Korean
-
ప్రాణాలతో చెలగాటమాడే థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సీజన్-3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
2021లో రిలీజై అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(Squid Game). తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో ఇటీవల మరో సీజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్కు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా సీజన్-2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరుసగా రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరో సీజన్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్-3 ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ జూన్ 27న స్క్విడ్ గేమ్-3ని స్ట్రీమింగ్కు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. దీంతో ఇలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్లు ఇష్టపడే ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.Press ⭕ for the final round.Watch Squid Game Season 3 on 27 June. #NextOnNetflix pic.twitter.com/SwdBVLB83f— Netflix India (@NetflixIndia) January 30, 2025 -
చాలా కాస్ట్లీ గురూ!పావు కిలో ఉప్పు రూ.7500?!
ఉప్పులేని కూరలను, వంటలను అస్సలు ఊహించలేంకదా. అందుకే అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు. అలాగే ఇండియాలో కాస్త చవగ్గా దొరికే పదార్థం కూడా ఉప్పే. ఉప్పు ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఉప్పు ఎంత కీలక పాత్ర పోషించిందో మన అందరికీ తెలుసు. అయితే ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్యమనే మనే వార్త ఒకటి ఉంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు. ఒక గ్రాము ధర కొనాలంటేనే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఏంటా ఉప్పు? తెలుసు కుందామా!పింక్ సాల్ట్....రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఇలా ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో దాని బట్టి ఒక్కో రేటు ఉంటుంది. వీటన్నింటిలో నేను రాజు అంటోందిక కొరియన్ ఉప్పు. ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది. 250 గ్రాముల కొరియన్ ఉప్పు ధర రూ.7,500 ( 100 డాలర్లు) దీన్ని ప్రత్యేక పద్ధతుల్లో కొరియన్ వెదురుతో తయారు చేస్తారట. అందుకే దీన్ని కొరియన్ బాంబూ ఉప్పు, ఊదారంగు వెదురు ఉప్పు, జుగ్యోమ్ అని కూడా అంటారు.కొరియన్ వెదురు ఉప్పు ఎలా తయారవుతుంది?పురాతన కాలం నుంచి కొన్ని శతాబ్దాల తరబడి కొరియన్ ఉప్పును వినియోగిస్తున్నారట. ఒక ప్రత్యకమైన పద్ధతుల్లో దీన్ని తయారు చేస్తారు. దీనికి పట్టే సమయం కూడా చాలా ఎక్కువే. వెదురు బొంగులలలో సాధారణ సముద్రపు ఉప్పు వేసి, వాటిని బంకమట్టితో మూసివేసిన తర్వాత, అధిక ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. 800°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉప్పును తొమ్మిది సార్లు కాల్చి, చివరిగా 1,000°C వద్ద రోస్టింగ్ చేస్తారు. ఇందుకు దాదాపుగా 50 రోజులు పడుతుంది. ఉప్పును వేయించిన ప్రతిసారీ, వెదురు లక్షణాలు పూర్తిగా ఉప్పులోకి శోషించబడేలా చల్లబరుస్తారు.అధిక ఉష్ణోగ్రతల వద్ద చాలా సార్లు వేడి చేయడంతోపాటు, దీని తయారీకి ప్రత్యేక ఫర్నేసులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం. ఎందుకంటే దీనికి చాలా శ్రద్ధ ,అనుభవం కావాలి. అందుకే ఈ ఉప్పు ధర అంత కాస్ట్లీ. సాధారణ సముద్రపు ఉప్పుతో పోలిస్తే వెదురు ఉప్పుతో ప్రయోజనాలు చాలా మెండు.వెదురు ఉప్పు-ఆరోగ్య ప్రయోజనాలువెదురు ఉప్పులో పొటాషియం, కాల్షియం మెగ్నీషియంతో సహా 70కి పైగా అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు: మంటను తగ్గిస్తుంది, కీళ్లనొప్పులు, గొంతు నొప్పి కి ఉపశమనంగా పనిచేస్తుంది.నోటి పూత, వాపు చిగుళ్ళకు చికిత్సలో పనిచేస్తుంది. నోటి పరిశుభ్రతకు చాలామంచిది.శరీరంలో pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది.యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది.డయాబెటిస్, హైపర్టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. టాక్సిన్ న్యూట్రలైజర్గా పనిచేసి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అంతేకాదు ఒత్తిడిని దూరం చేస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. గట్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ప్రపంచంలో ఉప్పు ధరఉత్పత్తి పద్ధతులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్ వంటి కారణాల రీత్యా ప్రపంచవ్యాప్తంగా ఉప్పు ధరలు మారుతూ ఉంటాయి. ఖరీదైన ఉప్పు ఉత్పత్తి చేసే దేశాలు:ఘనాస్విట్జర్లాండ్బెల్జియంసరసమైన ఉప్పు ఉత్పత్తి చేసే దేశాలుభారతదేశంపాకిస్తాన్కజకిస్తాన్ఈజిప్ట్భారతదేశం లాంటి దేశాలలో, దాని పొడవైన, విస్తృత తీరప్రాంతం , ప్రభుత్వ రాయితీల కారణంగా ఉప్పు చవగ్గా లభిస్తుంది. అదేవిధంగా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉప్పు గనులు, తీరప్రాంతం ఉన్న కారణంగా ఇక్కడ ఉప్పు ఉత్పత్తి ఎక్కువ.అమెరికాలో ఉప్పు అత్యంత ఖరీదైనది, కిలోకు సుమారు రూ. 300. ఐస్లాండిక్ ఉప్పు మరొక ఖరీదైన రకం. దీన్ని "లగ్జరీ సాల్ట్" అని పిలుస్తారు. ఇది ఐస్లాండ్లోని వాయువ్య ప్రాంతాలలో చేతితో తయారు చేస్తారు. చదవండి: పంచ్లో బెబ్బులి..కిక్ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా -
దెబ్బకు రూట్ మార్చిన మెగా ప్రిన్స్
-
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో కొరియన్ స్కిన్కేర్ & మేకప్ బ్రాండ్ ఎంట్రీ
సౌందర్య ప్రియులు,బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ కొరియన్ చర్మ సంరక్షణ మేకప్ సంచలనం టిర్టిర్( TIRTIR) ఇండియాలో లాంచ్ అయింది. రిలయన్స్ రిటైల్కు చెందిన టిరాతో కలిసి ఇది ఆఫ్లైన్ రిటైల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. భారతీయ బ్యూటి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని రిలయన్స్ ప్రకటించింది. Tira స్టోర్లు, Tira యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్బంగా కొనుగోలుదారులకు ఆఫర్లను కూడా అందిస్తోంది.ముఖ్యంగా మాస్క్ ఫిట్ రెడ్ కుషన్ ఫౌండేషన్,ఆకట్టుకునే 30 షేడ్స్తో తీసుకొచ్చింది. మిల్క్ స్కిన్ టోనర్, సిరామిక్ మిల్క్ ఆంపౌల్, మాస్క్ ఫిట్ మేకప్ ఫిక్సర్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులను లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది.చర్మ సంరక్షణ-జాగ్రత్తలుఏ సీజన్లో అయినా చర్మ ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి. తాజా పండ్లు, కూరగాయలతోపాటు సరిపడా నీళ్లు తాగాలి. చర్మ సంరక్షణకు హైడ్రేటింగా ఉండటం, రిఫ్రెషింగ్ చాలా కీలకం. చర్మం కాంతివంతంగా ప్రకాశించేలా ఉండాలంటే ఎండలో ఉన్నా, నీడలో ఉన్నా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.దుమ్ముధూళికి దూరంగా ఉండాలి. కెమికల్స్ వాడని సహజమైన సౌందర్య ఉత్పత్తులను వినియోగించాలి. నాణ్యమైన బ్రాండ్లను ఎంచుకోవాలి.ఒత్తిడికి, ఆందోళనకు దూరంగా ఉండాలి. మ్యాకప్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. బ్యూటీ నిపుణులు, స్కిన కేర్ వైద్య నిపుణుల సలహాల మేరకు ఉత్పత్తులను వాడాలి.ఎప్పటికపుడు మేకప్ను రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం -
స్క్విడ్ గేమ్ సిరీస్లో మన హీరోలు.. ఈ వీడియో చూశారా?
ఇటీవల విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోన్న వెబ్ సిరీస్ స్క్విడ్గేమ్-2(Squid Game-2) . గతంలో వచ్చిన సీజన్-1కు కొనసాగింపుగా ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు స్క్విడ్ గేమ్ -3 కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అది పొరపాటుగా పోస్ట్ చేశామని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్కు(web series) ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ఈ సిరీస్ అంతా ఆడియన్స్ను ఉత్కంఠకు గురి చేస్తుంది.అంతలా ఆదరణ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్లో మన హీరోలు నటిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహా ఎంత బాగుందో కదా? మరి అదే నిజమైతే బాగుండని మీకు అనిపిస్తోంది కదా? అవును.. మన హీరోలు ఆ గేమ్ను ఎలా ఆడతారో అనే ఆసక్తి ప్రతి ఒక్క సినీ ప్రియుడికి ఉంటుంది. అందుకే అసాధ్యం కాని వాటిన సుసాధ్యం చేయొచ్చని మరోసారి నిరూపించారు. అదెవరో కాదండి.. అదే మానవాళికి సవాలు విసురుతోన్న ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్). తాజాగా ఏఐ సాయం రూపొందించిన స్క్విడ్ గేమ్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.ఈ వీడియోలో మన స్టార్ హీరోలు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కల్యాణ్, ప్రభాస్ వీరంతా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్, టాలీవుడ్తో పాటు హీరోలు, కమెడియన్స్ సైతం ఈ స్క్విడ్గేమ్ వెబ్సిరీస్లోని పాత్రలతో వీడియోను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేసిన ఈ వీడియో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అభిమాన హీరోల ఏఐ ఇమేజ్ల వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్..ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న వెబ్సిరీస్ల్లో స్క్విడ్ గేమ్ ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైన స్క్విడ్గేమ్ సీజన్-2 ఓటీటీలో రికార్టులు సృష్టిస్తోంది. మొదటివారంలోనే అత్యధికంగా 68 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 92 దేశాల్లో నెట్ఫ్లిక్స్ ర్యాకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.సీజన్-3పై అప్డేట్..స్క్విడ్ గేమ్ సీజన్-2కు (Squid Game Season-2) ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇటీవలే సీజన్-3 అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. కొత్త ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత పొరపాటున డేట్ రివీల్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ. This is so good !! AI Generated !! 💥💥💥#SquidGameSeason2 ft #TFI pic.twitter.com/QqAyf3kTQ8— Priyanka Reddy - Rayalaseema 🌬 (@BerrySmile112) January 7, 2025 -
'ఎలిమినేట్ అయితే చంపేస్తారు'.. స్క్విడ్ గేమ్ ట్రైలర్ చూశారా?
2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ను దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్కు దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి సీజన్ లాగే ఆర్థికంగా ఇబ్బందులు పడే కొంతమంది వ్యక్తులు.. డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్లో భాగమవుతారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.తెలుగులోనూ విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ను మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు, ప్రమాదకరమైన గేమ్స్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.అసలు ఈ స్క్విడ్ గేమ్ ఏంటంటే..జీవితంలో అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్లైట్, గ్రీన్లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే పోటీలు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం సిక్స్ గేమ్స్ ఉంటాయి. చివరి గేమ్ పేరే స్క్విడ్ గేమ్. అయితే ఈ గేమ్స్లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్ పేరుతో చంపేస్తుంటారు. సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ను సొంతం చేసుకుంది. -
కే–పాప్ కాంటెస్ట్లో విజేతలు వీరే..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో కొరియన్ పాప్ సంగీతం(కే–పాప్)కు నగరంలోనూ క్రేజ్ పెరిగిన నేపథ్యంలో యువత ఆసక్తిని ప్రోత్సహించేందుకు కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియాతో కలిసి ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా నిర్వహించిన కే–పాప్ సంగీత పోటీల్లో కోల్కతాకు చెందిన అభిప్రియ చక్రవర్తి విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరం నుంచి పలువురు కే–పాప్ యూత్ను ఆకట్టుకున్న ఈ పోటీల్లో డ్యాన్సింగ్ విభాగంలో టైటిల్ను ది ట్రెండ్ ఫ్రమ్ ఇటానగర్ ఆల్బమ్ సొంతం చేసుకుందని, విజేతలకు కొరియా ట్రిప్ను బహుమతిగా అందించనున్నట్లు వివరించారు.అలరించిన.. సంగీత్ సమారోహ్ మాదాపూర్లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ ట్రైనింగ్)లో పండిత్ జష్రాజ్ 52వ పండిత్ మోతీరాం పండిత్ మనీరాం సంగీత్ సమారోహ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి, మహిమా ఉపాధ్యాయులు పాకవజ డ్యూయోట్ను, నటి శోభన భరతనాట్య ప్రదర్శన, అభిషేక్ రఘురాం కర్ణాటక సంగీతంతో ఆకట్టుకున్నారు. పద్యనాటకం.. నటన అద్భుతం పురాకృతి దశమ వార్షికోత్సవాలు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు అలరించాయి. పాదుకా పట్టాభిషేకం, భక్త పోతన, శ్రీకృష్ణ రాయభారం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సమావేశంలో కళాకారుడు ఉప్పలపాడు షేక్ సైదులుకు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. అదే విధంగా ప్రముఖ నటులు మల్లాది గోపాలకృష్ణ, ఇందిరాదేవికు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు శ్రీహరిరావు, సాంబశివారెడ్డి, షేక్లాల్ అహ్మద్, పొత్తూరు సుబ్బారావు, నాగేశ్వర్రావు, కళ్యాణ్, మల్లాది వెంకటరమణ, పుట్రేవు పరివారం తదితరులు పాల్గొన్నారు. భగవద్గీతతో జీవన నిర్వహణగీతా సారాంశాన్ని అర్థం చేసుకోవడం, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనడం, మానవ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, సమతుల్యమైన జీవితాన్ని గడపడం వంటి అవసరమైన అంశాలపై ఆధ్యాత్మిక బోధనలను ఆధ్యాత్మిక గురువు సుఖబోధానంద స్వామి వివరించనున్నారు. ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీల్లో భగవద్గీతతో జీవన నిర్వహణ అనే అంశంపై రెండు రోజుల పాటు విశ్వేశ్వరయ్య భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
ప్రభాస్ సలార్ 2 లో కొరియన్ సూపర్ స్టార్..
-
'ఈ గేమ్ ఆడితే అందరం చస్తాం'.. భయపెట్టిస్తోన్న టీజర్!
ప్రస్తుతం సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ మరో క్రేజీ వెబ్ సిరీస్తో సిద్ధమైంది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలో క్రేజ్ను దక్కించుకుంది.ఈ వెబ్ సిరీస్ దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదలైన ఈ టీజర్ మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
కొరియన్ నోట భారతీయ సంగీతం..'ఔరా' అంటున్న నెటిజన్లు
‘సౌత్ ఇండియన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఆసక్తి. పాటలు వింటాను. మ్యూజిక్ వీడియోలు చూస్తుంటాను’ అంటున్న కొరియన్ ఆర్టిస్ట్ ఔర సింగర్–సాంగ్ రైటర్ శిరీష భాగవతులతో కలిసి ‘థీ థీ తారా’ (కుట్టనాడన్ డ్రీమ్స్) ఆలపించాడు. గత సంవత్సరం చివరిలో బిగ్బాస్ సీజన్ 17లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా కనిపించాడు.ఈ సంవత్సరం ప్రారంభంలో ఝలక్ దిఖ్లా సీజన్ 11లో కూడా కనిపించాడు. ఈ క్రమంలో ఇండియన్ మ్యూజిక్పై లవ్ పెంచుకున్నాడు. ‘ఛలో’ ‘రోకో’లాంటి పదాలు పలుకుతున్న ఔర హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాడు.‘ఔరా ఉచ్చారణ చాలా భిన్నంగా ఉంటుంది. దీని కోసం ఐదు వారల పాటు పనిచేశాడు. అతడి అంకితభావం నాకు ఎంతగానో నచ్చింది’ అంటున్న శిరీష ఔరాను మన దేశంలోని ఇంటిపేరుగా అభివర్ణించింది. ‘మార్నింగ్ నూన్ ఈవెనింగ్’ ‘బ్లూ ఒషియన్’ ‘ఫైర్వర్క్’....ఇలాంటి ఎన్నో సింగిల్స్తో పేరు తెచ్చుకున్న ఔరా 2014లో బాయ్ బ్యాండ్ ఎఎతో కెరీర్ ప్రారంభించాడు. (చదవండి: ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్..కట్చేస్తే నేడు ఆమె..!) -
భారత షట్లర్లకు నిరాశ
సియోల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. బరిలోకి దిగిన యువ షట్లర్లు అష్మిత చాలిహా, మాళవిక, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రపంచ 53వ ర్యాంకర్ అష్మిత 8–21, 13–21తో 17వ ర్యాంకర్ పోన్పావీ చోచువాంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. మరో మ్యాచ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ మాళవిక 21–18, 15–21, 17–21తో 18వ ర్యాంకర్ లిన్ హోజ్మార్క్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆకర్షి 15–21, 15–21తో లిన్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ఆయుశ్ రాజ్ గుప్తా–శ్రుతి జంట 7–21, 12–21తో కో సంగ్ హ్యాన్–ఇయోమ్ హ్యూ వోన్ (కొరియా) జోడీ చేతిలో ఓడింది. -
Unlocked Review: పోగొట్టుకున్న ఫోన్ సీరియల్ కిల్లర్కు దొరికితే!
