిలో ఉన్నారు. సినిమాస్టార్లు, వర్తకులు, సామాన్యులు వారూ వీరూ అని లేదు. ఇక్కడ కూడా సీజన్ను బట్టి కొత్తరకం ఇడ్లీని తయారు చేస్తారు. తమిళనాడులో కుష్బూ ఊపు మీద ఉన్నప్పుడు ‘కుష్బూ ఇడ్లీ’ అమ్మారు. జయలలిత పేరుతో కూడా ఇడ్లీ ఉంది. ‘మేము అరిటాకులో చుట్టకుండా ఇడ్లీ ఇవ్వం’ అని ఇక్కడ 30 ఏళ్లుగా ఇడ్లీ అమ్ముతున్న మల్లిక అంది. ‘నాన్స్టిక్ ఇడ్లీ గిన్నెల్లో కొంతమంది ఇడ్లీలు ఉడికిస్తారు. కాని మేము సంవత్సరాలుగా తడి గుడ్డ మీదే ఇడ్లీ ఉడకబెడతాం. అందుకే మా ఇడ్లీ రుచి’ అని మరొకామె అంది. ఈరోడ్ చుట్టుపక్కల ఉత్సవాలు, వేడుకలు, తిరునాళ్లు జరుగుతుంటే కరుంగళ్ పాళ్యం నుంచి టీమ్లు అన్ని సరుకులు, గిన్నెలు ట్రాలీలో వేసుకుని అవసరమైతే ఐదు పది రోజులు ఉండి ఇడ్లీలు అమ్ముతాయి. వీళ్లొచ్చి స్టాల్ పెట్టారంటే ఆ ఉత్సవానికే గ్లామర్ వస్తుంది. తినేవారి పక్షం అయితే వీరికి కూడా కష్టాలు లేకపోలేదు. వంట చెరుకు, వంట నూనె, గ్యాస్ సిలిండర్, మినప్పప్పు ధరలు పెరిగినప్పుడల్లా వీరి ఆదాయానికి గండి పడుతుంది. కస్టమర్ కోసం వీరు వెంటనే ఇడ్లీ రేటు పెంచరు. క్వాలిటీ తగ్గించరు. ‘ఏం చేస్తాం... కస్టమర్లను వదులుకోలేము కదా’ అంటారు. కరుంగళ్ పాల్యం స్త్రీలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరి ఆడపిల్లలకు దిగులూ చింతా లేదు. పెళ్లి అవడంతోటే అల్లుడు ఇక్కడికే వచ్చి ఒక ఇడ్లీ షాపు తెరుస్తాడు. దూరంగా తల్లి, దగ్గరలో కూతురు ఉదయాన్నే హడావిడిగా ఇడ్లీలు పొట్లాలు కట్టే మనోహర దృశ్యం ఇక్కడే కనిపిస్తుందంటే నమ్మండి. ఎప్పుడైనా ఈరోడ్కు వెళితే ఈ ఇడ్లీల సంగతి మర్చిపోవద్దు. చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్చేస్తే.. కోట్లలో లాభం! -
అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..
పెద్దాపురం: ఈ రోజుల్లో రూపాయి పెట్టి ఏం కొనుక్కోవచ్చో ఠక్కుమని చెప్పండి.. కాస్త ఆలోచించారు కదూ.. రూపాయి పెడితే ఓ చిన్న చాక్లెట్టో, ఓ బిస్కెట్టో కొనుకోవచ్చు అని అనుకుంటున్నారా? నిజమే.. కానీ ఆ హోటల్లో రూపాయికి 3 చట్నీలతో ఇడ్లీ వస్తుంది. ఏంటి రూపాయికి ఇడ్లీయా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. రాజమహేంద్రవరం–కాకినాడ ఏడీబీ రోడ్డులో కొత్తూరు జంక్షన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళితే ఆర్బీ కొత్తూరు గ్రామం వస్తుంది. పెద్దాపురం మండల పరిధిలోని ఈ గ్రామానికి చెందిన చిన్ని రామకృష్ణ (రాంబాబు), రాణి దంపతులు ఇంటి బయట పూరి గుడిసెలో 16 ఏళ్లుగా హోటల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక్క రూపాయికే 3 చట్నీలతో ఇడ్లీ అమ్ముతున్నారు. ఇక్కడ మైసూరు బజ్జీ కూడా ఒక్క రూపాయే. ఊళ్లోని ఇతర హోటళ్లు అన్నింట్లో తొలుత రూపాయికే ఇడ్లీ ఇచ్చేవారు. క్రమేపీ సరుకుల ధరలు పెరగడంతో మిగిలిన హోటళ్లలో ఇడ్లీ ధరలను పెంచేశారు. రాంబాబు మాత్రం ఇప్పటికీ రూపాయికే ఇడ్లీ అందిస్తున్నారు. రాంబాబు హోటల్లో రుచికే కాదు శుచికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రత పాటిస్తూ టిఫిన్ అందిస్తారు. దీనికి నాణ్యత కూడా తోడవడంతో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి ఇక్కడ క్యూలో నిలుచుని మరీ టిఫిన్ చేస్తుంటారు. ఇంట్లోనే హోటల్ నిర్వహిస్తుండటంతో అద్దె కట్టే పని లేదని, తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో విక్రయిస్తుండటంతో పెద్దగా లాభాలు లేకపోయినా హోటల్ను నడిపిస్తున్నామని రాంబాబు చెబుతున్నాడు. రోజుకు సుమారు 500 మంది తన హోటల్కు వస్తారని తెలిపాడు. వేడివేడిగా బజ్జీలు వేస్తున్న అత్త రత్నావతి నాకు సంతృప్తిగా ఉంది రూపాయి అనే పదానికున్న ప్రత్యేకత వేరు. రూపాయికే వైద్యం అంటారు. రూపాయికే కిలో బియ్యం అంటారు. ఇవన్నీ జనం నోట్లో విపరీతంగా నానుతాయి. అందుకే నేను కూడా నష్టం రానంతవరకూ రూపాయికే ఇడ్లీ అమ్మాలనుకుంటున్నాను. చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. ధర పెంచాలన్నారు. కానీ నాకు నచ్చలేదు. 16 ఏళ్ల కిందట అర్ధ రూపాయితో ఇడ్లీ వ్యాపారం మొదలుపెట్టా. నా భార్య రాణి, అత్త రత్నావతి సహకారంతో ఇప్పటికీ అదే రేటుతో వ్యాపారం కొనసాగిస్తున్నాను. నష్టం లేకుండా ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నా. తక్కువ ధర కావడంతో ఒత్తిడి ఉంటుంది. కానీ ఇది నాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది. – చిన్ని రాంబాబు, హోటల్ వ్యాపారి, ఆర్బీ కొత్తూరు, పెద్దాపురం మండలం ఇవీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలింపు ఏపీ: ప్రతి 100 మందిలో 30 మందికి అప్పుడే పెళ్లిళ్లు -
చికెన్- పాలకూర ఫ్రిట్టర్స్ ఎలా తయారు చేయాలో తెలుసా?
చికెన్–పాలకూర ఫ్రిట్టర్స్ కావలసినవి: బోన్లెస్ చికెన్ – పావు కేజీ (మెత్తగా ఉడికించుకుని తురుములా చేసుకోవాలి), మొక్కజొన్న పిండి, చిక్కటి పాలు – అరకప్పు చొప్పున, బియ్యప్పిండి – పావు కప్పు, పాలకూర తురుము – 1 కప్పు, పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా తరగాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, టొమాటో గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – కొద్దిగా, గుడ్డు – 1 (అర టేబుల్ స్పూన్ పాలలో కలిపి పెట్టుకోవాలి.. అభిరుచిని బట్టి). తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, ఉడికించిన చికెన్ తురుము వేసుకుని, పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో గుజ్జు, తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము, పాలకూర తురుము వేసుకుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా చేసుకుని ఓవెన్లో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత అభిరుచిని బట్టి.. గుడ్డు – పాల మిశ్రమంలో ముంచి, పాన్ మీద ఇరువైపులా కొద్దిగా నూనె వేసుకుని దోరగా వేయించుకోవాలి. లేదంటే ఓవెన్లో ఉడికించినవి టొమాటో సాస్లో తింటే భలే రుచిగా ఉంటాయి. వాల్నట్ లడ్డూస్ కావలసినవి: శనగపిండి – 2 కప్పులు, వాల్నట్స్ – ముప్పావు కప్పు (నేతిలో దొరగా వేయించి, మిక్సీ పట్టుకోవాలి), పంచదార పొడి –1 కప్పు, నెయ్యి – 1 కప్పు, యాలకుల పొడి – 1 టీ స్పూన్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: స్టవ్ ఆన్ చేసుకుని పాన్లో నెయ్యి వేసుకుని అందులో శనగపిండి వేసుకుని తిప్పుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత నీళ్లు పోసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. వాల్నట్స్ పౌడర్, పంచదార పొడి, యాలకుల పొడి వేసుకుని తిప్పుతూ ఉండాలి. పొడిపొడిగా మారి, దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఆ మిశ్రమం చల్లారనివ్వాలి. అనంతరం లడ్డూల్లా చేసుకోవాలి. అభిరుచిని బట్టి డ్రైఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కోకోనట్–రైస్ ఇడ్లీ కావలసినవి: కొబ్బరి కోరు, అన్నం – అర కప్పు చొప్పున, బెల్లం కోరు – పావు కప్పు (అభిరుచిని బట్టి), అరటిపండ్లు – 2, నెయ్యి – (ఇడ్లీ ప్లేట్స్కి అప్లై చేసుకునేందుకు సరిపడా) తయారీ: ముందుగా మిక్సీ బౌల్లో అన్నం, కొబ్బరికోరు, బెల్లం కోరు (అభిరుచిని బట్టి) అరటిపండు ముక్కలు వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ రేకులకు నెయ్యి రాసుకుని, అందులో అన్నం–కొబ్బరికోరు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని పది లేదా పన్నెండు నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. బెల్లం కోరు వెయ్యకుంటే చేసుకున్న ఇడ్లీలైతే.. సాంబార్లో భలే రుచిగా ఉంటాయి. -
‘ఇడ్లీ’ రెండక్షరాలు.. వెరైటీలు వెయ్యి రకాలు!
ఆబాలగోపాలానికి ఇడ్లీ ఇష్టమైన ఫుడ్. రుచి విషయంలోనే కాదు సులభంగా జీర్ణమయ్యే ఈ అద్భుత వంటకం ఆరోగ్యానికి అదనపు బలం. మన ఆల్టైమ్ ఫేవరెట్ ఇడ్లీ గురించి కొన్ని విషయాలు...బటన్ ఇడ్లీ, తల్లే ఇడ్లీ, సాంబర్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ...ఇలా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రకాల వెరైటీ ఇడ్లీలు ఉన్నాయి. లాంగ్ లాంగ్ ఎగో, వన్స్ ఆపాన్ ఏ టైమ్ ‘ఇడ్లీ’ ఇండోనేషియా నుంచి ఇక్కడికి వచ్చిందని ఫుడ్ హిస్టారియన్ కె.జె.ఆచార్య పరిశోధనాత్మకంగా తెలియజేశారు. వారి ‘కెడ్లీ’నే మన ‘ఇడ్లీ’ అంటారు ఆచార్య. లిజి కొలింగమ్ అనే మరో ఫుడ్ హిస్టారియన్ మాత్రం అలనాడు అరబ్ వ్యాపారులు సముద్రతీర ప్రాంత ప్రజలకు ఇడ్లీని పరిచయం చేశారని అంటారు. ‘ఇడ్డలిగె’ అనే కన్నడ పదం నుంచి ‘ఇడ్లీ’ వచ్చింది అంటారు. కొందరు మాత్రం 12వ శతాబ్దానికి చెందిన సంస్కృత పదం ‘ఇడ్డరిక’ నుంచి వచ్చింది అంటారు. మరికొందరు సౌరాష్ట్ర (గుజరాత్) ప్రాంతానికి చెందిన నేతకార్మికులు ఉపయోగించే ‘ఇడడ’ నుంచి వచ్చింది అంటారు.‘రామసేరి ఇడ్లీ’ అనేది ఇడ్లీలలో ప్రత్యేకత సంతరించుకుంది. సదరు ఈ ఇడ్లీ మనం రోజూ చూసే ఇడ్లీ సైజులో కాకుండా ఏకంగా దోసె సైజ్లో ఉంటుంది. డిఫెన్స్ ఫుడ్ రిసెర్చి లెబోరేటరి(డీఎఫ్ఆర్ఎల్) ఆస్ట్రోనాట్స్ కోసం ‘స్పేస్ ఇడ్లీ’తో పాటు పౌడర్ చెట్నీ కూడా తయారు చేసింది. చెన్నైకి చెందిన ఎనియవన్ అనే వ్యక్తి ఇడ్లీకి ఈరాభిమాని. ఇడ్లీకి ఒకరోజు ఉండాలంటూ ‘వరల్డ్ ఇడ్లీ డే’ మొదలుపెట్టాడు. ఫుడ్వరల్డ్లో ఇదొక ట్రెండ్గా మారింది. -
ఇప్పుడు కూడా రూపాయికే ఇడ్లీ...
చెన్నై : కమలాతాళ్.. రూపాయి ఇడ్లీ బామ్మ అంటే ఎవరైనా టక్కున ఆమె పేరే చెప్పేస్తారు. తమిళనాడులోని పెరూర్కి చెందిన ఈ బామ్మ 80 ఏళ్ల వయసులోనూ ఇడ్లీలు తయారు చేసి ఒక్క రూపాయికే విక్రయిస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్డౌన్ ప్రభావంతో భారీగా నష్టం వాటిల్లినప్పటికీ.. కమలాతాళ్ తన ఇడ్లీల ధరను ఒక్క పైసా కూడా పెంచలేదు. నష్టాలు వచ్చినప్పటికీ పేద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఒక్క రూపాయికే వేడి వేడి ఇడ్లీ(ఒక ఇడ్లీ ఒక్క రూపాయి), ఘుమఘుమలాడే సాంబారు, రుచికరమైన చట్నీ అందచేస్తుంది. (చదవండి : రూపాయికే ఇడ్లీ.. 2.50 పైసలు గారె) అవ్వకు దాతల సాయం లాక్డౌన్ నేపథ్యంలో కూడా రూపాయికే ఇడ్లీ అందిస్తున్న కమలాతాళ్కు పలువురు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. భారతీయార్ విశ్వవిద్యాలయం ఆమెకు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ పి కలిరాజ్ ఆహార, కిరాణా వస్తు సామగ్రిని విరాళంగా ఇచ్చారు. భారతీయార్ విశ్వవిద్యాలయ తలుపులు తన కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని కమలాతాళ్ చెప్పారు. హిందూస్తాన్ స్కౌట్స్ మరియు గైడ్స్ సభ్యులు కమలాతాళ్కు అవసరమైన వస్తువులను ఇచ్చారు. కోయంబత్తూర్ సెక్టార్ హెడ్ ప్రశాంత్ ఉతమా మాట్లాడుతూ.. ‘కమలాతాళ్ బామ్మ గురించి చాలా సార్లు విన్నాం. ఆమె ఒక్క రూపాయికే ఇడ్లీ ఎలా అందిస్తున్నారో కూడా విన్నాం. కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో కూడా ఆమె ఒక్క రూపాయి ఇడ్లీని ఎలా నిర్వహించగల్గుతున్నారో విని ఆశ్చర్యపోయాను. ఆమె చేస్తున్న సేవకు మా వంతుకు కొంత సహాయం చేశాం’ అని అన్నారు. రెట్లు పెంచే ఆలోచన లేదు లాక్డౌన్ వల్ల భారీగా నష్టం వాటిల్లింది. అయినప్పటికీ రేట్లు పెంచే ఆలోచన నాకు లేదు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా రూపాయికే క్వాలిటీ ఇడ్లీ అందించేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలా మంది ఇడ్లీల కోసం వస్తున్నారు. లాక్డౌన్తో ఇక్కడే ఉండిపోయినా వలస కూలీలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. దాతల సహాయంతో వారందరికీ ఒక్క రూపాయికే ఇడ్లీ అందించగల్గుతున్నాను’అని కమలాతాళ్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో చెప్పారు. -
స్ప్రౌటెడ్ మిలెట్ దోసె, ఇడ్లీ విత్ జింజర్ చట్నీ
పిండి కోసం కావలసినవి: స్ప్రౌట్స్ – ఒక కప్పు (జొన్నలు, రాగులు, సజ్జలు); ఉప్పుడు బియ్యం – ఒక కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; మెంతులు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. చట్నీ కోసం కావలసినవి: ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం – చిన్న ముక్క; వెల్లుల్లి రెబ్బలు – 3 (లేకపోయినా పరవాలేదు); మెంతులు – అర టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 12; కరివేపాకు – పావు కప్పు; ఇంగువ – అర టీ స్పూను; చింతపండు – పావు కప్పు కంటె ఎక్కువ; బెల్లం పొడి – పావు కేజీ పిండి తయారీ: ఉప్పు మినహా పిండి కోసం చెప్పిన మిగతా పదార్థాలకు తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు నాలుగు గంటలసేపు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, నానబెట్టిన వాటిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాక, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙సుమారు ఎనిమిది గంటలపాటు ఈ పిండిని నానబెట్టాలి ∙ఈ పిండితో దోసెలు, ఇడ్లీలు తయారుచేసుకోవచ్చు ∙అల్లం చట్నీతో అందించాలి ∙ఈ అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లం చట్నీ తయారీ: చింతపండుకు తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ధనియాలు, పచ్చి సెనగ పప్పు, లవంగాలు, మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, అల్లం ముక్క వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙నానబెట్టిన చింతపండు, కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙బెల్లం పొడి, ఉప్పు జత చేసి పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ∙దోసె, ఇడ్లీలతో అందించాలి. ఇటువంటి ఆరోగ్యకరమైన వంటకాలను బామ్మలు, అమ్మమ్మలు మాత్రమే చెప్తారు. ఇందులో నూనె ఎక్కువగా వాడలేదు. మినుముకు విరుగుడైన అల్లం చట్నీతో తినడం వల్ల శరీరం గట్టి పడుతుంది. -
బరువు తగ్గాలంటే ఇవి తినాల్సిందే..
