indian medical association
-
కోల్కతా: జూడాలకు మద్దతుగా.. ఐఎంఏ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశంలో సంచలనం రేపింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఏ) అక్టోబర్ 15వ తేదీన 24 గంటల దేశవ్యాప్త నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించింది.మరోవైపు.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకోగా.. ఇప్పటి వరకు ముగ్గురు డాక్టర్లు ఆసుపత్రి పాలయ్యారు. ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్(జేడీఎన్), మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్(ఎంఎస్ఎన్) నేతృత్వంలో ఈ దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టనున్నట్లు ఐఎంఏ పేర్కొంది.‘‘తమ న్యాయమైన డిమాండ్ల కోసం కోల్కతా జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తొమ్మిదో రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డాక్టర్ల డిమాండ్లను అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఐఎంఏ తెలిపింది.ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లు కలిశారని పేర్కొంది. వాళ్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇచ్చినట్లు తెలిపింది. ఐఎంఏ బెంగాల్ యూనిట్.. నిరాహార దీక్షలు చేపట్టిన జూనియర్ డాక్టర్ల సంఘాలకు సంఘీభావం ప్రకటించింది. దేశంలోని అన్ని ఆఫీస్ బేరర్లు, రెసిడెంట్ డాక్టర్లు కూడా నిరాహార దీక్షలో పాల్గొనాలని ఐఎంఏ కోరింది. ఇక.. నిరాహారదీక్ష/నిరసన వేదిక.. మెడికల్ కాలేజీ లేదా క్యాంపస్ల సమీపంలో ఆదర్శంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు.. పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలోని పనిచేసే డాక్టర్లు.. తాము అక్టోబర్ 14 నుంచి 48 గంటల పాటు పాక్షికంగా విధలు నిర్వహిస్తామని ప్రకటించారు. -
కోల్కతా కేసు.. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా మహిళా డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ను పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రద్దుచేసింది. ఘోష్ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బెంగాల్ విభాగం ఇటీవల డబ్ల్యూబీఎంసీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న మెడికల్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.కాగా, ఈ కేసులో సీబీఐ అధికారులు నిన్న(బుధవారం) కీలక విషయాలు వెల్లడించారు. హత్యాచారం సమయంలో కేసులో ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ ధరించిన దుస్తులను కోల్కతా పోలీసులు ఆలస్యంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. హత్య జరిగిన రోజు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సెమినార్హాల్లోకి నిందితుడు సంజయ్రాయ్ వస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా కేసులో సంజయ్రాయ్ ప్రధాన నిందితుడని హత్య జరిగిన మరుసటి రోజే స్పష్టమైంది. అయినా హత్య సమయంలో రాయ్ ధరించిన దుస్తులను సీజ్ చేసేందుకు కోల్కతాలోని తాలా పోలీస్స్టేషన్ పోలీసులకు రెండు రోజులు పట్టింది.ఇదీ చదవండి: నిందితుడు సంజయ్ది పశు ప్రవృత్తిఒకవేళ హత్యాచారం జరిగిన మరుటిరోజే రాయ్ దుస్తులను సీజ్ చేసి ఉంటే మరిన్ని కీలక ఆధారాలు లభించి ఉండేవని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్రాయ్తో పాటు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ఘోష్, తాలా మాజీ సీఐ అభిజిత్ మండల్ను సీబీఐ ఇప్పటివరకు అరెస్టు చేసింది. అయితే వీరు విచారణలో సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తెలిపింది. -
IMA: ‘న్యాయం కోర్టుకు వదిలేసి.. వెంటనే విధుల్లో చేరండి’
ఢిల్లీ: కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు , వైద్య సిబ్బంది, మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే పశ్చిమబెంగాల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తిరిగి విధుల్లో చేరాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది.‘ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ ఘటన దేశంలో ఉన్న ప్రతిఒక్కరి మనస్సును కదిలించింది. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను దేశం తన కుమార్తెగా భావించింది. అయితే మొత్తం మెడికల్ కమ్యూనిటీ సుప్రీంకోర్టుకు ఆదేశాలకు కట్టుబడి ఉండాలి. వెంటనే విధుల్లోకి చేరి.. వైద్యసేవలు ప్రారంభించండి. న్యాయం జరగటం గురించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వదిలేయండి. రోగుల సంరక్షణ, భద్రత వైద్య వృత్తి ప్రధాన విధి. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది. డాక్టర్ల రక్షణ కోసం జాతీయ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. డాక్టర్లు తమను నమ్మాలని.. వైద్యం నిలిపివేయవద్దని ఇప్పటికే సుప్రీం కోర్టు తెలియజేసింది’ అని లేఖలో పేర్కొంది.ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు.. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించి సాక్ష్యాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు, వైద్య సిబ్బందికి మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతూ వివిధ రాష్ట్రాల్లో డాక్టర్లు భారీగా నిరసనలు చేపట్టారు. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
IMA study: ఆత్మరక్షణకు ఆయుధాలు
దేశంలో మూడింట ఒక వంతు వైద్యులు రాత్రి షిఫ్టుల్లో అభద్రతతో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. దాంతో కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తీసుకెళ్లడం తప్పదన్న భావనకు కూడా వచ్చారట. ఐఎంఏ అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశమంతటా ఆందోళనకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి షిఫ్టుల్లో వైద్యుల భద్రతను అంచనా వేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆన్లైన్ సర్వే చేపట్టింది. 3,885 వైద్యుల వ్యక్తిగత ప్రతిస్పందనలతో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే అతి పెద్ద అధ్యయనమని ఐఎంఏ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు వారు. 61 శాతం ఇంటర్న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలున్నారు. కేరళ స్టేట్ ఐఎంఏ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్, ఆయన బృందం రూపొందించిన ఈ సర్వే ఫలితాలను ఐఎంఏ కేరళ మెడికల్ జర్నల్ అక్టోబర్ సంచికలో ప్రచురించనున్నారు. ఈ ఆన్లైన్ సర్వేను గూగుల్ ఫామ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు పంపారు. 24 గంటల్లో 3,885 స్పందనలు వచ్చాయని డాక్టర్ జయదేవన్ తెలిపారు. ‘‘వీరిలో చాలామంది దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్టుల్లో అరక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది, పరికరాలను మెరుగుపరచాల్సిన అవసరముంది’’ అని అధ్యయనం పేర్కొంది.అధ్యయన నివేదిక...కొన్ని ఎంబీబీఎస్ కోర్సుల్లో లింగ నిష్పత్తికి అనుగుణంగా మహిళలు 63 శాతం ఉన్నారు. తమకు భద్రత లేదని భావించే వారి నిష్పత్తి మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. 20–30 ఏళ్ల వయస్సున్న వైద్యులు అతి తక్కువ భద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఇంటర్న్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. నైట్ షిఫ్టుల్లో 45 శాతం మందికి డ్యూటీ రూమ్ కూడా అందుబాటులో లేదు. రద్దీ, ప్రైవసీ లేకపోవడం, డ్యూటీ గదులకు తాళాలు లేకపోవడమే గాక అవి సరిపోవడం లేదు. దాంతో వైద్యులు ప్రత్యామ్నాయ విశ్రాంతి ప్రాంతాలను వెదుక్కోవాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న డ్యూటీ గదుల్లో మూడింట ఒక వంతు అటాచ్డ్ బాత్రూములు లేవు. దాంతో ఆ అవసరాలకు వైద్యులు అర్ధరాత్రి వేళల్లో బయటికి వెళ్లాల్సి వస్తోంది. సగానికి పైగా (53 శాతం) ప్రాంతాల్లో డ్యూటీ రూము వార్డు/ క్యాజు వాలిటీకి దూరంగా ఉంది. ప్రధానంగా జూ నియర్ డాక్టర్లు ఇలాంటి హింసను అనుభ విస్తున్నారు. పాలన లేదా విధాన రూప కల్పనలో వీరికి ప్రమే యం ఉండటం లేదు.వైద్యుల సూచనలు...→ శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలి.→ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.→ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీపీఏ) అమలు చేయాలి.→ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.→ తాళాలతో కూడిన సురక్షిత డ్యూటీ గదుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.→ సురక్షితమైన, పరిశుభ్రమైన డ్యూటీ రూములు ఏర్పాటు చేయాలి.– ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో మెరుగుదల అవసరం.→ ఆస్పత్రుల్లో తగినంత వైద్య సిబ్బందిని నియమించాలి.→ వార్డులు ఇతర ప్రాంతాల్లో రద్దీ లేకుండా ఏర్పాట్లు చేయాలి.అదనపు సూచనలుమద్యం సేవించిన లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి క్యాజువాలిటీలో పని చేస్తున్న వైద్యులు మౌఖిక, శారీరక బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అత్యవసర గదుల్లో మహిళా వైద్యులకు అనవసరంగా తాకడం, అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పరిమిత సిబ్బంది, తక్కువ భద్రత ఉన్న చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోందని చాలా మంది వైద్యులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సమ్మెలో డాక్టర్లు.. దేశవ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలోని ఆర్జీకార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె ప్రారంభమైంది. యువ డాక్టర్ హత్యకు నిరసనగా ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది. ఇందులో భాగంగా శనివారం(ఆగస్టు17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో అవుట్పేషెంట్(ఓపీ) సేవలు ఆగిపోయాయి. మళ్లీ ఆదివారం ఉదయం 6 గంటల తర్వాతే డాక్టర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నంలో నిలిచిపోయిన వైద్య సేవలుజూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్నిరసనలో పాల్గొననున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులువిశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం.. మద్దతు పలకనున్న అన్ని ప్రజా సంఘాలు..అనంతపురంలో వైద్యుల సమ్మె..కలకత్తాలో జరిగిన యువ వైద్యురాలి అత్యాచారం, హత్య నిరసిస్తూ వైద్య సేవలు నిలిపివేసిన అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు. జీజీహెచ్లో అవుట్పేషెంట్ సేవల నిలిపివేత. విజయవాడలో ఆగిన ఓపీ సేవలుకోల్ కతాలో జూనియర్ డాక్టర్ దారుణహత్య ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల ఆందోళనవిజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లునేడు ఓపీ సేవలు పూర్తిగా నిలుపుదలఅత్యవసర సేవలకు మినహాయింపుజూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్కేంద్రం వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్తిరుపతిలో డాక్టర్ల నిరసన రుయా హాస్పిటల్ వద్ద ఏపి జూడాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్అసోషియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసనబహిరంగ ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్న జూడాలుతిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజి మెడికల్ విద్యార్థులు, జూడాలు ఆద్వర్యంలో నిరసనసీబీఐ దర్యాప్తు ముమ్మరంఆర్జీ కార్ ఆసుపత్రిలో యువ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులను ప్రశ్నించారు. తమ కుమార్తెపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో అదే ఆసుపత్రిలో పని చేస్తున్న కొందరు జూనియర్ వైద్యులు, ఇతర సీనియర్ వైద్యుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నామంటూ తల్లిదండ్రులు చెప్పినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు. కొన్ని పేర్లను సైతం బయటపెట్టారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో బాధితురాలితోపాటు కలిసి పనిచేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు తెలిపినట్లు స్పష్టంచేశారు. 30 మందిని పిలిపించి, విచారించాలని నిర్ణయించామని అధికారులు వివరించారు. ఆసుపత్రి వైద్యులను, పోలీసు అధికారులను ప్రశ్నించబోతున్నామని చెప్పారు. బాధితురాలు హత్యకు గురైన రోజు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి సమన్లు జారీ చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా, ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన గదిలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఏర్పాటైన విచారణ కమిటీ ఆరోపించింది. హత్య సంగతి బయటపడగానే ఆ గదిని పరిరక్షించాల్సి ఉండగా, కొందరు లోపలికి వెళ్లి శుభ్రం చేశారని పేర్కొంది. కోల్కతాలోని డాక్టర్ హత్యాకాండను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు శుక్రవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. -
మెడికల్ బోర్డు చీఫ్పై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: ఇండియన్ మెడికల్ అసోషియేషన్(IMA) అధ్యక్షుడు డా. ఆర్వీ అశోకన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తప్పు పట్టింది. భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో తాము అందిరికంటే ముందు ఉంటామని మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యవహరిస్తున్న తీరుపై ఓ ఇంటర్వ్యూలో అశోకన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అమానుల్లా బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే పతంజలి నకిలీ ప్రకటనల కేసులో అశోకన్ పిటిషన్గా ఉన్నారని గుర్తుచేసింది.‘మీ (అశోకన్) నుంచి మరింత బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు ఆశించాం.కోర్టు తీర్పుకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలా హఠాత్తుగా మారటానికి కారణం ఏంటీ?’అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.ఈ విషయంలో సుప్రీం కోర్టుకు అశోకన్ క్షమాపణలు తెలియజేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలపై మీ క్షమాపణలను ఒకవేళ కోర్టు అంగీకరిస్తే.. మిమ్మల్ని కించపరిచారని కోర్టు ఆశ్రయించారు. అలాంటప్పుడు మీకు ఎలాంటి పరీక్ష పెట్టాలి?’ అని కోర్టు నిలదీసింది. క్షమాపణల అఫిడవిట్పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బహిరంగంగా ఎందుకు క్షమాపణలు చెప్పలేదని ప్రశ్నించింది. ‘మీరు నిజంగా క్షమాపణలు చెప్పాలనుకుంటే మీ అఫిడవిట్ను ఎందుకు సరిదిద్దుకోలేదు? ఇంటర్వ్యూ అనంతరం మిమ్మల్ని మీరు ఏవింధంగా సరిదిద్దుకున్నారో చెప్పండి’అని ధర్మాసనం ప్రశ్నించింది.‘భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో మేము ముందుంటాము. కానీ స్వీయ నియంత్రణ ఉండాల్సిన సందర్భాలు ఉంటాయి. మీకు నియంత్రణ ఉన్నట్లు ఆ ఇంట ఇంటర్వ్యూలో మాకు కనిపించలేదు’అని జస్టిస్ హిమకోహ్లి అన్నారు. ‘న్యాయమూర్తులుగా మేము విమర్శలు ఎదుర్కొంటున్నా. మేము స్పందించము. ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా అహం ఉండదు. మేము ఉన్నతస్థానంలో ఉన్నాం. మేము చర్యలు తీసుకోవడానికి అర్హులం. చాలా అరుదుగా మాత్రమే చర్యలు తీసుకుంటాం’అని జస్టిస్ అమానుల్లా అన్నారు. ‘మీరు ఇలాంటి వ్యాఖ్యలతో కోర్టు గురించి ఏమి చెప్పలేరు. ఇలాంటి వ్యాఖ్యలే మీపైనే చేస్తే ఏం చేసేవారు’అని కోర్టు ప్రశ్నించింది. అశోకన్ సమర్పించిన అఫిడవిట్ను చాలా చిన్న, ఆలస్యంతో కూడినదిగా కోర్టు పేర్కొంది.ఈ విషయంలో ఉరట కల్పించాలని అశోకన్ తరుఫు న్యాయవాది కోరగా జస్టిస్ కోహ్లి స్పందింస్తూ. మీరు ప్రతిదీ చెప్పడానికి లేదు. అశోకన్ ట్రాప్లో చిక్కుకున్నారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఈ కేసుపై విచారణను సుప్రీం కోర్టు జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. ఇక.. పతంజలి నకిలీ ప్రకటనల కేసు విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణ ఇప్పటికే రెండుసార్లు క్షమాపణలు తెలిపినా కోర్టు తిరస్కరించింది. -
ఇది సరైన ఔషధమేనా?