ఈ రోజుల్లో కాసేపు ఊపిరి బిగపట్టుకుని ఉండమన్నా ఉంటారేమో కానీ సెల్ఫోన్ లేకుండా క్షణం ఉండలేరు. ప్రతిదాంట్లో మంచి చెడు ఉన్నట్లే దీనివల్ల కూడా ఉపయోగం, ప్రమాదం.. అన్నీ ఉన్నాయి. మన ఫోన్ అవతలి వ్యక్తి చేతిలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్టే అన్లాక్డ్.కథతింటున్నా, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తున్నా, షికారుకు వెళ్లినా, జర్నీ చేస్తున్నా, ఏం చేసినా సరే.. ప్రతీది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది నామీ. ఒకరోజు బస్లో తన ఫోన్ మర్చిపోతుంది. అది కాస్త సీరియల్ కిల్లర్కు దొరుకుతుంది. నిజానికి పాస్వర్డ్ తెలియకపోవడంతో అతడు ఏమీ చేయలేక కోపంతో ఫోన్ను పగలగొడతాడు. పొరపాటున ఫోన్ కిందపడి అద్దం పగిలిందని, బాగు చేసి ఇస్తానని అమ్మాయిని పిలుస్తాడు. ఆపై పాస్వర్డ్ చేప్పమని అడుగుతాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది.తన నిశ్శబ్ధమే..ఈ క్రమంలో అక్కడికి వచ్చిన నామీ తటపటాయిస్తూనే తన పాస్వర్డ్ చెప్తుంది. దీంతో అతడు ఆమె ఫోన్ను హ్యాక్ చేసి ఇచ్చేస్తాడు. తన ప్రతి కదలికను గమనిస్తుంటాడు. నెమ్మది నెమ్మదిగా ఆమె జీవితాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని తనకు సంతోషమనేదే లేకుండా చేస్తాడు. అయితే ఇక్కడ సీరియల్ కిల్లర్ ఎక్కువ నిశ్శబ్ధంగా ఉండటం వల్ల నెక్స్ట్ ఏం చేస్తాడన్న ఉత్సుకత కలగక మానదు.పాస్వర్డ్ అడగడమే విడ్డూరంసినిమాలో క్యారెక్టర్ల గురించి పెద్దగా పరిచయం చేయకపోవడంతో చివర్లో కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. పెద్ద ట్విస్టులు లేకుండా కథ ఒకే లైన్లో ముందుకు సాగుతుంది. అయితే ఫోన్ స్క్రీన్ మార్చడానికి పాస్వర్డ్ అక్కర్లేదు. అలాగే షాపులోని వ్యక్తి (సీరియల్ కిల్లర్)కి పాస్వర్డ్ రాసివ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఇక్కడ షాపువాడు ఫోన్ పాస్వర్డ్ అడగడం, ఆమె రాసిచ్చేయడం కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.ఒక గంట 57 నిమిషాల నిడివి ఉన్న ఈ కొరియన్ థ్రిల్లర్ మూవీని ఓసారి చూసేయొచ్చు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అందుబాటులో ఉంది. -
Sleep Movie Review: నిద్రతోనే భయపెట్టే సినిమా
టైటిల్: స్లీప్(కొరియన్ మూవీ)దర్శకత్వం: జాసన్ యూనిర్మాణ సంస్థ లోటే ఎంటర్టైన్మెంట్జోనర్: హారర్ థ్రిల్లర్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్(తెలుగులోనూ అందుబాటులో ఉంది)నిడివి: 95 నిమిషాలుహారర్ సినిమా అంటే మనందరికీ గుర్తొచ్చేది దెయ్యమే. ఆ సబ్జెక్ట్ లేకుండా హారర్ సినిమా తీయడం చాలా అరుదు. తెలుగు చాలా హారర్ చిత్రాలు వచ్చాయి. కానీ దెయ్యం ఎక్కడా కనిపించకుండా ఆడియన్స్ను భయపెట్టేలా సినిమాలు చాలా తక్కువే ఉంటాయి. అలాంటి సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కించిన చిత్రమే స్లీప్. 2023లో వచ్చిన కొరియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉండో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా మొత్త ఇద్దరు దంపతుల చుట్టే తిరుగుతుంది. సౌత్ కొరియాలో హైయోన్-సూ (లీ సన్-క్యున్), సూ-జిన్ (జంగ్ యు-మి) కొత్తగా పెళ్లి చేసుకుని ఓ ఫ్లాట్లో నివసిస్తుంటారు. ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ హాయిగా జీవనం సాగిస్తుంటారు. కానీ అనుకోకుండా ఓ రాత్రి జరిగిన సంఘటనతో వారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ సంఘటన తర్వాత సూ జిన్లో భయం మొదలవుతుంది. అసలు తన భర్త ఎందుకిలా చేస్తున్నాడో భయంతో వణికిపోతుంది.ఆ తర్వాత తన భర్త హయన్ సూతో కలిసి వైద్యుని సంప్రదిస్తుంది సూ జిన్. ఆ తర్వాత ఆమె భర్తకు ఉన్న విచిత్రమైన, భయంకరమైన వింత సమస్య గురించి ఆమెకు అసలు నిజం తెలుస్తుంది. దీంతో భర్తను కాపాడుకునేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నిస్తుంది. అసలు అతనికి ఏమైంది? భయంకరమైన డిజార్డరా? లేక దెయ్యం ఆవహించిందా?.. అలాగే వీరికి పుట్టిన బాబును ఎలా రక్షించుకుంది? అనేది తెలియాలంటే స్లీప్ ఓసారి చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్లీప్.. హారర్ మూవీ అయినప్పటికీ డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్ను సినీ ప్రియులకు పరిచయం చేశాడు. దెయ్యాన్ని చూపించకుండానే ఆడియన్స్ను భయపడేలా చేశాడు. ఇందులో విచిత్రమైన డిజార్డర్ను పరిచయం చేస్తూ.. హారర్తో పాటు ఆడియన్స్లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. అతనికి ఉన్నది డిజార్డరా? లేక నిజంగానే దెయ్యం పట్టిందా? అన్న అనుమానాన్ని ఆడియన్స్లో రేకెత్తించాడు. అక్కడక్కడా మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించినా.. క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్ను మరింత భయపెట్టేస్తాయి. కొన్ని సీన్స్ అయితే ఒళ్లు గగుర్పొడ్చేలా ఉన్నాయి. అలాగే చివర్లో వచ్చే డ్రిల్లింగ్ మిషన్ సీన్ చిన్నపిల్లలకు చూపించకపోవడం మంచిది. మొత్తంగా ఓటీటీలో సస్పెన్ష్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ స్లీప్ చూసేయొచ్చు. -
ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలు మనకు బాగా అలవాటు అయిపోయాయి. ఎంతలా అంటే కొన్నాళ్ల ముందు వరకు తెలుగు సినిమాలు మాత్రమే మనోళ్లు చూసేవాళ్లు. ఇప్పుడు బాగుందని తెలిస్తే భాషతో సంబంధం లేకుండా ఏ మూవీని వదలట్లేదు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ మూవీస్ తీసేది ఎవరని అడిగితే చాలామంది చెప్పే పేరు కొరియన్. థ్రిల్లర్, డ్రామా, యాక్షన్.. ఇలా ఏ జానర్ చిత్రాలు అయినా కొరియన్స్ బాగా తీస్తారనే పేరుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)అలా ఇప్పుడు పలు ఓటీటీల్లో ది బెస్ట్ అని చూసిన ప్రతి ఒక్కరూ అంటున్న కొన్ని కొరియన్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయి. స్టోరీ లైన్ ఏంటనేది దిగువన లిస్టులో చూద్దాం.ఫర్గాటెన్ (2017) - ఇదో మిస్టరీ థ్రిల్లర్. నెట్ఫ్లిక్స్లో ఉంది. గతం మరిచిపోయిన ఓ వ్యక్తి.. సొంత తమ్ముడినే కిడ్నాప్ చేస్తాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ.మెమొరీస్ ఆఫ్ మర్డర్ (2003) - ఇది మర్డర్ మిస్టరీ మూవీ. నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇద్దరు డిటెక్టివ్స్... వరస హత్యల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. వాళ్లకు తెలిసిన నిజమేంటనేదే మెయిన్ స్టోరీ.ఐ సా ద డెవిల్ (2010) - ఇదో యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఓ ఊరిలో సంబంధం లేకుండా కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఇంతకీ ఎవరు చేస్తున్నారు? సీక్రెట్ ఏజెంట్ కనిపెట్టాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))ద గ్యాంగస్టర్ ద కాప్ ద డెవిల్ (2019) - ఇదో యాక్షన్ మూవీ, అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఓ సైకోని.. గ్యాంగస్టర్, పోలీస్ కలిసి ఎలా మట్టుబెట్టారనేదే స్టోరీ.ట్రెన్ టూ బుసాన్ (2016) - ఇది హారర్ మూవీ. అమెజాన్ ప్రైమ్లో ఉంది. బుసాన్ అనే ఊరికి వెళ్లేందుకు ఓ వ్యక్తి, కూతురితో కలిసి ట్రైన్ ఎక్కుతాడు. కానీ అందులోని మనుషులు.. జాంబీలుగా మారి అందరినీ చంపేస్తుంటారు. మరి వీళ్లు బతికి బయటపడ్డారా లేదా అనేదే స్టోరీ.ద ఔట్ లాస్ (2017) - ఇది క్రైమ్ యాక్షన్ సినిమా. అమెజాన్ ప్రైమ్లో ఉంది. కొరియన్, చైనీస్ గ్యాంగ్స్ మధ్య గొడవ జరిగితే.. ఓ డిటెక్టివ్ దాన్ని ఎలా డీల్ చేసాడనేదే స్టోరీ.ద హ్యాండ్ మెయిడెన్ (2016) - ఇది రొమాంటిక్ థ్రిల్లర్. అమెజాన్ ప్రైమ్లో ఉంది. 1930ల్లో ఓ రాజకుమారి దగ్గర పనిచేయడానికి ఓ అమ్మాయి వెళ్తుంది. కానీ తర్వాతర్వాత ఊహించని సంఘటనలు జరుగుతాయి. అదే స్టోరీ. 18 ప్లస్ సీన్లు ఉంటాయి. ఒంటరిగానే చూడండి!.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)పారాసైట్ (2019) - ఆస్కార్ గెలుచుకున్న కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఓ నిరుపేద ఫ్యామిలీ.. మాయమాటలు చెప్పి ఓ ధనవంతుల ఇంట్లో పనికి చేరుతారు. ఆ తర్వాత జరిగే సంఘటనల సమహారమే అసలు కథ.ద క్లాసిక్ (2003) - ఇది రొమాంటిక్ డ్రామా. నెట్ఫ్లిక్స్లో ఉంది. ఓ కాలేజీ స్టూడెంట్కి పాత డైరీ దొరుకుతుంది. అందులో తన తల్లి ట్రాయాంగిల్ లవ్ స్టోరీ గురించి ఉంటుంది. చివరకు ఆ కుర్రాడికి ఏం తెలిసిందనేదే స్టోరీ.ఓల్డ్ బాయ్ (2003) - ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఏమి లేనీ ఓ ఖైదీకి అన్ని వసతులు సమకూర్చిన.. లేని పోని గొడవల్లో ఇరుక్కుంటాడు. చివరకు ఏమైందనేదే అసలు కథ.ద అడ్మైరల్ (2014) - ఇది పీరియాడికల్ యాక్షన్ మూవీ. నెట్ఫ్లిక్స్లో ఉంది. కేవలం 13 యుద్ధనౌకలు ఉన్న ఓ యోధుడు.. 300 యుద్ధ నౌకలున్న జపాన్ యోధులతో ఎలా తలపడ్డాడనేదే స్టోరీ.ఏ ట్యాక్సీ డ్రైవర్ (2017) - ఇది యాక్షన్ కామెడీ మూవీ. అమెజాన్ ప్రైమ్లో ఉంది. రియల్ లైఫ్ సంఘటనలతో తీసిన ఈ సినిమా ఓ సాధారణ ట్యాక్సీ డ్రైవర్, ఊహించని వివాదాల్లో చిక్కుకుంటే ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?) -
వెదురు సారంతో కొరియన్ గ్లాస్ చర్మం..!
కొరియన్ చర్మానికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. పైగా అందుకు సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి కూడా. అయితే అవన్నీ ఆ బ్రాండ్లకు తగ్గ రేంజ్ ధరల్లోనే ఉంటాయనేది తెలిసిందే. అలా కాకుండా మనకున్న అందుబాటులోని వనరులతో కూడా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!వెదుర రసంతో కొరియన్ల లాంటి గ్లాస్ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చక్కగా వారిలా ప్రకాశవంతమైన మచ్చలేని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చట. వెదురు సారం ముఖాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుందట. ఇందులో ఉండే సిలికాన్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఖనిజంలా పనిచేస్తుంది. చర్మాన్ని దృఢంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్ది వచ్చే సిలికా స్థాయిలు తగ్గుతాయి.ముడతలు వచ్చి చర్మం ఆకృతి మారిపోయి, వృధాప్య సంకేచ్చేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాంటివి రాకూడదంటే చర్మ సంరక్షణలో భాగంగా వెదురు సారాన్ని ముఖానికి అప్లై చేస్తే సిలికా స్థాయిలు పెరగడమే గాక యవ్వనవంతమైన మెరిసే చర్మ మీ సొంతం అవుతుంది. దీనిలో ఉండే హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ కారకాలు చర్మాన్ని బొద్దుగా , మృదువుగా చేస్తాయి. ఇందులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మంలోని తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ముడతలు, గీతలు వంటివి పడకుండా ఉండేలా రిపేర్ చేస్తుంది. పొడి చర్మం వారికి ఈ వెదురుసారం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చర్మంపై ఉండే మంట, చికాకులను దూరం చేస్తుంది. వెదురుసారం శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను కలిగి ఉంది. అకాల వృద్ధాప్యం, నీరసానికి దారితీసే కాలుష్యం, యూవీ కిరణాలు వంటి పర్యావరణ నష్టం నుంచి చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడిడెంట్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇది సహజ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఎర్రటి మెటిమలు, చికాకు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేగాదు వెదురుసారంలో ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్లు ఉన్నాయి. ఇవి నిస్తేజంగా అయిపోయిన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, కోమలంగా మారుస్తుంది. ఈ వెదురుసారానికి హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, కలబంద వంటి ఇతర హైడ్రేటింగ్ పదార్థాలను జోడిస్తే మరింత తొందరగా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందగలరని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఈ వెదురు సారం పొడిగా లేదా ద్రవ రూపంలో వినియోగించవచ్చు. దీన్ని మీకు ఇష్టమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులకు జోడించడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..! షాక్లో వైద్యుడు) -
కే బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ కూతురు!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ స్టన్నింగ్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సార్ గ్లాస్లాంటి స్కిన్తో అత్యంత అందంగా ఉంటుంది. ఇప్పటికే ఆమె 2021లో అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ సెల్ఫ్ పోర్ట్రెయిట్ ప్రకటనల్లో కనిపించి మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడూ గ్లామర్ రంగంలో ఎంట్రీ ఇస్తూ..ప్రఖ్యాత భారతీయ కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్ లానీజ్ అంబాసిడర్గా వ్యవవహరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. సారా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ..ఆరోగ్యకరమైన మెరస్తున్న చర్మం కోసం లానీజ్ బ్రాండ్ని ఎంపిక చేసుకుని సరికొత్త ముఖంతో థ్రిల్గా ఉన్నాను. మీరు కూడా నాలాగే ప్రకాశవంతమైన చర్మంతో ఉండటానికి సిద్ధంగా ఉండండి అంటూ సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చింది. తాను ఆ బ్రాండ్ ఆవిష్కరణ, నిబద్ధతను అభినందిస్తున్నాని చెప్పింది. తాను కొంతకాలంగా ఈ ఉత్పత్తులను వినయోగిస్తున్నట్లు తెలిపింది. ప్రతి వ్యక్తి కాంతివంతంగా ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. తాను ఈ లానీజ్తో మరింత అందంగా కనిపించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అని రాసుకొచ్చింది సారా. సారా గ్లామర్ పరంగా సింపుల్ మేకప్తో క్యూట్ లుక్తో సందడి చేస్తుంది. మస్కరాతో నిండిన కనురెప్పలతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. పైగా అందమంతా గుది గుచ్చినట్లుగా ఉంటుంది సారా. అందుకు తగ్గట్లు ఆమె ధరించే డిజైన్వేర్లు ఆమె అందాన్ని మరింత ఇనమడింప చేస్తాయి. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) ( చదవండి: ఈ ఏడాది మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?) -
'యూ, యూ, యూ, లైక్ ఇట్స్'.. ఈ మాగ్నటిక్ సాంగ్ను విన్నారా!?
కొరియన్–పాప్ సెన్సేషన్ ‘ఇలిట్’ మ్యూజిక్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. డెబ్యూ–సింగిల్ ‘మాగ్నెటిక్’ బిల్బోర్డ్ చార్ట్ ‘హాట్ 100’లో చోటు సాధించడం ద్వారా ‘ఇలిట్’ గ్లోబల్ స్టేజీపై గ్రౌండ్ బ్రేకింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. యునహ్, మింజుచ, మోకా, వోన్హీ, ఇరోహ అనే అయిదుగురు అమ్మాయిల బృందంతో ‘ఇలిట్’ మ్యూజిక్ బ్యాండ్ గత నెల ప్రారంభమైంది. తొలి అడుగుల్లోనే స్పాటిఫై ‘డైలీ టాప్ సాంగ్ గ్లోబల్’ చార్ట్లో చోటు సంపాదించింది. యూకే ‘అఫిషియల్ సింగిల్స్ టాప్ 100’లో మెరిసింది. ‘మాగ్నెటిక్’ సాంగ్ను ‘ఇలిట్’ సభ్యుల ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించారు. ఈ గ్రూప్ డెబ్యూ ఆల్బమ్... సూపర్ రియల్ మీ. ‘మై వరల్డ్’, ‘మాగ్నటిక్’, ‘మిడ్నైట్ ఫిక్షన్’, ‘లక్కీ గర్ల్ సిండ్రోమ్’ అనే నాలుగు ట్రాక్లు ఈ ఆల్బమ్లో ఉంటాయి. తొలి వారంలోనే ‘సూపర్ రియల్ మీ’ అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. ‘యూ, యూ, యూ, లైక్ ఇట్స్ మాగ్నటిక్/ యూ, యూ, యూ, సూపర్’ అంటూ ‘మాగ్నటిక్’ను పాడాలనుకుంటే ఇప్పుడే వినండి మరి! ఇవి చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..! -
ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!
పాపులర్ ‘కె–పాప్’ మనకు సుపరిచితం. మరి ‘కె–ఖవ్వాలి అంటే?’ అని అడిగితే ‘అదేమిటీ!’ అని మిక్కిలి ఆశ్చర్యపోయేవారితో పాటు ‘ఎక్కడి ఖవ్వాలీ? ఎక్కడి కొరియా’ అని దూరాభారాలను కూడా లెక్కవేసే వాళ్లు ఉంటారు. ‘కొరియన్ సింగర్స్ సింగింగ్ ఖవ్వాలి’ ట్యాగ్లైన్తో పోస్ట్ చేసిన ఈ ‘కె –ఖవ్వాలి’ వీడియో వైరల్ అయింది. కల్చరల్ ఎక్స్చేంజ్కు అద్దం పట్టే ఈ వీడియోలో కొరియన్ గాయకులు సంప్రదాయక ఖవ్వాలి మెలోడీలను అద్భుతంగా ఆలపించే దృశ్యం, హార్మోని సుమధుర శబ్దం నెటిజనుల చేత ‘వహ్వా వహ్వా’ అనిపిస్తోంది. ‘బ్యూటీఫుల్ కల్చరల్ ఎక్స్చేంజ్’ లాంటి ప్రశంసలు కామెంట్ సెక్షన్లో కనిపించాయి. ఇవి చదవండి: ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్లో ఫ్యాన్స్ -
డైట్లో ఈ వంటకాన్ని చేరిస్తే..మెరిసే గ్లాస్ స్కిన్ మీ సొంతం!