ప్రస్తుతం అందరినీ వేధించి సమస్య అధిక బరువు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో మార్పు వచ్చింది. తినే ఆహారం మారిపోయింది. పీచుపదార్థం, పిండిపదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని మానవాళి గత కొద్ది దశాబ్దాలుగా వదిలిపెట్టింది. ఆధునికత పేరుతోనో, సౌలభ్యం కోసమనో పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహారానికి తోడు వ్యాయామం/నడక చాలావరకూ తగ్గిపోతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిండిపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినటం, వ్యాయామం లోపించడం, స్టెరాయిడ్స్ తీసుకోవటం తప్ప.. ఇటీవల దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య తామరతంపరగా పెరగడానికి మరో మూల కారణమేదీ లేదు. మరి బరువు తగ్గాలనుకునేవారు తక్కువ తినడం కన్నా సరైన ఆహారం తినడం ముఖ్యమని చెబుతున్నారు పోషకాహార, ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గడంలో హెల్తీ స్నాక్ తినడం ఒక భాగమే. ఇవి ఆకలిని తగ్గించమేగాక జీవక్రియలు సవ్యంగా జరిగేందుకు తోడ్పడుతాయి. సెనగలు: వీటిలో ప్రొటీన్స్, పీచు పదార్థాలుంటాయి. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. కూరగాయ ముక్కలు లేదా నిమ్మరసంతో ఉడికించిన సెనగల్ని తీసుకోవాలి. మినప పప్పు: మినపపప్పులో శరీరానికి అవసరమైన ప్రొటీన్ ఉంటుంది. మినప పప్పుతో సాయత్రం స్నాక్గా ఇడ్లీలు చేసుకుని తినొచ్చు. ఈ ఇడ్లీలు తొందరగా జీర్ణమవుతాయి. నట్స్: బఠాణీ, బాదం, జీడిపప్పు, వాల్నట్స్లో గ్లూటెన్ ఉండదు. వీటిలో ముఖ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని వేగించి లేదా వీటికి కొద్దిగా మొక్కజొన్నలు కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు: వీటిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా వీటిని తినొచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు ఉపకరించే పీచు ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తామర గింజలు: వీటిలో కొలెస్ట్రాల్, కొవ్వులు, సోడియం వంటివి అస్సలుండవు. ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎండు బఠాణి: ప్రొటీన్స్, కొవ్వులు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి తింటే బరువు తగ్గడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. -
సాంబారు వెనుక రహస్యం
ఆ తండ్రీకొడుకుల్ని చూసినవారు ముచ్చటపడకుండా ఉండలేరు. హడావుడిగా ఉండే ఆ ప్రాంతం వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అందరూ అక్కడకు వచ్చేది సాంబారు కోసమే. వింతగా ఉంది కదూ. ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం. అక్కడకి ఇడ్లీ కోసమో, దోసె కోసమో కాదు, కేవలం సాంబారు రుచి చూడటానికే వస్తారు. అదే చెన్నై ట్రిప్లికేన్లోని రత్నాకేఫ్. ఎంతోకాలంగా ఆ ప్రాంతానికి ఒక మైలురాయిగా నిలబడిపోయింది రత్నాకేఫ్. నిరంతరం ఆ కేఫ్ భోజన ప్రియులతో కిటకిటలాడుతూ ఉంటుంది. గుప్తా కుటుంబీకులు 1948లో ప్రారంభించిన రత్నాకేఫ్ అనేక బ్రాంచీల స్థాయికి విస్తరించింది. ఈ కేఫ్కు వచ్చేవారంతా సాంబారు ప్రియులే. ‘మా దగ్గర సాంబారే ప్రధాన వంటకం’ అంటారు నిర్వాహకులు లోకేశ్ గుప్తా. ఇక్కడ చిత్రమేమిటంటే, వెయిటర్లంతా సాంబారు మగ్గులు పట్టుకుని కస్టమర్లకు వడ్డించడానికి సిద్ధంగా ఉంటారు. ప్లేటులో ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ... ఏముందో చూడరు. అన్నిటినీ సాంబారులో మునకలు వేయిస్తారు. ఇడ్లీ సాంబారు, కాఫీకి ప్రసిద్ధి రత్నా కేఫ్. మధుర నుంచి మద్రాసు వరకు మధురకు 25 కి.మీ. దూరాన ఉన్న ఒక చిన్న పల్లెటూరుకు చెందిన జగ్గిల గుప్తా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనే ఆశయంతో మద్రాసు వచ్చారు. అక్కడ చిన్న హోటల్ ప్రారంభించారు. మొదట్లో ఇడ్లీ సాంబారు, కాఫీతో ప్రారంభించారు. సాంబారు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. నాణ్యమైన సరుకులను రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి, సాంబారు రుచిగా వచ్చేలా పొడి తయారు చేసేవాడు. ఆ ఫార్ములాను చాలా రహస్యంగా ఉంచారు. ఇది కేవలం ఆ కుటుంబీకులకు, వారి దగ్గర పనిచేసే సాంబారు మాస్టర్లకు మాత్రమే తెలుసు. ఇక్కడి సాంబారు ఇంత ఫేమస్ కావటానికి కారణం సాంబార్ స్పెషలిస్టు పెరుమాళ్. ఈయన ఇక్కడ 50 సంవత్సరాలపాటు పనిచేశాక, వయసు మీద పడటంతో స్వచ్ఛంగా 2013లో రిటైర్ అయ్యారు. పెరుమాళ్ స్థానంలో ఇప్పుడు కందస్వామి సాంబార్ మాస్టర్గా పనిచేస్తున్నారు.. అని గుర్తుచేసుకుంటారు లోకేశ్ గుప్తా. పెరుమాళ్ వామనుడు. పైన ఉంచిన వస్తువులు అందుకోవటం కష్టంగా ఉండేది. అందుకే సాంబారులోకి కావలసిన వస్తువులన్నీ అందుకోవటం కోసం ఒక చిన్న బల్ల మీద నిలబడి, సాంబారు తయారు చేసేవాడని చెబుతారు లోకేశ్ గుప్తా. ఇలా మొదలైంది.. రత్నాకేఫ్ని రాజేంద్ర గుప్తా మేనమామ అయిన త్రిలోక్నాథ్ గుప్తా (జగ్గీలాల్ గుప్తా కుమారుడు) 1948లో ప్రారంభించారు. ఎంతో వైభవంగా నడిచింది రత్నా కేఫ్. 2002లో ఈ హోటల్ని రాజేంద్ర గుప్తా నడపటం ప్రారంభించారు. వీరు శాంతి విహార్, ప్యాలెస్ కఫ్, అంబాల్ కేఫ్లను కొని ప్రారంభించినా, రత్నా కేఫ్ మాత్రమే నేటికీ రత్నంలా మెరుస్తూ ఉంది. ఇక్కడకు ఎక్కువమంది బ్యాచిలర్స్ వస్తుంటారు. సాంబారు వెనుక రహస్యం సాంబారులో ఉపయోగించే దినుసులలో ఈ డెబ్బయ్యేళ్లుగా ఎటువంటి మార్పు లేదు. అదే వారి విజయ రహస్యం అంటారు నిర్వాహకులు. సాంబారు రుచి చూసినవారంతా, ‘ఇన్ని సంవత్సరాలుగా సాంబారు రుచిలో ఏ మాత్రం మార్పు లేదు. అదే రుచిని కొనసాగిస్తున్నారు ’ అని చెబుతారు లోకేశ్ గుప్తా. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడమని చెబుతారు లోకేశ్. సాంబారులోకి కావలసిన వస్తువుల కొనుగోలు కోసం ఇప్పటికీ రాజస్థాన్ వెళ్తానని చెబుతారు లోకేశ్. కేవలం ఇందులోనే మార్పు రత్నా కేఫ్ రాజేంద్ర గుప్తా నుంచి లోకేశ్ గుప్తా చేతిలోకి వచ్చాక, చిన్నమార్పు జరిగింది. గతంలో కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. ఇప్పుడు స్టీమ్ బాయిలర్స్లో తయారుచేస్తున్నాం. ఈ మార్పును వంటవారు అంగీకరిం^è లేదు. దానితో సంప్రదాయంగాను, కొత్త విధానంలోనూ సాంబారు తయారు చేశారు కొంతకాలం. కస్టమర్లకు మాత్రం రుచి చాలా బావుందని చెబుతుండటంతో, వంటవారు కొత్తవిధానానికి అంగీకరించారు. నేను ఆర్కిటెక్ట్ని. ఎన్నడూ ఫుడ్ బిజినెస్లోకి వస్తాననుకోలేదు. అసలు నేను నిర్వహించగలననుకోలేదు. ఇక్కడ వారు చూపే ప్రేమ, వీరంతా మా కోసం పనిచేయడం చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. అయితే ఈ పని మాత్రం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిది. వారు మెచ్చుకున్నప్పుడు పట్టరాని ఆనందం కలుగుతుంది. అదే సమయంలో చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. ప్రస్తుతం మా కేఫ్లో ఉత్తరాది వంటకాలను కూడా పరిచయం చేశాం. రైల్వే క్యాటరింగ్లోకి ప్రవేశించాం. ట్రిప్లికేన్లోనే ఉన్న పార్థసారథి దేవాలయానికి వచ్చినవారంతా రత్నా కేఫ్ని తప్పక దర్శించుకుని సాంబారు రుచి చూస్తారు.– లోకేశ్ గుప్తా -
ఇడ్లీ తిన మనసాయె!
‘రోజూ ఇడ్లీయేనా..’ మన ఇళ్లలో డైనింగ్ టేబుళ్ల దగ్గర, టిఫిన్ చేసేటప్పుడు ఈ డైలాగ్ తరచూ వింటుంటాం. ఇక హోటల్కు వెళితే మెనూలో ఇడ్లీ తప్పించి మిగతా వెరైటీలపైనే మన దృష్టంతా ఉంటుంది. రకరకాల కాంబినేషన్లలోని దోసెలు, పెసరట్లు, పూరీలు ఆర్డర్ చేసి లొట్టలేస్తాం. అయితే జిల్లాలోని హోటళ్లకు వచ్చే కస్టమర్లు మాత్రం మాకు ఇడ్లీయే కావాలంటున్నారు. మెనూ కార్డు చూడకుండా.. ఏం టిఫిన్లు ఉన్నాయని సర్వర్ను అడక్కుండానే.. ఇడ్లీ, సాంబారు ఆర్డర్ చెసేస్తున్నారు. ఓ పేరొందిన హోటల్లో గతంలో రోజుకు 2వేల ఇడ్లీలు అమ్ముడవుతుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 4 వేలు దాటింది. ఇంతకీ ఇడ్లీకి హఠాత్తుగా అంత డిమాండ్ ఎందుకొచ్చింది. తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. అనంతపురం న్యూసిటీ : జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులన్నీ జ్వర పీడితులతో నిండిపోయాయి. అదే సమయంలో హోటళ్లలో ఇడ్లీలకు డిమాండ్ రెండు రెట్లు పెరిగింది. ఈ రెండిటికీ లింకేంటి అంటారా? చాలా ఉంది. సులువుగా జీర్ణమయ్యే ఇడ్లీయే తినాలన్న వైద్యుల సూచనలతో జనం రెండు పూటలా వాటిని ఇడ్లీతోనే సరిపెడుతున్నారు. మామూలుగా ఉదయం లేదా సాయంత్రం జనం వీటిని తినేందుకు ఇష్టపడేవారు. విజృంభించిన జ్వరాలతో డాక్టర్ల సలహా మేరకు మూడు పూటలా ఇడ్లీ సాంబర్తో సరిపెట్టుకుంటున్నారు. దీంతో హోటళ్లలో ఇడ్లీలు హాట్ హాట్గా అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో రోజూ 3వేల మంది చికిత్స పొందుతుంటే.. ఇందులో వెయ్యి మందికి పైగా జ్వరపీడితులే ఉన్నారు. జ్వరంతో నీరసించడంతో సులువుగా జీర్ణమయ్యే ఆహారమైన ఇడ్లీ వైపే రోగులు మొగ్గుచూపుతున్నారు. దీంతో వాటి అమ్మకాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. ఇడ్లీనే ఎందుకు? ఇడ్లీలో చాలా పోషకాలున్నాయి. జ్వరం వచ్చినప్పుడు మూడు ఇడ్లీలు తింటే మనకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. పిండి పులియబెట్టడం వల్ల విటమిన్లు పెరుగుతాయి. ఆవిరితో ఉడికించడం వల్ల సులువుగా జీర్ణమవుతుంది. నూనె వాడకపోవడం వల్ల ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు దరిచేరవు. ధాన్యం, పప్పు కాంబినేషన్ వల్ల సంపూర్ణ పోషకాలు అందుతాయి. వేడివేడిగా కావాలంటే క్యూ తప్పదు ఇటీవల అనంతపురం హోటళ్లలో ఇడ్లీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. జ్వరపీడితులతో పాటు వృద్ధులు, యువతలో ఎక్కువ మంది ఇడ్లీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోయింది. జంక్ఫుడ్ వల్ల అనేక గ్యాస్ట్రిక్, ఇతర సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఇడ్లీ ఫేవరేట్ ఫుడ్గా మారింది. నగరంలోని ప్రధాన హోటళ్లతో పాటు సప్తగిరి సర్కిల్, క్లాక్టవర్, శ్రీకంఠం సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, కమలానగర్ తదితర ప్రాంతాల్లో భారీగా సంఖ్యలో ఇడ్లీ సెంటర్లున్నాయి. గతంలో విక్రయాలతో పోలిస్తే ఇటీవల వ్యాపారం 30 నుంచి 50 శాతం పెరిగినట్లు చెపుతున్నారు. నగరంలోని ప్రధాన హోటళ్లలో ఒక్క పూట వెయ్యి నుంచి 1,500 ఇడ్లీలు అమ్ముడుపోతున్నాయి. మంచి పోషక విలువలున్నాయి ఇడ్లీలో మంచి పోషక విలువలు ఉంటాయి. జ్వరంతో బాధపడుతున్న వారికి అవసరమైన అన్ని రకాల క్యాలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఇడ్లీని ఆహారంగా తీసుకోవచ్చు. – నందిని, న్యూట్రిషియన్ కౌన్సిలర్, సర్వజనాస్పత్రి, అనంతపురం సులువుగా జీర్ణమవుతుంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇడ్లీనే ఆహారంగా తీసుకోవాలని చెబుతుంటాం. ఎందుకంటే చాలా సులువుగా జీర్ణమవుతుంది. దీని ద్వారా ఇతర ఇబ్బందులు ఏమీ ఉండవు. – డాక్టర్ ప్రవీణ్ దీన్కుమార్,చిన్నపిల్లల వైద్య నిపుణులు,సర్వజనాస్పత్రి, అనంతపురం -
ఇడ్లీ ప్లేటు రంధ్రంలో బుడ్డోడి వేలు
కర్ణాటక ,శివాజీనగర: ఇంట్లో చిన్న పిల్లలుంటే ఎంతో సందడిగా ఉంటుంది, ఒక్కోసారి వారిపట్ల పెద్దలు అజాగ్రత్తగా ఉంటే సమస్యలు కూడా వస్తాయి. నోట్లో ఏదైనా వస్తువు పెట్టుకోవడం, మింగడం వంటివి చేస్తుంటారు. ఓ 18 నెలల బాలుడు ఇడ్లీ తట్ట రంధ్రంలో వేలును దూర్చడంతో అది కాస్తా ఇరుక్కుపోయింది. దీంతో మార్తహళ్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు స్టీల్ కటింగ్ మిషన్ను తీసుకొచ్చి ఇడ్లీ తట్టను కత్తిరించాలని నిర్ణయించారు. సుమారు ఒక గంట పాటు కష్టపడి ప్లేటును కత్తిరించి బిడ్డ వేలుకు విముక్తి కల్పించారు. రంధ్రంలో వేలు చిక్కుకొని తక్షణమే ఉబ్బటం మొదలైంది. బయటకు తీయడం సాధ్యం కాలేదు, దీంతో ప్లేటును కత్తిరించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. -
ఇడ్లీ చాలెంజ్.. ఈ బామ్మతో పోటీ పడగలరా
బెంగళూరు: ఇడ్లీ చాలామందికి ఇష్టమైన అల్పాహారం. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తేలీకగా జీర్ణం అవుతుంది. అయితే ఇడ్లీ అంటే ఎంత ఇష్టం ఉన్నా మాములుగా ఎన్ని తినగల్గుతారు.. నాలుగు, ఆరు సరే ఓ పది. కానీ నిమిషంలోనే ఆరు ఇడ్లీలు స్వాహా చేసే వారిని ఎప్పుడైనా చూశారు. అది కూడా 60 ఏళ్ల బామ్మ అంటే నమ్మగలరా. కానీ ఇది వాస్తవం. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో ఇడ్లీ తినే పోటీ పెట్టారు. హుల్లాహళ్లి ప్రాంతానికి చెందిన సరోజమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఏకంగా నిమిషంలో ఆరు ఇడ్లీలు తిని ఔరా అనిపించడమే కాక పోటీలో మొదటి స్థానంలో నిలిచింది. యువతులు, పెళ్లైనవారు కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. కానీ వారందరిని సరోజమ్మ ఓడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో హిందుస్తాన్ టైమ్స్, ఏఎన్ఐలో వచ్చింది. -
రూపాయికే ఇడ్లీ
-
రూపాయికే ఇడ్లీ.. 2.50 పైసలు గారె