జనరిక్ ఔషధాల వినియోగాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఖరీదైన కంపెనీ మందుల బదులు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే తప్పక రాయాలంటూ వైద్యులకు ఆదేశాలిచ్చింది. వైద్యం ఖరీదవుతున్న వేళ సామాన్యులకు సాంత్వననిచ్చే ఆదేశాలు స్వాగతించాల్సినవే. ఈ విషయంలో ఎన్ఎంసీ మార్గదర్శకాలివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. మునుపెప్పుడో ఇచ్చినా, వాటి అమలు అంతంత మాత్రమైంది. అందుకే, ఈసారి ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక్కడే తకరారు వచ్చింది. ఇది ‘పట్టాలు లేకుండా రైళ్ళు నడపడం లాంటిది’ అంటూ దేశంలోని వైద్యులకు అతి పెద్ద సంఘమైన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తప్పుపడుతోంది. ఈ విధాన నిర్ణయాలు తీసుకొనే ముందే జనరిక్ మందుల్ని ప్రోత్సహించి, నాణ్యమైనవి దొరికేలా చేయాల్సింది. అది చేయకుండా జరిమానా నిబంధనలు పెట్టడం ఏ మాత్రం సబబన్నది ఐఎంఏ వాదన. వెరసి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఆగస్ట్ మొదట్లో అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు ఇకపై మోతాదులో స్వల్పతేడా సైతం దుష్పరిణామాలకు దారి తీసే మందుల విషయంలో తప్ప, మిగతావన్నీ జనరిక్ మందులే సిఫార్సు చేయాలి. ఫలానా బ్రాండే వాడాలనకూడదు. తత్సమాన జనరిక్ ఔషధం పేరు రాయాలి. నిర్ణీత మోతాదులో, అనుమతించిన కాంబినేషన్లలోనే ఆచితూచి మందులు రాయాలి. స్పష్టంగా, అర్థమయ్యేలా, ఇంకా వీలుంటే ఇంగ్లీషులో పెద్ద బడి అక్షరాల్లో మందుల చీటీ రాయాలి. అర్థం కాని కోడిగీతల్లో రాస్తే గందరగోళ పడ్డ రోగులు పొరపాటుగా వేరే మందులు తీసుకొనే ప్రమాదం ఉందనేది అంతరార్థం. అలాగే రోగి పరిస్థితి, చికిత్స, ఫలితం లాంటివి డాక్టర్లు ట్విట్టర్ వగైరాల్లో చర్చించరాదంటూ రోగుల హక్కులు కాపాడేలా 11 అంశాలతో సోషల్ మీడియా మార్గదర్శకాలూ ఇచ్చింది. ఇవన్నీ మంచి మాటలే. బ్రాండెడ్ మందులతో పోలిస్తే, జనరిక్ ఔషధాలు సగటున 30 నుంచి 80 శాతం చౌకని ఓ లెక్క. అందువల్ల ఆ మేరకు ఆరోగ్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. సహజంగానే సామాన్యులకు అది పెద్ద ఊరట. అదే సమయంలో, డాక్టర్ల వాదన ఏమిటంటే – మిగిలే లాభం తక్కువ గనక అన్ని ఫార్మ సీలూ అన్నిరకాల జనరిక్ మందులనూ నిల్వ చేయవు. డాక్టర్ రాసిచ్చిన మందు లేనప్పుడు నిర్ణయం షాపువాడి చేతిలోకి వస్తుంది. అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా, ఎక్కువ లాభం మిగిలే మందులను అంగట్లో అంటగట్టే ప్రమాదం ఉంది. అంతేకాక, వైద్యులు తమ అనుభవం కొద్దీ రోగికి సరిపోయే మందు రాయడానికి వీలు లేకుండా పోతుందనీ, కంపెనీలను బట్టి జనరిక్ ఔషధాల నాణ్యతలోనూ తేడాలు తప్పవు గనక చికిత్స సమర్థంగా సాగదనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో నాణ్యతా ప్రమాణాల నియంత్రణ అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఆందోళనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నాణ్యతకు హామీ లేకపోతే, మందుల్ని వాడినా ప్రయోజనం ఉండదన్నది నిష్ఠురసత్యం. ఈ రకమైన చికిత్స, ఔషధ వినియోగంతో వ్యాధి తగ్గకుంటే రోగికి నష్టం, డాక్టర్ పేరుకూ దెబ్బ. ఇన్ని లోతుపాతులున్న అంశంపై నిర్ణయాలు ప్రకటించే ముందు సంబంధిత వర్గాలన్నిటితో సమగ్రంగా చర్చించడం తప్పక అవసరం. అదేమీ లేకుండా మార్గదర్శకా లను నోటిఫై చేశారని వైద్యవర్గాల ఆరోపణ. నిజానికి, దేశంలోని జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అది డాక్టర్లు, మందుల ఉత్పత్తిదార్లు, పాలకులు – అంతా అంగీకరించే మాటే. తయారయ్యే మందుల్లో అన్ని బ్యాచ్లకూ ప్రభుత్వం నాణ్యతా పరీక్ష చేయడం ఆచరణ సాధ్యం కాదు. కేవలం 0.1 శాతం మందులకే పరీక్షలు జరుగుతున్నాయట. గత మూడేళ్ళ కాలంలో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులన్నిటికీ జరిపిన పరీక్షల్లో దాదాపు 3 శాతం ప్రమాణాల మేరకు నాణ్యంగా లేవని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల తయారీలో నిర్దుష్టమైన విధానాల్ని అనుసరించడమే నాణ్యతను సాధించ డానికి మూల మంత్రం. పాలకులు అందుకు కట్టుదిట్టమైన విధివిధానాలు పెట్టాలి. ఆ మాటకొస్తే కొన్నేళ్ళ క్రితం దాకా జనరిక్స్ తయారీ సంస్థలకు కొన్ని టెస్ట్లు తప్పనిసరి కాదు. బ్రాండెడ్ మందులకు సమానంగా జనరిక్ మందు స్పందిస్తున్నట్టు నిర్ధరించే బయో–ఈక్వలెన్స్ పరీక్ష కానీ, నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఔషధ నాణ్యత ఏ మేరకు మారుతుందో చూసే స్టెబిలిటీ అధ్యయనాలు కానీ జరపకుండానే బండి నడిచింది. ఇప్పుడవి తప్పనిసరి చేశారు. కానీ, అవేవీ జరగకుండానే బయటకొచ్చిన జనరిక్స్ చాలానే ఇప్పటికీ విపణిలో ఉన్నట్టు ఔషధరంగ నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా నిబంధనల అమలును వాయిదా వేసి, అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి సంప్రతింపులు జరపాలన్నది వైద్య సంఘం డిమాండ్. వైద్యవృత్తికి సంబంధించి నియంత్రణాధికారాలున్న ఎన్ఎంసీ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యులు నిరంతరం తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మార్గదర్శకం ఆచరణలో ఏ మేరకు సాధ్యమో ఆలోచించాలి. పర్యవేక్షించే విధానమేమిటో చెప్పాలి. అన్నిటి కన్నా ముందు బ్రాండెడ్కు దీటుగా జనరిక్ ఔషధాలు పనిచేస్తాయనే భరోసా ప్రజల్లో కల్పించాలి. షాపుల్లో ఈ రకం ఔషధాలన్నీ పెద్దయెత్తున నిల్వ ఉండేలా, జన్ ఔషధీ కేంద్రాలు ఊరి నలుమూలలా నెలకొనేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా మార్గదర్శకాలు, జరిమానాలంటూ హడావిడి చేస్తే ఏం లాభం? పుండు ఒకచోట ఉంటే, మందు మరొకచోట రాసినట్టే! -
ప్రైవేట్ వైద్యులు వర్సెస్ ప్రభుత్వ చట్టం
ప్రజలకు ఆరోగ్య హక్కును పరిపూర్ణంగా అందించేందుకంటూ రాజస్తాన్లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరోగ్య హక్కు చట్టం (రైట్ టు హెల్త్) దుమారం రేపుతోంది. ఎమర్జెన్సీ సమయాల్లో రోగులు ముందుగా డబ్బులు చెల్లించకపోయినా ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు విధిగా చికిత్స చేసి తీరాలని చెబుతోంది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రైవేటు వైద్యులు మెరుపు సమ్మెలకు దిగారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెలో లక్ష మంది ప్రైవేటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2,500 ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్యులు రెండు వారాలుగా ఉధృతంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దాంతో అత్యవసర పరిస్థితుల్లోనూ చికిత్స అందించే వైద్యుల్లేక రాష్ట్రంలో రోగులు అల్లాడుతున్నారు. వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదని సీఎం గహ్లోత్ అంటున్నారు. 2018 ఎన్నికల హామీని నెరవేర్చామని చెబుతున్నారు. దేశంలో తొలిసారి రాజస్తానే ఇలాంటి చట్టం తెచ్చిందని ఆరోగ్య మంత్రి ప్రసాద్ లాల్ మీనా గర్వంగా ప్రకటించారు. మరోవైపు ప్రైవేటు డాక్టర్ల వాదన కూడా విని, వారి ఆందోళనలను సీఎం తీర్చాలని కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ హితవు పలికారు. అలా ఈ చట్టం అధికార కాంగ్రెస్లోనూ అంతర్గత పోరుకు దారి తీయొచ్చంటున్నారు. ఏమిటీ చట్టం? ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి అనారోగ్యంతో అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు డాక్టర్లు వైద్యం నిరాకరించకూడదు. ముందుగా డబ్బులు చెల్లించకపోయినా చికిత్స అందించి తీరాలి. చికిత్స పూర్తయ్యాక రోగి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదాలు, పాము కాట్లు, గర్భిణుల ప్రసవంతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్దేశించిన ఏ పరిస్థితులైనా ఎమర్జెన్సీ కిందకు వస్తాయి. వాటికి వైద్యం నిరాకరించే ఆస్పత్రి/వైద్యుడు తొలిసారి 10 వేలు జరిమానా చెల్లించాలి. ఆ తర్వాత 25 వేలు, అలా పెరుగుతూ పోతుంది. చట్టంలో స్పష్టత లేని విషయాలివే! ► ఎమర్జెన్సీ అంటే చట్టంలో సరిగ్గా వివరించలేదు. ఒక్కోసారి తలనొప్పి కూడా అత్యవసర పరిస్థితి కిందకు వచ్చి బ్రెయిన్ హెమరేజ్కి దారి తీయవచ్చు. ► ఎంత బిల్లయినా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా? ► వైద్య పరీక్షలకయ్యే ఖర్చుల సంగతేమిటి? కడుపు నొప్పి, తలనొప్పితో వచ్చి పరీక్షలన్నీ చేశాక తీరా అది ఎమర్జెన్సీ కాదని తేలితే ఆ వైద్య పరీక్షల ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందా? ► బిల్లు పంపిన ఎన్నాళ్లకు ప్రభుత్వం ఆ సొమ్ముల్ని తిరిగి చెల్లిస్తుంది? ప్రైవేటు ఆస్పత్రులు ఎన్నాళ్లు వేచి చూడాలి? ప్రైవేటు వైద్యుల నిరసనలెందుకు? ► ప్రైవేటు ఆస్పత్రులను పూర్తిగా రూపుమాపాలన్న ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని చేశారని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. వైద్యుల జీవించే హక్కును కాలదన్నేలా ఈ చట్టం ఉందని, ఎమర్జెన్సీ అంటూ రోగులు వస్తే వారి సమస్య ఎలాంటిదైనా చికిత్స తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన వల్ల ఇక కనీస విశ్రాంతి కూడా దొరకదని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్పత్రులు తమ బాధ్యతను చాకచక్యంగా ప్రైవేటు ఆస్పత్రులపై నెట్టేస్తున్నాయన్న వాదనలున్నాయి. రోగులు బిల్లులు చెల్లించలేని పక్షంలో వాటిని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందో చట్టంలో స్పష్టత లేదని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ చట్టం అమలు సరిగ్గా జరగకపోతే రోగులకు, డాక్టర్లకు మధ్య పరస్పరం అపనమ్మకం ఎక్కువైపోతుందని వైద్యుల్లో ఒక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘‘దీన్ని ఆరోగ్య హక్కు చట్టం అని పిలుస్తున్నారు. కానీ ఇందులో రోగుల హక్కుల కంటే వైద్యుని బాధ్యతలే ఎక్కువ! దీన్ని బలవంతంగా రుద్దితే వైద్యులు ఆర్థికంగా, వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు’’అని జైపూర్కు చెందిన డాక్టర్ బ్రూనో అన్నారు. వైద్యులకు వేధింపులు తప్పవా? ► ప్రైవేటు క్లినిక్లో డాక్టర్ చికిత్స ఇవ్వడానికి నిరాకరిస్తే అతనిపై రోగి న్యాయపరమైన చర్యలకు దిగొచ్చు. చట్టంలోని ఈ నిబంధన వల్ల తాము వేధింపులకి గురి కాక తప్పదని, అధికార యంత్రాంగం జోక్యం పెరిగిపోయి తప్పుడు కేసులు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రైవేటు డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ‘‘ఎవరికైనా చిన్న ప్రైవేటు క్లినిక్ ఉంటే ఎమర్జెన్సీ కింద 24 గంటలు తెరిచి ఉంచడం కష్టం. వైద్యులకు వ్యక్తిగత జీవితం ఉండదా? రోగులు కేసు పెడితే దాన్ని సవాల్ చేసే అవకాశం వైద్యులకు లేకుండా చేశారు. ఇది కచ్చితంగా వైద్యుల్ని వేధించేందుకే’’అని జైపూర్ అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అమిత్ యాదవ్ విమర్శించారు. ఉద్దేశం మంచిదే కానీ... ► రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్న వైద్యులు, ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు అందరికీ ఆరోగ్యం అందించాలనే ఆ చట్టం స్ఫూర్తికి తాము మద్దతుగానే నిలుస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా చట్టంలో ఎన్నో లొసుగులున్నాయని డాక్టర్ పార్థ శర్మ అన్నారు. వాటినన్నింటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే మంచి కంటే చెడే జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో మళ్లీ కేసులు పెరిగి లాక్డౌన్ విధిస్తారేమోననే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత వైద్య సమాఖ్యకు చెందిన డా.అనిల్ గోయల్ స్పష్టత ఇచ్చారు. కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసినా భారత్లో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదన్నారు అనిల్ గోయల్. దేశంలో ఇప్పటికే 95 శాతం మంది కరోనా టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మనలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువని, చైనాతో అసలు పోల్చుకోవద్దని స్పష్టం చేశారు. అయితే మళ్లీ కరోనా కనీస జాగ్రత్తలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అనిల్ చెప్పారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఫార్ములాపై మరోసారి దృష్టిసారించాలన్నారు. అందరూ మాస్కు ధరించాలని సూచించారు. చదవండి: Covid-19: దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో కరోనా పరీక్షలు.. -
ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సాక్షి, కామారెడ్డి: తెలంగాణవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డిలో జిల్లాలో ఇండియన్ మెడికల్ అసొసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మకు పూజలు చేశారు. ఆ తర్వాత సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. -
ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్
న్యూఢిల్లీ: లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల గత లైసెన్స్ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల లైసెన్స్ గడువు ముగిసింది. భారత్లోని ఎన్జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్సీఆర్ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది. -
ప్రభుకుమార్కు ‘నేషనల్ యంగ్ లీడర్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ చైర్మన్, ప్రముఖ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలిని ‘డాక్టర్ కేతన్ నేషనల్ యంగ్ లీడర్’ అవార్డు వరించింది. ప్రభుకుమార్ చేసిన సేవలకు గుర్తింపుగా ఐఎంఏ ఈ అవార్డును ప్రకటించింది. ఢిల్లీలో ఏఎంఏ హౌస్లో ఆదివారం ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి జాతీయ నేతలు, వైద్యరంగ ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారని అవార్డు నిర్వాహకుడు, ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్, ప్రధాన కార్యదర్శి జయేశ్ లేలే ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో నివాసముంటున్న ప్రభుకుమార్ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో అనేకమంది పేషెంట్ల కు వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా ప్రభుకుమార్ అనేకమంది మన్ననలు పొందారు. బంజారాహిల్స్ ఐఎంఏ ప్రెసిడెంట్, రాపా మెడికల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్న ఆయన.. వైద్య రత్న, వైద్య విభూషణ్, వైద్య శిరోమణి, బెస్ట్ డాక్టర్ అవార్డు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ వంటి అవార్డులతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. -
Andhra Pradesh: ఆరోగ్య సేవలు భేష్