కొరియన్ గ్లాస్ స్కిన్లా చర్మం ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం అని కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్లను ట్రై చేస్తుంటారు. వాటన్నింటి కంటే కూడా ఈ కొరియన్ వంటకాన్ని మీ డైట్లో చేర్చుకుంటే చక్కటి మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అకాల వృద్ధాప్యా ఛాయలను కూడా దూరం చేస్తుంది. ఏంటా వంటకం అంటే.. కొరియన్ కిమ్చి అనే ప్రసిద్ధ వంటకం మీ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతిమంతంగా చేయడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కిమ్చి అనేది సాంప్రదాయ కొరియన్ పులియబెట్టిన ఆహారం. దీన్ని కొరియన్లు ప్రతిరోజు తమ ఆహరంలో భాగం చేసుకుంటారు. ఇది సాధారణంగా చక్కెర, ఉప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, మిరపకాయ మసాల వంటి వాటిని జోడింది పులియబెట్టిన క్యాబేజీతో తయారు చేస్తారు. ఈ కిమ్చిని కావాలంటే ముల్లంగా, సెలెరీ, క్యారెట్, దోసకాయ, బచ్చలి కూర వంటి ఇతర కూరగాయలను ఉపయోగించి కూడా తయారు చేయవచ్చు. ఇది పులియబెట్టడం వల్ల ఉబ్బినట్లుగా ఉండి, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీన్నీ మన రోజువారీ డైట్లో భాగం చేసుకుంటే కొరియన్లలాంటి గ్లాస్ స్కిన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మెటిమలు లేని, మృదువైన హైడ్రేటెడ్ చర్మాన్ని పొందొచ్చని చెబుతున్నారు కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ నీతి గౌర్. ఈ వంటకం చర్మాన్ని ఏవిధంగా మేలు చేస్తుందా సవివరంగా చూద్దాం. ప్రోబయోటిక్స్: కిమ్చిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి పేగు ఆరోగ్యానికి తోడ్పడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఇందులో ఉండే గట్ మైక్రోబయోమ్ చర్మ సంరక్షణ తోపాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది . శరీరంలో ప్రోబయోటిక్స్ సమతుల్య గట్ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా సంభావ్యంగా చర్మం మంటను తగ్గించి..మొటిమలు, తామర వంటి వాటిని రాకుండా చేస్తుంది యాంటీఆక్సిడెంట్లు: కిమ్చిలో వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిలో విటమిన్లు ఏ, సీ ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కీలకమైనవి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, పర్యావరణ ఒత్తిళ్లు, యూవీ రేడియేషన్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సీడెంట్లు ఒత్తిడిని తగ్గించి..ముఖాన్ని యవ్వనంగా నిగనిగలాడేలా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్: కిమ్చీని తయారీలో కిణ్వ ప్రక్రియ కారణంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. మొటిమలు, రోసేసియా, అకాల వృద్ధాప్యం వంటివి దూరం చేస్తుంది. అలాగే ఎక్కువగా చర్మ పరిస్థితులలో వచ్చే వాపు వంటివి రానియ్యదు. విటమిన్లు, మినరల్ కంటెంట్: కిమ్చిలో విటమిన్లు ఏ,సీ, కే వంటి పోషకాలకు మంచి మూలం. అలాగే కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. కొల్లాజెన్ సంశ్లేషణ, గాయం వంటి వాటి నుంచి సంరక్షిస్తుంది. (చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్ని లాగించేస్తుందా..!) -
కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వ్యవస్థాపకురాలిగా సత్తా చాటుతున్న టీచర్!
కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ఆ ప్రొడక్ట్లన్నీ సహజసిద్ధమైన వాటితోనే తయారు చేయడంతో ఆ ప్రొడక్ట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. అందులోనూ కొరియన్ మహిళలు మచ్చలేని చందమామలా కనిపించడంతో ఆ దేశ ప్రొడక్ట్లను కొనేందుకు ప్రజలు ఎగబడుతుంటారు. ముఖ్యంగా వాళ్ల గ్లాస్ స్కిన్ మరింతగా కట్టిపడేస్తుంది. అలాంటి ప్రముఖ కొరియన్ బ్రాండ్లలో ఒక ప్రసిద్ధ బ్రాండ్ని ప్రారంభించి.. ఓ టీచర్ సత్తా చాటుంది. వ్యాపారవేత్తగా విజయపథంలో దూసుకుపోతోంది. ఆమె సక్సెస్ జర్నీ ఎలా ప్రారంభమయ్యిందంటే.. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కొరియన్ బ్రాండ్లదే అగ్రస్థానం అని చెప్పాలి. కొరియన్ల మచ్చలేని చర్మం కారణంగానే ఆ ప్రొడక్టలకు ఇంత ప్రజాధరణ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొరియన్ డ్రామాలు, సినిమాలకు భారత్ అంతటా వేలాదిగా అభిమానులు ఉన్నారు. బహుశా ఆ కారణం వల్ల కూడా ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్టలకీ మార్కెట్లో ఇంతలా డిమాండ్ ఉంది. అయితే ఈ కొరియన్ ప్రొడక్టలకీ కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. అలాంటి కొరియన్ బ్యూటీ ప్రొడక్టలలో ప్రసిద్ధ బ్రాండ్ అయినా బ్యూటీ బార్న్ వ్యవస్థాపకురాలు నాగలాండ్కి చెందిన తోయినాలి చోఫీ . ఈ కే బ్యూటీ బ్రాండ్ని చోఫీ 2016లో స్థాపించింది. ఇందులో బార్న్ COSRX నత్త మ్యూసిన్, క్లైర్స్ జ్యూస్డ్ విటమిన్ డ్రాప్, హోలికా సిరమైడ్ క్రీమ్ తదితర ఫేమస్ బ్యూటీ ప్రొడక్ట్లను తయారు చేస్తారు. ప్రారంభంలో కేవలం 500 ఆర్డర్లు మాత్రమే వచ్చినట్లు చోఫీ పేర్కొంది. అయితే కాల క్రమేణ ఉత్పత్తుల నాణ్యత కారణంగా ఆ సంఖ్య విపరీతంగా పెరిగి, భారత్లో ఉన్న మిగతా ప్రసిద్ద కొరియన్ బ్రాండ్లలో ఇది కూడా ఒకటిగా దూసుకుపోవడం ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇక చోఫీ ఈ వ్యాపారం గురించి మాట్లాడుతూ ఆఫ్లైన్లో అమ్మకాలు బాగానే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ బ్రాండ్ని తాను కేవలం నాగాలండ్కే పరిమితం చేయాలనుకోవడం లేదని, భారతదేశమంతటా విస్తరించనున్నట్లు తెలిపింది. ఇక తాను టీనేజ్లో ఉన్నప్పుడూ ముఖంపై వచ్చిన మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతుండేదాన్ని అని చెప్పారు. అప్పుడే తన స్నేహితులు ఈ కొరియన్ చర్మసంరక్షణ ప్రొడక్ట్లు బెటర్ అని సూచించడంతో తనకు వాటి గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. అవి తనకు బాగా పనిచేయడంతోనే ఈ బ్యూటీ ప్రొడక్టలను తయారు చేసే వ్యాపారం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఆ ఆసక్తి కారణంగానే టీచర్ ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టానని చెప్పుకొచ్చింది. ఇక ఆమె బ్రాండ్కి చెందిన అధికారిక ఇన్స్టాగ్రాంలో 45 వేల మందికి పైగా ఫాలోవర్లు, అభిమానులు ఉండటం విశేషం. ఆసక్తి ఉంటే టీ (చదవండి: డౌన్ సిండ్రోమ్తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్గా..!) -
గ్లాసీ స్కిన్ సీక్రెట్ : కొరియన్ బ్యూటీలు కూడా కుళ్లు కోవాల్సిందే!
మెరిసే చర్మం, మచ్చలేని అందమైన ముఖం అనేగానే అందరికీ గుర్తొచ్చేది కొరియన్ బ్యూటీస్. అందులోనూ ఇటీవల కొరియన్ బాండ్ మ్యూజిక్, సినిమాలు, సిరీస్లపై యూత్లో బాగా క్రేజ్ పెరిగింది. దీంతో కొరియన్ బ్యూటీల్లాగా గ్లాసీ స్కిన్తో మెరిసి పోవాలని కోరుకోవడం సహజమే. అందుకే మచ్చలేని మహారాణి, రాజులా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఫేషియల్ ఎక్స్ర్సైజ్ ముందుగా వ్యాయామాలు చాలా ముఖ్యం. శరీర ఆకృతికి వ్యాయామాలు చేసినట్టుగానే ముఖానికి కొన్ని నిర్దేశిత వ్యాయామాలున్నాయి. రోజులో రెండు సార్లు కచ్చితంగా చేస్తే వీ-జాలైన్ మీ సొంతమవుతుంది. సరిపడినన్ని నీళ్లు తాగడం చాలా కీలకం. క్లెన్సింగ్ కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే డీప్ క్లెన్సింగ్ కీలకం. నీరు, గ్లిజరిన్ వంటి మాయిశ్చరైజర్లు , తేలికపాటి సర్ఫ్యాక్టెంట్లనుతో తయారుచేసిన మైకెల్లార్ క్లెన్సింగ్ వాటర్తో ముఖాన్ని రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇది ఆల్కహాల్ ఫ్రీ కూడా. చర్మాన్ని టోన్ చేస్తుంది. క్మురికి, మేకప్, ఆయిల్ను డీప్గా శుభ్రం చేస్తుంది. లేదంటే నిమ్మకాయ కలిపిన ఫేస్వాష్తో అయినా శుభ్రం చేసుకోవచ్చు. పులిసిన బియ్యం కడిగిన నీళ్లు ఫేస్వాష్లు, కెమికల్ సబ్బుల జోలికిపోకుండా రైస్ వాటర్ను ఫేస్ వాష్గా వాడతారట కొరియన్స్. ఇది న్యాచురల్ క్లెన్సర్లా పనిచేస్తుంది. చర్మాన్ని ఎక్కువసేపు హైడ్రేట్గా ఉంచుతుంది. శుభ్రంగా కడిగిన బియ్యం నానబెట్టిన నీటి, తరువాత వడకట్టుకోవాలి. 24 గంటలు దీన్ని పులియ నివ్వాలి. మేజిక్ వాటర్తో ముఖం కడుక్కుంటే ప్రకాశవంతంగా తేమగా ముఖం మెరిసిపోతుంది. చర్మ సంరక్షణలో పెరుగు చాలా ముఖ్యమైన భాగం. పెరుగులో కొద్దిగా కస్తూరి పసుపు కలిపి, ఈ మిశ్రమంతో మృదువుగా మసాజ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫేస్ మాస్క్ తేనె, నిమ్మరసం మాస్క్, గ్రీన్ టీ మాస్క్, చార్కోల్ సీరమ్ ఫేస్ మాస్క్ లేదా గ్రీన్-టీ సీరమ్ షీట్ మాస్క్ని ఉపయోగించి గ్లాసీ స్కిన్ను కూడా పొందవచ్చు.గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది. నిమ్మరసం, తేనె మాస్క్ చర్మంపై పేరుకున్న మలినాలను, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. తేనె చర్మానికి తేమనందిస్తుంది. నిమ్మరసం టాన్ తొలగించి, స్కిన్ టోన్ లైట్ చేస్తుంది. చర్మాన్నిఆరోగ్యంగా, ముడతల్లేకుండా ఉంచేందుకు వాష్క్లాత్లతో ముఖాన్ని మసాజ్ చేస్తారు. గోరువెచ్చని నీటిలో మెత్తని గుడ్డను ముంచి, సున్నితంగా (ఎగువ దిశలో) తుడవాలి. దీంతో దుమ్ము , ధూళిని తొలగి తేటగా అవుతుంది. ట్యాపింగ్ ఫేషియల్ రిలాక్సేషన్ కోసం ట్యాపింగ్ టెక్నిక్ను కొరియన్లు బాగా వాడతారు. ఇది చర్మానికి మంచి రక్షణ అందించడంతోపాటు, రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాదు తొందరగా వయసు సంబంధిత ముడతలు రాకుండా కాపాడుతుంది. టోనింగ్ అండ్ క్లీనింగ్ కొరియన్ చర్మ సంరక్షణలో మరో ముఖ్యమైంది టోనింగ్. పురాతన కాలంలో, కొరియన్లు తమ చర్మాన్ని టోన్ చేయడానికి దోసకాయ, టమోటా, పుచ్చకాయ వంటి సహజంగా నీరు లభించే వాటిని ఉపయోగించేవారట. కాబట్టి ఏదైనా టోనర్ను కొనుగోలు చేసేటప్పుడు ఈ పదార్థాలను గుర్తు పెట్టుకొంటే మంచిది. వీటితోపాటు, జెన్సింగ్, గ్రీన్టీ రోస్ట్ బార్లీ టీకి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇక చివరగా రాత్రి పడుకునే ముందు ముఖచర్మ రక్షణ చర్యల్ని అస్సలు మర్చిపోరు. ప్రధానంగా అలెవెరా జెల్ను ముఖమంతా అప్లయ్ చేసుకుని, ఉదయం చల్లటి నీటితో కడుక్కుంటారు. -
22 ఏళ్లకే వరల్డ్ నంబర్ వన్గా! బ్యాడ్మింటన్లో ఎన్నో సంచలనాలు
దాదాపు ఏడాది క్రితం... దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్ జరుగుతోంది. భారత్, కొరియా మధ్య పోరు... మహిళల సింగిల్స్లో భారత స్టార్ పీవీ సింధు... ఎదురుగా ప్రత్యర్థి ఒక వర్ధమాన షట్లర్... ఆమె ఆట గురించి సింధుకు కూడా బాగా తెలుసు. అందుకే తనదైన వ్యూహాలతో సన్నద్ధమై బరిలోకి దిగింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్ను సింధు 21–18తో గెలుచుకుంది. కానీ అటు వైపు ఉన్న అమ్మాయి వెంటనే కోలుకుంది. అంతే ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. తర్వాతి రెండు గేమ్లను అలవోకగా 21–5, 21–9తో సొంతం చేసుకొని మ్యాచ్ను తన ఖాతాలో వేసేసుకుంది. సింధు ముఖంలో తీవ్ర నిరాశ... ఎందుకంటే ఆమె చేతిలో సింధు ఓడిపోవడం ఇది మొదటిసారి కాదు. ఇద్దరూ 6 మ్యాచ్లలో తలపడితే ఆరోసారి కూడా కొరియా ప్లేయరే విజయం సాధించింది. 2019 నుంచి ప్రయత్నిస్తున్నా ఒక్క మ్యాచ్లో కూడా సింధు గెలవలేకపోయిందంటే అతిశయోక్తి కాదు. రెండు ఒలింపిక్స్ పతకాల విజేత, వరల్డ్ చాంపియన్, పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్లు సాధించి వరల్డ్ బ్యాడ్మింటన్ గ్రేట్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సింధును కూడా ఒక ఆటాడుకుంటున్న ఆ అమ్మాయి పేరే ఆన్ సె యంగ్... టీనేజ్ దాటకముందే టాప్ షట్లర్లందరినీ ఓడిస్తూ దూసుకు వచ్చి ఆపై విశ్వ విజేతగా కూడా నిలిచిన 22 ఏళ్ల కొరియన్ స్టార్ షట్లర్. ‘కొరియాను ఆదుకున్న స్కూల్ గర్ల్’... ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్లో గ్రూప్ దశలో డెన్మార్క్తో జరిగిన కీలక మ్యాచ్లో ఆన్ సె యంగ్ విజయం తర్వాత కొరియా అంతటా కనిపించిన హెడ్లైన్స్ ఇవి. ఈ పోరులో తొలి నాలుగు మ్యాచ్ల తర్వాత టీమ్ స్కోరు 2–2తో సమంగా ఉన్న దశలో ఆఖరి మ్యాచ్లో ఆమె బరిలోకి దిగింది. తీవ్ర ఒత్తిడి మధ్య సత్తా చాటిన యంగ్ తన డెన్మార్క్ ప్రత్యర్థి లైన్ క్రిస్టోఫర్సెన్ను ఓడించడంతో అందరి దృష్టీ ఆమెపై పడింది. ఈ టోర్నీలో కొరియా జట్టుకు కాంస్య పతకం అందించడంలో కూడా 16 ఏళ్ల యంగ్ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో కొరియా సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి స్కూల్గర్ల్గా ఈ అమ్మాయి గుర్తింపు పొందింది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఆపై ఇవే విజయాలను కొనసాగిస్తూ ఉన్నతస్థానానికి దూసుకుపోయింది. అంతకు ముందు ఏడాదే కొరియా జూనియర్ టీమ్ తరఫున ఆసియా చాంపియన్షిప్ గెలిచినప్పుడే ఈ టీనేజర్లో ఎంతో సత్తా ఉందని, సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా నమ్మారు. వాటిని వమ్ము చేయకుండా ఆన్ సె యంగ్.. నిజం చేసి చూపించింది. స్టార్ షట్లర్లను ఓడించి... కరోలినా మరీన్, అకీనా యమగూచి, సైనా నెహ్వాల్... బ్యాడ్మింటన్లో ఈ ముగ్గురూ సూపర్ స్టార్లు. ఎన్నో గొప్ప విజయాలు వీరి ఖాతాలో ఉన్నాయి. మరి ఈ ముగ్గురినీ ఒకే టోర్నమెంట్లో ఒక ప్లేయర్ ఓడగొడితే ఆ ప్లేయర్ స్థాయి ఏంటో ప్రపంచమంతటికీ అర్థమవుతుంది. ఆన్ సె యంగ్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఉబెర్ కప్లో సీనియర్ల చాటున జూనియర్గా టీమ్ ఈవెంట్లో మంచి ప్రదర్శన కనబరచిన యంగ్ 2019 ఆరంభం నుంచే వ్యక్తిగత టోర్నీల్లో ప్రదర్శనతో సత్తా చాటింది. సూపర్–100 నుంచి సూపర్–300 స్థాయి వరకు వరుసగా నాలుగు టోర్నీల్లో ఆమె విజేతగా నిలిచింది. ఇందులో ఒక టోర్నీలో 2012 ఒలింపిక్స్ విజేత లీ జురుయ్ని ఫైనల్లో ఓడించగలిగింది. అయితే ప్రతిష్ఠాత్మక, పెద్ద టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750లో ఆటతో ఆన్ సె యంగ్ స్థాయి మరింత పెరిగింది. పై ముగ్గురు స్టార్లను ఓడించి టైటిల్ సొంతం చేసుకోవడంతో యంగ్కు ఎదురు లేకుండా పోయింది. 