ఆమె వయసుఎనిమిది పదులు.నిండు పండు ముదుసలి.యువతరం కంటె ఎక్కువ శక్తి, ఉత్సాహం ఉన్నాయి.సామాన్యుల కోసం రూపాయికి ఇడ్లీ తయారుచేస్తోంది.తమిళనాడులోని పెరూర్కి దగ్గర ఉన్న వడివేలయంపాలయానికి చెందిన కమలాతాళ్ ఇడ్లీ షాపేఈ వారం ఫుడ్ ప్రింట్స్... కమలాతాళ్. పండు ముదుసలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేస్తుంది. స్వచ్ఛంగా స్నానం చేసి, భగవంతుడిని మనసారా ప్రార్థించి, పొలానికి వెళ్లి, తాజా కూరగాయలు తీసుకొస్తుంది. చట్నీ తయారుచేయడం కోసం రోలు సిద్ధం చేసి, తాజా కొబ్బరి, ఉప్పు వేసి, రుచికరమైన పచ్చడి చేస్తుంది ఈ అవ్వ. సాంబారులోకి కావలసిన కూరలన్నీ స్వయంగా తరిగి, మట్టితో అలికి చేసిన కట్టెల పొయ్యి మీద ఒక గిన్నెలో వేసి ఉడికిస్తుంది. ముందురోజు రాత్రే ఇడ్లీ పిండి రుబ్బి సిద్ధం చేస్తుంది. తమిళనాడులోని పెరూర్కి దగ్గరలో ఉన్న వడివేలయంపాలయం గ్రామంలో నివసించే ఈ అవ్వ, తన ఇంటి తలుపులు ఉదయం ఆరు గంటలకు తెరుస్తుంది. అప్పటికే ఇడ్లీ కోసం బోలెడుమంది బయట నిలబడి ఉంటారు. అవ్వ తలుపులు తెరవగానే, వారంతా ఆమెను నవ్వుతూ పలకరిస్తారు. అందరినీ ఆప్యాయంగా చూస్తూ, ఎవరెవరికి ఎన్నెన్ని కావాలో అడుగుతూ, వేడి వేడి ఇడ్లీ, ఘుమఘుమలాడే సాంబారు, రుచికరమైన చట్నీ అందచేస్తుంది అవ్వ. ఇన్నీ కలిపి చాలా ఎక్కువ ధర అనుకుంటే పొరపాటే. ఒక ఇడ్లీ కేవలం ఒక రూపాయి మాత్రమే. ఉదయం ఎనిమిది గంటలవుతున్నా వినియోగదారులు తమ వంతు వచ్చేవరకు ఎంతో ఓరిమిగా నిరీక్షిస్తూ ఉంటారు. ఇంతలోనే తన కోసం ఎవరైనా అతిథులు వస్తే, చిరునవ్వుతో పలకరిస్తుంది ఈ అవ్వ. అంతలోనే లోపలకు వెళ్లి ఒక చేతితో బకీటెడు సాంబారు, ఒక చేతితో ఇడ్లీలు అలవోకగా తెస్తుంటే, ఈ వయసులో ఇంత వేగంగా ఎలా పనిచేయగలుగుతుందా అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ‘‘మాది రైతు కుటుంబం. ప్రతిరోజూ మా కుటుంబ సభ్యులంతా నన్ను ఇంట్లో వదిలి పొలానికి వెళ్లేవారు. నేను ఒంటరిగా ఉండటంతో విసుగ్గా అనిపించేది. ఏదో ఒక పనిచేయాలనుకున్నాను. ఆ చుట్టుపక్కల ఉండేవారికోసం ఇడ్లీ వేయడం ప్రారంభించాను. ఇప్పుడు నా దగ్గరకు ఎంతోమంది రోజు కూలీలు వస్తుంటారు. అతి తక్కువ ధరలో స్వచ్ఛమైన కల్తీ లేని ఇడ్లీలు తింటున్నామన్న ఆనందం వారికి కలుగుతుంది. నేను వడివేలయంపాలెంలోనే ఇంటి దగ్గరే 30 సంవత్సరాలుగా ఇడ్లీలు అమ్ముతున్నాను’ అంటారు కమలాతాళ్. కమలాతాళ్కు చిన్నతనం నుంచి రోట్లో రుబ్బిన పప్పుతోనే ఇడ్లీలు తయారుచేయడం అలవాటు. నేటికీ ఆమె అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. గ్రైండర్ కొనడం అనవసరమని భావించారు ఆమె. ‘‘నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. అందువల్ల ఎక్కువమందికి వంట చేయడం అలవాటు నాకు. ప్రతిరోజూ పప్పు నానబెట్టి, శుభ్రంగా కడిగి, రుబ్బి మరుసటి రోజుకి సిద్ధం చేసుకుంటాను. ఇందుకోసం నాకు ప్రతిరోజూ ఆరు కిలోల పప్పు, బియ్యం కావాలి. రుబ్బడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. రోజూ తాజా పిండినే ఉపయోగిస్తాను. ఉదయాన్నే మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు ఇడ్లీలు అమ్ముతారు కమలాతాళ్. ఒక వాయికి కేవలం 37 ఇడ్లీలు మాత్రమే సిద్ధమవుతాయి. రోజుకి మొత్తం వెయ్యి ఇడ్లీలు అమ్ముతారు ఈ అవ్వ. ‘‘పది సంవత్సరాల క్రితం ఒక ఇడ్లీ అర్ధరూపాయికి అమ్మేదాన్ని. రెండు సంవత్సరాల నుంచి ఇడ్లీ ధర రూపాయి చేశాను’’ అంటారు బోసి నవ్వుల అవ్వ.సాంబారుతో పాటు, రోజుకో కొత్తరకం చట్నీ తయారుచేస్తారు కమలాతాళ్. టేకు ఆకులు, అరటి ఆకుల్లో ఇడ్లీలు అందిస్తారు. వీటిని కూడా తన పొలం నుంచే తీసుకువస్తారు కమలాతాళ్. ‘‘మా ఇంటి చుట్టుపక్కల ఉన్న దిగువ మధ్యతరగతి వారే నా దగ్గర ఇడ్లీలు కొంటారు. వారంతా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారే. అంతా రోజు కూలీలే. అటువంటివారు రెండు ఇడ్లీలు 15 రూపాయలకో 20 రూపాయలకో కొనడం కష్టం.చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో ఒక ప్లేట్కి నాలుగు ఇడ్లీలు ఇస్తారు. కాని వీరు చేసే కష్టానికి ఆ నాలుగు ఇడ్లీలతో ఆకలి తీరదు. అందువల్ల కమతాతాళ్ వీరి గురించి ఆలోచించి, తాను తక్కువ ధరకు ఇడ్లీలు పెట్టడం వల్ల వారు నాలుగు రూపాయలు వెనకేసుకోగలుగుతారని భావించారు. ఇంత తక్కువకు ఇస్తున్నా, కమలాతాళ్కి రోజుకి 200 రూపాయలు మిగులుతున్నాయంటారు ఆవిడ. ‘‘ఇడ్లీ ధర పెంచరెందుకు అని నన్ను చాలామంది అడుగుతుంటారు. వారందరికీ నేను ఒకటే సమాధానం చెబుతాను, ఆకలితో ఉన్న పేదవారి కడుపు నింపుతున్నాను. అదే నాకు పెద్ద ఆదాయం’’ అని.కమలాతాళ్ ఇడ్లీల విషయం వార్తల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో, ఆయా ప్రాంతాల నుంచి ఇడ్లీల కోసం వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయినప్పటికీ కమలాతాళ్ ఇడ్లీ ధర ఒక్క పైసా కూడా పెంచలేదు. రాబోయే రోజుల్లో కూడా పెంచనని చెబుతున్నారు. ఈ ఇడ్లీలో సంప్రదాయం ఉంది ఇక్కడి ఇడ్లీ పూర్తి సంప్రదాయంగా తయారవుతుంది. రోట్లో రుబ్బిన పిండి, శుభ్రంగా అలికిన మట్టి పొయ్యి, కట్టెల మంట మీద ఉడికే ఆరోగ్యకరమైన ఇడ్లీ, గారెలతో ఈ అవ్వ ఎంతోమందికి ఆరోగ్యం ఇస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ అవ్వను స్ఫూర్తిగా తీసుకోవాలేమో! ఇదే నా ఆరోగ్య రహస్యం వయసు పైబడుతుండటంతో, మా మనవలు నన్ను ఈ వ్యాపారం మానేసి, ఆరోగ్యం చూసుకో మంటున్నారు. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకు నేను ఈ పని చేయడం మానను. ఇలా చేస్తుండటం వల్లే నేను చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను. ఇటీవలే గారెలు కూడా మొదలుపెట్టాను. ఒక్కోగారె ధర 2.50 పైసలు. -
రుచుల గడప
కడపలో పెరిగి, ఒకసారి ఇక్కడ రుచులకు నాలుక అలవాటు పడ్డాక, మరే ఊరిలోని వంటకాలు తిన్నా సరే! దాన్ని తృప్తి పరచడం మహా కష్టం. బయటి ఊరి వాళ్లెవరైనా కడప గురించి విన్నపుడు, ‘అబ్బే కరువు ప్రాంతం కదా... ఇక్కడి వంటలు ఏం రుచి గా ఉంటాయిలే’ అనుకుంటారు, కానీ ఒక్కసారి కడప గడపలో అడుగుపెట్టి ఇక్కడి ఆతిథ్యం స్వీకరించాక గానీ నమ్మరు, కడపలో రుచులు అద్భుతః అని. సీమలో జనాలకు ఆతిథ్యం ఇవ్వడం అంటే మహా ఇష్టం, ఇంట్లో వాళ్ళకు లేకపోయినా సరే, అతిథికి మాత్రం ప్రేమతో చుక్కలు చూపించాల్సిందే, అందుకే సీమలో మంచినీళ్లడిగితే మజ్జిగిస్తారు, అన్న సామెత పుట్టుకొచ్చింది. కడప గురించి మాట్లాడుకునేటప్పుడు దోశెతోనే మొదలెట్టాలి, ఇక్కడ దోశెల్లో కారమే కాదు, మమకారం కూడా బాగానే దట్టిస్తారు, అందుకే కల్లలో నీల్లు కారిపోతున్నా సరే, కంచెం లో దోశె ను ఒక పట్టాన వదలబుద్ది అవ్వదు. చాలా చోట్ల దోశె అంటె ఒక వైపే కాలుస్తారు, కానీ కడపలో రెండు వైపులా కాల్చి, ఒక వైపున ఎండు మిరపకాయలతో చేసిన ఎర్రకారం, పుట్నాల పప్పులతో చేసిన పొడి, బొంబాయి చట్నీ, (కొన్నిచోట్ల దీన్ని ‘పిట్లా’ అంటారు) ని దోశె మొత్తం బాగా పూసి బాగా ఎర్రగా కాల్చి చేస్తారు. ఈ దోశెలు చెన్నూరు బస్ స్టాండ్ దగ్గర చాలా ఫేమస్, పది పదిహేనేళ్ల కిందట, ఒకే వరుసలో మూడు బండ్లు ఉండేవి, అప్పట్లోనే ఒక్కోదోశె 6 రూపాయలు, ఇప్పుడు 40 రూపాయలనుంచి వంద రూపాయల దాకా ఉంది, బండ్లు పోయి స్టాళ్లు వెలిసాయి. దోశెల్లో అక్కడ దొరకని వెరైటీ ఉండదు, దోశె దొరకాలంటే ఎలాంటి టైంలో అయినా అథమ పక్షం అరగంట వెయిట్ చేయాల్సిందే. బీకేయం వీధిలో లక్ష్మీనారాయణ స్వామి గుడి పక్కన ఒక చిన్న హోటల్లో పొద్దున మాత్రమే ‘పచ్చి కారం దోశె’ దొరుకుతుంది. ఇక్కడే ‘చిట్లంపొడి దోశె, చింతాకు పొడి దోశె, కరివేపాకు పొడి దోశె’ లాంటి వెరైటీ లు దొరుకుతాయి. ఊటుకూరు గేటు దాటి చమ్మిమియ్యా పేటలో దొరికే పాలకూర దోశె, టాప్ క్లాస్. ఇంకా యెర్రముక్కపల్లె లో దొరికే సమీర్ దోశె, గాంధీనగర్ స్కూల్ దగ్గర దొరికే రాగి దోశె కూడా ఫేమస్సే. మామూలుగా కడప దోశెలంటే బాగా పల్చగా ఉండి వాటి లోపల పూసిన టాపింగ్స్ మొత్తం బయటికి కనిపిస్తూ, కరకరలాడుతుంటాయి, కాని పెద్ద దర్గా దగ్గర దొరికే సోమయ్య దోశెలు మాత్రం దీనికి భిన్నం, చాలా మందంగా... కారం దట్టంగా పూసి, నెయ్యిలో స్నానం చేసినట్టున్న ఒక్క దోశె తిన్న కడుపు నిండిపోతాయి. కడపలో రవ్వ ఇడ్లీ కన్నా పిండి ఇడ్లీలు బాగా ఫేమస్సు, రవ్వ ఇడ్లీలు పెద్ద హోటల్ల లో మాత్రమే దొరుకుతాయి, కాని ప్రతీ వీధి దగ్గరా బండిలో పిండి ఇడ్లీలు దర్శనమిస్తాయి, కోటిరెడ్డి సర్కిల్ నుంచి నారాయణ కాలేజ్కి వెళ్లే దారిలో దొరికే శ్యాం బండి ఇడ్లీలు చూడటానికి మల్లె పువ్వులా తెల్లగా ఉండి, తినటానికి దూది కన్నా మెత్తగా ఉండి, నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి, ఇంకా దొంగల చెరువు కట్ట మీద సాయంత్రం దొరికే ఇడ్లీ కూడా దాదాపుగా ఇదే రుచి తో ఉంటుంది, దేవుని కడప మాడ వీధుల పక్కన దొరికే ఎర్ర కారం ఇడ్లీ కూడా యమా రుచి. ఇక కడప బిరియానీ, 21 వ శతాబ్దపు సరికొత్త సంచలనం, ఇరవై సంవత్సరాల కిందట, చెన్నూరులో శివరాం అనే ఒక వ్యక్తి చిన్న పందిరి వేసి ఒక బిరియానీ హోటల్ మొదలెట్టాడు, అది కడప– హైదరాబాదు నేషనల్ హైవే కావటంతో కస్టమర్ల ప్రవాహానికి కొదవ ఉండదు, జనాలకు ఈ బిరియాని ఎంత నచ్చేసిందంటే, పదేళ్లు తిరక్కుండానే ఒక్క కడప నగరంలోనే చెన్నూరు బిరియానీ పేరుతో వందకు పైగా హోటళ్లు వెలిశాయి, కానీ ఒరిజినల్ బ్రాంచ్ మాత్రం చెన్నూరు లోనే ఉంది, ఇది ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందో తెలియడానికి రెండు ఉదాహరణలు చాలు, రోడ్డు పక్కన చిన్న స్టాలు పెట్టుకుని బిరియానీలు అమ్ముకునే చోటికి ఐటి అధికారులు లెక్కలు చూపించమని రైడుకు రావడం, అమెరికాలోని ఓ పేద్ద హోటల్ మెనులో చెన్నూరు బిరియానీ అనే రెసిపీ దొరకడం. కడప జిల్లా మొత్తం కలిపి, చెన్నూరు బిరియానీ పేరుతో రమారమి ఓ 500 çహోటళ్ల దాకా ఉండొచ్చని అంచనా! కడప నుంచి రాయచోటి వెళ్ళే దారిలో గువ్వల చెరువు ఘాట్ దిగగానే ఓ ఇరవై ముప్పై పాలకోవా సెంటర్లు కనిపిస్తాయి, ఇక్కడ నుంచి విదేశాలకు కోవా ఎగుమతి అవుతుందంటే నమ్మండి, అక్కడికెళ్ళి నించోగానే ఓ చిన్న కప్పులో కోవా వేసి పైన, కొన్ని బాదం పలుకులు వేసి ఇస్తాడు, దాని రుచి నచ్చితేనే మనం కొనుక్కోవచ్చు, లేదా కొనుక్కోకుండా వెళ్లిపోవచ్చు కూడా! డబ్బులు అడగరు!! ఆరేడేళ్ళ క్రితం నాగరాజు పేటలో ఓ బండిలో బొరుగుల మిచ్చర్ దొరికేది, బాగా ఫేమస్సు, రాజారెడ్డి వీధిలో సీయస్సై గ్రౌండు వెనక పక్క ఓ బొరుగుల బండిలో 30 వెరైటీలు దొరుకుతాయి. కృష్ణా హాలు నుంచి దేవుని కడప వెళ్లే రోడ్డులో దొరికే సమోసా భలే ఉంటుంది, ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే స్వీట్ సమోసా, బూందిని స్టఫ్ గా పెట్టి సమోసా వేసి దానికి పాకం పడతారు, చాలా బావుంటుంది. వైవీ స్ట్రీట్ దగ్గర దొరికే అలంకార్ లస్సీ, కొంచెం లోపలికి, వెళ్లగానే దొరికే బాసుంది కడప ఐకానిక్ డిజర్ట్స్. నల్లమల అడవుల్లో మాత్రమే దొరికే నన్నారి వేర్లతో తయారు చేసే షర్బత్ చాలా కమ్మగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కడప నుంచి ఈ నన్నారి షర్బత్ బాటిళ్లు విదేశాలకు చాలా రెగ్యులర్గా పార్సిల్ అవుతుంటాయి. షర్బత్ తో పాటు నానబెట్టిన సబ్జా గింజలు కలుపుతారు, చూడటానికి చాలా కలర్ ఫుల్గా ఉంటుంది. (వాట్సప్లో చక్కర్లు కొడుతున్న ఓ సందేశం ఆధారంగా...) ఆలూ దాల్ టిక్కీ కావలసినవి: బంగాళ దుంపలు – అర కిలో (ఉడికించి తొక్క తీసి చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి); బ్రెడ్ స్లయిసెస్ – 3; ఉప్పు, కారం – రుచికి తగినంత; గరం మసాలా – కొద్దిగా; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – అర కప్పు; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 4; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ∙బ్రెడ్ స్లయిస్లను చేతితో మెత్తగా చేయాలి ∙బంగాళ దుంప ముద్ద, పచ్చిసెనగ పప్పు, కొత్తిమీర, నిమ్మరసం, పచ్చి మిర్చి తరుగు జత చేసి బాగా కలపాలి ∙జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కొద్దిగా నూనె జత చేసి మరోమారు కలపాలి ∙కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని, వడల మాదిరిగా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా వేస్తూ, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి. ఇడ్లీ పకోడా కావలసినవి: బొంబాయి రవ్వ – ముప్పావు కప్పు; పెరుగు – పావు కప్పు; నీళ్లు – పావు కప్పు; ఉప్పు – తగినంత; బేకింగ్ సోడా – అర టీ స్పూను; పంచదార పొడి – అర టీ స్పూను; నీళ్లు – రెండు టీ స్పూన్లు. పిండి కోసం: చిక్కుడు గింజలు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాలు – ఒకటిన్నర టీ స్పూన్లు; మెంతులు – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – 5 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రై కోసం. తయారీ: ∙చిక్కుడు గింజలకు తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటల సేపు నానబెట్టాలి ∙వేరే పాత్రలో ముప్పావు కప్పు రవ్వ, పావు కప్పు పెరుగు, పావు కప్పు నీళ్లు వేసి బాగా కలిపి నాలుగు గంటల సేపు పక్కన ఉంచాలి (నానిన తరవాత బాగా గట్టిగా అనిపిస్తే, కొద్దిగా నీళ్లు జత చేయాలి) ∙బాగా నానిన ఈ పిండిని సగ భాగం తీసుకుని, తగినంత ఉప్పు, పావు టీ స్పూను బేకింగ్ సోడా, పావు టీ స్పూను పంచదార పొడి వేసి బాగా కలపాలి ∙ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె పూసి, కలిపిన పిండిని వెంటనే ఇడ్లీ రేకులలో వేసి, కుకర్లో ఉంచి విజిల్ లేకుండా ఇడ్లీలు ఉడికించాలి ∙పది నిమిషాల తరవాత స్టౌ మీద నుంచి దింపి చల్లారనివ్వాలి ∙నానిన చిక్కుడు గింజలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి (కొద్దిగా నీళ్లు జత చేయాలి) ∙ఉప్పు, మిరప కారం, ధనియాల పొడి, మెంతి పొడి, కొత్తిమీర జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఉడికిన ఇడ్లీలను చిక్కుడు గింజల మిశ్రమంలో దొర్లించాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక, కొద్దిగా నూనె వేసి కాగాక, ఈ ఇడ్లీలను పెనం మీద వేసి రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి ∙గ్రీన్ చట్నీతో కాని టొమాటో సాస్తో కాని అందించాలి. రైస్ పకోడా కావలసినవి: అన్నం – 2 కప్పులు; అటుకులు – పావు కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం ముద్ద – ఒక టీ స్పూను; స్వీట్ కార్న్ – పావు కప్పు (ఉడికించాలి); ఉప్పు – తగినంత; మిరప కారం – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ: – ఒక పాత్రలో అటుకులకు, పావు కప్పు నీళ్లు జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి – అన్నాన్ని చేతితో మెత్తగా చేయాలి ∙ – ఒక పెద్ద పాత్రలో మెత్తగా మెదిపిన అన్నం, ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం ముద్ద, ఉప్పు, మిరపకారం, నానబెట్టిన అటుకులు వేసి బాగా కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న ఉండలను వేసి దోరగా వేయించి కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి ∙సాస్తో తింటే రుచిగా ఉంటాయి. -