డాబా గార్డెన్స్ (విశాఖ దక్షిణ): దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవలు భేషుగ్గా ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు జయలాల్ అన్నారు. విశాఖలోని అంకోశా గెస్ట్ హౌస్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్యుడికి వైద్యం అందివ్వాలన్న మంచి ఉద్దేశంతో వాడవాడలా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించడం శుభపరిణామమన్నారు. సీఎం జగన్ వైద్య సేవల విషయంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నారని కొనియాడారు. కోవిడ్ సేవలందిస్తూ మృతి చెందిన హెల్త్ వర్కర్లకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద రూ.50 లక్షలు ఇన్సూరెన్స్ ప్రకటించినప్పటికీ అమలు కావడం లేదన్నారు. కోవిడ్ బారిన పడి మరణించిన వైద్యులను గుర్తించి.. వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వైద్య సేవలందించే క్రమంలో అనుకోకుండా రోగి మృత్యువాత పడితే.. వైద్యులు, ఆస్పత్రులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్యులకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హోమియోపతిని ఐఎంఏ వ్యతిరేకించడం లేదన్నారు. మిక్సోపతిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఐఎంఏ గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేయిష్ లేలే, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
కరోనా సెకండ్ వేవ్: 624 మంది డాక్టర్లు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా జూన్ 2 వరకు 624 మంది వైద్యులు మృత్యువాత పడ్డారని ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎమ్ఏ) వెల్లడించింది. ఏపీలో 34 మంది, తెలంగాణలో 32 మంది వైద్యులు మృతి చెందారని తెలిపింది. ఈ మేరకు గురువారం సంబంధిత గణాంకాలను వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 109 మంది.. బిహార్లో 96 మంది, యూపీలో 79 మంది, రాజస్థాన్లో 43 మంది వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా 748 మంది మృతి చెందారని తెలిపింది. కాగా, దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ స్థిరంగా కొనసాగుతోంది. కేసుల నమోదు తగ్గకపోగా క్రమంగా పెరుగుతోంది. తాజాగా గురువారం లక్షా 34 వేల కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే రెండు వేలు అధికంగా నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,59,873 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా వాటిలో 1,34,154 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక మరణాలు 2,887 సంభవించాయి. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈమేరకు కరోనా బులెటిన్ను కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. చదవండి : Coronavirus: టీకాకు భయపడి డ్రమ్ వెనుక దాక్కున్న మహిళ -
బాబా సారీ చెప్పు.. లేకుంటే వెయ్యి కోట్లు ఇవ్వు
డెహ్రడూన్: కరోనా వైరస్ను నియంత్రించడంతో అల్లోపతి వైద్యం విఫలం చెందిందని యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లోపతి వైద్యంపై నమ్మకం లేదని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై భారత వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ అసోసియేషన్-ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి పరిహారంగా రూ.వెయ్యి కోట్లు డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ పరువు నష్టం దావా వేసింది. రూ.వెయ్యి చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్ విభాగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలపై రాందేవ్ బాబా క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేయకపోయినా.. 15 రోజుల్లో రాతపూర్వక క్షమాపణ చెప్పకపోయినా రాందేవ్ బాబా రూ.1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని ఐఎంఏ పరువు నష్టం దావా ఫిర్యాదులో పేర్కొంది. దీంతోపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్కు లేఖ రాసింది. రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
పతాంజలి సునీల్ మృతి.. మా మందులు వాడలేదు!
న్యూఢిల్లీ: అల్లోపతి ఓ పిచ్చిసైన్స్ అనే కామెంట్ల వీడియోతో దుమారం రేపిన రాందేవ్ బాబా.. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ నోటీసులతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆయన ఐఎంఏకు ఇరవై ఐదు ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు. ఇక పతాంజలి డెయిరీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ బన్సాల్ కరోనాతో చనిపోవడంతో తమ వైద్యవిధానంపై విమర్శలు రాకముందే ముందస్తు జాగ్రత్తగా పతాంజలి స్పందించింది. సునీల్కి జరిగిన కొవిడ్-19 ట్రీట్మెంట్లో పతాంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. యాభై ఏడేళ్ల వయసున్న సునీల్ బన్సాల్ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సునీల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన భార్య రాజస్థాన్ ఆరోగ్య విభాగంలో సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఆమే ఆయన ట్రీట్మెంట్ను దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు జరిగిన అల్లోపతిక్ ట్రీట్మెంట్లో పతాంజలి పాత్ర లేదు. కానీ, ఆయన బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశాం’’ అని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది రాజస్థాన్ పతాంజలి విభాగం. అయితే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ద్వారా పతాంజలి మరోసారి అల్లోపతి వైధ్యవిధానంపై సెటైర్ వేసినట్లయ్యింది. లక్ష కరోనిల్ బాబా రాందేవ్-ఐఎంఏ మధ్య కాంట్రవర్సీ నడుస్తున్నవేళ.. హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ట్రీట్మెంట్ కోసం లక్ష పతాంజలి కరోనిల్ కిట్లను కొనుగోలు చేసింది. ఈమేరకు పతాంజలి ఆయుర్వేద నుంచి కిట్లను కరోనా పేషెంట్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ ప్రకటించాడు. ఇందుకోసం సగం ఖర్చును పతాంజలి సంస్థ భరిస్తుందని, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి చెప్పారు. हरियाणा में कोविड मरीजों के बीच एक लाख पतंजलि की कोरोनिल किट मुफ्त बांटी जाएंगी । कोरोनिल का आधा खर्च पतंजलि ने और आधा हरियाणा सरकार के कोविड राहत कोष ने वहन किया है। — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 24, 2021 -
ఆ రోగాలకు ఫార్మా ఇండస్ట్రీలో శాశ్వత పరిష్కారం ఉందా?
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్య విధానం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి భారీ విమర్శలు మూటగట్టుకున్న తర్వాత క్షమాపణలు చెప్పిన యోగా గురు రాందేవ్ బాబా సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) 25 ప్రశ్నలు సంధించారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటివాటికి శాశ్వత పరిష్కారం అల్లోపతి వద్ద ఉందా అంటూ ప్రారంభించారు. అల్లోపతికి కేవలం 200 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందన్నారు. థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఆస్తమా వంటి రోగాలకు ఫార్మా ఇండస్ట్రీలో శాశ్వత పరిష్కారం ఉందా అని ప్రశ్నించారు. కొలెస్టరాల్కు, మైగ్రేన్కు, అమ్నీసియాకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని చికిత్స ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గుండెలో ఏర్పడే రంధ్రాలకు నొప్పి లేకుండా చికిత్స చేయగలరా అని అడిగారు. వయస్సును వెనక్కు మళ్లేలా చేసి హీమోగ్లోబిన్ను పెంచే చికిత్స ఉందా అన్నారు. అల్లోపతి అన్నింటికి సమాధానం ఇస్తే డాక్టర్లకు ఏ రోగమూ రాకూడదని అభిప్రాయపడ్డారు. -
సెకండ్ వేవ్లో 400 మందికి పైగా వైద్యులు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రపంచాన్ని వణికిస్తోంది. మరో వైపు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా..అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలను అందిస్తున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి కోవిడ్ బాధితులను రక్షిస్తున్న డాక్టర్లు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్లో కోవిడ్ సోకి 420 మందికిపైగా వైద్యులు కన్నుమూసినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ ఒక్క వారంలోనే కరోనావైరస్ కారణంగా 270 మంది వైద్యులు మరణించినట్లు తెలిపింది. వీరిలో 100 మందికిపైగా ఢిల్లీకి చెందిన వారేనని పేర్కొంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం..కరోనా ఫస్ట్ వేవ్లో 748 మంది వైద్యులు మరణించారు. ఐఎంఎఫ్ దాదాపు 3.35 లక్షల మంది సభ్యుల సమాచారాన్ని మాత్రమే రికార్డు చేసి ఉంచుతుంది. అయితే దేశంలో 12 లక్షలకు పైగా వైద్యులు ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,57,299 కరోనా కేసులు నమోదైనట్లు, 4,194 మంది ప్రాణాలు కోల్పోయిట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత నెల దేశరాజధాని ఢిల్లీ కరోనాతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ తరువాత అత్యధికంగా బీహార్లో 96 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో 41 మంది, గుజరాత్లో 31 మంది, తెలంగాణలో 20 మంది, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో 16 మంది చొప్పున చనిపోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. (చదవండి: వైరల్: వృద్ధుడి స్టెప్పులకు..నెటిజన్ల కళ్లు జిగేల్) -
ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డా. కె.కె.అగర్వాల్ కన్నుమూత
ఢిల్లీ: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు డా. కె.కె.అగర్వాల్(62) కన్నుమూశారు. ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స కోసం కె.కె.అగర్వాల్ ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. డాక్టర్ అగర్వాల్ హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు హెడ్గా పని చేసి.. కార్డియాలజిస్ట్గా సేవలు అందించారు. ఆయన 2005లో డాక్టర్ బీసీ రాయ్ అవార్డు, 2010లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. pic.twitter.com/uy7JzOyGWK — Dr K K Aggarwal (@DrKKAggarwal) May 17, 2021 చదవండి: కరోనా: నేడు ప్రధాని మోదీ సమీక్ష -
దేశవ్యాప్త లాక్డౌన్ విధించండి: ఐఎంఏ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఘాటుగా స్పందించింది. కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొంది. తాము కేంద్రానికి అందించిన సలహాలు, సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయం అర్థమైందని వెల్లడించింది. రాత్రిపూట కర్ఫ్యూల వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ అస్తవ్యస్తంగా ఉందని, 18 ఏళ్లకు పైబడినవారికి ఎక్కడైనా వ్యాక్సిన్ అందుతోందా? అని నిలదీసింది. కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్ ప్రక్రియ లోపభూయిష్టమని విమర్శించింది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే వ్యాక్సినేషన్ ముందుకు సాగడంలేదని ఆరోపించింది. కొవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఇకనైనా మేల్కోవాలని, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గమని ఐఎంఏ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. దేశం మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి గొలుసు విచ్ఛిన్నం అవుతుందని, అంతేకాకుండా, కరోనా రోగులకు నిర్విరామంగా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కొంతమేర ఉపశమనం లభిస్తుందని ఐఎంఏ అభిప్రాయపడింది. #PMOIndia #NITIAayog #LargestVaccineDrive #IMAIndiaOrg IMA demands the health ministry wake up from its slumber and responds to mitigate the growing challenges of the pandemic. pic.twitter.com/7OxKgLhi9Q — Indian Medical Association (@IMAIndiaOrg) May 8, 2021 -
కొరొనిల్’ ప్రమోషన్పై దుమారం.. కేంద్రమంత్రిపై ఆగ్రహం
న్యూఢిల్లీ: పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్దేవ్ బాబా రూపొందించిన కరోనా మందు ‘కొరొనిల్’ ప్రమోషన్పై భారత వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ ఆర్గనైజేషన్- ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేని మందుపై ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించింది. రామ్దేవ్ బాబా మందుపై కేంద్ర మంత్రులు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టింది. తప్పుడు, అశాస్త్రీయ మందును ప్రజల ముందుకు ఎలా తీసుకొస్తారని నిలదీసింది. కరోనాకు విరుగుడుగా పతాంజలి సంస్థ రూపొందించిన ‘కొరొనిల్’ మందును ఈనెల 19వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో రామ్దేవ్ బాబా విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్గా తమ మందుకు సర్టిఫికెట్ ఉందని, దీంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికెట్ ఉందని రామ్దేవ్ బాబా ప్రకటించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఏ సర్టిఫికెట్ జారీ చేయలేదని ట్విటర్లో తెలిపింది. అయితే దీనిపై సోమవారం భారత వైద్యుల సంఘం స్పందించింది. కొరొనిల్ మందును తాము ఎలాంటి పరీక్షలు చేయలేదని భారత వైద్య సంఘం (ఐఎంఏ) తెలిపింది. తాము పరీక్షించని మందుకు ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్గా ఎలా గుర్తించినట్లు రామ్దేవ్ బాబా చెప్పుకుంటారని ఐఎంఏ ప్రశ్నించింది. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ముందు పచ్చి అబద్ధాలు రామ్దేవ్ బాబా చెప్పారని ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రామ్దేవ్ బాబా చెప్పిన ప్రకటనపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పందించకుండా ఎలా ఉంటారని ప్రశ్నించింది. కరోనాను ఏ సంప్రదాయక మందుకు తాము సర్టిఫికెట్ జారీ చేయలేదని ఈ సందర్భంగా ఐఎంఏ స్పష్టం చేసింది. వైద్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దీన్ని ఎలా సమర్ధిస్తారని మండిపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తిరస్కరించిన మందును ఒక వైద్యుడిగా ఉన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఎలా సమర్ధించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రామ్దేవ్ తీసుకొచ్చిన ఆ మందుకు అంత సామర్థ్యం ఉంటే రూ.32వేల కోట్లు ఖర్చు చేసి ఎందుకు వ్యాక్సినేషన్ చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ను ఐఎంఏ డిమాండ్ చేసింది. అయితే రామ్దేవ్ బాబా గతేడాదే ఈ మందును తీసుకువచ్చారు. అయితే ఈ మందు కరోనా నివారణకు పనికి రాదని, కేవలం రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేసే మందుగా అమ్మాలని అప్పట్లో ఆయుశ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. The Indian Medical Association issues a strongly worded statement on the Patanjali shenanigans and calls it a shame on the behalf of the Health Minister. pic.twitter.com/0kAHBkycGI — Abhishek Baxi (@baxiabhishek) February 22, 2021 -