2019లో ఏకంగా ఐదు టైటిల్స్ గెలుచుకొని మరోదాంట్లో రన్నరప్గా నిలవడంతో సహజంగానే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అందించే ‘మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఆమె ఎంపికైంది. ఈ అవార్డు సాధించడం అంటే ఈ అసాధారణ ప్లేయర్ ఇక ముందు ప్రపంచ బ్యాడ్మింటన్ను శాసించేందుకు సిద్ధంగా ఉందని అర్థం. యంగ్ విషయంలోనూ అదే జరిగింది. తర్వాతి రెండేళ్లలో డెన్మార్క్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్, వరల్డ్ టూర్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లండ్, కొరియా ఓపెన్, మలేసియా మాస్టర్స్, జపాన్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్... ఇలా వేదిక మారడమే తప్ప యంగ్ విజయాల్లో మార్పు లేదు. వరుసగా టోర్నీలు ఆమె ఖాతాలో చేరాయి. 2022 ముగిసే సరికి సీనియర్ కెరీర్లో అప్పటికే 11 బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ గెలుచుకొని మరో 5 టోర్నీల్లో సె యంగ్ రన్నరప్గా నిలవడం ఆమె ఆధిపత్యానికి నిదర్శనం. సూపర్ 2023... చాలామంది టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్లతో పోలిస్తే ఆన్ సె యంగ్ ఆట శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. సాధ్యమైనంత తక్కువ శారీరక కదలికలతోనే ప్రత్యర్థిని బోల్తా కొట్టించే తత్వం ఆమెది. కోర్టులో అన్ని వైపులా పరుగెత్తుతూ సమాధానమిచ్చే శైలికి యంగ్ దూరం. కెరీర్ తొలుతలో దూకుడుగా ఆడుతూ అటాకింగ్ను ఇష్టపడిన ఆమె ఇప్పుడు ఎక్కువ భాగం డిఫెన్స్తోనే పాయింట్లు రాబడుతోంది. అటు వైపు షట్లర్ ఎంత వేగంగా షటిల్ను సంధించినా ప్రశాంతంగా రిటర్న్ ఇవ్వగలదు. దాంతోనే వారి దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ ఒత్తిడిలోకి నెట్టడం, ఫలితంగా విన్నర్ల ద్వారానే పాయింట్లు రాబట్టగలగడం యంగ్ ఆటతీరులో కనిపిస్తుంది. ఇదే ఆట ఆమెకు 2023లో అద్భుతాలను అందించింది. తిరుగులేని ఆటతో ఒకటి, రెండు కాదు... ఏకంగా 9 బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ ఆమె గెలుచుకోగలిగింది. ఇందులో బ్యాడ్మింటన్లో అన్నింటికంటే అత్యున్నత స్థాయి అయిన సూపర్ 1000 టైటిల్స్ మూడు ఉన్నాయి. మరో రెండు టోర్నీల్లో యంగ్ రన్నరప్గా నిలిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే మరో ప్లేయర్ ఎవరూ ఆమె దరిదాపుల్లోకి కూడా రాని విధంగా ఏకఛత్రాధిపత్యంతో ఈ కొరియా అమ్మాయి ఆటను శాసించింది. విశ్వవిజేతగా... నంబర్వన్గా... ఆన్ సె యంగ్ సత్తా, స్థాయి ఏమిటో ఇతర అగ్రశ్రేణి స్టార్ షట్లర్లతో ముఖాముఖీ సమరాల్లోనే తెలుస్తుంది. పీవీ సింధుపై ఏకపక్ష ఆధిపత్యం మాత్రమే కాదు... ప్రపంచ బ్యాడ్మింటన్లో రికార్డు స్థాయిలో 214 వారాల పాటు వరల్డ్ నంబర్ ఉన్న తై జు యింగ్, మరీన్, ఒకుహారాలపై విజయాలపరంగా ఆమెదే పైచేయి. 2016 నుంచి ఇటీవలి వరకు ప్రపంచ బ్యాడ్మింటన్ను శాసించిన తై జుపై 10–3 విజయాల ఆధిక్యం ఉందంటే ఆమె స్థానాన్ని యంగ్ అందుకొని కొత్త తరం ఘనతకు శ్రీకారం చుట్టినట్లే. 2023లో మరో మూడు ప్రత్యేకతలు యంగ్ను వరల్డ్ బ్యాడ్మింటన్లో హాట్ స్టార్ను చేశాయి. డెన్మార్క్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన ఆమె ఈ ఘనత సాధించిన తొలి కొరియా మహిళగా రికార్డులకెక్కింది. హాంగ్జూలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించి ఇక్కడా కొరియా తరఫున తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఇన్ని విజయాల తర్వాత సహజంగానే ర్యాంకింగ్స్లో శిఖరానికి చేరడం లాంఛనంగానే మిగిలింది. ఊహించినట్లుగానే ఆగస్టులో వరల్డ్ నంబర్వన్గా నిలిచి ఆపై వరుస టైటిల్స్లో తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఒలింపిక్స్లో అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగినా... ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ మాత్రం పతకం కోసం ఆమెను పిలుస్తోంది. యంగ్ ప్రస్తుత ఫామ్ చూస్తే అదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ కొరియా ప్లేయర్ ఇప్పటికే సాధించిన ఘనతలే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 22 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో చెలరేగుతున్న ఆమె మున్ముందు ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
మందుపాతరలను పసిగడుతుంది
చూడటానికి పిల్లలు ఆడుకునే కారుబొమ్మలా కనిపిస్తుంది గాని, ఇది మందుపాతరలను పసిగడుతుంది. కొరియన్ విద్యార్థులు సుబిన్ కిమ్, జిహూన్ పార్క్ ‘వార్డెన్’ పేరుతో ఈ మైన్ డిటెక్టింగ్ రోబోకు రూపకల్పన చేశారు. ఇది ఎగుడుదిగుడు రహదారులు, బాగా ఎత్తుపల్లాలు ఉండే కొండ దారుల్లో కూడా నిర్దేశించిన మార్గంలో సునాయాసంగా ముందుకు సాగిపోగలదు. దీని అడుగుభాగంలో మోవింగ్ అటాచ్మెంట్ను అమర్చడంతో దారిలో అడ్డొచ్చే గడ్డి, కలుపు మొక్కలను పీకిపడేస్తూ చకచక ముందుకు కదిలిపోగలదు. పగటి వేళలోనే కాకుండా, రాత్రి కటికచీకట్లోనూ ఇది పనిచేయగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ రోబో మైన్డిటెక్టర్ మందుపాతరలను అమర్చిన ప్రదేశాలను అత్యంత కచ్చితంగా గుర్తించి, వెనువెంటనే ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్ఫోన్కు చేరవేస్తుంది. కొరియన్ విద్యార్థులు ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా రూపొందించారు. మరింత మెరుగుపరచిన తర్వాత దీనిని రక్షణ అవసరాల కోసం అందుబాటులోకి తేనున్నారు. -
విదేశీయుని వద్ద రూ.5000 చలానా వసూలు చేసిన పోలీసు.. రిసిప్ట్ ఇవ్వకుండానే..
ఢిల్లీ: ఢిల్లీలో అక్రమంగా ట్రాఫిక్ చలానా వసూలు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కొరియా దేశస్థుని వద్ద కానిస్టేబుల్ రిసిప్ట్ ఇవ్వకుండానే రూ. 5000 చలానా వసూలు చేశాడు. నెలక్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. వీడియో ప్రకారం.. కానిస్టేబుల్ మహేష్ చంద్.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కొరియా దేశస్థునికి రూ.5000 జరిమానా విధించినట్లు చెప్పారు. కానీ విదేశీయుడు రూ.500 ఇచ్చాడు. తను అడిగిన డబ్బు రూ. 500 కాదని, రూ. 5000 అని చెప్పి కానిస్టేబుల్ మళ్లి అడిగాడు. చేసేది లేక విదేశీయుడు కానిస్టేబుల్కు మిగిలిన డబ్బును ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇద్దరు హ్యాండ్స్ షేక్ చేసుకుని వెళ్లిపోతారు. కానీ జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఆ బాధిత విదేశీయునికి కానిస్టేబుల్ ఇవ్వలేదు. Video: Delhi Cop Fines Korean Man ₹5,000 Without Receipt, Suspended https://t.co/EaheIf2LvI pic.twitter.com/bX5lLND7vM — NDTV (@ndtv) July 23, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు పోలీసు కానిస్టేబుల్ను విధుల నుంచి తప్పించారు. సంబంధిత వీడియోపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఇచ్చేలోపే ఆ విదేశీయుడు వెళ్లిపోయినట్లు కానిస్టేబుల్ చెబుతున్నాడు. ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
తీవ్ర విషాదం.. బాత్రూమ్లో విగతజీవిలా మారిన సింగర్!
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియన్ సింగర్ లీ సాంగ్ యున్ శవమై తేలింది. తన ప్రదర్శనకు కొద్ది నిమిషాల ముందే బాత్రూమ్లో విగతజీవిలా కనిపించింది. జూలై 6న జరిగిన ఘటన ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ప్రస్తుతం ఆమె మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) స్థానిక కొరియన్ మీడియా కథనం ప్రకారం.. బాత్రూమ్లో లీ సాంగ్ యున్ మృతదేహాన్ని గుర్తించిన ఈవెంట్ సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ప్రదర్శన ఇవ్వడానికి ముందే ఈ విషాదం జరగడంతో ప్రతి ఒక్కరూ శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో ఈ మిస్టరీ మరణంపై అక్కడి అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. లీ సాంగ్ యున్ తనదైన టాలెంట్తో సోప్రానో సింగర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సియోల్ నేషనల్ యూనివర్శిటీ చదువుకున్న ఆమె సంగీతంలో అసాధారణమైన ప్రతిభను కనబరిచింది. సంగీతం పట్ల ఆమెకున్న అంకితభావంతో న్యూయార్క్లోని ప్రతిష్టాత్మకమైన మన్నెస్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించింది. ఈ విషాద ఘటనతో పలువురు ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. (ఇది చదవండి: అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. నన్ను కూడా గుర్తుపట్టలేదు: యాంకర్) -
జాన్వీ కపూర్ సమర్పించు... గోచుజాంగ్
జాన్వీ కపూర్ ఫేవరెట్ ఫుడ్... గోచుజాంగ్. ఈ కొరియన్ ఫుడ్ గురించి ఒక యూట్యూబ్ వీడియోలో చవులూరించేలా మాట్లాడింది. లాక్డౌన్ టైమ్లో బోలెడు కుకింగ్ వీడియోలు, ట్రావెల్ వీడియోలు చూసింది జాన్వీ, క్విక్ నూడుల్స్ ‘గోచుజాంగ్’ తనను బాగా ఆకట్టుకుంది. అట్టే శ్రమ పడకుండా క్విక్గా ఈ నూడుల్స్ను తయారు చేయవచ్చు. రకరకాల ప్రోటీన్లు జత చేసి గోచుజాంగ్కు తనదైన హెల్తీ ట్విస్ట్ ఇచ్చింది జాన్వీ. ఈ వంటకం పుట్టుపుర్వోత్తరాలతో పాటు, ఎలా చేయాలి? ఏం వాడాలి... మొదలైన వివరాలు తెలుసుకోవడానికి జాన్వీ అభిమానులతో పాటు భోజన అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో సింగర్ మృతి.., హత్యా? ఆత్మహత్యా?
దక్షిణ కొరియా యూత్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ సింగర్ చోయ్ సంగ్ బాంగ్(33) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దక్షిణ సియోల్లోని తన నివాసంలో విగతజీవిగా పడున్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు..మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. అనంతరం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన దర్యాప్తును ప్రారంభించారు. చోయ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైన హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో మాత్రం చోయ్ ఆత్మహత్య చేసుకున్నాడనే తేలిందట. చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన యూట్యూబ్ చానెల్లో ఓ లేఖను అప్లోడ్ చేసిన ఆయన.. తన వల్ల ఇబ్బంది పడినవారందరికి క్షమాపణలు చెప్పారు. 2011లో రియాలిటీ సింగింగ్ పోటీ ‘కొరియాస్ గాట్ టాలెంట్’లో రెండో స్థానం పొందిన తర్వాత చోయ్ మరింత ఫేమస్ అయ్యాడు. చిన్న వయసులోనే స్టార్ సింగర్గా ఎదిగిన ఆయనకు..అదే స్థాయిలో వివాదాలు కూడా చుటుటముట్టాయి. ముఖ్యంగా తాను క్యాన్సర్ బారిన పడ్డానని, చికిత్స కోసం డబ్బులు కావాలంటూ విరాళాలు వసూలు చేయడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. డబ్బు కోసమే క్యాన్సర్ బారిన పడినట్లు అబద్దం చెప్పినట్లు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. తనకు వచ్చిన విరాళాలు కూడా తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే కొన్నాళ్లుగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఒంటరిగా ఉంటున్న చోయ్..ఇప్పుడు విగతజీవిగా మారడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. -
ఇండస్ట్రీలో విషాదం.. హోటల్ గదిలో ప్రముఖ సింగర్ సూసైడ్!
ప్రముఖ పాప్ సింగర్ హెసూ(29) ఆత్మహత్య చేసుకున్నారు. కొరియాకు చెందిన హెసూ ఓ హోటల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. చాలా మంది కొరియన్ పాప్ సింగర్స్కు మనదేశంలో మంచి ఫాలోయింగ్ ఉంది. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హెసూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. (ఇది చదవండి: ఓటీటీలో అవతార్-2.. ఇక నుంచి ఫ్రీగా చూసేయొచ్చు!) ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1993లో పుట్టిన హేసూ మై లైఫ్, మీ ఆల్బమ్స్తో కెరీర్ను ప్రారంభించింది. గాయా స్టేజ్, హ్యాంగౌట్ విత్ యూ, ది ట్రోల్ షో లాంటి ప్రోగ్రామ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ఇది చదవండి: సల్మాన్తో రిలేషన్లో ఉందా?.. ఏకంగా నా భర్తనే అడిగారు: హీరోయిన్) -
హైదరాబాద్ యూత్ను ఫిదా చేస్తున్న ‘కొరియన్’ ట్రెండ్..
హైదరాబాద్.... మినీ ఇండియాగా ప్రసిద్ధి. అనేక ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు. కొత్తగా ఏ ట్రెండ్ వచ్చినా దాన్ని వెంటనే ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అదే కోవలోకి చేరిపోయింది కొరియన్ ట్రెండ్. 2012లో వచ్చిన గంగ్నమ్ స్టైల్ నుంచి ఇప్పటి బీటీఎస్ మ్యూజిక్ దాకా.. వీటికి మనోళ్లు తెగ ఫిదా అవుతున్నారు. కె–పాప్, కె–డ్రామా, కె– ఫుడ్, కె– ఫ్యాషన్లపై మన హైదరాబాదీ యువత మోజు పెంచుకుంది. సిటీలో కొరియన్ ట్రెండ్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం!! – సాక్షి, సిటీడెస్క్ దక్షిణ కొరియా సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు నగరాన్ని తుపానులా చుట్టేస్తున్నాయి, లాక్డౌన్ టైమ్లో చాలా మంది అనేక భారత మెట్రోల్లానే నగరవాసులు కూడా ఆన్లైన్ వినోదం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. అదే క్రమంలో కె–డ్రామాల క్రేజ్లో చిక్కుకున్నారు. దక్షిణ కొరియా టెలివిజన్ ధారావాహిక ‘క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు’ ముగింపును చూస్తూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని మణి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ‘దక్షిణ కొరియా వారసురాలు ఉత్తర కొరియా సైన్యానికి చెందిన తీపి–విషాద ప్రేమకథలో లీనమైపోయి ఏడ్చాను’ అంటోందామె! మన సినిమాల్లాగే... మసాలా మెలోడ్రామాకు అలవాటు పడిన మనకు తగ్గట్టే విదేశీ లొకేషన్స్లో పాటలు, మిల్స్ – బూన్ రొమాన్స్, మన సినిమాల్లో తరహాలోనే హాస్యం, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, కిడ్నాప్లు, ఆకస్మిక మతిమరుపు, సంకల్ప శక్తి కలిగిన తల్లులు, కుటుంబ గౌరవం కోసం ప్రతీకారం తీర్చుకోవడాలు అన్నీ వీటి లోనూ ఉండడం విశేషం. యూరోమానిటర్ ప్రకారం, కె–డ్రామాలను భారతీయులు ఎక్కువగా వీక్షించడంతో, నెట్ఫ్లిక్స్లో కె–డ్రామాల వీక్షకుల సంఖ్య 370 శాతం పెరిగింది. వీటిని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అనువాదం చేయడంతో నగర యువత కె–డ్రామాకు పెద్ద ఎత్తున అభిమానులయ్యారు. నాటకాల నుంచీ నాలుగు విధాలుగా... తినే ఆహారం, ధరించే దుస్తులు, ఆభరణాలు, ఇంకా ముందుకెళ్లి వారు తాగే సోజు (కొరియన్ ఆల్కహాలిక్ పానీయం), వారు మాట్లాడే భాష వారు ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు ఇలా ప్రతిదీ సిటీ యూత్కి ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా మారాయి. దేశంలో ఒక్క దక్షిణ కొరియా నూడిల్ బ్రాండ్ నోంగ్షిమ్ మాత్రమే 1 మిలియన్ డాలర్ల విక్రయాలను నమోదు చేసింది. భాషపై సిటీజనుల ఆసక్తి ఈ కె డ్రామాల క్రేజ్తో సిటీలో కొరియన్ భాషా తరగతులపై ఆసక్తి కూడా బాగా పుంజుకుంది. ‘‘కొరియన్ భాషను నేర్చుకునే వారు తమకు నచ్చిన భాషా చిత్రాల్లో వారి చిహ్నాలు ఏమి చెబుతున్నాయి, గాయకులు ఏమి పాడుతున్నారనేది అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే భాష ద్వా రా కొరియాతో నేరుగా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారని ఇండో–కొరియన్ కల్చరల్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్కు చెందిన నగరశాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. సిటీలో కొరియన్ స్టోర్స్ కొరియన్ ట్రెండ్కు అనుగుణంగా నగరంలోని బాలానగర్, మాదాపూర్, హిమాయత్నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, గచ్చిబౌలి, అమీర్పేట, సికింద్రాబాద్, తిరుమలగిరి వంటి ప్రాంతాల్లో గ్రాసరీ స్టోర్స్, ఆర్గానిక్ ఫుడ్, కాస్మోటిక్, ఫుడ్, బేకరీ, కేక్, కిచెన్ స్టోర్స్ వెలిశాయి. జూబ్లీహిల్స్లో చబ్బీ చో, బంజారాహిల్స్లో సెవెన్ సిస్టర్స్, గచ్చిబౌలిలో హైకూ రెస్టారెంట్లు కొరియన్ వంటకాలు ఇష్టపడే నగరవాసుల అభిరుచులకు తగ్గ ఆతిథ్యాన్ని అందిస్తోంది. నాటకాలే ప్రధాన కారణం కొరియన్ కల్చర్ విజృంభణ వెనుక మొత్తం ఆ దేశపు నాటకాలే ప్రధాన కారణంగా విశ్లేషకులంటున్నారు. నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్న 500 కొరియన్ డ్రామాలలో డిసెండెంట్స్ ఆఫ్ ది సన్, బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్, రిప్లై 1988, కింగ్డమ్, స్కై కాజిల్... వంటివి వీక్షకుల క్రేజ్కు పునాది రాళ్ల వంటివిగా చెప్పొచ్చు. ‘ఒత్తిడితో కూడిన పరిస్థితిలో కొరియన్ నాటకాలు నన్ను నవ్విస్తాయి’ అని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని వర్షి అంటోంది. బీటీఎస్ హోరులో... కొరియన్ మ్యూజిక్ సెన్సేషన్ బీటీఎస్ (బుల్లెట్ ప్రూఫ్ బాయ్ స్కౌట్స్ లేదా బ్యాంగ్టన్ బాయ్స్) ఇప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. 