మా ఆవిడ చేసే సాంబార్ ఇడ్లీకి ఫిదా
మా ఆవిడ ప్రతిభ మనస్సు పెట్టి చేసే స్మాల్ ఇడ్లీ.. సాంబార్ అంటే నాకు భలే ఇష్టం.. ఆ రోజు నిజంగా పండుగే.. మాకు పెళ్లి అయ్యేటప్పటికి ఆమెకు వంట రాదు. తర్వాత డ్యూటీలో భాగంగా నాతో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వంట నేర్చుకుంది. సీ ఫుడ్ బాగా వండుతుంది.. కానీ ఇక్కడ అవి దొరకవు కదా.. అందుకే తీరిక దొరికినప్పుడు స్మాల్ ఇడ్లీ, సాంబారు చేస్తుందంటున్నారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్. ‘ఆయనకు ఇష్టమైన ఇడ్లీ చేయడం అంటే నాకు కూడా ఇష్టం.. ఆయన తిని ఆనందించడం కన్నా నాకేం కావాలి’ అంటున్నారు ఆయన సతీమణి ప్రతిభ. శనివారం ‘సాక్షి పర్సనల్ టైం’తో సీపీ దంపతుల ముచ్చట్లు.. సాక్షి, సిద్దిపేట: మాది పెద్దలు కుదిర్చిన వివాహం.. మా ఇద్దరిది సాంప్రదాయక కుటుంబాలు. డాక్టర్గా ప్రతిభ పేదలకు, వృద్ధులకు సేవచేయడం చూసిన మా బంధువులు ఈ మ్యాచ్ గురించి చెప్పారు. అమ్మా నాన్నలకు కూడా అటువంటి వారే కావాలని కోరుకునేవారు.. ఇంకేముంది ఒప్పేసుకున్నా.. అన్నారు డేవీస్. అయితే పోలీస్ ఆఫీసర్ అంటే మా కుటుంబానికి ఇష్టం ఉండకపోయేది. కానీ మంచి దైవచింతన, పెద్దలపై గౌరవం, కింది స్థాయి నుంచి కష్టాలు, కన్నీళ్లు చవిచూసిన వ్యక్తిగా మా బంధువులు చెప్పారు. అంతకంటే ఏం కోరుకుంటామని ఆయన సతీమణి ప్రతిభ బదులు చెప్పారు. మాది తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా.. వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చాం.. మాకు ఈ ప్రాంతంలో బంధువులు ఎవరూ లేరు.. నాకు మా ప్రతిభ.. ప్రతిభకు నేను.. మాకు ఇద్దరు కుమారులు ఎఫ్రేమ్ పీ జోయల్, ఇవాన్ పీ జోయల్, ఇది మా కుటుంబం.. అంతా సరదగా ఉంటాం.. అవకాశం దొరికితే ఇంటి వద్దనే ఎక్కువ గడిపేందుకు ఇష్టపడుతాం. నా పెళ్లి సమయం నాటికి ఆమెది ఎంబీబీఎస్ పూర్తి అయింది. సామాజిక సేవ చేయడం ఇష్టం. ఉట్నూరు ఆస్పత్రిలో పనిచేసినప్పుడు అందరు అంటూ ఉండేవారు.. అందుకోసమే ఆమె ఇష్ట్రపకారం ఎండీ కూడా చదివించాను. చదువును అశ్రద్ధ చేయలేదు.. చిన్నతనంలో ఎవ్వరైనా సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు.. నేను కూడా అంతే.. వేసవి సెలవుల్లో మా నాన్న గారు ముందుగా పదిరోజులు బైబిల్ స్కూల్కు పంపించేవారు.. ఆ తర్వాత.. ఆటలే ఆటలు పొద్దన లేవగానే మిత్రులతో కలిసి గ్రౌండ్కు వెళ్లడం.. వాలీబాల్ ఇతర ఆటలు ఆడటం.. కన్యాకుమారి చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతా లకు వెళ్లడం భలే సరదాగా ఉండేది. అయితే ఎంత ఆటలు ఆడినా.. ఎటు వెళ్లినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. సెలవులు ముగియగానే తిరిగి చదువు యుద్దం ప్రారంభించేవాళ్లం.. పోటీ పడి చదివే వాళ్లం.. కామిడీ సినిమా వస్తే చూడాల్సిందే.. కామిడీ సినిమాలు ఇంటే మా ఇద్దరికి ఇష్టం. అందుకోసమే కామిడీ సినిమా వచ్చిందంటే చూసి తీరాల్సిందే.. మనం సరదాగా సినిమాకు వెళ్తాం. అక్కడ కూడా అంతా టెన్షన్, ఉత్కంఠంగా ఉంటే నచ్చదు. సినిమా చూసిన మూడు గంటలు సరదాగా ఉండాలి. నవ్వుకునేలా ఉండాలి.. ఇటీవల చూసిన ఎఫ్–2 సినిమా మొదటి ఆఫ్ నాకు నచ్చింది. అనగానే రెండో ఆఫ్ నాకు నచ్చిందని డాక్టర్ ప్రతిభ బదులు చెప్పారు. అదేవిధంగా విక్రమార్క సినిమా కూడా బాగా నచ్చిందని చెప్పారు. తీరికి దొరికితే సిద్దిపేట కోమటిచెరువు.. ఎక్కువ సమయం దొరికితే హైదరాబాద్ వెళ్లి వస్తాం.. అక్కడ షాపింగ్, ఫుడ్ కోర్టులోకి వెళ్లడం అంటే కూడా ఇష్టమే. నైనిటల్ అంటే బాగా ఇష్టం.. ఇద్దరం బీజీగా ఉంటాం.. కానీ అప్పుడప్పుడు టూర్స్ వేస్తాం.. మా రాష్ట్రంలోని ఊటీ, కొడైకెనాల్ ఎప్పుడూ వెళ్తుంటా.. అయితే నైనిటాల్ అంటే బాగా ఇష్టం. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఉంటుంది. అక్కడికి ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలి అనిపిస్తుంది. మా పెళ్లి అయిన తర్వాత ఆరు సంవత్సరాలకు ఇద్దరు కవలలు పుట్టారు. వారి పుట్టిన రోజు మాకు బాగా ఆనందకరం కల్గించిన రోజు.. అదేవిధంగా చిన్నబాబు ఇవాన్ పీ జోయల్ గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నప్పుడు... ఎప్పుడైనా చనిపోయే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. ఆరోజు ఇద్దరు కంటికి రెప్పకూడా వేయకుండా బాబును చూసుకుంటూ ఏడ్చాం. అంతటి బాధెప్పుడూ రాలేదు. దేవుడి దయవల్ల ఇప్పుడు అంతా హ్యాపీ. -
వెన్నలా చందమామ
రోజూ ఒంగోలులో ఒక సన్నివేశం తప్పనిసరి. బస్స్టాండు సమీపంలోని అరవై అడుగుల రోడ్డు దగ్గర జనం కి టకిటలాడుతూ కనిపిస్తారు. వారి చేతుల్లో పచ్చని ఆకులు ఉంటాయి. వాటిలో తెల్లటి చందమామలు ఉంటాయి. నోటిలో వేసుకోగానే కరిగిపోయే ఈ చందమామల కోసం ఒక్కరోజు కూడా నాగా ఇవ్వకుండా అక్కడకు నిత్యం జనం వస్తూనే ఉంటారు. అది మస్తాన్ ఇడ్లీ మహిమ. అక్కడ ఉన్నది మస్తాన్ ఇడ్లీ షాపు. సుమారు 30 సంవత్సరాల క్రితం మస్తాన్ అనే వ్యక్తి ప్రారంభించిన ఈ ఇడ్లీషాపు నేటికీ సూపర్హిట్గా నడుస్తోంది. ఎంత హిట్ అంటే ఎంసిఏ చదువుకుని హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాల్సిన మస్తాన్ కుమారుడు మీరావలి ఆ ఉద్యోగం మానేసి, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకునేంత. తండ్రి తర్వాత ఆ షాప్ పరంపరను కొనసాగిస్తున్న మీరావలి... ‘మస్తాన్ ఇడ్లీషాపు’ ప్రయాణాన్ని సాక్షితో ఇలా పంచుకున్నారు... ‘‘మా నాన్నగారు మస్తాన్ పెద్దగా చదువుకోలేదు. కొంత కాలం టైలరింగ్ చే శారు. ఆ తరవాత ఐస్ ఫ్యాక్టరీలో పనిచేశారు. అక్కడా లాభం లేకపోయింది. ఆ తరవాత చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. ఎన్ని చేసినా ఆయనకు సంతృప్తి కలగలేదు. కుటుంబ పోషణ కోసం కొంతకాలం బంధువుల హోటల్లో పనిచేశారు. కాని ఎంత కాలం పనిచేసినా సరిపడేన్ని డబ్బులు వచ్చేవి కాదు. ఎలాగూ అనుభవం వచ్చింది కనుక సొంతగా హోటల్ మొదలెట్టాలని అనుకున్నారు. 1980లో ఈ ఊళ్లో కర్నూలు రోడ్డులోని భారతి నర్సింగ్ హోమ్కి ఎదురుగా ఒక చిన్న పూరి గుడిసెను హోటల్గా చేసుకుని అక్కడే వ్యాపారానికి విత్తనం నాటారు. ఆ పూరి గుడిసెలోనే ఇడ్లీ, ప్లెయిన్ దోసె, స్పెషల్ కాఫీ తయారు చేసి సప్లయి చేయడం మొదలుపెట్టారు. సుమారు మూడు çసంవత్సరాల పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఈ హోటల్ను కేవలం 1000 రూపాయలతో ప్రారంభించారు. నేతిలా పేరుకుపోయింది 1988లో మా హోటల్ దశ తిరిగింది. ఇప్పుడున్న చోటుకు మస్తాన్ ఇడ్లీసెంటరును మార్చారు. చాలాకాలం హోటల్కి నేమ్బోర్డు కూడా లేదు. కాని అందరి నోళ్లలో మస్తాన్ పేరు, పేరుకున్న నేతిలా పేరుకుపోయింది. ఇవీ ప్రత్యేకతలు... నేతి ఇడ్లీ, నేతి దోసె మా ప్రత్యేకత. వెన్నపూసను స్వయంగా కరిగించి నెయ్యి తయారుచేయించి, ఆ నేతితోనే వంటకాలు తయారు చేస్తాము. జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు, మిరపకారం... వీటిని దోసె మీద వేసి తయారుచేస్తాము. ఈ ఆలోచన నాన్నగారి సొంతం. ఈ రుచికే వినియోగదారులు సాహో అనేశారు. 2002లో మేము బిర్యానీ పాయింట్ ప్రారంభించాము. కాని ఎక్కువ కాలం నడవలేదు. అచ్చి వచ్చిన ఇడ్లీయే మాకు అన్నం పెడుతోంది. ఇద్దరం సంతానం... నాన్నగారికి ఒక అబ్బాయి (నేను), ఒక అమ్మాయి. అమ్మాయి దివ్యాంగురాలు. హోటల్కి సంబంధించిన పనంతా నాన్న, అమ్మ, నేను చేసేవాళ్లం. 2003లో నాన్నగారు కాలం చేశారు. అప్పటి నుంచి అమ్మకి విశ్రాంతి ఇచ్చాను. పనివారిని నియోగించుకుని హోటల్ నడుపుతున్నాను. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటే లక్షల్లో ఒకడిగా ఉండేవాణ్ణి. ఇప్పుడు మాత్రం మస్తాన్ ఇడ్లీ సెంటర్ ఓనర్ని. ఆ తృప్తి చాలు. ఇవీ మస్తాన్ ఇడ్లీ వేళలు... ఉదయం 8 – 11, సాయంత్రం 6 – 9.30 వరకు మస్తాన్ హోటల్ కిటకిటలాడు తుంటుంది. చుట్టుపక్కల వారంతా మస్తాన్ ఇడ్లీ షాపు దగ్గరే కనిపిస్తారు. దీనినొక మీటింగ్ పాయింట్గా చూస్తారు. స్వయంగా వచ్చి ఇడ్లీ రుచి చూడలేని రాజకీయ నాయకులు, పార్సిల్స్ తెప్పించుకుని తిని ఆ రుచిని ఆస్వాదిస్తారు. ఇక్కడ కేవలం ఇడ్లీ, దోసె మాత్రమే దొరుకుతాయి. అన్నీ ఇంట్లోనే తయారుచేస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన మినప్పప్పు, బియ్యం ఉపయోగిస్తారు. క్వాలిటీ విషయంలో రాజీపడరు. నెలకోసారి వేటపాలెం వెళ్లి బస్తాడు జీడిపప్పులు హోటల్ కోసం తెచ్చుకుంటారు. – డా. వైజయంతి పురాణపండ -
ఇడ్లీ విత్ కాజూ చట్నీ అండ్ గన్ పౌడర్
ఇడ్లీని చట్నీతో నంచుకుని తినడం దక్షిణ భారతేదశంలో సంప్రదాయంగా వస్తోంది. వీటిని తయారుచేసి అలంకరించడంలో వైవిధ్యాలు ఉన్నాయి. మా అత్తగారు తయారుచేసే మదరాసీ గన్పౌడర్ గురించి వివరించాలనుకుంటున్నాను. ఇందుకోసం రవ్వ ఇడ్లీ మిశ్రమం (20 ఇడ్లీలకు సరిపడా) సిద్ధం చేసుకోవడానికి కావలసినవి... బొంబాయి రవ్వ 100 గ్రా., పెరుగు 5 టేబుల్ స్పూన్లు, అర టీ స్పూను బేకింగ్ పౌడర్, రుచికి తగినంత ఉప్పు, 30 మి.లీ. నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీడిపప్పు పలుకులు, ఇడ్లీ పిండిలో పోపు వేయడానికి ఒక టేబుల్ స్పూన్ బటర్ కావాలి. ఒక టీ స్పూన్ నూనెలో మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఒక టీ స్పూను ఆవాలు, అర టీ æస్పూన్ కరివేపాకు వేసి వేయించాలి. గన్ పౌడర్ కోసం... ఒక టీ స్పూన్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ సెనగ పప్పు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, కడిగిన బియ్యం ఒక టేబుల్ స్పూన్, అర టీ స్పూన్ ఎండు మిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక టేబుల్ స్పూను వేయించిన నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ పంచదార పొడి, తగినంత ఉప్పు ఉంచుకోవాలి. కొబ్బరి జీడిపప్పు చట్నీ కోసం... ఒక టీ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, ఒక రెమ్మ కరివేపాకు, 50 మి.లీ. కొబ్బరి పాలు, ఒక టీ స్పూన్ వేయించిన జీడిపప్పులు సిద్ధం చేసుకోవాలి. సర్వ్ చేయడానికి... ఒక టీ స్పూన్ సాల్టె్టడ్ బటర్, అర టీ స్పూన్ అల్లం తురుము, అర టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, అర టీ స్పూన్ పచ్చి మిర్చి తరుగు, ఒక టీ స్పూన్ వేయించిన జీడి పప్పు, ఒక టీ స్పూన్ వేయించి కొబ్బరి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, అర టీ స్పూన్ ఉల్లి కాడల తరుగు తీసుకోవాలి. పోపు తయారు చేసుకోవడం... స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి. పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి దింపేయాలి. ఇడ్లీ పిండి తయారు చేసుకోవడం... ఒక పాత్రలో బొంబాయి రవ్వ, పెరుగు, బేకింగ్ పౌడర్, ఉప్పు, జీడిపప్పు పలుకులు, నీళ్లు వేసి బాగా కలిపాక, వేయించి ఉంచుకున్న పోపును ఈ పిండిలో వేసి కలిపి సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. ఇడ్లీలు తయారు చేయడం.... ఇడ్లీ స్టాండును శుభ్రంగా కడిగి, ఇడ్లీ రేకులకు బటర్ పూయాలి. సిద్ధంగా ఉంచుకున్న ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ఈ రేకులలో వేసి ఇడ్లీ స్టాండును స్టౌమీద ఉంచి ఉడికించి దింపేయాలి. గన్ పౌడర్ ఇలా తయారుచేసుకోవాలి... స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగపప్పు, బియ్యం, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. నువ్వులు జత చేసి, పదార్థాలన్నీ బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, దింపేసి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి (మరీ మెత్తగా ఉండకూడదు). పంచదార, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి. జీడిపప్పు, కొబ్బరి పచ్చడి తయారుచేద్దాం... స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. కొబ్బరి పాలు, వేయించిన జీడిపప్పు పలుకులు జత చేసి, కొద్దిసేపు సన్నని మంట మీద ఉంచి, దింపేసి చల్లారనివ్వాలి. బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పాన్లో బటర్ వేసి స్టౌమీద ఉంచి కరిగించాక, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి. తయారుచేసి ఉంచుకున్న ఇడ్లీలను జత చేయాలి. వీటి మీద గన్ పౌడర్ వేయాలి. ఇడ్లీలకు గన్ పౌడర్ బాగా పట్టేలా జాగ్రత్తగా కలపాలి. వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, వేయించిన కొబ్బరి ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లికాడల తరుగు జత చేసి, స్టౌమీద నుంచి దింపేయాలి. సర్వింగ్ ప్లేట్లలో ఇడ్లీలను అందంగా అలంకరించి, జీడిపప్పు, కొబ్బరి చట్నీతో అందించాలి. క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ అండ్ కినోవా పులావ్ కావలసినవి: ఉడికించిన కినోవా బియ్యం – 300 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. వీటి ఖరీదు కొద్దిగా ఎక్కువే ఉంటుంది. ఈ బియ్యం బదులు బాస్మతి బియ్యం కూడా వాడుకోవచ్చు); అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్; క్యాలీ ఫ్లవర్ తరుగు – 3 టేబుల్ స్పూన్లు; తాజా పచ్చి బఠాణీ – 3 టేబుల్ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; మిరప కారం – అర టీ స్పూన్; ఉప్పు – కొద్దిగా; గరం మసాలా పొడి – అర టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పుదీనా తరుగు – 2 టీ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ – ఒక టేబుల్ స్పూన్ తయారీ స్టౌమీద బాణలి ఉంచి వేడయ్యాక ఆలివ్ ఆయిల్ వేయాలి. నూనె కాగాక జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి. అల్లం తురుము, ఉల్లి తరుగు వేసి వేయించాలి. క్యాలీఫ్లవర్ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి మరోమారు వేయించాలి. పసుపు, మిరప కారం, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి ఉడికించాలి. కొద్దిగా మెత్తబడ్డాక, ఉడికించిన కినోవా వేసి బాగా కలిపి, ఉప్పు జత చేయాలి. పుదీనా ఆకులతో అలంకరించి వేడివేడిగా అందించాలి. -