పీజీ ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చు
న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై శస్త్రచికిత్సలు(సర్జరీలు) చేయొచ్చు. ఇందుకోసం వారు శిక్షణ పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఆధునిక వైద్యశాస్త్ర రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీజీ ఆయుర్వేద వైద్యులు చేయాల్సిన 39 సాధారణ శస్త్రచికిత్స పద్ధతులను ఐఐసీఎం తన జాబితాలో పేర్కొంది. ఇందులో 19 పద్ధతులు విధానాలు కన్ను, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినవే ఉన్నాయి. ఇందుకోసం ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్(పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద మెడిసిన్)–2016 నిబంధనలను సైతం కేంద్రం సవరించింది. తమ గెజిట్ నోటిఫికేషన్పై విమర్శలు వస్తుండడంతో ఆయుష్ శాఖ సెక్రెటరీ వైద్య రాజేశ్ కొటెచా స్పందించారు. ఇందులో కొత్త నిర్ణయం ఏదీ లేదని, నిబంధనలను ఉల్లంఘించడం లేదని చెప్పారు. పీజీ ఆయుర్వేద వైద్యులందరినీ సర్జరీలు చేయడానికి అనుమతించడం లేదన్నారు. కేవలం శల్య, శలక్య విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించిన వారికే అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయుర్వేద సంస్థల్లో 20 ఏళ్లుగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని సీసీఐఎం బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ వైద్యజయంత్ దేవ్పూజారి తెలిపారు. తమ నోటిఫికేషన్తో వాటికి చట్టబద్ధ గుర్తింపు లభిస్తుందన్నారు. అది తిరోగమన చర్య: ఐఎంఏ సీసీఐఎం అనుమతిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది తిరోగమన చర్య అని స్పష్టం చేసింది. సదరు ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆధునిక వైద్యానికి చెందిన శస్త్రచికిత్స పద్ధతులు కాకుండా పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా సొంత శస్త్రచికిత్స విధానాలను రూపొందించుకోవాలని ఐఐసీఎంకు ఐఎంఏ సూచించింది. భారతీయ వైద్య శాస్త్రానికి సంబంధించిన కాలేజీల్లో ఆధునిక వైద్య శాస్త్ర వైద్యులను నియమించరాదని ఐఎంఏ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వేర్వేరు వైద్య శాస్త్రాలను కలిపేయడం మంచి పద్ధతి కాదని తేల్చిచెప్పింది. అది ముమ్మాటికీ తిరోగమని చర్య అంటూ ఐఎంఏ ఒక ప్రకటన విడుదల చేసింది. -
కరోనాతో 500 మంది వైద్యులు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు కనీసం 500 మంది వైద్యులు కరోనా వైరస్ (కోవిడ్ -19) సోకి మరణించారని శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తెలిపింది. వీరిలో సగం మందికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. "కోవిడ్ -19 రోగులకు చికిత్స అందిస్తున్న 515 మంది వైద్యులు ఇప్పటి వరకు అమరవీరులయ్యారు. వీరందరూ అల్లోపతి డాక్టర్లు, వీటిని వివిధ ఐఎంఏ శాఖల ద్వారా గుర్తించాం. దీని కోసం దేశవ్యాప్తంగా 1,746 శాఖలు పనిచేస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది’ అని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ అన్నారు. ఐఎంఏ డేటాబేస్ ప్రకారం, డాక్టర్ రోగి నిష్పత్తి 1: 194 గా ఉంది. మరణించిన వారిలో మెజారిటీ నంబర్(201) వైద్యులు 60 నుంచి 70 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. తరువాత 50 నుంచి 60 సంవత్సరాల వయస్సులో 171 మంది మరణించారు. 70 ఏళ్లు పైబడిన వారు 66 మంది ఉండగా, 59 మంది వైద్యులు 35 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. 18 మంది వైద్యులు 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు ఉన్నారు. విధి నిర్వహణలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలపడానికి తమ వద్ద తగినంత డేటా లేదని కేంద్రం తెలిపింది. ప్రజారోగ్యం, ఆస్పత్రులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, అందువల్ల కేంద్రం అటువంటి డేటా బేస్ను నిర్వహించలేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఇటీవల పార్లమెంటులో వెల్లడించిన సంగతి తెలిసిందే. కేవలం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీలో భాగంగా ఈ మహమ్మరి సమయంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ప్రభుత్వ భీమా పథకం కింద పరిహారం చెల్లించే సంఖ్యను మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తుంది అని ఆయన తెలిపారు. డేటాను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. ఫ్రంట్లైన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులకు 50 లక్షల బీమా ఉందని, దీన్ని మార్చి 2021 వరకు పొడిగించామని ఆయన తెలిపారు. అయితే కరోనా బారినపడి మృతి చెందిన వైద్యుల వివరాల విషయంలో కేంద్రం తన బాధ్యత లేదంటూ చేతులు ఎలా దులుపుకుంటుందని ఐఎంఏ డాక్టర్ శర్మ సూటిగా ప్రశ్నించారు. కోవిడ్ పరీక్ష నిర్వహించడానికి ఆధార్ను అడిగినప్పుడు ఆ డేటా కేంద్రం దగ్గర ఎందుకు ఉండదని నిలదీశారు. చదవండి: కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు -
వైద్యుల పట్ల దృక్పథం మారాలి
సాక్షి, హైదరాబాద్: వైద్యుల పట్ల ప్రజల దృ క్పథంలో మార్పు రావాలని, వారి సేవలు, ఇబ్బందులను ప్రజలు గుర్తించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. వైద్యులపై రోగుల బంధువులు దాడులకు పాల్పడుతుండడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. వైద్యులకు రక్షణ కల్పించడంతో పాటు ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించడానికి కేంద్రం ఇటీవల కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆన్లైన్ ద్వారా నిర్వహించిన అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీ స్ కాన్వొకేషన్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు. వైద్యులు సమర్థవంతమైన సేవలు అందిస్తుండడంతో దేశంలో కరో నా మరణాల రేటు (సీఎఫ్ఆర్) చాలా తక్కు వగా ఉందన్నారు. కరోనా సోకిన వైద్యులు, వైద్య సిబ్బందిలో మరణాల రేటు 15 శాతం ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు రాజన్ శర్మ, సెక్రటరీ జనరల్ అశోకన్, ఐఎంఏ వైస్ చైర్మ న్ అష్రఫ్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
మోంగా ప్రకటనతో ఐఎంఏకు సంబంధం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కోవిడ్-19 సామూహిక వ్యాప్తి దశకు చేరిందనే విషయంలో స్పష్టత కొరవడింది. వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చైర్మన్ వీకే మోంగా ఆదివారం వెల్లడించారు. ఎవరికి ఎలా వైరస్ సోకుతున్నదనేది అంతుచిక్కట్లేదని ఆయన పేర్కొన్నారు. మోంగా ప్రకటనపై ఐఎంఏలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో గందరగోళం నెలకొంది. మోంగా ప్రకటనను ఐఎంఏ అధ్యక్షుడు, కార్యదర్శి ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మోంగా వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమని ఐఎంఏకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కొన్ని నగరాలు, పట్టణాల్లోనే కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్నాయని ఐఎంఏ కార్యవర్గం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశలో లేదని తెలిపింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 40, 421 తాజా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వైరస్ బారినపడి ఒక్కరోజులోనే 681 మంది మరణించారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 3,90,000 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చదవండి : కరోనా @11 లక్షలు -
సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 పరిస్థితి తీవ్రంగా ఉందనీ, కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలిపింది. ‘దేశంలో ప్రతి రోజూ 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఈ వైరస్ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఇది సామాజిక వ్యాప్తికి సంకేతం’అని ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ వీకే మోంగా అన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్ను అదుపు చేయడం చాలా కష్టమైన విషయమన్నారు. (సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ) దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలు కాలేదంటూ కేంద్రం చెబుతున్న నేపథ్యంలో ఐఎంఏ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతానికి ఢిల్లీలో కట్టడి చేసినా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి మాటేమిటి? అని ఆయన అన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సాయం తీసుకుని పరిస్థితిని నియంత్రించాలన్నారు. ‘వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరల్ వ్యాధిని కట్టడి చేయడానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, ఈ వ్యాధి సోకిన 70 శాతం మంది రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం, రెండోది, మిగతా 30 శాతం మందికి రోగ నిరోధక శక్తిని కల్పించడం’అని డాక్టర్ మోంగా తెలిపారు. (కరోనా చికిత్సల్లో రోబో) -
వైద్యులపై దాడులకు నిరసనగా బ్లాక్ డే
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అంటువ్యాధిలా అందరినీ కబలిస్తోంది. అయినా ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా రోగులకు డాక్టర్లు సేవలందిస్తున్నారు. అయినా కొందరు మాత్రం వైద్యులపై దాడులకు పాల్పడుతున్నారు. వైద్యులపై ఉమ్మివేస్తూ, దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈనెల 23న బ్లాక్డే పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్ణయించింది. దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22 రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలపాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ, గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్వీ అశోకన్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం డాక్టర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని సూచించారు. వైద్యులకు రక్షణగా ఓ చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. #IMA demands Special Central Law Against Violence on Doctor’s & Declares White Alert to the nation on 22.04.2020 & Black Day on 23.04.2020. pic.twitter.com/inFOSiJusI — Indian Medical Association (@IMAIndiaOrg) April 20, 2020 తమిళనాడులో కరోనా కారణంగా ఓ వైద్యుడు చనిపోతే అతని అంత్యక్రియలకు స్థానికులు అడ్డుతగిలారు. అంతేకాకుండా వారిపై రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ‘కరోనా కట్టడికోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడటం అన్నది అత్యంత హేయమైన చర్య. వారి శ్రమను గుర్తించకుండా వారిపై దాడులకు పాల్పడుతున్నారు. సరే మేం కూడా ఇంట్లో కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అపోహలు సృష్టిస్తూ దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేద’ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. -
ప్రభుత్వానికి డాక్టర్ల హెచ్చరిక!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైనా ప్రాణాలను కాపాడే డాక్టర్లు మాత్రం తమ ప్రాణాలు పణంగా పెట్టి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల డాక్టర్లపై , వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. దీన్ని ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ చాలా సీరియస్గా పరిగణిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం వైద్యలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామంటూ హెచ్చరిస్తున్న కొందరిలో మార్పు రావడం లేదు. (గాంధీలో కరోనా మరణం.. వైద్యులపై బంధువుల దాడి) డాక్టర్లపై దాడులు చేస్తే చర్యలు తీసుకొనే చట్టాన్ని ప్రభుత్వం సరిగా అమలు చేయడంలేదని భావించిన ఐయమ్ఏ ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఏప్రిల్ 23 వతేదీనీ బ్లాక్డే గా ప్రకటిస్తామని హెచ్చరించింది. దీనికి సంబంధించి సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నోటీసులు ఇచ్చింది. ‘మాకు సురక్షితమైన పని ప్రదేశాలు కావాలి. మనపై జరుగుతున్న దాడులు, హింస వెంటనే ఆపేయాలి. ముందస్తు హెచ్చరికగా వైద్యులు అందరూ ఏప్రిల్ 22 వతేదీ రాత్రి 9 గంటలకు మా పై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా క్యాండెల్ను వెలిగిస్తారు ’ అని ఐయమ్ఏ పేర్కొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోకపోతే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన, సామాజిక దూరం విషయంలో పాటించాల్సిన నియమాలు, వైద్యలపై జరుతున్న దాడుల గురించి రిపోర్టు ఇవ్వాల్సిందిగా కేంద్రం ఆరుగురు మంత్రులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. (జమాత్ సభ్యులపై అస్త్రం ప్రయోగించిన యోగి) -
కరోనా: ఇక్కడి పరిస్థితుల కారణంగా తక్కువ వ్యాప్తి
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్పై(కోవిడ్ 19) అవగాహన కల్పిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంగళవారం పోస్టర్ను విడుదల చేసింది. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. ఏపీలోని తిరుపతిలో వ్యాధి నిర్దారణ కేంద్రం ఉందని, కరోనా వైరస్ ఇప్పటివరకు వచ్చిన వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి కాదని తెలిపారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందన్నారు. కరోనా వ్యాధి కేవలం రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఎఫెక్ట్ అవుతుందని, బయట దేశాలలో ఉండి వచ్చిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (కరోనా అలర్ట్: ‘మాస్కులకు ఆర్డర్లు ఇస్తే మంచిది’) కరోనా వైరస్ తో లక్ష మంది ప్రజలు బాధ పడుతున్నారని, ఇందులో 25 శాతం మంది చనిపోవడం జరిగిందన్నారు. ఇది అంటువ్యాధిగా నిర్దారణ చేయటంతో ఐఎంఏ తరుపున అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వయసులో పెద్ద వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దగ్గిన, తుమ్మిన చేతులు అడ్డుపెట్టుకోవటం.. మాస్క్ లు ధరించటంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణ జలుబు దగ్గు వల్ల ఇబ్బంది ఉండదని, ఒక వారం పదిరోజులు దగ్గు జలుబుతో బాధ పడుతున్న వారు బయట జన సమూహాలు ఉన్న ప్రదేశాలకి వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు. (కరోనాతో మరో వైద్యుడు మృతి) -
డాక్టర్పై దాడికి పాల్పడ్డ 21 మంది
-
డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో దారుణం..!