21వ శతాబ్దిలో పాప్ ఐకాన్గా నిలిచింది. 2010లో ఓ గ్రూపుగా ఏర్పడిన ఏడుగురు సభ్యుల బృందం జూన్ 2013లో తమ మొదటి ఆల్బమ్ ‘2కూల్ 4స్కూల్’ పేరుతో దూసుకొచ్చారు. ఈ ఆల్బమ్ ప్రపపంచ వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. హిప్ హాప్ బ్యాండ్ గ్రూప్గా మొదలు పెట్టి కే–పాప్(కొరియన్ పాపులర్ మ్యూజిక్), పాప్(పాపులర్ మ్యూజిక్), ఆర్ అండ్ బీ (రిథమ్ అండ్ బ్లూస్), ఈడీఎం(ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మూజిక్) వంటి అనేక రూపాల్లో తమ సత్తాను చాటుకుంది. ఫుడ్కు యమా క్రేజ్ నటీనటులు తమ చాప్స్టిక్లతో వేడి వేడి కప్పు రమ్యున్ నూడుల్స్పై చప్పరించడం లేదా కిమ్చీని తినే సన్నివేశాల వీక్షణ ద్వారా పుట్టుకొస్తున్న అభిరుచులు నగరవాసుల్ని పట్టి కుదిపేస్తున్నాయి. దశాబ్దానికి పైగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నివసిస్తున్న కొరియన్ జాతీయురాలు చో మిన్ యున్ నగరంలో కొరియన్ వంటకాలకు ప్రత్యేకించిన గోగురియో రెస్టారెంట్ను ఇటీవలే హైటెక్ సిటీలో ప్రారంభించారు. ‘ కె–డ్రామా కె–పాప్ల జనాదరణతో, కొరియన్ ఫుడ్పై కూడా ఆసక్తి పెరుగుతోంది అందుకే రెస్టారెంట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను’ అని చో మిన్ యున్ వివరించారు. పాల వినియోగం ఉండదు కొరియన్ ఆహార సంస్కృతి చైనీస్, జపనీస్ సంస్కృతుల నుంచి ప్రేరణ పొందింది. ఆహారంలో, పాల అతి వినియోగం ఉండదు. కొరియన్ మిరపకాయ పేస్ట్ అయిన గోచుజాంగ్ గోచుగారు – కాల్చిన మిరప పొడి, ఇది భారతీయ మిరపకాయ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆహారం ఎల్లప్పుడూ కిమ్చితో వడ్డిస్తారు, కొరియన్ల కోసం చాలా ప్రత్యేకమైన పులియబెట్టిన సైడ్ డిష్ సంప్రదాయకంగా చేప నూనెతో వడ్డిస్తారు. ఇక్కడి ప్రజలు దాన్ని ఎక్కువగా ఇష్టపడరు, దీంతో చేప నూనెను వాడటం మానేశాను. – బెంజమిన్, జూబ్లీహిల్స్లోని ఓ కొరియన్ రెస్టారెంట్ చెఫ్ బీటీఎస్కు పెద్ద ఫ్యాన్ మొదటి నుంచి పాప్ సంగీతం అంటే ఇష్టం. ఇక కొరియన్ బీటీఎస్, ఎక్సో, బ్లాక్ పింక్, రెడ్ వెల్వెట్, షిండీ గ్రూపుల పాటలు వింటాను. మొదట్లో భాష అర్థం కాకపోయేది. క్రమక్రమంగా అలవాటు అయ్యింది, ఆ పాటలు నేర్చుకున్నా. బీటీఎస్లో సుగా అంటే ఇష్టం. వాళ్ల కాన్సర్ట్ వెరీ గుడ్. ఇక ఈ బృందంలోని ఏడుగురిది ఒక్కొక్కరిదీ ఒక్కో స్ఫూర్తిదాయక చరిత్ర. చాలా కష్టాలకు ఎదురొడ్డి ఈ స్థాయికి వచ్చారు. –పి.రితిక, బీఎస్సీ ఫస్ట్ ఇయర్, నారాయాణగూడ -
పాపులర్ బిటిఎస్ బాయ్ నోట మన తెలుగు పాట.. వీడియో వైరల్
కొరియన్ బిటిఎస్ బాయ్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యూజిక్ బ్యాండ్కి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి వీడియోలే దర్శనం ఇస్తాయి. ఈ బిటిఎస్ బ్యాండ్లోని బాయ్స్కు ఉండే లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలంటూ కుప్పలు తెప్పలుగా వారికి రిక్వెస్ట్స్ వస్తుంటాయట. ఇదిలా ఉంటే ఈ బిటిఎస్ బ్యాండ్కు చెందిన ఓ సింగర్ మన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ అంటే చాలా ఇష్టమట. చదవండి: తెలియక ఆ తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు అవి తెలుసుకున్నా: రష్మీ తాజాగా అతడు ఆ పాటకు హమ్ చేస్తూ స్టెప్పులు వేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకి ఆ సింగర్ ఎవరంటే అమ్మాయిల రాకుమారుడైన జంగ్ కూక్. రీసెంట్గా జంగ్ కూక్ నాటు నాటు పాట వింటూ ఆ పాటను స్వయంగా ఆలిపించాడు. అయితే ఈ పాటను తెలుగులోనే విని పాడటం విశేషం. పాడటంమే కాదే నాటు నాటు సిగ్నేచర్ స్టేప్ కూడా వేశాడు. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. అనంతరం ఈ పాట తనని ఎంతగా ఆకట్టుకుందో కూడా వివరించిన వీడియోను తన యూట్యూబ్ చానల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం వీడియోకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన బిటిఎస్ బ్యాండ్ సింగర్ స్వయంగా నాటు నాటు పాడటం చూసి తెలుగు అభిమానులంతా మురిసిపోతున్నారు. అంతేకాదు ఈ వీడియోను పలు సోషల్ మీడియా ప్లాట్ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక జంగ్ కూక్ నాటు నాటు పాట పాడిన అనంతరం ప్రస్తుతం ఈ పాట, ఆర్ఆర్ఆర్ సౌత్ కొరియాలో ట్రెండింగ్లో నిలిచిందని సమాచారం. -
నిందితుడి అతితెలివి: పోలీసులకు చిక్కుకుండా కొరియన్లా సర్జరీ! కానీ..
ఇటీవలకాలంలో పలు నేరస్తులు పోలీసులకు పట్టబడకుండా ఉండేందుకు చేసే పనులు విస్మయానికి గురి చేస్తున్నాయి. అతి తెలివితో పేరు, వేషంతో సహా కొందరూ సర్జరీలతో ముఖ మార్పిడికి సిద్ధపడిపోతున్నారు. అయినప్పటికీ వారు చేసిన నేరాలే వారిని చివరికి పట్టించేస్తున్నాయి. ఎన్ని వేషాలు వేసినా.. చివరికీ కటకటాలపాలు కాక తప్పట్లేదు. వివరాల్లోకెళ్తే..థాయ్ డ్రగ్ డీలర్ పోలీసులకు చిక్కకూడదని పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. ఐతే అతను చేసిన ఆ ప్రయత్నాలేమి ఫలించకపోగా..అతడు పోలీసులకు పట్టుబడక తప్పలేదు. సహరత్ సవాంగ్జాంగ్ అనే వ్యక్తి కొరియన్లా సర్జరీ చేయించుకుని సియోంగ జిమిన్గా పేరు మార్చుకుని అసలు గుర్తింపు దాచే యత్నం చేశాడు. ఐతే అతను డ్రగ్స్ను ఇతరలకు కొనుగోలు చేయడం కారణంగా అతన్ని సులభంగా ట్రాక్ చేశారు పోలీసులు. దీంతో బ్యాంకాక్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సవాంగ్జాంగ్ని పోలీసులు అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు దర్యాప్తులో సాక్ష్యులు అతన్ని అందమైన కొరియన్గా అభివర్ణించారు. ఐతే అతను క్లాస్ వన్ డ్రగ్ అయిన ఎక్స్టసీ(ఎండీఎంఏ)ని దిగుమతి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతను పట్టబడటానికి ముందు గతంలో మూడుసార్లు అరెస్టు అయ్యాడు కూడా. గానీ ఏదోరకంగా నిర్బంధం నుంచి తప్పించుకునే వాడని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసు మేజర్-జనరల్ థీరదేజ్ తమ్మసూటీ మాట్లాడుతూ.. సవాంగ్జాంగ్ కేవలం 25 ఏళ్ల వయసులో పేరుమోసిన డ్రగ్ డీలర్గా మారాడని, ఇలాంటి వాళ్లు విదేశాల్లో ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, ఇటీవల థాయ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణ తదితరాలపై కొరడా ఝళిపిస్తోంది. (చదవండి: అమెరికా ఏమి ప్రపంచ ఏటీఎం కాదు! మరోసారి పాక్పై విరుచుకపడ్డ నిక్కీ) -
కే మేనియా.. కొరియన్ కల్చర్కు ఫిదా అంటున్న భారతీయులు
హైదరాబాద్లోని ఓ మెట్రో రైల్వే స్టేషన్.. ‘అన్యొహసేవ్.. అజొస్సి..?’ అని పిలిచింది ఒక 23 ఏళ్ల అమ్మాయి తన దారికి అడ్డంగా ఉన్న ఓ పాతికేళ్ల కుర్రాడిని. ‘ఎస్..’ అంటూ అతను పక్కకు తప్పుకున్నాడు. ‘కమ్సహమీదా’ అని చెబుతూ గబగబా ముందుకు సాగిపోయింది ఆ అమ్మాయి. తీరా ఆమె ప్లాట్ఫామ్ చేరుకునే సరికి అప్పుడే ట్రైన్ డోర్స్ మూసుకున్నాయి. ‘ఒమో..’ అంటూ నిట్టూర్చుంది. అంతలోనే ఫోన్.. ‘చింగు’ అనే పేరున్న నంబర్ నుంచి. ‘అన్యొహసేవ్’ అంది ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తూనే. అవతలి నుంచీ ‘అన్యొహసేవ్’ అని బదులిచ్చి ‘ట్రైన్ క్యాచ్ చేశావా?’ అని అడిగింది ఆ స్వరం. ‘లేదు.. జస్ట్ మిస్డ్’అంది ఇవతలి అమ్మాయి. ‘చించా?’ అంది అవతలి స్వరం నమ్మలేనట్టుగా. ‘ఎస్.. కానీ ఇంకో ట్రైన్ క్యాచ్ చేసి వచ్చేస్తాలే..’అని చెప్పింది ఈ అమ్మాయి నమ్మకంగా. ‘ఓకే.. తర్వగా రా.. బెగొపాయో’ అంది అవతలి స్వరం. ‘నేనూ బెగొపాయో’ అంది ఈ అమ్మాయి. ఇంతలోకే ఇంచుమించు ఆ అమ్మయి వయసు అబ్బాయి ఆమె పక్కనుంచి ‘వావ్.. యెప్పుదా..!’ అనుకుంటూ వెళ్లాడు. అసలే ట్రైన్ మిస్ అయిన చిరాకుతో ఉన్న ఆ అమ్మాయి.. ఆ మాటకు ‘షిరొ.. మీచెస్సో’ అంటూ రిటార్ట్ ఇచ్చింది. గూఢచారుల కోడ్ భాష అనుకుంటున్నారా ఏమీ.. ఆ సంభాషణ విని?! కాదండీ.. అది కొరియన్ భాషండీ.. కొరియన్ భాష! ‘అన్యొహసేవ్.. అజొస్సి’ అంటే ‘హలో మిస్టర్’ అని, ‘కమ్సహమీదా’ అంటే ‘థాంక్యూ’ అని, ‘ఒమో’ అంటే ‘ ‘నో’ అని, ‘చింగు’ అంటే ఫ్రెండ్, ‘చించా’ అంటే ‘రియల్లీ’, ‘బెగొపాయో’ అంటే ‘అకలేస్తోంది’, ‘యెప్పుదా’ అంటే ‘ప్రెటీ’, ‘షిరొ’ అంటే ‘నాకు నచ్చలేదు’ అని, ‘మీచెస్సో’ అంటే ‘క్రేజీ’ అని అర్థం.. కొరియన్ భాషలో! ‘ఓహ్.. చించా! అయితే.. ఇక్కడ కొరియన్ భాషను నేర్పే కాలమ్ ఏదైనా మొదలుపెడుతున్నారా అనే సందేహం వలదు. దిస్ పేజ్ ఈజ్ వెరీమచ్ డెడికేటెడ్ టు కవర్ స్టోరీ ఓన్లీ. కొరియన్ మేనియా మీదే ఈ స్టోరీ! టీన్స్ నుంచి ‘టీ (ఫిఫ్టీ..సిక్సీ›్ట, సెవెంటీ.. ఎట్సెట్రా)’ల దాకా అన్ని వయసుల వాళ్లు కొరియన్ డ్రామా, కొరియన్ పాప్కి పరమవీర ఫ్యాన్స్! ఈ అఫైర్ కొరియన్ పాప్తో పదేళ్ల కిందటే మొదలైనా కొరియన్ డ్రామాతో స్టార్ట్ అయింది మాత్రం కరోనా లాక్డౌన్లోనే. ఇంట్లోనే గడిపిన ఆ సమయాన్ని చాలామంది ఓటీటీతో కాలక్షేపం చేశారు. నెట్ఫ్లిక్స్లోని ‘డిసెండెంట్స్ ఆఫ్ ది సన్’, ‘బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్’, ‘రిప్లై1988’, ‘కింగ్డమ్’, ‘స్కైకెసిల్’ వంటి కొరియన్ సిరీస్తో మన వీక్షకుల ప్రేమకథ మొదలైంది. క్వారంటైన్ను మనం ఓటీటీలో కొరియన్ సిరీస్, యూట్యూబ్లో కొరియన్ పాప్తో ఎంటర్టైన్ అయ్యామని పలు అధ్యయనాల సారాంశం. అదిగో అప్పుడే కొరియన్ డ్రామా, కొరియన్ పాప్ క్రేజ్ను పెంచి ఓ వేవ్లా మార్చింది. దీన్నే అంటే కొరియన్ డ్రామా, కొరియన్ పాప్తో కలసి కొరియన్ కల్చర్ పట్ల మోజు పెంచుకోవడాన్ని .. అదో వేవ్లా కొనసాగడాన్ని ‘హాల్యు’ అంటున్నారు. ఎందుకంత క్రేజ్? హై ప్రొడక్షన్ వాల్యూస్, అంతే అద్భుతమైన ప్రెజెంటేషన్తో మనమూ ఐడెంటిఫై అయ్యేలా కుటుంబ కథాంశాలతో కొరియన్ డ్రామాలు స్ట్రీమ్ అవుతున్నాయి. ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. అందులో విహరించాలని ఎవరికి మాత్రం ఉండదు? అందుకే వాటి వ్యూయర్షిప్ అంత హైలో ఉంటోంది. భాష, సెట్టింగ్స్, పాత్రలు కొరియన్ నేపథ్యం. కథనం మాత్రం అంతర్జాతీయ వీక్షకులను అలరించేదిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా మన వాళ్లకు దగ్గరగా.. ఇంకా చెప్పాలంటే మనం అన్వయించుకునేలా ఉంటాయి ఆ సిరీస్లు. అందుకే కదా.. ఆస్కార్ విన్నర్ ‘పారసైట్’ని చూసి ప్రపంచమంతా ‘వహ్వా’ అంటుంటే మనకు వెరీమచ్ తెలుగు సినిమాలా అనిపించింది! ‘కొత్త మనుషులు, కొత్త వాతావరణం.. కొత్త కథలుగా అస్సలు అనిపించవు’ అని చెబుతుంటారు కొరియన్ డ్రామాను అమితంగా ఇష్టపడే తెలుగు వీక్షకులు. అప్పటిదాకా గూఢచర్య, మిలిటరీ ఆపరేషన్ నేపథ్యపు అమెరికన్ డ్రామాలు, నేరస్థులను పట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సాగే స్కాండినేవియన్ డిటెక్టివ్ సిరీస్లు చూసీ చూసీ పాతబడున్న ప్రేక్షకులు, వీక్షకులకు కొరియన్ డ్రామా ఓ మత్తులా పట్టుకుంది.. కొత్త సీసాలో పాత మందులాగా! ముక్కోణపు ప్రేమ, శృంగారం, అమ్మ సెంటిమెంట్, కిడ్నాప్లు, గతం మర్చిపోవడాలు, కుటుంబ పరువు–ప్రతిష్ఠలను కాపాడుకోవడం, పాటలు, పగ– ప్రతీకారం, పురిట్లోనే కవలలిద్దరూ విడిపోవడం, దేశభక్తి .. ముఖ్యంగా మెలోడ్రామా.. ఇలా ఇండియన్ సినిమాల్లో కనిపించే నవరస, మసాలా దినుసులన్నీ కొరియన్ డ్రామాలో పుష్కలం. అందుకే మనవాళ్లు అంతలా కనెక్ట్ అవుతున్నారు. ‘మన సినిమాలనే ఫారిన్ లొకేషన్స్లో.. ఫారిన్ యాక్టర్స్తో చూసినట్టుంటాయి.. భలే ఎంటర్టైన్ అవుతాం’ అంటున్నారు కొరియన్ డ్రామా వీరాభిమానులు కొందరు. ‘ఆ డ్రామాల్లో ఉండే ఎమోషనల్ స్టిక్నెసే వాటి పట్ల క్రేజ్ పెరగడానికి కారణం’ అంటారు ‘క్రాస్ పిక్చర్స్’ అనే కొరియన్ మల్టీనేషనల్ ప్రొడక్షన్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న చిత్ర సుబ్రహ్మణ్యం. ‘సౌత్ కొరియన్ సంస్కృతీసంప్రదాయాల్లో ఒక తరహా అప్పీల్ ఉంటుంది. అవి మనకు ఇదివరకే పరిచయమున్నట్టు తోస్తాయి. అందుకే వాటి మేళవింపుగా ఉన్న కొరియన్ డ్రామాలు మన దగ్గర అంత హిట్ అవుతున్నాయి’ అంటారు దక్షిణ కొరియాలోని భారతీయ రాయబారి శ్రీప్రియ రంగనాథన్. చవకకే.. భారతీయులు ఇలా ఏకబిగిన కొరియన్ డ్రామాలను చూడడం వల్ల నెట్ఫ్లిక్స్ వ్యూయర్షిప్ 2019తో పోలిస్తే 2020లో ఏకంగా 370 శాతం పెరిగిందని తేలింది.. యూరోమానిటర్ సర్వేలో! దీంతో మన దగ్గర కొరియన్ డ్రామాలకున్న క్రేజ్, డిమాండ్ మిగిలిన ఓటీటీ చానెల్స్కూ అర్థౖమైపోయింది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి జీ గ్రూప్ శాటిలైట్ ప్రొవైడర్ డిష్ టీవీ హిందీలోకి డబ్ అయిన కొరియన్ డ్రామాలను అతి చవక (రూ. 