అదిరెన్ ఇడ్లీ
అ షాపులో అరటి ఆకు వేస్తారు... నాలుగు రకాల పచ్చళ్లు వడ్డిస్తారు...మరోవ్యక్తి పళ్లెం నిండా ఇడ్లీలు, గారెలు పుచ్చుకుని వస్తాడు... ఇంకొకరు శొంఠి పొడి, నెయ్యి తీసుకువస్తారు...‘మీకు ఏం కావాలి’ అంటూ తమిళ భాషలో ప్రశ్నిస్తూ, కొసరికొసరి వడ్డిస్తారు...ఆ ప్రదేశం పేరు మురుగన్ ఇడ్లీ షాపు...ఆ యజమాని పేరు మనోహర్...మదురై పేవ్మెంట్ ప్రారంభమైన వీరి ప్రయాణం‘మురుగన్ ఇడ్లీ షాపు’ గా విదేశాల స్థాయికి ఎదిగింది. ఆ ఫుడ్ ప్రింట్స్ ఈ వారం... ‘‘మా తల్లిదండ్రులు చెప్పినట్టు విని ఉంటే, నేను వంటగదిలోకి అడుగుపెట్టేవాడినే కాదు. వాళ్లు నన్ను బ్యాంకు ఉద్యోగిగానో, కాలేజీ ప్రొఫెసర్గానో చూడాలనుకున్నారు’’ అంటారు మురుగన్ ఇడ్లీ షాపు అధినేత 55 సంవత్సరాల మనోహర్. చదివిన లా డిగ్రీని పక్కనపెట్టి, తల్లిదండ్రులు నడుపుతున్న చిన్న కాఫీ షాపుని మదురై నుంచి చెన్నైకి, అక్కడ నుంచి సింగపూర్ స్థాయికి తీసుకువచ్చారు. ప్రతిరోజూ మురుగన్ ఇడ్లీ షాపు కనీసం రోజూ 25,000 ఇడ్లీలను, 13 బ్రాంచీలలో అమ్ముతోంది. బిజీ సమయాల్లో ఇడ్లీ తినాలంటే ఇక్కడ కనీసం 45 నిమిషాలు నిరీక్షించాల్సిందే. ఇక్కడ ఇడ్లీ తిన్న తరవాత చాలామంది ‘మెత్తగా ఉండే మురుగన్ ఇడ్లీ, రకరకాల చట్నీలు కావాలి’ అని అడగడం సహజమైపోయింది. అలా మొదలైంది... కుటుంబ ఆదాయానికి వేణ్నీళ్లకు చన్నీళ్లు అన్నట్లుగా మనోహర్ తల్లి 1960 ప్రాంతంలో మదురై పేవ్మెంట్ మీద హంగు ఆర్భాటం లేకుండా అతి సామాన్యంగా ఇడ్లీ దుకాణం ప్రారంభించారు. ‘‘మా తల్లిగారు కేవలం ఇడ్లీలు తయారుచేసి అమ్మేవారు. ఇడ్లీలలోకి రెండు రకాల చట్నీలు మాత్రమే చేసేవారు. సాంబారు కూడా ఉండేది కాదు. కస్టమర్లు వాటిని ఎంతో ఇష్టంగా తినేవారు. ఆ చిన్న స్టాలే ఎంతో పేరు సంపాదించుకుంది’’ అంటారు మనోహర్.ఒకసారి దివంగత కె. కామరాజు కారులో అటు వెళ్తున్న సమయంలో, ఆ షాపు దగ్గర జనం గుమిగూడి ఉండటం చూసి, తాను కూడా అక్కడ ఇడ్లీ తినాలని కారు ఆపుకున్నారంటే ఆ ఇడ్లీలకు ఎంత పేరు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 1970 నాటికి ఆ స్టాల్ చిన్న దుకాణంగా మారింది. ‘‘మురుగన్ మా కులదైవం కావడం వల్ల మా షాపుకి ‘మురుగన్ కాఫీ నిలయం’ అని పేరు పెట్టాం’’ అని గతం వివరిస్తారు మనోహర్. 1993 నాటికి మనోహర్ చదువు పూర్తి చేయడంతో, ఇంట్లో వారి కోరికను కాదని పూర్తిస్థాయిగా ఈ వ్యాపారంలోకి ప్రవేశించారు. ‘‘చిన్నతనం నుంచీ నాకు ఇలాంటి ఒక షాపు నడపాలని కోరికగా ఉండేది. మా తల్లిదండ్రులు మాత్రం, ‘చదువుకున్నవారు పనివాళ్లతో పనిచేయించలేరు’ అని నన్ను వెనక్కులాగారు. నేను ఏ మాత్రం పట్టు విడిచిపెట్టలేదు. ఈ దుకాణం నా చేతిలోకి వచ్చాక సీటింగ్ కెపాసిటీ పెంచాను. ఇంటీరియర్లో మార్పులు చేశాను. మెనూలో ఇడ్లీలతో పాటు చక్ర పొంగలి, దోసె, వడ, మరిన్ని చట్నీలు, సాంబారు... వంటివి చేర్చాను’’ అని ఎంతో ఆన ందంగా చెబుతున్న మనోహర్, కేవలం రెండు సంవత్సరాలలో మదురైలో మరో రెండు శాఖలు తెరిచి, పది సంవత్సరాల కాలంలో 30 లక్షల టర్నోవర్ స్థాయికి తీసుకువెళ్లారు. ‘‘రెండు నెలల పాటు చెన్నై అంతా తిరిగిన తర్వాత టి. నగర్లో మొట్టమొదటి ఇడ్లీ షాపును ప్రారంభించాను. ‘ఇడ్లీ కడై’ అని తమిళ పేరుతో ప్రారంభించడంతో ఆ పేరు ఎలా వినపడుతుందో అని సందేహపడ్డాను. ఆంగ్లంలో ‘మురుగన్ ఇడ్లీ షాప్’ అని పేరు స్థిరపరిచాను. ఆరు నెలల తర్వాత టి. నగర్లోనే మరో ఇడ్లీ షాపు తెరిచాను. ప్రస్తుతం చెన్నపట్టణంలో పది షాపులు ఉన్నాయి. ఇక ధైర్యం వచ్చింది. 2008లో సింగపూర్లో తెలుగు, తమిళలు ఎక్కువగా ఉండే ముస్తఫా స్టోర్ ఎదురుగా ఒక షాపు ప్రారంభించాను. ఆ రోజే అక్కడ ఇడ్లీలు తినడానికి పెద్ద క్యూ ఏర్పడింది’’ అని సంబరంగా చెబుతారు మనోహర్. మురుగన్ ఇడ్లీ షాపులో వడ్డించే విధానం, తయారుచేసే విధానం... భోజన ప్రియుల్ని బాగా ఆకర్షిస్తుంది. ‘‘ఇన్ని రెస్టారెంట్లు ఉన్నప్పటికీ ఇడ్లీలు మాత్రం ఒకే చోట తయారుచేసి, అన్ని బ్రాంచీలకు సప్లయి చేస్తారు. ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ‘‘అన్నిరకాల పదార్థాలు అరటి ఆకుల్లోనే వడ్డిస్తాం. అన్లిమిటెడ్ చట్నీ సాంబారు వడ్డిస్తాం’’ అని చెబుతున్న వీరి ఇడ్లీ షాపులో ‘పొడి కావాలా’, ‘నెయ్యి కావాలా’ అని కొసరి కొసరి వడ్డిస్తారు. వీరికి పోటీగా ఉన్న హోటల్స్లో పెద్ద పుస్తకం పరిమాణంలో మెనూ కార్డులు ఇస్తారు. ఇక్కడ కేవలం ఆరోగ్యకరమైన భారతీయ వంటకాలు మాత్రమే దొరుకుతాయి. చెన్నైలోని ఒక మార్కెట్ రిసెర్చర్ మురుగన్ ఇడ్లీ షాపు గురించి ‘ఈ షాపు చైనీ వంటకాల నుంచి చాట్ వరకు అమ్మకపోవడం చాలా సంతోషం’ అంటారు. ‘‘ఇడ్లీ తయారీలో మినప్పప్పు, ఉప్పుడు బియ్యం పరిమాణం ఎంత అన్నది రహస్యంగానే ఉంచాం’’ అంటున్న మనోహర్ మెనూను స్వయంగా తయారుచేసుకున్నారు. ఇక్కడి కాఫీ కూడా రుచిగా ఉంటుంది. ‘మా అమ్మ తయారుచేసే వాటికే మరి కొన్ని జోడించాను’ అంటారు మనోహర్. చాలామంది వీటిని అనుకరించడానికి ప్రయత్నించి, విఫలమయ్యారు. ఇడ్లీ, వడ, దోసెతో పాటు జిగర్ఠండా, ఉల్లి ఊతప్పమ్ వీరి ప్రత్యేకం. చిన్న ఉల్లిపాయలు మాత్రమే ఇందుకు ఉపయోగిస్తారు. వాటి తొక్క తీయడం చాలా కష్టం. చిన్న ఉల్లిపాయల వల్లే ఊతప్పానికి రుచి చేరుతుంది. ‘ఉల్లి పాయలు ఒలవడానికి 20 మందిని నియోగించాను. వారంతా మదురైలోనే ఉంటారు. వారు తొక్క తీసి అన్ని ప్రాంతాలకు చేర వేస్తారు. మేం ఇంతవరకూ మురుగన్ ఇడ్లీ షాపు ప్రకటనల కోసం ఎక్కువ ఖర్చు చేయలేదు’’ అని గర్వంగా చెబుతారు మనోహర్.‘‘మా తల్లిదండ్రుల్లా కాకుండా నేను మాత్రం ఈ వ్యాపారాన్ని నా కుమారుడితో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా ప్రపంచ దేశాల మీద ఉంది. రానున్న పది సంవత్సరాలలో మరో 300 శాఖలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అంటారు మనోహర్. – వైజయంతి పురాణపండ -
కొత్తదనానికి ఉప్మానం
ఉప్మాలో ఏముంటుంది చెప్మా అనుకోవద్దు.ఇవి ఒట్టి ఉప్మాలు కావు. చెమ్చాతో కొంచెం కొంచెం కొరుక్కుతినాలనిపించే కొత్తతరహా పలహారాలు.ఓట్స్, మరమరాలు, అటుకులు... రొటీన్గా రవ్వతో కాకుండా కొత్తగా ట్రై చేసిన డిష్లు ఇవి.మసాలా ఇడ్లీతో ఉప్మా, దోసె ఉప్మా ఎప్పుడైనా చూశారా?వానలు పడుతున్నాయి.కొంచెం వెరైటీగా పోండి. వేడివేడిగా ఎంజాయ్ చేయండి. ఓట్స్ ఉప్మా కావలసినవి:ఓట్స్ – 2 కప్పులు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; పసుపు – ఒక టీ స్పూన్; ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); పచ్చి మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఉల్లి తరుగు – అర కప్పు; క్యారట్ తురుము – పావు కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; పంచదార – ఒక టీ స్పూన్; ఉప్పు – తగినంత అలంకరణ కోసం; కొత్తిమీర – కొద్దిగా తయారీ: స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి కాగాక, ఓట్స్, పసుపు వేసి కొద్దిగా రంగు మారేవరకు వేయించి తీసేయాలి. (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ∙అదే బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి ∙ఎండు మిర్చి, పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙క్యారట్ తురుము, పచ్చి బఠాణీ జత చేసి రెండు నిమిషాలు వేయించాలి ∙చివరగా ఓట్స్, పంచదార, ఉప్పు వేసి పసుపు జత చేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేగాక, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి ∙బాగా ఉడికిన తరవాత స్టౌ ఆపేసి, బాణలి దింపేసి, కొత్తిమీరతో అలంకరించి, వేడివేడిగా అందించాలి. స్పైసీ మసాలా ఇడ్లీ ఉప్మా కావలసినవి:ఇడ్లీలు – 10; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 1 (చిన్న ముక్కలు చేయాలి)గ్రైండ్ చేయడం కోసం పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; కొబ్బరి తురుము – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంతఈ పదార్థాలన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.పోపు కోసం... ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – తగినంత తయారీ: ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు జత చేసి మరోమారు వేయించాలి ∙బాగా వేగిన తరవాత ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙మిక్సీలో మెత్తగా చేసిన మిశ్రమం, పావు కప్పుడు నీళ్లు జత చేసి బాగా కలిపి, రెండు మూడు నిమిషాలు కలపాలి ∙చివరగా ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలిపితే ఇడ్లీ ఉప్మా సిద్ధమైనట్లే ∙కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడిగా అందించాలి. దోసె ఉప్మా కావలసినవి: బియ్యం – 2 కప్పులు; కొబ్బరి తురుము – అర కప్పు; పచ్చి మిర్చి – 4; ఉప్పు – తగినంత పోపు కోసం... నూనె – తగినంత; ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: బియ్యాన్ని సుమారు రెండు గంటలపాటు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙కొబ్బరి తురుము జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, పాత్రలోకి తీసుకోవాలి ∙రెండు కప్పుల నీళ్లలో మిక్సీ జార్ను శుభ్రంగా కడిగి, ఆ నీటిని బాణలిలో పోసి, స్టౌ మీద ఉంచి, దగ్గరపడేవరకు కలిపి, బియ్యప్పిండి మిశ్రమానికి జత చేసి, రవ్వ దోస పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక, మిశ్రమాన్ని దోసెగా వేసి రెండువైపులా కాల్చి తీసేయాలి ∙కుకర్లో తగినన్ని నీళ్లు, కందిపప్పు, పసుపు వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ∙దోసెలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఉడికించిన కంది పప్పు, పావు కప్పు నీళ్లు జత చేసి బాగా కలపాలి ∙నీళ్లు మరుగుతుండగా దోసె ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙దోసె ఉప్మా రెడీ అయినట్లే ∙వేడివేడిగా అందించాలి. బ్రెడ్ ఉప్మా కావలసినవి: బ్రెడ్ స్లయిసెస్ – 10; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒక టీ స్పూను; పోపు కోసంఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – ఒక రెమ్మ; పచ్చి మిర్చి – 2; అల్లం తురుము – ఒక టీ స్పూను తయారీ: ముందుగా బ్రెడ్ స్లయిసెస్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, బ్రెడ్ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, అల్లం తురుము వరుసగా వేసి వేయించాలి ∙సెనగ పప్పు బంగారు వర్ణంలోకి వచ్చాక ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ∙టొమాటో తరుగు, మిరప కారం, ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙టొమాటో ముక్కలు బాగా ఉడికి మెత్తబడ్డాక, బ్రెడ్ ముక్కలు వేసి అన్నీ కలిసేవరకు జాగ్రత్తగా కలియబెట్టి దింపేసి, వేడివేడిగా అందించాలి. అవలక్కి ఉప్మా కావలసినవి: అటుకులు – 2 కప్పులు; వేయించిన సెనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత పోపు కోసం ఆవాలు – ఒక టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; నూనె – వేయించడానికి తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను తయారీ: అటుకులను తగినన్ని నీళ్లల్లో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పూర్తిగా ఒంపి, పావు గంటసేపు పక్కన ఉంచాలి వేయించిన సెనగ పప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి కొబ్బరి తురుము జత చేసి తడిపోయే వరకు వేయించాలి ∙కడిగిన అటుకులను జత చేసి బాగా కలపాలి ∙చివరగా వేయించిన సెనగపప్పు పొడి, ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙ఆవకాయ లేదా మాగాయలో నంచుకుని తింటే రుచిగా ఉంటుంది. పోరి ఉప్మా కావలసినవి: మరమరాలు – 5 కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; పల్లీలు – 3 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; పసుపు – చిటికెడు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత పోపు కోసం ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను తయారీ: ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి, మరమరాలు వేసి సుమారు మూడు నిమిషాలు నానబెట్టాక, మరమరాలను గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి వేయించాక, కొత్తిమీర వేసి కలియబెట్టాలి ∙వేయించిన పల్లీలు, మిరప కారం, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙మరమరాలు జత చేసి రెండు మూడు నిమిషాలు వేయించి వేడి వేడిగా అందించాలి. (దీనినే మరమరాల ఉప్మా అని కూడా అంటారు). రాగి సేమ్యా ఉప్మా కావలసినవి: రాగి సేమ్యా – పావు కేజీ; ఉల్లి తరుగు – అర కప్పు; ఎండు మిర్చి – 4 (చిన్న ముక్కలు చేయాలి); ఆవాలు – అర టీ స్పూను; సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; నూనె – తగినంత; ఉప్పు – తగినంత తయారీ: రాగి సేమ్యాను తగినన్ని నీళ్లల్లో సుమారు రెండు మూడు నిమిషాలు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, సేమ్యాను ఇడ్లీ ప్లేట్లో ఉంచి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి, ఎండు మిర్చి వేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి ∙చివరగా ఉడికించిన సేమ్యా జత చేసి బాగా కలిపి