గువాహటి : అసోంలోని టియోక్ టీ ఎస్టేట్లో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో సోమ్రా మాఝి (33) అనే మహిళా కార్మికురాలు మృతి చెందింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు సదరు మహిళ మృతికి డాక్టరే కారణమంటూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. డాక్టర్ దేవెన్ దత్తా (73) ఆస్పత్రికి చేరుకోగానే దాదాపు 250 మంది మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. అయితే, టీతోటలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొందని తెలుసుకున్న పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. కానీ, అప్పటికే సమయం మించిపోయింది. మూక దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా డాక్టర్ దేవెన్ దత్తా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈ ఘటన గత శనివారం జోర్హాత్ జిల్లాలో చోటుచేసుకుంది. డాక్టర్పై దాడికి పాల్పడ్డ 21 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. డాక్టర్ దేవెన్ దత్తాపై జరిగిన అమానుష దాడితో వైద్య సంఘాలు భగ్గుమన్నాయి. రిటైర్ అయ్యాక కూడా ప్రజలకు సేవ చేస్తున్న సీనియర్ డాక్టర్కు ఇలాంటి గతి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ మంగళవారం బంద్కు పిలుపునిచ్చింది. అత్యవసర సేవల్ని కూడా నిలుపుదల చేస్తున్నామని ప్రకటించింది. -
17న వైద్యుల దేశవ్యాప్త సమ్మె
న్యూఢిల్లీ/కోల్కతా: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మూడురోజుల పాటు జరిగే వైద్యుల దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలను శుక్రవారం ప్రారంభించింది. పశ్చిమబెంగాల్లోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ ఆందోళనలకు దిగిన వైద్యులకు సంఘీభావంగా ఈ ప్రదర్శనలు చేపట్టింది. అదేవిధంగా ఈ నెల 17న దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మెకు పిలుపునిచ్చింది. అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అవుట్ పేషంట్ విభాగాలతో పాటు అత్యవసరం కాని వైద్య సేవలన్నిటినీ 24 గంటల పాటు నిలిపివేయాలని సూచించింది. అయితే అత్యవసర, క్యాజువాలిటీ సేవలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఆస్పత్రుల్లో వైద్యులపై దాడులను నిరోధించేందుకు కేంద్ర చట్టం తేవాలనే తమ డిమాండ్ను పునరుద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఐఎంఏ లేఖ రాసింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా వైద్యులంతా నల్లబ్యాడ్జీలు ధరించాలని, ధర్నాలు, శాంతియాత్రలు నిర్వహించాలని సూచించింది. కోల్కతాలోని ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాలలో డాక్టర్ పరిబాహ ముఖర్జీ తదితరులపై దాడిని ఖండిస్తున్నట్లు ఐఎంఏ సెక్రటరీ జనరల్ ఆర్వీ అశోకన్ చెప్పారు. నిందితులపై బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, రెసిడెంట్ డాక్టర్ల చట్టబద్ధమైన డిమాండ్లన్నిటినీ బేషరతుగా అంగీకరించాలని కోరారు. నాలుగో రోజుకు చేరిన సమ్మె ప్రభుత్వాసుపత్రుల్లో తమకు భద్రత కల్పించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు బెంగాల్ జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంఘీభావంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన 100 మందికి పైగా సీనియర్ డాక్టర్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. కాగా వైద్యుల సమ్మెకు ముఖ్యమంత్రి మమత మేనల్లుడు, వైద్య విద్యార్థి కూడా అయిన అబేష్ బెనర్జీ మద్దతుగా నిలవడం విశేషం. బెంగాలీ నేర్చుకోవాల్సిందే కాంచ్రాపార: పశ్చిమ బెంగాల్లో నివసిస్తున్నవారు ఎవరైనా బెంగాలీలో మాట్లాడటం నేర్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా కాంచ్రాపార సభలో ఆమె మాట్లాడారు. ‘మనం బంగ్లా భాషను ముందుకు తీసుకురావాలి. ఢిల్లీ వెళ్లినప్పుడు హిందీ మాట్లాడతాం. నేను అలాగే చేస్తా. తమిళనాడు వెళ్లినప్పుడు నాకు తమిళ భాష తెలియదుగానీ కొన్ని పదాలు తెలుసు. అలాగే మీరు బెంగాల్వస్తే బెంగాలీలో మాట్లాడాల్సిందే’ అని అన్నారు. సమ్మె వెనుక బయటి వ్యక్తులు రాష్ట్రంలో వైద్యుల సమ్మె వెనుక కొందరు బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని మమత అన్నారు. తాను గురువారం ఎస్ఎస్కేఎం ఆస్పత్రిని సందర్శించినప్పుడు ప్రభుత్వానికి, తనకు వ్యతిరేకంగా నినదిస్తున్నవారిలో కొందరు బయటివ్యక్తులను తాను చూశానని చెప్పారు. కొందరిలా వాస్తవాలు నిర్ధారించుకోకుండా తాను మాట్లాడనని ఆస్పత్రిని సందర్శించిన సినీ నిర్మాత అపర్ణాసేన్ను ఉద్దేశించి మమత వ్యాఖ్యలు చేశారు. -
దాడులకు నిరసిస్తూ 17న వైద్యసేవలు నిలిపేస్తాం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి తెలిపారు. వైద్యులపై దాడులకు నిరసనగా శుక్రవారం కోఠిలోని ఐఎంఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వైద్యులకు భద్రత కల్పించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ ప్రతాప్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల 17న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేసి భారత్బంద్ను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా వైద్యులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు నిలిపివేసి వైద్యుల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. కోల్కతాలో వైద్యుడిపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైద్యులు 99 శాతం సేవాభావంతో పనిచేస్తారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని గుర్తించాలన్నారు. అలాగే వైద్యులపై దాడిచేసినవారిపై శిక్షలు కఠినంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెక్రటరీ జనరల్ డాక్టర్ రవిశంకర్, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సంజీవ్సింగ్ యాదవ్, డాక్టర్ రఘురామ్, డాక్టర్ రంగనాథ్, డాక్టర్ ప్రభావతి, డాక్టర్ దయాళ్సింగ్తో పాటు పెద్ద ఎత్తున వైద్యులు పాల్గొన్నారు. -
17న దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె
సాక్షి, న్యూఢిల్లీ : కోల్కతాలో వైద్యులపై దాడికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు ఐఎంఏ సంఘీభావంగా ఈనెల 17న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్టు ప్రకటించింది. మరోవైపు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త నిరసనలను ప్రారంభించింది. ఈనెల 17న ఔట్పేషెంట్ విభాగాలతో పాటు అత్యవసర మినహా అన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఐఎంఏ ప్రకటించింది. అయితే ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక ఆస్పత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. మరోవైపు బెంగాల్లో జూనియర్ డాక్టర్ల ఆందోళనను విరమింపచేసేందుకు చొరవ చూపాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోల్కతా హైకోర్టు కోరింది. వైద్యుల ఆందోళనతో నెలకొన్న ప్రతిష్టంభనేను తొలగించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారో వారం రోజుల్లోగా వెల్లడించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి బంధువులు జరిపిన దాడిలో ఇద్దరు వైద్యులు తీవ్రంగా గాయపడిన ఘటనకు నిరసనగా పశ్చిమ బెంగాల్లో వైద్యులు గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. -
గ్లోబల్ ఆస్పత్రిలో డాక్టర్లపై దాడిని ఖండించిన ఐఎంఏ
సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ ఆస్పత్రిలో జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఖండించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు సోమజిగూడా ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైద్యం పట్ల ఎలాంటి అనుమానాలున్నా వినియోగదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, లేదా పోలీసులకైనా ఫిర్యాదు చేసే అవకాశం బాధితులకు ఉందని తెలిపారు. గ్లోబల్ ఆస్పత్రిలో జరిగిన హింసాత్మక ఘటన సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం వల్లే అత్యవసర వైద్య చికిత్స అందించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. పేషెంట్ ప్రాణాలు కాపాడడం కోసమే వైద్యులు ప్రయత్నం చేస్తారని, షేమిమ్ బేగంకు వెంటిలేటర్ పెట్టాలని వైద్యులు చెప్పినా కుటుంబ సభ్యులు సహకరించ లేదని చెప్పారు. ఆస్పత్రిలో విధ్వంసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఐఎంఏ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా.ప్రతాప్ రెడ్డి, రవీందర్ రావు, సంపత్ రావు, జీఎన్ రెడ్డిలు పాల్గొన్నారు. -
నేడు ఆస్పత్రుల్లో ఓపీ సేవలకు ఆటంకం
న్యూఢిల్లీ: జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) 12 గంటల పాటు రోజువారీ విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఆందోళనలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆస్పత్రుల్లో ఔట్పేషంట్ సేవల్ని నిలిపివేయనున్నారు. అత్యవసర వైద్యసేవలు కొనసాగుతాయి. ఐఎంఏ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో నేడు ఔట్పేషంట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఎంఏ స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు కేంద్రం పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. హోమియో, ఆయుర్వేద కోర్సులు చేసిన డాక్టర్లను ఓ బ్రిడ్జి కోర్సు చేశాక ఆధునిక వైద్యం చేపట్టేందుకు అనుమతించాలన్న నిబంధన చేర్చారు. బిల్లు కారణంగా వైద్యరంగంతో సంబంధం లేనివారికి వైద్యులు జవాబుదారీగా ఉండాల్సి వస్తోందని ఐఎంఏ ఆరోపించింది. -
బీసీసీఐకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఘాటు లేఖ!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్-శ్రీలంక టెస్టు మ్యాచ్ సందర్భంగా కాలుష్య వివాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాయుకాలుష్యం తీవ్రంగా ఉందంటూ పలువురు శ్రీలంక ఆటగాళ్లు పదేపదే ఎంపైర్లకు ఫిర్యాదు. అంతేకాకుండా పలువురు ఆటగాళ్లు ముఖానికి మాస్క్ కట్టుకొని మైదానంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బీసీసీఐకి ఘాటు లేఖ రాసింది. ఢిల్లీలో తీవ్ర వాయుకాలుష్యం ఉన్నప్పటికీ భారత్-శ్రీలంక టెస్టు మ్యాచ్ నిర్వహించడాన్ని ఐఎంఏ తప్పుబట్టింది. ఐఎంఏ తీరు తమను చాలా ఇబ్బంది పెట్టిందని పేర్కొంది. 'వాయుకాలుష్యం కూడా క్రీడాకారుల సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఆటగాళ్ల జయాపజయాల్లో మిల్లి సెంకండ్, మిల్లిమీటర్ కూడా ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఆటగాళ్ల ప్రదర్శనపై వాయుకాలుష్య ప్రభావం కూడా కీలకమైనదే' అని తన లేఖలో పేర్కొంది. వర్షం, సరైన వెలుతురు లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆడటానికి అనువైన వాతావరణం ఉందా? లేదా? అన్నది నిర్ధారిస్తున్నారని, వాతావరణ కాలుష్యాన్ని సైతం ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించింది. -
‘మెర్శల్’ వివాదం: డాక్టర్ల సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై: ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన తమిళ సినిమా ‘మెర్శల్’పై వైద్యులు కన్నెర్ర చేశారు. ఈ సినిమాను బహిష్కరిస్తున్నట్టు తమిళ వైద్యులు ప్రకటించారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. తమను కించేపరిచేలా సినిమా తీశారని మండిపడ్డ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా పైరసీ లింకులను సోషల్ మీడియాలో షేర్ చేయాలని నిర్ణయించారు. ‘మెర్శల్’పై మౌనపోరాటం చేస్తామని ప్రకటించారు. ‘ఈ వివాదంపై మీడియా, కోర్టును సంప్రదించకూడదని నిర్ణయించాం. ఎందుకంటే మేము కోర్టుకెళితే సినిమాకు మరింత పబ్లిసిటీ వస్తుంది. దీనికి బదులుగా ఈ సినిమా లింకులను వెబ్ పేజీల్లో పోస్ట్ చేస్తాం. దీంతో సినిమా కలెక్షన్లు తగ్గుతాయి. అప్పుడు ఈ సినిమా తీసినవాళ్లు కళ్లుతెరుస్తార’ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ రవిశంకర్ అన్నారు. కాగా, ‘మెర్శల్’ ను బహిష్కరించాలని తమ సభ్యులకు, వారి కుటుంబసభ్యులకు ఇంటర్నెట్ ద్వారా ఐఎంఏ సందేశాలు పంపింది. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో డిజిటల్ ఇండియా, జీఎస్టీ అమలుపై డైలాగులు కూడా వివాదస్పదమయ్యాయి. ఈ రెండు అంశాలపై అసత్య సమాచారం ఇచ్చారని బీజేపీ మండిపడింది. ఈ డైలాగులు తొలగించాలని డిమాండ్ చేసింది. కాగా, ఈనెల 18న విడుదలైన ‘మెర్శల్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తమిళనాడులో రికార్డులు సృష్టిస్తోంది. -
16న వైద్య సేవలు బంద్
దేశ వ్యాప్తంగా ఐఎంఏ సత్యాగ్రహం విజయవాడ (లబ్బీపేట): నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు ప్రతిపాదనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో ఈ నెల 16న దేశ వ్యాప్తంగా సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి గంగాధరరావు చెప్పారు. ఆ రోజు ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపేస్తామన్నారు. గవర్నర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జి.సమరం, డాక్టర్ అప్పారావు, డాక్టర్ సీఎస్ఆర్ ప్రసాదరావు పాల్గొన్నారు. -
డాక్టర్ల పదవీ విరమణ వయస్సు 62కు పెంచాలి
- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజ్ఞప్తి - కేంద్రం 65 ఏళ్లకు పెంచినట్లు ప్రస్తావన హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ సర్కారుకు విన్నవించింది. ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ల ఉద్యోగ విరమణ వయస్సును 65కు పెంచినట్లు గుర్తు చేశారు. అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పటికే విరమణ వయస్సును పెంచినట్లు పేర్కొన్నారు. విరమణ వయస్సు పెంచడం వల్ల అనేకమంది యువ డాక్టర్లు ప్రభుత్వ సర్వీసులోకి రావడానికి ఆసక్తి కనబర్చుతారని ఐఎంఏ వివరించింది. అంతేగాక సీనియర్ వైద్యుల సేవలు కూడా మరింత వినియోగించుకోవడానికి వీలుపడుతుందని వారు తెలిపారు. -
నో సెల్ఫీ ప్లీజ్..