1.3.. అంటే ఒక సెంట్ కన్నా తక్కువ) ప్యాకేజీకే స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టింది. ఎమ్ఎక్స్ ప్లేయర్ (ఓటీటీ ప్లాట్ఫామ్) అయితే ఇంకో అడుగు ముందుకేసి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోకి అనువదించిన కొరియన్ డ్రామాలను స్ట్రీమ్ చేస్తోంది. ఈ ప్రయత్నం ఇక్కడి ఔత్సాహిక కంటెంట్ రైటర్స్కూ అవకాశాలను పెంచి మంచి ఆదాయ మార్గాన్ని చూపిస్తోంది. బిజినెస్ బూమ్ ఇదిగో ఇలా కొరియన్ డ్రామా రేకెత్తించిన కుతూహలం, జిజ్ఞాస మన మార్కెట్లో కొరియన్ కంపెనీలకు కాసుల పంట కురిపిస్తోంది. ‘అందేంటీ.. కొరియన్ ఉత్పత్తులు మనకేం కొత్త కాదే. సామ్సంగ్, ఎల్జీ, కియా మోటార్స్, లాటీ, హ్యూండైలాంటి 20కి పైగా కొరియన్ కంపెనీలే కదా మన మార్కెట్ను ఏలుతున్నది! అవన్నీ దాదాపుగా 17.45 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్నాయని మన ప్రభుత్వమే లెక్కలు చెప్తోంది! పైగా 2010లో మనకు, దక్షిణ కొరియాకు మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కూడా కుదిరింది. దానిప్రకారం ఎలాంటి పన్ను లేకుండానే మనం దక్షిణ కొరియా ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నాం’ అంటారా?! నిజమే.. అదేం కొత్త విషయం కాదు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్తో మన దగ్గర వ్యాపారం పెంచుకున్న .. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన కొరియన్ కంపెనీలే ఇక్కడ విషయం.. విశేషమూనూ. కే మోజు కొరియన్ తిండి, సోజూ( ్జౌu.. ఆల్కహాల్), బట్టలు, నగలు, బ్యూటీ ప్రొడక్ట్, కొరియన్ టూరిజం ఆఖరుకు కొరియన్ భాష, కొరియన్ కల్చర్ వరకూ సాగి.. కొరియన్ బ్రాండ్స్ డిమాండ్ను పెంచుతున్నాయి. నూడుల్స్ అమ్మే దక్షిణ కొరియా కంపెనీ నాన్షిన్ బ్రాండ్.. 2020లో మిలియన్ డాలర్ల అమ్మకాలు చేసింది. మీకో విషయం తెలుసా.. 2020 కన్నా 2021లో మనం 178 శాతం అధికంగా కొరియన్ ఇన్స్టంట్ నూడుల్స్ను వినియోగిం చామని యూరోమానిటర్ ఇంటర్నేషనల్ అంచనా. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ‘ఐల్ ఆఫ్ స్కిన్’ అనే కొరియన్ బ్యూటీ బ్రాండ్ను లాంచ్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి కే మేనియాను. ఇలా ఇన్నిస్ఫ్రీ, లనేజ్ ( ్చn్ఛజీజ్ఛ), ఎట్యూడ్ (్ఛ్టuఛ్ఛీ), స్లవషూ (టu ఠీజ్చిటౌౌ) వంటి దక్షిణ కొరియా బ్రాండ్స్కి, ది ఫేస్ షాప్ లాంటి ఆన్లైన్ స్టోర్స్కి భలే గిరాకీ మొదలైంది. ఇక్కడి కే క్రేజ్ వల్ల అమెజాన్లో కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ సేల్స్ ఇదివరకంటే మూడున్నర రెట్లు పెరిగాయని తెలిపింది అమెజాన్ సంస్థ ఒక ఇంటర్వ్యూలో. అయితే ఇప్పుడు దీన్ని క్యాచ్ చేసుకోవడానికి భారతీయ ఔత్సాహిక పారిశ్రామిక సంస్థలూ పోటీ పడుతున్నాయి. ఆ మేరకు మన మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిట్లోనూ వాటి ఔట్లెట్స్ వచ్చేశాయి. హైదరాబాద్లోనూ ఉన్నాయి. భాష మీదా.. పరాయి భాష మరీ ముఖ్యంగా ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మనీ వంటి భాషలను నేర్చుకుంటున్నారు అంటే ఆయా దేశాల్లో చదువు, ఉద్యోగాల నిమిత్తమే అని చెప్పకనే అర్థమైపోతుంది. ఏ భాషనైనా దాని మీద అభిమానంతో నేర్చుకోవడమనేది అరుదే. కొరియన్ ఆ కోవలోకే వస్తుంది. కే డ్రామా మీద వీక్షకులకున్న అభిమానం ఆ భాష నేర్చుకునేలా ప్రోత్సహిస్తోంది. వారి సంఖ్యను పెంచుతోంది. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాలన్నిట్లో కొరియన్ భాషను నేర్పే ఇన్స్టిట్యూట్స్ వెలిశాయి.సెంట్రల్ సిలబస్ను బోధిస్తున్న అన్ని స్కూళ్లల్లో.. ఎనిమిదవ ఫారిన్ లాంగ్వేజ్గా కొరియన్ను బోధించాలని కేంద్రప్రభుత్వం 2020లో కొత్త విధానాన్నీ తీసుకువచ్చింది. ‘తమ కొరియన్ అభిమాన నటీనటులు, గాయనీగాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం పాడుతున్నారు అని ఇంగ్లిష్ సబ్టైటిల్స్తో కాకుండా నేరుగానే తెలుసుకోవాలనుకుంటున్నారు వీక్షకులు. ఇంకా చెప్పాలంటే కొరియన్ భాష మీద ఆపేక్షను పెంచుకుంటున్నారు. తద్వారా ఆ దేశంతో ప్రత్యక్షానుబం«ధాన్ని కోరుకుంటున్నారు’ అని చెబుతారు తమిళనాడులోని ఇండో– కొరియన్ కల్చరల్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్కు హెడ్గా పనిచేస్తున్న రతి జాఫర్. ఫ్యాన్ క్లబ్స్.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్సేకే కాదు కే డ్రామా, కే పాప్కీ మన దగ్గర ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకుంటే చాలు. ఆ క్లబ్లు ఎక్కడో డెహ్రాడూన్, అహ్మదాబాద్, పట్నా, ముంబై, పుణే, నాగపూర్లలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో కూడా వెలిశాయి. ఇవి తమ అభిమాన కొరియన్ నటీనటులు, కొరియన్ పాప్ సింగర్స్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటాయి. ముంబైలోని కే పాప్ ఫ్యాన్ క్లబ్ .. 2021, మార్చి 24న బీటీఎస్ బ్యాండ్లోని ఓ మెంబర్ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసింది. నిధులను సమీకరించి.. ముంబై శివారు ప్రాంతమైన ములుండ్లోని ఓ బస్ షెల్టర్ను వారం పాటు అద్దెకు తీసుకుని దాన్నిండా జియాన్ జంగ్కూక్ పోస్టర్లను అతికించి వీరాభిమానాన్ని చాటుకుంది. ఇదంతా గమనించిన కొరియన్ కల్చరల్ సెంటర్ (ఢిల్లీ).. క్రమం తప్పకుండా కే పాప్, డాన్స్ పోటీలను నిర్వహించేలా ఈ ఫ్యాన్ క్లబ్స్కు సహకారమందిస్తోంది. ఈ పోటీల్లో ఎవరైతే తమ అభిమాన గాయనీగాయకుల గాత్రాన్ని, డాన్స్ను, వస్త్రధారణను అనుకరిస్తారో వారికే ట్రోఫీలను అందించడం విశేషం. 2021లోనే చెన్నైలోని కొరియన్ కాన్సులేట్ అక్కడ అమ్మాయిలకు కే పాప్ డాన్స్ పోటీలను నిర్వహించి అయిదుగురు విజేతలను ఎంపిక చేసుకుని వాళ్లతో ‘డ్రీమ్ కే పాప్’ అనే బాండ్ను ఏర్పాటు చేసింది. ఈ బాండ్ కే డాన్స్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. అలాగే పాపులర్ కే పాప్ సాంగ్స్ను తమ యూ ట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేస్తూంటుంది. ఇక్కడ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టే దిశగా కొరియన్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ టూరిజం, ఫారిన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖలు యోచిస్తున్నాయట. ఇలా కే డ్రామా.. కే పాప్ వినోదాన్ని పంచుతూ మన వీక్షకుల, ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. ఆ అభిమానాన్ని తన వ్యాపారానికి అనుగుణంగా మలచుకుంటోంది. ‘కే డ్రామా.. కే పాప్ మీద ఇండియన్స్ ప్రేమ ఇలాగే పెరిగి.. పెరిగి అది కే ఫుడ్, బ్యూటీ ఇంకా ఇతర కొరియన్ ప్రొడక్ట్స్కి ఇండియన్ మార్కెట్లో డిమాండ్ను పదింతలు చేయాలని కోరుకుంటున్నాం’ అంటాడు కొరియాలోని యూరోమానిటర్ కన్సల్టెంట్ సన్నీ మూన్. అదన్న మాట కే మేనియా ఫలితం!! పట్టించుకోకపోయినా.. చిత్రమేంటంటే అటు కొరియన్ డ్రామాలు కానీ.. ఇటు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కానీ 60 ఏళ్ల పైబడిన వాళ్లను పట్టించుకోవడం లేదు. ఆ డ్రామాల్లోని కంటెంట్ సీనియర్ సిటిజన్స్ను భాగస్వాములుగా చేసుకోవడం లేదు. ఇటు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీళ్ల కోసం కంటెంట్ను జనరేట్ చేయడంలేదు. అయినా.. ఆ పెద్దవాళ్లు సారీ.. ఆ సెకండ్ యూత్ .. ఓటీటీలోని ఈ కొరియన్ డ్రామాలను కన్నార్పకుండా చూస్తున్నారు. టైమ్ తెలియకుండా అందులో మునిగిపోతున్నారు. ముఖ్యంగా 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కులు. అంతేకాదు కొరియన్ భాషా పదాలను నేర్చుకుని.. ఉపయోగిస్తున్నారు. ‘అన్యొహసేవ్ (హలో)’ అంటూ ఫోన్లలో, మెసేజెస్లో సంభాషణలు కావిస్తున్నారు. ముంబైకి చెందిన 67 ఏళ్ల సీఎస్ మణి ఇప్పటి వరకు 70కి పైగా కొరియన్ డ్రామాలను వీక్షించాడు. వాటి ద్వారా దాదాపు 60 కొరియన్ నుడికారాలను నేర్చుకున్నాడు. ఆ డ్రామాలు కలిగించిన ఆసక్తితో సియోల్ గురించి తెలుసుకున్నాడు. ‘సియోల్లో లక్షా డెబ్బయి ఐదువేల సీసీ కెమెరాలు ఉంటాయి తెలుసా! అక్కడ ఇంటర్నెట్ చాలా ఫాస్ట్. ప్రతి కారులో కెమెరా ఉండాల్సిందే. కొరియన్స్ భోజనప్రియులు. ఆల్కహాల్ ఫ్రీక్స్ కూడా’ అంటూ ఉత్సహంగా చెబుతుంటాడు. హాల్యూ.. ఓటీటీ ద్వారా మనకు ఇన్ఫెక్ట్ అయ్యేకంటే ముందే భారతీయ చిత్రసీమను ఎఫెక్ట్ చేసింది. హాలీవుడ్ ఎట్సెట్రా రంగాల్లోని చిత్రాలు మన మీద ప్రభావం చూపినట్టే.. కొరియన్ చిత్రసీమా మన మీద ప్రభావం చూపింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్.. టాలీవుడ్ దాకా చాలా వుడ్లలో కొరియన్ స్ఫూర్తి చిత్రాలు మన వెండి తెర మీద వెలుగు చూశాయి. తెలుగులో ‘అబ్బ.. భలే సినిమా’ అనిపించుకున్న ‘ఓ బేబీ’.. కొరియన్ ‘మిస్ గ్రానీ’కి రీ మేడ్. ఇలా తమిళంలోనూ కొన్ని కొరియన్ సినిమాలు రీమేడ్ అయ్యాయి. బాలీవుడ్లోనైతే ఆ జాబితా పదుల సంఖ్యలో ఉంది. నిన్నటి ‘ధమాకా’ .. ‘ది టెర్రర్ లైవ్’, ‘రాధే’.. ‘ది అవుట్ లాస్’, అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ‘తీన్’.. ‘మాంటేజ్’, ప్రియాంక చోప్రా, రణ్బీర్ కపూర్, ఇలియానా సూపర్ హిట్ ‘బర్ఫీ’.. ‘లవర్స్ కన్సర్టో’, రితేశ్ దేశ్ముఖ్, శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా హిట్ ‘ఏక్ విలన్’.. ‘ఐ సా ది డెవిల్’కి రీమేడ్లే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ పెద్దదే! ఈ ప్రేరణ కథను చూసి సాక్షాత్తు కొరియన్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోని పెద్దలే వచ్చి మన దగ్గర చిత్రనిర్మాణం చేపడుతు న్నారు. అతియోశక్తి కాదు.. నిజం! బెంగళూరులో నివాసముంటున్న మూన్ అనే అమ్మాయి (18) మంచి డాన్సర్. తన ఇంట్లోనే కే పాప్ సాంగ్స్ మీద డాన్స్ను షూట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూంటుంది. ఈ పోస్ట్లకు 86,700 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోయింగ్ను గమనించిన ఫ్లిప్కార్ట్ ఆమెను తమ మార్కెటింగ్ ప్రొడక్ట్స్కి మోడల్గా పెట్టుకుంది. -
ముఖ నిగారింపు పెంచుకోవాలంటే.. చెంప చెళ్లుమనాల్సిందే!
ముఖ నిగారింపుని మరింతగా పెంచుకునేందుకు కొరియన్లు స్లాప్ థెరపీని వాడతారు. స్లాప్ థెరపీ అంటే చెంప మీద పెళ్లున కొట్టడం.రెండు చేతులతో ముఖానికి ఇరువైపులా కొట్టడం వల్ల ముఖచర్మం గ్లోగా కనిపిస్తుంది. ►ముందుగా ముఖాన్ని వేడినీటితో కడిగి, తడిలేకుండా శుభ్రంగా తుడవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాయాలి. ఇప్పుడు మెల్లగా కొట్టడం ప్రాంభించి క్రమంగా పెద్దగా కొట్టాలి. ఇలా ఏడు నిమిషాలు పాటు చేస్తే స్లాప్ థెరపీ అయిపోయినట్లే. ►రోజూ క్రమం తప్పకుండా ఈ స్లాప్ థెరపీ చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి, సహజసిద్ధంగానే చర్మం రేడియంట్ నిగారింపుని సంతరించుకుంటుంది. ►ఈ థెరపీతో నిగారింపే కాకుండా చర్మం మీద ముడతలు త్వరగా రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. అందుకే దీనిని యాంటీఏజింగ్ థెరపీ అని కూడా పిలుస్తారు. ►రక్తప్రసరణ పెరగడం వల్ల టాక్సిన్స్ బయటకు పోయి ముఖం మీద మొటిమలు కూడా రావు. ఇంకెందుకాలస్యం... ఏ మాత్రం శ్రమలేని స్లాప్ థెరపీతో మీ ముఖాన్ని మెరిపించండి. -
బొంగులో ఉప్పు.. ధరలో టాపు
కేజీ ఉప్పు రేటు ఎంతుంటుంది? మహా అయితే రూ.20 నుంచి రూ.30 మధ్య ఉంటుంది. హిమాలయన్ పింక్ సాల్ట్ అయితే రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది. అంతేకానీ కేవలం పావుకిలో ఉప్పుకు ఎక్కడైనా రూ.7,500 ఉంటుందా.. అంటే కొరియన్ స్టైల్లో తయారు చేసే ఉప్పుకు ఉంటుంది మరి. ఈ రకం ఉప్పు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది కూడా. మున్ముందు పావుకిలో రూ. 10 వేలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా ఏముంది ఆ ఉప్పులో అనుకుంటున్నారు కదా. అయితే దాని పుట్టుపూర్వోత్తరాలు, తయారీ, ఉపయోగాల గురించి తెలుసుకోవాల్సిందే. 800 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చి.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఉప్పు పేరు బాంబూ (వెదురు) సాల్ట్. దీన్నే పర్పుల్ సాల్ట్ అని కూడా అంటారు. కొరియన్ సంప్రదాయంలో ఎక్కువగా వాడతారు. వారి వంటల్లో, ఔషధాల్లో, చికిత్స విధానాల్లో వందల ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని మిగతా ఉప్పులతో పోలిస్తే దీనిలో ప్రత్యేకత ఏముంది? అంటే.. తయారీ విధానమే. సముద్రపు ఉప్పును వెదురు బొంగుల్లో వేసి దాన్ని సిరామిక్ రకం బంకమన్నుతో మూసేస్తారు. తర్వాత ఆ బొంగును అత్యధికంగా 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. దీంతో బొంగులోని ఖనిజ లవణాలు, బొంగు నుంచి వచ్చే నూనే ఉప్పులో కలిసిపోతాయి. దాదాపు 14 నుంచి 15 గంటలు కాలిస్తే బొంగు మొత్తం కాలిపోయి కేవలం ఉప్పు ముద్ద మిగులుతుంది. దీన్ని మళ్లీ పొడి చేసి మళ్లీ బొంగులో నింపి కాలుస్తారు. ఇలా అనేకసార్లు బొంగును కాల్చడంతో ఉప్పు రంగు కూడా మారిపోతుంది. గట్టిగా రాయిలా తయారవుతుంది. తర్వాత ఈ ఉప్పును బయటకు తీసి పొడిలా చేసి అమ్ముతారు. తయారీకి 40 నుంచి 45 రోజులు బొంగులో ఉప్పు నింపడం దగ్గర్నుంచి ఉప్పు తయారయ్యాక తీసి పొడి చేయడం వరకు అంతా మనుషులు చేస్తారు. అందుకే రేటు ఎక్కువుంటుంది. ఈ ఉప్పు వాడితే రోగనిరోధక శక్తి, ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. గతంలో రెండు, మూడుసార్లు వెదురు బొంగుల్లో కాల్చి ఉప్పును తయారు చేసేవారు. అయితే 20వ శతాబ్దం నుంచి తొమ్మిదిసార్లు కాలుస్తున్నారు. ఎక్కువసార్లు బొంగులో కాల్చడం వల్ల వెదురులోని మంచి గుణాలన్నీ ఉప్పుకు చేరతాయని, పైగా మలినాలన్నీ తొలగిపోయి అత్యంత నాణ్యమైన ఉప్పు వస్తుందని తెలుసుకున్నారు. అందుకే ప్రస్తుతం తొమ్మిదిసార్లు 800 డిగ్రీల నుంచి 1,000 డిగ్రీల ఉష్ణోగ్రతలో బొంగులో ఉప్పును కాలుస్తున్నారు. చివరగా 9వ సారి 1,000 డిగ్రీల వేడిలో కాలుస్తున్నారు. ఈ రకం ఉప్పు తయారీకి దాదాపు 40 నుంచి 45 రోజులు పడుతుంది. ఎన్నెన్నో ఉపయోగాలు వెదురు ఉప్పును వాడితే జీర్ణక్రియ బాగా జరుగుతుందని, చర్మం మెరుగవుతుందని, కడుపులో మంటను తగ్గిస్తుందని, కేన్సర్ రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. సాధారణ ఉప్పుతో పోలిస్తే వెదురు ఉప్పులో ఇనుము, పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
హైదరాబాద్లో ఇవి కూడానా? ఓపెన్ కొరియన్ మెనూ!
