international level
-
డాక్టరమ్మ శిక్షణ చక్ దే..!
చక్దే ఇండియాలో మహిళా హాకీ జట్టును తీర్చిదిద్దుతాడు షారుక్ ఖాన్ . నిజామాబాద్లో ఫుట్బాల్లో బాలికలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ కవితారెడ్డి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్న బాలికలు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టేలా చేయడమే లక్ష్యం అంటున్నారామె. కవితారెడ్డి ఈ క్రీడా శిక్షణ ఎందుకు ప్రారంభించారో తెలిపే కథనం.‘సహాయం చేసే వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే సహాయం చేయడం మనక్కూడా అలవడుతుంది’ అంటారు డాక్టర్ శీలం కవితా రెడ్డి. నిజామాబాద్లో గైనకాలజిస్ట్గా పేరొందిన ఈ డాక్టర్ తన సేవా కార్యక్రమాలతో కూడా అంతే గౌరవాన్ని పొందుతున్నారు. ‘మా తాతగారిది నల్లగొండ. పేదవాళ్లకు ఆయన సహాయం చేయడం, వాళ్లకు ఫీజులు కట్టి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివించడం నేను బాల్యం నుంచి గమనించేదాన్ని. సాయం చేయడంలో సంతృప్తి నాకు అర్థమైంది. నేను డాక్టర్గా స్థిరపడ్డాక ‘డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్’ స్థాపించి స్త్రీల, బాలికల ఆరోగ్యం కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం అవసరం అనే భావనతో ఈ పని మొదలుపెట్టాను’ అన్నారామె.ఫుట్బాల్ మేచ్ చూసి...‘నిజామాబాద్ పట్టణంలో ఒకసారి బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ΄ాల్గొన్న అమ్మాయిల క్రీడానైపుణ్యం చూసి ఆశ్చర్య΄ోయాను. ఎంతటి పేదరికంలో ఉన్నా సరైన ΄ోషణ, డ్రస్, షూస్ లేక΄ోయినా వారు గ్రౌండ్లో చిరుతల్లా పరిగెడుతూ ఆడారు. అలాంటి పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే మరింతగా దూసుకు΄ోతారని భావించి 2019లో డాక్టర్ కవితారెడ్డి ఫుట్బాల్ అకాడెమీ స్థాపించాను. నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణప్రాంతం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేసి ఫుట్బాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాను. పట్టణంలో ఉన్న బాలికలు రోజూ వచ్చి ఉచిత శిక్షణ పొందితే బయటి ఊళ్ల అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు’ అని తెలి΄ారామె.అదే ప్రత్యేకం...కవితారెడ్డి తన అకాడెమీని ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్కు అనుబంధంగా రిజిస్టర్ చేశారు. తెలంగాణ లో మొత్తం 8 ఫుట్బాల్ క్లబ్బులు ఉండగా మహిళా కార్యదర్శి ఉన్న క్లబ్ మాత్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుతం డాక్టర్ కవితారెడ్డి ఫుట్బాల్ అకాడమీలోని 41 మంది బాలికలు కోచ్ గొట్టి΄ాటి నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. గతంలో నాగరాజు శిక్షణలోనే అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్య తయారైంది. శిక్షణ పొందుతున్న బాలికల్లో వివిధ జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణప్రాంతాల వారున్నారు. వీరందరికీ కవితారెడ్డి తన సొంత ఖర్చుతోనే వసతి, ఆహారం, డ్రెస్సులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతరప్రాంతాల్లో టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తే అవసరమైన సామగ్రి, ప్రయాణ ఖర్చులన్నీ డాక్టరమ్మే భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 9 మంది బాలికలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్స్ ఆడారు. మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల క్లబ్లకు ఆడారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అండర్–13, అండర్–15లో 14మంది ఆడారు. ఇక తెలంగాణ ఉమెన్స్ లీగ్కు 22 మంది ఈ అకాడమీ బాలికలు ఆడనున్నారు. మిషన్ 2027లో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ ΄ోటీలకు వెళ్లేలా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు బాక్సింగ్ క్రీడాకారులకు సైతం ఇప్పటివరకు అవసరమైనప్పుడల్లా కిట్లు కొనిస్తున్నారు.హెల్త్ కార్డ్లుడాక్టర్ కవితారెడ్డి తన హెల్త్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి పేద గర్భిణులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. నాలుగు వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డ్ ఉన్నవారికి తన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ΄ాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్ధినులకు అనీమియా వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సేవాకార్యక్రమాల విషయంలో తనను భర్త రవీందర్రెడ్డి, కుమారుడు డాక్టర్ పరీక్షిత్ సాయినాథ్రెడ్డి అన్నిరకాలుగా ్ర΄ోత్సహిస్తున్నారని కవితారెడ్డి చెబుతున్నారు.– తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
ఎలక్టోరల్ బాండ్లు అంతర్జాతీయ రాకెట్: రాహుల్
థానే: బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం ముమ్మాటికీ అంతర్జాతీయ స్థాయి బలవంతపు వసూళ్ల రాకెట్ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయ పారీ్టలను చీల్చడానికి, రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడానికి ఈ పథకాన్ని వాడుకున్నారని మండిపడ్డారు. మహరాష్ట్రలోని జాంభాలీ నాకాలో శనివారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ప్రసంగించారు. మన దేశంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, నిరసన తెలిపినా ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ వంటివి వెంటనే దాడులకు దిగుతున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన పారీ్టలు రెండుగా చీలడానికి కారణం ఏమిటో చెప్పాలని బీజేపీని ప్రశ్నించారు. దేశ జనాభాలో 80 శాతం ఉన్న బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారీ్టలు, పేదలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకకు కేవలం సంపన్న పారిశ్రామికవేత్తలను, సినిమా నటులను మాత్రమే ఆహా్వనించారని, పేదలను పక్కనపెట్టారని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆదివాసీ మహిళ అయినందుకే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహా్వనించలేదని ఆరోపించారు. కాంగ్రెస్పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్: జైరాం లోక్సభ ఎన్నికల ముందు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా తమపై బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్రైక్కు దిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. దాంతో పార్టీ ఆర్థికంగా శక్తిహీనంగా మారిందని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఇప్పుడు తమ వద్ద డబ్బు లేదని అన్నారు. బాండ్ల ముసుగులో బీజేపీ చట్టవిరుద్ధంగా నిధులు కొల్లగొట్టిందని ఆరోపించారు. -
చిప్ల తయారీలో అంతర్జాతీయ స్థాయికి భారత్
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో సెమీ కండక్టర్ల తయారీలో భారత్ అంతర్జాతీయ స్థాయికి చేరగలదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చిప్ల విభాగంలో తైవాన్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా దేశీయంగా కొత్త ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. భారత్లో ప్లాంట్లు పెట్టేందుకు, సంబంధిత రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు తయారీ సంస్థలు ముందుకొచ్చేలా ప్రభుత్వ విధానాలు ఆకర్షిస్తున్నాయని మంత్రి చెప్పారు. చైనాకి ప్రత్యామ్నాయంగా, ప్రజాస్వామ్య టెక్నాలజీ హబ్గా భారత్ నిలుస్తోందని ఆయన తెలిపారు. ‘భారత్కి ఎప్పుడు వెళ్లాలి.. అసలు వెళ్లొచ్చా అని గతంలో అంతా అలోచించే వారు. కానీ ఇప్పుడు వీలైనంత ముందుగా వెళ్లాలి అనుకుంటున్నారు. అటువంటి మార్పు కనిపిస్తోంది. ప్రతి పెద్ద సంస్థ భారత్లో పెట్టుబడులు పెట్టే ఆలోచనల్లో ఉంది‘ అని పేర్కొన్నారు. కేంద్రం ఇటీవలే దాదాపు రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. వీటిలో టాటా గ్రూప్ తలపెట్టిన మెగా ఫ్యాబ్ కూడా ఉంది. -
అంతర్జాతీయ స్థాయిలో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖపట్నం రైల్వేస్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేంద్ర రైల్వే, జౌళి శాఖల సహాయ మంత్రి దర్శనా జర్దోష్ తెలిపారు. వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్తో కలిసి శనివారం విశాఖపట్నం రైల్వేస్టేషన్ను ఆమె సందర్శించారు. విశాఖ రైల్వేస్టేషన్ దేశంలో రద్దీ స్టేషన్లలో ఒకటని, నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పారు. ఈ పనులపై గతిశక్తి, వాల్తేర్ డివిజన్ అధికారులతో దర్శనా జర్దోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జరుగుతున్న పనుల గురించి అధికారులు ఆమెకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత ఆమె ఒకటో నంబర్ గేట్ వైపు ప్రారంభమైన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ను సందర్శించారు. రైల్వేస్టేషన్, స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కారి్మకులకు హెల్త్ కిట్స్ను అందజేశారు. అనంతరం ఏటికొప్పాక బొమ్మలతో వన్ స్టేషన్–వన్ ప్రొడక్ట్ పథకం కింద ఏర్పాటు చేసిన స్టాల్ను పరిశీలించారు. అమ్మకాలు, స్టేషన్ అధికారుల ప్రోత్సాహం, సహకారం గురించి స్టాల్ యజమానితో మాట్లాడారు. 24/7 రైల్ కోచ్ రెస్టారెంట్ ప్రారంభం రైల్వేస్టేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన 24/7 రైల్ కోచ్ రెస్టారెంట్ను మంత్రి దర్శనా జర్దోష్ ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు, నగర వాసులకు ఈ రెస్టారెంట్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వాల్తేర్ డివిజన్ అధికారుల, సిబ్బంది పనితీరును మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
మరో అద్భుతం ‘యశోభూమి’
ప్రాచీన కట్టడాలు, దర్శనీయ క్షేత్రాలకు నిలయమైన దేశ రాజధాని ఢిల్లీ కీర్తికిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. చూపు తిప్పుకోనివ్వని సుందరమైన, విశాలమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్(ఐఐసీసీ) యశోభూమి ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలో సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్ల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి సంకల్పం మేరకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో యశోభూమిని అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో నిర్మించింది. ప్రధాన ఆడిటోరియం, కన్వెన్షన్ హాళ్లు, బాల్రూమ్, మీటింగ్ రూమ్లతో యశోభూమి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా నిలువనుంది. ఎనిమిది అంతస్తుల యశోభూమిలో మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్(ఎంఐసీఈ) సదుపాయాలన్నీ ఉన్నాయి. ఐఐసీసీ మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17వ తేదీన స్వయంగా ప్రారంభించనున్నారు. అలాగే జాతికి అంకితం ఇస్తారు. విశేషాలివీ.. 1. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు ఏరియా 8.9 లక్షల చదరపు మీటర్లు, బిల్ట్–అప్ ఏరియా 1.8 లక్షల చదరపు మీటర్లు. కన్వెన్షన్ సెంటర్ను 73,000 చదరపు మీటర్లకుపైగా వైశాల్యంలో నిర్మించారు. 2. మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఒక బాల్రూమ్, 13 మీటింగ్ రూమ్లు ఉన్నాయి. 3. అన్ని గదుల్లో కలిపి ఏకకాలంలో 11,000 మంది ఆసీనులు కావొచ్చు. 4. 6,000 మంది అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రధాన ఆడిటోరియం(ప్లీనరీ హాల్) నిర్మించారు. ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టమ్ ఉంది. 5. అందమైన సీలింగ్తో ఆకట్టుకుంటున్న బాల్రూమ్ సీటింగ్ సామర్థ్యం 2,500. ఇక్కడే మరో 500 మంది కోసం ఓపెన్ ఏరియా ఉంది. 6. అలాగే 1.07 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి. 7. మీడియా రూమ్లు, వీవీఐపీ గదులు, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టికెటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 8. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ వర్షం నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసుకొని మళ్లీ ఉపయోగించుకునే ఏర్పాట్లున్నాయి. 9. సౌర విద్యుత్ కోసం రూప్టాప్ సోలార్ ప్యానళ్లు బిగించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు. 10. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినమ్ సరి్టఫికేషన్ పొందింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సైబర్ సెక్యూరిటీకి సమిష్టి కృషి అవసరం
న్యూఢిల్లీ: సైబర్ దాడుల ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు సైబర్సెక్యూరిటీ విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జీ20 సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా.. సవాళ్లను అధ్యయనం చేసి, పరిష్కార సాధనాలను కనుగొనడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. యూపీఐ, ఓఎన్డీసీ, కోవిన్ వంటి భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊతంతో టెక్నాలజీ ప్రయోజనాలను సామాన్యులకు కూడా భారత్ అందజేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ‘సైబర్సెక్యూరిటీ అనేది అందరికీ ఉమ్మడి సవాలే. అది చాలా సంక్లిష్టమైనది దానికి సరిహద్దులేమీ లేవు. టెక్నాలజీ నిత్యం రూపాంతరం చెందుతోంది. ఇవాళ ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటే.. రేపు మరో కొత్త సమస్య పుట్టుకొస్తోంది. కృత్రిమ మేథ (ఏఐ)తో సంక్లిష్టత మరిన్ని రెట్లు పెరుగుతుంది‘ అని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో అందరి ప్రయోజనాల కోసం కొత్త పరిష్కార సాధనాలను రూపొందించడం, పరస్పరం పంచుకోవడం అవసరమని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన కొన్ని సైబర్సెక్యూరిటీ సాధనాలను, వాటిపై ఆసక్తి గల దేశాలతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని వైష్ణవ్ తెలిపారు. -
టీచర్ @ ఎకో స్మార్ట్ కుండీ
లక్ష్మీదేవికి పాఠాలూ ప్రయోగాలే ఊపిరి. క్లాసులో పాఠంతోపాటు ప్రయోగమూ చేయిస్తారు. మొక్క కోసం నేలకు హాని తలపెడితే ఎలా? అందుకే నేలకు మేలు చేసే పూల కుండీ చేశారు. ఆ.. ఎకో స్మార్ట్ పూల కుండీ... అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శితం కానుంది. ‘టీచర్ ఉద్యోగం ఒక వరం. దేవుడిచ్చిన ఈ అవకాశానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేయాలనేది నా ఆశయం’ అన్నారు కొల్లాటి లక్ష్మీదేవి. ఆమె పుట్టింది, పెరిగింది మచిలీ పట్నంలో. ఎమ్ఎస్సీ, బీఈడీ చేసి 1995లో డీఎస్సీ సెలెక్షన్లో ఉద్యోగం తెచ్చుకున్నారు. తొలి పోస్టింగ్ కృష్ణాజిల్లా, సుల్తానగరంలో. అప్పటి నుంచి మొదలైందామె విజ్ఞాన దానయజ్ఞం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న విషయాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించడంతో మొదలైందా యజ్ఞం. పదేళ్ల తర్వాత పెడన మండలం చెన్నూరు ఈస్ట్లో మరో స్కూల్కి హెడ్మాస్టర్గా బదిలీ. ఆ సంతోషం ఆ స్కూల్కి వెళ్లే వరకే. పదిహేనుమంది పిల్లలున్న స్కూల్ అది. అలాగే వదిలేస్తే ఇద్దరు టీచర్ల స్కూల్లో ఒక పోస్ట్ రద్దయ్యే పరిస్థితి. ఇంటింటికీ వెళ్లి ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. మంచి విద్యనందిస్తాం. మా మీద నమ్మకం ఉంచండి’ అని నచ్చచెప్పి ఎన్రోల్మెంట్ 45కి పెంచారు. సైన్స్ ప్రాజెక్టులు చేయించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ పాఠశాల పిల్లలను అయస్కాంతంలా ఆకర్షించేటట్లు చేశారు. ఆ తర్వాత చెన్నూరు జిల్లా పరిషత్ స్కూల్కి వచ్చినప్పటి నుంచి పెద్ద తరగతులకు పాఠం చెప్పే అవకాశం రావడంతో మరింత విస్తృతంగా ప్రయోగాలు మొదలుపెట్టారు. వందకు పైగా ప్రయోగాలు చేసిన ఆమె ప్రయోగాల్లో ఎకో ఫ్రెండ్లీ పూల కుండీ ప్రయోగం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఆమె విద్యార్థులు మణికంఠ, వినయ కుమార్లు యూఎస్లోని టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్ నగరంలో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్లో ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో ఈ ప్రయోగాన్ని ప్రదర్శించనున్నారు. తన ప్రయోగాల పరంపరను సాక్షితో పంచుకున్నారు లక్ష్మీదేవి. ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటారు! పిల్లల మెదడు కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్లకు మనం మనసు పెట్టి నేర్పిస్తే వాళ్లు అంతే చురుగ్గా నేర్చుకుంటారు. ప్రయోగాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పాఠాలను ప్రయోగాత్మకంగా వివరించడానికి స్లయిడ్లు, స్టెమ్, లీఫ్, ప్లవర్ల భాగాలు నిలువుకోత, అడ్డకోతల నుంచి శరీర అవయవాల పనితీరును వివరించడానికి వధశాలల నుంచి మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులను సేకరించేదాన్ని. ఒక సైన్స్ ఫేర్లో సులువైన పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకాన్ని నిరూపించాం. కానీ మా స్కూల్కి గణితం విభాగంలో ఒక అవార్డ్ ప్రకటించడంతో అదే స్కూల్కి రెండో అవార్డు ఇవ్వకూడదని చెప్పి అప్రిషియేషన్ ఇచ్చారు. నాచుతో సేద్యం ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. కోవిడ్ సమయంలో ఎక్కువ ఖాళీ సమయం వచ్చింది. మా ఇంటి ఎదురుగా సంతలో అమ్మే మొక్కలు, నర్సరీల వాళ్లు వాడే పాలిథిన్ కవర్ల మీద దృష్టి పడింది. వాటికి ప్రత్యామ్నాయం కోసం ప్రయోగాలు మొదలుపెట్టాను. వేరుశనగపొట్టు, వేపాకు, కొబ్బరి పీచు, మెంతుల మిశ్రమంతో కుండీ తయారీ విజయవంతమైంది. ఎండకు, వానకు తట్టుకుని నిలవడంలో కష్టమవడంతో కలంకారీలో ఉపయోగించే సహజ రంగులను వేయడంతో సమస్య పరిష్కారమైంది. ఇక అవి మట్టిలో కలిసిపోవడం గురించినదే అసలు ప్రశ్న. నెలరోజుల్లో డీ కంపోజ్ అవుతోంది. ఈ కుండీ మట్టిలో కలిసిన తరవాత మట్టికి పోషణనిస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడమూ అవసరమే. ఎన్పీకే చాలా తక్కువగా ఉన్న మట్టిలో వేసి, కలిసిపోయిన తర్వాత మట్టిని మళ్లీ టెస్ట్కి పంపిస్తే ఎన్పీకే గణనీయంగా పెరిగినట్లు రిపోర్ట్ వచ్చింది. అంతే కాదు నీటిని నిలుపుకునే శక్తి పెరిగింది, వేపలోని యాంటీ మైక్రోబియల్ స్వభావం వల్ల తెగుళ్లు నివారణ సాధ్యమైంది. పైటో కెమికల్స్ ఉన్నాయని ల్యాబ్టెస్ట్లో నిర్ధారణ అయింది. నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ పెట్టిన సైన్స్ ఫేర్లలో మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయులు దాటి జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శించాం. మెరిటోరియస్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ‘బెస్ట్ గైడ్ టీచర్’ అవార్డు అందుకున్నాను. ఈ ప్రయోగాన్ని అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించడానికి పెడన నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం. ఢిల్లీలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని 12వ తేదీన అమెరికా విమానం ఎక్కుతారు మా పిల్లలు’’ అని సంతోషంగా చెప్పారు లక్ష్మీదేవి. ఫ్లోరైడ్ జవాబు దొరికింది! నేను గర్వంగా చెప్పుకోదగిన ప్రయోగాల్లో ఫ్లోరైడ్ నీటిని శుద్ధి చేసే కుండ కూడా ముఖ్యమైనదే. మట్టిలో తులసి, మునగ ఆకులు కలిపి చేశాను. ఫ్లోరైడ్ 3.5 పీపీఎమ్ ఉన్న నీటిలో అడవుల్లో దొరికే చిల్లగింజలను వేసి హార్డ్నెస్ తగ్గించిన తరవాత ఆ నీటిని నేను చేసిన కుండలో పోసి ఆరు గంటల తర్వాత టెస్ట్ చేస్తే పీపీఎమ్ 1.5 వచ్చింది. ఈ కుండలో శుద్ధి అయిన నీటి పీహెచ్ సాధారణ స్థాయుల్లో ఉండడమే కాదు నీటిలో ఉండాల్సిన కంపోజిషన్స్ అన్నీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన స్మార్ట్ ఇండియన్ హాకథాన్లో ప్రదర్శించాం. ‘ద ఇనిషి యేటివ్ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్స్టెమ్ (ఐరిస్)’ నిర్వహించిన పోటీలో ప్రదర్శించినప్పుడు నా స్టూడెంట్ ‘సీహెచ్. తరుణ్బాబు’కి ‘యంగ్ ఇన్నోవేటర్ అవార్డు’, 45 వేల క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఫిఫ్త్ యాన్యువల్ ఇంటర్నేషనల్ ఇన్నోహెల్త్ ప్రోగ్రామ్ ఢిల్లీ ట్రిపుల్ ఐటీ– ఇన్నో క్యూరియో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫైనల్స్కి వచ్చి ఆరు బెస్ట్ ప్రాజెక్టుల్లో రెండవ స్థానం. – కొల్లాటి లక్ష్మీదేవి, బయలాజికల్ సైన్స్ అసిస్టెంట్, బీజీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెడన, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో మేము తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ పూల కుండీని డల్లాస్లో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్లో ప్రదర్శిస్తారు. ఆ కార్యక్రమంలో వంద దేశాలు పాల్గొంటాయి, ప్రదర్శనలో 1800 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని బ్రాడ్కామ్ అనే మల్టీనేషనల్ కంపెనీ నిర్వహిస్తోంది. – వాకా మంజులారెడ్డి -
యూపీఐ, రూపేలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి
కోచి: భారత్లో విజయవంతమైన యూపీఐ, రూపే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యక్తం చేశారు. భారత్ ఈ విషయంలో తన జీ20 అధ్యక్ష స్థానాన్ని అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. మన దేశంలో రూపొందించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ఎంతో విజయవంతమైంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత మెరుగైన చెల్లింపుల వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. అందుకే పలు దేశాలు ఈ సాధనం విషయంలో ఆసక్తి చూపిస్తున్నాయి. ‘‘రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ విజన్ 2025 కింద.. ప్రతి ఒక్కరికీ ఈ–చెల్లింపులు, ఎక్కడైనా, ఎప్పుడైనా (4ఈలు) అనే ముఖ్యమైన థీమ్కు కట్టుబడి ఉన్నాం. మన చెల్లింపుల ఉత్పత్తులను అంతర్జాతీయం చేసేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అప్పుడు మన దేశానికి కొత్త అవకాశాల ప్రపంచం ఏర్పడుతుంది. ఈ ఏడాది జీ20 దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తోంది. కనుక అంతర్జాతీయంగా అందరి దృష్టికీ మన విజయవంతమైన స్టోరీని తీసుకెళ్లాలి’’అని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవస్థతో అనుసంధానం అంతర్జాతీయ వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థ అనుసంధానత పెరుగుతోందన్నారు. సీమాంతర చెల్లింపులు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయని.. మన యూపీఐ, రూపే నెట్వర్క్ స్థానం అంతర్జాతీయంగా విస్తరిస్తోందని చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో ఇతర దేశాలతో మన చెల్లింపులు, స్వీకరణ లావాదేవీలు మరింత సులభంగా, చౌకగా, వేగంగా జరిగేందుకు వీలు పడుతుందన్నారు. యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత మర్చంట్ చెల్లింపులు ప్రస్తుతం భూటాన్, సింగపూర్, యూఏఈలో అందుబాటులోకి రావడం గమనార్హం. ఈ విషయంలో మనం ఎంతో సాధించామని, రానున్న రోజుల్లో మరింత చేయాల్సి ఉందని శక్తికాంతదాస్ అన్నారు. వైఫల్యాలపై దృష్టి సారించాలి.. ‘‘విజయవంతం కాని ప్రతీ లావాదేవీ, మోసపూరిత ప్రయత్నాలనేవి కొనసాగితే, ప్రతి ఫిర్యాదును సంతృప్తికరంగా పరిష్కరించకపోతే అది ఆందోళనకరమైన అంశమే అవుతుంది. అప్పుడు మరింత లోతైన విశ్లేషణ చేయాల్సి వస్తుంది. దేశంలో ఎవరూ కూడా డిజిటల్ చెల్లింపులకు వెలుపల ఉండకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని శక్తికాంతదాస్ అన్నారు. -
Tasheen Rahimtoola: స్టార్ స్ట్రాటజిస్ట్
ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్గా తనను తాను నిరూపించుకున్న తషీన్...ఒకరోజు తనకు తానే సలహా ఇచ్చుకుంది. ఆ సలహా 28 సంవత్సరాల తషీన్ను సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మార్చింది... మ్యాథ్స్, ఎకనామిక్స్లో డిగ్రీ చేసిన తషీన్ రహిమ్తోలకు ఎప్పుడూ లాభ,నష్టాల గురించి ఆలోచించే అవసరం రాలేదు. ‘ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్’గా ఆమె మంచి ఉద్యోగంలో ఉంది. ‘ఎందరికో వ్యూహాత్మక సలహాలు ఇస్తున్న నేను ఎందుకు వ్యాపారంలోకి అడుగుపెట్టకూడదు?’ అని ఒక ఫైన్మార్నింగ్ ఆలోచించింది. తనకు తానే సలహా ఇచ్చుకుంది. నిజానికి ఎంటర్ప్రెన్యూర్ అనే మాట ఆమెకు కొత్తేమీ కాదు. తల్లిదండ్రులు ఇద్దరూ వేరువేరు వ్యాపారాల్లో ఉన్నారు. అయినప్పటికీ ‘జాబ్ వదిలేస్తున్నాను’ అని చెబితే ‘రిస్క్ తీసుకుంటున్నావు’ అనే మాటే ఎక్కువగా వినిపించింది. ‘బిజినెస్లోకి అడుగు పెట్టే ముందు బాగా నవ్వు. ఎందుకంటే రకరకాల టెన్షన్లతో ఆ తరువాత నవ్వే పరిస్థితి ఉండదు’ అన్నారు కొందరు. ఎవరు ఎలా స్పందించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తషీన్. ‘టేస్ట్ రీట్రీట్’తో ఎంటర్ప్రెన్యూర్గా తొలి అడుగు వేసింది. మార్కెట్లో పోటీని తట్టుకోవడం, ఆర్డర్స్ సంపాదించడం, టీమ్ను లీడ్ చేయడం...అంత తేలికైన విషయం కాదు. అయితే ఆమెకు ప్రతి ఆర్డర్ ఒక విలువైన పాఠం నేర్పింది. థీమ్డ్ పార్టీస్, కార్పొరేట్ గిఫ్టింగ్, సిట్–డౌన్ డిన్నర్....మొదలైన వాటిలో తనదైన ముద్ర వేసింది టేస్ట్ రీట్రీట్. ఒకప్పుడు ‘ముంబై–వోన్లీ సర్వీస్’గా మొదలైన ఈ వెంచర్ పాన్–ఇండియా ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఎంతో కాలం పట్టలేదు. 50 లక్షలతో మొదలుపెట్టిన ‘టేస్ట్ రీట్రీట్’ ఇప్పుడు ‘17 క్రోర్ క్లబ్’లో చేరింది. ‘ఎందరో సాధించిన ఎన్నో విజయాల గురించి వింటూ ఉంటాం. నేను కూడా ట్రై చేసి చూస్తాను అనే ఆలోచన మీలో వస్తే మొదటి అడుగు పడినట్లే. మీకు ఇష్టమైన బిజినెస్ మొదలుపెడితే రెండో అడుగు పడుతుంది. మూడో అడుగులో అనుభవాలే పాఠాలు నేర్పించి మనల్ని విజేతగా నిలుపుతాయి’ అంటుంది 28 సంవత్సరాల తషీన్. -
మన మామిడికి.. మంచిరోజులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిపి ఎగుమతికి తగ్గ నాణ్యమైన మామిడిని ఉత్పత్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకోసం మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. వీటిని మామిడి క్లస్టర్ కింద గుర్తించింది. ప్రస్తుతం ఈ జిల్లాల్లో 57,344 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సగటున 2.29 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. కొత్తగా మరో 10 వేల ఎకరాల్లో మామిడి పంటను ప్రోత్సహిస్తారు. మొత్తంగా 67 వేల ఎకరాల్లో ఎగుమతి చేసే స్థాయి కలిగి ఉండే నాణ్యమైన మామిడి ఉత్పత్తి అయ్యేలా చూస్తారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.200 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన సొమ్మును ప్రైవేట్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. రాష్ట్ర ఉద్యానశాఖతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ బ్రాండ్ కోసం ప్రత్యేక చర్యలు తెలంగాణలో దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాధారణంగా ఎకరానికి ఎనిమిది టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. అంటే 28 లక్షల టన్నుల మామిడి రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. సీజన్ను బట్టి ఒక్కోసారి తక్కువ ఎక్కువ అవుతుంది. అయితే తెలంగాణ మామిడికి దేశంలో మార్కెట్ ఉన్నా, విదేశీ ఎగుమతులు లేకపోవడంతో రైతులకు అవసరమైన గిట్టుబాటు ధర లభించడం లేదు. అయితే ఎగుమతి చేయాలంటే అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి రసాయనాలు వాడకూడదు. ఎక్స్పోర్ట్ క్వాలిటీని పెంచేందుకు ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మిస్తారు. అకాల వర్షాలకు నష్టాలు జరగకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. రైతులకు అత్యంత నాణ్యమైన మామిడి విత్తనాలను అందజేస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మామిడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు (బ్రాండ్) తీసుకొచ్చేందుకు, తద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసింది. అందుకోసం ఐదు జిల్లాలను ఎంపిక చేసింది. బిడ్డింగ్ ద్వారా ప్రైవేటు సంస్థల ఎంపిక ఈ ప్రాజెక్టుకు చేసే రూ.200 కోట్ల వ్యయంలో మామిడి ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి సమయంలో రూ.79.89 కోట్లు, కోత అనంతరం నిర్వహణ, అదనపు విలువను జోడించేందుకు రూ.80.70 కోట్లు, మార్కెటింగ్, బ్రాండింగ్ కోసం రూ.39.80 కోట్లు ఖర్చు చేస్తారు. మూడేళ్లలో ఈ సొమ్మును ఖర్చు చేయాలి. ప్రాజెక్టు అమలు కోసం రాష్ట్ర ఉద్యానశాఖ, జాతీయ ఉద్యాన మండలి ఒప్పందం చేసుకుంటాయి. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించే ప్రైవేట్ సంస్థలను బిడ్డింగ్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. రైతు ఉత్పత్తి సంస్థలు, సహకార సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మండళ్లకు భాగస్వామ్యం కల్పిస్తారు. రాష్ట్రంలో పండించే మామిడిని ఢిల్లీకి కిసాన్ రైలు ద్వారా పంపిస్తారు. దళారులదే రాజ్యం: మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తోంది. ప్రస్తుతం రైతుల నుంచి టన్ను మామిడి రూ.40 వేలకు కొంటున్న వ్యాపారులు, వినియోగదారుల నుంచి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో పండ్లు రూ.50 వరకు ఉండాల్సి ఉండగా మార్కెట్లో రూ.100 పలుకుతోంది. కొన్ని రకాలకైతే రూ.150–200 వసూలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్నప్పటికీ గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో రైతు ఉన్నాడు. -
పంట సిరులే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ సముచితమైన ధర, అదనపు విలువ జోడింపుతో అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్రంలో చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు కానుంది. చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించి ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించే దిశగా ఈ బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. బోర్డు విధి విధానాలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపు, అనుబంధ ఉత్పత్తులు వంటి అంశాలపై ఏ విధంగా ముందుకు సాగాలనే అంశాల పరిశీలనకు మార్కెటింగ్, వ్యవసాయ శాఖాధికారులు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటనలు చేసివచ్చారు. కేంద్ర సంస్థలతో సంప్రదింపులు జరిపారు. ఇంతకీ చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు ఆవశ్యకత ఏమిటి, దేనికి ఉపయోగపడుతుందనే దానిపై అధికార వర్గాలు ఏమంటున్నాయంటే... వ్యవసాయ రంగానికి మంచి ఊపు పంటల ఉత్పత్తి, శుద్ధి, ప్రతి ఉత్పత్తికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడటం చిరు ధాన్యాల బోర్డు ప్రధాన ఉద్దేశం. తద్వారా వ్యవసాయ రంగానికి, అందులో భాగస్వాములయ్యే వారికి ఊపు, ఉత్సాహాన్ని ఇవ్వడమే దీని పని. బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. పంటల ప్రణాళిక నుంచి ఆహార శుద్ధి వరకు, మార్కెటింగ్ మొదలు ఎగుమతుల వరకు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. పరిశోధన, మార్కెటింగ్, ఎగుమతి సహా అంతర్లీనంగా ఉండే వాటన్నిటి మధ్య సమన్వయం, సహకారం ఉండేలా చూస్తుంది. బోర్డు విధులు ఇలా.. ఏయే చిరు ధాన్యంతో ఏమేం చేయొచ్చో వాటన్నింటినీ గుర్తిస్తుంది. ఉదాహరణకు కొర్రలతో అన్నం మాత్రమే కాకుండా ఎన్ని రకాల వంటకాలు, ఇతర పదార్థాలు చేయవచ్చో ఈ బోర్డు గుర్తిస్తుంది. ఉత్పత్తిదారులకు వివరిస్తుంది. ఏయే ప్రాంతాల్లో ఏయే రకాల చిరు ధాన్యాలు పండించవచ్చో ప్రణాళికను తయారు చేయడంతో పాటు ఆచరణాత్మక పద్ధతుల్ని రూపొందిస్తుంది. గ్రామ స్థాయిల్లో వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తుంది. సేకరణ, మార్కెటింగ్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే జోక్యం చేసుకుంటుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల ప్రమాణాలు ఉండేలా రైతులకు అవగాహన కల్పిస్తుంది. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేలా ప్రణాళికను తయారు చేస్తుంది. ప్రైవేట్ భాగస్వాములతో కలిసి ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా చూస్తుంది. సమర్థమైన మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను ప్రోత్సహిస్తుంది. వ్యవస్థ ఎలా ఉంటుందంటే.. ఇది నాలుగు ప్రధాన వ్యవస్థలతో అనుసంధానమై ఉంటుంది. పరిశోధన, విస్తరణ, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్, వాణిజ్యం పెంపుదల, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ఇతర యంత్రాంగం, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వంటివి ఇందులో ఉంటాయి. ప్రతి వ్యవస్థకు నిర్ధిష్టమైన పని విభజన ఉంటుంది. వీటితో పాటు బోర్డు ప్రస్తుతం వ్యవసాయ శాఖ, విశ్వవిద్యాలయాలు, మార్కెటింగ్ ఇతర ప్రభుత్వ సంస్థలలో ఉన్న సౌకర్యాలను, మౌలిక వసతులను వినియోగించుకుంటుంది. ఈ బోర్డుకు ఎవర్ని చైర్మన్గా నియమించాలనేది ఖరారు కానప్పటికీ ఎంఎల్ఏ లేదా ఎమ్మెల్సీ చైర్మన్గా ఉంటారని భావిస్తున్నారు. వైస్ చైర్మన్గా రైతు నాయకుడు ఉంటారు. విస్తరణ, మార్కెటింగ్, స్టోరేజి, మౌలిక వసతులు, ప్రాసెసింగ్, వ్యాపార–వాణిజ్య వర్గాల నిపుణులు, వ్యవసాయ రంగం నుంచి ఒక రైతు, ఇతర భాగస్వామ్య పక్షాల వారు బోర్డులో ప్రతినిధులుగా ఉంటారు. -