వేడివవేడిగా అందించాలి. పెరుగు ఉప్మా కావలసినవి: బియ్యం – ఒక కప్పు; కొబ్బరి తురుము – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; పుల్ల పెరుగు – ముప్పావు కప్పు; సెనగ పప్పు – టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత పోపు కోసం: ఆవాలు – అర టీ స్పూన్; మినప్పప్పు–అర టీ స్పూన్; కరివేపాకు – రెమ్మ తయారీ: బియ్యాన్ని ముందురోజు రాత్రి నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి కొద్దికొద్దిగా పెరుగు జత చేస్తూ మిశ్రమం తయారుచేసుకోవాలి (మరీ చిక్కగాను, మరీ పల్చగాను ఉండకూడదు) ∙ఒక గిన్నెలో సెనగ పప్పును రెండు గంటలసేపు నానబెట్టుకొని, బియ్యప్పిండి మిశ్రమంలో కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙మినప్పప్పు, కరివేపాకు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙బియ్యప్పిండి, పెరుగు మిశ్రమం వేసి బాగా కలపాలి ∙మిశ్రమం ఉప్మాలా విడివిడిలాడే వరకు సుమారు అరగంట సేపు ఉడికించి దించేసుకుని వేడివేడిగా అందించాలి. ఉప్మా.. ఉత్తమం... కాలాలు మారినా, తరాలు మారినా, మానవుని శక్తికి యుక్తికి మూలాధారం ఆహారమే. నాగరికత పరిణామ క్రమంలో ప్రకృతి ప్రసాదించిన అపక్వ (వండని) ఆహార సేవన నుండి, పదార్థాలను కాల్చి, ఉడికించి తినటం, అనంతరం వివిధ ద్రవ్యాలతో పచనం (వండి) చేసి తినటం వరకు మార్పు చోటుచేసుకుంది. అంతవరకు ‘ప్రగతి’గానే భావించవచ్చు. కాని ప్రస్తుతం మితిమీరుతున్న ‘క్షణాల్లో వంటలు, అధిక కాలం నిల్వచేసిన భక్ష్యాలు’ పరిశీలిస్తే అర్ధరహితమైన వ్యాపారకోణం మాత్రమే ప్రస్ఫుటమౌతోంది. పోషక విలువలు లేని, శరీరానికి హానికరమైన ఆహారాలకు, ఆ రుచులకు సమాజం బానిసైపోతోంది. ఈ నేపథ్యంలో సనాతన వంటకాలకు ఆదరణ పెరుగుతోందనేది నిర్వివాదం. విజ్ఞులంతా ఆ పోకడలకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటి వాటిలో అత్యంత ఉత్తమమైనది ‘ఉప్మా’. రోజులో ప్రధాన ఆహారాన్ని ‘భోజనం’అనీ, ఇతర సమయాల్లో తక్కువ పరిమాణాలలో తినేవాటిని ‘ఉపాహారం లేదా అల్పాహారం’ అనీ పిలుస్తుంటాం. ఉప్మా మనం ఉదయం పూట తినే అల్పాహారాలలో ప్రధానమైనది. దీనికి కారణం అప్పటికప్పుడు సునాయాసంగా తయారుచేసుకోగలగటం. కొంతమంది రాత్రిపూట భోజనానికి బదులు ఉప్మాను ఆస్వాదిస్తారు. దీనిని ‘బోంబే రవ్వ’గా పిలవబడే ‘నూక’ లేదా ‘మొరుము’ తో తయారుచేస్తారు. దీని మూలం గోధుమలు. వాస్తవానికి పాత రోజుట్లో వరి నూక (రవ్వ)తో ఉప్పుడు పిండిని తయారుచేసుకునేవారు. ఈ రెండింటి తయారీలో చాలా సారూప్యత ఉంది. రుచి భేదం కూడా సుస్పష్టం. బొంబాయి రవ్వ ఉప్మా:గోధుమల పై పొట్టు తీసేసి పాలిష్ చేసి మిల్లులో ఆడి రవ్వ తయారుచేస్తారు. (పూర్తిగా మెత్తగా చేస్తే పిండి అంటాం). ఈ రవ్వ అతి సన్నం, కొంచెం పెద్ద సైజులలో రెండు రకాలుగా ఉంటుంది. ఈ పెద్ద సైజునే ‘సెమోలినా’ అంటారు. హిందీలో ‘సూజీ’ అంటారు. తయారీ విధానం: ఇది అందరికీ తెలిసిందే. ముందుగా రవ్వను పొడిగా (తడి తగలకుండా) వేయించి పక్కన పెట్టుకోవాలి. కొంత పప్పులు, కరివేపాకు, ఆవాలు, మిర్చిలతో కూడిన పోపును తైల సంస్కారంతో (నూనెలో వేయించి) తయారుచేసుకుని, దానిలో కావలసిన నీరు పోసి, మరిగించి, ఈ రవ్వను మెల్లమెల్లగా కలుపుతూ (తగినంత ఉప్పుతో సహా) ఉడికిస్తే ఉప్మా సిద్ధమౌతుంది. చివరి దశలో కొంతమంది ‘నేతిని’ కలుపుతారు. ఇవి ఉప్మాకు కావలసిన ప్రాథమిక ద్రవ్యాలు. అభిరుచిని బట్టి వేగిన పోపులో జీడిపప్పు, వేరుసెనగ పలుకులు కొందరు కలుపుకుంటారు. మరికొందరు వీటికి తోడు రకరకాల కూరముక్కలు (క్యారట్, మటర్, బంగాళదుంప, క్యాబేజీ, బిరియానీ బీన్సు వంటివి) కూడా జత చేస్తారు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవటం సాధారణమైపోయింది. కొన్ని ప్రాంతాలలో (ఉత్తర భారతంలో) తయారైన పోపులో వేయించిన రవ్వను కలిపి, అనంతరం మరిగించిన నీటిని కొద్దికొద్దిగా పోస్తూ కలుపుతారు. దీనివలన ఉండలు కట్టదు. పోషక విలువలు: రవ్వలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు తగినంతగాను, కొవ్వులు అత్యంత తక్కువగాను ఉంటాయి. పీచు సమృద్ధిగా ఉంటుంది. క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింకులు కూడా ఉంటాయి. బి కాంప్లెక్సు విటమిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ – ఇ, సెలీనియం కూడా ఉంటాయి. ఆరోగ్య ఫలితాలు:ఉప్మా చాలా నిదానంగా అరుగుతుంది కనుక వేరే చిరుతిళ్ల మీద ధ్యాస ఉండదు. రక్తహీనతను తగ్గించి, ఎముకల బలాన్ని పెంచి, వ్యాధినిరరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. సుఖవిరేచనం జరుగుతుంది. మూత్రపిండాలకు, గుండెకు కూడా బలకరం. మనం కలుపుకునే జీడిపప్పు లేదా వేరుసెనగ పలుకులు, ఇతర కూరగాయల యొక్క పోషకవిలువ వలన అధిక ప్రయోజనం ఉంటుంది. మితంగా సేవిస్తే బరువును కూడా తగ్గించే గుణం గోధుమకు ఉంది. పిల్లలకైనా, పెద్దలకైనా నీరసాన్ని తగ్గిస్తుంది. ఇతర ద్రవ్యాలతో ఉప్మాలు: వరి రవ్వ (నూక): ఇది అసలైన సనాతన సాంప్రదాయక అల్పాహారం. దీని పేరు ఉప్పుడు పిండి. దీనిలో ఉండే ప్రధాన ప్రత్యేక ఇంగువను పోపులో తగినంత వేస్తారు. స్వచ్ఛమైన నువ్వులనూనెను వాడతారు. ఉప్మాలో మాదిరి ఇతరమైన అధికపదార్థాలను కలపరు. మిగిలిన తయారీ విధానం సమానమే. ఈ నూకను దంపుడు బియ్యం నుండి కూడా తయారుచేస్తారు. వరిలో ఉండే అన్ని పోషకవిలువలూ లభిస్తాయి. ఇంగువ జీర్ణాశయాన్ని శుద్ధి చేసి, ఆకలి పెంచుతుంది. దలియా: ఇది పొట్టు తీయని గోధుమల నుండి తయారయ్యే కొంచెం పెద్ద సైజులో ఉండే రవ్వ. పొటాషియం, విటమిన్ బి 6 సమృద్ధిగా లభిస్తుంది. అటుకులు: వరి ధాన్యం నుండి తయారవుతాయి. సన్నని, దⶠసరి రకాలు లభిస్తాయి. గోధుమలలో ఉండే గ్లూటెన్ దీంట్లో ఉండదు. ఐరన్, క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. సునాయాసంగా జీర్ణమై బలాన్ని సమకూరుస్తుంది. మొక్కజొన్న రవ్వ: ఇది బజారులో లభిస్తుంది. దీని పోషక విలువలను అనుగుణంగా ప్రయోజనం సమకూరుతుంది. కొర్ర బియ్యం: ఇవి చాలా సన్నగా చిన్న పరిమిణంలో ఉంటాయి కనుక దీనిని ర్వగా చేయనవసరం లేదు. ఓ గంటసేపు నీటిలో నానబెట్టిన తరువాత ఆ నీటిని తొలగింఇచ ఉప్మాను తయారుచేసుకోవచ్చు. దీనిలో పిండిపదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి కనుక మధుమేహం ఉన్నవాళ్లకి కూడా చాలామంచిది, బలకరం కూడా. గమనిక: ఓట్సు, సేమ్యాలతో కూడా ఉప్మా చేస్తారు. ఇవి కడుపులో వాయువును వృద్ధి చేస్తాయి. శరీరానికి మైదా మంచిది కాదని గుర్తుంచుకోవాలి. కాబట్టి భారతీయుల ఉప్మాలలో ఇవి అంత శ్రేష్ఠం కావు. తినేటప్పుడు పైన చెప్పిన ఏ రకం ఉప్మా లేక ఉప్పుడుపిండిలోనైనా కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే రుచి పెరుగుతుంది. విటమిన్ ‘సి’ సమకూరుతుంది.గుర్తుంచుకోవలసిన సారాంశం:ఉప్మ చేయుట సులభమ్ము ఉత్తమమ్ముపాత ఉప్పుడుపిండియున్ బలకరమ్ముఅటుకులు దలియ గోధుమల్ పటుతరమ్మెఅన్ని వయసులవారికిన్ ఆప్తబంధు – డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు జై ఉప్మా .. జై సేమ్యా ఉప్మా జనాలు ఉత్తి పుణ్యానికి ఉప్మా మీద పడి ఏడుస్తుంటారు కానీ అసలూ ... ఉప్మా ఎంత బావుంటుందో తెల్సా! మండే ఎండల్లో వండివార్చలేని పూట ఆకలితో మాడకుండా ఆదుకునే అమృతమేరా ఉప్మా అంటే అన్నంపప్పుకూరలు ఇప్పుడేం చేస్తామని బద్ధకించే ప్రాణానికి అప్పటికప్పుడు దొరికే అన్నపూర్ణేరా ఉప్మా అంటే ముగ్గురికి సరిపోయే రవ్వకి ఓ గ్లాసుడు ఎక్కువ నీళ్లు పోస్తే ఐదుగురికి సరిపోయే అద్భుతమేరా ఉప్మా అంటే కూరముక్కలేసినా పొంగిపోక వేయకపోతే కుంగిపోక స్ధితప్రజ్ఞతతో మన కడుపులో సర్దుకుపోయేదేరా ఉప్మా అంటే ఎర్రరవ్వైనా ఏడిపించక తెల్లరవ్వైనా పోజుకొట్టక చిటికెలో తయారై చింత తీర్చేదేరా ఉప్మా అంటే సేమ్యాతో చేస్తే సూపర్ హిట్గా బియ్యపురవ్వతో చేస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచే మినిమం గ్యారంటీ వున్న ఏకైక డిష్రా ఉప్మా అంటే .. నేతితో చేసినా.. నూనెతో చేసినా రుచిలో మాత్రం సాటిరాదు దీనికేదైనా చట్నీ లేకపోయినా చింతించక, ఆవకాయతో అమాంతం జతకట్టేస్తుంది .. ఊరగాయ అందుబాటులో లేకపోయినా.. నిమ్మచెక్క పిండితే చాలు నోరూరించేలా సిద్ధమైపోతుంది జీడిపప్పు వేయకున్నా ఏమనుకోదు కరివేపాకు వేయకున్నా కలవరపడదు కొత్తిమీర చల్లితేనే పొంగిపోయి ఘుమఘుమలాడే ఆత్మీయ నేస్తమురా ఉప్మా అంటే ... అకాల క్షుద్బాధకు చెక్ చెబుతూ... సకాలంలో తయారైపోయే డిష్... ఉదయమైనా సాయంత్రమైనా... అర్ధరాత్రైనా .. ఉన్నట్టుండి బంధువులొస్తే... ఉప్మారవ్వ ఉంటే ఇంట్లో కొండంత నిశ్చింత ఉన్నమాట ఒప్పుకోవాలి ఎప్పుడో ఒకప్పుడు తప్పదు... అందుకే మరి చెప్పేదేంటంటే .,, ఉప్మాని ఆరగిస్తూ వుంటే మీకు అన్నీ ఇట్టే కలిసొచ్చేస్తాయి... (చాలా బాగా టేస్టీగా వచ్చిందన్న ఆనందంతో ) – కాత్యాయని ఇటీవల కొంతకాలంగా వాట్సాప్లో వీరవిహారం చేస్తోన్న కొన్నింటికి ఉపమాలంకారమిది. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@gmail.com పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. -
ఇడ్లీ దోశ వడ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్స్కు నిధులను సమీకరించడం పెద్ద సవాలే. వినూత్న ఆలోచన, భవిష్యత్తు మార్కెట్ అవకాశాలుంటే తప్ప అంత త్వరగా పెట్టుబడులు రావు. అలాంటిది ఇడ్లీ, దోశ, వడ పిండిలను విక్రయించే సంస్థలో దిగ్గజ పారిశ్రామికవేత్త, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ పెట్టుబడి పెట్టడమంటే మామూలు మాట కాదు. రెడీ టు కుక్ రంగంలో తనదైన ముద్రవేసిన బెంగళూరు కంపెనీ ‘ఐడీ ఫ్రెష్ ఫుడ్స్’ మన దేశంలోనే కాదు! విదేశాల్లోనూ ఇడ్లీ, దోశ ఉత్పత్తులను విక్రయిస్తోంది. రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్న ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ వ్యవస్థాపక సీఈఓ పీసీ ముస్తఫా ఓ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ‘స్టార్టప్ డైరీ’తో మాట్లాడారు. ఆయనేమంటారంటే.. ‘‘మాది కేరళలోని చెన్నాలోడె అనే మారుమూల గ్రామం. నిరుపేద కుటుంబం కావటంతో మూడు పూట్లా తిండే కష్టం. ఇక పొద్దున్నే టిఫిన్స్ అంటే లగ్జరీనే. చదువే దారి చూపిస్తుందని కష్టపడి కోల్కతాలోని ఆర్ఈసీ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. ఆ తర్వాత మోటరోలా, సిటీ బ్యాంక్, ఇంటెల్ సంస్థల్లో ఇండియాతో పాటు యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో పనిచేశా. తర్వాత ఐఐఎం బెంగళూర్లో ఎంబీఏ కూడా పూర్తి చేశా. ఓసారి బెంగళూరులోని మా కజిన్ వాళ్లింటికి వెళ్లా. వాళ్లకు ఇంద్రానగర్లో ఓ చిన్న కిరాణా షాపుంది. రోజూ అక్కడ లోకల్ బ్రాండ్ ఇడ్లీ, దోశ ప్యాకెట్స్ బోలెడన్ని అమ్మకాలుండేవి. ఓసారి షాపులో కూర్చున్న నాకు.. ఇది ఆశ్యర్యం కలిగించింది. నాణ్యత, దినుసుల ఎంపిక వంటివేవీ పట్టించుకోకుండా ప్యాకేజ్డ్ ఫుడ్కు ఇంత మార్కెట్ ఉందా అని! దీన్నే తాజాగా, అందుబాటు ధరల్లో అందిస్తే ఎలా ఉంటుందనుకున్నా!! మా కజిన్తో కలిసి రూ.50 వేల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా ఐడీ ఫ్రెష్ ఫుడ్ను ప్రారంభించాం. వండుకునేందుకు సిద్ధమైన రెడీ టు కుక్ ప్యాకెట్స్.. అది కూడా ప్రతి రోజూ తాజా ఉత్పత్తులు, వినూత్న ప్యాకేజింగ్, అందుబాటు ధర ఇదీ ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ ప్రత్యేకత. 8 ఉత్పత్తులు.. ప్రస్తుతం ఐడీ ఫ్రెష్ నుంచి ఇడ్లీ, దోశ, వడ, రాగి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, మలబార్ పరాఠా, గోధుమ పరాఠా, పన్నీర్ పిండి 8 రకాల ఉత్పత్తులున్నాయి. త్వరలోనే ఫిల్టర్ కాఫీ డికాక్షన్, టమాట, కొబ్బరి చట్నీలను తెస్తున్నాం. వచ్చే రెండేళ్లలో 15 ఉత్పత్తులను విపణిలోకి తీసుకురావాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, దుబాయ్లో 6 తయారీ కేంద్రాలున్నాయి. ఆయా ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 15 లక్షల ఇడ్లీలు. త్వరలోనే బెంగళూరులో మరో భారీ ప్లాంట్ను నిర్మించనున్నాం. దీంతో సామర్థ్యం రోజుకు కోటి ఇడ్లీలకు చేరుతుంది. పిండి రుబ్బడానికి అమెరికా సంస్థతో కలిసి సొంతంగా మిషన్లను అభివృద్ధి చేశాం. ఈ మిషన్ గంటకు 1,500 కిలోల పిండి రుబ్బుతుంది. 20 వేల స్టోర్లు; రోజుకు 20 కోట్ల వ్యాపారం.. మన దేశంతో పాటు దుబాయ్లోనూ ఐడీ ఫ్రెష్ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. మొత్తం 20 వేల స్టోర్లున్నాయి. హైదరాబాద్లో 2,200, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లో 1,200 స్టోర్లున్నాయి. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్లో 3 వేల స్టోర్లతో పాటు వరంగల్, కర్నూల్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలని లకి‡్ష్యం చాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్నాం. హైదరాబాద్లో రోజు కు రూ.2 కోట్లు, ఏపీలో రూ.80 లక్షల వ్యాపారం ఉంది. మొత్తం ఆదాయంలో బెంగళూరు నుంచి 40%, హైదరాబాద్ నుంచి 16% వాటా వస్తోంది. ఐదేళ్లలో వెయ్యి కోట్లు లక్ష్యం.. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.275 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. అంతక్రితం ఏడాది ఇది రూ.182 కోట్లు. వచ్చే ఐదేళ్లలో వెయ్యి కోట్ల టర్నోవర్ను లకి‡్ష్యంచాం. త్వరలోనే ఒమన్, సౌదీ దేశాలకు ఆ తర్వాత సింగపూర్, శ్రీలంక, అమెరికా వంటి దేశాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం కంపెనీలో 1,600 మంది ఉద్యోగులున్నారు. త్వరలో ఈ సంఖ్యను 2 వేలకు చేరుస్తాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో రూ.185 కోట్ల నిధులను సమీకరించాం. హీలియన్ వెంచర్ పార్టనర్స్ రూ.35 కోట్లు, అజీజ్ ప్రేమ్జీ రూ.150 కోట్లు పెట్టుబడులు పెట్టారు... అని ముస్తఫా వివరించారు. -
ప్రాణం తీసిన ఇడ్లీ!