ప్రణాళికలు రచిస్తున్న మంగళూరు జిల్లా యంత్రాంగం మంగళూరు: అత్యాధునిక సాంకేతికతతో కూడిన సెల్ఫోన్లు తక్కువ ధరలకే మార్కెట్లో సందడి చేస్తుండడంతో ఎక్కడ చూసినా సెల్ఫీ ట్రెండ్ నడుస్తోంది. చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు సెల్ఫీ క్రేజుకు దాసోహమయ్యారు. ఎత్తై కొండలు, లోతైన జలపాతాలు తదితర ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ చాలా మంది యువతీ, యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన సెల్ఫీ జాడ్యం కొద్ది కాలంగా భారత్కు కూడా వ్యాపించింది. 2015లో ప్రపంచ వ్యాప్తంగా 27 మంది సెల్ఫీ క్రేజులో పడి మృతి చెందగా అందులో 15 మంది భారతీయులు ఉండడం మరింత ఆందోళన కలిగించే విషయం. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో సెల్ఫీలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకే నివేదికలు అందించింది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా సెల్ఫీలు తీసుకుంటూ ఇటీవల కొంత మంది యువతీ, యువకులు మృతి చెందడంతో పర్యాటక , ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలను నిషేధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇదే దిశలో మంగళూరు అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర పర్యాటకంలో అగ్రస్థానంలో ఉన్న మంగళూరు జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాను నోసెల్ఫీజోన్లుగా ప్రకటించడానికి రాష్ట్ర నిర్ణయం తీసుకోనుందని సమాచారం. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన సోమోశ్వర రుద్రపాద, సుల్తాన్ బత్తేరి కోట, రైల్వేస్టేషన్, నేత్రావతి బ్రిడ్జ్, మరవూరు డ్యామ్, తణ్ణీరు బావి, పణంబూరు, ఉళ్లాల తదితర ప్రాంతాలను సెల్ఫీలను నిషేధించనుందని తెలుస్తోంది. -
భారత్లో వైద్య విద్యకు అవినీతి జబ్బు
లండన్: నేడు భారత్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన డాక్టర్లు ఉన్నారు. వారిలో కొంత మంది భారత్లోని ప్రతిష్టాత్మక వైద్య కళాశాలలో చదువుకున్న వాళ్లుకాగా, మరి కొందరు విదేశాల్లోని ప్రతిష్టాత్మక వైద్య కళాశాలల్లో చదువుకున్న వాళ్లు ఉన్నారు. దీనిబట్టి భారత్లో వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అత్యుత్తమమైనవని భావిస్తే పొరపాటు పడినట్లే. దేశంలోని వైద్య విద్య, బోధనాస్పత్రుల పనితీరు ఏమాత్రం బాగా లేకపోవడమే కాకుండా రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతుందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దేశంలో వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు మొత్తం 579 ఉండగా, 2005 నుంచి 2014 వరకు దశాబ్దకాలంలో 579లో ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా రిసెర్చ్ పేపర్లు సమర్పించకపోవడం ఆశ్చర్యకరం. వైద్య విద్యా విధానం ప్రమాణాలకు రిసెర్చ్ పేపర్లు సమర్పించడం ఒక్కటే ప్రమాణం కాకపోయినప్పటికీ, దేశంలోని ప్రైవేటు వైద్య కళాశాలలు వైద్య వృత్తిని కేవలం వ్యాపారం చేసుకున్నాయనే అనుమానాలకు ఈ రిసెర్చ్ పత్రాల అంశం బలం చేకూరుస్తోందని తాజా అధ్యయనంలో పాల్గొన్న ఢిల్లీకి చెందిన గ్యాస్ట్రోయింటెస్టైనల్ సర్జన్ సమీరన్ నుండి అభిప్రాయపడ్డారు. 2010 నుంచి భారత్లోని 69 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాయని, ప్రవేశ పరీక్షల్లో రిగ్గింగ్కు పాల్పడడంగానీ లంచాలు తీసుకొని విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడంగానీ చేస్తున్నాయని రాయటర్స్ నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైంది. దేశంలోని 398 వైద్య కళాశాలల్లో ప్రతి ఆరింటికి ఒకటి చొప్పున చీటింగ్కు పాల్పడినట్లు భారత ప్రభుత్వ గణాంకాలు, కోర్టు ఫైళ్లే తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత్లో వైద్యంతో తగ్గిపోయే డయేరియా, టీబీ, నిమోనియా లాంటి జబ్బులతో ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యకళాశాలలను పట్టిపీడిస్తున్న అవినీతి జబ్బును నయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు దేశంలో ప్రాక్టీసు చేస్తున్న వైద్యుల్లో దాదాపు సగం మంది డాక్టర్లకు వైద్యవిద్యలో సరైన శిక్షణ లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంచనా వేసింది. బల్వంత్ అరోరా అనే వైద్యాధికారిపై 2011లో దాఖలైన కోర్టు కేసు వైద్య విద్యలో చోటు చేసుకుంటున్న అక్రమాల తీవ్రతను సూచిస్తోంది. ఆయన వంద డాలర్లకు ఒకటి చొప్పున 50 వేల నకిలీ వైద్య పట్టాలను జారీచేసినట్లు అంగీకరించారు. దేశంలో తీవ్రమైన డాక్టర్ల కొరత ఉన్నందువల్ల వైద్యంలో ఏదోరకమైన అనుభవం ఉన్నవాళ్లకు తాను నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చినట్లు అరోరా సమర్థించుకున్నారు. 1980 దశకంలో వంద ప్రభుత్వ వైద్య కళాశాలలకుగాను 11 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా, నేడు 215 ప్రభుత్వ వైద్య కళాశాలలకుగాను 183 ప్రైవేటు వైద్య కళాశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో ఎక్కువ ప్రైవేటు కళాశాలలను వైద్య వత్తితో ఎలాంటి సంబంధంలేని వ్యాపారవేత్తలే నిర్వహిస్తున్నారు. -
అక్షయ్ కుమార్ కు లీగల్ నోటీసు
ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి లీగల్ నోటీసు పంపించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్ణయించింది. 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాలో వైద్యవృత్తిని కించపరిచేలా చూపించారని, పవిత్రమైన వైద్య వృత్తిపై ప్రజలకు నమ్మకం పోయేలా సన్నివేశాలున్నాయని ఐఎంఏ తెలిపింది. అక్షయ్, భన్సాలీకి మంగళవారం లీగలు నోటీసు ఇస్తామని ఐఎంఏ గౌరవ కార్యదర్శి డాక్టర్ కేకే అగర్వాల్ తెలిపారు. మెడికల్ ప్రొఫెషన్ దేవాలయం లాంటదని... రాజకీయాలు, పోలీసులు ఇతర వృత్తులకు భిన్నమైనదని పేర్కొన్నారు. ఇలాంటి వృత్తి గురించి సినిమాలో చూపించాలనుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. వైద్యవృత్తిని కించపరిచేలా ఉన్న దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా 'గబ్బర్' సినిమా చాలా బాగుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కితాబిచ్చారు. -
హైదరాబాద్లో కొత్తగా 25 స్వైన్ఫ్లూ కేసులు
హైదరాబాద్ : ఓవైపు చలి, మరోవైపు స్వైన్ఫ్లూ ... హైదరాబాద్ ప్రజలను వణికిస్తోంది. నగరంలో కొత్తగా మరో 25 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 173 కేసులు నమోదు కాగా ఏడుగురు మరణించారు. మరోవైపు దేశవ్యాప్తంగా స్వైన్ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఈ వ్యాధిని అరికట్టడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్నిమార్గదర్శకాలను విడుదల చేసింది. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే డాక్టర్లని సంప్రదించాలని కోరింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి స్వైన్ఫ్లూ వ్యాధికి లక్ష్యణాలుగా పేర్కొంది. కాగా స్వైన్ఫ్లూ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్ర జేపీ నడ్డా పేర్కొన్నారు. స్వైన్ఫ్లూ సోకినవారికి అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. -
ప్లాస్టిక్ వాడకంతో ఇబ్బందులెన్నో..