సూపర్ డూపర్ కంప్యూటర్లు అవసరమే!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకోవడం మొదలుకొని ప్రాణాంతక కేన్సర్ చికిత్స వరకు.. కంప్యూటర్ల వాడకం లేని రంగమంటూ లేదంటే అతిశయోక్తి కాదు.. ఏటా కంప్యూటర్ల వేగం పెరుగుతూనే ఉన్నా.. మరింత వేగవంతమైన యంత్రాల కోసం ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి.. ఎందుకు? నిజంగానే వీటి అవసరముందా? అడ్డంకులు ఏంటి? అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునేందుకు కంప్యూటర్ శాస్త్రవేత్త చిరంజీబ్ సుర్ను ‘సాక్షి’కలిసింది. అత్యధిక సామర్థ్యంతో పనిచేసే కంప్యూటింగ్ వ్యవస్థలపై హైదరాబాద్లో జరుగుతున్న హెచ్ఐపీసీ అంతర్జాతీయ సదస్సుకు అధ్యక్షుడు చిరంజీబ్ సమాధానాలు.. ప్ర: హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్ఐపీసీ) అవసరం ఏంటి? జ: చాలా ఉంది. ఉదాహరణకు మనలో చాలామంది ఉపయోగిస్తున్న గూగుల్ మ్యాప్స్ను తీసుకుందాం. ఇప్పుడైతే మీరు స్క్రీన్పై వేలిని కదిలిస్తూ సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు గానీ.. భవిష్యత్తులో మీ మాటతోనే అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. పర్సనల్ అసిస్టెంట్ల రూపంలో ఇప్పటికే మాటలకు స్పందించే వ్యవస్థలు ఉన్నా.. హెచ్ఐపీసీ కారణంగా భాషతోపాటు.. యాసను గుర్తించి తదనుగుణంగా స్పందించే వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయి. వాతావరణ అంచనాలను కచ్చితంగా తెలుసుకునేందుకు, కొత్త మందుల ఆవిష్కరణలో నూ కీలక ప్రాత పోషించనుంది. సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి అందరికీ ఉపయోగపడే కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు, వాటిని ఆచరణలో పెట్టేందుకు కూడా కంప్యూటర్ల వేగం, సామర్థ్యం మరింత పెరగాల్సి ఉంది. ప్ర: కంప్యూటర్ల వేగం, సామర్థ్యం ప్రతి 18 నెలలకు రెట్టింపు అవుతుందని మూర్స్ నిబంధన చెబుతుంది. ప్రస్తుతం ట్రాన్సిస్టర్ల సైజు 9 నానోమీటర్లు. ఇంతకంటే తక్కువ సైజువి తయారు చేసే అవకాశం లేదు. మరి.. కంప్యూటర్ల వేగం పెంచడం ఎలా సాధ్యం? జ: మూర్స్ నిబంధనను అధిగమించేందుకు గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు. ‘ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే’ల వంటి పరికరాల ద్వారా హార్డ్వేర్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. సాఫ్ట్వేర్లు పనిచేసే తీరులో నూ మార్పులు చేయడం ద్వారా డెస్క్టాప్ కంప్యూటర్కే సూపర్ కంప్యూ టర్ సామర్థ్యం ఇవ్వగలుగుతున్నాం. వైద్యరంగంలోనూ హెచ్ఐపీసీతో అద్భుతాలు సృష్టించొచ్చు. ఒకసారి ఎంఆర్ఐ తీసుకుంటే రేడియేషన్ వస్తుందని మనకు తెలుసు. దీనిని హెచ్ఐపీసీతో అధిగమించవచ్చు. ప్ర: భారత్లో హెచ్ఐపీసీ పరిస్థితి ఏంటి? జ: నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ను కేంద్రం ఇప్పటికే అమలు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సమస్యల పరిష్కారానికి సూపర్ కంప్యూటర్లను వాడటం, దీనికి తగ్గ మానవ వనరులు అభివృద్ధి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ‘పరమ్ శివాయ్’ పేరుతో ఓ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. దేశంలో హైపర్ఫార్మెన్స్ కంప్యూటింగ్పై కోర్సులు అందించే విద్యాసంస్థలు తక్కువగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ ఈ రం గంలో కోర్సులు మొదలైతే సమీప భవిష్యత్తులో డేటా, ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో దేశ యువత ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. హెచ్ఐపీసీ రంగంలో పరిశోధనలను ముమ్మరం చేసేందుకు, అంతర్జాతీయ పురోగతిని అర్థం చేసుకునేందుకు హెచ్ఐపీసీ వంటి సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. హెచ్ఐపీసీ సమావేశంలో సుమారు 500 మంది దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. -
అడవి కాచిన వన్నెలు
అడవి కాచిన వెన్నెల అడవికే పరిమితం అవుతుంది. డేబ్భయ్ ఏళ్ల వయసులో ఈ గిరిపుత్రిక నేర్చుకున్నచిత్రలేఖనం మాత్రం విశ్వ విధిలో కాంతులు విరజిమ్ముతోంది. ఖండాంతర ఖ్యాతిని సముపార్జిస్తోంది. పుట్టినప్పటి నుంచి డెబ్బై ఏళ్ల వరకు జీవించిందామె. అన్నేళ్లలో తనకు చెప్పుకోవడానికంటూ ఏ ప్రత్యేకతా లేదు. మధ్యప్రదేశ్లోని ‘లోరా’ అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది. భర్త, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అడవిలో దొరికే పనులతో బతుకు వెళ్లదీసింది. ఆమెకు నలబై ఏళ్ల వయసులో భర్త పోయాడు. ముగ్గురు పిల్లల్ని ఒక ఇంటి వాళ్లను చేసే బాధ్యత ఆమె భుజాల మీద పడింది. భర్త వదిలి వెళ్లిన ఆ బాధ్యతలను పూర్తి చేసిందామె. అయితే డెబ్బై ఏళ్ల వయసులో ఆమె జీవితం ఆమెకు కూడా తెలియకుండా ఊహించని మలుపు తిరిగింది! ఇప్పుడామెకి ఎనబై ఏళ్లు. ఈ పదేళ్లలో ఆమె అంతర్జాతీయ స్థాయి చిత్రకారిణి అయింది! రాష్ట్రం దాటి బయటకు రాని జీవితం ఆమెది. ఆమె వేసిన బొమ్మలు ఖండాంతరాలు దాటి ఇప్పుడు పారిస్లోనూ, ఇటలీలోని మిలన్ ఆర్ట్ ఎగ్జిబిషన్లోనూ ప్రఖ్యాత చిత్రకారుల చిత్రాల వరుసలో స్థానం సంపాదించుకున్నాయి. ప్రైజులు కూడా గెలుచుకున్నాయి. దేశంలో అనేక ఆర్ట్ గ్యాలరీలలో అంతకంటే ముందునుంచే ప్రదర్శితమవుతున్నాయి. ఈ ఎనబై ఏళ్ల చిత్రకారిణి పేరు జుధైయా బాయ్ బైగా. ‘‘పెయింటింగ్ నన్ను మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అక్కడ నేను స్వేచ్ఛావిహంగాన్ని’’ అంటోంది బైగా. ఆమె అంటున్నట్లే ఆకాశమే హద్దుగా తన కుంచె శక్తితో మేధా యుక్తితో సృజనాత్మక లోకంలో విహరిస్తోందామె. జీవితమే థీమ్ బైగా కి బొమ్మలు వేయడానికి థీమ్ గురించి మేధామథనం చేయాల్సిన అవసరమే ఉండదు. తన చుట్టూ కనిపించే సామాన్య గిరిజన జీవితాన్నే కాన్వాస్ మీదకు తెస్తుంది. గిరిజన సంప్రదాయ జీవనశైలికి ప్రతిబింబాలవి. ఒక్కో బొమ్మకు మూడు వందల నుంచి ఎనిమిది వేల వరకు ధర పలుకుతోంది. గ్రామస్థులు ఆమె ధరిస్తున్న రంగురంగుల కొత్త దుస్తులను చూస్తూ ‘‘బైగా అవ్వ జీవితం రంగులమయం అయింది’’ అని చమత్కరిస్తున్నారు. ‘‘ఆమె నుంచి నేర్చుకోవలసింది డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు. డెబ్బై ఏళ్ల వయసులో చిత్రలేఖనం నేర్చుకోవడానికి ముందుకు రావడమే’’నన్నారు ఆషిశ్ స్వామి. అడవి బిడ్డలకే సొంతం బెంగాల్కు చెందిన ఆషిశ్ ప్రముఖ చిత్రకారుడు, శాంతినికేతన్ విద్యార్థి. ఆషిశ్ తన ఆర్ట్ స్టూడియో ‘జన్గాన్ తస్వీర్ఖానా’లో ప్రదర్శన కోసం మధ్యప్రదేశ్లోని గిరిజన గ్రామాలను సందర్శిస్తూ పదేళ్ల కిందట లోరా వచ్చాడు. ఉచితంగా చిత్రలేఖనం నేర్పిస్తున్నాడని తెలియడంతో పదిహేను మంది మహిళలు నేర్చుకోవడానికి వచ్చారు. డెబ్బై ఏళ్ల బైగా కూడా. ‘‘కుంచె పట్టుకున్న తొలిరోజు నుంచే ఆమె దీక్షతో బొమ్మలు వేసింది. ఒకటి వేసిన తర్వాత మరింకేదో కొత్తగా వేయాలనే తపన కూడా కనిపించేదామెలో. శిక్షణ తీసుకున్న నాగరిక చిత్రకారులకు సాధ్యం కానిది, అడవి బిడ్డలకు మాత్రమే ఒంటపట్టే మెళకువ ఒకటుంది. వాళ్లు అడవిలో సంచరించే జంతువుల కళ్లలోని భావాన్ని ఇట్టే పసిగట్టేస్తారు. బైగా ఆ భావాన్ని బొమ్మలోకి పట్టుకొస్తుంది’’ అన్నాడు ఆషిశ్ స్వామి. ‘నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదు’ అని ఇప్పటికే ఎందరో నిరూపించారు. జుధైయా బాయ్ బైగా మరోసారి నిరూపించింది, తన కుగ్రామం లోరా పేరును ప్రపంచస్థాయి వేదికల మీదకు తీసుకెళ్లింది. – మంజీర -
హ్యాపీ.. హ్యాపీ
నిర్మించిన తొలి సినిమాయే అంతర్జాతీయ స్థాయి వేదికపై ప్రదర్శితమయ్యే అవకాశం వస్తే ఏ నిర్మాతకైనా ఆనందంగానే ఉంటుంది. ఆ హ్యాపీ ఫీలింగ్లోనే ఉన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. మ్యూజిషియన్ విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ‘99 సాంగ్స్’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ ఒక నిర్మాతగా ఉన్నారు. అంతే కాదండోయ్ ఈ సినిమాకు రచయిత కూడా. ఈ ‘99 సాంగ్స్’ సినిమాతో ఇహన్ భట్, ఎడిల్సీ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు 24వ దక్షిణ కొరియాలో బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ చిత్రోత్సవాల్లో అక్టోబరు 9న ‘99 సాంగ్స్’ ప్రదర్శితం కానుంది. ‘‘99 సాంగ్స్’ చిత్రం బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కాబోతుందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ఏఆర్ రెహమాన్. 85 దేశాల నుంచి వచ్చిన దాదాపు 299 సినిమాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్నాయి. స్క్రీనింగ్ అయ్యే సినిమాల జాబితాలో ‘ది స్కై ఈజ్ పింక్, ఆధార్’ వంటి హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించే వాటిలో కొన్ని షార్ట్ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. -
అంతర్జాతీయ స్థాయిలో తెలుగుకవులకు స్థానం
సాక్షి, నెల్లూరు(వీఆర్సీసెంటర్): అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు కవులకు స్థానం లభించడం తెలుగు వారందరికీ గర్వకారణమని సుప్రసిద్ధకవి, జిల్లా వాసి డాక్టర్ పెరుగు రామకృష్ణ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన దక్షిణాసియా కవిత సంకలనంలో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల్లో ఒకరైన శివారెడ్డికి సోమవారం నెల్లూరు నగరంలో పెరుగు రామకృష్ణ సంపాదకీయం వహించి, వెలరించిన ‘దిపొయెట్రి ఆఫ్ సౌత్ ఏసియా’ పుస్తకాన్ని శివారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పెరుగు మాట్లాడుతూ తొమ్మిది దేశాల కవుల సరసన ఇద్దరు తెలుగు కవులు శివారెడ్డి, పాపినేని శిశంకర్ నిలవడం అభినందనీయమన్నారు. సార్క్ దేశాల కవులు రాసిన 53 కవితల్లో వీరి కవితలు కూడా ఉండడం తెలుగువారందరికీ గర్వకారణమ న్నారు. తెలుగుభాష కన్వీనర్ కూడా అయిన శివారెడ్డి రాసి ప్రచురించిన కవితలతో వారికి తెలుగుకవుల ప్రతిభాపాటవాలు ఇతర భాషా కవులకు తెలియవచ్చిందని పేర్కొన్నారు. -
బ్లాక్లిస్ట్లో పాకిస్తాన్!
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికలపై ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయంపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)కు పుల్వామా ఘటనపై కీలక సాక్ష్యాధారాలను సమర్పించనుంది. వచ్చేవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఎఫ్ఏటీఏ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్కు పాకిస్తాన్ నిఘా సంస్థలు అందజేస్తున్న సాయాన్ని భారత్ ఎండగట్టనుంది. ఈ పత్రాలను భద్రతా సంస్థలు రూపొందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పారిస్లో జరిగే సమావేశంలో పాకిస్తాన్ను నిషేధిత జాబితా(బ్లాక్ లిస్ట్)లో చేర్చాల్సిందిగా కోరతామని తెలిపారు. మనీ లాండరింగ్తో పాటు ఉగ్రవాదులకు ఆర్థిక సాయమందించే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేరుస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ), యూరోపియన్ యూనియన్(ఈయూ)లు సదరు దేశపు రేటింగ్ను డౌన్గ్రేడింగ్ చేస్తాయి. దీంతో అంతర్జాతీయ సంస్థల నుంచి రుణసాయం, పెట్టుబడులు నిలిచిపోతాయి. అలాగే ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్ వంటి రేటింగ్ ఏజెన్సీలు సైతం పెట్టుబడులపై రిస్క్ రేటింగ్లను తగ్గించేస్తాయి. తద్వారా నిషేధిత దేశానికి అన్నివైపుల నుంచి దారులు మూసుకుపోతాయి. 2018, జూలైలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎఫ్ఏటీఎఫ్ పాక్ను ‘గ్రే’ జాబితాలో చేర్చింది. నిర్దేశిత నిబంధనలను పాటించకుంటే నిషేధిత జాబితాలో చేరుస్తామని హెచ్చరించింది. ఎఫ్ఏటీఎఫ్లో 35 దేశాలు, ఈయూ కమిషన్, గల్ఫ్ సహకార మండలి సభ్యులుగా ఉన్నాయి. ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేర్చింది. -
దేశానికి లిఫ్ట్ ఇచ్చినా దేశం లిఫ్ట్ ఇవ్వలేదు!
అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన శ్యామలాదేవికి నేడు సొంత రాష్ట్రంలోనే ఆదరణ కరువైంది! శిక్షకులు, మార్గదర్శకులు లేకుండా.. పట్టుదల, సాధనే కృషిగా అంతర్జాతీయ స్థాయిలో ఇరవై నాలుగు దేశాలు పాల్గొన్న ఆసియా జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించి దేశానికి వన్నె తెచ్చినప్పటికీ ఏ గుర్తింపు లేకుండా ఆమె అనామకంగా ఉండవలసి వస్తోంది! కేంద్రం నుంచి కూడా ఎటువంటి సహాయం అందకపోవడంతో చిరు ఉద్యోగంతో ఆమె కాలం వెళ్లదీస్తున్నారు. శ్యామల 2006లో దక్షిణకొరియాలో జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలలో బంగారు పతకం సాధించి, భారతదేశ జెండాను రెపరెపలాడించారు. దాంతో పాటు జాతీయ స్థాయిలో 8 రజిత, 16 కాంస్య పతకాలు గెలుపొందారు.శ్యామల స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. తండ్రి కిషోర్కుమార్. తల్లి విజయలక్ష్మి. తండ్రి అల్యూమినియం వస్తువులు తయారు చేసే పరిశ్రమలో దినసరి కార్మికుడిగా పని చేసేవారు. పెద్ద కుటుంబం, తక్కువ ఆదాయం కావడంతో తండ్రికి అండగా ఉండేందుకు బి.కాం. చదివినప్పటికీ శ్యామల కూడా దినసరి కార్మికురాలిగా వెళ్లేవారు. శ్యామలకు పాఠశాలస్థాయి నుంచే ఆటలపై మక్కువ. ఎన్ని అవరోధాలు ఎదురైనా నిరాశ చెందకుండా వెయిట్ లిఫ్టింగ్ సాధన చేస్తూ పవర్ లిఫ్టింగ్లో ఒడుపు సాధించారు. అలా కళాశాల నుంచి జాతీయ స్థాయికి అక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. 2005లో పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించినప్పటికీ లక్షల్లో ఖర్చు కనుక ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో శ్యామలకు ఆ అవకాశం చేజారిపోయింది. ‘శాప్’ అధికారులకు విన్నవించుకుంటే.. ‘ఇంతా ఖర్చు చేశాక పతకం తీసుకురాకుంటే!’ అనే సందేహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి సంవత్సరం దాతలు కొందరు ముందుకు రావడంతో పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత సాధించి దక్షిణ కొరియాలో పతకం సాధించారు. అప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె వైపు చూడను కూడా చూడలేదు. ప్రభుత్వ ఆదరణ లేకపోవడంతో ఆ క్షణం నుంచే ఆటలకు ఆమె స్వస్తి పలికారు. ప్రస్తుతం శ్యామల నెల్లూరు పౌర సరఫరాల సంస్థలో ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నారు. భర్త ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ప్రోత్సహించే వారు కరువవడం, బంగారుపతకం సాధించిన తరువాత ఆమెను మంత్రులు, పెద్ద అధికారులకు పరిచయం చేసే వారు లేకపోవడంతో ఆ ఆణిముత్యం ప్రతిభ అంతటితో అగిపోయింది. పేద కుటుంబంలో జన్మించి దేశం గర్వించే విధంగా పతకం సాధించిన శ్యామలాదేవి ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఆమెకు ఆర్థికంగా సహాయం చేయవలసిన అవసరం ఉంది. వెయిట్ ‘లిస్ట్’ ►2004 ఆగస్టులో... సీనియర్ నేషనల్స్లో కాంస్యం. ►2004 నవంబర్లో... సౌత్ ఇండియాచాంపియన్షిప్లో స్వర్ణం. ►2005 జనవరిలో...జూనియర్ నేషనల్స్ చాంపియన్షిప్లో 4 కాంస్యాలు. ►2005 ఫిబ్రవరిలో...జూనియర్స్ ఫెడరేషన్ కప్లో స్వర్ణం. ►2005లో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత.అదే ఏడాది...అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో రజతం. ►2006లో...జూనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్లో 4 రజతాలు. ►2006... ఫెడరేషన్ కప్ జూనియర్స్ పోటీలలో స్వర్ణం. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోపాల్గొనేందుకు అర్హత. -
గుంతకల్లు రైల్వేస్టేషన్కు అంతర్జాతీయ స్థాయి
గుంతకల్లు: గుంతకల్లు రైల్వేస్టేషన్కు అంతర్జాతీయ స్థాయి హోదానిస్తూ రూ.25 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ స్టేషన్కు మహర్దశేనని రైల్వేవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం ఆరు రైల్వేస్టేషన్లకు, రాయలసీమలో గుంతకల్లు, కర్నూలు స్టేషన్లకు అంతర్జాతీయ హోదా ఇచ్చారు. ప్రస్తుతం గుంతకల్లు స్టేషన్లో రూ.6 కోట్లతో మోడల్ స్టేషన్ భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో మార్పులు చేర్పులు చేసి అంతర్జాతీయ స్థాయిలో భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. రైల్వే అధికారులు పంపిన నమూనాలు పరిశీలిస్తే అవి విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. మోడల్ స్టేషన్ బిల్డింగ్ దక్షిణం వైపున నిర్మిస్తున్నారు. స్టేషన్ ప్రాంగణంలో దాదాపు 2 ఎకరాలపైగా స్థలం ఉంది. అందులో పార్కులు, పౌంటెయిన్లు, ఇతరత్రా అందమైన కళాకృతులు ఏర్పాటు చేయాలన్న యోచనతో ఊహాత్మక నమూనాలను బోర్డు అనుమతికి పంపారు. అదేవిధంగా స్టేషన్లో ఎస్కలేటర్లు, వైఫై సదుపాయం, ఆధునిక ఎలక్ట్రికల్ డిస్ప్లే తదితర హంగులతో గుంతకల్లు రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. -
అంతర్జాతీయ స్థాయిలో మేడారం జాతర
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పలు శాఖల అధికారులను ఆదేశించారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం జాతర ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలని, విదేశీ యాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యేక నివాసాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సాంస్కృతిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, జాతర కార్యక్రమాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన వాకాటి కరుణను జాతర కోసం ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, గిరిజన ఎంపీలను ఆహ్వానించాలని ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అత్యాధునిక మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. జాతర ఏర్పాట్లపై సాంస్కృతిక దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా శాఖల వారీగా సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. యాత్రికులకు హెలికాప్టర్ సేవలను కల్పించాలన్నారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి వెంకటేశం, దేవాదాయ శాఖ కమిషనర్ శివ శంకర్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, నాగిరెడ్డి పాల్గొన్నారు. -
ముచ్చటగా మూడో మహాసభల్లో..