సాక్షి, చెన్నై: ఇడ్లీలు తినే పోటీలో విషాదం చోటుచేసుకుంది. ఇడ్లీ గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడకడో వ్యక్తి మృతిచెందాడు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తమిళనాడులోని పుదుకోట్టై కీరమంగళంలోని కళ్లిచ్చియమ్మన్ ఆలయంలో మంగళవారం సాయంత్రం నుంచి ప్రత్యేక పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా రాత్రి ఇడ్లీలు తినే పోటీలు సాగాయి. ఇందులో పెద్ద సంఖ్యలో యువకులు తమ సత్తాను చాటుకునే ప్రయత్నం చేశారు. ఇందులో గ్రామానికి చెందిన చిన్న తంబి(45) అనే వ్యక్తి అతివేగంగా ఇడ్లీలు తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస ఆడక అవస్థ పడుతున్న అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. ఈ పోటీ మూలంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని చిన్నతంబి భార్య చిత్ర, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు విలపిస్తున్నారు. -
షాకింగ్: ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం
► 11 కిలోల ప్లాస్టిక్ స్వాధీనం ► ప్లాస్టిక్ బియ్యం పట్టుబడితే కఠిన చర్యలు: మంత్రి కామరాజ్ సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో పలుచోట్ల ప్లాస్టిక్ బియ్యం బైటపడగా, చెన్నైలోని పలు హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం బైటపడింది. అన్నానగర్, తేనాంపేట మండలాల్లోని పలు హోటళ్లపై ఆహార భద్రతాశాఖధికారులు బుధ, గురువారాల్లో ఆకస్మికంగా దాడులు చేయగా ఇడ్లీ తయారీకి ప్లాస్టిక్ పేపర్లను ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం వినియోగించడం బైటపడింది. ఈ సందర్భంగా 11 కిలోల ప్లాస్టిక్ పేపరును స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కొన్ని చిన్న, పెద్దతరహా హోటళ్లలో ఇడ్లీని ఉడకబెట్టేందుకు ప్లాస్టిక్ పేపరును వినియోగిస్తున్న అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల మేరకు రెండు రోజులుగా అన్నానగర్, తేనాంపేట మండల పరిధిలోని హోటళ్లలో తనిఖీలు సాగిస్తున్నారు. ఒక్క అన్నానగర్ మండలంలోనే 30కి పైగా హోటళ్లలో తనిఖీలు చేయగా కొన్ని హోటళ్ల ప్లాస్టిక్ పేపరు వాడకం బట్టబయలైంది. ఆయా హోటళ్ల నుంచి ఆరుకిలోల ప్లాస్టిక్ పేపరును స్వాధీనం చేసుకున్నారు. అలాగే తేనాంపేట మండల పరిధిలోని నుంగంబాక్కంలో జరిపిన తనిఖీల్లో ఐదు కిలోల ప్లాస్టిక్ పేపర్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ, ప్లాస్టిక్ పేపర్ తయారీ సమాయంలో కలిపే రసాయనాలు ఆహారపదార్థాలతో మిళితమైతే గుండె సంబంధిత వ్యాధులు సోకే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయాన్ని అన్ని హోటళ్లలోనూ ప్రచారం చేస్తున్నామని చెప్పారు. అన్నానగర్, తేనాంపేట మండలాల్లో ప్లాస్టిక్ పేపర్ స్వాధీనం చేసుకున్న హోటళ్లవారిని హెచ్చరించి వదిలేస్తున్నాము, కఠిన చర్యలు ఏవీ తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ బియ్యంపై కఠిన చర్యలు: మంత్రి కామరాజ్ రాష్ట్రంలో ప్లాస్టిక్ బియ్యం పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల మంత్రి కామరాజ్ హెచ్చరించారు. చెన్నై సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ప్లాస్టిక్ బియ్యం చలామణి అవుతున్నట్లు వార్తలు వస్తున్నా, తమిళనాడులో ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు లేవని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా అయ్యే బియ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని అన్నారు. ప్లాస్టిక్ బియ్యం మార్కెట్లోకి రాకుండా తనిఖీలు పెంచామని, అనుమానం ఉన్నచోట్ల బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకుని పరిశీలించామని తెలిపారు. ప్లాస్టిక్ బియ్యం గనుక పట్టుబడితే నిందితునిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
గొంతులో ఇడ్లీ ఇరుక్కుని చిన్నారి మృతి
నర్వ: మురిపెంతో పెట్టిన ఇడ్లీ ముక్క ముద్దులొలికే చిన్నారి ఉసురు తీస్తుందని ఆ కన్నతల్లి ఊహించి ఉండదు. కానీ, జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇడ్లీ ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు. మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత పట్టణంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన చిన్నారి తల్లిదండ్రులతో పాటు స్థానికులను విషాదంలో ముంచివేసింది. వెంకటయ్య, పద్మ దంపతులకు ఐదు నెలల పృథ్వీరాజ్ సంతానం. బుధవారం ఉదయం చిన్నారికి పద్మ ఇడ్లీ తినిపించే ప్రయత్నం చేసింది. ఓ ఇడ్లీ ముక్క నోట్లో పెట్టగా గొంతులో ఇరుక్కుపోవడంతో పసివాడు విలవిలలాడిపోయాడు. చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళుతుండగానే తుది శ్వాస విడిచాడు. -
ఇడ్లీ, దోశ, పొంగల్.. జిమ్లో ఆరు గంటలు
హాలీవుడ్ కండల వీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ దక్షిణాది వంటకాలపై మనసు పారేసుకున్నాడు. ఇడ్లీ, దోశ, పొంగల్ వరుసగా లాగించేసి...వాటిని అరిగించుకోవటానికి సుమారు ఆరుగంటలు జిమ్లో కసరత్తు చేశాడు. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'ఐ' సినిమా ఆడియో ఫంక్షన్కు చెన్నై వచ్చిన ష్వార్జ్ నెగర్...కాంటినెంటల్ వంటకాల్ని కాదని, అడిగి మరీ ఇడ్లీ, దోశ, పొంగల్ను ఇష్టంగా ఆరగించాడు. ఆ తర్వాత చెమటలు కక్కేలా ఆరు గంటలు వర్క్ అవుట్ చేశాడట. అంతేకాకుండా ష్వార్జ్ నెగర్ తమిళ సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టుపై కూడా మనసు పడ్డాడట. ఈవిషయాన్ని 'ఐ' చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసిందుకు ష్వార్జ్ నెగర్ పంచెకట్టులో వెళదామనుకున్నా... సమయం సరిపోనందున 'అమ్మ'ను సూట్లోనే కలిసినట్లు రవిచంద్రన్ తెలిపాడు. 'ష్వార్జ్ నెగర్ 3.30కి లాండ్ అయ్యాడు. 5.30కి బ్రేక్ ఫాస్ట్ చేశాడు...ఆ తర్వాత జిమ్లో ఆరు గంటలు గడిపాడు' . ఫిట్నెస్పై ష్వార్జ్ నెగర్కి ఉన్న అంకిత భావం చూసి చిత్ర యూనిట్ స్టన్ అయ్యారట. ఆరు పదులు వయసు దాటినా ష్వార్జ్ నెగర్ ఇప్పటికీ కుర్రాడిలా షూటింగ్లో ఫైట్స్ చేస్తూ కాళ్లు చేతులకు గాయాలు తగలించుకోవటం అలవాటే. -
మెనూ చూడ కడుపు నిండు.. భోజనం చూడ గుండె మండు!
కర్నూలు(అర్బన్): సంక్షేమ వసతి గృహాల్లో నిర్లక్ష్యం గూడుకట్టుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సంక్షేమాధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. మెనూ చార్టులో భోజనం వివరాలు పరిశీలిస్తే కడుపు నిండిపోతుంది. వాస్తవంలోకి వెళితే మెనూ ఎక్కడా అమలుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో వారంలో ఆరు రోజులు(సెలవు రోజులు మినహా) ఆయా పాఠశాలల్లోనే హాస్టల్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం అందుతోంది. ఇక మిగిలింది ఆదివారం మాత్రమే. ఆ రోజు మూడు పూటలా మెనూ అమలు చేయాల్సి ఉండగా.. పెట్టింది తినాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మెనూ ప్రకారం ఉదయం పాలు, పంచదారతో కలిపిన రాగి జావ, టిఫెన్కు ఇడ్లీ, పల్లీల చెట్నీ, మధ్యాహ్నం గుడ్డుతో బిరియానీ, కుర్మా, పెరుగుపచ్చడి.. సాయంత్రం ఉడికించిన శనగలు.. రాత్రి అన్నం, కూర, రసం వడ్డించాల్సి ఉంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని పెద్దపాడు బీసీ బాలుర వసతిగృహాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఆదివారం ఉదయం ఉగ్గాని.. మధ్యాహ్నం తెల్లన్నం, ఉడికించిన గుడ్డు, రసంతో సరిపెట్టారు. 250 మంది విద్యార్థులున్న ఈ వసతిగృహంలో సగానికి పైగా విద్యార్థులకు గ్లాసులు కూడా లేకపోవడం గమనార్హం. తిన్న ప్లేట్ను శుభ్రం చేసుకున్న తర్వాత అందులోనే నీళ్లు పట్టుకుని తాగాల్సిన దుస్థితి. అదేవిధంగా ఏడు గదుల్లోనే వీరంతా సర్దుకుపోవాల్సి వస్తోంది. ఒక్కో గదిలో 30 మందికి పైగా విద్యార్థులు ఉండాల్సి రావడం ఇక్కడి పరిస్థితి అద్దం పడుతోంది. జిల్లాలోని సగానికి పైగా వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి. ఉడికీ ఉడకని.. లావు బియ్యంతో చేసిన ఆహారం తినలేక అధిక శాతం విద్యార్థులు చెత్తకుండీల్లో పారబోస్తున్నారు. నీళ్ల చారు తినలేక వెక్కిళ్లతో నీటి కోసం విద్యార్థులు పరుగులు తీయడం పరిపాటిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉన్నతాధికారులెవరూ పర్యవేక్షించరనే భావన సంక్షేమ హాస్టళ్లలో ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. అధిక శాతం హాస్టళ్లకు ప్రహరీ గోడలు లేకపోవడంతో విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో పశువులు, కుక్కలు, పందులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఈ కారణంగా వ్యాధులు ప్రబలుతుండటం తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. అదేవిధంగా చాలీచీలని గదులు.. తాగునీటి ఇక్కట్లు.. మరుగుదొడ్ల కొరతతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. కొరవడిన పర్యవేక్షణ సంక్షేమ వసతి గృహాలను పర్యవేక్షించాల్సిన సహాయ సంక్షేమాధికారులు ఆయా వసతి గృహాలకు చుట్టపుచూపుగా మాత్రమే వెళ్తున్నారు. వీరంతా కేవలం తమ కార్యాలయాలకే పరిమితం అవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి సహాయ సంక్షేమాధికారుల పోస్టులు దాదాపు ఐదు ఖాళీగా ఉంటే.. వీటికి గ్రేడ్-1 వసతి గృహ సంక్షేమాధికారులు ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా 21 హెచ్డబ్ల్యుఓ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మిగిలిన వాచ్మెన్, కమాటీ పోస్టులు దాదాపు 40 వరకు ఖాళీగా ఉన్నా భర్తీకి చర్య చూపని పరిస్థితి నెలకొంది. నాల్గో తరగతి సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్న వసతి గృహాల్లో ఆయా పనులన్నీ విద్యార్థులే చేయాల్సి వస్తుండటం గమనార్హం. -
కథ: తోడూ నీడా
‘‘మినపరుబ్బు కొంచెం ఉంటే తెచ్చానమ్మా. నూక కలిపిందే. నాకు చిన్న రొట్టి కాల్చి మిగతాది ఉదయం ఇడ్లీకి ఉంచు..’’ అంటూ తను తెచ్చినవన్నీ, బయటకు ఒక్కొక్కటీ పెట్టింది. పిల్లలకి సున్నుండలు, మధుకి ఇష్టమని జంతికలు, చెరుకు ముక్కలు, అనకాపల్లి ఫేమస్ చిన్న బెల్లం దిమ్మ, పచ్చళ్లు పేరిన నెయ్యి... ఇవన్నీ చూసి పిల్లలు సంబరపడిపోయారు. ‘‘అమ్మా!’’ ‘‘మమ్మీ!’’ ‘‘అబ్బబ్బా! ఎందుకర్రా ఆ కేకలు. ఏదో భాషలో పిలవండి. ఏమయింది?’’ వంటింటిలోంచి వస్తున్న సుమతిని చూస్తూ షేవ్ చేసుకుంటున్న మధు అద్దంలోంచి చూస్తూ నవ్వుతున్నందుకు ఉడుక్కుని, ‘‘ఊ! అలా నవ్వే బదులు వాళ్లను కాస్త చూడొచ్చు కదా, ఎందుకరుస్తున్నారు?’’ ‘‘అది నీ సెక్షనోయ్!’’ ‘‘అవును. ఈ సెక్షనాఫీసరుగారికి ఇంట్లో కూడా రూల్సే. ఇంతకీ ఏమిటర్రా మీ గోల?’’ ‘‘ఈ పొట్టోడు జామంతా ఉత్తినే తినేస్తున్నాడు. మరి నేనెలా తినాలి ఈ బ్రెడ్డుని?’’ దీర్ఘం తీసింది సిరి. దానికే ఎనిమిదేళ్లు. దాని కన్నా ఏడాది చిన్న ఫణి. వాడు దీనికి పొట్టోడు. ఇది మరీ పొడుగ్గా ఉన్నట్లు. నవ్వాపుకుంటూ, ‘‘పోనీలే. ఈసారికి పాలల్లో వేసిస్తాను. నా తల్లివి కదూ. వేగిరం తినాలి. టైమవుతుంది. ఆటో వచ్చేస్తుంది. మరి రేపు నీకు వేరే జాము కొంటాను కదూ.’’ ‘‘మమ్మీ! రోజూ ఈ బ్రెడ్డేనా? ఏదైనా టిఫిన్ చెయ్యమ్మా?’’ ‘‘అలాగే. రేపు సండే కదా. పూరీ చేస్తాను. సరేనా?’’ పిల్లలిద్దరికీ బాక్సులు సర్ది, వాళ్లని ఆటో ఎక్కించి వచ్చినప్పటికి శ్రీవారు రెడీ. అతనికి కొంచెం పెరుగన్నం పెట్టి, తనూ రెండు ముద్దలు ఆదరాబాదరాగా తిని, ఇద్దరికీ టిఫిన్ బాక్సులు సర్ది, తను తయారైనప్పటికి తొమ్మిదిన్నర. డోర్ లాక్ చేసి, పరుగుపరుగున వచ్చి కూర్చున్న సుమతిని చూసి, ‘‘గ్యాస్ కట్టావా? మొన్నటిలా మర్చిపోయావా?’’ బైక్ స్టార్ట్ చేస్తూ అడిగాడు మధు. ‘‘మొన్న ఏదో తొందరలో అలా చేశానుగాని, ఎప్పుడూ జాగ్రత్త గానే ఉంటాను.’’ వీళ్లు ఏం మాట్లాడుకున్నా ఆ పావుగంట ప్రయాణంలోనే. అన్ని కబుర్లనూ. సుమతి ఆఫీసు ముందు వస్తుంది. తనని అక్కడ డ్రాప్ చేసి, మధు ఆఫీస్కి వెళ్తాడు. సాయంత్రం మాత్రం వీలుపడదు. సుమతి ముందుగా వస్తుంది ఆటోలో. పిల్లలు, అప్పటికే వచ్చి వరండాలో కూర్చుని ఉంటారు. ఆఫీసులో లంచ్ టైమ్లో కలిసింది సుధ. ఇద్దరూ ఒకే దగ్గర పనిచేస్తున్నా గాని, వాళ్లు కలిసేది, ఈ లంచ్ టైమ్లో మాత్రమే. ‘‘ఏమిటే! అలా ఉన్నావు? కొంచెం డల్గా ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఎనీ ప్రాబ్లమ్?’’ కూర్చుంటూ అడిగింది. ఉదయం సిరి అన్న మాటలు చెప్పి, ‘‘వాళ్లు ఎదిగే వయసులో సరైన సంరక్షణ చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది. అప్పటికి ఉదయం ఐదింటికే లేస్తాను. గదులు ఊడ్చి, స్నానం చేసి, కుక్కరు పెట్టి, దేవునికి ఒక దీపం పెట్టేటప్పటికి వీళ్లు లేస్తారు. వాళ్ల పనులు చూసి వంటయేటప్పటికి వీళ్ల ఆటో ఎనిమిదింటికి వస్తుంది. వాళ్లని తయారుచేసి పంపేటప్పటికి ఈయన రెడీ అవుతారు. ఆయనకి, నాకు బాక్సులు కట్టుకుని, తయారయ్యేప్పటికి టైమవుతుంది. ఏం చేయడం? ఆఫీసు పది గంటలకైనా, ఈ ట్రాఫిక్ నుండి తొమ్మిదిన్నరకే బయల్దేరాల్సొస్తుంది’’ ‘‘మీవారేమి సాయం చేయరా?’’ ‘‘చేస్తారు. పిల్లలకి షూస్ వేయడం, వాళ్ల పనులు కొంచెం చూస్తారు.’’ ‘‘పనమ్మాయి ఉంది గాబోలు.’’ ‘‘ఆ! అది వచ్చేప్పటికి మేము వెళ్లిపోతాం. వరండాలో సామాన్లు పడేస్తే, తోమి వెళ్తుంది. సాయంకాలం రాదు. ఆదివారం నాడు ఇల్లు వత్తుతుంది. దానికే, ఆరు వందలు. మరి ఏం చేస్తాం? తప్పదు. అప్పటికి క్యారియర్లు, అన్నీ నేనే కడుక్కుంటాను.’’ సింక్లో చేతులు కడుక్కువచ్చి, ‘‘అన్నట్లు సుమా! మీ అత్తగారు ఆ పల్లెటూరులో ఒక్కళ్లే ఉండే బదులు మీ దగ్గరే ఉండొచ్చు కదా! నీకూ కొంచెం సాయం ఉంటుంది. పిల్లలకీ బాగుంటుంది.’’ ‘‘నిజమే గాని! ఆవిడ ఆ ఊరు వదలి రారు. ఎప్పుడైనా వచ్చినా అదే టైముకి నాకు డేట్సు వస్తాయి. వారం కన్నా ఎక్కువ ఉండరు. మా అత్తగారిది ఉమ్మడి కుటుంబం. ఈవిడ వాళ్లతో కలిసే ఉంటుంది. మా చినమామగారిది, మాది పక్కపక్కన ఇళ్లే. పక్కనే ఉన్నారు గనుక ఆవిడకు తోడుగా ఉన్నారని మేము అంతగా బలవంతం చేయలేదు. అదీగాక, ఆవిడకు కొంచెం మడీ తడీ ఎక్కువ. నెలనెలా ఇదొక ప్రాబ్లమ్ కదా. ఇన్నాళ్లూ అంటే ఖాళీగా ఉన్నాను గనక పర్వాలేకపోయింది. ఈ వచ్చింది గవర్నమెంటు జాబు. మానలేను.’’ ‘‘మానమని ఎవరు చెప్పేరే? నువ్వు కొంచం సర్దుకుపోతే బాగుంటుంది కదా. ఆ మూడు రోజులు. వంటింటివైపు వెళ్లకు. నువ్వు కొంచం ఎడంగా ఉంటే, ఆవిడే సర్దుకుంటారు. పెద్దవాళ్లు కదా, వాళ్లకి కొన్ని ఆచారాలు ఉంటాయి. అయినా, మన పూర్వీకులు చాలా తెలివిగా ఈ కట్టుబాట్లు పెట్టారు. పూర్వం అందరివీ ఉమ్మడి కుటుంబాలు. జనాభాలూ ఎక్కువే ఉండేవి. అలాగే, ఆడవాళ్లకి పనులు కూడా ఎక్కువే ఉండేవి. అందుకే, ఆ సమయంలో ఆడవారికి రెస్టు ఉండాలన్న ఉద్దేశంతో, ఆ నియమాన్ని అలా పెట్టారు. చూశావా? మన పూర్వీకులకి స్త్రీల పట్ల ఎంత అభిమానము, గౌరవమో! లేకపోతే, ఉమ్మడి కుటుంబాల్లో కోడళ్ల పని అయిపోయేదే! ఆ పద్ధతి ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో పెద్దవాళ్లు పాటిస్తున్నారు. అంతే! దానికి మనమే ఎడ్జస్టయిపోతే సరిపోతుంది కదా’’ అని వాచీ చూసుకులేచి సుమతి భుజం మీద చెయ్యేసి, నవ్వుతూ, ‘‘గాడ్ బ్లెస్ యూ’’ అంటూ వెళ్లిపోయింది. సుమతికి ఇంటికి వెళ్లినంతవరకూ ఇవే ఆలోచన్లు. ‘‘నిజమే! సుధ చెప్పినట్లు చేస్తే బాగుణ్ను గాని, ఆవిడ వస్తారా? ఈ సంగతి మధుకి ఎలా చెప్పడం? ఏమనుకుంటారు? నీ సాయం కోసం అమ్మని తెమ్మంటావా అంటారేమో! ఏమని చెప్పాలి?’’ ఆలోచన్లలోనే పనులు చేసుకుంటోంది. మధు రానే వచ్చాడు. వస్తూనే, ‘‘సుమా! చిన్న న్యూస్, ఇలారా?’’ అంటూ కూర్చుని బూట్లు విప్పుకుంటూ సోఫాకి చేరబడి, సుమతి ఇచ్చిన టీ అందుకుంటూ, ‘‘చిన్నాన్న ఫోన్ చేశారోయ్! ఈ వర్షాలకి మన ఇల్లు కారుతోందట. ఇల్లు రిపేరు చేయించాలి. అమ్మను తీసుకెళ్లమని చెప్పారు. రేపు ఆదివారం. వెళ్లి తెస్తాను. ఏమంటావు?’’ తనేమంటుంది? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు... సుమతి మనసులో సంశయం తీరిపోయింది. ‘‘ఏమంటాను? తప్పక తీసుకురండి. పాపం! ఒక్కళ్లే ఏం ఇబ్బంది పడుతున్నారో’’ అంది సంతోషంగా. పిల్లలు కూడా సరదా పడ్డారు నానమ్మ వస్తుందని. మర్నాడే ఉదయం బస్సుకి వెళ్లాడు మధు. సాయంత్రంకల్లా రానే వచ్చేశారు. అనకాపల్లి ఎంత దూరమని, రెండు గంటల ప్రయాణం. రాగానే ఇద్దరి మనవల్ని దగ్గరకు తీసుకుని ముద్దులాడి, సుమతిని పలకరించింది జానకమ్మ. అత్తగారి కాళ్లకి నమస్కరించి, కుశలాలు పలకరింపులు అయ్యాక, ఇద్దరికీ కాఫీలు తెచ్చి ఇచ్చింది. సుమతి. ‘‘అత్తయ్యా! ఈ రోజు ఆదివారం కదా. రాత్రికి భోజనం చెయ్యరు. ఏం టిఫిను చెయ్యమంటారు?’’ ‘‘మినపరుబ్బు కొంచెం ఉంటే తెచ్చానమ్మా. నూక కలిపిందే. నాకు చిన్న రొట్టి కాల్చి మిగతాది ఉదయం ఇడ్లీకి ఉంచు..’’ అంటూ తను తెచ్చినవన్నీ, బయటకు ఒక్కొక్కటీ పెట్టింది. పిల్లలకి సున్నుండలు, మధుకి ఇష్టమని జంతికలు, చెరుకు ముక్కలు, అనకాపల్లి ఫేమస్ చిన్న బెల్లం దిమ్మ, పచ్చళ్లు పేరిన నెయ్యి... ఇవన్నీ చూసి పిల్లలు సంబరపడిపోయారు. సుమతి అవన్నీ తీసి సర్దుతూ, ‘‘ఇవన్నీ ఎప్పుడు చేయించారత్తయ్యా?’’ ‘‘రమణ నిన్న చెప్పాడు, మధుకి ఫోన్ చేశాను, రేపు వస్తాడని. మీ చిన్నత్త రాత్రి చేయించింది. బెల్లం, మినప్పప్పు ఇంట్లో ఉన్నవే పట్టుకొచ్చాను. రాత్రికి కొంచెం గుమ్మడి వడియాలు వేయించు. పిల్లలు ఇష్టంగా తింటారు.’’ ‘‘మీరు అలా కాసేపు చేరబడండి. బస్సులో అలా కూర్చొనుంటారు’’ సామానులన్నీ ఫ్రిజ్లో పెట్టి, వంటగదిలోకి వెళ్లింది. తల్లి కొడుకు ఊరి సంగతులు మాట్లాడుకుంటూండగా గబగబా వంట చేసి, భోజనాలకు పిలిచింది. అత్తగారు తెచ్చిన ఆవకాయ పచ్చళ్లు, కమ్మని నెయ్యితో సంతృప్తిగా భోజనాలు చేశారు. పిల్లలిద్దరూ ముందు గదిలో మంచం మీద నానమ్మ పక్కలో చేరిపోయారు కథ చెప్పమని! జానకమ్మ వచ్చాక సుమతికి కొంత స్వస్తత కలిగింది. ఉదయం దేవునికి దీపం. కాయగూరలు తరగడం, సిరికి జడ వేయడం అవన్నీ ఆమె చేస్తుండబట్టి, కాస్త వంట దగ్గర సులువవుతుంది. అందరికీ టిఫిను కూడా చేయగలుగుతుంది. సాయంకాలం పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ల కోసం ఏదో ఒకటి తినడానికి ఉంటుంది. సుధ చెప్పిన విధంగా ఆ మూడు రోజులు కూడా పాటించినందుకు ఆవిడ కూడా ఇబ్బంది పడలేదు. చాలా రోజులకి, ఆఫీస్లో లంచ్ టైమ్లో సుధ సుమతిని కలిసింది. ‘‘హాయ్ సుమా! ఎలా ఉన్నావు. హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఏమిటి విశేషం?’’ కుర్చీ దగ్గర జరిపి కూర్చుంది సుమతి. ‘‘అక్కా!’’ సుధని అక్కా అని పిలుస్తుంది సుమతి. ‘‘అక్కా! నువ్వు చెప్పిన మర్నాడే అనుకోకుండా ఆవిడ్ని తేవల్సివచ్చింది. దేవుడే నీ నోట అనిపించాడేమో అనుకున్నాను’’ జరిగినవన్నీ చెప్పి,‘‘ఆవిడ వచ్చిన దగ్గర్నుంచీ, నాకు చాలా రిలీవ్ అయింది. ఇంటి గురించి, పిల్లల గురించి బెంగ తగ్గింది. తాళం సరిగ్గా వేశానో, గ్యాసు కట్టానో లేదో, పనమ్మాయి వచ్చిందో లేదో, పిల్లలు వచ్చి ఏం చేస్తున్నారో అని రకరకాల టెన్షన్లు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పిల్లలు కూడా వాళ్ల నానమ్మ దగ్గర బాగా చేరికయ్యారు. చిన్న చిన్న పద్యాలు, దేవుని కథలు అన్ని నేర్చుకుంటున్నారు. పనమ్మాయి కూడా వస్తే దగ్గరుండి అన్ని పనులూ చేయిస్తున్నారు. మిల్లుకి పంపి పిండిమర పట్టించడం, గ్రైండరుకి పంపి పప్పు రుబ్బించడం, వీధిలోకి మంచి కూరలు వస్తే కొని ఉంచటం, ఉదయం వాకింగ్కి వెళ్లినట్లు పిల్లలతో కలసివెళ్లి పూజకు పూలు తెచ్చుకోవటం, కాయగూరలు తరిగి ఇవ్వటం... ఇలా చాలా విషయాల్లో నాకు సాయంగా ఉంటున్నారు. నా కన్నా ఆమె వంట కూడా బాగా చేస్తారు. నువ్వు చెప్పిన సలహా భగవంతుడు తీర్చినందుకు మీ ఇద్దరికీ వందనాలు. ఇంకో గుడ్ న్యూస్. మా ఊళ్లో ఇల్లు అమ్మి, ఇక్కడ ఫ్లాట్ తీసుకోమనీ, తనూ ఇక్కడే ఉండిపోతాననీ అన్నారు.’’ సుమతి చేయి పట్టుకుని సుధ షేక్హాండ్ ఇస్తూ, ‘‘నువ్వు అదృష్టవంతురాలివే. ఈ రోజుల్లో అత్తగార్ని బయటపెట్టే కోడల్ని చూశాను గానీ, అత్తగార్ని పొగిడే కోడల్ని నిన్నే చూస్తున్నాను. నీమీద జలసీ కలుగుతుందే. మా అత్త లేనందుకు. ఇంతకీ మీ అత్తగారి వయసెంతే?’’ ‘‘డెభ్భయ్.’’ ‘‘ఆ..?!’’ ‘‘ఏమిటలా ఆశ్చర్యపోతున్నావ్?’’ ‘‘ఏమీ లేదు. ఈ వయసులో కూడా అంత యాక్టివ్గా ఉన్నారంటే గ్రేట్. అందుకే అంటారు, ఇంటికో పెద్దతోడు ఉండాలని. పిల్లలు కూడా ఆమె దగ్గర పడుకోవడం మంచిదే. ఎదుగుతున్న వయసులో అది మంచి పద్ధతి. చిన్నప్పుడు తల్లి దగ్గర, కొంత ఎదిగాక, వాళ్లకి వేరే పక్కలు అమర్చాలి. ఈ విధంగా మీ అత్తగారు మీకు ఫ్రీడమ్ కూడా కల్పిస్తున్నారన్నమాట. సంతోషం! ఒకసారి ఆవిణ్ని చూడాలి.’’ ‘‘తప్పకుండా. ఈ సండే ఉదయాన్నే వచ్చీ. లంచ్ అక్కడే చేద్దూగాని. మా అత్తగారి చేతివంట కూడా రుచి చూద్దువుగాని. మీవారిని, అదే బావగారిని కూడా తీసుకురా. నేను ఫోను చేసి పిలుస్తాను. తప్పకుండా రండి. సరేనా?’’ ‘‘ఓకే.’’ ‘‘ఆవిడ వచ్చిన దగ్గర్నుంచీ, నాకు చాలా రిలీవ్ అయింది. ఇంటి గురించి, పిల్లల గురించి బెంగ తగ్గింది. తాళం సరిగ్గా వేశానో, గ్యాసు కట్టానో లేదో, పనమ్మాయి వచ్చిందో లేదో, పిల్లలు వచ్చి ఏం చేస్తున్నారో అని రకరకాల టెన్షన్లు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పిల్లలు కూడా వాళ్ల నానమ్మ దగ్గర బాగా చేరికయ్యారు. చిన్న చిన్న పద్యాలు, దేవుని కథలు అన్ని నేర్చుకుంటున్నారు. -
ఎట్టకేలకు ఊరట
గజ్వేల్, న్యూస్లైన్: నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఐదు సబ్స్టేషన్ల నిర్మాణానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నిధుల కొరత కారణంగా ఈ ప్రక్రియ రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్న విషయం తెల్సిందే. తాజాగా రూ.10 కోట్ల నిధులు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశమున్నట్టు సమాచారం.నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్ మండలాల్లో 33/11కేవీ సబ్సేష్టన్లు 21 వరకు ఉన్నాయి. గజ్వేల్లో అదనంగా 132/33కేవీ సబ్స్టేషన్ కూడా ఉంది. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డితోపాటు మెదక్ జిల్లాకు విద్యుత్ సరఫరానందించే 400 కేవీ సబ్స్టేషన్ కూడా ఇక్కడే ఉంది. నియోజకవర్గంలో అధికార, అనధికారికం గా కలుపుకొని 22 వేలకుపైగా వ్యవసాయ కనెక్షన్లు ఉండగా సీజన్లో నిత్యం 100 మెగావాట్లకుపైగా విద్యుత్ అవసరముంటుంది. నాణ్యమైన విద్యుత్ను అవసరమైన స్థాయిలో అందించేందుకు 400 కేవీ సబ్స్టేషన్ ఉన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నియోజకవర్గంలోని గ్రామాల్లో తగినన్ని 33/ 11కేవీ, 132/33కేవీ సబ్స్టేషన్లు లేకపోవడం సమస్యగా మారింది. ఫలితంగా లో-ఓల్టేజీ సమస్యలు తలెత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వర్గల్ మండలం పాములపర్తి, సీతారామ్పల్లి, ములుగు మండలం క్షీరసాగర్, కొండపాక మండలం బందారం, జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్, తూప్రాన్ మండలం మల్కాపూర్, గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో కొత్తగా ఏడు 33/11కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటుకు రెండున్నరేళ్లక్రితం వర్గల్లో నిర్వహించిన రచ్చబండలో సీఎం అంగీకారం తెలిపారు. మొదటి విడతలో అప్పట్లోనే రెండింటికి మాత్రమే నిధులు మంజూరయ్యాయి. వర్గల్ మండలం పాములపర్తి, ములుగు మండలం క్షీరసాగర్లో 33/11కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటుకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. పాములపర్తిలో పనులు ముగింపు దశలో ఉండగా క్షీరసాగర్లో చురుగ్గా సాగుతున్నాయి. ఇక పెండింగ్లో ఉన్న మిగిలిన ఐదు సబ్స్టేషన్ల నిర్మాణానికి తాజాగా రూ.10 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని ఏపీసీపీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) డీఈ రాజశేఖర్ ‘న్యూస్లైన్’ మాట్లాడుతూ ధ్రువీకరించారు. మూడు నెలల్లోపు టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే గనుక రైతుల ఇబ్బందులు తీరనున్నాయి.