సరిగ్గా పదేళ్ల క్రితం ఓపెన్ గాంగ్నమ్ స్టైల్ అంటూ కొరియన్ పాప్ సింగర్ సై పాడిన పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలతో బీటీఎస్ గ్యాంగ్కి ఇండియాలో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్ డ్రామాలకి మన దగ్గర సెపరేట్ ఫ్యాన్బేస్ ఏర్పడింది. ఇప్పుడా ఫ్యాన్స్ కోసం మన భాగ్యనగరంలో కొరియన్ రెస్టారెంట్లో వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. హాలీవుడ్ సినిమాలు, పాప్ మ్యూజిక్ తర్వాత హంగ్బేస్డ్ నటులైన బ్రూస్లీ, జాకీచాన్లకే ఇండియాలో పెద్ద ఫ్యాన్బేస్ ఏర్పడింది. వారి తర్వాత జెట్లీ, టోనీజాలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్ డ్రామాలు, కొరియన్ నటులను ఇండియన్లు సొంతం చేసుకుంటున్నారు. కే డ్రామాతో పాపులరైన కొరియన్ వెబ్ సిరీస్లకు యూత్లో యమా క్రేజ్ ఉంది. కే డ్రామాలో నటులు ఉపయోగించే గార్మెంట్స్, స్టైలింగ్ ఇప్పటికే కాలేజీ అమ్మాయిల్లో పాపులర్ అవ్వగా గత ఏడాది కాలంగా ఆ నటులు తాగే డ్రింక్స్, తినే ఫుడ్ ఐటమ్స్కి ఎంటైర్ యూత్లో డిమాండ్ పెరిగింది. ఏకంగా రెస్టారెంట్ కే డ్రామాలకు ఉన్న ఫ్యాన్బేస్ని, యూత్లో ఉన్న క్రేజ్ని ఆధారం చేసుకుని హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ కొరియన్ రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది. గత పదేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్న చో మిన్ యున్ అనే కొరియన్ మహిళ గోగుర్యో పేరుతో ఈ రెస్టారెంట్ని మాదాపూర్లో ప్రారంభించింది. భారీ మెనూ గోగుర్యో రెస్టారెంట్లో ఫేమస్ కొరియన్ వంటకాలైన జాప్చో, బిబిమ్బాప్, కిమ్బాప్, రమ్యున్, కిమ్చీ ప్యాన్కేక్, గ్రిల్ల్డ్ మీట్ ఇలా పలు రకాలైన 11 పేజీలతో కూడి భారీ మెనూని అందిస్తోంది చో మిన్ యున్. ఒకేసారి 80 మంది వెళ్లి ఆస్వాదించేలా ఈ రెస్టారెంట్ని తీర్చిదిద్దారు. రెస్టారెంట్ వాల్స్పై బే సూజి లాంటి కొరియన్ స్టార్స్ పోస్టర్స్ చూస్తూ స్పీకర్లలో బీటీఎస్ మ్యూజిక్ని వింటూ నోరూరించే కొరియన్ ఫుడ్ని ఆస్వాదిస్తున్నారు హైదరాబాదీలు. బిర్యానీ ఒక్కటే కాదు కాస్మోపాటిలన్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్. ఆ తర్వాత సౌతిండియన్ తాలిని అందించే హోటళ్లు కోకొళ్లుగా ఉన్నాయి. వీటి తర్వాత ఇటాలియన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్లు వచ్చాయి. ఆ తర్వాత రాయలసీమ రుచులు, పల్లె రుచులు, తెలంగాణ రుచులు పేరుతో దేశీ వంటకాలు కూడా ఫేమస్ అయ్యాయి. వాటా వ్యాపారం పుంజుకుంది. ఇక చైనీస్ రెస్టారెంట్లు, ఫుడ్కోర్టులు గల్లీగల్లీకి వెలిశాయి. ఐనప్పటికీ కొరియన్ క్యూజిన్ జాడలు ఇప్పటి వరకు లేవు. కేవలం యూబ్యూబ్లో బీటీఎస్, ఓటీటీలో కే డ్రామాల మూలంగా స్థానికంగా ఏర్పడిన ఫ్యాన్ బేస్ కోసమే ఇప్పుడు కొరియన్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. చదవండి:ఈ ఫుడ్ డెలివరీ యాప్తో బరువు తగ్గుతారు! -
అబార్షన్ చేయించుకొమన్నందుకు.. మాజీ ప్రియురాలికి సారీ చెప్పిన నటుడు
నెట్ఫ్లిక్స్లో విడుదలైన రొమాంటిక్ డ్రామాగా విడుదలై మంచి ఆదరణ పొందింది ‘హోమ్ టౌన్ చా చా చా’. ఈ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు కొరియన్ నటుడు కిమ్ సియోన్ హో. ఇటీవల ఈయనపై తన మాజీ ప్రియురాలు అబార్షన్ చేయించుకోమన్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిపై తాజాగా ఈ నటుడు స్పందించి క్షమాపణలు తెలిపాడు. ‘నేను కిమ్ సియోన్ హో. ఇంతకుముందు చేసిన వాదన గురించి క్షమాపణలు చెబుతున్నా. ఆ సమయంలో ఆ పోస్ట్లో నా పేరు చూడగానే ఎంతో భయపడ్డా. అందుకే అలా రియాక్ట్ అయ్యా. అందుకే అనాలోచితంగా, అజాగ్రత్తగా వ్యవహరించి ఆమెను బాధ పెట్టాను. దాని గురించి ఆమెను ప్రత్యక్షంగా కలిసి సారీ చెప్పాలని భావిస్తున్నాను’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు కిమ్. నటుడిగా ఇంత ఎత్తుకు ఎదిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరినీ నిరాశ పరిచానని కొరియన్ యాక్టర్ చెప్పాడు. ప్రశ్చాత్తాపంతో అందరికీ అపాలజీ చెబుతున్నట్లు ఈ నటుడు పేర్కొన్నాడు. గుడ్ మేనేజర్, టు కాప్స్, 100 డేస్ మై ప్రిన్స్తో సహా అనేక ప్రదర్శనలలో నటించి నటుడిగా గుర్తింపు పొందాడు కిమ్. కాగా అపాలజీ చెప్పిన అనంతరం అతను నటిస్తున్న కొన్ని షోల నుంచి ఈ కొరియన్ నటుడిని తొలగించారు నిర్వహకులు. చదవండి: ‘జస్టిస్ లీగ్’ డైరెక్టర్ నన్ను బెదిరించాడు: వండర్ వుమెన్ -
'జోకర్' రంగంలోకి దిగింది.. స్క్విడ్ గేమ్ క్రేజ్ మాములుగా లేదుగా..!
‘స్క్విడ్ గేమ్’.90 దేశాల వీక్షకుల్ని ఊపేస్తున్న కొరియన్ వెబ్ సిరీస్. అయితే ఈ వెబ్ సిరీస్కు ఊహించని రెస్పాన్స్ను క్యాష్ చేసుకునేందుకు హ్యాకర్స్ మాల్వేర్తో దాడులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన గూగుల్ 'ప్లే స్టోర్'లో స్క్విడ్ గేమ్ పేరుతో ఉన్న యాప్స్ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. మాల్వేర్ ఉన్న ఆ యాప్స్ 5వేల డౌన్ లోడ్లు దాటిన్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు యూజర్లను టార్గెట్ చేసేందుకు జోకర్ రంగంలోకి దిగినట్లు మాల్వేర్ రీసెర్చర్లు గుర్తించారు. 12ఏళ్ల కష్టం దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ 12 ఏళ్ల క్రితం అంటే 2009 లో స్క్విడ్గేమ్ పేరుతో స్టోరీ రాసుకున్నారు. కాలం కలిసిరాక, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా తెరక్కెక్కేందుకు ఇన్నేళ్లు పట్టింది. అయినా ఈ ఏడాది సెప్టెంబర్ 17న నెట్ ఫ్లిక్స్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్కు ఊహించని విధంగా వీక్షకులు బ్రహ్మరథం పడుతుంటే డైరెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 21.4 మిలియన్ల బడ్జెట్ తో ఈ సిరీస్ను తెరకెక్కించగా 900 మిలియన్ల లాభాల్ని గడించింది. నెట్ ఫ్లిక్స్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ సిరీస్ను 142మిలియన్ల మంది యూజర్లు వీక్షించారు. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ట్విట్టర్ యూజర్ @ReBensk పేరుతో స్క్విడ్ గేమ్ వాల్ పేపర్లుతో ఓ యాప్ను డిజైన్ చేశారు. ఆ యాప్లో మాల్వేర్ ఉందనే విషయాన్ని తొలిసారి గుర్తించారంటూ ఫోర్బ్స్ రిపోర్ట్ను విడుదల చేసింది. ఈ స్క్విడ్ గేమ్ వాల్ పేపర్ యాప్తో ప్రమాదకరమైన యాడ్స్ తో పాటు ఎస్ఎంఎస్లతో పెయిడ్ సబ్స్క్రిప్షన్ చేయాలని డిమాండ్ చేసినట్లు ఈఎస్ఈటీ మాల్వేర్ రీసెర్చర్ లుకాస్ స్టెఫాంకో గుర్తించారు. అంతేకాదు ఈ యాప్స్లలో జోకర్ మాల్వేర్ ఇన్ స్టాల్ చేసినట్లు లుకాస్ తెలిపారు. జోకర్ మాల్వేర్ జోకర్ మాల్వేర్..! ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. మొదటిసారి 2017లో గూగుల్లో ప్లేస్టోర్లలో యాప్స్పై దాడి చేసింది. దీంతో దీన్ని గుర్తించేందుకు గూగుల్కే మూడేళ్లు పట్టింది. గుర్తించిన తరువాత సుమారు జోకర్ మాల్వేర్ నిండిన 1800 యాప్స్ను గూగుల్ డిలీట్ చేసింది. తాజాగా స్క్విడ్ గేమ్ పేరుతో ప్లేస్టోర్లో ఉన్న యాప్స్లలో ఈ జోకర్ మాల్వేర్ ఉన్నట్లు ఈఎస్ఈటీ మాల్వేర్ రీసెర్చర్ లుకాస్ స్టెఫాంకో హెచ్చరించారు. చదవండి: అక్కడేమో ప్రాణాలతో చెలగాటం! ఇక్కడేమో.. -
అక్కడేమో ప్రాణాలతో చెలగాటం! ఇక్కడేమో..
Honeycomb Challenge Viral: నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్ ‘స్క్విడ్ గేమ్’.. స్ట్రీమింగ్ కంటెంట్లో పెనుసంచలనం. కొరియన్ డైరక్టర్ వాంగ్ డోంగ్ యుక్ డైరెక్షన్కు ప్రపంచం మొత్తం ఫిదా అయిపోతోంది. కిందటి నెలలో(సెప్టెంబర్ 17న) రిలీజ్ అయిన కొరియన్ డ్రామా పాజిటివ్ రివ్యూలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ కూడా దక్కించుకుంది. పలువురు సెలబ్రిటీలు సైతం మెచ్చుకుంటుండగా, యూత్ అడిక్ట్ అయిపోతోంది. ఓవరాల్గా.. తక్కువ టైంలో మోస్ట్ వాచ్డ్ నెట్ఫ్లిక్స్ సిరీస్గా నిలిచింది. కొందరు కంటెస్టెంట్లు, కొన్ని టాస్క్లు, వాటిని విజయవంతంగా పూర్తిచేయడం, ఓడిపోతే చావడం, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లతో సాగుతుంది ఈ డ్రామా. డబ్బు ఎరగా వేసి కంటెస్టెంట్లతో కొన్ని గేమ్స్(చిన్నపిల్లల గేమ్స్లా ఉంటాయి) ఆడిస్తారు. అందులో ఓడిపోతే కంటెస్టెంట్ ప్రాణం తీసేస్తారు. ‘బతుకు పందెం’ కాన్సెప్ట్లతో ఇదివరకే బోలెడు సినిమాలు వచ్చినా.. ఎంగేజింగ్గా, క్రేజీగా ఉండడం వల్ల స్క్విడ్ గేమ్కి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు రకరకాల కారణాలతో Squid Game Netflix సిరీస్ వార్తల్లో నిలుస్తోంది. హనీకాంబ్ ఛాలెంజ్ స్క్విడ్ గేమ్ ఛాలెంజ్ అంటే.. షుగర్ హనీకాంబ్. కొరియా పిల్లల ఆట ‘సియోల్టాంగ్ బోంప్కి’ స్ఫూర్తితో ఈ గేమ్ను రూపొందించారు(ఈ సిరీస్లో అన్నీ కొరియన్ పిల్లల గేమ్స్). తేనే, చక్కెరతో సన్నని పొరలా తయారుచేసే ఈ స్వీట్ను మధ్యలో ఒక షేప్కి తీసుకొస్తారు. ఈ స్వీట్ను స్క్విడ్ గేమ్ సిరీస్లో డగ్లోనా(కరోనా టైంలో పాపులర్ అయిన కొరియన్ కాఫీ పేరు) అని పిలుస్తారు. ఆ షేప్ను సన్నని బ్లేడ్తో తెగకుండా కట్ చేయాలి. ఒకవేళ ఆ షేప్ గనుక బ్రేక్ అయితే అంతే!. వెబ్ సిరీస్లో అయితే చంపేస్తారు. కానీ, షార్ట్ వీడియో యాప్స్లో ట్రెండ్ అవుతున్న ఈ ఛాలెంజ్లో మాత్రం సరదాగా శిక్షిస్తారు. విశేషం ఏంటంటే.. గతంలో వచ్చిన ‘కీకీ’, ‘ఐస్ బకెట్’ లాంటి ఛాలెంజ్ల రికార్డును ఇది కేవలం నెల వ్యవధిలోనే బద్దలు(రికార్డు స్థాయి హ్యాష్ట్యాగ్లతో) కొట్టడం. ఇక ఈ వెబ్ సిరీస్లో కాంగ్సయే బైయోక్ క్యారెక్టర్ వేసింది నటి జంగ్ హో యోవాన్. స్క్విడ్ గేమ్ ఈమె తొలి సిరీస్. అయినప్పటికీ ఇక్కడ దక్కిన క్రేజ్తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్(ఫ్యాన్) పెంచేసుకుంది. ఇక సిరీస్లో ఆమె అలవోకగా ఈ ఛాలెంజ్ను పూర్తి చేస్తుంది. కానీ, అందుకోసం పదుల సంఖ్యలో టేక్లు తీసుకుందట ఈ అమ్మడు. నెంబర్ల గొడవ ఈ సిరీస్లో గేమ్ సీన్లలో ఫోన్ నెంబర్లు ఓపెన్గా చూపిస్తారు. ఇప్పుడు ఆ నెంబర్లకు విపరీతంగా కాల్స్, మెసేజ్లు వెళ్తున్నాయట. దీనిపై సదరు వ్యక్తులు ఫిర్యాదులు చేయడంతో నెట్ఫ్లిక్స్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రస్తుతం ఆ నెంబర్లను ఎడిట్ చేసి చూపిస్తోంది ఇప్పుడు. మరోవైపు ఈ కొరియన్ డ్రామా సబ్ టైటిల్స్ వల్ల డైలాగులకు అర్థాలు మారిపోతున్నాయట. దీంతో వాటిని సైతం మార్చే ప్రయత్నంలో ఉంది నెట్ఫ్లిక్స్. ప్రస్తుతం స్టోరీ దగ్గరి నుంచి క్యారెక్టర్లు, నటన, టెక్నికల్ అంశాలు.. స్క్విడ్ గేమ్కు సంబంధించిన ప్రతీది హాట్ టాపిక్గానే మారింది. చదవండి: నెట్ఫ్లిక్స్ స్క్విడ్గేమ్.. అమెజాన్ బాస్ రివ్యూ ఇది -
ప్రపంచాన్ని ఊపేసిన ఈ పాట గుర్తుందా?