1975, 2012లో జరిగిన రెండు తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఈయన ఈసారి మూడోసభల్లోనూ పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా గత సభల ద్వారా తెలుగు భాషకు, సాహిత్యానికి జరిగిన ప్రయోజనాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలివీ.. మొదటి సభలతో... వివిధ రాష్ట్రాలలో ఉన్న ఆంధ్ర సాంస్కృతిక సంస్థలను ఒకే వేదిక మీదకు చేర్చే ప్రయత్నం జరిగింది. అంతర్జాతీయ తెలుగు సంస్థ ద్వారా భాషాభివృద్ధికి చేయూత లభించింది. అజ్ఞాతంగా ఉండిపోయిన శంకరంబాడి సుందరాచారి రచన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయం ప్రాచుర్యంలోకి వచ్చి రాష్ట్రగీతంగా గుర్తింపునకు నోచుకుంది. తెలుగు బోధనాభాషగా అభివృద్ధి చెంది తెలుగు అకాడమీ కార్యకలాపాలు విస్తరించాయి. ఆ తర్వాత మలేషియా తదితర ప్రాంతాలలో జరిగిన మహాసభలతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు గుర్తింపు పొందింది. రెండవ సభలు తిరుపతిలో 2012, డిసెంబర్లో జరిగిన ఈ సభలకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. అదొక భాషా బ్రహ్మోత్సవంగా జరిగాయి. ఈ సభల ద్వారా... ► అప్పటికి తెలుగు భాషలో సంస్కృతి, భాష, కళలు, సంగీతం, నాటికలు, అష్టావధానాలు... వంటి ప్రక్రియలు విస్తరించాయి. వాటన్నింటినీ ఒకే వేదిక మీదపై పంచుకునే వీలు కలిగింది. ► తెలుగు అకాడమీ చైర్మన్ యాదగిరి ఆధ్వర్యంలో వందకు పైగా తెలుగు సాహిత్యాల మోనోగ్రాఫ్లు వచ్చాయి. ► అమెరికా వంటి దేశాలలో తెలుగు నేర్చుకునే విద్యార్థులకు ‘తెలుగుబడి’ వంటి కార్యక్రమాలకు వ్యాప్తి జరిగింది. ఈ సభలు ఎలా ఉండనున్నాయంటే! ఇలాంటి సభల ద్వారా ఎందరో వర్ధమాన, ప్రసిద్ధ, అజ్ఞాత రచయితలకు కళాకారులకు ప్రచారం లభిస్తుంది. అజ్ఞాతంగా ఉన్న ఎందరో తెలంగాణ కళాకారులకు తమ గళం విప్పే అవకాశం వస్తుంది. ఈ సభలు కాంతులు వెదజల్లి భాషా సంస్కృతులను ప్రపంచ వేదికలపైకి చేరుస్తాయి. – డాక్టర్ రేవూరు అనంతపద్మనాభరావు, అష్టావధాని, దూరదర్శన్ మాజీ అడిషనల్ డైరెక్టర్ ..: వాకా మంజుల -
అంతర్జాతీయ స్థాయిలో లేపాక్షి ఉత్సవాలు
లేపాక్షి : అంతర్జాతీయ స్థాయిలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించడానికి నిపుణులతో సలహాలు తీసుకుంటున్నట్లు అనంతపురం టూరిజం శాఖ డీఈఈ సాయిసుధీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈశ్వరయ్య, ఆర్కెటిక్స్ బీకే తాటియా, ఆర్టిస్ట్ రమాదేవి తెలిపారు. శుక్రవారం సాయంత్రం లేపాక్షిలోని పలు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ, కలెక్టర్ ఆదేశాల మేరకు లేపాక్షికి వచ్చామన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఎలాంటి సందర్శన స్థలాలను అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. లేపాక్షి నంది విగ్రహానికి దక్షిణ భాగంలో పెద్దగుండ్లపై ఆకర్షణీయమైన జఠాయువు పక్షి విగ్రహం ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేస్తున్నట్టు వివరించారు. అదేవిధంగా లేపాక్షికి తూర్పు, పడమటి ద్వారాలను ఆధునికీకరించుటకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. -
అంతర్జాతీయ కరాటే పోటీల్లో చందన ప్రతిభ
వర్ధన్నపేట టౌన్: మండల కేంద్రంలోని ఫుస్కోస్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కాట బోయిన చందన అంతర్జాతీయ కరాటే పోటీ ల్లో వెండి, రజత పతకాలు సాధించినట్లు పా ఠశాలప్రిన్సిపాల్ సిస్టర్ ఆనిస్ తెలిపారు. ఇటీవల వరంగల్, ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్థాయి 13 సంవత్సరాల బాలికల విభాగం పోటీలలో బంగారు పతకం సాధించిన చందన అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ముంబ యిలో ఈనెల 24న నిర్వహించిన అంతర్జాతీయ 18వ వరల్డ్కప్ కరాటే పోటీల్లో కెనడా బాలికతో తలపడిన చందన రెండో స్థానంలో నిలి స్పారింగ్లో వెండి, కటాస్లో రజత పతకం సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన కోచ్ సోమ శ్రీధర్ను ఆమె అభినందించారు. -
హెచ్ఎండీఏను ముట్టడించి ఉద్యమిస్తామం..
హిమాయత్నగర్: యువతకు ప్రాధాన్యతను ఇస్తామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరో పక్క అధికారులు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ‘ఇంటర్నేషనల్ హంప్టీ–డంప్టీ’ ఫుడ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఆరోపించారు.అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించతలపెట్టిన ఫుడ్ఫెస్టివల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎండీఏ తమకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని నిర్వాహకులు తుల్లూరి పృథ్వితేజ్, గుణశేఖర్రెడ్డి, జయదీప్రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. సోషల్ నెట్వర్క్ ద్వారా యువతకు సమాచారాన్ని చేరవేసి హెచ్ఎండీఏను ముట్టడించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. వీరికి మద్దతుగా నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ విలేకరులతోమాట్లాడారు. భారతదేశ వంటలను రుచి చూపించేందుకు ఫుడ్ఫెస్టివల్ నిర్వహిద్దామనుకుంటే సహకారం అందించాల్సిన హెచ్ఎండీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. తక్షణం వీరికి న్యాయపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు వెనకాడమని హెచ్చరించారు. నిర్వాహకులు ప్రిత్వితేజ్, శ్రీదివ్య, గుణశేఖర్లు మాట్లాడుతూ హెచ్ఎండీఏ తీరువల్ల తాము తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. రూ.60లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
రాడాన్ లఘు చిత్ర అవార్డుల ప్రదానం
రాడాన్ లఘు చిత్రాల అవార్డుల వేడుక బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది.జాతీయ,అంతర్జాతీయ స్థాయికి చెందిన పలు లఘు చిత్రాలు పోటీలో పాల్గొనడం విశేషం. నటి రాధిక శరత్కుమార్ కూతురు రెయాన్ నిర్వహించిన ఈ లఘు చిత్ర పోటీ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.ఈ పోటీలో దర్శకుడు వివేక్ ఇళంగోవన్ దర్శకత్వం వహించిన ఓడమ్ అనే లఘు చిత్రం టైటిల్ విన్నర్గా నిలిచింది.దీనికి రూ 1.5 లక్షల నగదు బహుమతిని అందించారు.కాగా అంజలి పద్మనాభన్ దర్శకత్వం వహించిన నిళల్ షార్ట్ ఫిలిం రన్నరప్ టైటిల్ను గెలుచుకుంది. దీనికి 75 వేల నగదు బహుమతిని అందించారు. వీటితో పాటు జీకే దర్శకత్వం వహించిన అస్సారి చిత్రం, వివేక్ మనో తడై,అంజలి ఇరుదివరై చిత్రాలు వరుసగా ప్రధమ,ద్వితీయ,తృతీయ అవార్డులను గెలుచుకున్నాయి.ఈ కార్యక్రమంలో నటుడు శరత్కుమార్,రాధిక శరత్కుమార్,దర్శకుడు కే. భాగ్యరాజ్,కార్తీక్ సుబ్బరాజ్, నటుడు ఆర్య,సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సినీ ప్రముఖులు పాల్గొని విజేతలకు అవార్డులను అందించారు.ఆ పోటీల్లో అవార్డులు పొందిన లఘు చిత్ర దర్శకులను సినీ అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకురాలు రెయాన్ వెల్లడించారు. -
అంతర్జాతీయ స్థాయికి విశాఖ
ఫ్లీట్ రివ్యూతో ప్రపంచ పటంలో చోటు జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదిక రూ.30 వేల కోట్లతో పరిశ్రమలు సబ్బవరం సమీపంలో ఎడ్యుకేషన్ సిటీ జిల్లాలో 20 వేల మందికి ఇళ్లు గణతంత్ర సందేశంలో కలెక్టర్ యువరాజ్ అల్లిపురం: అంతర్జాతీయ స్థాయి నగరంగా, ఆర్థిక కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ చెప్పారు. గత ఏడాది కాలంగా నగరం ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ఈవెంట్లకు వేదికగా మారిందన్నారు. ఈ పరంపరలో భాగంగా ఫిబ్రవరి 4 నుండి 8 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను విశాఖ తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, దీంట్లో 51 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. సూర్యాబాగ్ ఏఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో మంగళవారం జరిగిన 67వ గణతంత్ర వేడుకల్లో ఆయన ముందుగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల నగరంలో జరిగిన సీఐఐ సదస్సులో కుదిరిన ఒప్పందాల వల్ల రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించడానికి అవకాశమేర్పడిందని చెప్పారు. పరిశ్రమల స్థాపన వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఎడ్యుకేషన్ హబ్గా విశాఖ జాతీయ అంతర్జాతీయ గుర్తింపు కలిగిన విద్యాసంస్థలను నగరానికి కే ంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. సబ్బవరం వద్ద వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో ఎడ్యుకేషన్ సిటీని నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. స్వచ్ఛభారత్ పథకం కింద 48 పాఠశాలకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. మండలాల్లో విద్యా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మూడు దశల్లో 34 ఆదర్శ పాఠశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లా లక్ష్యంగా.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబర్ 2 నాటికి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా విశాఖ జిల్లాను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన గల 1,65.399 మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలో క్రీడా సౌకర్యాలను మెరుగుపరచడానికి స్పోర్ట్స్ అధారిటీ కొమ్మాదిలో మిని స్టేడియంను, యలమంచిలిలో ఇండోర్ స్టేడియంను నిర్మిస్తుందన్నారు. రహదారులకు మహర్దశ అనకాపల్లి-పూడిమడక, ఎలమంచిలి-గాజువాక, విశాఖపట్నం-అనంతగిరి-అరుకు, నర్సీపట్నం-తుని, భీమునిపట్నం-నర్సీపట్నం, సబ్బవరం-కొత్తవలస-కె.కోటపాడుల మధ్య నాలుగు లైన్ల రహదారిని అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాన్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ.173 కోట్ల ఖర్చుతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. స్వయంసహాయక సంఘాల అభివృద్ధి : జిల్లాలో 44 వేల 214 స్వయం సహాయక సంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయన్నారు. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ఈ సంఘాలకు రూ.508 కోట్లు సహాయంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటిలో ఇప్పటి వరకు రూ,139.49 కోట్లు మహిళా సంఘాల ఖాతాలలోకి జమ చేశామన్నారు. మూడవ విడత జన్మభూమిలో భాగంగా ప్రజల నుండి లక్ష ఎనిమిదివేల ధరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్మార్ట్ సిటీగా.. స్మార్ట్ సిటీగా నగరంలో సౌకర్యాల మెరుగుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో ఇల్లు లేని వారికి 20 వేల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించటం జరిగిందన్నారు. హుద్హుద్ తుఫాను సహాయం కింద కార్పొరేట్ సంస్థల సహకారంతో జిల్లాలో 5,462 ఇళ్లను ఒక్కొక్కటి రూ.4.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. ఇవి వచ్చే ఆరు నెలల్లో పూర్తి కానున్నాయన్నారు. ఉత్తమ సేవలకు పురస్కారాలు ఉత్తమ సేవలందించిన వివిధ విభాగాలకు చెందిన 470 మంది ఉద్యోగులకు కలెక్టర్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. విదేశీయులు పోగొట్టుకున్న లక్ష డాలర్ల కరెన్సీని నిజాయితీగా పోలీసులకు అప్పగించిన శివశివానీ పాఠశాల విద్యార్థులు ఎం.సాయి సూర్య, పవన్సాయిలకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2015లో పర్యావరణంపై ప్రజంటేషన్ ఇచ్చి మెరిట్ సర్టిఫికేట్ పొందిన జిల్లా విద్యార్థి ఆనంద్కు కూడా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందిన 42,361 మందికి రూ.101.07 కోట్ల ఆస్తులను కలెక్టర్ పంపిణీ చేశారు. -
సానియాకు ‘ఖేల్ రత్న'!
క్రీడా మంత్రిత్వ శాఖ యోచన న్యూఢిల్లీ: ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో అద్వితీయ విజయాలు సాధిస్తోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’కు సిఫారసు చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. గత ఏప్రిల్లో మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను సాధించి... ఇటీవల వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్నూ నెగ్గి చరిత్ర సృష్టించిన సానియా ఇప్పటివరకు ఈ అవార్డుకు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోలేదు. అయితే నిబంధనల ప్రకారం క్రీడా మంత్రిత్వ శాఖ అర్హత ఉన్న వారి ఎవరి పేరునైనా ఈ అవార్డుకు సిఫారసు చేసే వీలుంది. సానియా గతేడాది ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ మైనేనితో కలిసి మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం, ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్లో కాంస్యం సాధించింది. అంతేకాకుండా బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే ‘ఖేల్త్న్ర’ అవార్డు విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటే అవుతుందని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ తెలిపారు. -
మల్లీ.. ఎప్పుడొస్తావ్!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మల్లి మస్తానయ్య.. సుబ్బమ్మల ఐదుగురు సంతానంలో మస్తాన్బాబు చివరివాడు. చివరివాడే అయినా.. ఆ అమ్మకు ముద్దుల కొడుకు. ఐదుగురు కలిసి ఓ రోజు మాలో ఎవరంటే నీకిష్టం అని తల్లి సుబ్బమ్మను అడిగారు. తడుముకోకుండా ‘చిన్నోడు మస్తాన్బాబు అంటే నాకు ఇష్టం’ అని ఆ తల్లి తేల్చిచెప్పింది. అదేవిధంగా తల్లి సుబ్బమ్మ అన్నా.. మస్తాన్బాబుకు ఎనలేని ప్రేమ. అమ్మకు ఆరోగ్యం సరిగా లేదని తెలిస్తే.. మస్తాన్బాబు ఎక్కడున్నా రెక్కలు కట్టుకువచ్చి అమ్మ ముందు వాలిపోతాడు. ముద్దులకొడుకు కంటికి కనిపిస్తే సుబ్మమ్మ రోగం గీగం మాయమవుతుంది. అంతగా ఇష్టపడే కొడుకు నెలరోజులుగా కంటికి కనిపించలేదు. సజీవంగా వస్తాడన్నా.. ఇక రాలేడు. అయినా ఆ మాతృహృదయం ముద్దుల మల్లి మృతదేహం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. చివరివాడే అయినా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కన్నకొడుకు మల్లి మస్తాన్బాబు మృతదేహం కోసం సుబ్బమ్మ 30 రోజులుగా నిద్రాహారాలు మాని ఎదురుచూడటం చూస్తే.. బహుశా ప్రపంచంలో ఏ తల్లికీ ఇంతటి కష్టం వచ్చి ఉండదేమో. పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు కనిపించకుండా పోయి నేటి సరిగ్గా నెలరోజులు. గతనెల 25న మస్తాన్బాబు కనిపించలేదని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి పర్వతాల్లో మస్తాన్బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఈనెల 4న మస్తాన్బాబు మృతిచెందారని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మస్తాన్బాబు కనిపించలేదని తెలిసే తల్లి సుబ్బమ్మ తల్లడిల్లిపోయింది. కన్నకొడుకు మరణించాడని తెలిసి అమె గుండెలవిసేలా విలపించింది. ఇప్పటికీ విలపిస్తూనే ఉంది. సుబ్బమ్మతోనే... గాంధీజనసంఘం కన్నతల్లికే కాదు.. కన్న ఊరికీ పేరుతెచ్చిపెట్టాడు మల్లి మస్తాన్బాబు. అందుకే జన్మనిచ్చిన ఊరు గాంధీజనసంఘం కూడా మౌనంగా రోదిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పర్వతారోహకుడిగా గుర్తింపు పొందిన మస్తాన్బాబు మరణం కన్నతల్లిని.. జన్మనిచ్చిన ఊరిని శోకలోయల్లోకి తోసేసింది. మస్తాన్బాబుకి ప్రకృతి అంటే అంత ప్రేమ. అందుకే గ్రామంలో ఉంటే ఎక్కువగా పొలాల్లో తిరుగుతూ గడిపేవాడని స్నేహితులు చెబుతున్నారు. జిల్లా పేరును అంతర్జాతీయస్థాయిలో నిలిపిన వ్యక్తి మల్లి మస్తాన్బాబు మృతదేహం నేటి రాత్రికి గాంధీజనసంఘం చేరుకోనుంది. అందుకు జిల్లావాసులు అనేక మంది మస్తాన్బాబు మృతదేహానికి ఘనంగా కన్నీటి వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. జిల్లా నలుమూలల నుంచి మస్తాన్బాబు పార్థీవదేహాన్ని చూసేందుకు పెద్దఎత్తున తరలిరానున్నారు. -
గ్రామాలు గల్లంతే !
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ప్రతిపాదిత రాజధానిలో పల్లెలు గల్లంతుకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు, మంత్రుల ప్రకటనలు ఇందుకు అనుగుణంగానే ఉండటంతో అక్కడి ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. సీడ్ కేపిటల్ (తొలిదశ) నిర్మాణాలకు నాలుగు గ్రామాల ఎంపిక, విశాలమైన రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాల ఏర్పాటుకు భారీ ప్రణాళికలు, ముంపు ప్రమాదం లేకుండా సముద్ర మట్టానికి అనుగుణంగా గ్రామాల ఎత్తు పెంపు వంటి ఆలోచనలు పల్లెల ఎత్తివేతకేనంటున్నారు. వారందరికీ బహుళ అంతస్తుల భవనాల్లో నివాసం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న నవ్యాంధ్ర రాజధానిలోనే పల్లెలు కొన సాగితే అవన్నీ మురికివాడలుగా కనిపించే అవకాశం ఉంది. ఇదే అభిప్రాయంలో ప్రభుత్వం ఉండటంతో వీటిని తొలగించే అవకాశాలే ఎక్కువంటున్నారు. మొదటి నుంచి రాజధానిలోని 29 గ్రామాలను తొలగించేది లేదని, అవన్నీ యథావిధిగా కొనసాగుతాయని అధికారులు, మంత్రులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనికి విరుద్ధంగా తొలిగా సీడ్ కేపిటల్కు నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. భూ సమీకరణకు మొదటి నుంచి సానుకూలంగా స్పందించిన ఈ గ్రామాల్లోనే రాజధానికి సంబంధించిన ముఖ్యమైన నిర్మాణాలు చేపట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ఈ గ్రామాలు కనుమరుగుకాక తప్పదు. రాజధానికి విశాలమైన రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యాలు, ముంపు బె డద నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం రహదారుల వెడల్పు 20 అడుగులకు మించి లేదు. నవ్యాంధ్ర రాజధానికి నాలుగు సమాంతర రహదారుల నిర్మాణా లకు అంచనాలు రూపొందుతున్నాయి. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖలు ఇప్పటికే రాజధాని వరకు రవాణా సౌకర్యం మెరుగుకు 100 అడుగుల నిడివి కలిగిన రహదారుల విస్తరణకు అంచనాలు రూపొందించాయి. వీటికి అనుగుణంగా రహదారుల విస్తరణ జరిపితే అనేక భవనాలను నేలకూల్చక తప్పదు. కొండవీటి వాగు ముంపు నుంచి రాజధానిని కాపాడేందుకు సముద్ర మట్టానికి అనుగుణంగా రాజధాని గ్రామాల ఎత్తు పెంచుతామని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ఇది సాధ్యమయ్యే అవకాశం లేకపోవడంతో ఈ గ్రామాలను పూర్తిగా ఎత్తివేసి, అక్కడ నిర్మించనున్న బహుళ అంతస్తుల్లో వారికి నివాసం కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జోన్ల వారీగా అభివృద్ధి జరుగుతుందని, గ్రామ కంఠాల పరిధి పెరగదనే ప్రకటనలతో రాజధాని గ్రామాల ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. పొంతనలేని ప్రకటనలకు రాజధాని గ్రామాల ప్రజలు కలత చెందుతున్నారు. పాలకుల మైండ్ గేమ్కు తట్టుకోలేక ఏదో ఒక రోజు రాజధాని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా అక్కడి నుంచి తరలివెళ్లే అవకాశాలు లేకపోలేదు. వీటికితోడు సీఆర్డీఏ ఏడు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో పారిశ్రామిక, నివాస ప్రాంతాలు, రోడ్ నెట్వర్క్లు ఉన్నాయి. రాజధాని నగరం 212 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ పరిధిలో నిర్మాణాలకుతోడు మురుగునీరు, వరదనీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. వీటిల్లో అనేక ప్రాజెక్టులు రాజధాని గ్రామాల నుంచి కొనసాగుతాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే రాజధాని గ్రామాల్లోని అనేక నివాసాలను తీసివేయాల్సి ఉంటుంది. కొన్నింటిని తొలగించి, మరి కొన్నింటిని కొనసాగించే కంటే మొత్తం గ్రామాలనే తొలగించాలని, లేకుంటే అవన్నీ మురికి వాడలుగా కనిపిస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఒక సమయంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ రాజధాని నిర్మాణం జరిగితే ఆ పరిసరాల్లోని రాజధాని గ్రామాలు మురికివాడలుగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఈ అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వ చర్యలు ఉండటంతో రాజధాని గ్రామాల మనుగడపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
జోరు పెరగాలంటే!