సెమినార్లో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జయేష్ లేలే సాక్షి, ముంబై: మానవుని నిత్య జీవితంలో ప్రతిదీ ప్లాస్టిక్ వాడకంతో ముడిపడి ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ జయేష్ లేలే అభిప్రాయపడ్డారు. ఏక్ట్ ఇండియా (్చఛ్టిజీఛీజ్చీ) ఆధ్వర్యంలో ‘నో మోర్ ప్లాస్టిక్-యూజ్ గ్లాస్ బాటిల్’ అనే అంశంపై గురువారం ముంబైలో ఓ సెమినార్ జరిగింది. ఈ సెమినార్కు పలువురు వైద్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లేలే మాట్లాడుతూ ఉదయం టూత్ బ్రష్ మొదలుకుని వాటర్ బాటిళ్లు, టిఫిన్ బాక్స్లు, భోజనం చేసే ప్లేట్లు, షాంపు బాటిళ్లు, మందు బాటిళ్లు, అయిల్, టానిక్ బాటిళ్లు, పిల్లలకు పాలు పట్టించే సీసాలు, శీతల పానీయాల బాటిళ్లు, పిల్లలకు అన్నం తినిపించే స్పూన్లు ఇలా ప్రతీ వస్తువు ప్లాస్టిక్తో తయారైనవే అన్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో సెలైన్ బ్యాగులు, రక్తం భద్రపర్చిన బ్యాగులు, ఇంజక్షన్లు కూడా ప్లాస్టిక్తో తయారైనవే వాడుతున్నారన్నారు. వాటిని వినియోగించడంవల్ల ఝజీటఛ్చిటటజ్చీజ్ఛట,ఆస్తమ లాంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అదే గాజుతో తయారైన వస్తువులను వాడితే ఈ వ్యాధుల వ్యాప్తి 80 శాతానికి పైగా తగ్గిపోతుందని చెప్పారు. ముఖ్యంగా గర్భిణిలు ప్లాస్టిక్తో తయారైన వస్తువులు వాడకుండా ఉండాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్ సోకడంతోపాటు కడుపులో ఉన్న బిడ్డపై కూడా ప్రభావం పడుతుందని వివరించారు. డాక్టర్ తుషార్ మాట్లాడుతూ ముఖ్యంగా మనుషులు ఆరోగ్యం కంటే ఫ్యాషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్లాస్టిక్తో తయారైన వస్తువులు ఎలాగైనా, ఎక్కడికైనా పట్టుకెళ్లడం చాలా సులభం కాని వాటివల్ల ప్రమాదం పొంచి ఉందని గుర్తించలేకపోతున్నారన్నారు. కొత్త బాటిళ్ల వల్ల ప్రమాద స్థాయి అంతగా లేకపోయినా రీ సైక్లింగ్ బాటిళ్లతో పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. అతి తక్కువ డిగ్రీల వేడిమిలోనే ప్లాస్టిక్ బాటిళ్లు కరిగిపోతాయి. అదే గాజు సీసాలైతే 130 డిగ్రీల వేడిమిలో కరగడం వల్ల రీ సైక్లింగ్ చేసినప్పటికీ వాటి వల్ల ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల మానవుని సరాసరి జీవితకాలం తగ్గిపోయే ప్రమాదముందని, అందువల్ల సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ బాటిళ్లకు దూరంగా ఉండాలని తుషార్ సలహా ఇచ్చారు. -
శ్రీధర్రాజు విజయం
ఎంజీఎం : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లాశాఖ ఎన్నికలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. అధ్యక్ష, కార్యదర్శి స్థానాలకు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎర్రా శ్రీధర్రాజు, కార్యదర్శిగా అన్వర్ గెలుపొందారు. శ్రీధర్రాజు 18 ఓట్ల తేడాతో రాజ్కుమార్పై విజయం సాధించగా, అన్వర్ 77 ఓట్ల మెజార్టీతో వంశీపై గెలుపొందారు. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటలకు వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 1,132 ఓట్లకు 696 ఓట్లు పోలయ్యాయి. రౌండ్కు ఇలా.. రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు లెక్కింపు జరిగింది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన డాక్టర్ కంకల మల్లేశం 9 గంటలకు ఫలితాలు వెల్లడించారు. మొదటి, రెండు రౌండ్లలో రాజ్కుమార్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 26 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్లో ఎర్రా శ్రీధర్రాజు పుంజుకుని 20 ఓట్ల ఆధిక్యం సాధించారు. నాలుగో రౌండ్ కీలకంగా మారింది. నాలుగో రౌండ్లో శ్రీధర్రాజుకు 62 ఓట్లు రాగా రాజ్కుమార్కు 38 ఓట్లు వచ్చాయి. మొత్తంగా నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఎర్రా శ్రీధార్రాజుకు 18 ఓట్ల మెజార్టీ వచ్చింది. మరోవైపు కార్యదర్శి ఎన్నికల్లో అన్వర్, వంశీలు పోటీ పడగా మొదటి రౌండ్ నుంచి అన్వర్ ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి వంశీపై 77 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజయ్యకు చేదు అనుభవం స్వయంగా వైద్యుడైన ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈసారి జరిగిన ఐఎంఏ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న డాక్టర్ రాజ్కుమార్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసేందుకు ప్రయత్నించారు. ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం రాజయ్య ప్రత్యేకంగా జిల్లాకు వచ్చి పోలింగ్లో పాల్గొన్నారు. కానీ.. చివరికి హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో రాజ్కుమార్ ఓటమి పాలుకావడం రాజయ్య కు ఇబ్బందిగా మారింది. -
మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ వాడకంతో తగ్గుతున్న రోగ నిరోధక శక్తి
ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కర్ణాటక శాఖ ఆందోళన సాక్షి, బెంగళూరు : జ్వరం, జలుబు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు సైతం ప్రజలు మోతాదుకు మించి యాంటీ బయాటిక్స్ను వాడుతుండటంతో శరీరంలోని రోగనిరోధక శక్తి క్రమేపీ తగ్గుతూ వస్తోందని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కర్ణాటక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధి డాక్టర్ వై.సి.యోగానందరెడ్డి మాట్లాడుతూ...ప్రస్తుతం చాలా మంది తమకు అవసరం ఉన్నా లేకున్నా అనేక రకాల యాంటీ బయాటిక్స్ను వాడుతున్నారని అన్నారు. ఈ కారణంగా శరీరంలో సహజంగా ఏర్పడిన రోగనిరోధక శక్తి తగ్గుతూ వస్తోందని తెలిపారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో అసలు ఎలాంటి ఔషధం మనిషి దేహంపై పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు యాంటీబయాటిక్స్ను వాడడాన్ని ప్రజలు తగ్గించుకోవాలని, అందునా డాక్టర్ సలహా లేకుండా ఏ యాంటీ బయాటిక్స్ను వాడరాదని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో అవసరం లేని అనేక యాంటీ బయాటిక్స్ ప్రజలపై దుష్పరిణామాలను కనబరుస్తున్నాయని, వీటన్నింటిని నిరోధించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. యాంటీ బయాటిక్స్ వాడకంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహనను కల్పించేందుకు నేటి (ఆదివారం) నుంచి అక్టోబర్ 5 వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రముఖ డాక్టర్లు, మెడికల్ షాపుల యజమానులు ఈ అవగాహనా కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారని వెల్లడించారు. -
తెలంగాణ, ఏపీ ఐఎంఏ కార్యవర్గాల ఎన్నిక
విజయవాడ,హన్మకొండ: రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 56వ రాష్ట్ర మహాసభలు (ఉమ్మడి రాష్ట్రం) ఆదివారం ముగిశాయి. ఉమ్మడి రాష్ట్ర కౌన్సిల్ను ఆంధ్ర, తెలంగాణలుగా విభజిస్తూ తీర్మానించారు. ఏపీ అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన డాక్టర్ పి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా సీతారామయ్య (ఒంగోలు), కె.ఆనందనాయుడు (తిరుపతి), జె.సి.నాయుడు (విజయనగరం), కార్యదర్శులుగా కృష్ణారెడ్డి (నెల్లూరు), కె.వెంకటేశ్వర్లు (నెల్లూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో ఐఎంఏ నేతలు ఎన్.అప్పారావు, జి.సమరం, సుబ్రహ్మణ్యం, యాదగిరి పాల్గొన్నారు. ఐఎంఏ తెలంగాణ అడ్హక్ కమిటీ చైర్మన్గా వరంగల్ నగరానికి చెందిన డాక్టర్ కొండపల్లి సుధాకర్రెడ్డి నియమితులయ్యూరని జాతీయ ఎన్నికల కమిషనర్గా వ్యవహరించిన డాక్టర్ విజయ్చందర్రెడ్డి తెలిపారు. 2015 నుంచి తెలంగాణ మెడికల్ అసోసియేషన్ పూర్తి సంస్థగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొన్నారు. జనరల్ సర్జన్ అరుున సుధాకర్రెడ్డి ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. -
వైద్యుల నైపుణ్యం పెంచేందుకు కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: వైద్యుల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ (సీజీపీ) నూతన కోర్సులను ప్రవేశ పెట్టింది. ఈ కోర్సుల వివరాలను సీజీపీ డీన్ పి.పుల్లారావు బుధవారమిక్కడ వెల్లడించారు. ఫెలోషిప్ ఇన్ డయాబెటాలజీ, ప్రివెంటివ్ కార్డియాలజీ, అల్ట్రాసోనోగ్రాఫి, పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్(పీజీడీఇఎం), డిప్లొమా ఇన్ ఫ్యామిలీ మెడిసిన్(డీఎఫ్ఎం), మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్(ఎంఆర్సీజీపీ), ఇంటర్నేషనల్ పీజీ పిడియాట్రిక్ కోర్సు, ఫెలోషిప్ ఇన్ క్లినికల్ సైకియాట్రీ, డెర్మటాలజీ, ఇన్ఫెర్టిలిటీ కోర్సులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కోర్సుల్లో సంవత్సరం పాటు వైద్యులకు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎంబీబీఎస్, మెడికల్ కౌన్సిల్ రిజిస్రే్టషన్ కలిగిన వైద్యులు ఈ కోర్సులకు అర్హులని తెలిపారు. వీటిలో చేరాలనుకునేవారు జూన్ 30వ తేదీలోపు కోఠిలోని ఐఎంఏ కార్యాలయంలో గాని, 9848034519, 040-24657107 నంబర్లలోకాని సంప్రదించాలని కోరారు. -
ఎన్నికల్లో వైద్య అభ్యర్థులను గెలిపించాలి: ఐఎంఏ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పోటీ చేస్తున్న వైద్య అభ్యర్థులను పార్టీలకు అతీతంగా గెలిపించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపునిచ్చింది. సోమవారం కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎంఏ నేషనల్ లీడర్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ అప్పారావు, ఐఎంఏ సీజీపీ డీన్ డాక్టర్ పుల్లారావుతో కలసి ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.యాదగిరిరావు మాట్లాడారు. తెలంగాణలో ఈనెల 30న, సీమాంధ్రలో మే 7న జరిగే ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 100 మందికి పైగా వైద్యులు పోటీ చేస్తున్నారన్నారు. వీరికి రాష్ట్రంలోని 167 బ్రాంచీల్లో ఉన్న 24 వేల ఐఎంఏ వైద్యులు, వారి కుటుంబాలు మద్దతివ్వాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్(సీపీఏ), క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్(సీఈఏ)లను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. -
రోగం కుదిర్చే తీర్పు!
నిర్లక్ష్యం ఎక్కడైనా క్షమార్హం కానిదే. అందునా రోగుల ప్రాణాలతో ముడిపడి ఉండే వైద్యరంగంలో అది మరింతగా అవాంఛనీయం. కానీ, అన్ని రంగాల్లాగే వైద్యరంగంలోనూ వ్యాపారధోరణులు ముదిరిపోయాక నిర్లక్ష్యం ఒక్కటే కాదు... అనైతికత, అమానవీయత కూడా అందులో దండిగా పెరిగిపోయాయి. ‘వైద్యో నారాయణో హరి’ అన్న నానుడి అర్ధమే మారిపోయింది. వైద్యుడికీ, రోగికీ మధ్య ఉండాల్సిన బంధం బీటలువారింది. ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో... నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక రోగి ప్రాణం పోవడానికి కారణమైన కోల్కతాకు చెందిన ఆస్పత్రికి, అందులోని ముగ్గురు వైద్యులకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుంది. చికిత్సలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, పౌరుల ఆరోగ్యానికి భంగంకలిగిస్తే అది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమేనని స్పష్టంచేయడం బాధితులకు ఊరట కలిగిస్తుంది. అమెరికాలో చిన్నపిల్లల సైకాలజిస్టుగా పనిచేస్తూ 1998లో కోల్కతా వచ్చిన అనూరాధ అనే మహిళ అస్వస్థురాలైనప్పుడు ఇచ్చిన ఒక ఇంజెక్షన్ వికటించింది. కొద్దిరోజుల్లోనే ఆమె కన్నుమూశారు. అనూరాధ మరణానికి ఆమెకిచ్చిన ఇంజెక్షనే కారణమని వైద్య నిపుణులు తేల్చారు. ఆమె భర్త డాక్టర్ కునాల్ సాహా ఈ కేసుపై పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఆస్పత్రివైపునుంచి, వైద్యులవైపునుంచి జరిగిన లోపాలేమిటో నిరూపించారు. తన భార్య మృతివల్ల జరిగిన ఆదాయ నష్టాన్ని, కుటుంబానికి కలిగిన వేదనను, వ్యాజ్యానికైన ఖర్చులను లెక్కగట్టి పరిహారం ఇప్పించాలని కునాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పర్యవసానంగా ఆయనకు రూ. 5.96 కోట్ల మొత్తాన్ని పరిహారంగా నిర్ణయించి, అందుకు వడ్డీని కూడా లెక్కేసి మొత్తం రూ. 11.41 కోట్లను 8 వారాల్లో చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నాలుగేళ్ల క్రితం కూడా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే వెలువరించింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అతనికి శాశ్వత వైకల్యం తీసుకొచ్చినందుకు కోటి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. నాడి చూసి కొన్ని అంచనాలతో రోగనిర్ధారణ చేసి, వైద్యాన్ని అందించే దశనుంచి దేన్నయినా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిర్ధారించి చికిత్సచేసే పరిస్థితులొచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు కనుమరుగై, క్లినిక్లు వచ్చి...అవికూడా నర్సింగ్హోంలుగా, పాలీ క్లినిక్లుగా రూపాంతరంచెందాయి. భారీ పెట్టుబడులు అవసరమైన అత్యాధునిక సాంకేతిక ఉపకరణాలు అందుబాటులోకొచ్చాక స్టార్ హోటళ్లను తలదన్నే రీతిలో కార్పొరేట్ ఆస్పత్రులు వెలిశాయి. ఓ మాత్రం సంపాదనపరులైనవారెవరూ ఇప్పుడు వీధి చివరన ఉండే సాధారణ వైద్యులను ఆశ్రయించడంలేదు. నేరుగా కార్పొరేట్ ఆస్పత్రులను వెదుక్కుంటూ వెళ్తున్నారు. ఆ ఆస్పత్రుల్లో అడుగుపెడితే చాలు... అంతా నయమైపోతుందన్న భ్రమల్లో ఉండిపోతున్నారు. సరిగ్గా ఈ స్థితినే ఆస్పత్రులు సొమ్ముచేసుకుంటున్నాయి. లక్షలు, కోట్లు పోసి కొనుగోలు చేసిన పరికరాలకు పనిచెబితే తప్ప లాభాలు రావన్న ఏకైక సూత్రంతో... రోగులకు అవసరమున్నా, లేకున్నా ఖరీదైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అటు తర్వాత చికిత్సల పేరిట మరిన్ని వేలు రాబడుతున్నాయి. ఇలా వేలకు వేలు ఖర్చుపెట్టినా రోగం కుదురుకుంటుందన్న ధీమా ఎవరికీ కలగటంలేదు. ఈ అనైతిక వైద్య పరీక్ష లూ, చికిత్సలూ డబ్బులు కొల్లగొట్టడంతో ఊరుకోవడంలేదు. ఆరోగ్యాన్ని సైతం గుల్లబారుస్తున్నాయి. ఫలితంగా అటు డబ్బూ పోయి, ఇటు శాశ్వత అనారోగ్యమూ దాపురించి సామాన్యులు విలవిల్లాడుతు న్నారు. కడుపునొప్పి ఉన్న మహిళలకు హిస్టరెక్టమీ ఆపరేషన్లు నిర్వహించిన వైద్యుల నిర్వాకాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు గతంలో బట్టబయలు చేశాయి. వైద్యరంగంలో కనబడుతున్న ఈ విపరీత పోకడలను అరికట్టడంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)వంటి వృత్తిగత సంస్థలు విఫలమవుతున్నాయి. లాభార్జనే ధ్యేయంగా, దోపిడీయే లక్ష్యంగా పనిచేస్తున్న వైద్యులనూ, ఆస్పత్రులనూ దారికి తీసుకురాకపోతే మొత్తం వైద్య వృత్తికే కళంకం ఏర్పడుతుందన్న భావన ఆ సంఘాల్లో కలగడంలేదు. తామే కొన్ని ప్రమాణాలను ఏర్పర్చుకుని, వాటిని పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత విషమించేది కాదు. ప్రభుత్వాలు సైతం ఈ విషయంలో సమగ్రమైన చట్టాలను తీసుకురాలేకపోయాయి. పర్యవసానంగా సామాన్యులకే కాదు...పలుకుబడి, హోదా ఉన్నవారికి సైతం నాణ్యమైన వైద్యం అందుతుందన్న గ్యారెంటీ లేకుండాపోయింది. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ మరణానికి సైతం సరైన చికిత్స లభించకపోవడమే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. కునాల్ సాహాకు ఈ విజయం అంత సులభంగా, అలవోకగా లభించలేదు. ఆయన ఎన్నో వ్యయప్రయాసలకోర్చి 15 సంవత్సరాలపాటు పోరాడారు. ఒకచోట కేసే లేదని కొట్టేస్తే, మరోచోట ఈ మాత్రం పరిహారం సరిపోతుందని లెక్కేస్తే...ఆయన విసుగూ, విరామంలేకుండా న్యాయస్థానాల చుట్టూ తిరిగారు. పోయిన ప్రాణాలకు పరిహారం సమమవుతుందనుకోలేదు. చికిత్స పేరిట ప్రాణం తీసిన ఆస్పత్రిని, వైద్యులనూ దోషులుగా నిలబెట్టాలనుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి మరే ప్రాణమూ బలికాకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. ఆయన కోరిక నెరవేరింది. ఈ తరహా కేసుల్లో మైలురాయిగా నిలిచిపోయే ఉత్కృష్టమైన తీర్పు వెలువడింది. ఈ తీర్పు వైద్యుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని కొందరు వ్యక్తంచేస్తున్న ఆందోళన అర్ధంలేనిది. వృత్తే దైవంగా భావించేవారికి దీనివల్ల ఏమీకాదు. వృత్తికి ద్రోహంచేసేవారి పాలిట మాత్రమే ఇది అంకుశంలా పనిచేస్తుంది. వైద్యపరమైన నిర్లక్ష్యంతో బాధితులుగా మారినవారెందరికో ఈ తీర్పు ఒక ఆలంబనగా నిలుస్తుంది. -