ఎంటర్టైన్మెంట్ ఎల్లలు లేనిది. భాష తెలియకపోయినా.. కంటెంట్ను ఆస్వాదించడమే అందరికీ తెలిసింది. కానీ, ఒక పాటను అంతలా ఆదరించడం.. ఆస్వాదించడం కనిపించింది అప్పుడే. ఆ పాట అతని జీవితాన్ని మలుపు తిప్పింది. కే-పాప్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. హుషారెత్తించే మ్యూజిక్తో గ్లోబ్ మొత్తాన్ని చిందులేయించింది. యూట్యూబ్లో తొలిసారి మిలియన్లైకులతో గిన్నిస్ బుక్ రికార్డు.. అంతకు మించి ఫస్ట్ బిలియన్ వ్యూస్ పూర్తి చేసుకున్న తొలి ఘనతకు దక్కించుకుంది గంగ్నమ్ స్టైల్. ఇవాళ్టికి ఈ సెన్సేషన్ సాంగ్ రిలీజ్ అయ్యి సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. సాక్షి, వెబ్డెస్క్: కొరియా పాప్సాంగ్ గంగ్నమ్ స్టైల్.. జులై 12న టీజర్ రిలీజ్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 15న ఆడియోతో పాటు ఒకేసారి యూట్యూబ్లో అప్లోడ్ అయ్యింది. అప్పటికే సౌత్ కొరియాలో సింగర్ సై(పార్క్ జెయ్ సాంగ్)కు కొద్దిపాటి ఫేమ్ ఉంది. అయితే రిలీజ్ తర్వాత పాటకు మిక్స్డ్ రివ్యూస్ దక్కాయి. కానీ, నెమ్మదిగా గంగ్నమ్ స్టైల్ మత్తు గ్లోబ్ మొత్తానికి ఎక్కేసింది. సిగ్గుపడే మగవాళ్ల నోట సైతం ‘సెక్సీ లేడీ’ అనే పదం వచ్చేలా చేసి.. హుషారెత్తించింది ఈ పాట. 9 years ago today, Psy's first teaser for 'Gangnam Style' was released. pic.twitter.com/dMWShXGGpW — On This Day in K-Pop (@thisdayinkpop) July 12, 2021 డబుల్ మీనింగ్, కానీ.. ‘ఒప్ప గంగ్నమ్ స్టైల్..’ గగ్నమ్ అనేది సౌత్ కొరియాలో ఒక జిల్లా. కొరియన్ పాప్ సింగర్ సై పుట్టి, పెరిగింది అక్కడే. అందుకే అక్కడి ఆడవాళ్ల లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికే ఆ ఆల్బమ్ను కంపోజ్ చేశాడు. ఒప్ప అంటే.. పెద్దన్న, తోపు అనే అర్థాలు వస్తాయి. అక్కడి ఆడవాళ్లను, ముఖ్యంగా తన కంటికి నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్చేసేందుకు చేసే ప్రయత్నాల్ని.. తన విరహా వేదనను వివరిస్తూ సాగే పాట అది. అందుకే అక్కడి ఉన్నతవర్గాలకు చెందిన ఆడవాళ్లకు ఆ పాటను అంకితం చేశాడు. అయితే ఆ పాట లిరిక్స్ పక్కా డబుల్ మీనింగ్. విజువల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది కూడా. కానీ, అర్థాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే.. దానిని సూపర్ హిట్ చేసేశారు జనాలు. అప్పటిదాకా హిందీ, ఇంగ్లీష్, డీజే రీమిక్స్ సాంగ్స్తో హోరెత్తిన న్యూఇయర్ వేడుకల్లో కొత్త జోష్ నింపింది గగ్నమ్ స్టైల్. ముఖ్యంగా గుర్రపు స్వారీ స్టెప్పులకు ప్రపంచం మొత్తం ఫిదా అయ్యింది. 30 దేశాల్లో ఛార్ట్బస్టర్ దక్షిణ కొరియా వయా అమెరికా నుంచి ప్రపంచం మొత్తం గంగ్నమ్ స్టైల్ పాకింది. రిలీజ్ అయిన అన్ని దేశాల్లోనూ ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. గుర్రపుస్వారీ డ్యాన్స్ను ప్రపంచం మొత్తం ఆస్వాదించింది. కొరియా పాప్ మ్యూజిక్ సత్తా ఏంటో ఆ టైంలోనే చాటిన ఈ సాంగ్.. చాలామందికి ఇది కొరియన్ ఆల్బమ్ అని తెలియకుండానే ఎక్కేసింది. పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా, సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ ఊపేసింది. అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సైతం స్టెప్పులేయగా, అప్పటి యూఎన్ఏ సెక్రటరీ బాన్ కీ మూన్ ఐక్యత కోసం ఈ పాటను ప్రచార గీతంగా ఉపయోగించాలని పిలుపు ఇచ్చారంటే అతిశయోక్తి కాదు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఆ టైంలో.. ‘‘కొరియన్ వేవ్లో ప్రపంచమంతా కొట్టుకుపోతోంద’ని సరదాగా వ్యాఖ్యానించాడు. జకోవిచ్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఇలా.. ఇలా ఆటగాళ్లు, మరెందరో స్టార్లు సైతం చిందులేశారు. సాంగ్ ఆఫ్ యూట్యూబ్ కొరియా పాప్ సింగర్ పార్క్ జెయ్ సాంగ్(సై)(43), యూ జంగ్ హ్యుంగ్ రాసిన సాంగ్. మ్యూజిక్ కూడా వాళ్లదే. చో సూ హ్యున్ డైరెక్షన్. గుర్రపు స్వారీ, కంగారు, పాండా స్టెప్పులను కలగలిపి లీ జు సన్స్టెప్పులు కంపోజ్ చేశాడు. కొరియన్ చెస్ గేమ్ జంగ్గీ తరహాలో మూమెంట్స్.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఇక ఈ పాటలో బుడ్డోడు వాంగ్ మిన్వూ, నటుడు యూ జయ్ సుక్, నోహ్ హోంగ్ హుల్, ట్రైన్లో కనిపించే నటి హ్యునా.. ఇలా అందరూ కలిసి పాటను రిచ్గా మార్చేశారు. మొదటిరోజు ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి. #GangnamStyle #PSY #9YearsofGangnamStyle pic.twitter.com/vLuSxgOwID — ashwik (@ursashwik) July 14, 2021 సౌత్ కొరియా గావోన్ ఛార్ట్ నుంచి ఆగష్టు నాటికి యూట్యూబ్ టాప్ 100 లిస్ట్కి అటుపై బిల్బోర్డ్ హాట్ 100 కి చేరింది. సెప్టెంబర్ నాటికి కేవలం ఐదు మిలియన్ల మార్క్కు చేరింది. కానీ, ఆ తర్వాత విధ్వంసం మొదలైంది. డిసెంబర్ 21 నాటికి గంగ్నమ్ స్టైల్ బిలియన్ మార్క్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 4 బిలియన్ల వ్యూస్కి పైగా.. ఓవరాల్ టాప్ పొజిషన్ సాంగ్ లిస్ట్లో ఎనిమిదో పొజిషన్లో కొనసాగుతోంది గంగ్నమ్స్టైల్. పేరడీలు, మిగతా వెర్షన్లు ఇవన్నీ లెక్కేస్తే ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న డెస్పాసిటోను ఎనిమిదేళ్ల క్రితమే గంగ్నమ్ స్టైల్ దాటేసినట్లే లెక్క. సై ఏం చేస్తున్నాడు ‘సై సిక్స్రూల్స్’ పేరుతో రిలీజ్ చేసిన ఆల్బమ్లో మొదటి పాటే గంగ్నమ్ స్టైల్. 2012లో సై ఒక వైరల్ స్టార్. కానీ, ఆ ఫేమ్ను సై కొనసాగించలేకపోయాడు. కారణం.. సై మిగతా పాప్ సింగర్స్లాగా కాదు. అభిమానం ఎక్కడుంటే.. వెతుక్కుంటూ వెళ్లి మరీ ఉచితంగా ప్రదర్శనలిచ్చేవాడు. బ్రాండ్లు, ప్రమోషన్, సంపాదన కోసం ఏనాడూ పెద్దగా ఆలోచించేవాడు కాదు. గంగ్నమ్స్టైల్ తర్వాత సైకి దక్కిన పాపులారిటీతో ఒక గ్లోబల్ సెలబ్రిటీగా మారిపోయే అవకాశం దక్కినా.. దానికి ఆయన మొగ్గు చూపించలేదు. ఆ తర్వాత నాలుగైదు పాప్ సాంగ్స్ కంపోజ్ చేసినప్పటికీ.. తర్వాత కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో రియాలిటీ షోలను నిర్వహిస్తున్నాడు. పీ నేషన్ పేరుతో కంపెనీ స్థాపించి..కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నాడు. మామూలుగా సై(43) ప్లేస్లో వేరే ఎవరు ఉన్నా.. ప్రదర్శనల కోసం, యూట్యూబ్ రికార్డుల కోసం, డబ్బు కోసం పాకులాడేవాళ్లేమో!. -
మరో కొరియన్ రీమేక్
ఇటీవలే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని సమంతతో ‘ఓ బేబి’గా తెరకెక్కించింది సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. తాజాగా మరో కొరియన్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత సురేశ్ బాబు. 2016లో విడుదలైన ‘లక్కీ కీ’ అనే కొరియన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు, భారతీయ భాషలన్నింటి రైట్స్ను దక్కించుకున్నట్టు తెలిపారు. 2012లో విడుదలైన ‘కీ ఆఫ్ లైఫ్’ అనే జపనీస్ చిత్రాన్ని ‘లక్కీ కీ’ పేరుతో కొరియన్ పరిశ్రమ రీమేక్ చేసింది. ఇప్పుడు ఈ కొరియన్ సినిమా ఆధారంగా తెలుగు రీమేక్ రూపొందనుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న యాక్టర్, కిరాయికి హత్యలు చేసే రౌడీ అనుకోకుండా ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్తే ఏం జరిగింది? అనేది ఈ చిత్రకథాంశం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారని, ఇందులో ఓ పెద్ద స్టార్ నటిస్తారని ప్రకటించారు. గురు ఫిలింస్, యస్ కే గ్లోబల్ ఎంటర్టైన్మెంట్తో కలసి సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
దుమ్ములేపిన కొరియన్ బ్యాండ్
-
బాలీవుడ్ పాటకు దుమ్ములేపిన కొరియన్ బ్యాండ్
BTS (బీటీఎస్).. దక్షిణ కొరియాలో ఫేమస్ బాయ్ బ్యాండ్. దీన్ని బ్యాంగ్టన్ బాయ్స్ అని కూడా పిలుస్తారు. 2010లో సియోల్లో ప్రారంభమైన బీటీఎస్.. ఇండియన్ సాంగ్స్కి మాషప్స్ చేస్తూ ఎంతో క్రేజ్ సంపాదించింది. తెలుగు, హిందీపాటలతోపాటు విభిన్న భాషల్లోని పాటలకు డాన్స్ చేయడం వీరి ప్రత్యేకం. ఈ బాయ్ బాండ్లో ఏడుగురు సభ్యులున్నారు. వీళ్లుచేసే ఒక్కే పార్ఫమెన్స్ ఒక్కో అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో హిట్స్ సాంగ్స్కి డాన్స్ చేసి భారత్లోనూ క్రేజ్ సంపాదించుకుంది బీటీఎస్ బ్యాండ్. ఇటీవల అల్లు అర్జున్ బబ్లాక్ బాస్టర్ సినిమా ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి బుట్టబొమ్మ పాటకు డాన్స్ చేసి దుమ్ములేపారు. (అంధాధున్ రీమేక్: టబు పాత్రలో నటించేది ఆమే!) తాజాగా బాలీవుడ్ చాద్దీ జవానీ, తుమ్సే మిల్కే దిల్ కాపై అనే పాటలకు కూడా మాషప్ చేశారు. ఈ వీడియోను క్వాలిటాపోసస్ట్స్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ పాటకు బీటీఎస్ బ్యాండ్ సభ్యులు తమ స్టైల్లో అద్భుతమైన స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. భాష రాకున్న స్టెప్పులతో ఇరగదీశారు. ఇక ఈ డ్యాన్స్పై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. చూడటానికి ఎంతో చక్కగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.. ‘ఈ డాన్స్ చూస్తుంటే నాకు కూడా వీళ్లతో కలిసి స్టెప్పులు వేయాలనిపిస్తోంది.’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. (సమంత ప్లేస్లో‘వరల్ఢ్ ఫేమస్ లవర్’ నటి) -
యూట్యూబ్లో రికార్డు సృష్టిస్తున్న సాంగ్
కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ మొదటి ఇంగ్లీష్ సింగిల్ “డైనమైట్” ను శుక్రవారం విడుదల చేసింది. డైనమైట్ విడుదలయిన ఒక్కరోజులోనే అత్యధిక వీక్షణలు పొంది యూట్యూబ్లో రికార్డు సృష్టించింది. డైనమైట్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విడుదలయ్యింది. అయితే శనివారం ఉదయం 6.05 గంటలకు వరకు ఈ వీడియోను 86.4 మిలియన్ల మంది చూశారు. అంతకుముందు కూడా మరొక కొరియా పాప్ బ్యాండ్ బ్లాక్పింక్ చేసిన ట్రాక్ “హౌ యు లైక్ దట్” కూడా 86.3 మిలియన్ల వీక్షణలతో రికార్డ్ను సృష్టించింది. శనివారం యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోలలో డైనమైట్ మొదటిస్థానంలో నిలిచింది. కేవలం ఇది మాత్రమే కాకండా డైనమైట్ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ వీడియో 3 మిలియన్లకు పైగా ప్రత్యక్ష వీక్షకులతో అత్యధికంగా వీక్షించిన యూట్యూబ్ ప్రీమియర్గా రికార్డును సృష్టించింది. అయితే, కొరియా పాప్ బ్యాండ్ ఈ ఘనతను సాధించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు విడుదలైన “బాయ్ విత్ లవ్” 24 గంటల్లో 74.6 మిలియన్ వీక్షణలను పొందింది. దీని గురించి బీటీఎస్ సంస్థ వారు మాట్లాడుతూ, ‘ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ఒక ఇంగ్లీష్ పాటను రూపొందించి వారికి కొంత ఆనందాన్ని పంచాలనుకుంటున్నాం’ అని తెలిపారు. -
ట్రిపుల్ ఐటీలో కొరియా భాష బోధన
ఎచ్చెర్ల క్యాంపస్: ప్రపంచం కుగ్రామమైపోయింది. ఉపాధి అవకాశాలు ఎంత సులభంగా వస్తున్నాయో అంతే తొందరగా పోతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో సరైన ఉపాధి అవకాశాలను అన్వే షించడం విద్యార్థులకు అత్యవసరం. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఈ దిశగా తర్ఫీదు ఇస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలో ఇంజినీరింగ్ చేశాక వంద శాతం ఉద్యోగం లభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీయూసీ కోర్సు నుంచే విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, యాప్స్ వంటివాటిపై తర్ఫీదు అందుతోంది. దీంతో పాటు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్షిప్ ప్రోత్సహించే విధంగా కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం కొరియా సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో దూసుకుపోతోంది. ఆ దేశంలో మన విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొరియా భా షను నేర్పించేందుకు వర్సిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా కొరియాలో పనిచేయాలంటే నైపుణ్యంతో పాటు భాష కూడా ప్రధానమే. అందుకే మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్న ఆ దేశంలో పనిచేసే విధంగా, విద్యార్థులను ప్రొత్సహించే దిశగా కొరియా భాషను ట్రిపుల్ ఐటీలో పరిచయం చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు.. రాష్ట్రం యూనిట్గా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో కొరియా భాషను ప్రవేశ పెట్టే చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు కొరియన్ కల్చరల్ అండ్ టెక్నాలజీ సెంటర్తో ఎంఓయూ (ఒప్పందం) కుదుర్చుకున్నా రు. మరో పక్క సౌత్కొరియా సంస్థలు కళాశాలలకు వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూ లు నిర్వహించటం, భారత దేశంలో పలు ప్రధాన నగరాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేయడం కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, మంచి ప్యాకేజీలకు ఎంపికయ్యే అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలో విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రతిభావంతమైన వి ద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో చేరుతున్నా రు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యంతో పాటు భాషా నైపుణ్యం అవసరవుతోంది. ఈ నేపథ్యంలో కొరియా వంటి భాషలను నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. – డాక్టర్ జి.భానుకిరణ్,శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ -
లేడీ పోలీస్
ఈ ఏడాది కొరియన్ కథతో ‘ఓ బేబి’ (కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్) వంటి బ్లాక్బస్టర్ హిట్ సాధించారు సమంత. లేడీ ఓరియంటెడ్ సినిమాగా సమంత కెరీర్లో పెద్ద హిట్ సినిమా అనిపించుకుంది ‘ఓ బేబి’. ఇప్పుడు నయనతార కూడా ఓ కొరియన్ కథలో నటించడానికి అంగీకరించారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని హీరో రానా నిర్మిస్తారట. ఇందులో నయనతార పోలీస్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మోస్ట్ వాంటెడ్
సల్మాన్ ఖాన్ కెరీర్ను గాడిలో పడేసిన సినిమా ‘వాంటెడ్’. ప్రభుదేవా దర్శకత్వంలో ‘పోకిరి’ చిత్రానికి హిందీ రీమేక్గా రూపొందింది ఈ సినిమా. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ‘మోస్ట్ వాంటెడ్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటించనున్న కొత్త సినిమాకు ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ కాప్: రాధే’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ పండగకు తీసుకురాబోతున్నారు. కొరియన్ చిత్రం ‘ద అవుట్ లాస్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. నవంబర్ 4న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. సల్మాన్ఖాన్ – ప్రభుదేవా కాంబినేషన్లోనే రెడీ అయిన ‘దబాంగ్ 3’ చిత్రం డిసెంబర్లో విడుదలకానుంది. -
మృత్యుంజయురాలు.. చదవాల్సిన కథనం
బ్రిస్బేన్: కొండ మీది నుంచి లోయలోకి పడ్డా.. ఆమెకు నూకలు మాత్రం చెల్లిపోలేదు. ఆరో రోజులు మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు ప్రాణాలతో బయటపడింది. గురువారం ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ రాష్ట్రంలో ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన జోహీ హాన్(25) గత గురువారం క్వీన్స్ల్యాండ్లో టల్లీ పట్టణానికి వెళ్లారు. అక్కడి నుంచి తన స్నేహితురాలికి ఫోన్ చేసిన ఆమె.. కెర్నిస్ అటవీ ప్రాంతంలోని టైసన్ పర్వతంపైకి ట్రెక్కింగ్కు వెళ్తున్నట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత ఆమె జాడ లేకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైన్యం హెలికాఫ్టర్ సాయంతో అధికారులు గాలింపు చేపట్టారు. అయినా లాభం లేకపోయింది. శనివారం అటవీ మార్గం గుండా వెళ్తున్న కొందరికి దూరంగా సాయం చేయాలన్న కేకలు వినిపించాయి. అయితే వారు పోలీసులకు సమాచారం అందించేసరికి కాస్త ఆలస్యమైంది. తిరిగి ఏరియల్ సర్వే ద్వారా గాలింపు చేపట్టిన అధికారులు.. ఎట్టకేలకు జలపాతం దగ్గర ఆమెను గుర్తించి రక్షించారు. టల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించగా, ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె డీహైడ్రేషన్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కొమ్మల్లో చిక్కుకుని... కొండ మీద ఉన్న ఓ రాయిపై నిల్చుని ఫోటో తీసుకునే సమయంలో ఆమె కిందపడినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ కింద ఉన్న రాక్సీ జలపాతం చెట్ల భాగంలో ఆమె చిక్కుకుపోయారు. అలా కొన్ని గంటలు స్పృహ లేకుండా పడి ఉన్న ఆమె.. మేలుకువ రాగానే కిందకు దిగి సాయం కోసం కేకలు వేయటం ప్రారంభించారు. అప్పటికే పూర్తిగా నీరసించిన ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. పైన హెలికాఫ్టర్ శబ్ధం విన్న ఆమె కింద ఉన్న ఇసుక తిన్నెలపై రక్షించాలంటూ రాతలు రాశారు. అయితే అవి సైన్యం కంటపడలేదు. చివరకు శక్తిని కూడగట్టుకుని ఆమె వేసిన కేకలు స్థానికుల చెవిన పడటంతో ప్రాణాలతో ఆమె బయటపడగలిగారు. -
బుడుగుల కోసం సూపర్ కారు..
పిల్లల కోసం రూపొందించిన లేటెస్ట్ సూపర్ ఎలక్ట్రిక్ కారు ఇది. పేరు ‘బ్రూన్ ఎఫ్8’. కొరియన్ కంపెనీ తయారుచేసిన ఈ కారు మూడు రకాల డ్రైవింగ్ మోడ్లలో నడుస్తుంది. ఆండ్రాయిడ్ టాబ్లెట్తో సైతం దీనిని నియంత్రించొచ్చు. కుదుపులు నివారించేందుకు నాలుగు చక్రాలకూ గ్యాస్ సస్పెన్షన్ సిస్టమ్, స్మార్ట్ టచ్స్క్రీన్ పవర్ కంట్రోల్, పిల్లల భద్రత కోసం బకెట్ సీట్లు, ఎలక్ట్రానిక్ డిస్క్ బ్రేకుల వంటి ప్రత్యేకతలూ ఉన్నాయి. బ్లూటూత్ రిమోట్ కంట్రోల్తో పెద్దవారు కూడా దీనిని బయటి నుంచి నియంత్రించే అవకాశమూ ఉంటుంది. గరిష్టంగా గంటకు 14 కి.మీ. వేగంతో పరుగెత్తే ఈ కారు పిల్లలకు అద్భుతమైన కానుక అని దీని రూపకర్తలు చెబుతున్నారు. అన్నట్టూ.. దీని ఖరీదెంతో తెలుసా..? జస్ట్ వెయ్యి డాలర్లు.. అంటే రూ. 63 వేలే!