హైదరాబాద్: ‘‘హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలున్నాయి. అందరికీ నచ్చే వాతావరణముంది. స్థానికులకు హిందీ భాష వస్తుంది. నైపుణ్యం గల యువతకు కొరతే లేదు. అన్నింటికీ మించి ఇళ్ల ధరలూ తక్కువగా ఉంటాయి. రానున్న రోజుల్లో మార్కెట్ తప్పకుండా వృద్ధి చెందుతుంది’’.. భాగ్యనగరం గురించి ఏ బిల్డర్ని అడిగినా ఇంచుమించు ఇలాగే చెబుతారు. గత కొంతకాలంగా ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు కూడా. ఇందతా నిజమే అయినప్పటికీ.. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలైనా మార్కెట్ మెరుగు కావటం లేదెందుకు? మునుపటి జోరెందుకు కన్పించటం లేదు? ఈ అంశంపై నగర నిర్మాణ సంస్థలు ఆలోచించాల్సిన అవసరముంది. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. దాన్ని సరిదిద్దుకోవాలనే విషయాన్ని ఆలోచించాలి. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకేయాలి. అప్పుడే హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో మళ్లీ మునుపటి జోరును చూడొచ్చు. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు నాలుగేళ్ల నుంచి హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో అనుకున్నంత ఊపు లేదు. ఆశించిన స్థాయిలో అమ్మకాలూ లేవు. ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం వల్ల పెట్టుబడిదారులు పూర్తిగా నిష్ర్కమించారు. ఫలితంగా స్థిర నివాసానికి మొగ్గు చూపేవారే మిగిలిపోయారు. వీరిలోనూ అధికశాతం మంది వివిధ ప్రాంతాల్లో గల ప్రాజెక్టులన్నీ తిరిగి చూడటం, రేటు తక్కువున్న చోట కొనడం చేసేవారు. ఇంటికి సంబంధించి అంతిమ నిర్ణయం తీసుకోవడానికి రెండు లేదా మూడు నెలల సమయాన్ని తీసుకునేవారు. ఇంకొందరేమో సొంతిల్లు కొనాలన్న ఆశ ఉన్నప్పటికీ.. వారి బడ్జెట్కు తగ్గట్లు మార్కెట్లో ఇళ్లు దొరకని పరిస్థితి. కొన్ని చోట్ల ధరలు తక్కువున్నా.. అవి నగరానికి దూరంగానో.. మౌలిక సదుపాయాలూ అభివృద్ధి చెందని ప్రాంతాల్లోనో ఉన్నాయి. మరికొందరేమో హైదరాబాద్ను పూర్తిగా విస్మరించి బెంగళూరు, పుణె, చెన్నైల్లో కొనుగోలు చేశారు. ఇలా రకరకాల కారణాల వల్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ధర ఎక్కువ ఫ్లాట్ల ధరలు అందుబాటులోఉంటే.. మార్కెట్తో సంబంధం లేకుండా అమ్మకాలు మెరుగ్గా జరిగేవి. కాకపోతే పశ్చిమ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రెండు పడక గదుల ఫ్లాట్లు రూ.40-50 లక్షలు, మూడు పడక గదుల ఫ్లాట్లయితే రూ.60 లక్షలు పెట్టాల్సిందే. అంతంత రేటు పెట్టాలంటే ఐటీ రంగంలో కనీసం పదేళ్లకు పైగా అనుభవమున్న వారి వల్ల సాధ్యమవుతుంది. వారి శాతం ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇతర ప్రాంతాల్లో 2,3 బీహెచ్కే ఫ్లాట్ల కోసం కనీసం రూ.30-40 లక్షలు పెట్టాల్సి వస్తోంది. దీంతో సామాన్యులు వెనుకడుగు వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఫ్లాట్ల విస్తీర్ణం తక్కువ పెడితే.. కొనుగోళ్లు మెరుగ్గా జరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనీసం, కొత్తగా ఆరంభమయ్యే ప్రాజెక్టుల్లోనైనా తక్కువ విస్తీర్ణం గల ఫ్లాట్లకు పెద్ద ్దపీట వేయాలి. మార్కెట్ పోకడను అర్థం చేసుకోకుండా ఒంటెద్దు పోకడకు పోతే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గ్రహిం చాలి. నమ్మకం పోయిందా.. బూమ్ సమయంలో ఆరంభమైన పలు గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు కొన్నవారు.. అందులో గృహ ప్రవేశం చేయడానికి నిర్ణీత గడువు కంటే ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా ఫ్లాట్లను అందజేయడం వల్ల రెండిందాల నష్టం జరిగింది. హైదరాబాద్ బిల్డర్లంటే ఆలస్యం చేస్తారన్న అపవాదు నెలకొంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఇతర నగరాలకు చెందిన వారు ఇలాంటి ప్రతికూల సమాచారాన్ని అంతర్జాలంలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా చాలా మంది నగరంలో ఇళ్లు కొనడం మానేశారు. దీని బదులుగా బెంగళూరు, చైన్నైలను ఎంచుకోవటం మేలని భావిస్తున్నారు. కొత్త రాష్ట్రం.. విభజన జరగక ముందు వరకూ హైదరాబాద్లో సీమాంధ్రకు చెందినవారు ఇళ్లను ఎక్కువగా కొనుగోలు చేసేవారు. వీరితో బాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఐటీ నిపుణులు ముందంజలో ఉండేవారు. కానీ, రాష్ట్ర విభజన జరిగాక.. ఇక్కడ కొందరు కొనుగోళ్లు చేయడాన్ని నిలిపివేశారు. పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందోనని వేచి చూస్తున్నారు. పలువురు పెట్టుబడిదారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అందులో కొందరు అక్కడే ఇల్లో, ప్లాటో కొనాలని నిర్ణయానికి వచ్చారు. కాకపోతే అక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆయా ప్రాంతాల్ని హైదరాబాద్తో బేరీజు వేసుకున్నాక ప్రస్తుతం చాలామంది పునరాలోచనలో పడ్డారు. వీరంతా తీసుకునే తదుపరి నిర్ణయం మీద ఆధారపడి ఇక్కడి అమ్మకాలు ఆధారపడతాయనేది మార్కెట్ నిపుణులు విశ్లేషణ. -
విశ్వనగరి
అభివృద్ధిలో వెనుకడుగు వేయబోయం విమర్శలకు వెరసేది లేదు ఆలోచనలన్నీ కార్యరూపం ఉపాధికి ప్రాధాన్యం అత్యాధునిక సదుపాయాలతో మార్కెట్లు ‘న్యూ విజన్’ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగర అభివృద్ధి... ఉపాధి అవకాశాల కల్పన... ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వేలు... పేదలకు పక్కాగృహాలు... వానొస్తే ఎక్కడా చుక్క నీరు నిలవకుండా ఏర్పాట్లు... ఇదీ సీఎం కే సీఆర్ మనసులోని మాట. నగర ప్రజల ప్రస్తుత...భవిష్యత్తు అవసరాలు... తన కలలు... ఇలా.. అనేక అంశాలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. భాగ్యనగరాన్ని విశ్వనగరిగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. సిటీబ్యూరో: దేశంలోని ఏ నగరానికీ లేనివిధంగాసహజ సిద్ధ సౌకర్యాలు... నిజాం కాలం నుంచి అధునాతన సదుపాయాలు కలిగిన హైదరాబాద్ గత పాలకుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఈ దుస్థితిని రూపుమాపేందుకు... హైదరాబాద్ రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాయుతంగా తమ ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. బుధవారం రాత్రి ఓ టీవీ చానెల్లో ‘విజన్ హైదరాబాద్’పై ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘కల్పన’ నుంచి కార్యరూపం దిశగా నడిచే చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత తమకు ఉన్నాయన్నారు. ఎక్స్ప్రెస్ కారిడార్లు, ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వేలు, మల్టీలెవెల్ ఫ్లై ఓవర్ల గురించి వింటున్న వారు హైదరాబాద్లో అలాంటివి సాధ్యమా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని... వాటిని పటాపంచలు చేసేలా తాము ఆచరణలో చూపిస్తామన్నారు. ఏ పనిలోనైనా ప్రారంభంలో చాలామందికి నమ్మకం కలగదని... తెలంగాణ సాధనను సైతం తొలుత అలాగే పరిగణించారని గుర్తు చేశారు. ఆలోచన నుంచి పురోగమించి.. నిబద్ధతతో ముందుకు వెళ్తూ... మడమ తిప్పకుండా సాగితే కల సాకారమవుతుందని నిరూపించామన్నారు. ఇదే తరహాలో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఉద్యమ రూపం నుంచి ప్రభుత్వంగా అవతరించాక...అన్నిరకాలుగా తెలంగాణ అభివృద్ధికి వందశాతం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. అభివృద్ధిలో ఐదారు ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటాపోటీగా ముందుకెళ్తోందని చెప్పారు. పెరిగే జనాభాను అంచనా వేసి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని.. నాటి పాలకుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మోస్తరు వాన కురిస్తే నీరు వెళ్లే మార్గం లే దని గుర్తు చేశారు. రాజ్ భవన్ రోడ్డు, అసెంబ్లీ, సీఎం క్యాంప్ కార్యాలయ ప్రాంతాలను దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఇదే తగిన సమయం హైదరాబాద్ అభివృద్ధికి ఇదే తగిన సమయమని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో 5 లక్షల ఎస్ఎఫ్టీలో తమ సంస్థలు విస్తరించేందుకు విప్రో ప్రేమ్జీ వంటి వారు ముందుకొస్తున్నారని చెప్పారు. తద్వారా 5వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తొలి దశలో రూ.1250 కోట్లతో ఆ ప్రాజెక్టులు అమలు చేయనున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ త్వరలోనే వాటికి టెండర్లు పిలవనుందని తెలిపారు. ఐదారేళ్లలో వాటిని పూర్తి చేస్తామన్నారు. దీనికిప్రజల సహకారం కావాలని కోరారు. వివిధ దేశాల ప్రముఖ సంస్థలు పెట్టుబడులకు శరవేగంగా ముందుకొస్తున్నాయన్నారు. ఫ్లై ఓవర్ల మలుపుల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని... భవిష్యత్తులో నిర్మించే వాటి వల్ల ఇలాంటి వాటికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఆ మార్గాల్లోని భవంతులకు రెండింతలైనా నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారు. నాలాల విముక్తికి... నాలాలు కబ్జాకు గురికావడంతో వర్షాలు వస్తే నీరు వెళ్లే మార్గం లేకుండా పోయిందని జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులు తనకు వివరించారని సీఎం తెలిపారు. ఈ దుస్థితి నుంచి బయట పడేందుకురూ.10 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. ఫ్లై ఓవర్లు.. స్కైవేలు.. నగరంలో ప్రయాణ సమస్యలు లేకుండా ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వేలు, మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు, జిల్లాల నుంచి వచ్చే వారి కోసం స్కైవేలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఐదు మార్గాల్లో స్కైవేలు నిర్మిస్తామని తెలిపారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో దిగాలనుకునే వారికి ర్యాంప్లు ఉంటాయన్నారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న లీ అసోసియేట్స్ కన్సల్టెన్సీలు డిజైన్లు రూపొందిస్తున్నాయని తెలిపారు. జేబీఎస్ నుంచి తూముకుంట వరకు ఒక స్కైవే నిర్మిస్తామన్నారు. అమెరికాలోని డల్లాస్ తరహాలో హైదరాబాద్ను మారుస్తామని చెప్పారు. ఇవన్నీ చేయాలంటే శస్త్ర చికిత్సలాంటి పని జరగాలని అభిప్రాయపడ్డారు. మార్కెట్లు నిర్మిస్తాం ప్రజల అవసరాలు తీరేలా ఆధునిక మార్కెట్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దాదాపు కోటి జనాభా ఉన్న నగరంలో కనీసం వెయ్యి మార్కెట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. కేవలం 24 మాత్రమే ఉండటం శోచనీయమన్నారు. చాలా మార్కెట్లు ఎకరం లోపు విస్తీర్ణంలో ఉండడం దారుణమన్నారు.మెహదీపట్నం మార్కెట్ వద్దే ఆటోలు, పశువులు ఉండటాన్ని ప్రస్తావిస్తూ అక్కడ ఆధునిక మార్కెట్ను కట్టి చూపిస్తామన్నారు. ప్రభుత్వ ప్రదేశాల్లో మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరాల కోసం ప్రభుత్వ భూములు పరిశీలిస్తుంటే కొందరు సచివాలయ భూములు అమ్ముతారా ? అని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారందరికీ తగిన సమాధానం చెప్పేలా హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హరితహారంలో భాగంగా మూడేళ్లలో పది కోట్ల మొక్కలు నాటుతామన్నారు. -
గ్లోబల్... నోబెల్
యువత 2014 శాంతిస్థాపన యత్నానికి అత్యున్నత పురస్కారం.. అపారమైన ప్రతిభకు అవధుల్లేని అవకాశాలు.. ఎవరెస్ట్ స్థాయి సాహసాలు.. ఆటల్లోనూ అబ్బురపరిచే విన్యాసాలు.. మొత్తంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యువతకు కలిసొచ్చిన సంవత్సరం 2014. ఈ ఏడాదిలో అనేక యువకిరణాలు ఉదయించాయి. వ్యాపార, క్రీడ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనేక మంది యువతీయుకులు తమ ప్రతిభాపాటవాలను చాటారు. నోబెల్ బహుమతి... ఈ బహుమతి స్థాయిని బట్టి, తలపండిన వారికే దక్కుతుందనుకోవడం చాలా సహజమైన అభిప్రాయం. అయితే అలాంటి అంచనాలకు భిన్నంగా ఒక 17 యేళ్ల యువతికి నోబెల్ బహుమతి దక్కింది. అది కూడా శాంతి పరిరక్షణకు గానూ.. దక్కిన నోబెల్ శాంతి బహుమానం. ఈ ఏడాది యువతకు సంబంధించి ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సిన విషయం ఇది. యువ శక్తి ఉద్యోగం సంపాదించుకొనేంత స్థాయికో, కొత్త ఆవిష్కరణ చేపట్టడానికో పరిమితం కాదు... టీనేజ్లోనే నోబెల్ను సాధించుకొనే స్థాయి వరకూ ఎదిగిందనే సందేశాన్ని ఇచ్చింది పాకిస్తాన్ యువతి మలాలాకు దక్కిన ఈ ఖ్యాతి. మలాలానే ఈ ఏడాదికి ‘యూత్ ఆఫ్ ది ఇయర్’ అని చెప్పవచ్చు. ఎవరెస్ట్నూ అధిరోహించేశారు! ఈ ఏడాది భారతీయ యువతకు దక్కిన ఖ్యాతి ఇది. తెలుగువాళ్లు అయిన మలావత్ పూర్ణ, సద్దనపల్లి ఆనంద్లు ఎవరెస్ట్ను అధిరోహించి ఆ శిఖర స్థాయి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొన్నారు. టీనేజర్ పూర్ణ ఎవరెస్ట్ను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలు కూడా. వీరి విజయానికి తెలుగుగడ్డ నీరాజనాలు పల్కింది జీతాలు కోట్లకు చేరాయి! ఐదంకెల జీతం ఇన్ని రోజులకూ గొప్ప. అయితే ఇప్పుడు ఐదుకు మరో రెండంకెలను జోడించి ఆ మొత్తాన్ని భారతీయ విద్యార్థులకు ప్యాకేజీలుగా ఇవ్వడానికి ముందుకొచ్చాయి అనేక కంపెనీలు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేస్తున్న అనేక మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు చదువు పూర్తి కాకుండానే ఇలాంటి ఆఫర్లు వచ్చాయి. గూగుల్ వంటి దిగ్గజాలు భారతీయ విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో సంచలనాలే నమోదయ్యాయి. వార్షిక వేతనం కోటి, కోటిన్నర రూపాయల స్థాయిలో ఉండే ఉద్యోగాలు మనవాళ్లను పలకరించాయి. కోటి రూపాయల వేతనం! 2014 మెమరబుల్ ఇయర్.. ఇదే ఏడాది స్టూడెంట్స్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్లో భాగంగా ఒక సెమిస్టర్ సింగపూర్లో చదివాను. సామ్సంగ్లో ఇంటర్న్షిప్ చేయడం మంచి అనుభవాన్ని మిగిల్చింది. అందులోనే ఉద్యోగం రావడం, అదీ కోటి రూపాయల భారీ వేతనంతో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ఈ ఏడాదితో నా విద్యార్థి జీవితం ముగుస్తుంది. 2015 నుంచి బాధ్యత గలిగిన ఉద్యోగిగా మారాలి. అయితే నా జీవితంలో ఇది ఒక మైలురాయి అని చెప్పడం కష్టం. ప్రతిదీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియెన్స్ అనే చెప్పాలి. ఐఐటిలో సీటు కోసం కోచింగ్ దగ్గర నుంచి ఐఐటి క్యాంపస్లో చదువు అన్నీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్పించాయి. - ఇమ్మడి పృథ్వితేజ్, ముంబయి ఐఐటి విద్యార్థి -
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సిలబస్ ఉండాలి
-
నైపుణ్యానికి చిరునామా
* కేజీ టు పీజీ విద్యాలయాలపై సీఎం కేసీఆర్ ఆకాంక్ష * ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని వెల్లడి * అందులో చదివే పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి * శాంతిభద్రతలు, మహిళల పట్ల గౌరవం పెంచేలా పాఠాలుండాలి * రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సిలబస్ ఉండాలి * జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తమ పిల్లలను ఈ స్కూళ్లలోనే చదివించాలి * విద్యా విధానంపై మరింత చర్చ కోసం విద్యావేత్తలతో సదస్సు సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ విద్యాలయాల్లో వృత్తి నైపుణ్యాలను పెంచే విద్యా విధానం ఉండాలని, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు, వృత్తి నిపుణులు అవసరమో ముందుగానే అంచనా వేసుకొని, అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం మంచిదన్నారు. కేజీ టు పీజీ పాఠశాలల్లో చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉపాధి లభించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కేజీ టు పీజీ పాఠశాలల్లో అమలు చేయబోయే విద్యా విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై మంత్రులు, అధికారులతో చర్చించారు. ఏ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ప్రారంభించాలి? ఏ వయసు నుంచి పిల్లలు హాస్టళ్లలో ఉండటం మంచిది? విద్యా బోధనకు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు సరిపోతారా? వారికి అదనంగా ఏమైనా శిక్షణ ఇవ్వాలా? బోధన అంశాలు ఎలా ఉండాలన్న విషయాలపై చర్చించారు. ఇది సమాజంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీనిపై విసృ్తత స్థాయిలో చర్చ జరగాలని నిర్ణయించారు. ఇందుకు ఈ నెలాఖరులోగా ఎస్సీఈఆర్టీ, ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్లు, విద్యావంతులు, విద్యారంగంలో అనుభవం ఉన్న వారితో సీఎం నేతృత్వంలోనే రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘా లు, ఎన్జీవోలతోనూ సదస్సు నిర్వహించి, అందరి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, దేశానికి ఉపయోగపడే మానవ వనరులుగా తీర్చిదిద్దేలా తెలంగాణ రాష్ట్ర విద్యా విధానం ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విద్య కోసం పెట్టే ఖర్చు వృథా పెట్టుబడి అనే నీచ ప్రచారం గతంలో జరిగిందని, ఫలితంగా ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం విద్య కోసం పెట్టే ఖర్చును అత్యంత ఉపయుక్తమైన కార్యక్రమంగా భావి స్తోందని, నాణ్యమైన విద్యను అందించడం ద్వా రానే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందన్నారు. దేశంలో నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థలతోపాటు కొరియా, జర్మనీ వంటి దేశాల్లోనూ అధ్యయనం చేయిస్తానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని వేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తెలంగాణలో కేజీ టు పీజీ విద్యా విధానం అమలుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పా ఠ్యాంశాల్లో శాంతి భద్రతలు, మహిళల పట్ల గౌరవంగా మసలుకోవడం, సాంస్కృతిక వికాసం, నైతిక ప్రవర్తన వంటి అంశాలు ఉండాలన్నారు. అత్యాధునికంగా నిర్మాణాలు.. కేజీ టు పీజీ పాఠశాలల ఏర్పాటులో భాగంగా మొదటి ఏడాది నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించి, నిర్వహణలోని లోటుపాట్లను పరిశీలించి ఆ తర్వాతి సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలను విస్తరించనున్నట్లు సీఎం చెప్పారు. 15 ఎకరాల స్థలంలో ఈ స్కూళ్లు ఉండాలని, అందులో హాస్టల్, స్కూల్, ఆట స్థలం, డైనింగ్ హాల్ తదితర నిర్మాణాలన్నీ అత్యాధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలన్నారు. అటాచ్డ్ టాయ్లెట్తో కూడిన గదిలో నలుగురే విద్యార్థులు ఉంటారన్నారు. వీటిల్లో అందించే ఆహారం కూడా పోషక విలువలతో కూడి ఉంటుందన్నారు. కేవలం పప్పుచారుతో సరిపెట్టకుండా గుడ్డు, తాజా కూరగాయలు వండాలని, ప్లేట్లు, గ్లాసులను కూడా స్టెరిలైజ్ చేసి వాడాలని సీఎం చెప్పారు. కలెక్టర్, ఎస్పీ లాంటి అధికారులు కూడా తమ పిల్లలను వీటిలోనే చదివించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వివిధ పథకాల కింద వివిధ పాఠశాలలు ఉన్నాయన్నారు. వాటన్నింటిని క్రమంగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చుతామన్నారు. రాష్ట్రమంతా ఒకే తరహా పాఠశాలలు, ఒకే సిలబస్, ఒకే భోజనం మెను, ఒకే పద్ధతి, ఒకే పరీక్ష విధానం ఉండాలని స్పష్టం చేశారు. కుల మతాల పట్టింపు లేకుండా పిల్లలంతా ప్రభుత్వ ఖర్చుతోనే ఒకేచోట చదవాలని, దీనివల్ల అంతరాలు లేని సమాజం సృష్టించవచ్చన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, విద్యామంత్రి జగదీశ్రెడ్డి, సలహాదారు బీవీ పాపారావు, దేశపతి శ్రీనివాస్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డెరైక్టర్ జగన్నాథరెడ్డి, పాఠశాల విద్యా అదనపు డెరైక్టర్ గోపాల్రెడ్డి, కన్సల్టెంట్ ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అదే నా లక్ష్యం : రాజేశ్ టచ్రివర్