ఉత్కంఠభరితంగా ఐఎంఏ ఎన్నికలు
కరీంనగర్ హెల్త్, న్యూస్లైన్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కరీంనగర్ విభాగం ఎన్నికలు ఆదివారం ఐఎంఏ హాల్లో ఉత్కంఠభరితంగా జరిగాయి. రెండు రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన ఎన్నికలు ఆదివారం ఓటింగ్ సమయంలోనూ అంతే ఉత్కంఠ రేపాయి. ప్రచారం సాధారణ ఎన్నికలను తలపించింది. వైద్యేతరులు తమ అభ్యర్థులకు ఓటు వేయాలని బయట ప్రచారం నిర్వహించారు. ఓ వర్గం వారు ప్యానెల్ పేర్లు, బయోడేటా ముద్రించిన పత్రంతోపాటు పువ్వులు ఇచ్చి ఎన్నికల్లో తమ వారికి ఓటువేయాలని అభ్యర్థించారు. డాక్టర్ జగన్మోహన్రావు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించగా, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ జరిగింది. 480 మంది సభ్యులకు గాను 301 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితాలను రాత్రి 9 గంటలకు ప్రకటించారు. ఫలితం వరకూ ఉత్కంఠే... ఐఎంఏ కరీంనగర్ విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ హరికిషన్ 67 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి డాక్టర్ వసంతరావుకు 111 ఓట్లు రాగా, హరికిషన్ 178 ఓట్లు సాధించారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ మల్లికార్జున్ 204 ఓట్లు, డాక్టర్ యాకయ్య 174 ఓట్లు పొంది గెలుపొందారు. మూడు ఉపాధ్యక్ష పదవులకు గాను మహిళా కోటా నుంచి డాక్టర్ శోభ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా డాక్టర్ వెంకటరెడ్డి 40 ఓట్ల మెజారిటీతో అక్షయ్ డానియెల్పై విజయం సాధించారు. కోశాధికారిగా ఎల్.రవికాంత్ (161 ఓట్లు) డాక్టర్ కె.వి.రవీందర్రెడ్డి(124 ఓట్లు)పై 37 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆరు కార్యవర్గ సభ్యుల పదవులకు గాను రెండు ఏకగ్రీవం కాగా పీఆర్ రాజేందర్(243), వి.వెంకటేశ్వర్లు(192), వి.రఘు(184), డాక్టర్ రాజిరెడ్డి(182 ఓట్లు) సాధించి విజయం సాధించారు. ఏకగ్రీవమైనవారు వీరే.. ఐఎంఏ ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ శోభ, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ ఝాన్సీ, ఉమ, సంయుక్త కార్యదర్శిగా నారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పొలాడి శ్రీనివాస్, సాయిప్రసాద్, రాంకిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫ్యామిలీ బెన్ఫిట్ స్కీమ్ సభ్యులుగా బీఎన్రావు, రవీందర్, ప్రొఫెషన్ ప్రొటెక్షన్ వర్కర్లుగా డాక్టర్ శౌరయ్య, హరిత, లోకల్ యాక్షన్ కమిటీ సభ్యులుగా డాక్టర్ అలీం, డాక్టర్ వి.లక్ష్మణ్, ఆకుల శైలజ, వి.రాంరెడ్డి , సెంట్రల్ కౌన్సిల్ సభ్యులుగా పి.కిషన్, మధుసూధన్రావు, విఠల్రెడ్డి, జి. రవీందర్, ఆది శ్రీదేవి, సర్దారున్నీసా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని డాక్టర్ ఎడవెల్లి విజయేందర్రెడ్డి తదితరులు అభినందించారు. -
సమైక్యాంధ్ర పోరు@ 50
ఏలూరు, న్యూస్లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమ ప్రభం జనం కొనసాగుతోంది. 49వ రోజైన మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను మూసివేసిన వైద్యులు ప్రజాపోరాటానికి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయూన్ని వ్యతిరేకిస్తూ పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు మంగళవారం దీక్షలు చేపట్టారు. జెడ్పీ కార్యాలయం వద్ద దీక్షలు చేస్తున్న ఎన్జీవోలకు సంఘీభావం తెలి పేందుకు వచ్చిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను సమైక్యవాదులు అడ్డుకుని స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయూలని, చంద్రబాబుతో సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటింపచేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చిం ది. భీమవరంలో ఎన్జీవోలు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. మాల మహానాడు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మావుళ్లమ్మ గుడి రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పాలకొల్లు మండలం పూల పల్లిలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఇంటిని ముట్టడించారు. యలమంచిలి మండలం చించినాడ, దొడ్డిపట్లలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థి జేఏసీ చేపట్టిన సద్భావన పాదయాత్ర ముగిసింది. నరసాపురం రాయపేటలో డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు రోడ్డుపై కసరత్తులు చేసి నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పండ్లు, పూల వ్యాపారులు, తోపుడు బళ్ల వర్తకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్మించారు. తణుకు తహసిల్దార్ హరిహరబ్రహ్మాజీ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు, ఎన్జీవోలు గుంజీలు తీశారు. మునిసిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పీహెచ్సీ ఏఎన్ఎంలు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఆర్టీసీ, జేఏసీ నాయకులు రిలే దీక్షల్లో కూర్చున్నారు. రాష్ట్రంలోని అందరి బతుకులు బాగుండాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో విద్యార్థినులు బతుకమ్మను శిరస్సున ధరించి ప్రదర్శన చేశారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడారు. ఉంగుటూరులో జాతీయ రహదారిపై ముస్లిం నమాజ్, మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. పెనుగొండ మండలం సిద్ధాం తంలో ఎరువులు, పురుగు మందుల డీలర్లు దీక్షల్లో పాల్గొన్నారు. నిడదవోలులో ఎస్కేవీడీ ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల, మోడరన్ రూఫ్, ప్రభుత్వ బాలిక ల జూనియర్ కళాశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి మానవహారం చేశారు. పెనుగొండ , మార్టేరు, ఆచంట, ఎ.వేమవరం, వల్లూరు గ్రామాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. చాగల్లులో కేంద్ర మం త్రుల మాస్కుల ధరించి ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ప్రదర్శన చేపట్టారు. కొవ్వూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తీన్మార్, గారడీ నృత్యాలతో ర్యాలీ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలకు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంఘీభావం ప్రకటించారు. చింతలపూడిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో తోపుడు బండ్లపై పండ్లు అమ్మి నిరసన తెలిపారు. లింగపాలెంలో వికలాంగులు మౌన ప్రదర్శన చేశారు. జీలుగుమిల్లి మం డలం దర్భగూడెంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. కొయ్యలగూడెంలో టాక్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవోల మానవహారం ఏర్పాటు చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో... సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాయి. నరసాపురంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావలి నాని నాయకత్వంలో 20 మంది కూర్చున్నారు. పార్టీ తాడేపల్లిగూడెం సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం 40వ రోజుకు చేరుకున్నాయి. తణుకు, ఉంగుటూరు, నిడదవోలు, కొవ్వూరు, భీమవరం పట్టణాల్లో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నారుు. -
17న ప్రైవేటు వైద్య సేవల బంద్
చిత్తూరు(అర్బన్), న్యూస్లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా 17న జిల్లావ్యాప్తంగా ప్రైవేటు వైద్య సేవల్ని ఆపివేస్తున్నట్లు సమైక్యాంధ్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐక్య కార్యాచరణ వేదిక ప్రకటించింది. ఈ మేరకు గురువారం చిత్తూరు నగరంలో సంఘ నాయకులు సమావేశమయ్యారు. జేఏసీ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 44 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. కనీస జ్ఞానం కూడా లేని కొందరు వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం వల్లే దేశంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం, విద్య పరంగా హైదరాబాదు చాలా అభివృద్ధి చెందిందని దీని వెనుక సీమాంధ్రుల కష్టం ఉందన్నారు. రాష్ట్రం విడిపోతే ఇక్కడి వైద్య విద్యార్థులకు మెడికల్ సీట్లు, పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో సీట్లు సగానికి పైగా తగ్గిపోతాయన్నారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో ఉన్న వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం మిగిలిన ఆస్పత్రుల్లో లేకపోవడం వల్ల సీమాంధ్రులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఢిల్లీ పెద్దలకు ఇక్కడి ఉద్యమ తీవ్రతను తెలియచేయడంలో భాగంగా సీమాంధ్ర వైద్యసేవల జేఏసీ పిలుపు మేరకు 17న బంద్ నిరహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపులు, నర్సింగ్, పారామెడికల్ అన్నీ స్వచ్ఛందంగా మూసివేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు సైతం తమకు మద్దతు పలకాలని కోరారు. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని వైద్యులు, సిబ్బంది రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలు చేసి సమైక్యాంద్ర ఉద్యమ తీవ్రతను తెలియచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైద్య జేఏసీ నేతలు డాక్టర్ రాజేంద్రకుమార్, డాక్టర్ వినోద్, డాక్టర్ శ్రీరాములురెడ్డి, డాక్టర్ సురేంద్రరెడ్డి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ రాజారావు పాల్గొన్నారు. -
క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు..
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్లైన్ క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడవద్దని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ అన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంస్థ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఐఎంఏ హాల్ నుంచి మయూరీసెంటర్, వైరా రోడ్డు, జడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం వల్ల వారి కుటుం బాలు చిన్నాభిన్నం అవుతాయని అన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే దానిని మానుకుంటారని అన్నారు. ఆత్మహత్య అనేది ఒక సంక్లిష్టమైన, బాధాకరమైన చర్య అని అన్నారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు. అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణా సంస్థ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇలాంటి అవగాహన ర్యాలీ లు, సదస్సులు, నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తొలుత ఈ ర్యాలీని డీఎంహెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్, అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంస్థ జిల్లా అధ్యక్షులు సతీష్బాబు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. నాగమణి, ప్రసాద్రావు, మమత సంస్థల చైర్మన్ అజయ్కుమార్, వైద్యులు అజయ్కుమార్, డీఎస్పీ బాలకిషన్, నర్సింగ్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్ నుంచి సిబ్బంది బయలుదేరి ఆర్టీసీ బస్టాండు, అద్దంకి బస్టాండు, ట్రంకురోడ్డు, మిరియాలపాలెం మీదుగా చర్చి సెంటర్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్ర డాక్టర్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ కే సీతారామయ్య మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని సోనియాగాంధీ అగౌరవపరుస్తోందని మండిపడ్డారు. రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ఆమె ఎజెండా అని మండిపడ్డారు. డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆశయాన్ని కాపాడాలని కోరారు. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ నల్లూరి రాఘవరావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ప్రతినిధులు సీహెచ్ చలమయ్య, కేశవ, కృష్ణారావు, ఆలూరి భాస్కరరావు, జయకిషోర్, రవికుమార్, యామినేని శ్రీధర్, విజయ్కుమార్, నామినేని కిరణ్కుమార్, పోలవరపు హరీష్, వెంకటరావు, నరసింహారావు, హనుమారెడ్డి, మెడికల్ కాలేజీ విద్యార్థుల జేఏసీ కన్వీనర్ రాహుల్ రాథోడ్, నాయకులు పీ వెంకటేశ్వర్లు, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రాయపాటి జగదీష్, నగర కన్వీనర్ సీహెచ్ అశోక్, నాయకులు జగన్నాథం, మహేష్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.