తెలుగు సినిమాలపై అభిమానంతో హైదరాబాద్లో స్థిరపడ్డ మలయాళీ... రాజేశ్ టచ్రివర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా’ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. రీసెంట్గా ఆయన తీసిన ‘నా బంగారు తల్లి’ చిత్రం మూడు జాతీయ అవార్డులను, అయిదు అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టడమే తన ముందున్న లక్ష్యమని చెబుతున్న రాజేశ్ టచ్ రివర్తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. ‘నా బంగారు తల్లి’ ఆలోచన ఎవరిది? తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యథార్థ గాథ ఇది. వ్యభిచార వృత్తిలో నలిగిపోతున్న స్త్రీలకు విముక్తిని కల్పించడమే లక్ష్యంగా నా భార్య సునీత కృష్ణన్ స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ‘ప్రజ్వల’. ఆ సంస్థ ద్వారా ఇప్పటికి 20 వేల మంది స్త్రీలకు విముక్తిని అందించడం జరిగింది. ఈ 20వేల మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ఆ కథల్లో మా ఇద్దరి మనసుల్ని కదిలించింది ఓ కథ. దాన్ని అందరికీ చెప్పాలనిపించింది. నిజానికి ఈ కథను సినిమాగా చేస్తే... కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీయాలి. కానీ... ఎలాంటి అసభ్యత లేకుండా, అందరూ చూసేలా సినిమా తీయాలని నా భార్య సూచించింది. తను చెప్పినట్లే... ఆ కథను ‘నా బంగారు తల్లి’గా తీశాను. సమాజానికి పెను ప్రమాదంగా సంభవించిన అక్రమ రవాణా అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. సామాజిక సంస్కరణలో మార్పు మన నుంచే మొదలవ్వాలని ఇందులో చెప్పాను. సినీ ప్రముఖులందరూ ఈ సినిమా చూసి అభినందించారు. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఇక ముందు కూడా ఇలాంటి సినిమాలే తీస్తారా? అలాంటిదేం లేదు. యువతరం కథతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీయబోతున్నా. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తారు. వచ్చే నెలలో ఆ సినిమా మొదలవుతుంది. దర్శకునిగా నా లక్ష్యం ఒక్కటే. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలి. దాని కోసం అహర్నిశలూ శ్రమిస్తా. ప్రేమ, యాక్షన్.. ఈ రెండిటి చుట్టే తెలుగు సినిమా తిరుగుతుంటే... మీరు అందుకు భిన్నంగా సామాజిక విలువలతో కూడిన సినిమా తీశారు. సాధారణంగా మలయాళంలో ఇలాంటి సినిమాలొస్తుంటాయి. మీరు మలయాళీ కావడం వల్లే ఇలా ఆలోచించారని అనొచ్చా? అలాంటిదేం లేదండీ... ఇది తెలుగు నేలపై జరిగిన కథ. అసలు నేను దర్శకుణ్ణి అయ్యింది తెలుగు సినిమాలు చూసి. చిరంజీవి, కె.రాఘవేంద్రరావుల చిత్రాలు కేరళలో అనువాదమయ్యేవి. అవి చూసే.. సినిమాలపై నాకు ఇష్టం పెరిగింది. లండన్లో డెరైక్షన్పై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నాలోని ప్రతిభ గమనించి బ్రిటిష్ గవర్నమెంట్ స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత 1996లో యానిమేషన్ మేకింగ్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. అప్పట్నుంచి ఇక్కడే ఉంటున్నా. కేరళ నా మాతృభూమి అయితే... తెలుగునేల నా కర్మభూమి. తెలుగు సినిమాతో మీ అనుబంధం? కళా దర్శకుడు అశోక్కుమార్గారి వద్ద సహాయకునిగా ఇక్కడ నా కెరీర్ మొదలైంది. చిరంజీవిగారి ‘మాస్టర్’కి తొలిసారి అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్గా చేశా. ఆ తర్వాత బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు చిత్రాలకు కూడా పనిచేశాను. ‘స్టూడెంట్ నెం 1’ చిత్రంతో ఆర్ట్ డెరైక్టర్గా ప్రమోట్ అయ్యాను. ఆ తర్వాత వచ్చిన ‘మనసంతా నువ్వే’ చిత్రానికి కూడా నేనే ఆర్ట్ డెరైక్టర్ని. చివరి ప్రశ్న... మీ మెడలో ఆ వెరైటీ హారం ఏంటి? ఆ హారం వయసు 460 సంవత్సరాలు. అది నా మెడలో గమ్మత్తుగా చేరింది. కొనేళ్ల క్రితం మధ్యప్రదేశ్లో భవానీమాత ఆలయానికి వెళ్లాను. అక్కడ గుంపుగా వెళుతున్న పదిహేనుమంది సాధువులు... నన్ను చూసి ఆగి ‘ఇది అతి పురాతనమైన అమ్మవారి నగ. ధరించు.. నీకు శుభం జరుగుతుంది’ అని నా మెడలో వేసి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఇది నా శరీరంలో భాగమైంది. నన్ను కలిసిన చిన్న పరిచయస్తులు కూడా... మొదట అడిగే ప్రశ్న... ‘మీ మెడలో అదేంటండీ?’ అని. ఇప్పటివరకూ ఎంతోమందికి చెప్పినా... మొత్తానికి మీ ద్వారా అది ప్రపంచానికి తెలుస్తున్నందుకు సంతోషం. -
అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి - ఎంపీ మేకపాటి
నెల్లూరు(బృందావనం): భారత క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. జనాభా సంఖ్యకు అనుగుణంగా క్రీడల్లో రాణించలేకపోతున్నామన్నారు. కారణాలను విశ్లేషించుకోవాలన్నారు. ఇటీవల ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారుల ప్రతిభ అభినందనీయమన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ జాతీయ బాల్బ్యాడ్మింటన్ క్రీడాపోటీలకు నెల్లూరు వేదికకావడం గర్వకారణమన్నారు. క్రీడలకు తమ వంతు ప్రోత్సాహం అందజేస్తామన్నారు. ఆకస్మిక వర్షం కారణంగా ఫైనల్ పోటీలు జరగకపోవడం కొంత వెలితిగా ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ క్రీడాస్ఫూర్తిప్రధానమన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారత్ క్రీడలకు చిరునామా కావాలన్నారు. ఇందు కోసం అన్నివర్గాల సహకారం అందాలన్నారు. కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి వై.రాజారావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్రావ్, డీఎస్డీఓ ఎతిరాజ్, జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మురళీకృష్ణారెడ్డి, టోర్నమెంట్ కమిటీ చైర్మన్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘నాయక్’ చిత్రాలు భళా
‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’లో గుర్తింపు అంతర్జాతీయ స్థాయి పుస్తకంలో చోటు ‘మెట్రో పోలిస్’ సదస్సులోనూ ప్రదర్శన ప్రతిభతో ప్రశంసలందుకుంటున్న వర్సిటీ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రాజేంద్రనగర్: చిత్రకారుడు రమావత్ శ్రీనివాస్ నాయక్ తన కళా ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆర్టిస్టు, ఫొటోగ్రాఫర్గా పనిచేస్తోన్న ఈయన ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’కు ఎంపికయ్యారు. గతనెల 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు నగరంలోని తారామతి బారాదరిలో నిర్వహించిన ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ఎగ్జిబిషన్లో శ్రీనివాస్ నాయక్ కుంచె నుంచి జాలువారిన అద్భుతమైన చిత్రాలకు అరుదైన గౌరవం దక్కింది. చిత్రకళా రంగంలో విశ్వఖ్యాతిని ఆర్జించిన పికాసో స్ఫూర్తితో లంబాడాల జీవన విధానాన్ని క్యూబిజమ్ శైలిలో అద్భుతంగా ఆవిష్కరించినందుకు శ్రీనివాస్ నాయక్ పలువురు అంతర్జాతీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. నల్గొండ జిల్లా మారుమూల ప్రాంతం ఎర్ర చెరువు తండాకు చెందిన శ్రీనివాస్ పేద కుటుంబంలో జన్మించారు. ఈయన పాఠశాల స్థాయిలోనే అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. నగరంలోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీఎఫ్ఏలో ప్రవేశం పొందారు. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆర్టిస్ట్గా ఉద్యోగంలో చేరారు. ఇప్పటివరకు ఈయన 500 క్యూబిజమ్ చిత్రాలు, రెండువేలకు పైగా క్యారికేచర్లు వేశారు. ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ అవార్డు, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వారు నిర్వహించిన పోటీల్లోనూ అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రాలను వేసినందుకు గాను ఆర్ట్ ఎట్ తెలంగాణ నుంచి రూ.25 వేల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. మెట్రో పోలిస్ సదస్సులో 90 చిత్రాలు, చిత్రకారుల బయోడేటాతో కూడిన పుస్తకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ముద్రించారు. వీటిని సదస్సుకు హాజరైన 114 దేశాల ప్రతినిధులకు అందజేశారు. -
‘నన్నూ గుర్తించండి’
వికలాంగ క్రీడాకారుడు అంజనారెడ్డి ఆవేదన సాక్షి, హైదరాబాద్: వికలాంగ బ్యాడ్మింటన్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించినప్పటికీ తననెవరూ గుర్తించడం లేదని కరీంనగర్కు చెందిన వన్నెల అంజనారెడ్డి ఆవేదన చెందాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం తనను గుర్తిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిని రెండు కాళ్లు చచ్చుబడినా 2003 నుంచి 2010 వరకు పలు పోటీల్లో పాల్గొన్నానని గుర్తు చేశాడు. అయితే ముఖ్యమంత్రిని కలిసేందుకు శనివారం సచివాల యానికి వచ్చిన అంజనకు చేదు అనుభవం ఎదురైంది. అపాయింట్మెంట్ లేని కారణంగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. సోమవారం సీఎంను కలిసే వెళతానని చెప్పాడు. అయితే తన కుటుంబం పేదరికంలో లేదని, తగిన గుర్తింపు కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపాడు. 2003లో ఇజ్రాయెల్ ఓపెన్ చాంపియన్షిప్లో రెండోస్థానం, 2006లో తొమ్మిదో పసిఫిక్ గేమ్స్లో కాంస్య పతకం, 2008 రెండో ఆసియా కప్లో కాంస్యం, 2009 ఐడబ్ల్యూఏఎస్ గేమ్స్లో రెండు స్వర్ణాలు సాధించినట్టు అంజన చెప్పాడు. -
ఏపీని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తా: చంద్రబాబు
రాగిసంకటి, నాటుకోడి పులుసుకు ప్రాచుర్యం: చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రశస్తమైన రాగి సంకటి, నాటుకోడి పులుసు తదితర వంటకాలకు అంతర్జాతీయస్థాయిలో బహుళ ప్రాచుర్యం దక్కేలా చూస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సాంస్కృతికంగా, వారసత్వపరంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజాశక్తి తెలుగు దినపత్రిక 34వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ విభాగం ‘నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి’పై ప్రచురించిన ప్రత్యేక సంచికను చంద్రబాబు మంగళవారం లేక్ వ్యూ అతిధి గృహంలోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి తన ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణలో ఎస్ఎల్బీసీ, దేవాదుల ప్రాజెక్టుల పూర్తికి ఎంత కష్టపడ్డానో తనకే తెలుసన్నారు. 40 లక్షల ఫించనుదారులకు ప్రతి నెలా వారి ఫించనుకు సంబంధించిన సమాచారం వొడాఫోన్ ద్వారా సంకిప్త సమాచారం రూపంలో తెలియచేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సహజవనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా దేశంలోనే నెంబర్వన్ రాష్ర్టంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మౌలికసదుపాయాల అభివృద్ధిపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తున్నామని, అందుకే ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్ధిని చేపడుతున్నామని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ చంద్రబాబు సారధ్యంతో భవ్యాంధ్రప్రదేశ్గా రూపొందుతుందని ప్రజాశక్తి ఆంధ్రప్రదేశ్ విభాగం సంపాదకులు తెలకపల్లి రవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్ వి.కృష్ణయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్, ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమ హబ్గా విశాఖ: బాబు సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం ప్రాంతాన్ని చిత్ర పరిశ్రమ హబ్గా రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను కలవడానికి వచ్చిన చిత్ర పరిశ్రమ ప్రముఖులకు హామీనిచ్చారు. మంగళవారం లేక్వ్యూ అతిథిగృహంలోని క్యాంప్ కార్యాలయంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు రవి కొటార్కర్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ల ప్రతినిధులు అశోక్ కుమార్, దేవరాజ్, మురళీధర్, నిర్మాతల మండలి ప్రతినిధులు సి. కల్యాణ్, కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు సీఎంను కలిశారు. చక్కెర పరిశ్రమ సమస్యలు పరిష్కరిస్తాం చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంతో పాటు రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. చక్కెర పరిశ్రమను లాభసాటిగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం కేసీపీ చక్కెర పరిశ్రమ ప్రతినిధులు శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, పెనమలూరు ఎమ్మెల్యే బడే ప్రసాద్ నే తృత్వంలో సీఎంను కలిశారు. ఎల్ఎన్జీ టెర్మినల్కు సదుపాయాలు కల్పించండి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు, సదుపాయాలు వెంటనే కల్పించాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. -
హ్యాకర్లకు చెక్ పెట్టే.. ఐటీ సెక్యూరిటీ
అప్కమింగ్ కెరీర్ సమాచార సాంకేతిక (ఐటీ) పరిజ్ఞానం రాకతో అన్ని రంగాల్లో కంప్యూటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్లైన్లోనే అన్ని లావాదేవీలు జరుగు తున్నాయి. అదే సమయంలో సమాచార చోరు లు (హ్యాకర్లు) తమ హస్తలాఘవం చూపుతు న్నారు. కంప్యూటర్లలోని విలువైన డేటాను తస్కరిస్తున్నారు. దీనివల్ల కంపెనీలు నష్ట పోతున్నాయి. కోలుకోలేని విధంగా దెబ్బతింటు న్నాయి. కొన్నిసార్లు దేశభద్రతకు సంబంధించిన కీలక సమాచారం కూడా శత్రుదేశాలకు చేరి పోతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామం. ఈ నేపథ్యంలో హ్యాకర్ల బారినుంచి కంప్యూటర్లను రక్షించేందుకు ఐటీ సెక్యూరిటీ నిపుణుల వినియో గం పెరిగింది. ఐటీ సెక్యూరిటీ ఉద్యోగాలకు, ఉపాధికి ఢోకా లేని కెరీర్గా మారింది. కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లోని కంప్యూటర్లు ఎక్కువగా హ్యాకర్ల బారిన పడుతున్నాయి. ఇటీవలి కాలంలో అన్ని రంగాల్లోనూ ఈ బెడద అధికమైంది. కేసుల విచారణలో సాయం: కంప్యూటర్లలోకి నకిలీ సాఫ్ట్వేర్లను, వైరస్లను పంపి, సమాచారాన్ని తస్కరించి, సొమ్ము చేసుకుంటున్న ముఠాలు ఉన్నాయి. ఏది ఎలాంటి సాఫ్ట్వేరో తెలియని పరిస్థితి. ఇదంతా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది. హ్యాకర్ల పంజాకు గురైన ఎన్నో సంస్థలు ఐటీ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. ప్రమాద తీవ్రత అందరికీ తెలియడంతో అన్ని రంగాల్లో వీరి నియామకం జరుగుతోంది. ఐటీ సెక్యూరిటీ లో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి.. కంప్యూటర్ హ్యాకింగ్కు గురైతే అందుకు కారణాన్ని గుర్తించడం. రెండోది.. ఎక్కడి నుంచి హ్యాకింగ్ జరిగిందో గుర్తించడం. మూడోది.. నకిలీ సాఫ్ట్వేర్ను, వైరస్లను తొలగించి, మరోసారి హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఈ మూడు దశల్లో పనిచేయాల్సి ఉంటుంది. వీరి ప్రధాన బాధ్యత ఆన్లైన్ మోసాలను అరికట్టడం. అంతేకాకుండా సెక్యూరిటీ కంప్యూటర్ అప్లికేషన్లను రూపొందించాలి. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలకు సంబంధించిన కేసుల విచారణకు దర్యాప్తు సంస్థలు ఐటీ సెక్యూరిటీ నిపుణుల సాయం తీసుకుంటున్నాయి. నేరస్థులను చట్టం ముందు నిలబెట్టేందుకు వీరి సేవలు అవసరమవుతున్నాయి. అర్హతలు: మనదేశంలో అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో ఐటీ సెక్యూరిటీపై ఎలాంటి కోర్సులు లేవు. అయితే, బీసీఏ, బీటెక్ కోర్సుల్లో భాగంగా ఐటీ సెక్యూరిటీని ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. ఈ రంగాన్ని కెరీర్గా ఎంచుకోవాలంటే ఇది సరిపోదు. బీటెక్ పూర్తిచేసిన వారు ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) కోర్సు చేస్తే మంచి అవకాశాలుంటాయి. వేతనాలు: ఐటీ సెక్యూరిటీ నిపుణులకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం అందుతుంది. నైపుణ్యాలను పెంచుకుంటే నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు పొందొచ్చు. ఎంసీఏ, బీటెక్ చేస్తే ఇంకా ఎక్కువ వేతనం లభిస్తుంది. ఐటీ సెక్టార్లో వన్నెతగ్గని కెరీర్ ‘‘ఐటీ రంగంలో వన్నెతగ్గని కోర్సుగా ఐటీ సెక్యూరిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆన్లైన్ మార్కెటింగ్, ఇంటర్నెట్ వినియోగం ఎంతగా వ్యాప్తిచెందితే.. ఈ రంగంలో అంతగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఐటీ దిగ్గజాల నుంచి సాధారణ వస్త్రదుకాణం వరకూ అంతటా కంప్యూటర్ వినియోగం పెరిగింది. ఆన్లైన్లో వ్యాపార లావాదేవీలు మరింత విస్తృతమవు తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణుల అవసరం నానాటికీ పెరుగుతుంది. టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే అవకాశాలకు కొదవ ఉండదు. సాఫ్ట్వేర్ సంస్థలూ ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరుగుతున్న కొద్దీ నకిలీ కార్డులను అదుపు చేసేందుకు ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం పెరిగింది. మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న ఈ కోర్సుతో ఉపాధి, సంతృప్తి రెండూ లభిస్తాయి. వేతనం విషయానికొస్తే ప్రారంభంలో నెలకు రూ.15వేల వరకు అందుకోవచ్చు. అనుభవం, నైపుణ్యాలు పెంచుకుంటే అధిక వేతనాలు పొందొచ్చు. - శివకుమార్, జనరల్ మేనే జర్, జూమ్ టెక్నాలజీస్ -
అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటీ
ఏడువేల ఎకరాల్లో ఏర్పాటు ఫార్మా కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో ఏడు వేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్మాసిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. బుధవారం ఆయన సచివాలయంలో ఫార్మాకంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పరిశ్రమ పరిస్థితి, భవిష్యత్తు, ఈ రంగంలో ఉన్న అవకాశాల మీద చర్చించారు. ఈ రంగంలో చైనా, భారతదేశాలే అభివృద్ధి చెందాయని, దేశంలో ఇప్పటికే తెలంగాణ అగ్రగామిగా ఉందని, మరింత అభివృద్ధి సాధించేం దుకు తెలంగాణలోనే ఎక్కువ అవకాశాలున్నాయని వివరిం చారు. రైలుమార్గం, జాతీయ రహదారి, నీటివసతి అందుబాటులో ఉన్న చోట ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి తోడు నిరంతరాయంగా 500 మెగావాట్ల విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఫార్మాసిటీకి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాలుష్యరహిత పారిశ్రామిక విధానానికి అనుగుణంగానే ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఐదు వేల ఎకరాల్లో పరిశ్రమలను, రెండు వేల ఎకరాల్లో ఆయా పరిశ్రమల్లో పనిచేసే వారికి కాలనీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫార్మా అనుబంధ కంపెనీలు కూడా ఇక్కడే ఉంటాయని, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను కూడా ఫార్మాసిటీకే తరలించాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటైతే ఐదు లక్షల మందికి ఉపాధి లభించనుందని, వారందరూ నివసించేందుకు వీలుగా టౌన్షిప్ను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ఫార్మా వ్యవహారాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఫార్మా విధానం అత్యుత్తమంగా ఉందో పరిశీలించాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ కన్సల్టెంట్లతో ఫార్మాసిటీ డిజైన్ను తయారు చేయించాలని నిర్ణయించారు. సమావేశంలో డ్రగ్ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు జయంత్ ఠాగూర్, ప్రధానకార్యదర్శి ఆర్.కె.అగర్వాల్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు. -
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి
న్యూఢిల్లీ: విజయవాడ సమీపంలోని గన్నవరం సహా దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ప్రణాళికలు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సిద్ధేశ్వర మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త సమీకృత టర్మినల్ బిల్డింగ్, ఇతర ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా తిరుపతి విమానాశ్రయం అభివృద్ధికి 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 42.02 కోట్లు వ్యయం చేసినట్టు పేర్కొన్నారు. -
నిఖత్కు చేయూత
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్లో సత్తా చాటుతున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్కు చేయూతనందించేందుకు జేఎస్డబ్ల్యూ స్టీల్ గ్రూప్ సంస్థ ముందుకొచ్చింది. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా దేశంలోని వివిధ క్రీడలకు చెందిన 28 మంది అథ్లెట్లకు జేఎస్డబ్ల్యూ సహకారమందిస్తోంది. వీరిలో నిఖత్ కూడా చేరింది. జేఎస్డబ్ల్యూ సహకారం అందుకుంటున్న 12 మంది అథ్లెట్లు త్వరలో గ్లాస్గోలో ప్రారంభం కానున్న కామన్వెల్త్ క్రీడల్లోనూ పాల్గొననున్నారు. కాగా, నిజామాబాద్కు చెందిన బాక్సర్ నిఖత్.. రెండేళ్లుగా పలు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తోంది. గత ఏడాది సెర్బియాలో జరిగిన నేషన్స్కప్లో విజేతగా నిలిచిన నిఖత్.. ఇటీవల సెర్బియాలోనే జరిగిన ‘గోల్డెన్ గ్లవ్ ఆఫ్ వోజ్వోదినా’ అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకోవడం ద్వారా మరోసారి సత్తా చాటింది. -
జూ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం
వరంగల్ పార్కుకు జయశంకర్ పేరు అటవీశాఖ మంత్రి జోగు రామన్న బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కుకు మరిన్ని వన్యప్రాణులను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జూలోని వివిధ ఎన్క్లోజర్లను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ మినీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి దానికి తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతామన్నారు. జూలోని ఉద్యోగులను వాచ్మెన్, లేబర్గా పిలివడాన్ని మార్చి అసిస్టెంట్ సార్జెంట్గా ఇతర పేర్లకు మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. అనంతరం జూలోని జిరాఫీకి మంత్రి అరటి పండు, ఆపిల్ను తినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర జూ పార్కుల డెరైక్టర్, అడిషనల్ పీసీసీఎఫ్ పి.మల్లికార్జున్ రావు, జూ క్యూరేటర్ బి.ఎన్.ఎన్.మూర్తి, జూ ఏసీఎఫ్ పి.శామ్యూల్, జూ వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం, అసిస్టెంట్ క్యూరేటర్లు మోబీన్, రమేశ్, సరస్వతి, జూ పీఆర్వో హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆ పోస్టులను తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేసిన నెహ్రూ జూలాజికల్ పార్కులోని 40 పోస్టులను ఉద్యోగులను వెంటనే తెలంగాణకు తీసుకొచ్చి జూలో కాంట్రాక్ట్, డెలీవైజ్గా పని చేస్తున్న ఉద్యోగులతో పర్మినెంట్ చేయాలని జూ యానిమల్ కీపర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. దేవేందర్, ఆయూబ్ కౌసర్ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
జిల్లా ప్రాజెక్టులపై కేంద్రం కరుణించేనా?
నేడు కేంద్ర బడ్జెట్ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు దక్కేనా గ్యాస్ ధరపై ప్రజల ఆసక్తి విజయవాడ సిటీ : గతేడాది యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయికి ఎయిర్పోర్టును అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో విస్తరణ, ఆధునిక హంగులు కల్పిస్తామని తెలిపారు. ఆ నిధులు రాలేదు. విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి చేరలేదు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. బంటుమిల్లి, కృత్తివెన్ను ప్రాంతాల్లో సముద్రపు కరకట్టను జాతీయ విపత్తుల నివారణ కింద అభివృద్ధి చేయాలని గతంలో యూపీఏ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్ర ఏర్పాటు ప్రతిపాదన పెండింగులో ఉంది. ఈ కేంద్రానికి యూపీఏ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన 361ఎకరాల అటవీ భూములను సేకరించారు. కేంద్ర బడ్జెట్లో నిధులు మంజూరు కాకపోవటంతో ఇదీ కాగితాలకే పరిమితమైంది. జిల్లాలో అతి ముఖ్యమైన ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ నుంచి నిధులు రాకపోవడం వల్లే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా గురువారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. పన్నుల భారం లేకుండా, నిత్యావసర సరకుల ధరలను అదుపు చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉండాలని జనం ఆశిస్తున్నారు. జిల్లాలో మూడు పెండింగు ప్రాజెక్టులకు కూడా కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ముందుగానే వాతలు.. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మోడీ సర్కారు రైల్వే చార్జీలు, పెట్రోలు డీజిల్, కిరోసిన్ ధరలను పెంచింది. గ్యాస్ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుందోనని ప్రజలు హడలెత్తిపోతున్నారు. రుణమాఫీ వైపు అందరి చూపు.. గత ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని టీడీపీ ఇచ్చిన హామీ ఇచ్చింది. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామపక్షం కావడంతో రుణమాఫీపై కేంద్ర బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు ఉంటాయనే దానిపైనా రైతన్నలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో లక్షలాది మంది రైతులకు సంబంధించి దాదాపు రూ.9,137 కోట్లు రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాల ధరలను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు. ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపుపైనా జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధరలు అదుపుచేసేనా.. ఇప్పటికే మార్కెట్లో నిత్యావసర సరకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రకం బియ్యం కిలో రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. పప్పు, వంట నూనెల ధరలు కూడా పెరిగిపోయాయి. ఉల్లి, అల్లం ధరలు కూడా అడ్డూ అదుపులేకుండా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో వివిధ వస్తువులపై పన్నులు విధిస్తే ఆ భారం మళ్లీ నిత్యావసర సరకులపై పడే ప్రమాదం ఉంది. ఎన్నికల సమయంలో అధిక ధరలను నియంత్రిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేతలు ప్రస్తుతం ఏ మేరకు చర్యలు తీసుకుంటారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
‘మైక్రోసా్ఫ్ట్’ పోటీల్లో వీఐటీ ప్రతిభ
వేలూరు: మైక్రోసాఫ్ట్ సంస్థ జరిపిన ఎమ్ఎస్ ఆఫీస్ నిపుణుల పోటీ ల్లో అంతర్జాతీయ స్థాయిలో వేలూరు వీఐటీ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఐదుగురు విద్యార్థులు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విద్యార్థులను వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ అభినందించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్వేర్లో విద్యార్థులను ఎంపిక చేసేందుకు కంప్యూటన్ అనే పేరుతో ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో మైక్రోసాఫ్ట్ నిపుణులు అనే అవార్డును ప్రకటిస్తారు. ఈ ఏడాది ప్రపంచ స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు గత ఏప్రిల్లో పోటీలు నిర్వహించారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని మైక్రోసాఫ్ట్ కేంద్రం ఆధ్వర్యంలో జరిపిన ఈ పోటీల్లో బీటెక్, ఎంటెక్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివే విద్యార్థులు 72 మంది కలుసుకున్నారు. ఈ పోటీలకు ఎనిమిది మంది వీఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని న్యూయడోలో మే 30వ తేదీన అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వీఐటీలోని మైక్రోసాఫ్ట్ ఇనోవేషన్ సెంటర్ ప్రొఫెసర్ దినేష్, వీసుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కళాశాలల నుంచి 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి మైక్రోసాఫ్ట్, ఇడియేషన్ ఫీస్ట్, ఆఫ్తాన్, హాక్తాన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్లపై పరిశోధనలు చేశారు. ఈ పోటీల్లో వీఐటీకి చెందిన అరుణ్కుమార్ ఎమ్ఎస్ వరల్డ్లో రెండో స్థానం, కరుణ్ మాత్యూ ఎమ్ఎస్ పవర్ పాయింట్లో రెండో స్థానం లభించింది. సిద్దార్థాఫ్పా, శివం, ఆదిత్య, జ్ఞాన హిదితాలు సాధన చేశారు. సాధన చేసిన విద్యార్థులను వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్, వైస్ చాన్సలర్ రాజు, ఉపాధ్యక్షులు జీవి సెల్వంలు అభినందించారు. -
వైజాగ్ ‘పంచ్’ పవర్
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటి ష్ దేశీయులు తమ వినోదం కోసం ఇక్కడ సరదాగా బాక్సింగ్ను ఆడడం ప్రారంభించారు.. కాలక్రమేణా అది నేడు విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెడుతోంది. ఆంగ్లో ఇండియన్స్ను ఆనందింపజేసేందుకు నాటి విశాఖవాసులు చేతులకు గుడ్డలు చుట్టుకొని ఆడుతూ వినోదం పంచితే.. ప్రస్తుత తరం ప్రపంచ వేదికలపై పవర్ పంచ్లు విసురుతూ పతకాలు కొల్లగొడుతున్నారు. పురుషులతోపాటు మహిళా బాక్సర్లనూ తయారు చేస్తూ విశాఖ.. జాతీయ స్థాయి శిక్షణ శిబిరాలకు కేంద్రంగా మారింది. ఐదు సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీ కోమ్ కూడా ఈ శిబిరాల్లో పాల్గొన్న బాక్సరే. (-ప్రకాష్ మాడిమి, విశాఖపట్నం, న్యూస్లైన్) 1947కు ముందు ఆంగ్లో ఇండియన్లు విశాఖలో ఎక్కువగా నివసించేవారు. వారంతా ఇక్కడ రైల్వే, పోర్టు, షిప్ యార్డుల్లో పనిచేసేవారు. ఖాళీ సమయాల్లో ఒకరిపై ఒకరు పంచ్లు విసురుకుంటూ బాక్సింగ్ ఆడుతుంటే స్థానికులు అమితాసక్తితో గమనించేవారు. బ్రిటిష్ వారు నౌకల్లోని డెక్ పైన ఓపెన్ ప్లేస్లో ఈ ఆటలాడేవారు. ఇక డచ్ వారు నావికుల మధ్య బాక్సింగ్ పోటీలు పెట్టేవారు. నౌకల్లో పనిచేసే వారి చేతికి గుడ్డలు చుట్టి సాయంత్రం వేళల్లో రిక్రియేషన్గా బాక్సింగ్ పోటీలు నిర్వహించేవారు. నగదు ప్రోత్సాహకాలను కూడా అందించేవారు. ఈ పోటీల్ని ఆసక్తిగా గమనిస్తూ స్థానికులు బాక్సింగ్పై మక్కువ పెంచుకొన్నారు. క్రమంగా మెళకువలూ నేర్చుకున్నారు. జాతీయ సమాఖ్య ఏర్పాటుతో ప్రాధాన్యత.. అప్పటి వరకు బ్రిటిష్, డచ్వారికి ఆనందాన్నందించిన ఆ ఆట భారత బాక్సింగ్ సమాఖ్య ఏర్పడటంతో అధికారిక పోటీలకు నోచుకుంది. రైల్వే యార్డ్స్లో ఫోర్మెన్గా ఆంగ్లో ఇండియన్స్ ఉండటంతో బాక్సింగ్ సంస్కృతి అక్కడ నుంచే స్థానిక ఆటగాళ్లకు చేరింది. కాలక్రమేణా ఆంగ్లో ఇండియన్స్కు పోటీనిచ్చే స్థాయికి స్థానిక బాక్సర్లు ఎదిగారు. ఇదే క్రమంలో కోస్తా ప్రాంతంలో బాక్సింగ్ క్రీడకు ప్రాధాన్యత పెరిగింది. ఈస్ట్ కోస్ట్ ప్రాంతమైన విశాఖ నుంచి కోల్కతా వరకూ పాకింది. సమాఖ్య చొరవతో విశాఖ పాతపట్నమైన వన్టౌన్ ఏరియాలోనూ అమెచ్యూర్ ఆటగాళ్లు తయారయ్యారు. విశాఖ బాక్సింగ్ సంఘం ఆవిర్భావం.. విశాఖలో బాక్సింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ ముందుకొచ్చింది. 1997లో స్థానికంగానే ప్రాంతీయ హాస్టల్ను ఏర్పాటు చేసింది. అయితే పోటీలు ఎక్కడ, ఎలా జరుగుతాయనే విషయంపై అవగాహన లేకపోవడంతో పోటీల్లో తలపడే అవకాశం స్థానికులకు దక్కేది కాదు. ఈ పరిస్థితుల్లో జేమ్స్ ఆధ్వర్యంలో విశాఖలో బాక్సింగ్ సంఘం ఏర్పాటైంది. దీంతో స్థానికంగా కొన్ని క్లబ్లను ఏర్పాటు చేసి వాటి మధ్య పోటీలకు అంకురార్పణ జరిగింది. పది వెయిట్ కేటగిరీల్లో తలపడే క్లబ్లకు గుర్తింపునివ్వడం, మూడు టోర్నీల వరకు మిగిలిన క్లబ్లకు అవకాశం కల్పించి క్లబ్లను నియంత్రించడంతో బాక్సింగ్ టోర్నీల హవా ప్రారంభమైంది. దానికి నగర పోలీస్ కమిషనర్లు కూడా సహకరించారు. అయితే అప్పటికే బాక్సింగ్ శిక్షణ కేంద్రం తరలివెళ్లి డీఎస్ఏకు అనుసంధానం చేయడంతో మూడేళ్లకే హాస్టల్ ముగిసింది. అకాడమీ ఏర్పాటుతో ఊపు అప్పటి వరకు ప్రాంతీయ హాస్టల్గా ఉండి, శాప్కు అనుసంధానించబడిన బాక్సింగ్ క్రీడ.. అకాడమీ ఏర్పాటుతో విశాఖలో ఊపందుకుంది. మరో మూడేళ్ల పాటు శాప్ ఆధ్వర్యంలోపోర్ట్ స్టేడియంలోనే నడిచిన రాష్ట్ర అకాడమీ పాత్ర ముగిసింది. అయితే 2003లో భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్).. అకాడమీల స్కీమ్లో భాగంగా విశాఖలో ఎస్టీసీ ఏర్పడింది. రెసిడెన్షియల్గా శిక్షణనిచ్చే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. జాతీయ శిక్షణ శిబిరాలు చోటు చేసుకున్నాయి. దాంతో అంతర్జాతీయ పోటీల్లోనూ విశాఖ బాక్సర్లు, ఇక్కడ శిక్షణ పొందిన బాక్సర్ల రాణింపు పెరిగింది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కోమ్ కూడా ఇక్కడ నిర్వహించిన రెండు జాతీయ శిక్షణా శిబిరాల్లో పాల్గొంది. సీనియర్లే కోచ్లు.. స్థానికంగా బాక్సింగ్ క్రీడకు ప్రాచుర్యం ఉన్నా సాంకేతికంగా శిక్షణ పొందిన కోచ్లు కరువయ్యారు. దీంతో సీనియర్ బాక్సర్లే కోచ్ల పాత్రను కూడా పోషించాల్సి వచ్చింది. అయితే ఉమామహేశ్వరరావు కోచ్గా శిక్షణ తీసుకోవడంతో మార్పు చోటుచేసుకుంది. అదే క్రమంలో శిక్షకునిగా వచ్చిన వెంకటేశ్వరరావు కూడా ద్రోణాచార్య అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. 70వ దశకంలోనే సీనియర్ స్టేట్ మీట్కు వరుసగా రెండు సార్లు విశాఖ ఆతిథ్యమిచ్చింది. సాయి ప్రసాద్, ఉదయ్ ప్రకాష్, నాగేంద్ర, లింగేశ్వరరావు, ఇజాన్, వరహాలరావు వంటి వారు జాతీయస్థాయికి ఎదిగారు. ఆసియా చాంపియన్షిప్లో సురేష్, ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో ఉదయ్ప్రకాష్, కిరణ్, యుగంధర్ లాంటివారు పదునైన పంచ్లతో ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా బాక్సర్లు కాలక్రమేణా విశాఖ అమ్మాయిలు కూడా బాక్సింగ్పై మక్కువ పెంచుకోసాగారు. ఏకంగా అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనే పతకాలు అందుకునే స్థాయికి ఎదిగారు. తొలిసారిగా ఈ ఘనతను సాధించిన బాక్సర్ కనకదుర్గ. 2004లో దుబాయ్ వేదికగా సాగిన అంతర్జాతీయ బాక్సింగ్లో ఈమె స్వర్ణం సాధించింది. మరో రెండేళ్లకు ఉష ఫైనల్కు చేరుకుని రజతాన్ని అందుకుంది. 2007లో ట్రైనింగ్ కమ్ కాంపిటీషన్లోనూ రజతాన్ని సాధించింది. ఆ తరువాత కోచ్ (ఎన్ఐఎస్)గానూ శిక్షణ పూర్తి చేసుకుంది. బాలుర విభాగంలోనూ... బాలుర విభాగంలో 2005లో ఎం.సురేష్ వియత్నాంలో జరిగిన ఆసియన్ క్యాడెట్ బాక్సింగ్లో కాంస్యం సాధించాడు. ప్రస్తుతం సబ్ జూనియర్స్ స్థాయిలోనూ విశాఖ బాక్సర్లు సత్తా చాటుతున్నారు. 2005లో జరిగిన జాతీయ సబ్ జూనియర్స్ పోటీల్లో చిన్నారావు, భాస్కర్, సాగర్, శ్యామ్ కుమార్లు, ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీల్లో ప్రవీణ్ స్వర్ణ పతకాలు సాధించారు. బాలికల సబ్ జూనియర్స్లో ఉమారాణి, నిరోషా, సుజాత స్వర్ణాలందుకున్నారు. ఇంకా ఎంతో మంది వర్ధమాన బాక్సర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ‘అప్పట్లో కిట్స్ కూడా ఉండేవి కావు’ అప్పట్లో నేను జాతీయ చాంపియన్షిప్లో పాల్గొన్నా.. ట్రాక్ తీసుకోవడం అంటే కలే. కనీసం కిట్స్ కూడా ఉండేవి కావు. ఏడాదికి ఒక టోర్నీలో తలపడితే గొప్పే. నేడు పరిస్థితులు పూర్తిగా భిన్నం. వసతులు పెరిగాయి. నెలకో టోర్నీ వచ్చింది. ఔత్సాహిక క్రీడాకారులు ట్రాక్ లేకుండా ప్రాక్టీస్నే మొదలెట్టడం లేదు. గల్లీ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ విశాఖలో బాక్సింగ్ అభివృద్ధి చెందింది. - జేమ్స్, విశాఖ బాక్సింగ్ సంఘం వ్యవస్థాపకుడు ‘కామన్వెల్త్లో స్వర్ణం తెస్తా’ మూడో కామన్వెల్త్ బాక్సింగ్ ట్రయల్స్కు వెళ్తున్నాను. సీనియర్ విభాగంలో పతకాలు సాధించడమే లక్ష్యం. యూత్ కామన్వెల్త్లో స్వర్ణం సాధిస్తాను. 2009 నుంచి ప్రతి ఏటా అంతర్జాతీయంగా పతకాలు సాధిస్తున్నా. రెండు సార్లు వరల్డ్కప్ బాక్సింగ్లో సత్తా చాటాను. టర్కీ, సెర్బియాల్లో స్వర్ణాలందుకున్నాను. బల్గేరియా, సెర్బియాల్లో ఫైనల్కు చేరాను. -నిఖత్ జరీన్ (బాక్సర్) ‘యూత్ ఒలింపిక్స్కు సిద్దమవుతున్నా’ ప్రపంచ యూత్ బాక్సింగ్లో కాంస్య పతకం సాధించాను. గతంలో రెండు అంతర్జాతీయ టోర్నీల్లో విజేతగా నిలిచాను. మరో టోర్నీలో ఫైనల్కు చేరుకున్నాను. అయితే ప్రస్తుతం యూత్ ఒలింపిక్స్లో సీనియర్ విభాగంలో పతకం సాధించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. - శ్యామ్ కుమార్, అంతర్జాతీయ బాక్సర్ -
రాజా కుటుంబీకుడికి అరుదైన అవకాశం
వెంకటగిరి రాజా కుటుంబీకుడు వెలుగోటి వెంకటసత్యప్రసాదకృష్ణ యాచేంద్రకు అరుదైన అవకాశం లభించింది. బంగ్లాదేశ్లో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు మేనేజర్గా బీసీసీఐ నియమించింది. సత్యప్రసాద్ యాచేంద్రగా ప్రాచుర్యం పొందిన ఆయన రంజీ క్రికెట్లో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్గా రాణించి మంచి క్రీడాకారుడిగా గుర్తింపుపొందారు. ప్రస్తుతం సౌత్జోన్ సెలక్షన్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. 2008లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సత్యప్రసాద్ యాచేంద్ర ఇంటర్మీడియట్ విద్యను పుట్టపర్తిలోని బృందావనంలో పూర్తి చేశారు. చెన్నైలో ఎంకాం చదివే సమయంలో క్రికెట్పై ఆసక్తి పెంచుకుని అటుగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన భారత జట్టుకు మేనేజర్గా వ్యవహరించే స్థాయికి చేరుకున్నారు. తమ రాజా కుటుంబీకుడికి అరుదైన అవకాశం లభించడంపై వెంకటగిరి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యూస్లైన్, వెంకటగిరి : క్రికెట్తో పాటు పోలో తదితర క్రీడల్లో వెంకటగిరి సంస్థానం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ప్రధానంగా క్రికెట్లో వెంకటగిరి పేరు గతంలోనే మార్మోగింది. ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్గా దివంగత వెంకటగిరి రాజా వీవీవీఆర్కే యాచేంద్ర వ్యవహరించారు. ఇక రాజకుటుంబంలో నేటి తరానికి చెందిన సత్యప్రసాద్ యాచేంద్రతోపాటు 50వ దశకంలో వెలుగోటి గోపాలకృష్ణ యాచేంద్ర రంజీ క్రీడాకారులుగా రాణించారు. వెంకటగిరి సంస్థాన క్రికెట్క్లబ్, వెంకటగిరి క్రికెట్ క్లబ్ అనే రెండు క్లబ్లను అప్పట్లోనే రాజాలు ఏర్పాటు చేశారు. ఈ క్లబ్ల ద్వారా పలువురు క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఎంతోమంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తున్నారు. పట్టణంలో తారక రామా క్రీడాప్రాంగణం రూపొందించారు. కాగా వెంకటగిరి క్రికెట్ క్లబ్కు ప్రస్తుత అధ్యక్షుడిగా సత్యప్రసాద్ యాచేంద్ర కొనసాగుతుండడం విశేషం. హర్షణీయం: అనంతరామయ్య, కోచ్ - సూరి స్టేడియం పర్యవేక్షకుడు వెంకటగిరి సంస్థానం కుచెందిన సత్యప్రసాద్ యాచేంద్ర భారతజట్టు మేనేజర్గా నియమితులవడం ఆనందంగా ఉంది. రాజాల కృషితో వెంకటగిరికి చెందిన నేటితరం విద్యార్థులు క్రికెట్ క్రీడలో రాణిస్తున్నారు. రాజాలు వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
భాగ్యనగరానికి మరో మణిహారం..!
హైదరాబాద్లో రూ.150 కోట్లతో భారీ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ముందుకొచ్చిన చెన్నై సంస్థ... సీఎస్ అనుమతికోసం ఫైల్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరనుంది. నగరంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ మల్టీప్లెక్స్ ప్రాజెక్టు రూపొందనుంది. హుస్సేన్సాగర తీరాన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో గతంలో రూపొందిన ప్రసాద్ ఐమాక్స్ను మించిన హంగులతో దీన్ని నిర్మించేందుకు పర్యాటక శాఖ ప్రణాళిక రూపొందించింది. లోయర్ట్యాంక్బండ్లో ఇందిరాపార్కు పక్కన రెండెకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. చెన్నైకు చెందిన ఓ ప్రముఖ థియేటర్స్ గ్రూపు సంస్థ రూ. 150 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దాదాపు ఏడు అంతస్తుల భవన సముదాయంలో ఓ బిగ్ స్క్రీన్ సహా ఐదు థియేటర్లు ఉంటాయి. వీటితోపాటు ఫుడ్ కోర్టులు, పిల్లల గేమింగ్ జోన్, ఇతర రిక్రియేషన్ సెంటర్లు ఉంటాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవగా చెన్నైకు చెందిన సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. రెండు రోజుల క్రితమే టెక్నికల్ బిడ్ తె రిచిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ.. ఒకే బిడ్ దాఖలు కావటంతో దానిని ఆమోదించే విషయంలో అధికారులు తటపటాయిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు బిడ్ దాఖలు చేసిన సంస్థ చెన్నైలో దాదాపు 50 వరకు థియేటర్లను అద్భుతంగా నిర్వహిన్నందున దానిని పీపీపీలో కలుపుకోవటం వల్ల హైదరాబాద్ ప్రాజెక్టు మెరుగ్గా రూపొందుతుందని అధికారులు పేర్కొం టున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందుంచాలని నిర్ణయించారు. అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాతే ఫైనాన్షియల్ బిడ్ తెరవాలని భావిస్తున్నారు. పర్యాటక శాఖకు భారీ ఆఫర్.. చెన్నై సంస్థకు ఈ ప్రాజెక్టును అప్పగిస్తే ఆర్థికంగా పర్యాటక శాఖకు భారీ ఆఫర్నే ప్రకటించినట్టు తెలుస్తోంది. అడిషనల్ డెవలప్మెంట్ ప్రీమియంగా రూ. 1.48 కోట్లు, లీజ్ రెంట్గా రూ. 1.78 కోట్లతోపాటు లాభాలపై 5.4 శాతం వాటా ఇచ్చేందుకు ఆ సంస్థ సిద్ధపడిందని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం లాభాలలో వాటా ద్వారానే ప్రతి నెలా రూ. 10 లక్షలు మించి వచ్చిపడే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఇది లాభదాయకమైన ప్రాజెక్టు అయినందున వీలైనంత వరకు సీఎస్తో ఆమోదముద్ర వేయించుకోవాలని భావిస్తున్నారు. -
అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం
నిడదవోలు, న్యూస్లైన్ : క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే వైఎంసీఏ ప్రధాన ధ్యేయమని వైఎంసీఏ నేషనల్ బోర్డు సభ్యుడు, ఇండియన్ వైఎంసీఏ చైర్మన్ కె.రాజారత్నం ఐజాక్ పేర్కొన్నారు. నిడదవోలులో శనివారం ఆల్ ఇండియా ఇంటర్ వైఎంసీఏ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వైఎంసీఏ ఆధ్వర్యంలో బాస్కెల్ బాల్, క్రికెట్లో రాణించిన వారిని జర్మనీ, ఇంగ్లండ్, శ్రీలంక దేశాలకు పంపించామన్నారు. అమెరికాలో ఉన్న స్పింగ్ ఫీల్డు యూనివర్సిటీతో అనుబంధంగా చెన్నై వైఎంసీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. క్రీడలతో పాటు సామాజిక కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్టు తెలిపారు. గతంతో వచ్చిన సునామీతో నష్టపోయిన పలు కుటుంబాలను ఆదుకున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో నాగపట్నం, మధురై, సంజావూర్ ప్రాంతాల్లో సుమారు రూ.22 కోట్లతో గృహాలు నిర్మించామన్నారు. విశాఖపట్నంలో 50 మంది చిన్నారులకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పారు. -
ఇక్కడి కూరగాయలు.. విదేశాలకు
=ఎగుమతులతో రైతులకు లాభం =త్వరలో ‘ఐ-అగ్రి’ సేవలు ప్రారంభం =‘సాక్షి’తో సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ప్రశాంత్రెడ్డి సాక్షి, హన్మకొండ: అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు కలిగిన హైదరాబాద్కు వరంగల్ కేవలం 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఇక్కడ పండే కూరగాయలు, పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం ఎంతో సులభం అంటున్నారు ఐ-అగ్రి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ప్రశాంత్రెడ్డి. వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సుకు హాజరైన ఆ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ కంపెనీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. జనవరి నుంచి వరంగల్లో తమ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, ఆ తర్వాత నాలుగు నెలల వ్యవధిలో ఇక్కడ పండే కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేయొచ్చని, తద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయని తెలిపారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. నా సొంతూరు అనంతపురం. కంప్యూటర్ విద్యను లండన్లో పూర్తి చేసిన తర్వాత స్వదేశం వచ్చి సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో స్థిరపడ్డాను. కానీ, మాది వ్యవసాయ కుటుంబం కావడంతో దానిపై ఆసక్తి ఏర్పడింది. నాణ్యమైన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంటే.. మనదేశంలో సరైన మార్కెట్ ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయూన్ని గ్రహించాను. ఈ రెండింటిని అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే ఉద్దేశంతో ‘ఐ-అగ్రి’ అనే సంస్థను హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా గతేడాది ఏర్పాటు చేశాను. ఇక్కడ నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొంటూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మా కంపెనీ సామర్థ్యానికి మించి ఉత్పత్తి ఉంటే... అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లో ఉన్న ఇతర పేరెన్నికగల కంపెనీల దృష్టికి తీసుకుపోతున్నాం. దాంతో మన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ను కల్పిస్తున్నాం. ప్రయోగాత్మకంగా ఈ పని చేపట్టినా మంచి ఫలితాలు సాధించాం. మొదటగా అనంతపురం.. మొదటగా అనంతరపురంలోని బత్తాయి రైతులతో సమావేశమై మా సలహా మేరకు పంటలు పండిస్తే మంచి ధరకు కొంటామని హామీ ఇచ్చాం. బత్తాయి పంట చేతికి వచ్చిన తర్వాత కోయడం, గ్రేడింగ్ చేయడం, భద్రపరచడం వంటి విభిన్న అంశాలపై శిక్షణ ఇచ్చాం. మా శ్రమ ఫలించింది. మొదటి ఏడాదే రూ. 30 లక్షల విలువ చేసే బత్తాయి ఉత్పత్తులను మిడిల్ఈస్ట్(గల్ఫ్) దేశాలకు ఎగుమతి చేయగలిగాం. ఆ తర్వాత నల్లగొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూరగాయలు పండించే క్షేత్రాలకు మా కార్యకలాపాలను విస్తరించాం. ఆర్నేళ్ల వ్యవధిలో 1600 మంది రైతుల నుంచి నేరుగా పంట ఉత్పత్తులను కొని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. జనవరిలో ప్రారంభం.. జనవరి నుంచి వరంగల్లో మా సేవలు ప్రారంభిస్తున్నాం. నెల రోజల వ్యవధిలో ఇక్కడి నేల స్వభావం, పండే పంటలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులపై సూక్ష్మస్థాయి నుంచి వివరాలు సేకరిస్తాం. అలా గుర్తించిన ప్రాంతాలకు వెళ్లి అక్కడ రైతులకు అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్మేందుకు వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇస్తాం. పంట వేసిన తర్వాత మొదటి దశ ఉత్పత్తి వచ్చేంత వరకు సహకారం అందిస్తాం. ఆశించిన దిగుబడి రాగానే వరంగల్ నగరంలోనే గోదాములను ఏర్పాటు చేస్తాం. ఇక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను హైదరాబాద్కి తరలిస్తాం. అక్కడి నుంచి విమానాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తాం. దేశీ మార్కెట్తో పోల్చితే విదేశీ మార్కెట్లో గిట్టుబాటు ధర ఎక్కువగా ఉంటుంది. రైతులకు మంచి లాభాలు వస్తాయి. -
గెలుపోటములు సాధారణం
భూపాలపల్లి, న్యూస్లైన్ : క్రీడల్లో గెలుపోటములు సాధారణమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా మరోసారి గెలుపునకు కృషిచేయాలని ప్రభుత్వ చీఫ్విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో పరకాల జోన్ పాఠశాలల క్రీడోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ అధ్యక్షతన జరిగిన ఈ క్రీడోత్సవాలకు ప్రభుత్వ చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా, పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్విప్ గండ్ర మాట్లాడుతూ పరకాల ప్రాంతంలో అనేక మంది జాతీయస్థాయి క్రీడాకారులు ఉన్నారన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన కు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది స్పోర్ట్స్ బడ్జెట్ను రూ. 200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ క్రీడలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన అనంతరం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు, పీఈటీలుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించారు. ఈ క్రీడల్లో పరకాల జోన్లోని భూపాలపల్లి, రేగొండ, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి, పరకాల మండలాలకు చెందిన సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-14, 17 బాల, బాలికల విభాగాల్లో జరుగనున్న కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో డీఎస్పీసంజీవరావు, డిప్యుటీ డీఈఓ క్రిష్ణమూర్తి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మైన్ యార మల్లారెడ్డి, భూపాలపల్లి నగర పంచాయతీ కమిషనర్ నోముల రవీందర్యాదవ్, ఎంఈఓ సాల్మన్, తహసీల్దార్ రాజమహేందర్రెడ్డి, ఎంపీడీఓ బ్రహ్మచారి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.విజయ్కుమార్, ప్రైవేటు కళాశాలల సంఘం మండలాధ్యక్షుడు బిల్ల రాజిరెడ్డి, భూపాలపల్లి క్రీడా కమిటీ నాయకులు జోగుల సమ్మయ్య, కె.రాజయ్య, సెగ్గెం సిద్ధు, సంజీవరావు, చిట్యాల, గణపురం ఎంఈఓలు జి.సారంగపాణి, కె.సురేందర్ పాల్గొన్నారు. -
ఆటలను ఆపేసి...
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సమైక్యాంధ్ర సభకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని నిబంధనలను పక్కన పెట్టింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం 7వ తేదీన హెచ్సీఏ క్రికెట్ లీగ్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. సభ కోసం ఆ మ్యాచ్లను రద్దు చేశారు. తర్వాతి రోజు అంటే ఆదివారంనుంచి సివిల్ సర్వీసెస్ క్రీడల కోసం ఇప్పటికే అధికారులు స్టేడియాన్ని కేటాయించారు. అయితే సభ జరిగాక టోర్నీ ఏర్పాట్ల కొరకు తగిన సమయం లేకపోవడంతో సివిల్ సర్వీసెస్ క్రీడలను వాయిదా వేయాల్సి వచ్చింది. జీఓ నం. 20 ప్రకారం క్రీడా ప్రాంగణాలను అద్దెకు ఇవ్వడంలో ప్రథమ ప్రాధాన్యత క్రీడలకే ఇవ్వాలి. అది జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ కాకపోయినా...ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు తమ స్థాయిలో ఆటలు నిర్వహించుకున్నా సరే వాటికి అవకాశం ఇచ్చిన తర్వాత క్రీడేతర కార్యక్రమాలకు మైదానాన్ని వినియోగించాలనే నిబంధన ఉంది. దాంతో పాటు అప్పటికే నిర్ణయించిన క్రీడా కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా క్రీడేతర కార్యక్రమాలకు స్టేడియాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏపీఎన్జీవోల సభ విషయంలో మాత్రం సడలింపు ఇచ్చారు.